Cards
-
చట్టబద్ధ స్వామిత్రతో ఆర్థికాభివృద్ధి
న్యూఢిల్లీ: చట్టబద్ధంగా జారీచేస్తున్న స్వామిత్ర ఆస్తి కార్డులతో దేశంలో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుని ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తంచేశారు. శనివారం 65 లక్షల మందికి నూతనంగా స్వామిత్ర ప్రాపర్టీ కార్డ్లను జారీచేసిన సందర్భంగా ప్రధాని మోదీ వర్చువల్గా ప్రసంగించారు. పెరిగిన ఆర్థిక కార్యకలాపాలతో పేదరికాన్ని తరిమికొట్టొచ్చని ఆయన చెప్పారు. ఛత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, మిజోరం, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ మొత్తంగా 10 రాష్ట్రాలతోపాటు జమ్మూకశీ్మర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 50,000 గ్రామాలకు చెందిన 65 లక్షల మందికి శనివారం ఈ కార్డులను అందజేశారు. కార్డులు అందుకున్న వారిలో కొందరు లబ్ధిదారులతో ప్రధాని మోదీ మాట్లాడారు. ‘‘గ్రామీణ ప్రాంతాల్లో భూముల డిజిటలైజేషన్తో మరింత సమర్థవంతమైన సాంకేతికత, సుపరిపాలన సాధ్యమవుతుంది. ఇది గ్రామాల సాధికారతకు బాటలువేస్తుంది. కార్డులున్న లబ్ధిదారులు రుణాలు పొందేందుకు, ఇతర ప్రభుత్వ పథకాలు పొందేందుకు అర్హులవుతారు. కొత్తగా తీసుకున్న వారితో కలుపుకుని ఇప్పుడు దేశవ్యాప్తంగా దాదాపు 2.24 కోట్ల మంది స్వామిత్ర ప్రాపర్టీ కార్డుదారులున్నారు. ఆస్తి హక్కు అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రధాన సవాల్గా తయారైంది. చాలా దేశాల్లో ప్రజలకు తమ సొంత ఆస్తులకు సంబంధించిన చట్టబద్ధమైన పత్రాలు లేవని స్వయంగా ఐక్యరాజ్యసమితి చేపట్టిన ఒక అధ్యయనంలో తేలింది. పేదరిక నిర్మూలనలో ఆస్తి హక్కు కీలకమైనది ఐరాస ఆనాడే పేర్కొంది’’అని మోదీ గుర్తుచేశారు. మృత మూలధనం కాదు ‘‘గతంలో ఒక ప్రముఖ ఆర్థికవేత్త చెప్పినట్లు భారతీయ గ్రామాల్లోని భూమి పెట్టుబడికి పనికిరాని మృత మూలధనం కాదు. సరైన పత్రాలు లేకపోవడంతో చాలా మంది వాటిని విక్రయించలేకపోతున్నారు. కొనేందుకు ఎవరూ ముందుకు రావట్లేదు. ఆక్రమణలు, భూవివాదాలతో గ్రామీణులు ఇబ్బందులు పడుతున్నారు. సరైన భూమి డాక్యుమెంట్లు లేని కారణంగా వీళ్లకు బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వవు. మనసున్న ఏ ప్రభుత్వమూ గ్రామీణులను ఇలా కష్టాల కడలిలో వదిలేయదు. గత ప్రభుత్వాలు ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపే ప్రయత్నంకూడా చేయలేదు. దీంతో దళితులు, వెనుకబడిన వర్గాలు, గిరిజనులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈ సమస్య పోగొట్టేందుకే గ్రామాల్లో వ్యక్తులకు నివాస, భూములకు సంబంధించిన ప్రాపర్టీ కార్డులను జారీచేస్తున్నాం. స్వామిత్ర (సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్) యోజన పథకం ద్వారా డ్రోన్ సాంకేతికత సాయంతో మ్యాపింగ్ చేసి వారి వారి ఇళ్లు, భూములను ఖచి్చతమైన సరిహద్దులతో చట్టబద్ధమైన ఆస్తికార్డులను అందజేస్తున్నాం. వీటితో వ్యక్తులకు తమ భూములపై సర్వాధికారాలు ధారాదత్తమవుతాయి. ఈ పథకం ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. భారత్లో 6,00,000 గ్రామాలుంటే వాటిల్లో సగం గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తయింది’’అని ప్రధాని మోదీ అన్నారు. శనివారం దాదాపు 230 జిల్లాల్లో రైతులకు అధికారులు స్వయంగా ప్రాపర్టీ కార్డులను అందజేశారు. స్వామిత్ర యోజన పథకాన్ని మోదీ సర్కార్ 2020లో ప్రారంభించింది. ఆస్తులను నగదుగా మార్చుకునే వెసులుబాటు, ఆయా భూములకు బ్యాంక్ రుణాలు వచ్చేలా చేయడం, ఆస్తి తగాదాలను సాధ్యమైనంత మేరకు తగ్గించడం, ఆస్తులు, ఆస్తిపన్నుల మదింపు, గ్రామస్థాయిలో సమగ్ర విధాన నిర్ణయాలకు దోహదపడటమే స్వామిత్ర యోజన ముఖ్యోద్దేశం. -
ఫ్యామిలీ డిజిటల్ కార్డులో యజమానిగా మహిళే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయనున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డుల్లో మహిళలనే ఇంటి యజమానిగా గుర్తించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. కుటుంబ సభ్యుల పేర్లు, వారి వివరాలను కార్డుల వెనుకభాగంలో ముద్రించాలని సూచించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు (ఎఫ్డీసీ)లపై శనివారం సచివాలయంలో సీఎం రేవంత్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల అంశంపై ఈ నెల 25 నుంచి 27 వరకు రాజస్తాన్, హరియాణా, కర్ణాటక, మహారాష్ట్రలో పర్యటించిన అధికారుల బృందం... తమ అధ్యయనానికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచి్చంది.కార్డుల రూపకల్పనలో ఆయా రాష్ట్రాలు సేకరించిన వివరాలు, కార్డులతో కలిగే ప్రయోజనాలు, లోపాలను సీఎంకు వివరించింది. ఈ సందర్భంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డుల రూపకల్పనపై అధికారులకు సీఎం పలు ఆదేశాలు, సూచనలు చేశారు. ప్రస్తుతమున్న రేషన్, ఆరోగ్యశ్రీ, వ్యవసాయ, ఇతర సంక్షేమ పథకాల్లోని సమాచారం ఆధారంగా కుటుంబాలను నిర్ధారించాలన్నారు. ఇతర రాష్ట్రాల కార్డు ల రూపకల్పన, జారీలో ఉన్న మేలైన అంశాలను స్వీకరించాలని, లోపాలను పరిష్కరించాలని ఆదేశించారు. బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డుల వంటి సమాచారం సేకరించాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గం పరిధిలోని రెండు ప్రాంతాల్లో... ఎఫ్డీసీ కోసం సమాచార సేకరణ, వాటిల్లో ఏయే అంశాలు పొందుపరచడంతోపాటు మార్పుచేర్పుల వివరాలను నివేదిక రూపంలో ఆదివారం సాయంత్రంలోగా మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, దామోదరతో కూడిన మంత్రివర్గ ఉప సంఘానికి అందించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. మంత్రివర్గ ఉప సంఘం సూచనల మేరకు అందు లో జత చేయాల్సిన లేదా తొలగించాల్సిన అంశాల సమగ్ర జాబితా రూపొందించాలని సూచించారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి రెండేసి ప్రాంతాలను (ఒక గ్రామీణ, ఒక పట్టణ) పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకొని వచ్చే నెల 3 నుంచి కుటుంబాల నిర్ధారణ చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, దామోదర్, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, సీఎస్ శాంతికుమారి, సీఎం ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి పాల్గొన్నారు. -
బాల.. భళా..! వరల్డ్ రికార్డు సాధించిన హన్విద్..
