-
Lok Sabha Election 2024: త్రిముఖ ‘కురుక్షేత్రం’
హరియాణాలోని కురుక్షేత్ర లోక్సభ స్థానంలో ఎన్నికల పోరు రణరంగాన్నే తలపిస్తోంది. సాధారణంగా ముఖాముఖి పోరు సాగే ఈ నియోజకవర్గంలో ఈసారి మాత్రం బీజేపీ, ఆప్, ఇండియన్ నేషనల్ లోక్దళ్ (ఐఎన్ఎల్డీ) మధ్య త్రిముఖ పోరు నెలకొంది. గత రెండు ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించిన బీజేపీ ఈసారి మాత్రం గెలుపు కోసం చెమటోడుస్తోంది. ఇటీవలే కాంగ్రెస్ నుంచి వచి్చన ప్రముఖ పారిశ్రామిక వేత నవీన్ జిందాల్కు టికెటిచి్చంది. ఇండియా కూటమి అభ్యరి్థగా ఆప్ నుంచి సుశీల్ గుప్తా, ఐఎన్ఎల్డీ తరఫున జాట్ నాయకుడు అభయ్ చౌతాలా పోటీ పడుతున్నారు. హరియాణా ముఖ్యమంత్రి నాయ»Œ æసింగ్ సైనీ ఇటీవలి దాకా ఇక్కడ బీజేపీ ఎంపీగా ఉన్నారు.కురుక్షేత్రలో 2004, 2009ల్లో నవీన్ జిందాల్ కాంగ్రెస్ తరఫున గెలిచారు. 2014, 2019ల్లో బీజేపీ భారీ విజయాలు సాధించింది. కురుక్షేత్రలో జాట్ సామాజికవర్గ ప్రాబల్యమున్న స్థానం. 17.88 లక్షల మంది ఓటర్లలో జాట్లు 14 శాతముంటారు. బ్రాహ్మణులు, సైనీలు చెరో 8 శాతం, సిక్కులు 6 శాతం, అగర్వాల్ సామాజికవర్గం 5 శాతం ఉన్నారు. అభయ్ చౌతాలా జాట్ నాయకుడు కాగా జిందాల్, సుశీల్ గుప్తాలది బనియా సామాజికవర్గం. పోరు బీజేపీ, ఆప్ మధ్యేనని తొలుత భావించినా ఐఎన్ఎల్డీ నుంచి జాట్ నేత రంగంలోకి దిగడంతో పోరు త్రిముఖంగా మారింది. బీజేపీకి రైతుల సెగగత రెండుసార్లూ బీజేపీ భారీ మెజారిటీలు సాధించినా, కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నా పారీ్టపై ప్రస్తుతం వ్యతిరేకత తీవ్రంగా ఉంది. దీనికితోడు రైతు సమస్యలు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత మరింత సమస్యగా మారాయి. ఇటీవలి రైతుల ఆందోళనలు ఆ పార్టీ పుట్టి ముంచుతాయన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. పైగా ఆ సందర్భంగా వేలాది రైతులపై కేసులు పెట్టడం బీజేపీకి చాలా వ్యతిరేకంగా మారింది. భారతీయ కిసాన్ యూనియన్ (చారిణి) ఇప్పటికే చౌతాలాకు మద్దతిచ్చింది. ఈ యూనియన్ ఊరూరా రైతులతో సమావేశాలు నిర్వహించి మరీ ఐఎన్ఎల్డీకి మద్దతివ్వాలని కోరుతోంది. ఆప్ కూడా రైతులకు 200 యూనిట్ల ఉచిత కరెంటు, యువత, మహిళలకు నెలకు రూ.వేయి ఆరి్ధక సాయం వంటి హామీలతో దూసుకెళ్తోంది. ఆప్ నేత, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సుడిగాలి ప్రచారం చేస్తున్నారు.జిందాల్ పొలం బాట బీజేపీకి ఎదురు గాలి వీస్తున్న సంకేతాలు అందుతుండటంతో పార్టీ అభ్యర్థి జిందాల్ ప్రచార శైలిని మార్చారు. ముఖ్యంగా రైతులను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ట్రాక్టర్లు నడపడం, వరి పొలాల్లోకి దిగి రైతులతో మాట్లాడటం వంటివి చేస్తున్నారు. తన సంస్థల ద్వారా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి యువతకు భారీగా ఉపాధి కలి్పస్తానని హామీ ఇస్తున్నారు. కురుక్షేత్రలో ఈ నెల 25న ఆరో విడతలో పోలింగ్ జరగనుంది. – సాక్షి, న్యూఢిల్లీ -
ప్రజలకు రాహుల్గాంధీ క్షమాపణ చెప్పాలి
జహీరాబాద్ (సంగారెడ్డి)/సిద్దిపేటజోన్: కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత రాహూల్గాంధీ ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి మరిచిపోయారని మాజీమంత్రి హరీశ్రావు విమర్శించారు. హామీల అమలులో విఫలమైనందుకు రాష్ట్ర ప్రజలకు రాహుల్ గాంధీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి ఏం ముఖం పెట్టుకుని రాష్ట్రానికి వచ్చారని హరీశ్రావు ప్రశ్నించారు. అక్కా చెల్లెళ్లకు రాహూల్గాంధీ రూ.8,500 ఇస్తానంటున్నారని, మళ్లీ ఎవరి చెవులో పువ్వు పెడతారని నిలదీశారు.సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో గురువారం బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్కుమార్కు మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ..కరెంటు కోతలు పెడుతున్న కాంగ్రెస్కు పార్లమెంట్ ఎన్నికల్లో వాతలు పెట్టాలన్నారు. ఆరు గ్యారంటీ పథకాలు వచ్చిన వారు కాంగ్రెస్కు ఓటు వేయాలని, రాని వారంతా బీఆర్ఎస్కు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్కుమార్, ఎమ్మెల్యే కె.మాణిక్రావు, డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై.నరోత్తం, బేవరేజస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవిప్రసాద్, బీఆర్ఎస్ నాయకులు కిజర్యాఫై పాల్గొన్నారు.బీజేపీతో కొట్లాడినందుకే కవితకు జైలుబీజేపీతో కొట్లాడేది ఒక్క కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీయేనని ఆ పోరాటం ఫలితంగానే ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్లాల్సి వచ్చిందని హరీశ్రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగిన ముస్లిం, మైనార్టీ ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్లు ఒక్కటేనని కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. బీజేపీతో బీఆర్ఎస్ కలిసి ఉంటే కవిత అరెస్ట్ అయ్యేవారా..? అని ప్రశ్నించారు. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ప్రధాని మోదీతో జత కట్టారని, చాలాసార్లు బహిరంగంగానే ప్రధానిని పొగిడిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రేవంత్రెడ్డి, బీజేపీ మిలాఖత్ అయి రాష్ట్రంలో బీఆర్ఎస్ను లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. -
బీఆర్ఎస్ ఎంపీలతోనే తెలంగాణకు బలం!
అల్వాల్/ కంటోన్మెంట్ (హైదరాబాద్)/ నిర్మల్: బీఆర్ఎస్ ఎంపీలతోనే తెలంగాణకు బలమని, రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడేది తామేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు గెలిస్తే.. ఢిల్లీ పాలకుల గల్లాపట్టి నిలదీసే ధైర్యం ఉండదని స్పష్టం చేశారు. హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేసేందుకు కుట్రలు సాగుతున్నాయని.. అది ఆగాలంటే తెలంగాణ నుంచి కేసీఆర్ సైనికులు పార్లమెంట్లో ఉండాలని చెప్పారు.గురువారం మల్కాజిగిరి నియోజకవర్గంలోని అల్వాల్ వీబీఆర్ గార్డెన్లో, కంటోన్మెంట్ పరిధిలోని సిఖ్ విలేజ్ ఇంపీరియల్ గార్డెన్స్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో.. నిర్మల్ జిల్లా కేంద్రంలో, భైంసాలో నిర్వహించిన రోడ్ షో, కార్నర్ మీటింగ్లలో కేటీఆర్ మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘పార్లమెంట్ ఎన్నికలు కదా బీఆర్ఎస్కు ఎందుకు ఓటు వేయాలని కొందరు అంటున్నారు. పార్లమెంట్లో తెలంగాణ ప్రజల గళం వినిపించడానికి కేసీఆర్ సైనికులు ఉండాలి. 2004లో ఐదుగురు ఎంపీలతో పార్లమెంట్లో అడుగుపెట్టిన కేసీఆర్.. 32 పార్టీలను ఒప్పించి, మెప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. రాహుల్ గాంధీని, నరేంద్ర మోదీని ఎదిరించే దమ్ము కాంగ్రెస్, బీజేపీ ఎంపీలకు లేదు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంటే అక్కడ బీజేపీ వాళ్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని అలవోకగా పడగొట్టారు. అదే కేసీఆర్, మమతా బెనర్జీ, హేమంత్ సోరేన్, స్టాలిన్, కేజ్రీవాల్ ప్రభుత్వాలను పడగొట్టే ప్రయత్నాలు చేసినా విఫలమయ్యారు. బలమైన లీడర్లు ఉన్నచోట బీజేపీ ఆటలు సాగలేదు. అందుకే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి బలం ఇవ్వాలి.బీజేపీ ముందు తల వంచేది లేదుబీఆర్ఎస్, బీజేపీ ఒకటేనంటూ అవాస్తవ ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్, ఈటల, రఘునందన్రావు, సోయం బాపూరావు వంటి బడా లీడర్లను ఓడించింది బీఆర్ఎస్ వాళ్లేనని గుర్తుంచుకోవాలి. మేం తల నరుక్కుంటాం కానీ.. బీజేపీ ముందు తల వంచేది లేదు.రేవంత్ ఊసరవెల్లిలా ప్రవర్తిస్తున్నారుకాంగ్రెస్ వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే చెప్పాం. ఆ పార్టీ అబద్ధపు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను ఇబ్బంది పెడుతోంది. గత ఐదు నెలల్లో రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయింది. రేవంత్ చిల్లర మాటలు మాట్లాడటం తప్ప మరేమీ జరగలేదు. ఊసరవెల్లి రంగులు మార్చినట్టు హామీల అమలు గురించి నెలలు, తారీఖులు చెప్తున్నారు. కొడుకుల్లారా, పేగులు తీసి మెడలో వేసుకుంటా అంటూ రేవంత్ మాట్లాడుతున్నారు. ఆయన ముఖ్యమంత్రా.. బోటీ కొట్టేవాడా? మన ఖర్మకాలి ముఖ్యమంత్రి అయ్యిండు. పిచ్చోడి చేతిలో రాయిలా తెలంగాణ మారింది.బీజేపీ హైదరాబాద్ను యూటీ చేస్తుందిరిజర్వేషన్లను రద్దుచేసి అగ్రవర్ణాలకు మేలు చేసేలా బీజేపీ కుట్ర చేస్తోంది. ఇందుకోసం రాజ్యాంగాన్ని కూడా మార్చాలని ప్రయత్నిస్తోంది. ప్రధాని మోదీ పదేళ్ల క్రితం ఇచ్చిన హామీలకే గ్యారంటీ లేదు, ఇప్పుడు కొత్తగా చెప్పే మాటలకు గ్యారంటీ ఏముంది? జూన్ 2వ తేదీతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతుంది. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు ముగుస్తుంది. దీంతో కేంద్రం హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది.అదే జరిగితే హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోతుంది’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. మల్కాజిగిరిలో బీజేపీ, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు ఇద్దరూ నాన్ లోకల్, బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి పక్కా లోకల్ అన్నారు. ఎంపీగా లక్ష్మారెడ్డిని, కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలో నివేదిత సాయన్నను గెలిపించాలని పిలుపునిచ్చారు.భైంసాలో కేటీఆర్పై ఉల్లిగడ్డలు.. జైశ్రీరాం నినాదాలుభైంసా/ భైంసాటౌన్: లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్ జిల్లా భైంసాలో గురువారం సాయంత్రం కేటీఆర్ నిర్వహించిన రోడ్ షోలో.. కొందరు ఉల్లిగడ్డలు, చిన్నపాటి రాళ్లు విసిరారు. కార్నర్ మీటింగ్ నిర్వహించిన ప్రాంతానికి హనుమాన్ స్వాములు, మరికొందరు చేరుకున్నారు. కేటీఆర్ ఖబడ్దార్ అంటూ ముద్రించిన ప్లకార్డులను చూపుతూ.. జైశ్రీరాం అంటూ నినాదాలు చేశారు.కేటీఆర్ ప్రసంగిస్తున్నంత సేపు ఆయన వాహనంపైకి ఉల్లిగడ్డలు విసిరారు. ఈ సమ యంలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసనకారులవైపు దూసు కెళ్లే ప్రయత్నం చేయడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు చాలా కష్టపడి ఇరువర్గాలను అదుపుచేశారు. నిరసనకారులు విసిరిన ఉల్లిగడ్డలు, చిన్నరాళ్లతో ఓ యువకుడి తలకు స్వల్పంగా గాయమైంది.దేవుడిని అడ్డంపెట్టుకుని రాజకీయాలా?భైంసాలో తనపై ఉల్లిగడ్డలు, రాళ్లు విసిరినవారిపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు కావాలనే యువకులను రెచ్చగొట్టి ఇలా పంపిస్తుంటారని, కార్యకర్తలు సంయమనం పాటించాలని సూచించారు. ‘‘కేసీఆర్ తెలంగాణలో యాదాద్రి సహా ఎన్నో మందిరాలు నిర్మించారు. ఏమీ చేయనివారే దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తారు.రాముడు ఎంతో ఆదర్శవంతుడు. మేం కూడా జైశ్రీరాం అంటాం. మరి రాముడు ఎదుటివారిపై రాళ్లు విసరాలని చెప్పాడా? మా పని మేం చేసుకుంటున్నాం. మీ పని మీరు చేసుకోండి. కానీ చిల్లర పనులు చేయవద్దు. ఇలాంటి వాటికి భయపడబోం’’ అని కేటీఆర్ స్పష్టం చేశారు.‘మత’ ముష్కరులపై పోరాటం కొనసాగుతుంది: ‘ఎక్స్’లో కేటీఆర్‘‘భైంసా పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో నాపై కొందరు బీజేపీ గూండాలు రాళ్లతో దాడి చేసిన ఘటనతో అనేక మంది ఫోన్లు చేసి నా యోగక్షేమాలు అడుగుతున్నారు. నేను క్షేమంగా ఉన్నాను. మతం పేరిట విద్వేషాన్ని వ్యాప్తి చేస్తూ విషాన్ని చిమ్మే ఈ ముష్కరులపై నాపోరాటం కొనసాగుతుంది’’ అని ‘ఎక్స్’లో కేటీఆర్ పేర్కొన్నారు. -