కరీంనగర్: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు భాస్కరరాజు మనవడు (నాలుగు నెలల బాలుడు) హన్విద్కృష్ణ వరల్డ్ రికార్డు సాధించాడు. 347 ఫ్లాష్ కార్డ్స్ను గుర్తించడంలో నోబుల్ వరల్డ్ రికార్డు సాధించినట్టు భాస్కరరాజు సోమవారం తెలిపాడు. బాలుడు ఫ్లాష్ కార్డ్స్ గుర్తించిన వీడియోను ఆన్లైన్లో నోబుల్ సంస్థకు పంపించగా, అవార్డుకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.ఇవి చదవండి: కూతురు ఎంపీ.. తండ్రి పెత్తనం -
త్వరలో కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు
రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ లబ్దిదారులకు కొత్తగా కార్డులివ్వాలని నిర్ణయించింది. ప్రతి కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని యూనిక్ నంబర్తో కార్డులు ఇవ్వనుంది. కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ ఒక్కో సబ్ నంబర్ ఇస్తారు. ఇదే కార్డును హెల్త్ ప్రొఫైల్కు లింక్ చేసి, స్టేట్ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ను తయారు చేస్తారు. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్టు కసరత్తు చేస్తోంది. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పటివరకు కొందరు పేదలకు ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి. అంతేకాకుండా అనేకమంది తెల్ల రేషన్కార్డును ఆధారం చేసుకొనే ఆరోగ్యశ్రీ సేవలు పొందుతున్న సంగతి తెలిసిందే. ఇక నుంచి ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డుకు లింకు పెట్టకూడదని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల జారీ అంశంపై ఆరోగ్యశ్రీ ట్రస్టు దృష్టిసారించింది. ఈ మేరకు లబ్దిదారుల గుర్తింపుపై మార్గదర్శకాలు రూపొందిస్తోంది. అందరికీ ఆరోగ్యశ్రీని వర్తింప చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై వైద్య, ఆరోగ్యశాఖ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కోసం ఏటా రూ.1,100 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అందరికీ వర్తింప చేయడం వల్ల అదనంగా రూ.400 కోట్ల భారం పడే అవకాశం ఉందని, ఇది పెద్ద భారం కాదన్న భావనలో సర్కారు ఉంది. మధ్యతరగతి ప్రజల్లో చాలామందికి, ఉద్యోగులకు, ఇతరులకు పలు పథకాలు ఉన్నాయి. అలాగే ప్రైవేట్ ఆరోగ్య బీమాతో ఆరోగ్య సేవలు పొందుతున్న వారూ చాలామంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ కార్డులతో అందరికీ సార్వజనీన ఆరోగ్య సేవలు అందించవచ్చని సర్కారు యోచిస్తోంది. వంద శస్త్రచికిత్సలు చేర్చే అవకాశం రాష్ట్రంలో 293 ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు, 198 ప్రభుత్వ పెద్దాసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి. అలాగే గత ఏడాది 809 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)లోనూ ఆరోగ్యశ్రీ కింద సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. మొత్తంగా రాష్ట్రంలో 1,310 ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీకి అర్హులుగా 77.19 లక్షల మంది పేదలు ఉన్నారు. ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని కూడా ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా అమలు చేస్తున్నారు. లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులు, జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు ఈజేహెచ్ఎస్ కిందకు వస్తారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద 1,376 శస్త్రచికిత్సలు, 289 వైద్య సేవలున్నాయి. ఆయుష్మాన్ భారత్ కింద 1,949 వ్యాధులకు వైద్యం అందుతోంది. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్లో ఈ రెండింటిలో ఉన్న వ్యాధులను కలిపి అమలు చేస్తున్నారు. వీటికి సుమారు మరో వంద శస్త్రచికిత్సలను చేర్చే అవకాశం ఉంది. ఒక్కో కుటుంబానికి 10 లక్షల కవరేజీ ఆయుష్మాన్ భారత్ పథకం కింద కేంద్రం 2022లో ప్యాకేజీలను సవరించింది. గతంలో ఆరోగ్యశ్రీ కింద కవరేజీ రూ. 2 లక్షలు ఉండగా, ఆయుష్మాన్ భారత్ పథకం రావడంతో దాన్ని రూ. 5 లక్షలు చేశారు. కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రూ.10 లక్షలు చేసిన సంగతి తెలిసిందే. ఏడాదికి ఈ పథకాల కింద ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల వరకు కవరేజీ వర్తిస్తుంది. దీనికి ప్యాకేజీ సొమ్ము కూడా పెంచితే ఏటా రూ.1,500 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈహెచ్ఎస్ పథకంపై తేలని నిర్ణయం ఈహెచ్ఎస్ పథకంపై ఉద్యోగులు కంట్రిబ్యూషన్ ఇస్తామని పేర్కొన్న సంగతి విదితమే. గత అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్కు ముందు రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంప్లాయి హెల్త్ కేర్ ట్రస్ట్ (ఈహెచ్సీటీ) ఏర్పాటు చేసి అమలు చేయాలని నిర్ణయించింది. పథకం అమలుకు ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి కొంత మొత్తాన్ని, అంతే మొత్తంలో ప్రతి నెలా ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్గా జమ చేయాలని పేర్కొన్నది. ఈ మేరకు తమ మూల వేతనంలో ఒక శాతం కాంట్రిబ్యుషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి గతంలో విజ్ఞప్తి చేశాయి. ఆసుపత్రుల్లో తమకు వైద్యం అందనందున ఈ ప్రక్రియకు ఉద్యోగులు కూడా ముందుకు వచ్చారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల బకాయిల చెల్లింపునకు ఏర్పాట్లు ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు మాత్రం ఆరోగ్యశ్రీ రోగులకు వైద్యం చేయడంపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. బ కాయిలు పేరుకుపోవడంతో పాటు ఆరో గ్యశ్రీ కింద ఆసుపత్రులకు ఇచ్చే ప్యాకేజీ సొమ్ము సరిపోవడం లేదని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నా యి. దీంతో ఆరోగ్యశ్రీ లబ్దిదారులు, ఈ హెచ్ఎస్ బాధితులు డబ్బులు చెల్లించి వైద్యం పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా తర్వాత అనారోగ్య సమస్యలు పెరగడంతో చాలామంది ప్రైవేట్ ఆరోగ్య బీమా తీసుకుంటున్నారు. ఉద్యోగులైతే రీయింబర్స్మెంట్ పద్ధతిలో ముందుగా డబ్బులు చెల్లించి వైద్యం పొందుతున్నా రు. అయితే బిల్లుల సొమ్ము మాత్రం పూ ర్తి స్థాయిలో రావడంలేదని ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. పెద్దఎత్తున బిల్లులు పే రుకుపోవడం వల్లే తాము వైద్యం అందించలేకపోతున్నామని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు నెట్వర్క్ ఆసుపత్రుల లెక్క ప్రకా రం దాదాపు రూ.500 కోట్లు ఆరోగ్యశ్రీ నుంచి తమకు రావాల్సిన బిల్లుల బకా యిలు పెండింగ్లో ఉన్నాయని అంటున్నాయి. మరోవైపు వివిధ వ్యాధులకు 2013లో నిర్ధారించిన ప్యాకేజీ ప్రకారమే ఆసుపత్రులకు సొమ్ము అందుతోంది. అంటే తెలంగాణ ఏర్పడ్డాక ఇప్పటివరకు ఒక్కసారి కూడా వ్యాధులు, చికిత్సలకు ప్యాకేజీ సవరణ జరగలేదు. ఈ రెండు కారణాల వల్ల తాము ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ పథకాల కింద వైద్యం చేయలేకపోతున్నామని ఆసుపత్రుల యాజమాన్యాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో పెండింగ్ బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. -
ఎస్బీఐ కార్డ్ లాభం ప్లస్
న్యూఢిల్లీ: క్రెడిట్ కార్డుల దిగ్గజం ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సరీ్వసెస్ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో నికర లాభం 8 శాతం వృద్ధితో రూ. 549 కోట్లను తాకింది. గతేడాది (2022–23) ఇదే కాలంలో కేవలం రూ. 509 కోట్లు ఆర్జించింది. పీఎస్యూ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ప్రమోట్ చేసిన కంపెనీ మొత్తం ఆదాయం సైతం రూ. 3,656 కోట్ల నుంచి రూ. 4,742 కోట్లకు ఎగసింది. అయితే నిర్వహణ వ్యయాలు 23 శాతం పెరిగి రూ. 2,426 కోట్లకు చేరాయి. గత క్యూ3లో ఇవి రూ. 1,974 కోట్లుగా నమోదయ్యాయి. స్థూల మొండిబకాయిలు (ఎన్పీఏలు) 2.22% నుంచి 2.64 శాతానికి, నికర ఎన్పీఏలు 0.8% నుంచి 0.96 శాతానికి పెరిగాయి. దీంతో అనుకోని నష్టాలు, మొండి రుణాల వ్యయాలు రూ. 533 కోట్ల నుంచి రూ. 883 కోట్లకు పెరిగాయి. కాగా.. డిసెంబర్కల్లా కనీస మూలధన నిష్పత్తి 23.1 శాతంగా నమోదైంది. 2023 మార్చిలో 18.4 శాతం సీఏఆర్ సాధించింది. -
కేసీఆర్ అంటేనే గ్యారంటీ
సాక్షి, సిద్దిపేట: ‘మీ గ్యారంటీ కార్డులు తెలంగాణలో పనిచేయవు..కేసీఆరే తెలంగాణకు శ్రీరామరక్ష.. కేసీఆర్ అంటేనే గ్యారంటీ, వారంటీ’ అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నా రు. మంగళవారం సిద్దిపేట జిల్లాకేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ, కుమ్మర మోడ్రన్ యాంత్రిక పరిశ్రమకు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ 50 ఏళ్ల నుంచి చేయని అభివృద్ధి, ఇప్పుడు చేస్తామని గ్యారంటీ కార్డులు, బాండ్పేపర్లు రాసిస్తున్నార న్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మాటలు చెప్పేవారయితే, చేతల్లో చూపేది, మాటతప్పని, మడమతిప్పని నాయకుడు కేసీఆర్ అని చెప్పారు. సీఎం కేసీఆర్ బీసీలకు చేసే ఆర్థికసాయం పథకాన్ని కాపీ కొట్టారని, అది అప్పు రూపంలో మోదీ అందిస్తున్నారని విమర్శించారు. ఉద్యమస్ఫూర్తి, పోరా టస్ఫూర్తిని చాకలి ఐలమ్మ అందించిందన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు హక్కుగా రావాల్సిన రూ.లక్ష కోట్లు ఇవ్వడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉద్యోగులకు 71% ఫిట్మెంట్ ఇస్తోందన్నారు. త్వరలో సీఎం కొత్త పీఆర్సీ వేసి తీపికబురు చెబుతారన్నారు. అతి తక్కువ వేతనాలు ప్రధాని మోదీ సొంతరాష్ట్రం గుజరాత్లో ఉన్నాయని, చూసేందుకు వెజ్ గవర్న మెంట్, కానీ చేసేందుకు నాన్వెజ్ గవర్నమెంట్ అంటూ బీజేపీ ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్బీఐ కార్డ్స్ లాభం క్షీణత