హర్యానాలో మరో ట్విస్ట్.. గవర్నర్కు లేఖ రాసిన జేజేపీ
చండీగఢ్: ముగ్గురు స్వతంత్ర ఎమ్యెల్యేలు బీజేపీ కూటమికి మద్దతు ఉపసంహరించుకోవటంతో నయాబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. ఈ నేపథ్యంలో మాజీ డిప్యూటీ సీఎం, మాజీ మిత్ర పక్షం జననాయక్ జనతా పార్టీ చీఫ్ దుష్యంత్ సింగ్ చౌతాలా అసెంబ్లీలో ఫోర్ టెస్ట్ (విశ్వాస పరీక్ష) నిర్వహించాలని గవర్నర్ బండారు దత్తాత్రేయకు లేఖ రాశారు.‘‘మేజార్టీని లేని బీజేపీ కూటమిని విశ్వాస పరీక్షకు పిలవాలని కోరుతున్నాం. ఇటీవల ఒక బీజేపీలో ఎమ్మెల్యే, ఒక స్వతంత్ర ఎమ్యెల్యే రాజీనామా చేశారు. అదేవిధంగా ప్రస్తుతం మరో ముగ్గురు స్వతంత్ర ఎమ్యెల్యేలు బీజేపీ కూటమికి మద్దతు ఉపసంహరిచుకున్నారు. దీంతో బీజేపీ కూటమి ప్రభుత్వం మైనార్టీలో పడింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విశ్వాస పరీక్ష తీర్మానం ప్రవేశపెట్టండి. మేము ఫ్లోర్ టెస్ట్ తీర్మానికి మా పార్టీ తరఫున మద్దతు ఇస్తాం’’ అని దుష్యంత్ సింగ్ చౌతాలా గవర్నర్కు రాసిన లేఖలో తెలిపారు.మరోవైపు.. ‘‘మేము గవర్నర్కు ఫ్లోర్ టెస్ట్ చేపట్టాలని లేఖ రాశాం. విశ్వాస పరీక్షలో జేజేపీ.. బీజేపీ కూటమికి వ్యతిరేకంగా ఓటు వేస్తుంది. మేము బహిరంగా మరో ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీకి మా మద్దతు ఇస్తాం’’ అని దుష్యంత్ సింగ్ ఓ వీడియో విడుదల చేశారు.ఇక.. మంగళవారం స్వతంత్ర ఎమ్మెల్యేలు సోంబిర్ సంగ్వాన్ (దాద్రీ), రణధీర్ సింగ్ గొల్లెన్ (పుండ్రి), ధరంపాల్ గోండర్ (నీలోఖేరి)లు.. రోహ్తక్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రతిపక్ష కాంగ్రెస్ నేత భూపిందర్ సింగ్ హుడా, రాష్ట్ర పీసీసీ చీఫ్ ఉదయ్ భాన్ సమక్షంలో బీజేపీకి తమ మద్దతును ఉపసహరించున్న విషయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే.హర్యానాలో మొత్తం 90 స్థానాలు ఉండగా.. మ్యాజిక్ ఫిగర్ 45 స్థానాలు. మనోర్ లాల్, రంజిత్ చౌతాలా రాజీనామాల కారణంగా రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో మొత్తం సభ్యుల సంఖ్య 88. ప్రస్తుతం బీజేపీకి 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ హర్యానా లోఖిత్ పార్టీ ఎమ్మెల్యే ఒకరు, మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఇస్తున్నారు. అయితే ముగ్గరు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించగా.. బీజేపీకి మరో ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది.ఇక.. జేజేపీకి 10 మంది ఎమ్యెల్యేలు ఉన్నారు. ప్రస్తుతం ముగ్గరు స్వతంత్ర అభ్యర్థులతో కలిపి కాంగ్రెస్ పార్టీ కూటమికి 33 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఒకవేళ జేజేపీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినా మొత్తం సంఖ్య 43 కు చేరుంది. ఇలా అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటచేయాలంటే కూడా మరో ఇద్దరు ఎమ్యెల్యేలు అవసరం అవుతారు. ఎలా చూసినా కాంగ్రెస్కు ఛాన్స్ లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
‘ డిబేట్కి ఎక్కడైనా రెడీ’.. ప్రియాంకా గాంధీకి స్మృతి ఇరానీ సవాల్
లక్నో: కేంద్రమంత్రి, బీజేపీ అమేథీ అభ్యర్థిని స్మృతి ఇరానీ.. కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీకి సవాల్ విసిరారు. ఏ ఛానెల్ అయినా, హోస్ట్ ఎవరైనా, టైం, ప్రదేశం, అంశం ఏదైనా తాను డిబేట్లో మాట్లాడటానికి బీజేపీ సిద్ధంగా ఉందని స్మృతి ఇరాని ప్రియాంకా గాంధీకి ఛాలెంజ్ చేశారు.‘‘నేను ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరికీ ఛాలెంజ్ చేస్తున్నా. ఛానెల్, యాంకర్, ప్రదేశం, టైం విషయం ఏదైనా డిబేట్ చేయడానికి బీజేపీ సిద్ధం. ఒకవైపు.. సోదరుడు, సోదరీ. మరోవైపు.. బీజేపీ అధికార ప్రతినిధి ఉంటారు. మా పార్టీ నుంచి అయితే సుధాంశు త్రివేది చాలు. వాళ్లకు అన్ని సమాధానాలు చెబుతారు’’అని స్మృతి ఇరానీ బుధవారం అమేథీలో సవాల్ చేశారు.దేశంలోని ముఖ్యమన అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెదవి విప్పరని ప్రియాంకా గాంధీ చేసిన ఆరోపణల నేపథ్యంలో స్మృతి ఇరానీ పైవిధంగా ఛాలెంజ్ విసిరారు. 2019లో స్మృతి ఇరానీ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని 55 వేల మేజార్టీతో ఓడించారు. మరోసారి బీజేపీ స్మృతి ఇరానీకి అమేథీ టికెట్ కేటాయించింది. ఇప్పటికే స్మృతి ఇరానీ అమేథీ పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తం తిరిగి ప్రచాం చేశారు. మరోవైపు.. కాంగ్రెస్కు కంచుకోట స్థానమైన అమేథీలో నామినేషన్ల చివరి రోజు గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన కిషోరి లాల్ సింగ్ను బరిలోకి దిపింది. ఇక.. అమేథీ, రాయ్ బరేలీలో గెలుపే లక్ష్యంగా ప్రియాంకా గాంధీ శరవేంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. -
వరంగల్ జనసభలో.. మోదీ నినాదం!
సాక్షి, వరంగల్: వరంగల్ నగరం కాషాయ జెండాలతో రెపరెపలాడింది. వరంగల్, మహబూబాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థులు అరూరి రమేశ్, సీతారాంనాయక్ను గెలిపించాలంటూ గ్రేటర్ వరంగల్ పరిధిలోని మామునూరు తిమ్మాపూర్ క్రాస్రోడ్డు లక్ష్మీపురం మైదానంలో బుధవారం నిర్వహించిన ఓరుగల్లు జనసభలో ప్రధాని నమో నినాదం మార్మోగింది. సభలో ఎక్కడ చూసినా నమో బొమ్మలతో కూడిన ప్లకార్డులు కనిపించాయి. భారీ ఆకృతి లో ఉన్న ఫ్లెక్సీలు సభా ప్రాంగణంలో ప్రజలు పట్టుకొని ఉండడం చూసి మోదీ ఫిదా అయ్యారు.ఓరుగల్లు అంటే అభిమానమంటూ..‘నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు.. నా అదృష్టం ఏమిటంటే నేను పనిచేసినటువంటి అహ్మదాబాద్ అధిష్టాత్మి దేవత కూడా భద్రకాళి. ఆ భద్రకాళి అమ్మవారికి, ఆమె చరణాలకు నేను ప్రణామం చేస్తున్నా. ఇక్కడినుంచి కొంచెం దూరంలో ఉన్న రామప్ప మందిరానికి కూడా నేను నమస్కారాలు చేస్తున్నా. ఈ ప్రాంతం కాకతీయుల విజయ గౌరవ పతాకకు ప్రతీక.మూడో దశ పోలింగ్ను కూడా పూర్తి చేసుకొని ఇక్కడకు వచ్చి మీ ఆశీర్వాదం తీసుకునేటువంటి అదృష్టాన్ని పొందా’ అంటూ మోదీ ప్రసంగం ప్రారంభించడంతో సభికులు పెద్దపెట్టున మోదీ.. మోదీ అంటూ నినాదాలు చేశారు. ‘నా దృష్టిలో వరంగల్ చాలా ముఖ్యమైనటువంటి చోటు. 40 సంవత్సరాల క్రితం బీజేపీకి ఇద్దరంటే ఇద్దరు ఎంపీలు ఉన్నప్పు డు అందులో ఒకరు మన హనుమకొండ నుంచి దివంగత నేత జంగారెడ్డి. బీజేపీ మీ అభిమానాన్ని, ఆశీర్వాదాన్ని, స్నేహాన్ని ఎప్పటికీ మరిచిపోలేదు.మాకు ఎప్పుడు కష్టం వచ్చినా వరంగల్ ప్రజానీకం వెన్నంటి నిలిచారు. అందుకే బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇనుపగుప్పిటనుంచి వరంగల్ను బయటకు తీసేందుకు బీజేపీ సర్వప్రయత్నాలను చేయబోతోంది’ అని వ్యాఖ్యలు చేశారు. ‘కేంద్రం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉంది. వరంగల్లో మేం టెక్స్టైల్ పార్కు ఏర్పాటుచేశాం. కానీ, పార్కు నిర్వహణ విషయంలో సమస్యలు వచ్చేలా ప్రయత్నిస్తున్నారు.తెలంగాణకు నష్టం చేస్తున్నటువంటి, ఇబ్బందులు కలిగిస్తున్నటువంటి వాళ్లకు జవాబు చెప్పాల్సిన సమయం వచ్చింది. మీ అందరిని కోరుతున్నాను. వరంగల్ నుంచి అరూరి రమేశ్, మహబూబాబాద్ నుంచి సీతారాంనాయక్ను లోక్సభకు పంపించండి. మోదీకి బలం చేకూర్చండి అంటూ సభికులను ఆయన అభ్యర్థించారు. ఇంకోవైపు కళాకా రులు నిర్వహించిన కళానృత్యాలు అందరినీ అలరించా యి. మోదీ పాటలకు సభకు హాజరైన కొందరు స్టెప్పులేయడం కనిపించింది.వేదికపై అగ్రనేతలు.. అభ్యర్థులు..వేదికపై మోదీకి ఒకవైపు మహబూబాబాద్, వరంగల్ ఎంపీ అభ్యర్థులు సీతారాంనాయక్, అరూరి రమేశ్ ప్రజలకు నమస్కరిస్తూ కనిపించారు. మురళీ ధర్గౌడ్, గుజ్జుల ప్రేమేందర్రెడ్డి అధ్యక్షతన సభ జరగగా. మోదీ ప్రసంగాన్ని హైదరాబాద్కు చెంది న రాక సుధాకర్ అనువదించారు.ప్రధాన వేదికపై నాయకులు పొంగులేటి సుధాకర్రెడ్డి, ఎర్రబెల్లి ప్రదీప్రావు, చందుపట్ల కీర్తిరెడ్డి, పార్టీ వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, జనగామ జిల్లాల అధ్యక్షులు గంట రవికుమార్, రావు పద్మ, నిశిధర్రెడ్డి, దశమంతరెడ్డితో పాటు నాయకులు కుమారస్వామి, మార్తినేని ధర్మారావు, గరికపాటి మోహన్రావు, కొండేటి శ్రీధర్, డాక్టర్ రాజేశ్వర్రావు, స్వాతిరెడ్డి, రావుల కోమల, జలగం అనిత, డాక్టర్ కాళీప్రసాద్, డాక్టర్ విజయరామారావు, అల్లం నాగరాజు, జలగం రంజిత్రావు, మాదిరెడ్డి దేవేందర్రెడ్డి, మల్లాడి తిరుపతిరెడ్డి కూర్చున్నారు. -
రాజాసింగ్పై ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కేసు
నిర్మల్, సాక్షి: బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై జిల్లాలో కేసు నమోదు అయ్యింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ రాజాసింగ్తో పాటు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్పైనా కేసు నమోదు చేశారు ఖానాపూర్ పోలీసులు. ఆదిలాబాద్ బీజేపీ అభ్యర్థి గోడం నగేష్ తరఫున రాజాసింగ్, పాయల్ శంకర్లు ప్రచారంలో పాల్గొన్నారు. అయితే సమయం ముగిసినా కూడా ప్రచారం చేశారనే వీళ్లపై ఖానాపూర్ పోలీసులు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేశారు. -
'ఏంటిది సుజనా'..?
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి తీరు స్థానిక ఓటర్లలో గుబులు రేపుతోంది. ఈ నియోజకవర్గంలో ముస్లిం, ఆర్యవైశ్య, నగర సామాజిక వర్గ ప్రాబల్యం ఎక్కువ. తాజాగా ఆయన వీరితో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు.ఈ సమావేశాల్లో ‘నా ఎదుగుదలకు మీరే కారణం.. మీ రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వండి’అంటూ తెగ ఊదరగొట్టారు. దీంతో సమావేశాలకు వెళ్లిన వారంతా ఒకటే మాట.. బ్యాంకులు లూటీ చేసి, ఆ డబ్బుతో ఎన్నికలకో పార్టీ మారే సుజనా ఎదుగుదలకు తామెలా కారణమవుతామని మిత్రులతో గుసగుసలాడుకుంటున్నారు. కొంపదీసి ఈయన ఎగ్గొట్టిన బ్యాంకు రుణాల బకాయిల్ని తమ నెత్తిన రుద్దుతారేమోనని భయపడుతున్నారట.ఇవి చదవండి: 'గ్లాస్ గుచ్చుకుంది'..! -
'గ్లాస్ గుచ్చుకుంది'..!
విశాఖ ఉత్తర నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్రాజుకు గ్లాసు గుర్తు గట్టిగానే గుచ్చుకుంటోందట. ఇప్పటికే జైభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ తన ఓట్లనే చీల్చుతారని తెగ ఇదైపోతున్నారట. దీనికి గ్లాసు గుర్తు తోడు కావడంతో భయపడ్డ ఆయన, గ్లాస్ గుర్తు దక్కిన స్వతంత్ర అభ్యర్థి ఇంటికెళ్లి మరీ బతిమాలుకున్నారట.తను గెలిచాక అధిక మొత్తం ముట్టజెప్తానని హామీ ఇచ్చారట. అయి తే 2014లో ఆయన తీరు గుర్తుకొచ్చి తక్షణ బేరం మాట్లాడుకున్నారట. కాస్త ‘భారీ’స్థాయిలో బతిమాలుకున్నాకే ఆ అభ్యర్థి వెనక్కి తగ్గినట్లు పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. ఏది ఏమైనా ఈసారి పరువు తప్ప, అధికారం మాత్రం దక్కదన్న నమ్మకానికొచ్చేశారట..!ఇవి చదవండి: 'పులుసు కారుతోంది'..! -
పశ్చిమంలో సుజనా ప్రైవేట్ సైన్యం
వన్టౌన్(విజయవాడపశ్చిమ): విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పోటీచేస్తున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సుజనాచౌదరి ఎన్నికల్లో గెలుపు కోసం డబ్బు పంపిణీకి తెరతీశారు. ఇందు కోసం తన ప్రైవేట్ సైన్యాన్ని విజయవాడ నగరంలో మోహరించారు. ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని గుర్తించిన ఆయన ఏదో విధంగా గెలవాలని భావిస్తున్నారు. దీనికి అనుగుణంగా సుజనాచౌదరితో పాటుగా తెలుగుదేశం నాయకులు భారీ ప్రణాళిక రూపొందించారు. నియోజకవర్గంలో సుజనాకు మద్దతు లేని ప్రాంతాల్లో తన సంస్థల్లో పనిచేసే ఉద్యోగులను మోహరించారు. కొత్త వ్యక్తులు నియోజకవర్గంలో డబ్బుల కట్టల పట్టుకొని తిరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు.డివిజన్లవారీగా బాధ్యతలునియోజకవర్గంలో ఓట్లను కొనుగోలు చేయడానికి తన కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు 200 మందిని సుజనాచౌదరి నగరంలో దింపారని బీజేపీ నాయకులు చెబుతున్నారు. డివిజన్కు పది మంది వరకూ తమ ఉద్యోగుల ద్వారా నగదు పంపిణీ చేయాలని ఆయన భావిస్తున్నారని సమాచారం. అందుకు అనుగుణంగా ఉద్యోగులకు ఆయా డివిజన్ల బాధ్యతలను అప్పగించినట్లు తెలిసింది. ఎస్సీ, మైనార్టీ, ఎస్టీ ఓట్లను కొనుగోలు చేయాలనే లక్ష్యంతో ఆ వర్గాలు అధికంగా ఉన్న డివిజన్లను ఎంపిక చేససుకొని వాటిపై దృష్టిని పెడుతున్నారు. ఇప్పటికే కొంత మంది నాయకులను సంతలో పశువుల్లా కొనుగోలు చేశారని సీనియర్ నాయకులు పేర్కొంటున్నారు. ఇంత అడ్డగోలుగా నాయకులు అమ్ముడుపోవటం ఇప్పుడే చూస్తున్నామని వారు ఆవేదన వ్యక్తంచేశారు.హోటళ్లు ఫుల్నగరంలోని పలు ప్రాంతాల్లో సుజనా సైన్యం బస చేస్తోంది. నిడమానురులోని సుజనా సొంత నివాసంలో కొద్దిమంది షెల్టర్ తీసుకోగా అధిక శాతం మంది వన్టౌన్, గొల్లపూడి, బెంజిసర్కిల్ తదితర ప్రాంతాల్లోని హోటళ్లలో తిష్టవేశారు. ఒక సామాజికవర్గానికి చెందిన దుకాణాలు, హోటళ్ల ద్వారా వారు నగదును బయటకు తరలిస్తున్నారని సమా చారం. ఎంత మొత్తం వెచ్చించైనా ఓట్లు కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగా మైనార్టీ, దళిత వర్గాలు నివసించే ప్రాంతాల్లో ఆయా స్థానిక నాయకుల నుంచి ఓటరు లిస్టులను దగ్గర ఉంచుకొని కొనుగోలు చేయాల్సిన ప్రాంతాలను ఎంపిక చేసుకొని ఆ దిశగా పావులు కదుపుతున్నారు.సుజనాచౌదరిని తరిమికొడతాం తమ ఓట్లను కొనుగోలు చేస్తామంటూ తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూసే సుజనాచౌదరిని తరిమికొడతామని దళిత, మైనార్టీ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. సుజనాచౌదరి నగరానికి వచ్చినప్పటి నుంచి దళితులు, మైనార్టీల ఓట్లు కొంటామని మాట్లాడుతున్నా రని వారు చెబుతున్నారు. తమ ఓట్లు కొనుగోలు చేసి తద్వారా గెలుస్తానని పదేపదే మాట్లాడటం తమను దిగజార్చటమేనని వారు వ్యాఖ్యానిస్తున్నారు. సుజనాచౌదరి వంటి నేతలకు ఓటు ద్వారా తమ సత్తా చూపుతామని వారు హెచ్చరిస్తున్నారు. -
చంద్రబాబు బాటలోనే రెండు కళ్ల సిద్ధాంతం అంది పుచ్చుకున్న బిజెపి
-
బీజేపీ గెలిస్తే.. నియంత పాలనే! : సీఎం రేవంత్రెడ్డి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాజ్యాంగాన్ని మార్చి.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేయాలన్నది మోదీ ప్రభుత్వ కుట్ర అని టీపీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపించారు. బీజేపీ గెలిచి రాజ్యాంగాన్ని మారిస్తే.. దేశం నియంత పాలనలోకి వెళుతుందని వ్యాఖ్యానించారు. దేశంలో మోదీ, రాష్ట్రంలో కేడీ ఒక్కటేనని.. బీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లేనని పేర్కొన్నారు. కేసీఆర్ తన బిడ్డ కవిత బెయిల్ కోసం ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని విమర్శించారు. బుధవారం నిజామాబాద్, ఆర్మూర్లలో నిర్వహించిన రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లలో రేవంత్రెడ్డి మాట్లాడారు. ‘‘రైతు భరోసా ఇస్తే అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాస్తానన్న కేసీఆర్కు సిగ్గులేదు. 69 లక్షల మంది రైతుల ఖాతాలు చూస్తే డబ్బులు జమ అయిన విషయం తెలుస్తుంది. మరి కేసీఆర్ ఏం చేస్తున్నారు? రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీశ్రావు సవాల్ చేశారు. ఆగస్టు 15లోగా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి.. సిద్దిపేటకు పట్టిన శని హరీశ్రావును వదిలిస్తా. రాజీనామా రాసిపెట్టుకో హరీశ్రావు.. రైతులకు ధాన్యానికి రూ.500 బోనస్తోపాటు ఎర్రజొన్నలు, మొక్కజొన్న, సోయాకు గిట్టుబాటు ధరలు ఇస్తాం. షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాం.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీల్లో ఐదింటిని అమలు చేశాం. గంజాయి, డ్రగ్స్పై ఉక్కుపాదం మోపాం. నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు ఇప్పటికే ఉపసంఘం వేశాం. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే చెరుకు రైతులకు రూ.47 కోట్ల బకాయిలు విడుదల చేస్తాం. ఎంపీ అర్వింద్ చెప్తున్న పసుపుబోర్డు కాగితాలకే పరిమితమైంది. నిజాం చక్కెర ఫ్యాక్టరీ తెరిపిస్తానని మాటిచ్చి తప్పిన కవితను ప్రజలు ఓడించి అర్వింద్ను గెలిపించారు. పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చిన అర్వింద్ తేలేకపోయారు. పైగా షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని ప్రధాని మోదీ మళ్లీ అబద్ధాలు చెప్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి. మేం తప్పకుండా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం. రాజ్యాంగాన్ని మార్చితే ప్రజలు ఊరుకోరు 2021లోనే చేయాల్సిన జనగణన చేపట్టకుండా ప్రధాని మోదీ కుట్ర చేశారు. బీసీల కులగణనకు మోదీ ఎందుకు అడ్డుపడుతున్నారో చెప్పాలి. రాజ్యాంగాన్ని మార్చి.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేయాలన్న మోదీ ప్రభుత్వ కుట్రలో భాగమే. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని నచ్చినట్టు మార్చాలని చూస్తే జనం చూస్తూ ఊరుకోరు. రాజ్యాంగాన్ని మారిస్తే దేశం నియంత పాలనలోకి వెళుతుంది. రిజర్వేషన్లను రద్దు చేసే ప్రమాదం మెడ మీద కత్తిలా వేలాడుతోంది. అందుకే దేశ ప్రజలు బీజేపీని గొయ్యి తీసి పాతిపెట్టాలి. అభివృద్ధి అడిగితే గాడిద గుడ్డు ఇచ్చారు రాష్ట్ర విభజన సమయంలో బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్, నల్లగొండలో ఐఐటీ, మెదక్లో ఐఐఎం ఏర్పాటుకు కేంద్రం హామీ ఇచ్చింది. కానీ మోదీ ప్రభుత్వం వాటిని అమలు చేయలేదు. చక్కెర కర్మాగారం అడిగితే గాడిద గుడ్డు ఇచ్చారు. దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలి.. దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలి. దేవుడి ఫొటోలు చూపించి ఓట్లడిగేవారిని బిచ్చగాళ్లు అంటారు. రామాలయం ప్రతిష్టకు 15 రోజుల ముందే అక్షింతలు ఎక్కడి నుంచి వచ్చాయి? అక్షింతలు ముందే పంపిణీ చేయడం హిందూ సంప్రదాయం కాదు. బీజేపీ నాయకులు దేవుడిని, ప్రజలను మోసం చేస్తున్నారు..’’ అని రేవంత్ ఆరోపించారు. నిజామాబాద్ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డిని గెలిపించాలని కోరారు. -
‘ఆర్ఆర్’ ట్యాక్స్ వెయ్యికోట్లు!: ప్రధాని మోదీ