ముంబై: క్రెడిట్ కార్డుల దిగ్గజం ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సరీ్వసెస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికం(క్యూ1)లో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 5 శాతం నీరసించి రూ. 593 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 627 కోట్లు ఆర్జించింది. ఇందుకు ప్రధానంగా వసూళ్లు తగ్గడం లాభాలను దెబ్బతీసింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 3,263 కోట్ల నుంచి రూ. 4,046 కోట్లకు జంప్చేసింది. వడ్డీ ఆదాయం రూ. 1,387 కోట్ల నుంచి రూ. 1,804 కోట్లకు బలపడింది. ఫీజు ఆదాయం సైతం రూ. 1,538 కోట్ల నుంచి రూ. 1,898 కోట్లకు ఎగసింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.24 శాతం నుంచి 2.41 శాతానికి, నికర ఎన్పీఏలు 0.78 శాతం నుంచి 0.89 శాతానికి పెరిగాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 22.9 శాతానికి చేరింది. ఫలితాల నేపథ్యంలో ఎస్బీఐ కార్డ్స్ షేరు బీఎస్ఈలో స్వల్ప లాభంతో రూ. 859 వద్ద ముగిసింది. -
కార్డు నెట్వర్క్ను ఎంచుకునేందుకు కస్టమర్కు ఆప్షన్
న్యూఢిల్లీ: బ్యాంకులు, బ్యాంక్యేతర సంస్థలు జారీ చేసే కార్డులకు సంబంధించి అదీకృత నెట్వర్క్లను ఎంచుకునే వెసులుబాటును కస్టమర్కు ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ ప్రతిపాదించింది. ప్రస్తుతం కార్డ్ నెట్వర్క్లు, కార్డ్లు జారీ చేసే సంస్థల (బ్యాంకులు, నాన్–బ్యాంకులు) మధ్య ఉన్న ఒప్పందాలు.. కస్టమర్లకు తగినన్ని ఆప్షన్లను అందుబాటులో ఉంచేలా లేవని సర్క్యులర్ ముసాయిదాలో అభిప్రాయపడింది. కార్డును జారీ చేసేటప్పుడు గానీ లేదా ఆ తర్వాత గానీ అర్హత కలిగిన కస్టమర్లు.. బహుళ కార్డు నెట్వర్క్ల నుంచి ఏదో ఒకదాన్ని ఎంచుకునేందుకు అవకాశం కలి్పంచాలని పేర్కొంది. కార్డు ఇష్యూయర్లు ఒకటికి మించి నెట్వర్క్లతో కార్డులను జారీ చేయాలని తెలిపింది. సంబంధిత వర్గాలు ఆగస్టు 4 వరకు ఈ ముసాయిదా సర్క్యులర్పై ఆర్బీఐకి తమ అభిప్రాయాలు తెలియజేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం వీసా, రూపే, మాస్టర్కార్డ్ మొదలైన కార్డ్ నెట్వర్క్లు భారత్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటితో భాగస్వామ్యం ద్వారా బ్యాంకులు, నాన్–బ్యాంకులు తమ డెబిట్, క్రెడిట్, ప్రీపెయిడ్ కార్డులు మొదలైన వాటిని జారీ చేస్తున్నాయి. -
పత్తాలు ఆడి రోడ్డున పడుతున్నారు.. అయినా మానట్లేదు
జగిత్యాల క్రైం: జగిత్యాల జిల్లాలో పేకాట జోరుగా సాగుతోంది. పోలీసులు కఠినచర్యలు చేపడుతున్నా జూదరుల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. గతంలో జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యా పారి సుమారు రూ.3 కోట్ల ఆస్తులను అమ్మి, పేకాటకు పెట్టి నష్టాల ఊబిలో కూరుకుపోయా డు. మరో మద్యం వ్యాపారి సుమారు రూ.కోటి మేరకు ఆన్లైన్లో పేకాట ఆడి, అప్పులపాలయ్యాడు. కుటుంబసభ్యులు లబోదిబోమంటూ తమ ఆస్తులమ్మి తీర్చారు. జూదంతో జిల్లాలో ఎందరివో కాపురాలు కూలిపోయాయి. మూడేళ్లలో ఇదీ పరిస్థితి.. జిల్లాలో 2021లో పోలీసులు 207 కేసులు నమోదు చేసి, 295 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.32.65 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. 2022లో 109 కేసులు నమోదు చేసి, 536 మందిని అరెస్టు చేశారు. రూ.16.91 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 20 కేసుల్లో 133 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.3.16 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అయినా పోలీసుల కళ్లుగప్పి నిత్యం జూదం కొనసాగుతుండటంతో ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయి. కొంతమంది పేకాట కోసం ఆస్తులు, బంగారం తాకట్టు పెడుతుండటంతో వారి బతుకులు తారుమారు అవుతున్నాయి. ఇళ్లు, మామిడితోటలే అడ్డాలు.. చాలా మంది పేకాటరాయుళ్లు ఇళ్లు, మామిడితోటలు, ఫామ్హౌస్లు, అటవీ ప్రాంతాల్లో ప్రత్యేక స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. సీసీ కెమెరాలు, రోడ్ల వెంట ఇన్ఫార్మర్లను పెట్టుకొని, జూదం ఆడుతున్నారు. నెలకు సుమారు రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల మేర సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లా కేంద్రంలో రెండంతస్తుల భవనాలను అద్దెకు తీసుకొని, కింది అంతస్తులో కుటుంబాలను అద్దెకు ఉంచుతూ రెండో అంతస్తులో జూదం నిర్వహిస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి వస్తున్న జూదరులు జగిత్యాల జిల్లాలోని పేకాట స్థావరాలకు ఇతర జి ల్లాల నుంచి కూడా జూదరులు పెద్ద ఎత్తున వస్తున్నారు. పోలీసులు కఠినచర్యలు తీసుకుంటున్నా వారు వెనుకడుగు వేయడం లేదు. పేకాడుతున్న సమయంలో పోలీసులు దాడులు చేస్తే చాలామంది జూదరులు వారి కళ్లుగప్పి, పారిపోతున్నారు. అడ్డుకట్ట పడేదెలా? జిల్లా వ్యాప్తంగా పేకాటను అడ్డుకునేందుకు పో లీసులు చర్యలు తీసుకుంటున్నా ఆగడం లేదు. జూదం ఆడేవారికి కోర్టులో కఠిన శిక్షలు లేకపోవడంతో చాలా మంది పట్టుబడినా తమ ప్రవర్తన మార్చుకోవడం లేదు. బయటకు వచ్చి, మళ్లీ పే కాడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలు తెస్తే తప్ప జూదానికి అడ్డుకట్ట పడేలా లేదు. పేకాటపై ప్రత్యేక నిఘా జగిత్యాల జిల్లాలో పేకాటను అరికట్టేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. చాలా మందిపై కేసులు నమోదు చేస్తూ అరెస్టు చేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో కఠినచర్యలు తీసుకుంటున్నాం. – ఎగ్గడి భాస్కర్, ఎస్పీ -
యూట్యూబర్ అదితి అగర్వాల్ సక్సెస్ జర్నీ..మీరు ఫిదా!
సాక్షి, ముంబై: ఇటీవలి కాలంలో దాదాపు ప్రతీ ఇంటికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉందిఅనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ఔత్సాహిక టీనేజర్లు,యువభారతం తమ టాలెంట్ను నిరూపించుకునేందుకు యూట్యూబ్ను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలు వంటలు, చిట్కాలు, యోగాలు, కిచెన్ గార్డెనింగ్ దగ్గర్నించి, బిజినెస్, రాజకీయాలు ఇలా పలు కేటగిరీల్లో సక్సెస్ఫుల్ యూటూబర్లుగా లక్షలు, కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. ఢిల్లీకి చెందిన భువన్ బామ్ నుండి ముంబైకి చెందిన ప్రజక్తా కోలి వరకు అంతర్జాతీయ ఖ్యాతిని పొందారు. అలాంటి వారిలో ఒకరు యూట్యూబర్ అదితి అగర్వాల్. అద్దె ఇంట్లో మొదలు పెట్టిన ప్రయాణంలో ఇపుడు సొంత ఫ్లాట్తో పాటు దాదాపు 70 లక్షల మంది మద్దతుతో ఈ స్థాయికి చేరడం వెనుక ఏళ్ల కష్టం ఉంది. యూట్యూబ్లో క్రాఫ్టర్ అదితిగా దూసుకుపోతోందిఅదితి అగర్వాల్. ప్రయాగ్రాజ్కు చెందిన అదితి ప్రయాగ్రాజ్లోని బాలికల ఉన్నత పాఠశాలలో తన విద్యను పూర్తి చేశాక అలహాబాద్ యూనివర్శిటీ నుండి డిగ్రీని చేసింది. (చిన్న రుణాలనుంచి..వరల్డ్ టాప్ బ్యాంకర్స్లో స్థానం దాకా! కిక్ అంటే ఇది!) అదితి ప్రయాణం ఎలా మొదలైంది? ఒక విధంగా చెప్పాలంటే అదితి ప్రయాణం ఎనిమిదో తరగతిలో మొదలైంది. ఊహాత్మకంగా, ఆకర్షణీయంగా కార్డులు తయారు చేయడం అదితికి చాలా ఇష్టం. అలా ఎనిమిదో తరగతిలో ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఆమె ఓ కార్డును రూపొందించింది. అది చూసిన టీచర్లంతా ఫిదా అయిపోయారు. అక్కడనుంచి ప్రేరణకు తోడు 11వ తరగతిలో, అదితికి కార్డ్ ఆర్డర్ వచ్చింది. దానికి ప్రతిఫలంగా తొలి సంపాదనగా 300 రూపా యలుఆర్జించింది. ఇది ఇలా ఉండగా, అదితి తన 12వ తరగతిలో NIFT పరీక్షకు హాజరై 205 మార్కులు సాధించింది, కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా కళాశాలలో చేరలేదు. (ఫోర్బ్స్ బిలియనీర్ కేషుబ్ మహీంద్రా గురించి తెలుసా? ఆనంద్ మహీంద్రకి ఏమవుతారు?) దీంతో తన స్పెషల్ ఇంట్రస్ట్ గిప్ట్స్, కార్డుల మేకింగ్లో ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో సోషల్ మీడియాను ఉపయోగించుకుంది. 2015లో ఫేస్బుక్లో అదితి కార్డ్ జోన్ పేజీని ప్రారంభించింది. ఆ మరుసటి రోజే ఆమెకు 800 రూపాయల ఆర్డర్ వచ్చింది. తానే స్వయంగా కార్డులను డెలివరీ చేసింది. ఈ ప్రయాణం అంతఈజీగా ఏమీ సాగలేదు. కానీ పట్టువదలకుండా తన వంతు ప్రయత్నం చేస్తూ పోయింది అదితి. 2017లో తన యూట్యూబ్ ఛానెల్ని ప్రారంభించింది. గ్రాడ్యుయేషన్ చేస్తూనే ప్రతిరోజూ ఆమె ఒక వీడియోను అప్లోడ్ చేసేది. సోదరి సాయంతో వీడియోలను రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసింది. మదర్స్ డే , ఫాదర్స్ డే ఇలా ఏ అకేషన్ను వదులుకోలేదు. రకారకాల గిఫ్ట్స్, కార్డ్లను ఆన్లైన్లో విక్రయించడంతో అదితి వీడియోలను అప్లోడ్ చేసేది. అలా కార్డ్ మేకింగ్ వీడియోను వైరల్ అయింది. దాదాపు 2 లక్షల మందికి పైగా దీన్ని వీక్షించారు. దీంతో మరింత పాపులారీటి పెరిగింది. ఫలితంగా 2018లో లక్షమార్క్ను దాటిన అదితి ఛానెల్ సబ్స్క్రైబర్లు 2020 నాటికి 2.60 లక్షలకు చేరుకుంది. ఈ సక్సెస్తో 30 ఏళ్లుగా అద్దె ఇంట్లో ఉన్న తన ఫ్యామిలీకి అదితి 2020లో లక్నోలో రెండు పడకగదుల ఫ్లాట్ని కొనుగోలు చేసింది. ఆమె తండ్రి ఒక ప్రైవేట్ ఉద్యోగి. ఈలోపు కరోనా రావడంతో 2021లో లక్నోకి మకాం మార్చింది. అదితి ఛానెల్పై కోవిడ్-19 ప్రభావం కరోనా సమయంలో, అదితి ఛానెల్ కంటెంట్కు ఆదరణ కాస్త తగ్గింది. దీంతో 2.60 లక్షల మంది సభ్యులు 2.54 లక్షలకు పడిపోయారు. ఈ సమయంలో కాస్త నిరాశ పడినా, ఆ తర్వాత అదితి తన తల్లి సపోర్ట్తో ప్రతిరోజూ వీడియోలు అప్లోడ్ చేయాలని నిర్ణయించుకుంది. చివరికి వీడియో ఒకటి వైరల్ కావడంతో కేవలం 15 రోజుల్లో సబ్స్క్రైబర్లు 10 లక్షల మంది చేరారు. ప్రస్తుతం అదితి యూట్యూబ్ ఛానెల్లో దాదాపు 7 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లుండటం విశేషం. ఈ రోజు సంపాదన 6 అంకెలలో. అదితికి ఇన్స్టాగ్రామ్లో 5.9 లక్షల మంది, ఫేస్బుక్లో 2.90 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. రేసు గుర్రంలా పరిగెట్టాల్సిందే యూట్యూబర్ కావాలనుకునే వారికి టిప్స్ ఇస్తూ..సక్సెస్ రావాలంటే లాంగ్ రేసు తప్పదని, చాలామందికి సడెన్గా సక్సెస్ వచ్చినా మాయమైపోతుందని, దాన్ని నిలుపు కోవడం ముఖ్యమని సూచిస్తుంది. అందుకే రేసు గుర్రంలా మారితే గొప్ప విజయాన్ని అందుకోలేమని చెబుతుంది అదితి. తనకు కూడా సక్సెస్ రావడానికి ఆరేళ్లు పట్టిందంటూ తన జర్నీని గుర్తు చేసుకుంది. (సర్కార్ కొలువుకు గుడ్బై..9 లక్షల కోట్ల కంపెనీకి జై: ఎవరీ ప్రసూన్ సింగ్?) YouTube ప్రశంసలు అనేక ఈవెంట్లకు ఆహ్వానం అదితి విజయాన్ని యూట్యూబ్ కూడా ప్రశంసించింది. DIY ఈవెంట్కి ఆహ్వానాన్ని అందుకుంది. ఇంకా మెటా అనేక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం వచ్చింది. -
డిజీలాకర్ అంటే? డైనమిక్ కేవైసీతో లాభాలేంటి?