సాక్షి, వరంగల్/ సాక్షి ప్రతినిధి, కరీంనగర్/ వేములవాడ: ‘‘కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే అభివృద్ధి పూర్తిగా ఆగి, ప్రభుత్వ ఖజానా ఖాళీగా మారింది, కాంగ్రెస్ వాళ్లు.. ఆర్ఆర్ ట్యాక్స్ పేరిట ప్రజలను దోపిడీ చేస్తున్నారు. అందులో సగం హైదరాబాద్లోని ‘ఆర్’కు వెళ్తే.. రెండో సగం మరో ‘ఆర్’ కోసం ఢిల్లీకి వెళ్తుంది. ఈ ఆర్ఆర్ ట్యాక్స్.. ట్రిపుల్ ఆర్ సినిమా రూ.వెయ్యికోట్ల వసూళ్లను అనతికాలంలోనే దాటడం ఇక్కడి అవినీతికి నిదర్శనం..’’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ ఎంత అబద్ధాల కోరు అన్నది తెలంగాణ ప్రజలకు తెలిసినంతగా మరెవరికీ తెలియదన్నారు. రైతుల రుణమాఫీపై కాంగ్రెస్ చేతులెత్తేయబోతోందని.. లోక్సభ ఎన్నికల వరకు ఆగి మోసగిస్తుందని వ్యాఖ్యానించారు. బుధవారం వేములవాడ, వరంగల్లలో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణ అమరుల కుటుంబాలకు పెన్షన్ ఇస్తామని, 250 గజాల భూమి ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది. ఇవ్వలేదు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పి, మోసం చేసింది. తెలంగాణలో విద్యుత్ కోతలు పెరిగాయి. ప్రజలకు గంట గడవడం కష్టమవుతోంది. అలాంటి నమ్మక ద్రోహి కాంగ్రెస్ ప్రజలకు ఎలా మేలు చేస్తుంది? ఒక్కసారి ఆలోచించాలి. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో ప్రజలు కాంగ్రెస్ను అధికారమిస్తే.. కుటుంబానికే పెద్దపీట వేసి, జాతి ప్రయోజనాలకు గంగలో ముంచింది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావును అవమానించింది. అదే పీవీని బీజేపీ సర్కారు భారతరత్నతో గౌరవించింది. బీసీలకు కోత వేసి ముస్లింలకు ఇస్తుంది కాంగ్రెస్ దృష్టిలో రాజ్యాంగానికి విలువ లేదు. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వకూడదని అంబేడ్కర్ స్పష్టంగా చెప్పారు. కానీ కాంగ్రెస్ కర్ణాటకలో బీసీల రిజర్వేషన్లు కత్తిరించి ముస్లింలకు ఇచ్చింది. ఉమ్మడి ఏపీలో అదే ప్రయత్నం జరిగినా హైకోర్టు నిలిపివేసింది. దీన్ని కాంగ్రెస్ సహించలేకపోతోంది. అందుకే చట్టం చేసి అయినా.. ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీల రిజర్వేషన్లు తొలగించి ముస్లింలకు ఇవ్వాలనుకుంటోంది. బీఆర్ఎస్ కూడా బుజ్జగింపు రాజకీయాలు చేస్తోంది. కేవలం ముస్లింల కోసం ఐటీ పార్కులను ఏర్పాటు చేస్తామని గతంలో ప్రకటించింది. 2014లో అధికారంలోకి వస్తే దళితుడ్ని సీఎం చేస్తామని మోసం చేసింది. దళిత బంధు పేరిట మోసం చేసింది. కాళేశ్వరం కుంభకోణానికి పాల్పడింది. ఎస్సీ వర్గీకరణ చేస్తాం.. మాదిగ సోదరులకు రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో కాంగ్రెస్ వెనుకడుగు వేస్తోంది. ఎస్సీ వర్గీకరణ కోసం నా చిన్న తమ్ముడు మంద కృష్ణ చాలాకాలం నుంచి పోరాడుతున్నారు. ఇప్పటివరకు న్యాయం జరగలేదు. నేను వారికి న్యాయం చేస్తానని వాగ్దానం చేశాను. అమలు చేసి చూపిస్తా. కాంగ్రెస్ సీట్లను భూతద్దంలో చూసుకోవాల్సిందే.. ప్రపంచమంతా అస్థిరత, అశాంతి, విపత్తులు నెలకొని ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో దేశ కార్యభారాన్ని, శక్తిని తప్పుడు చేతుల్లో పెట్టొద్దు. పదేళ్ల క్రితం వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏరకమైన పాపాలు చేసిందో అందరికీ తెలుసు. నాలుగు రోజులకో కుంభకోణం, అవినీతి బయటపడుతుండేవి. దేశంలోని పెద్ద పట్టణాల్లో బాంబు పేలుళ్లు సంభవించేవి. ఇప్పుడు ఎన్టీయే విజయరథం వేగంగా ప్రయాణం చేస్తోంది. ఇప్పటివరకు జరిగిన మూడు దశల పోలింగ్లో ముందు నిలిచింది. కాంగ్రెస్ ఎక్కడెక్కడ సీట్లు గెలుస్తుందా అని భూతద్దం పెట్టి చూసే పరిస్థితి ఏర్పడింది. నాలుగో దశ పూర్తయ్యే సరికి భూతద్దంతోనూ దొరకవు. మైక్రోస్కోప్ కావాల్సి వస్తుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ తోడు దొంగలే! బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ తోడుదొంగలే. పైకి తిట్టుకున్నా అవినీతి అనే వారధి వారిని తెరవెనుక కలుపుతోంది. అందుకే ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ నేతను, కాళేశ్వరం అవినీతిలో బీఆర్ఎస్ నేతలను రెండు పార్టీలు పరస్పరం కాపాడుకుంటున్నాయి. హైదరాబాద్లో ఎంఐఎం విషయంలో బీఆర్ఎస్–కాంగ్రెస్ మధ్య అవగాహన ఉంది. కానీ బీజేపీ రంగంలోకి దిగేసరికి వారిలో ఆందోళన మొదలైంది. కాంగ్రెస్–బీఆర్ఎస్లకు కుటుంబ రాజకీయాలే తొలి ప్రాధాన్యం. బీజేపీకి దేశమే తొలిప్రాధాన్యం. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అడ్రస్ గల్లంతే. తెలంగాణ ప్రజలంతా ఏకమై మే 13న ఆ పార్టీలకు బుద్ధి చెప్పాలి..’’ అని మోదీ పిలుపునిచ్చారు. ఓరుగల్లు సభలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పాల్గొన్నారు. చర్మం రంగును బట్టి యోగ్యత ఉంటుందా..? మేం 2014లో తొలిసారి అధికారంలోకి రాగానే దళితుడైన రాంనాథ్ గోవింద్ను రాష్ట్రపతిని చేశాం. 2019లో ఆదివాసీ మహిళ ద్రౌపదీ ముర్మును రాష్ట్రపతిని చేశాం. కాంగ్రెస్ ఈ ఇద్దరిని వ్యతిరేకించింది. ముఖ్యంగా ద్రౌపదీ ముర్మును కాంగ్రెస్ ఎందుకు అంతగా వ్యతిరేకించిందా? అని ఎంతగా ఆలోచించినా ఇన్నాళ్లూ అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమవుతోంది. ద్రౌపదీ ముర్ము గారి చర్మం రంగు నలుపు. ఇక్కడున్న రాజ కుమారుడి (రాహుల్ గాం«దీ)కి అమెరికాలో ఓ ఫ్రెండ్ ఫిలాసఫర్, మార్గదర్శి (శ్యామ్ పిట్రోడా) ఉన్నారు. చర్మం రంగు నల్లగా ఉన్నవాళ్లందరూ ఆఫ్రికన్లలా ఉంటారని ఆయన ఈ మధ్య అన్నారు. చర్మం రంగును బట్టి ద్రౌపదీ ముర్ము గారిని కూడా ఆఫ్రికన్ అని ఆయన భావించారు. అందుకే ఓడించాలని చెప్పి రాజకుమారుడికి బోధించారు. నలుపు చర్మం ఈ దేశంలో చాలా మందికి ఉంటుంది. శ్రీకృష్ణుడి రంగు కూడా నలుపే. మరి అలాంటిది చర్మం రంగును బట్టి యోగ్యతను నిర్ధారిస్తారా? ఇందుకే ఆ రాజ కుమారుడి మీద నాకు కోపం వస్తోంది. నన్ను తిడితే నాకు కోపం రాదు. కానీ నా దేశ ప్రజలను చర్మం రంగు పేరిట రాజ కుమారుడి మార్గదర్శకుడు లండన్లో కూర్చొని , అమెరికాలో కూర్చొని తిట్టడం నాకు కోపం తెప్పిస్తోంది. రాజన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ బుధవారం ఉదయం 9.30 గంటల సమయంలో ప్రత్యేక హెలికాప్టర్లో ప్రధాని మోదీ వేములవాడకు చేరుకున్నారు. నేరుగా శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. కోడె మొక్కు చెల్లించుకున్నారు. తర్వాత ప్రత్యేక కాన్వాయ్లో ప్రజలకు అభివాదం చేస్తూ.. బాలానగర్లోని సభాస్థలికి చేరుకున్నారు. సభ ముగిశాక హెలికాప్టర్లో వరంగల్ పయనమయ్యారు. ‘ఒక్కొక్కరి పొలంలో పది మీటర్లు..’ కాంగ్రెస్పై మోదీ సెటైర్ లెక్క! ‘‘ఈసారి ఇండియా కూటమి ఐదు సంవత్సరాల్లో ఐదుగురు ప్రధానులను తీసుకొస్తామని చెప్తోంది. ఇదీ అందరికీ స్పష్టంగా అర్థం కావాలంటే మరో పద్ధతిలో చెబుతా. పది మంది రైతులు తమ పొలాల్లో బోరు వేయించాలనుకున్నారు. ఒక నిపుణుడిని పిలుచుకొచ్చారు. ఆ నిపుణుడు మొత్తం పరిశీలించి, 100 మీటర్లు తవ్వితే నీళ్లు పడతాయని చెప్పారు. అప్పుడు ఈ రైతులు.. ఒకరి పొలంలో పది మీటర్లు, పక్క పొలంలో పది మీటర్లు, ఆ పక్కవాడి పొలంలో పది మీటర్లు.. ఇలా పది మంది పొలాల్లో తవ్వితే 100 మీటర్లు అయిపోతుందనుకున్నారు. అలా చేస్తే నీళ్లు వస్తాయా? ఇండియా కూటమి అంతే. పార్టీకో ప్రధాని ఉంటే దేశం భవిష్యత్ ఏమవుతుంది?’’ రుణమాఫీపై చేతులెత్తేస్తారు! ‘‘కాంగ్రెస్ అతిపెద్ద నాయకురాలు (సోనియా) పుట్టినరోజు డిసెంబర్ 9న రైతుల రుణమాఫీ చేస్తామని ఆ పార్టీ నేతలు చెప్పారు. ఇప్పుడు ఆగస్టు 15 వరకు వాయిదా వేసి ఆ వాగ్దానాన్ని వెనక్కి తోశారు. లోక్సభ ఎన్నికలు అయ్యేదాకా ఆగి ఆ తర్వాత చేతులెత్తేయబోతున్నారు. ఇది మిమ్మల్ని మోసం చేయడమే.. మీ మనోభావాలను దెబ్బతీయడమే.. వాళ్లు ఒకవైపు వేములవాడ రాజన్న మీద ఒట్టు పెడుతున్నారు. మరోవైపు సనాతన ధర్మాన్ని తిడుతున్నారు. సనాతన ధర్మాన్ని తిడుతూ, ఒట్లు పెట్టేవారిని ఎవరు నమ్ముతారు..’’ – మోదీ -
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
కోల్కతా : బీజేపీ డబ్బులతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తోందంటూ పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఆరంబాగ్లో పార్టీ అభ్యర్ధి మితాలీ బాగ్కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. రూ.5,000, రూ.10,000, రూ.15,000 వరకు డబ్బులు చెల్లించి బీజేపీ ఓట్లను కొనుగోలు చేస్తోందని అన్నారు.తమపై తప్పుడు ప్రచారం చేసేలా మహిళలకు బీజేపీ డబ్బులిచ్చి ఉసిగొల్పిందని, సందేశ్ఖాలీలోని మహిళల పరువును ఎలా తీసిందో మీరో చూడండి అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని 26 వేల మంది టీచర్ల ఉద్యోగాలను బీజేపీ లాక్కుందని, సుప్రీం కోర్టు తీర్పుతో నిజం గెలిచిందని సంతోషం వ్యక్తం చేశారు. 100 రోజుల పనికి సంబంధించిన డబ్బును మా పార్టీ దొంగిలించిందని మోదీ అంటున్నారు. అవన్ని అవాస్తవాలే. రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల పని కింద రూ. 24 కోట్లు ఆదా చేసిందని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. -
పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాహుల్ గాంధీ మెంటర్ ఆలోచన, వైఖరిని వెల్లడిస్తుందని అన్నారు.లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారుతున్నాయి. ఇటీవల వారసత్వ పన్నుపై మాట్లాడి వివాదంలో చిక్కుకున్న ఆయన.. తాజాగా, జాత్యహంకార వ్యాఖ్యలతో తీవ్ర దుమారాన్ని రేపారు. పిట్రోడా జాతి వివక్షకు పాల్పడుతున్నారంటూ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలపై నిర్మలా సీతారామన్ ఎక్స్ వేదికగా స్పందించారు. నేను దక్షిణ భారతీయురాలిని. నేను భారతీయురాలిగా కనిపిస్తున్నాను అని అన్నారు.కానీ రాహుల్ గాంధీకి గురువు పిట్రోడా జాత్యహంకారానికి మనమందరం ఆఫ్రికన్, చైనీస్, అరబ్, శ్వేతజాతీయులుగా కనిపిస్తున్నాము. మీ ఆలోచనా విధానాన్ని, మీ వైఖరిని వెల్లడించినందుకు ధన్యవాదాలు. మీ వ్యాఖ్యలు ఇండియా కూటమికే అవమానం అని మండ్డారు. కాగా, పిట్రోడా వ్యాఖ్యల్ని కాంగ్రెస్ ఖండించింది. ‘పిట్రోడా వ్యాఖ్యలు దురదృష్టకరం. ఆమోదయోగ్యం కాదు’ అని పార్టీ అధికార ప్రతినిధి జైరాం రమేశ్ స్పష్టం చేశారు. I am from South India. I look Indian! My team has enthusiastic members from north east India. They look Indian! My colleagues from west India look Indian! But, for the racist who is the mentor of @RahulGandhi we all look African, Chinese, Arab and the White! Thanks for… pic.twitter.com/UzXi4ndwhk— Nirmala Sitharaman (Modi Ka Parivar) (@nsitharaman) May 8, 2024 -
చిక్కుల్లో బీజేపీ అభ్యర్థి పరమ్పాల్.. వీఆర్ఎస్ రద్దు.. డ్యూటీకి రావాలంటూ ఆదేశం!