భారత ఫిన్టెక్ను ఐదు విభాగాలుగా వేరు చూసి చూడొచ్చు. క్యూఆర్ కోడ్ తదితర చెల్లింపులు, బిల్లుల చెల్లింపులు, ఇతర అగ్రిగేటర్ సేవలు, బై నౌ, పే లేటర్ సహా రుణ సదుపాయం, రుణాలిచ్చే ప్లాట్ఫామ్లు, డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్లు, ఇన్సూరెన్స్ ప్లాట్ఫామ్లు, వెల్త్ మేనేజ్మెంట్ సంస్థలు. ఈ ప్లాట్ఫామ్లకు సంబంధించి సేవలు పొందాలంటే ప్రజలు గుర్తింపు పత్రాలను సమర్పించాల్సి (కేవైసీ) ఉంటుంది. గత కొన్నేళ్ల కాలంలో కేవైసీ ప్రక్రియను ఫిన్టెక్ సంస్థలు ఎంతో సులభతరం చేశాయి. ఫిన్టెక్ సంస్థలు డిజీలాకర్లో ఉన్న డాక్యుమెంట్లను పొందే అవకాశం కల్పిస్తామని 2023-24 బడ్జెట్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం నిజంగా ఒక పెద్ద మార్పు వంటిదే. డిజిటల్ ఇండియా మిషన్కు అనుగుణంగా భారత ప్రభుత్వం దేశంలో ఫిన్టెక్ పరిశ్రమ వృద్ధికి ఎన్నో సదుపాయాలు కల్పించింది. ఆధార్, పీఎం జన్ ధన్ యోజన, వీడియో కేవైసీ, యూపీఐ వంటివి ఎన్నో చేపట్టింది. ఫలితంగా భారత ఫిన్టెక్ పరిశ్రమ 2025 నాటికి 1.3 ట్రిలియ్ డాలర్ల స్థాయికి చేరుకోనుంది. డిజీలాకర్ ప్రస్తుతం డిజీలాకర్ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన డాక్యుమెంట్ల డిజిటల్ కాపీలు స్టోర్ చేసుకునేందుకు వినియోగిస్తున్నారు. ప్రభుత్వం తాజా నిర్ణయం ఇతర డాక్యుమెంట్లను సైతం డిజీలాకర్లో స్టోర్ చేసుకునే దిశగా ప్రోత్సహిస్తుంది. వెబ్బ్రౌజర్, మొబైల్ యాప్ రూపంలో అందుబాటులో ఉన్న డిజీలాకర్ను డిజీయాత్ర యాప్పై ఐడెండిటీ వెరిఫికేషన్కు అనుమతిస్తున్నారు. దీంతో దేశీ విమానాశ్రయాల్లో కాంటాక్ట్లెస్ చెకిన్కు వీలు లభిస్తోంది. డైనమిక్ కేవైసీ డిజీలాకర్ సాయంతో కేవేసీ ప్రక్రియను మరింత సులభతరం చేయాలన్న ప్రభుత్వం నిర్ణయంతో కేవైసీ ప్రక్రియ క్రియాశీలంగా మారుతుంది. ఆధార్, పాన్ డేటా ఆధారంగా రిస్క్ సమీక్ష సాధ్యపడుతుంది. డిజిటల్ ఇండియా కార్యక్రమం దేశంలో మరింత విస్తరిస్తుంది. రుణాల లభ్యతను పెంచుతుంది. భారత ఫిన్టెక్ పరిశ్రమ దీర్ఘకాల వృద్ధికి బడ్జెట్ ఎంతో ముందడుగు వేసింది సాంకేతిక, విజ్ఞాన ఆధారిత వృద్ధి ప్రాధాన్యతను బడ్జెట్ గుర్తించింది. వివిధ ప్రభుత్వ ఏజెన్సీలు, నియంత్రణసంస్థలు కలిగి ఉండే పౌరుల డేటా విషయంలో ఏకీకృత పరిష్కారంపై దృష్టి సారించింది. నేషనల్ డిజిటల్ లైబ్రరీ సహా ఇతర చర్యలు ఫిన్టెక్ పరిశ్రమ వృద్ధికి ఎంతో లబ్ధి కలిగిస్తాయి. క్రెడిట్ కార్డులు యూపీఐతో లింక్ చేయడానికి ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం కూడా ఆహ్వానించతగినది. -
Aasara Pension: అందని ఆసరా గుర్తింపు కార్డులు..!
ముషీరాబాద్ భోలక్పుర్కు చెందిన మహిళకు వితంతు పింఛన్ మంజూరైంది. కొత్తగా పింఛను మంజూరు కావడంతో గుర్తింపు కార్డు కోసం తహాసిల్ ఆఫీస్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని ఆశ్రయించింది. ఫించన్ మంజూరైంది కానీ.. కార్డు రాలేదంటూ నాలుగైదు రోజులుగా సమాధానం చెబుతూ వచ్చి... చివరకు కార్డు వచ్చింది... ఒంటరిగా రా ఇస్తానని చెబుతున్నాడని ఆరోపిసూ సదరు మహిళ కుటుంబ సభ్యులు, బస్తీ వాసులతో కలిసి తహసీల్దార్ సమక్షంలోనే సదరు సిబ్బందిని చితకబాదారు. ఈ ఘటనపై గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సాక్షి, హైదరాబాద్: కొత్త ఆసరా ఫించన్దారులకు గుర్తింపు కార్డులు అందని ద్రాక్షగా తయారయ్యాయి. ఆసరా పింఛన్లు మంజూరైనా..గుర్తింపు కార్డులు పంపిణీ నత్తలకు నడకనేర్పిస్తోంది. గత నెలలో నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేల చేతులు మీదుగా ఫించను గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టినా... కనీసం 30 శాతం పూర్తి కాలేదు. కొందరికి కార్డు దక్కి మిగతా వారికి పంపిణీ కాకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో లబ్ధిదారులు తహాసిల్ ఆఫీసుల చుట్టూ ప్రదక్షణలు చేస్తూ సంబంధిత సిబ్బందిచే ఛీత్కారాలు, వేధింపులకు గురవుతున్నారు. మహిళలకు వేధింపులే... ఆసరా పించన్ల విషయంలో వితంతు మహిళలు, ఒంటరి మహిళలకు వేధింపులు తప్పడం లేదు. ఒక వైపు సిబ్బంది, మరోవైపు దళారులు మహిళల పేదరికం, అవసరాన్ని ఆసరా చేసుకొని వివిధ రకాలుగా వేధించడం పరిపాటిగా తయారైంది. గుర్తింపు కార్డులు అందని వారు తమకు ఫించన్ మంజూరు కాలేదన్న భయం... కొందరు సిబ్బంది.. దళారులకు కలిసి వచ్చే అవకాశంగా తయారైంది. తాము సహకరస్తామంటూ తమ నైజాన్ని ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినవస్తున్నాయి. కార్డుల పంపిణీ అంతంతే.. సరిగ్గా మూడేళ్ల నిరీక్షణ తర్వాత ఆఫ్లైన్ ఆసరా దరఖాస్తులకు, ఏడాది అనంతరం ఆన్లైన్ ఆసరా దరఖాస్తులకు మోక్షం లబించి కొత్త పింఛన్లు మంజూరైనా గుర్తింపు కార్డుల పంపిణీ అంతంత మాత్రంగా తయారైంది. హైదరాబాద్ జిల్లా పరిధిలో మొత్తం మీద సుమారు 80,824 మంది ఆసరా పింఛన్లు మంజూరైనట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అందులో 58,066 మంది వద్దులకు, 15,210 మంది వితంతులకు, 3,265 మంది వికలాంగులకు, 2,197 ఒంటరి మహిళలకు, ఇద్దరు బీడీ కార్మికులకు, 1,194 మంది కళాకారులకు, 892 యాలసిస్ బాధితులకు, ఆరుగురు ఫైలేరియా, ఇద్దరు చేనేత కార్మికులను అసరా పింఛన్లు మంజూరయ్యాయి. ప్రస్తుతం వివిధ కేటగిరీ కింద 1.96 లక్షల మంది సరా పింఛన్లు పొందుతున్నారు. (క్లిక్ చేయండి: అనారోగ్యంతో అపోలోకు.. ఆరోగ్యంగా నిమ్స్కు..!) -
ఎస్బీఐ కార్డ్ లాభం 67 శాతం అప్..
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ (ఎస్బీఐ కార్డ్) నికర లాభం 67 శాతం ఎగిసింది. రూ. 345 కోట్లకు పెరిగింది. రిటైల్, కార్పొరేట్ కస్టమర్లు గణనీయంగా వ్యయాలు చేయడం ఇందుకు దోహదపడినట్లు సంస్థ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నికర లాభం రూ. 206 కోట్లు. ఇక తాజా క్యూ2లో ఆదాయం 7 శాతం వృద్ధి చెంది రూ. 2,510 కోట్ల నుంచి రూ. 2,695 కోట్లకు పెరిగింది. ఫీజులు, సర్వీసుల విభాగాల నుంచి మరింత ఆదాయం రావడం ఇందుకు తోడ్పడినట్లు ఎస్బీఐ కార్డ్ తెలిపింది. సమీక్షాకాలంలో నిర్వహణ వ్యయాలు 25 శాతం పెరిగి రూ. 1,383 కోట్లకు చేరినట్లు వివరించింది. వ్యాపార పరిమాణం పెరగడం ఇందుకు కారణమైనట్లు ఎస్బీఐ కార్డ్ తెలిపింది. మొండిబాకీలు తదితర అంశాలకు సంబంధించిన వ్యయాలు రూ. 862 కోట్ల నుంచి రూ. 594 కోట్లకు దిగి వచ్చాయి. కొత్త ఖాతాల సంఖ్య 6,88,000 నుంచి 39 శాతం వృద్ధి చెంది 9,53,000కు చేరింది. సెప్టెంబర్ ఆఖరు నాటికి వినియోగంలో ఉన్న కార్డుల సంఖ్య 14 శాతం పెరిగి 1.26 కోట్లకు చేరినట్లు, ఈ విషయంలో తమ మార్కెట్ వాటా 19.4 శాతంగా ఉన్నట్లు ఎస్బీఐ కార్డ్ పేర్కొంది. బీఎస్ఈలో గురువారం ఎస్బీఐ కార్డ్ షేరు సుమారు 1 శాతం క్షీణించి రూ. 1,124 వద్ద క్లోజయ్యింది. -
క్రిప్టోకరెన్సీ దెబ్బకు వీటి ధరలు భారీగా పెరగనున్నాయా..!
ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీ కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. పలు క్రిప్టోకరెన్సీల విలువ ఆకాశమే హద్దుగా పెరుగుతూనే ఉంది. తాజాగా బిట్కాయిన్ 51 వేల డాలర్ల మార్క్ను దాటిపోయింది. బిట్కాయిన్ తరహాలోనే మరొక క్రిప్టోకరెన్సీ ఈథిరియం కూడా గణనీయంగా వృద్ధి చెందింది. తాజాగా ఈథిరియం విలువ 3907.61 డాలర్లకు చేరుకుంది. చదవండి: Cryptocurrency: క్రిప్టోకరెన్సీలో భారత్ స్థానం ఎంతో తెలుసా...! తాజాగా ఈథిరియం విలువ పెరగడంతో పలు కంప్యూటర్లలో వాడే జీపీయూ(గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్) ధరలు భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది. మై డ్రైవర్స్ నివేదిక ప్రకారం చైనా లో ఎన్విడియా జీపీయూ ధరలు 18 శాతం పెరిగాయని వెల్లడించింది. సెప్టెంబర్లో ఎన్వీడియా జీపీయూ గ్రాఫిక్ కార్డుల కొనుగోళ్లు 50 శాతం తగ్గుతాయని పేర్కొంది. గతంలో ఈథిరియం విలువ తగ్గడంతో గ్రాఫిక్స్ కార్డు ధరలు గణనీయంగా తగ్గాయి. గత వారంలో ఈథిరియం విలువ 23 శాతం పైగా పెరిగింది. క్రిప్టోకరెన్సీ పెరుగుదలతో ఎన్విడియా గ్రాఫిక్స్ కార్డులు మాత్రమే కాకుండా ఏఎమ్డీ ఎక్స్ 6000 సిరీస్, గిగా బైట్ గ్రాఫిక్స్ కార్డు ధరలు కూడా పెరగనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా వీటి ధరలు భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది. క్రిప్టోకరెన్సీ గ్రాఫిక్స్ కార్డు ధరలు ఎలా నియంత్రిస్తుదంటే..! క్రిప్టోకరెన్సీ కంటికి కనిపించని ఒక డిజిటల్ కరెన్సీ. క్రిప్టోకరెన్సీ పూర్తిగా బ్లాక్చెయిన్ టెక్నాలజీ ఉపయోగించి లావాదేవీలను జరుపుతుంటారు. క్రిప్టోకరెన్సీ మైనింగ్ చేయడం కోసం కంప్యూటర్లలో శక్తివంతమైన గ్రాఫిక్స్ కార్డులు కావాల్సి ఉంటుంది. గ్రాఫిక్స్ కార్డులనుపయోగించి సంక్లిష్టమైన గణిత సమస్యలను పరిష్కరించవచ్చును. క్రిప్టోకరెన్సీ మైనింగ్ జరిపే వారితో ఈ గ్రాఫిక్స్ కార్డుల ధరలు గణనీయంగా పెరుగుతాయని టెక్నాలజీ నిపుణులు వెల్లడించారు. చదవండి: Elon Musk: శక్తివంతమైన క్రిప్టోకరెన్సీ ఏదో తేల్చిచెప్పిన ఎలన్ మస్క్...! -
ప్రాపర్టీ కార్డుల పంపిణీ ప్రారంభించిన మోదీ
-
‘గ్రామీణ భారతంలో చారిత్రక ఘట్టం’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రజలకు ప్రాపర్టీ కార్డులను అందించే స్వమిత్వ పథకం గ్రామీణ భారతాన్ని సమూలంగా మార్చే చారిత్రక ఘట్టం కానుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. స్వమిత్ర పథకాన్ని ప్రధాని మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించి లబ్ధిదారులతో ముచ్చటించారు. ప్రాపర్టీ కార్డుల ద్వారా లబ్ధిదారులకు తమ ఆస్తులపై బ్యాంకు రుణాలు పొందే వెసులుబాటు కలుగుతుంది. ఈ సందర్బంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ తమ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించారు. దశాబ్దాలుగా గ్రామాల్లో నిరుపేదలు సొంతిల్లు లేక ఇబ్బందులు పడుతున్నారని, తమ ప్రభుత్వం రెండు కోట్ల పక్కా ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు అందచేసిందని చెప్పుకొచ్చారు. కాగా స్వమిత్వ పథకం ద్వారా లక్ష మంది ఆస్తిదారులు తమ మొబైల్ నెంబర్కు వచ్చే ఎస్ఎంఎస్ లింక్ ద్వారా తమ ప్రాపర్టీ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) వెల్లడించింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రాపర్టీ కార్డులను లబ్ధిదారులకు అందచేస్తాయని పేర్కొంది. చదవండి : అసెంబ్లీ ఎన్నికలు : మోదీ, షా కీలక భేటీ -
ఎస్బీఐ కార్డ్స్ ఐపీఓ ప్రైస్బాండ్ రూ.750–755
ముంబై: ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ కంపెనీ ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ప్రైస్బాండ్ను నిర్ణయించింది. వచ్చే నెల 2 నుంచి మొదలై 5 వ తేదీన ముగిసే ఈ ఐపీఓకు ప్రైస్బాండ్గా రూ.750–755ను నిర్ణయించామని ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ తెలిపింది. ఐపీఓలో భాగంగా రూ. 500 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్)లో భాగం గా 13 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయిస్తారు. మొత్తం మీద ఇష్యూ సైజు రూ.9,000 కోట్ల మేర ఉంటుందని అంచనా. కనీసం 19 షేర్లకు (మార్కెట్ లాట్)దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. మార్చి 16న ఈ కంపెనీ షేర్ స్టాక్ మార్కెట్లో లిస్టవుతుంది. ప్రస్తుతం గ్రే మార్కెట్ ప్రీమియమ్(జీఎమ్పీ) రూ.325/330 రేంజ్ లో ఉందని సమాచారం. ఫిబ్రవరి 18 వ తేదీ వరకూ ఎస్బీఐ షేర్లను హోల్డ్ చేసిన ఇన్వెస్టర్లు–రిటైల్ కేటగిరీలోనూ, షేర్ హోల్డర్ల కేటగిరీలోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్బీఐ ఉద్యోగులకు ఇష్యూ ధరలో రూ.75 డిస్కౌంట్ లభిస్తుంది. క్యూ3లో స్థూల మొండి బకాయిలు 2.47%గా ఉన్నాయని ఎస్బీఐ కార్డ్స్ సీఈఓ హర్దయాళ్ ప్రసాద్ తెలిపారు. -
ఏపీలో నేటి నుంచి కొత్త పెన్షన్ కార్డులు
-
వాలెంటైన్స్ డే రోజే ఆగ్నికి ఆహుతి