పంజాబ్లోని బఠిండా లోక్ సభ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగిన ఐఏఎస్ అధికారి పరమ్పాల్ కౌర్ చిక్కుల్లో పడ్డారు. అకాలీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన సికందర్ సింగ్ మలుకా కోడలు, పంజాబ్ ఐఏఎస్ అధికారి పరంపాల్ కౌర్ రాజీనామాలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది.రెండు రోజుల క్రితం పరమ్పాల్ కౌర్ రాజీనామాను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. అలాగే దీనికి సంబంధించి పంజాబ్ ప్రభుత్వానికి కేంద్రం లేఖ కూడా రాసింది. అయితే పంజాబ్ ప్రభుత్వం పరమ్పాల్ కౌర్ వీఆర్ఎస్ను తిరస్కరించింది. ఆమెను వెంటనే విధుల్లో చేరాలని కోరింది.ఇటువంటి పరిస్థితిలో పరమ్పాల్ కౌర్ నామినేషన్ దాఖలు చేయడంలో ఇబ్బందులను ఎదుర్కోనున్నారు. పరంపాల్ కౌర్ స్వచ్ఛంద పదవీ విరమణ తర్వాత తన భర్తతో కలిసి బీజేపీలో చేరారు. ఈ నేపధ్యంలో పార్టీ ఆమెను బఠిండా అభ్యర్థిగా ప్రకటించింది. పంజాబ్ ప్రభుత్వ పర్సనల్ డిపార్ట్మెంట్ తన నోటీసులో.. ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్లోని రూల్ 16(2) ప్రకారం సమర్థ ప్రీ-డిశ్చార్జ్ కోసం పరమ్పాల్ కౌర్ దరఖాస్తు చేసుకున్నారని తెలిపింది. వృద్ధురాలైన తల్లిని చూసుకోవడానికి రిటైర్మెంట్ కోరుతున్నట్లు ఆమె తన దరఖాస్తులో పేర్కొన్నారు.పదవీ విరమణ దరఖాస్తు నిబంధనల ప్రకారం మూడు నెలల నోటీసు వ్యవధిని మినహాయించాలని పరమ్పాల్ కౌర్ అభ్యర్థించారు. అయితే పంజాబ్ ప్రభుత్వ సిబ్బంది విభాగం పంపిన నోటీసులో పదవీ విరమణకు సంబంధించిన నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే సంబంధిత అధికారికి మూడు నెలల నోటీసు వ్యవధి నుండి మినహాయింపు ఇవ్వగలదని స్పష్టం చేసింది . కేంద్ర ప్రభుత్వానికి ఈ హక్కు లేదని దానిలో పేర్కొంది.అలాగే తల్లి సంరక్షణకు కోసం పదవీ విరమణ కోరుతున్నట్లు దరఖాస్తులో పేర్కొన్న కారణం నిరాధారమైనదిగా పరిగణిస్తున్నట్లు నోటీసులో స్పష్టం చేసింది. ఆమె దరఖాస్తు సమర్పించాక రాజకీయాలలో చురుకుగా మారారు. అందుకే ఈ కారణం నిరాధారమని సదరు నోటీసులో పేర్కొన్నారు. పంజాబ్ ప్రభుత్వం ఆమె రిలీఫ్ అప్లికేషన్పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఆమె తక్షణమే విధుల్లో చేరాలని ఆ నోటీసులో ఆమెకు తెలియజేశారు. -
నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
సాక్షి, అమరావతి: ప్రధాని మోదీ బుధవారం రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఆయన మధ్యాహ్నం 1:50 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 2.55 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా 3.45 గంటలకు రాజంపేట లోక్సభ పరిధిలో ఉన్న కలికిరిలో బహిరంగ సభలో పాల్గొంటారు.సాయంత్రం 6.25 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు చేరుకుంటారు. అక్కడ బందర్ రోడ్డులో ఇందిరాగాంధీ స్టేడియం వద్ద 7 గంటలకు రోడ్ షోను ప్రారంభించి, గంట పాటు బెంజ్ సర్కిల్ వరకు రోడ్ షో నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
కేంద్రంలో బీజేపీ వస్తే భవిష్యత్తు ఉండదు
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో బీజేపీ మరోమారు అధికారంలోకి వస్తే దేశంలోని బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లకు భవిష్యత్తు ఉండదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హెచ్చరించారు. 400 సీట్లు ఎప్పుడు వస్తాయా? రాజ్యాంగాన్ని ఎప్పుడు మార్చి రిజర్వేషన్లను రద్దు చేద్దామా అని ఆ పార్టీ ఉర్రూతలూగుతోందని చెప్పారు. పొరపాటున బీజేపీకి ఓటేస్తే మన గొంతు మనం కోసుకున్నట్టేనని వ్యాఖ్యానించారు. మంగళవారం గాం«దీభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ నేతలు బండ్ల గణేశ్, సామా రామ్మోహన్రెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడారు. 90% మందికి హక్కులు దక్కకుండా బీజేపీ కుట్ర ‘బీజేపీ అధికారంలోకి వస్తే దళితులు, గిరిజనులు, బీసీలకు రాజ్యాంగం ద్వారా దక్కాల్సిన హక్కులు, వారి వాటా దక్కకుండాపోయే ప్రమాదముంది. తరతరాలుగా అణగదొక్కబడుతున్న దళితులు, గిరిజనులకు రిజర్వేషన్లు ఆషామాïÙగా రాలేదని బీజేపీ నేతలు గుర్తుంచుకోవాలి. ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ఎస్సీ, ఎస్టీలకు అవకాశాల్లో మార్పు రావడానికి రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్లే కారణం. ఈ రిజర్వేషన్ల ద్వారా ఆయా వర్గాలకు రావాల్సింది ఇంకా చాలా ఉంది. ఓవైపు దేశ వ్యాప్తంగా కులగణన చేసి జనాభా దామాషా ప్రతిపాదికన ఎవరి వాటా వారికి ఇవ్వాలనేది రాహుల్గాంధీ ఆలోచన. కులగణన ఊసెత్తకుండా ఇప్పటికే ఉన్న ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను తొలగించాలన్నది బీజేపీ ఆలోచన. దేశంలోని 90 శాతం మంది ప్రజలకు రావాల్సిన హక్కులు వారికి రాకుండా బీజేపీ కుట్ర చేస్తోంది. అందుకే పదే పదే 400 సీట్లు కావాలని అడుగుతోంది..’అని భట్టి చెప్పారు. పెను ప్రమాదంలో ప్రజాస్వామ్యం ‘బీజేపీ ఆలోచనలతో ప్రజాస్వామ్యం పెను ప్రమాదంలో పడింది. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని సమాజంపై రుద్దే కుట్ర జరుగుతోంది. ఇలాంటి వాస్తవాలను చెబుతుంటే తప్పుడు కేసులు పెడుతున్నారు. ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై కేసులు పెట్టి విచారణకు ఢిల్లీ రావాలని పిలిపిస్తున్నారు. కేసులు పెట్టి బెదిరిస్తున్నారా? ప్రజల మనసులను గెలుచుకుని ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలే తప్ప కేసులు పెట్టి కాదు. బీజేపీకి ఈ రాష్ట్రంలో స్థానం లేకుండా చేయాల్సిన బాధ్యత రాష్ట్రంలోని బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లపై ఉంది. రానున్న ఎన్నికల్లో తెలంగాణలోని ఆయా వర్గాలు కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించాలి. దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యాంగబద్ధమైన వాటాను, వారి హక్కులను కాపాడుకోవాలంటే కాంగ్రెస్ను నిలబెట్టుకోవాలి..’అని డిప్యూటీ సీఎం అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చడంఎవరి తరం కాదు‘ఎన్నికల కోడ్ రాకముందు మేము అధికారంలోకి వచ్చి మూడు నెలలే అవుతోంది. పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ తెలంగాణను ఛిన్నాభిన్నం చేస్తే దాన్ని సరిదిద్దుతూ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. పదేళ్ల కాలంలో చెప్పిన హామీలను అమలు చేయని కేసీఆర్ ఇప్పుడు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు..’అని భట్టి విమర్శించారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉండబోదని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు కదా అని ప్రశ్నించగా.. ప్రభుతాన్ని కూల్చడం ఎవరి తరం కాదని భట్టి చెప్పారు. సంపూర్ణంగా ఐదేళ్ల పాటు పాలిస్తామని ధీమా వ్యక్తం చేశా రు. గత పదేళ్లలో ప్రజా సంపదను ఎలా లూఠీ చేయాలో బీఆర్ఎస్ చూపెడితే, ఆ సంపదను ప్రజలకు ఎలా పంచాలో తాము చూపెడతా మని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 14 స్థానాల్లో గెలుస్తుందని అన్నారు. -
కాంగ్రెస్ పార్టీకి ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది
కరీంనగర్ టౌన్: ‘వంద రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని మోసం చేసిన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే కాంగ్రెస్ నేతలారా.. నా ఆస్తిపాస్తులు, మీరు నాపై చేస్తున్న అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ కోరేందుకు నేను సిద్ధం. మరి మీ ఆస్తిపాస్తులు, అవినీతి, బినామీ ఆస్తులపై సీబీఐ విచారణకు సిద్ధమా? దమ్ముంటే నా సవాల్ను స్వీకరించాలి’అంటూ బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ సహా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. మంగళవారం కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో బండి సమక్షంలో పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడారు. దేశంలో ఎన్నికలు నరేంద్రమోదీ, రాహుల్గాం దీకి మధ్య జరుగుతున్నాయని, ఎవరి నాయకత్వం కావాలో ఆలోచించుకోవాలని సూచించారు. పదేళ్ల ఎన్డీఏ పాలన, అంతకుముందు పదేళ్ల యూపీఏ పాలనపై బేరీజు వేసి ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ పెద్ద డ్రామాఆర్టిస్ట్, అవినీతికి కేరాఫ్ అడ్రస్ అని విమర్శించారు. తనను, తన కుటుంబాన్ని అరెస్ట్ చేయకుండా ఉండేందుకు సీబీఐని రాష్ట్రంలోకి అడుగుపెట్టకుండా ఉత్తర్వులు ఇచ్చిన కేసీఆర్.. సిగ్గులేకుండా తాను సుద్దపూసనని, మోదీ అరెస్ట్ చేసేందుకు కుట్ర చేస్తున్నారని అంటున్నారని విమర్శించారు. కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ అని, పదేళ్ల యూపీఏ పాలనలో రూ.12 లక్షల కోట్ల అవినీతి, 2జీ, బొగ్గు, విమానాలు, కామన్వెల్త్ గేమ్, ఆదర్శ స్కాంలు.. ఐపీఎల్, గడ్డి కుంభకోణం, సహారా, ఈఎస్ఐ, హవాలా చివరకు చెప్పుల స్కాం (ఫేక్ లెదర్ సొసైటీ ఏర్పాటు)లో వేల కోట్ల రుణం తీసుకొని ఎగ్గొట్టిన వ్యాపారులను సంకలో వేసుకొని తిరిగిన నీచ చరిత్ర కాంగ్రెస్దేనన్నారు. కానీ మోదీ మచ్చలేని స్వచ్ఛమైన పాలన అందిస్తున్నారని వివరించారు. అందుకే 140 కోట్ల మందికి గ్యారంటీ మోదీ మాత్రమేనని ప్రజలు నమ్ముతున్నారని స్పష్టం చేశారు. అవినీతి, కుంభకోణాలు, వారసత్వ పాలనతో దేశాన్ని భ్రష్టు పట్టించిన కాంగ్రెస్కు ఎక్స్పైరీ డేట్ వచ్చేసిందన్నారు. బుధవారం ఉదయం 8 గంటలకు మోదీ వేములవాడ రాజన్నను దర్శించుకుంటారని, తర్వాత 9 గంటలకు వేములవాడ బాలానగర్ కోర్టు వద్దనున్న మైదానంలో భారీ బహిరంగసభలో పాల్గొంటారని, సభను విజయవంతం చేయాలని కోరారు. -
నేడు వేములవాడకు మోదీ!