సాక్షి, న్యూఢిల్లీ: రాజధాని నగరం ఢిల్లీని వరుస అగ్ని ప్రమాదాలు వణికిస్తున్నాయి. కరోల్ బాగ్ ట్రాజెడీని ఇంకా మరువకముందే మరో భారీ అగ్నిప్రమాదం కలకలం రేపింది. వాలెంటైన్స్ డే కార్డులు, ఇతర గిఫ్ట్ కార్డులను తయారు చేసే ఫ్యాక్టరీలో భారీ ఎత్తున గ్రీటింగ్ కార్డులు అగ్నికి ఆహుతి కావడం విషాదం. అదీ వాలెంటైన్స్ డే రోజు. వెస్ట్ ఢిల్లీలోని నరైనా ఇండస్ట్రియల్ ఏరియాలోని ఫ్యాక్టరీ పైఅంతస్థులో గురువారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న 23 అగ్నిమాపక శకటాలు మంటలను అదుపు చేస్తున్నాయి. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. అయితే ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి వుంది. కాగా ఫిబ్రవరి 12వతేదీన కరోల్ బాగ్లోని అర్పిత్ ప్యాలెస్ హోటల్ దుర్ఘటన జరిగి 24 గంటలు గడవకముందే బుధవారం జరిగిన మరో అగ్ని ప్రమాదంలో సుమారు 250కిపైగా నిరుపేదల గుడిసెలు కాలి బూడిద కాగా, గురువారం మరో ప్రమాదంతో ఢిల్లీ నగరం నిద్ర లేచింది. #WATCH A medium category fire broke out at a paper card factory in Naraina Industrial Area, Phase I, early morning today; Total 23 fire tenders engaged in fire fighting operations, no casualties reported pic.twitter.com/l6wiOjfELO — ANI (@ANI) February 14, 2019 -
చెత్త కుప్పలో ‘చంద్రన్న బీమా’
గుంటూరు, తెనాలి రూరల్: ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన చంద్రన్న బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం పథకాన్ని ప్రవేశపెట్టగా, రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా ‘చంద్రన్న’ పేరు జోడించి, పథకాన్ని తామే ప్రవేశపెట్టినట్టు ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల వరకు అందరూ గొప్పలు చెప్పుకున్నారు. అంత హడావిడి చేసిన ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారులకు అందాల్సిన బీమా కార్డులు తెనాలి పట్టణంలో చెత్తకుప్పలో దర్శనమిచ్చాయి. స్థానికులు గుర్తించి 210 కార్డులను అధికారులకు అందించారు. వందల కార్డులు పట్టణ మారీసుపేట మఠం బజారులో మున్సిపల్ ఎలిమెంటరీ స్కూలు ముందు రోడ్డు వెంబడి గార్బేజ్ కలెక్షన్ పాయింట్ ఉంది. చెత్త కుండీ వద్ద కొందరు కార్డులను ఏరుకుంటుండడాన్ని ఇదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి గమనించి, 210 కార్డులను అధికారులకు అందజేశాడు. అప్పటికే కొన్ని వందల కార్డులు గుర్తు తెలియని వారు తీసుకెళ్లారు. చంద్రన్న బీమాకు రూ.15 ప్రీమియం చెల్లించి కార్డు తీసుకోవాలి. 18 నుంచి 50 ఏళ్లలోపు వారికి సహజ మరణమైతే రూ.2 లక్షలు, 51 నుంచి 60 ఏళ్ల లోపు వారికి రూ. 30 వేలు చెల్లిస్తారు. మరణించిన పాలసీ దారుడి కుటుంబానికి రూ.ఐదు వేలు తక్షణ సాయం కింద ఇస్తారు. ప్రమాదవశాత్తు మరణం, పూర్తి అంగవైకల్యానికి రూ.5 లక్షలు, పాక్షిక అంగవైకల్యానికి రూ.2.50 లక్షలు చెల్లిస్తారు. కార్మికుల పిల్లలు 9, 10 తరగతులు, ఇంటర్, ఐటీఐ చదివే వారికి(ఇద్దరు పిల్లలకు)రూ. 1200 స్కాలర్షిప్ కింద ఇస్తారు. ఈ పథకానికి సంబంధించి ప్రజల నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో ప్రభుత్వమే ప్రీమియం చెల్లించింది. సాధికార సర్వే ఆధారంగా ప్రీమియంను రెండేళ్లు ప్రభుత్వమే చెల్లించింది. లబ్ధిదారుల నుంచి రూ.30 వసూలు చేయాలని అధికారులకు ఆదేశాలు వచ్చాయి. అయితే కార్డులు అంద జేసి డబ్బులు వసూలు చేయాలన్నారు. ఈ డబ్బు కట్టేందుకూ ప్రజలు ఆసక్తి కనబర్చకపోవడం, రెండేళ్లు పూర్తవడంతో మూడో ఏడాది ప్రభుత్వం ఉచితంగా అందరికీ ప్రీమియం చెల్లించింది. నిర్లక్ష్యానికి నిదర్శనం చంద్రన్న బీమా తమ పేరిట ఉందీ లేనిదీ ఇప్పటికీ తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు. లబ్ధిదారులందరికీ కార్డులు పంపిణీ చేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. పురపాలక సంఘంలో మెప్మా విభాగం ఆధ్వర్యంలో చంద్రన్న బీమా ప్రీమియం చెల్లింపులు(ప్రారంభంలో), కార్డుల అందజేత జరుగుతుంది. ఈ ఏడాది ఆరంభంలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో మొక్కుబడిగా కొందరికి కార్డులను ప్రజాప్రతినిధులు చేత ఇప్పించి, మిగిలిన వాటి పంపిణీ బాధ్యతను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. వారు కార్డులను అందజేయడంలో తాత్సారం చేయడం, పర్యవేక్షించుకోవాల్సిన మెప్మా సిబ్బంది పట్టనట్టు వ్యవహరించడంతో లబ్ధిదారులకు కార్డులు చేరలేదు. పట్టణంలో 90 శాతం మందికి కార్డులు అందలేదని తెలుస్తోంది. ఇప్పుడు చెత్త కుప్పలో కార్డులు దర్శనమివ్వడంపై ఆర్భాటంగా ప్రచారం చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు ఏం సమాధానం చెబుతారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు బీమా కార్డులు లబ్ధిదారులకు తప్పనిసరిగా అందించాలి. చెత్తకుప్పలో పడేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఇందుకు సంబంధించిన బాధ్యులెవరో విచారించి కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రైవేటు వ్యక్తుల వద్దకు ఎందుకు వెళ్లాయో విచారిస్తాం.కె.శకుంతల, మున్సిపల్ కమిషనర్ -
మంత్రి ఇలాకాలో జోరుగా పేకాట
సాక్షి ప్రతినిధి,పశ్చిమగోదావరి, ఏలూరు: పేకాట... కోతాట.. ఎక్కడ ఈ ఆటలు ఆడినా క్షణాల్లో పోలీసులు వాలిపోతారు. వీటిని నిర్వహించే వారితో పాటుగా ఈ జూదాలు ఆడే వారిని అరెస్టు చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం అసలు అరెస్టులే ఉండవు. కొవ్వూరు పట్టణం నడిబొడ్డులో జూదక్రీడ సాగుతున్నా అటువైపు పోలీసులు కన్నెత్తి చూడరు. ఎందుకు అనుకుంటున్నారా. అసలే మంత్రి గారి ఇలాకా... పైగా లక్షల్లో మామూళ్లు అందించి మరీ నిర్వహిస్తున్నారు. అసలే రెండు జిల్లాల సరిహద్దు ప్రాంతం కావడంతో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుండి ఈ జూదశాలకు బారులు తీరుతున్నారు. కొవ్వూరు మున్సిపాలిటీ కేంద్రం, డివిజన్ ప్రధాన పట్టణం. కొవ్వూరు పట్టణం నడిమధ్యలో ఈ జూదక్రీడ సాగుతోంది. వాస్తవానికి లిటరరీ క్లబ్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ క్లబ్లో మొదట్లో ఉన్నతస్థాయి ఉద్యోగులతో ఎంతో ఆదర్శంగా నడిచేది. జడ్జీలు, ఆర్డీవో స్థాయి అధికారులు సభ్యులుగాఉండేవారు. రానురాను కొంత మంది రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్లింది. క్లబ్కి వచ్చిన ఆదాయంతో కల్యాణ మండపం, జిమ్ వంటి వసతులు ఏర్పాటు చేశారు. క్లబ్ సభ్యత్వం కలిగిన వారి కుటుంబాలు కూడా ఇక్కడ వివిధ వేడుకలు నిర్వహించుకునేవారు. కళ్యాణ మండపం సభ్యులకు నామమాత్రపు రుసుముతోను ఇతరులకు నిర్దేశిత ధరలకు ఇస్తున్నారు. క్లబ్ జిమ్కు పరిమితమైంది. ఇక క్లబ్గా మార్పు గత సంవత్సర కాలంగా లిటరరీక్లబ్ పేకాటక్లబ్గా మారిపోయింది. నిర్దేశిత సమయంలో క్లబ్ సభ్యులు కొన్నిరకాలైన పేకాట ఆడుకోవచ్చునన్న కోర్టు తీర్పుని సాకుగా చూపిస్తూ క్లబ్ నడుపుతున్నారు. ఇక్కడకు 400 మీటర్ల దూరంలో ఎస్సీ, ఎస్టీ డీఎస్పీ కార్యాలయం ఉంది. అంతే కాకుండా 500 మీటర్ల పరిధిలో శాంతిభద్రతల డీఎస్పీ కార్యాలయం, డివిజనల్ మేజిస్ట్రేట్ అయిన ఆర్డీవో కార్యాలయం ఉన్నాయి. అర కిలోమీటరు దూరంలో టౌన్ పోలీస్స్టేషన్, రూరల్ పోలీస్స్టేషన్, సీఐ కార్యాలయం ఉంది. అయినప్పటికీ పేకాట రాయుళ్లు తమ జూదక్రీడను కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే పట్టణ ప్రజలు నిరంతరం తిరుగుతూ ఉండే ప్రదేశం.. పైగా రైల్వే స్టేషన్ పక్కనే ఉన్నప్పటికీ ఈ జూదాన్ని నియంత్రించే నాథుడే లేకుండా పోయాడు. నిబంధనలకు వ్యతిరేకంగా అర్ధరాత్రి వరకూ పేకాట నడుస్తోంది. కాసులే కీలకం ఈ క్లబ్లో గతంలో రూ.25 వేలు ఉండే సభ్యత్వాన్ని ఇప్పుడు రూ.