సాక్షి, హైదరాబాద్/ వేములవాడ/ సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం మరోసారి రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. వేములవాడ రాజన్నను దర్శించుకోవడంతోపాటు వేములవాడ, వరంగల్లలో నిర్వహించే బహిరంగ సభలలో ప్రసంగించనున్నారు. బుధవారం ఉదయమే హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరుతారు. సుమారు 8 గంటల సమయంలో వేములవాడకు చేరుకుంటారు.అక్కడి రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత వేములవాడలోని బాలానగర్లో బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కు మద్దతుగా నిర్వహిస్తున్న బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం ఉదయం 10 గంటల సమయంలో వరంగల్కు చేరుకుంటారు. అక్కడ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేశ్కు మద్దతుగా ఎన్నికల బహిరంగ సభలో పాల్గొంటారు.పకడ్బందీగా ఏర్పాట్లు..వేములవాడలో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో పకడ్బందీగా భద్రత ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసరాలను ఎస్పీజీ తమ ఆధీనంలోకి తీసుకుంది. ఆలయ సమీపంలోని ఎత్తయిన భవనాలపై ప్రత్యేకంగా నిఘా పెట్టారు. ఇక ఎంపీ బండి సంజయ్ ఆధ్వర్యంలో ప్రధాని సభ కోసం బాలానగర్ ప్రాంతంలో భారీగా ఏర్పాట్లు చేశారు. అయితే మంగళవారం కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులతో టెంట్లు, కుర్చీలు చెల్లాచెదురయ్యాయి. వాటిని సరిచేస్తున్నారు. వానలు కొనసాగుతాయన్న వాతావరణశాఖ ప్రకటన నేపథ్యంలో.. బుధవారం సభ నిర్వహణ ఎలాగన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వేములవాడ ఆలయానికి వస్తున్న తొలి ప్రధాని మోదీయే కావడం గమనార్హం.అమిత్ షా, రాజ్నాథ్ల ప్రచారం కూడా..బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి రానున్నారు. బుధవారం రాత్రే హైదరాబాద్కు చేరుకోనున్న అమిత్ షా.. గురువారం ఉదయం 9 గంటలకు హెలికాప్టర్లో భువనగిరికి చేరుకుని, బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఇక రాజ్నాథ్ సింగ్ గురువారం ఉదయం 9 గంటలకు వరంగల్లో, 11 గంటలకు జహీరాబాద్ లోక్సభ అభ్యర్థి బీబీ పాటిల్కు మద్దతుగా బాన్సువాడలో నిర్వహించే బహిరంగ సభలలో పాల్గొంటారు. బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి ఈ వివరాలను వెల్లడించారు.పీవీ కుటుంబ సభ్యులతో మోదీ డిన్నర్రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిమిత్తం ప్రధాని మోదీ మంగళవారం రాత్రే హైదరాబాద్కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి వచ్చిన ఆయనకు బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. అనంతరం మోదీ నేరుగా రాజ్భవన్కు వెళ్లి బస చేశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమారుడు ప్రభాకర్రావు, కుమార్తెలు ఎమ్మెల్సీ వాణీదేవి, శారదాంబ, ఇతర కుటుంబ సభ్యులు రాజ్భవన్కు వచ్చి ప్రధాని మోదీని కలిశారు. మోదీ వారితో కాసేపు మాట్లాడారు, కలిసి డిన్నర్ చేశారు. అనంతరం పీవీ మనవడు ఎన్వీ సుభాష్ మాట్లాడారు. ప్రధానిని కలిసి, అరగంటకుపైగా గడపడం.. సైన్స్, టెక్నాలజీ, ఇతర అంశాలపై మాట్లాడటం ఎంతో ఆనందాన్ని కలిగించిందని చెప్పారు. -
ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చివరి నాలుగు రోజుల్లో నిర్వహించే ఎన్నికల ప్రచారం, దీంతో ముడిపడిన అంశాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రచార గడువు ముగియనుండటంతో.. అప్పట్లోగా చేపట్టే ప్రచారం, ఇప్పటివరకు నిర్వహించిన ప్రచార సరళి, ప్రధాన ప్రత్యర్థులైన కాంగ్రెస్, బీఆర్ఎస్ను ఎలా ఎదుర్కోవాలి, ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుతూ ప్రస్తావించాల్సిన అంశాలు, సామాజిక మాధ్యమాల్లో పనిగట్టుకుని దు్రష్పచారం జరిగితే ఎలా ఖండించాలి అన్న వాటిపై కీలక నేతలు సమీక్షించారు. శనివారం లోగా పోలింగ్బూత్ స్థాయిలో చేపట్టాల్సిన కార్యాచరణతో పాటు ఇంటింటి ప్రచారానికి ప్రాధాన్యతనిచ్చి ఓటర్లను వారి ఇళ్లల్లో కలుసుకునేలా కార్యక్రమాల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. ఈ నాలుగు రోజుల్లో ఒక్క నిమిషం కూడా వృథా కాకుండా విస్తృత ప్రచారం చేపట్టాలని నిర్ణయించారు. మంగళవారం బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ, మీడియా కమిటీలతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోశ్, ఎలక్షన్ కమిటీ చైర్మన్ డా.కె.లక్ష్మణ్, ఎమ్మెల్సీ ఏవీఎన్రెడ్డి, రాష్ట్ర ప్రధానకార్యదర్శి (సంస్థాగత) చంద్రశేఖర్ తివారీ పాల్గొన్నారు. మీడియా, సోషల్ మీడియా కమిటీల భేటీలో... వీరితో పాటు రాజస్తాన్ సీఎం భజన్లాల్ శర్మ, తమిళనాడు పార్టీ అధ్యక్షుడు అన్నామలై, పార్టీ నేతలు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, డా.కాసం వెంకటేశ్వర్లు యాదవ్, ప్రేంసింగ్ రాథోడ్, డా.ఎస్.ప్రకాష్ రెడ్డి, పోరెడ్డి కిశోర్ రెడ్డి, రచనా రెడ్డి, పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జిలు పాల్గొన్నారు.అలాంటి దు్రష్పచారం మళ్లీ జరగొద్దు.. ఐదు నెలల పాలనలో కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలు, సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల హామీల అమలు నెరవేర్చకపోవడం వంటి వాటిని ఎండగట్టడంతో పాటు... రిజర్వేషన్ల రద్దు, ఇతర అంశాలపై కొన్నిరోజులుగా బీజేపీపై చేస్తున్న దు్రష్పచారాన్ని మరింత సమర్థవంతంగా తిప్పికొట్టాలని పార్టీ నాయకులకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోష్ సూచించారు. తెలంగాణలోని కొన్ని మీడియా సంస్థలు (సాక్షి కాదు) బీజేపీ పట్ల ద్వంద్వ విధానాలు అవలంబిస్తున్నాయని, పారీ్టకి నష్టం కలిగించే దిశలో ఇతర పారీ్టల ప్రచారానికి ఊతమిస్తున్నాయని సంతోష్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఒక పత్రికలో పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి దుష్యంత్ కుమార్ చౌహాన్ రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలను పూర్తిగా వక్రీకరించి, తప్పుడు ప్రచారానికి దోహదపడేలా వార్త ప్రచురించారని ఆయన ప్రస్తావించినట్టు తెలిసింది. చివరి నాలుగు రోజులూ ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్లు పారీ్టవర్గాల సమాచారం. -
కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
సాక్షి ప్రతినిధి, వరంగల్: నాటి ఓరుగల్లు కాకతీయుల పాలకుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లకు ఏమాత్రం తీసిపోని బీజేపీని లోక్సభ ఎన్నికల్లో తిప్పికొట్టి ఉద్యమస్ఫూర్తి చాటుదామని ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ ఎ.రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికలు తెలంగాణ వర్సెస్ గుజరాత్ మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ లాంటిదని అభివరి్ణంచిన సీఎం బీజేపీని డకౌట్ చేసి గుజరాత్ను ఓడించాలని కోరారు.లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రాత్రి గ్రేటర్ వరంగల్లో ఎంపీ అభ్యర్థి కడియం కావ్య గెలుపుకోసం రేవంత్ వరంగల్ పశి్చమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్షో నిర్వహించారు. హన్మకొండ చౌరస్తా, వరంగల్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్లలో ఆయన ప్రసంగించారు. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ పదేళ్లు పాలించి విధ్వంసం చేశాయని ధ్వజమెత్తారు. ఆ రెండు పార్టీలు ఒక్కటేనని, అవగాహనతోనే ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందం ‘వరంగల్ సాక్షిగా బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసుకొని బీఆర్ఎస్ నాయకుడిని బీజేపీలోకి పంపించాయి. పాపం ఓ అమాయకుడిని బీఆర్ఎస్ పక్షాన బరిలో నిలిపాయి. ఇందుకు ఉదహరణ.. బీఆర్ఎస్ నాయకులు బాహాటంగా నిష్పక్షపాతంగా ప్రచారంలో పాల్గొనడం లేదు. మీ కష్టాన్ని పణంగా పెట్టి మిమ్మల్ని వ్యాపార వస్తువుగా మార్చుకొని బీజేపీతో కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారు ఇందుకు నగదు పంచుకొని నగదు నారాయణ రాజకీయం చేçస్తుండు’అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బండకేసి కొట్టినా కేసీఆర్ బుద్ధి మారలే.. మాజీ సీఎం కేసీఆర్ బుద్ధి ఇంకా మారలేదనీ..వంకర ఆలోచనలు మానలేదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి తెలంగాణను విధ్వంసం చేసినందుకు డిసెంబర్ ఎన్నికల్లో ప్రజలు బండకేసి కొట్టినా కేసీఆర్ తీరుమారలేదని విమర్శించారు. బస్సు యాత్రలో మంచి మాటలు మాట్లాడి .. చేసిన అన్యాయానికి క్షమాపణలు చెప్పి మారతాడనుకుంటే.. మళ్లీ దగాకోరు విధానాలతో తిరుగుతుండ్రని నిందించారు. ఇక తలకిందికి పెట్టి తపస్సు చేసినా మీరు గెలువరనీ, కేటీఆర్ కారును జుమరాత్ బజారుకు తరలించండ్రనీ సూచించారు. నేను అల్లాటప్పాగా రాలేదు... ‘సీఎం కుర్చీ నుంచి దిగిపోవడానికి నేను అల్లాటప్పాగా రాలేదు. నిరంకుశ ప్రభుత్వంపై పదేళ్లు పోరాడి సీఎం కురీ్చలో కూర్చున్నా. పదేళ్లుగా అధికారంలో ఉన్న మోదీ దిగిపోవాలని కేసీఆర్ ఎందుకు అనడం లేదు. కుమార్తె బెయిల్ కోసం ఎంపీ సీట్లను ఆయన మోదీకి తాకట్టుపెట్టారా’అని రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు.వరంగల్ బిడ్డ కడియం కావ్యను లక్ష మెజారిటీతో గెలిపించే దిశగా బూత్ లెవల్లో మారుమూల గ్రామాల్లో ఇంటింటా తిరిగి పార్టీ గెలుపు కోసం పాటుపడాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంత్రులు కొండా సురేఖ, ధనసరి సీతక్క, ప్రభుత్వ సలహాదారు వేం నరెందర్రెడ్డి, వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. మోదీ నిన్ను ప్రశి్నస్తున్నా.. వరంగల్కు ఎలా వస్తావు.. ‘ఓట్ల కోసం వస్తున్న ప్రధాని నరేంద్రమోదీని ప్రశి్నస్తున్నా.. జవాబు చెప్పినంకనే వరంగల్లో అడుగు పట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నా. కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షను తీర్చేందుకు సోనియాగాంధీ నేతృత్వంలో అప్పటి పీఎం మన్మోహన్సింగ్ ఆధ్వర్యంలో లోక్సభ, రాజ్యసభల్లో విభజన చట్టం చేసి ప్రత్యేక రాష్ట్రం వచి్చంది. తెలంగాణ ప్రాంతానికి సముచిత న్యాయం చేసేందుకు ఖమ్మం జిల్లాలోని బయ్యారం ఉక్కు, వరంగల్ జిల్లాలోని కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చేందుకు ఒప్పందం చేస్తే ఇక్కడి ప్రజల ప్రయోజనాలను విస్మరించిన నువ్వు వరంగల్కు ఎలా వస్తావ్’అని రేవంత్రెడ్డి ప్రశ్నించారు.వర్షం కారణంగా కరీంనగర్లో సీఎం సభ వాయిదాఅకాల వర్షం కారణంగా మంగళవారం సాయంత్రం కరీంనగర్లో జరగాల్సిన సీఎం ఎ.రేవంత్రెడ్డి బహిరంగ సభ వాయిదా పడింది. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావుకు మద్దతుగా స్థానిక ఎస్సారార్ కళాశాలలో ఏర్పాటు చేసిన జనజాతర సభ కోసం సీఎం రావాల్సి ఉంది. అయితే మంగళవారం మధ్యాహ్నం నుంచే ఒక్కసారిగా గాలిదుమారంతో టెంట్లు ఎగిరి, భారీవర్షానికి సభాస్థలిలో నీరు నిలిచిపోవడంతో సభను వాయిదా వేశారు. -
పెట్టుబడిదారుల పార్టీకి..పేదల కన్నీళ్లు పట్టవు
సాక్షి, కామారెడ్డి/ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘మోదీ పదేళ్ల పాలనలో దేశ ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నమైపోయింది. రూపాయి విలువ భారీగా పడిపోయి అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ట దెబ్బతిన్నది. బీజేపీ దోపిడీదారులు, పెట్టుబడిదారులకే కొమ్ముకాసే పార్టీ. దాని ఎజెండాలో పేదల కష్టాలు, కన్నీళ్లు ఉండవు..’అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రాత్రి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా నుంచి పట్టణంలోని ప్రధాన వీధుల్లో కేసీఆర్ రోడ్షో నిర్వహించారు. జయప్రకాశ్ నారాయణ్ చౌరస్తా వద్ద కార్నర్ మీటింగులో ప్రసంగించారు. ఆ తర్వాత మెదక్ జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్షోలో కూడా మాట్లాడారు. అచ్ఛే దిన్ ఏమోగానీ సచ్చే దిన్ వచ్చినయ్ ‘ప్రధాని నరేంద్ర మోదీ వట్టి గ్యాస్ మాటలు చెబుతాడు. ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’అని చెప్పి సత్తె నాశనం చేశాడు. ఎగుమతులు బందయి, దిగుమతులు పెరిగాయి. దేశ ఆర్థిక పరిస్థితి దిగజారింది. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, బేటీ పడావో..బేటీ బచావో, జన్ధన్ యోజన ఇవేవీ దేశానికి ఉపయోగపడలేదు. 150 వాగ్దానాలు చేసిండ్రు. అవేవీ ప్రజలను ఆదుకోలేదు. అచ్ఛే దిన్ ఏమోగానీ సచ్చేదిన్ వనయ్. పెద్ద పెద్ద మాటలు చెప్పి మోసం చేసిండ్రు.అంతటా రూ.15 లక్షలు ఇస్తామన్నారు? కామారెడ్డిలో బీజేపీ ఎమ్మెల్యే గెలిచినందుకు ఇక్కడ రూ.30 లక్షలు ఇచి్చండ్రా? (లేదంటూ సభికులు కేకలు పెట్టారు) రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిన మోదీ ఎక్కడా రైతులకు మేలు చేయలేదు. తల్లిని చంపి బిడ్డను బతికించిండ్రంటూ మోదీ ప్రతిసారీ తెలంగాణ ఏర్పాటుపై విషం కక్కాడు. పేదలకు ఏమీ చేయని బీజేపీకి ఓటేయడమే దండుగ. ఆ పారీ్టకి 400 సీట్లు రానేరావు. మళ్లీ మోదీ ప్రధాని అయితే మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 దాటిపోతాయి..’ అని కేసీఆర్ అన్నారు. ఐదు నెలల్లో ఎన్నో ఘోరాలు ‘ఎన్నో త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అసమర్థులు, పరిపాలన సాగించలేని తెలివితక్కువ వాళ్ల చేతుల్లోకి వెళ్లి ఐదు నెలల్లోనే ఆగమైంది. ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చారు. కల్యాణలక్ష్మి కింద రూ. లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి మోసం చేశారు. రూ.2 లక్షల వరకు రుణం మాఫీ చేస్తనంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడిన సీఎం రేవంత్రెడ్డి ఇప్పుడు ఎక్కడికి పోతే అక్కడి దేవుళ్ల మీద ఒట్లు పెట్టుకుంటున్నాడు. ఈ నెల 9 లోపు రైతుబంధు వేస్తా అన్న ముఖ్యమంత్రి తనే కుట్ర చేసి ఆపించాడు.ఐదెకరాలకు ఇస్త అంటడు. ఆరెకరాలు, ఏడెకరాల రైతులకు ఎందుకు ఇవ్వడు? తొమ్మిదేళ్లు రెప్పపాటు కూడా పోకుండా కరెంటు ఇచ్చాం. కేసీఆర్ దిగిపోగనే కరెంటుకు ఏమైంది? మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ వన నీళ్లు ఇప్పుడెందుకు రావడం లేదు? వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వడం లేదు? ఫీజు రీయింబర్స్మెంటు చేయడం లేదు, 125 గురుకులాల్లో విద్యార్థులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. ఐదు నెలల్లో ఎన్నో ఘోరాలు జరిగిపోయాయి..’అని మాజీ సీఎం ఆందోళన వ్యక్తం చేశారు.అలాగైతే తెలంగాణ ప్రాజెక్టులు ఏం కావాలి?‘రేవంత్రెడ్డి ఒట్లు పెట్టుకోవడం, కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు. అసమర్థులు, తెలివితక్కువ వాళ్లు రాజ్యమేలితే ఇలాగే ఉంటుంది. కృష్ణా నదిని కేఆర్ఎంబీకి అప్పగించిన కాంగ్రెస్ సర్కారు.. గోదావరి నదిని తమిళనాడుకు అప్పగిస్తోంది. ఉన్న ఒక్క గోదావరి నదీ జలాలు తమిళనాడుకు వెళితే తెలంగాణ ప్రాజెక్టులు ఏం కావాలి? మేం కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే వాటిని తీసేస్తామని కాంగ్రెస్ అంటోంది. ఉద్యమాల్లో రాటుదేలిన, చైతన్యవంతమైన కామారెడ్డి, మెదక్ ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి.పార్లమెంటు ఎన్నికల్లో 12, 13 స్థానాల్లో మనం గెలిస్తే రాష్ట్రం మెడలు వంచి హామీలు అమలు చేయించుకుందాం. కేంద్రంలో బీజేపీ పరిస్థితి బాగాలేదు. వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే. 12, 13 స్థానాలు గెలిస్తే మనమే కీలకంగా మారతాం. కామారెడ్డితో పాటు ఇతర జిల్లాలు పోకుండా ఉండాలంటే బీఆర్ఎస్ గెలవాలి. మన నదీ జలాలు మనకు రావాలన్నా, తెలంగాణ ఆత్మగౌరవం కాపాడుకోవాలన్నా మన అభ్యర్థులను గెలిపించాలి..’అని బీఆర్ఎస్ అధినేత విజ్ఞప్తి చేశారు. ఈ సభల్లో మాజీ మంత్రి టి.హరీశ్రావు, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, జాజుల సురేందర్, హన్మంత్ షిండే, మెదక్, జహీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థులు వెంకట్రామ్ రెడ్డి, గాలి అనిల్కుమార్ పాల్గొన్నారు. చిన్నారులకు పకోడీలు తినిపించిన కేసీఆర్ ఇందల్వాయి ( నిజామాబాద్ రూరల్): పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర నిర్వహిస్తున్న మాజీ సీఎం కేసీఆర్ మంగళవారం చిన్న పిల్లలు, రైతులతో కాస్త సరదాగా గడిపారు. సాయంత్రం నిజామాబాద్ నుంచి కామారెడ్డి జిల్లా కేంద్రానికి వెళుతూ 44వ నంబరు జాతీయ రహదారిపై ఇందల్వాయి టోల్ప్లాజా వద్ద ఆగారు. అక్కడి హోటల్లో ఉల్లిగడ్డ పకోడి తిని టీ తాగారు. అక్కడ ఉన్న చిన్నారులకు పకోడీలు తినిపించారు. తనను కలిసేందుకు వన రైతులకు ఇచ్చారు. మరోవైపు హోటల్ వద్ద ఆగిన ప్రయాణికులు, చిన్నారులు కేసీఆర్తో ఫొటోలు, సెల్ఫీలు దిగారు. వారందరితో కేసీఆర్ సరదాగా సంభాíÙంచారు. హోటల్ యజమాని వెంకట రమణయ్యతోనూ ముచ్చటించారు. -
రిజర్వేషన్లకు ఎవరు భరోసా?