లక్షకు పెంచారు. పెద్ద మొత్తంలో పోలీసులకు కాసులు ఇస్తూ వీరి పనికానిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరికి తోడు రాష్ట్ర మంత్రికి కూడా పెద్ద ఎత్తున ముడుపులు ఇస్తున్నట్లు చెబుతున్నారు. డివిజన్స్థాయి పోలీసులకు, స్థానిక నేతలకు నెలవారీ మామూళ్లు ఇస్తున్నట్లు సమాచారం. క్లబ్ నిర్వాహకులకు రూ.50 లక్షలకు పైగా నెలవారీ ఆదాయం వస్తున్నట్లు అంచనా. మంత్రి ప్రోద్భలంతోనే ఈ జూద ప్రక్రియను ప్రోత్సహిస్తున్నారని బాహాటంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. అప్పుడప్పుడు సేవా కార్యక్రమాల పేరుతో కొంత సొమ్ము వెచ్చించి, క్లబ్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు బయటికి ప్రచారం చేసుకుంటున్నారు. 1100 అపరిష్కార వేదిక ఎటువంటి అవినీతి జరిగినా పరిష్కరించేందుకు 1100 ఎంతో దోహద పడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు బాహాటంగానే ప్రకటించుకుంటున్నా ఈ లిటరరీ క్లబ్ బాగోతంపై ఫిర్యాదులు చేసినా కనీసం స్పందించిన పాపాన పోవడం లేదు. ఇది కేవలం ప్రకటనలకు మాత్రమే అనేది స్పష్టం అవుతోంది. ఇక 100 ఫోన్ చేసినా స్థానికంగా పోలీసులు స్పందించిన పాపాన పోవడం లేదు. పైగా ఈ క్లబ్లో పేకాట నిర్వహించుకునేందుకు అనుమతులు ఉన్నాయంటూ పోలీస్బాసులే సమాధానం చెబుతూ వెనకేసుకురావడం కొసమెరుపు. వాస్తవానికి అనుమతులు ఉంటే క్లబ్ మెంబర్లే ఉండాలి. అంతే కాకుండా కనీస నిబంధనలు అయిన సీసీ కెమేరాల పర్యవేక్షణలో నిర్వహించుకోవాలి. అటువంటి నిబంధనలే లేకుండా ఎక్కడివారైనా ఇక్కడ మాత్రం యథేశ్ఛగా పేకాట, జూదం ఆడుకునేందుకు కొవ్వూరు లిటరసీ క్లబ్ వేదికగా మారుతోంది. మళ్లీ తెరుచుకున్న జంగారెడ్డిగూడెం క్లబ్ జంగారెడ్డిగూడెం క్లబ్ మళ్లీ తెరుచుకుంది. సాక్షి కథనాలతో కొంతకాలం మూతపడిన క్లబ్లు మళ్లీ తెరుచుకుం టున్నాయి. ఉంగుటూరు నియోజకవర్గంలోని పేకాట క్లబ్లను మళ్లీ తెరిపించేందుకు ప్రజాప్రతినిధులు జిల్లా పోలీసు అధికారులపై వత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. తణుకు వేల్పూరులో ఐదు ప్రాంతాల్లో పేకాట క్లబ్లు నడుస్తుండగా, తాడేపల్లిగూడెం బ్రహ్మయ్యతోటలో పేకాట స్థావరం నడుస్తున్నట్లు సమాచారం. జిల్లాలో పేకాట క్లబ్లు, స్థావరాలు యథేశ్చగా సాగుతున్నా స్పెషల్ బ్రాంచి అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేకాట క్లబ్లను ఉక్కుపాదంతో అణిచివేయాలని భావిస్తున్న జిల్లా ఎస్పీకి సరైన సమాచారం అందడం లేదని తెలుస్తోంది. రమ్మీగేమ్కి అనుమతి ఉంది లిటరరీ క్లబ్ రిజిస్ట్రార్ క్లబ్. రమ్మీ గేమ్ ఆడుకోవడానికి అనుమతి ఉంది. క్లబ్లో 250 మంది వరకు సభ్యులున్నారు. రెగ్యులర్ రమ్మీ ఆడుతున్నారు. రమ్మీ అనేది స్కిల్ గేమ్. దీన్ని అడ్డుకునే అర్హత పోలీసులకు లేదు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పేకాడుతున్నారనేది ఆవాస్తవం. ఫిర్యాదుల నేపథ్యంలో ఇప్పటికే పలుమార్లు క్లబ్ని తనిఖీ చేశారు. నిర్దేశిత సమయాల్లో క్లబ్ సభ్యులు రమ్మీ ఆడుకునే అవకాశం ఉంది. –ఎస్.వెంకటేశ్వరరావు, డీఎస్పీ, కొవ్వూరు లీజుకి ఇచ్చి మరీ పేకాడిస్తున్నారు లిటరరీక్లబ్లో పేకాట సాగుతున్నా పట్టించుకునే నాథుల్లేరు. క్లబ్ కమిటీ పేకాట నిర్వహణకు లీజుకు ఇచ్చారు. ఆ సొమ్ము లీజుదారుడు క్లబ్కి చెల్లించే ఓప్పందం చేసుకున్నారు. సభ్యులు మాత్రమే రమ్మీ ఆడుకోవాలి. అయితే తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పేకాట కోసం తరలివస్తున్నారు. ఎస్పీకి ఫిర్యాదు చేసినా స్పందన లేదు. పేకాటకి వచ్చిన కార్లు పార్కింగ్తో జనం సైతం ఇబ్బందులు పడుతున్నారు.– పరిమి రాధాకృష్ణ, క్లబ్ మాజీ కార్యదర్శి, కొవ్వూరు -
కస్టమర్లకు షాక్: సర్వీస్ చార్జ్ బాదుడు?
-
కస్టమర్లకు షాక్: సర్వీస్ చార్జ్ బాదుడు?
సాక్షి, న్యూఢిల్లీ: ఇప్పటికే కస్టమర్లను తీవ్ర ఇక్కట్ల పాలు చేస్తున్న బ్యాంకులు ఇపుడు వారినెత్తిన మరో బాంబు వేసేందుకు సన్నద్ధమవుతున్నాయి. అతి త్వరలో ఏటీఎం లావాదేవీలు, చెక్కుల జారీ, డెబిట్ కార్డుల లావాదేవీలు తదితర లావాదేవీల పై సర్వీస్ ఛార్జి విధించాలనే సంచలన నిర్ణయం దిశగా కదులుతున్నాయి. ప్రధానంగా ఇకపై ఉచిత సేవలపైన కూడా పన్నులు కట్టాలన్న జీఎస్టీ నోటీసుల నేపథ్యంలో ఇకపై ఉచిత సేవలకు శుభం కార్డు వేయనున్నాయని తెలుస్తోంది. మే నెలలో దీనికి సంబంధించిన పూర్తి ఆదేశాలు రానున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఆయా బ్యాంకులు ఉచితంగా అందించిన సేవలకు కూడా.. సర్వీస్ ఛార్జీ వసూలు చేసినట్లు పరిగణించిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ ఇంటెలిజెన్స్ (డీజీజీఎస్టీ) ఈ నోటీసులు అందించటం విశేషం. బ్యాంకులు ఉచితంగా అందించే సేవలపై.. సర్వీస్ ఛార్జీ విధిస్తున్నట్లుగా భావించి ఈ పన్నులు చెల్లించాలని జీఎస్టీ ఇంటలిజెన్స్ కోరింది. ఈ మేరకు ప్రధాన బ్యాంకులకు నోటీసులు అందాయి. అంతేకాదు ఈ సంవత్సరానికే కాకుండా.. గత ఐదేళ్లుగా ఖాతాదారులకు బ్యాంకులు అందించిన అన్ని ఉచిత సేవలపైనా ట్యాక్స్ కట్టాలని ఈ నోటీసుల్లో తెలిపింది. ఈ పన్నుల భారం మొత్తం విలువ సుమారు రూ.6వేల కోట్లు ఉండొచ్చని అంచనా. ఇదే జరిగితే ఉచిత సేవలకు బదులు బ్యాంకులు ఇక సర్వీస్ చార్జీ బాదుడుకు తెర తీస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఏటీఎం లావాదేవీలు, చెక్ బుక్కుల జారీ, లావాదేవీలు, కార్డుల ద్వారా జరిగే అన్ని లావాదేవీలపై సర్వీస్ ఛార్జీ భారం తప్పదంటున్నారు. ఇప్పటివరకు ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ ఐసీఐసీఐ, యాక్సిస్, కొటక్ మహీంద్ర బ్యాంకులకు నోటీసులు అందాయి. త్వరలోనే ఇతర బ్యాంకులకు నోటీసులు అందే అవకాశం ఉంది. -
రంగు పడుద్ది..