రిజర్వేషన్ల మీద జాతీయ స్థాయిలో ఇంతటి ప్రస్తావన చోటు చేసుకోవడం ఒక మంచి పరిణామం. ఇది ప్రస్తావన మాత్రంగానే సాగుతున్న వ్యవ హారం కాబట్టి దీనిని చర్చ అనడం లేదు. ప్రస్తుతం జరుగు తున్న ఎన్నికల్లో (లోక్సభ ఎన్ని కలు–2024) బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ వస్తే రాజ్యాంగాన్ని మార్చివేస్తుందనీ, రిజర్వేషన్లను రద్దు చేస్తుందనీ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారానికి కమలనాథులు తీవ్ర కలవర పాటుకు గురౌతున్నారు. అర్ఎస్ఎస్ చేత కూడా ఖండన ప్రకటనలిప్పిస్తున్నారు. రాజ్యాంగాన్ని మార్చే ఉద్దేశం కానీ, రిజర్వేషన్లను రద్దు చేసే ఆలోచన కానీ ఏ కోశానా లేవని చెప్పుకుంటున్నారు. రిజర్వేషన్లు జనాభాలో అత్య ధిక శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించి నవి కాబట్టి బీజేపీ ఇంతగా ఇది అయిపోతోందని అర్థమవుతోంది. సామాజికంగా అణగారిన వర్గాలకు–అంటే సామాజికంగా, విద్యా పరంగా వెనుకబడిన వారికి మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వాలని రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. అందుకు విరుద్ధంగా ఆర్థిక వెనుకబాటుతనాన్ని రాజ్యాంగంలో చేర్పించి ఆ వర్గానికి ఏకంగా 10 శాతం రిజర్వేషన్లు కల్పించిన చరిత్ర బీజేపీ పాలకులది. ఇందు కోసం అగ్ర వర్ణాలనుంచి ఒత్తిడి వర్గాలను రంగంలో దింపిన ఘనత బీజేపీది. దేశంలో శతాబ్దాలుగా కఠోరంగా అమల్లో గల కుల వ్యవస్థ, బ్రాహ్మణీయ వివక్ష వల్ల చదువుకీ, ఆస్తికీ, ఆత్మగౌరవానికీ బహు దూరంగా బతుకుతూ... అదే సమయంలో సకల శ్రామిక, సేవక వృత్తులు చేస్తూ సమాజ రథాన్ని నడిపిస్తున్న వేలాది కింది కులాల ప్రజలను చేయి అందించి ముందుకు తీసుకురావలసిన కర్తవ్యాన్ని గుర్తించి రాజ్యాంగ కర్తలు సానుకూల వివక్షకు అవకాశం కల్పించారు. విద్య, ఉద్యోగాల్లో కొంత శాతాన్ని ప్రత్యేక పరిగణన ద్వారా వారికి కేటాయించాలని నిర్ణయించారు. రాజ్యాంగ అధికరణలు 15(4), 46 ఇందుకే చోటు చేసుకున్నాయి. ప్రమోషన్లలో, భర్తీ కాకుండా మిగిలిపోయిన బ్యాక్ లాగ్ ఉద్యోగాలలో కూడా ఈ రిజర్వేషన్లు వర్తింపజేయడానికి వేర్వేరు రాజ్యాంగ సవరణల ద్వారా అవకాశం కల్పించారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ అందరికీ సమానంగా ఓటు హక్కును కల్పించడంతో దేశంలో సమతా భావన బలపడడం ప్రారంభించింది. అయినా ఇప్పటికీ వెలి గ్లాసులు, వెలి బావులు వంటివి కొనసాగుతున్నాయి. అగ్రవర్ణాలకు కేటాయించిన మంచినీటి కుండలోని నీరు తాగేడనే నెపం మీద పాఠశాలలో దళిత బాలుడిని కొట్టి చంపిన మాదిరి దారుణ ఉదంతాలు జరుగతున్నాయి. రిజర్వేషన్లు కల్పించి ఏడు దశాబ్దాలు దాటినా అణగారిన వర్గాల– ఎస్సీ, ఎస్టీ, బీసీల బతుకులు చాలీ చాలని గుడిసెల్లోనే కొనసాగుతున్నాయి. నిరుద్యోగం, అధిక ధరలు వారి బతుకులను మరింతగా అంచులకు ఈడ్చివేశాయి. అందుకే జనాభాలో తామెందరో... విద్య, ఉద్యోగాల్లో అంత శాతం వాటా తమకు రావాలనే డిమాండ్ ముందుకు వచ్చింది. కులగణన నినాదం బలం పుంజుకున్నది. కాంగ్రెస్ పార్టీ దీనిని ప్రధాన వాగ్దానంగా చేసుకుంది. ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా దామాషాను బట్టి రిజర్వేషన్లు వర్తిస్తుండగా దేశ జన సంఖ్యలో సగానికి పైగా ఉన్న బీసీలకు రిజర్వేషన్లను 27 శాతానికే కుదించారు. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీం కోర్టు గీచిన హద్దు గీత, క్రీమీ లేయర్ నిబంధన బీసీల పాలిట శాపాలయ్యాయి. ఆర్థిక వెనుకబాటుతనం పేరిట అగ్రవర్ణ పేదలకు రాజ్యాంగ సవరణ ఆయుధంతో 10 శాతం కోటా కల్పించిన మోదీ ప్రభుత్వం రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని, క్రీమీ లేయర్ను తొలగించడానికి రాజ్యాంగ సవరణ ఎందుకు చేయలేదు? కులగణను బీజేపీ ఎందుకు వ్యతి రేకిస్తోంది? బీసీల దయనీయస్థితి అంకెల్లో అచ్చు గుద్ది నట్టు బయటపడి వారిని వాడుకుంటూనే తాను వారిని ఎంతగా వంచిస్తున్నదో బహిర్గతమవుతుందనే భయంతోనే కదా! బీజేపీ చరిత్రంతా రిజర్వేషన్ల వ్యతిరేక చరిత్రే. దశాబ్దాల క్రితం మండల్ నివేదిక అమలుకు తలపెట్టిన ప్పుడు చెలరేగిన రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం, మందిర్ ఆందోళన పరివార్ శక్తుల ప్రమేయంతో చెలరేగినవే కదా! సమ్మిళిత లక్షణంతో సెక్యులర్ సదాశయంతో వారి వారి అణగారినతనం ఆధారంగా హిందూయేతర మత స్థులలోని వారికీ రిజర్వేషన్ల కల్పనకు రాజ్యాంగం వీలు కల్పించింది. 2005 లో యూపీఏ ప్రభుత్వం నెలకొల్పిన జస్టిస్ రాజిందర్ సచార్ కమిటీ దేశంలో ముస్లింలు దయనీయ స్థితిలో ఉన్నారనీ, వారికి విశేష స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలనీ సిఫారసు చేసింది. ఇప్పుడు ముస్లింలకు అరకొరగా ఉన్న రిజర్వేషన్లను కూడా రద్దు చేస్తామని ప్రధాని మోదీ తన ఎన్నికల ప్రచార సభల్లో కఠోర స్వరంతో ప్రకటిస్తున్నారు. రాజ్యాంగ ధర్మాన్ని కాల రాస్తున్నారు. ముస్లింల రిజర్వే షన్లను తెగనరుకుతానంటున్న బీజేపీ, ఆ తర్వాత వారికి దగ్గరగా ఉన్న ఎస్సీ, ఎస్టీల కోటాకు టాటా చెప్పాబోదనే హామీ ఎక్కడిది? ఈ ఎన్నికల్లో తమ పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమికి లోక్సభలో 400 సీట్లు వస్తే రిజర్వేషన్లను తొలగిస్తామనీ, రాజ్యాంగాన్ని మారుస్తామనీ రాజస్థాన్ మంత్రి కిరోరి లాల్ మీనా ప్రకటించినట్టు చూపించిన ఒక వీడియో గత నెలలో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. బీజేపీ తన అభిమతాన్ని అధికారికంగా కాకుండా అనధికారిక మార్గాలలో వ్యక్తం చేస్తూ ఉంటుందనే అభిప్రాయం ఉంది. రిజర్వేషన్ల జోలికి వెళ్ళబోమనీ, అది తప్పుడు ప్రచారమనీ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పదే పదే చేస్తున్న ప్రకటనలను, ఇస్తున్న హామీలను నమ్మలేం. అర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ కూడా రంగ ప్రవేశం చేసి రిజర్వేషన్ల రద్దు జరగబోదని స్పష్టంగా ప్రకటించారు. అయితే గతంలో ఆయనొకసారి రిజర్వేషన్లను సమీక్షించాలని అన్నారు. 2015 లో బిహార్ ఎన్నికలకు కొద్ది వారాల ముందు మాట్లాడుతూ రిజర్వేషన్ విధానంపై సామాజిక సమీక్ష జరగాలని ప్రకటించారు. దాని మీద వివాదం చెలరేగడంతో ఇతర పేద వర్గాలకు కూడా మేలు చేసే ఉద్దేశంతోనే ఆయన అలా అన్నారని వివరణ వచ్చింది. ఆచరణలో బీజేపీ పదేళ్ల పాలనలో రిజర్వేషన్లు కను మరుగయ్యేలా ప్రైవేటైజేషన్ ముమ్మరించింది. సామా జికంగా, విద్యా విషయకంగా వెనుకబడిన బీసీలకు విధానపరంగా అది ఉపయోగపడింది శూన్యమే. బడు గులను కేవలం పేదలుగా, పైనుంచి నెలకు 5 కిలోల బియ్యం ‘ముష్టి’ వేస్తే అదే మహా ప్రసాదమని కళ్ళకు అద్దుకొనేవారుగా మాత్రమే బీజేపీ పరిగణిస్తూ ఉంది.హిందూ కుల వ్యవస్థ దశాబ్దాలుగా అణగదొక్కగా చదువు, ఆత్మగౌరవం పిసరంతైనా అంటని బానిస బతు కులు బతికినవారికి పరిహారంగా రిజర్వేషన్లను కల్పించడాన్ని తాము నెత్తిన పెట్టుకునే సనాతన నీతికి అవమా నమని వారు భావిస్తున్నారు. ఉదాహరణకు మహిళలపై గతంలో మోహన్ భాగవత్ వెలిబుచ్చిన అభిప్రాయా లను గమనించవచ్చు. ‘పెళ్లి ఒక కాంట్రాక్టు అని ఈ ఒప్పందం ప్రకారం నువ్వు నా ఇంటి బాధ్యతలు నెరవేరిస్తే నీ అవస రాలాన్నిటినీ నేను తీరుస్తాను, నిన్ను భద్రంగా కాపాడుతాను అని భర్త భార్యకు చెబుతాడు, భార్య ఈ ప్రకారం నడుచుకున్నంత కాలం భర్త ఆమె బాధ్యత వహిస్తాడు, ఆమె ఈ కాంట్రాక్టును ఉల్లంఘిస్తే ఆమెను అతడు వదిలేయవచ్చు’అని ఆయన అన్నారు. గ్రామీణ భారతంలో రేప్లు తక్కువనీ, పట్టణాల్లో, నగరాల్లోనే ఎక్కు వని కూడా అన్నారు. మహిళ ఆస్వతంత్రురాలుగా, పురుషుడి చేతుల్లో ఉండాలని ఆయన ప్రవచించారు. ఇటువంటి భావాలు గలవారి అధిపత్యంలో దేశం సెక్యులర్ రాజ్యాంగానికీ, రిజర్వేషన్లకూ స్వస్తి చెప్పి మనుస్మృతిని అమల్లోకి తెస్తుందనే భయాలు కలగడం సహజాతి సహజం.జి. శ్రీరామమూర్తి వ్యాసకర్త సీనియర్ సంపాదకులు -
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
ఒడిశాలో ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతుంది. ఈ తరుణంలో బీజేపీ అగ్రనేతలు ఒడిశాపై దృష్టి సారించారు. మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్లు బీజేపీ అభ్యర్థుల తరుపున ప్రచారం చేయనున్నారు. ప్రధాని మోదీ ఇటీవలే బెర్హంపూర్, నబరంగ్పూర్ లోక్సభ స్థానాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే మే 13న ఒడిశాలో మొదటి రౌండ్ ఎన్నికలకు ముందు కమలం నేతలు తమ ప్రచారాన్ని మరింత ఉదృతం చేయనున్నారు.రాష్ట్ర బీజేపీ విశ్వసనీయ సమాచారం మేరకు మే 10న మోదీ భువనేశ్వర్లో రోడ్షో, మే 11న బొలంగీర్లో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించనున్నారు. ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం మే 8న బరంగ్పూర్, కోరాపుట్లలో బహిరంగ సభలలో పాల్గొననున్నారు. అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలు హైవే ప్రాజెక్టులు, ఒడిశాలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఆవశ్యకత వంటి అంశాలను హైలైట్ చేయనున్నారు. బీజేపీ జాతీయ నాయకులు,కేంద్ర మంత్రులతో ఎన్నికల ప్రచారం నిర్వహించగా.. మరోవైపు ఒడిశా అధికార బీజేడీ మాత్రం సీఎం పట్నాయక్ ఆయన సన్నిహితుడు పాండియన్ ద్వయం రాబోయే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం మే 13 నుంచి జూన్ మధ్య నాలుగు సార్లు సుడిగాలు పర్యటనలు చేయనున్నారు.
Pagination
ఓటు ఎలా వేయాలో తెలుసా..?
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
కాల యముళ్లు
కాళేశ్వరం ప్రాజెక్ట్ తో కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో గట్టి దెబ్బే..
చుండ్రు సమస్య వేధిస్తోందా? ఇలా ట్రై చేయండి!
భారత్ దౌత్యం సక్సెస్.. ఇరాన్ చెర నుంచి ఐదుగురు రిలీజ్
Priyanka Kholgade: స్టైలిష్ లుక్లో ప్రియాంక ఖోల్గడే.. పిక్స్ వైరల్ (ఫొటోలు)
Sreemukhi: ఈమె వాయిస్ ముందు డీజే కూడా తక్కువే.. శ్రీముఖి బర్త్డే స్పెషల్ (ఫోటోలు)
పేదలను ముప్పుతిప్పలు పెడుతున్న చంద్రబాబు
మేతకొచ్చాడు.. మరో నేత!
Mirnalini Ravi: లవ్ గురు బ్యూటీ కొంటె అందాలు (ఫోటోలు)
నాకోసం ఆ స్టార్ హీరో నెలలతరబడి వెయిట్ చేశాడు: కమెడియన్
తప్పక చదవండి
- ఏఐ యూనివర్సిటీ.. ఒడిశా మేనిఫెస్టోలో ఆసక్తికర హామీలు
- అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా?.. యంగ్ హీరోయిన్కు ఉహించని ప్రశ్న!
- జనగణన లేకుండా ఈ లెక్కలేల?
- మారుతీ స్విఫ్ట్ కొత్త మోడల్
- ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్
- ఎస్బీఐ లాభం రికార్డ్
- 15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
- మద్యం మత్తుతో ఓటర్ల చిత్తుకు చంద్రబాబు కుట్ర
- RCB Vs PBKS: ఆర్సీబీ ఘన విజయం.. ఐపీఎల్ నుంచి పంజాబ్ ఔట్
- ఓటు ఎలా వేయాలో తెలుసా..?
Advertisement