జిల్లాలోని ప్రభుత్వ భవనాలకు పసుపు రంగు పడుతోంది. పంచాయతీ, ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులకు పచ్చరంగు వేయాల్సిందేనని ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. తాజాగా ఉపాధి కార్డులు పసుపు రంగులోనే ఉండాలని పాలకులు నిర్ణయించారు. లోటు బడ్జెట్ అంటూ సంక్షేమ పథకాలకు కత్తెర వేస్తూ.. ఏమాత్రం ఉపయోగం లేని అంశాలపై ప్రజాధనాన్ని వెచ్చిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. చిత్తూరు, సాక్షి: రాష్ట్ర ప్రభుత్వానికి రంగు పైత్యం పట్టుకుంది. తమ పార్టీ అధికార రంగు పసుపును ప్రభుత్వ భవనాలకు వేయాల్సిందేనని హుకుం జారీ చేసింది. దీంతో జిల్లాలోని పంచాయతీ భవనాలు, ఓహెచ్ఎస్ఆర్ (ఓవర్హెడ్ సర్వీస్ రిజర్వాయర్) ట్యాంకులు, ఉపాధి కార్డులపై పచ్చరంగు పడుతోంది. దీనిపై ఎన్ని విమర్శలు వస్తున్నా ప్రభుత్వం లెక్క చేయడం లేదు. పైకి విమర్శలు చేయకపోయినా ఉద్యోగులు కూడా ఈ విషయంపై చర్చించుకుంటున్నారు. మెమో నంబర్ 2754/2017 సీపీఆర్అండ్బీ ఆర్డీ పేరిట పంచాయతీరాజ్ కమిషనర్ అన్ని జిల్లాల కలెక్టర్లకు, డీపీఓలకు పచ్చరంగు పులమడంపై ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భవనాలకు ఏ రంగు వేయాలి, ఏ కంపెనీ రంగు వాడాలో ఓ నమూనా చిత్రాన్ని పంపారు. పంచాయతీ భవనాలకు.. జిల్లాలో 1,363 పంచాయతీలు ఉన్నా యి. వీటిలో 1,148 పంచాయతీలకు భవనాలు న్నాయి. వీటన్నింటిపై పసుపు రంగు పడనుంది. రాజ్యాంగం ప్రకారం పంచాయతీలు స్వపరిపాలన సంస్థలు. వీటికి.. రాజకీయ పార్టీలకు ఎలాంటి సబంధం లేదనే విషయం తెల్సిందే. అయినా పంచాయతీ భవనా లన్నింటికీ తెలుగుదేశం పార్టీ అధికారిక రంగును వేయిం చేందుకు ప్రభుత్వం పూనుకుంది. భవనం మొత్తం పసుపు రంగు, కార్నర్లకు తెలుపు రంగు వేయాలని మెమోలో ప్రభుత్వం సూచించింది. 9600 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులకు కూడా.. జిల్లాలో 9600 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులున్నాయి. వీటికి కూడా పచ్చరంగు వే యాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ట్యాంకుపైకి ఎక్కడానికి కేటా యించిన వంతెనకు తప్ప మొత్తం ట్యాంకుకు పసుపు రంగు వేయాలని పేర్కొం ది. 6734/2017 సీపీఆర్ ఆర్అండ్డీ పేరుతో ఆదేశాలు జారీ చేసింది. ఉపాధి కార్డులకూ.. ఇప్పుడు ఉండే ఉపాధికార్డులను రద్దు చేసి పసుపు రంగు కార్డులిచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. పసుపు జాబ్ కార్డులు ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పంపిణీ కూడా చేశారు. మన జిల్లాలో 6,58,914 జాబ్ కార్డులున్నాయి. వీటన్నింటినీ పసుపురంగులో ముద్రించి కొత్తగా పంపిణీ చేయాలని సర్కారు నిర్ణయించింది. కేంద్రం నిధులతో నడిచే ఈ పథకంపై తన ముద్ర వేసుకోడానికే ఈ ప్రయత్నమని పలువురు పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఆడంబరాలకు ప్రజాధనం దుర్విని యోగం అవుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. -
జూదంలో భార్యను పణంగా పెట్టాడు
ఇండోర్: జూదంలో ఓడిపోయిన భర్త తనను ఇద్దరు వ్యక్తులకు అప్పగించటంతో వారు లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగింది. జూదానికి బానిసైన ఓ వ్యక్తి ఓడిపోతే తన భార్యను ఇస్తానని బెట్ కట్టాడు. ఆటలో ఓటమి పాలై అందుకు బదులుగా భార్యను గెలిచిన ఇద్దరికి అప్పగించాడు. దీంతో ఆ ఇద్దరు ఆమెపై అత్యాచారం చేశారు. దీనిపై బాధితురాలు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు ఆమె భర్తతోపాటు వేధింపులకు పాల్పడిన ఇద్దరిని పిలిపించి విచారించారు. ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి కేసు నమోదు చేయలేదని ఇండోర్ మహిళా పోలీస్స్టేషన్ ఇన్చార్జ్ జ్యోతి శర్మ వెల్లడించారు. అయితే, భర్తతో పాటు మిగతా ఇద్దరు కూడా మహిళను వేధిస్తున్నట్లు తమ విచారణలో తేలిందని వివరించారు. -
పరిహారం ‘పాపం’ నిజమే..
-బోగస్ ఐడీ కార్డుల బాగోతాన్ని నిర్ధారించిన అధికారులు -ముంపు మండలాల మీ సేవా కేంద్రాల్లో పీఓ, ఆర్డీఓ తనిఖీలు -కూనవరంలో ఒకటి, వీఆర్ పురంలో రెండు కేంద్రాల సీజ్ కూనవరం (రంపచోడవరం) : పరిహారం కోసం సాగిన మోసకారి వ్యవహారంలో అధికార యంత్రాంగం కదిలింది. ‘పోలవరం’ ముంపు మండలాల్లో బాధితులకు ఇచ్చే పరిహారాన్ని అర్హత లేకున్నా పొందే దురుద్దేశంతోత ఆగమేఘాలపై నకిలీ ఓటరు ఐడీ కార్డులు, ఆధార్ కార్డులు జారీ అవుతున్న బాగోతంపై ‘ఇదో ‘ఐడి’యా’ పేరుతో బుధవారం ‘సాక్షి’లో వచ్చిన కథనంతో చర్యలకు ఉపక్రమించారు. అసలు క్షణాల్లో బోగస్ ఓటరు ఐడీ కార్డులు ఎలా లభ్యమవుతున్నాయనే దానిపై చింతూరు ఐటీడీఏ పీఓ గుగ్గిలి చినబాబు, ఎటపాక ఆర్డీఓ ఎల్లారమ్మ బుధవారం వీఆర్ పురం, కూనవరం మండలాల్లోని మీసేవా కేంద్రాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఓటర్ ఐడీ, ఆధార్కార్డుల నమోదులో ఆయా కేంద్రాలు పలు అవకతవకలకు పాల్పడుతున్న నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో దర్యాప్తు నిర్వహించారు. మీ సేవా కేంద్రాల నిర్వాహకులు పేర్కొన్న అంశాలకు, దరఖాస్తుల పరిశీలనలో కనిపిస్తున్న వాస్తవాలకు పొంతన లేకపోవడంతో వీఆర్ పురంలో రెండు కేంద్రాన్ని, కూనవరంలో ఒక కేంద్రాన్ని సీజ్ చేశారు. ఆ కేంద్రాల నుంచి హోలోగ్రామ్, స్టాంప్లు, తదితర రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ గతంలో పనిచేసిన «అధికారుల పేర్లతో ఉన్న స్టాంపులు వినియోగిస్తున్నారని, భద్రాచలం ఆర్డీఓ పేరుతో పాత తేదీలతో ఉన్న ఓటరు ఐడీ కార్డులు జారీ చేస్తున్నట్లు వెల్లడైందన్నారు. ఆర్డీఓ ఎల్లారమ్మ మాట్లాడుతూ గొమ్ము పొట్లవాయిగూడెంలో వీఆర్ పురం మండలానికి చెందిన మీ సేవా కేంద్రం నిర్వాహకుడు అవకతవకలకు పాల్పడినట్లు తనిఖీల్లో తేలిందన్నారు. ఆధార్ కార్డులు తీసి వెంటనే ఇస్తున్నాడని, వాటితో ఎలాంటి దరఖాస్తు చేసుకున్నా చెల్లుబాటు కాకపోవడంతో నష్టపోయామంటూ కొందరు తనకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అలాగే పైదిగూడెంకు చెందిన కొందరు బాధితులు కూనవరం మీ సేవ నిర్వాహకునిపై కూడా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామాల్లో విచారణ జరిపానని, నివేదికను జాయింట్ కలెక్టర్కు అందజేస్తానని తెలిపారు. కాగా పోలవరం ముంపు మండలాల్లో పరిహారం పొందేందుకు పదేళ్ల క్రితం ఊరు వదిలి వెళ్లిన వారు సైతం తిరిగివచ్చి నకిలీ ఆధార్కార్డులు, ఓటర్ ఐడీ, రేషన్కార్డులు పొందేందుకు మీ సేవా కేంద్రాలను ఆశ్రయించడంతో వాటి నిర్వాహకులు అవకతవకలకు పాల్పడినట్లు విచారణలో తేలడంతోనే అధికారులు ఈ కేంద్రాలపై చర్యలు తీసుకున్నారు. తనిఖీల్లో విఆర్పురం, చింతూరు తహసీల్దార్లు జీవీఎస్ ప్రసాద్, తేజేశ్వరరావు, ఎస్సైలు బి.అజయ్కుమార్, రామకృష్ణ, ఆర్ఐ చలపతిరావు, వీఆర్ఓ వనపర్తి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాగా మరింత లోతుగా విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు బయటపడే అవకాశముందని, దీనివలన అసలైన అర్హులకు మేలు జరుగుతుందని నిర్వాసితులు కోరుతున్నారు. -
ఇదో ‘ఐడి’యా
ముంపు పరిహారం కోసం...ఓటరు కార్డుల పరిహాసం రోజుల వ్యవధిలో ఓటరు ఐడీ కార్డుల జారీ పోలవరం ముంపు పరిహారం కోసం ‘నకిలీ’ సృష్టి టీడీపీ నేతల కనుసన్నల్లో నడుస్తున్న దందా వీఆర్పురం, కూనవరం మండలాల్లోని పలు మీసేవా కేంద్రాల్లో జారీ పరిహారం సొమ్ము కొట్టేందుకు నేతల కుట్ర సాక్షి ప్రతినిధి, కాకినాడ: – ఈ ఓటర్ గుర్తింపు కార్డు చూడండి. వర రామచంద్రపురం మండలం రాజుపేటకు చెందిన ఖండవల్లి శివాజీది. దరఖాస్తు చేసుకున్న రోజుల వ్యవధిలోనే ఓటర్ ఐడీ కార్డు వచ్చేసింది. ఇదొక్కటే కాదు టీసీలో (పుట్టిన తేదీ 2001ఫిబ్రవరి 10) ఉన్న ప్రకారం 18 సంవత్సరాలు నిండలేదు. కానీ...1998 జనవరి ఒకటో తేదీన పుట్టినట్టు చూపించి ఓటర్ ఐడీ కార్డు జారీ చేసేశారు. ఒక్క శివాజీయే కాదు వీఆర్పురం, కూనవరం మండలాల్లోని అనేక మందికి ఈ రకంగా ఓటరు గుర్తింపు కార్డులు జారీ అయిపోయాయి. నిజానికైతే వీటిని నకిలీగా గుర్తించాలి. 18 సంవత్సరాలు నిండితేనే ఓటర్ గుర్తింపు కార్డు ఇవ్వాలి. కానీ ఇక్కడ అనేక మందికి వయస్సు తక్కువ ఉన్నప్పటికీ పుట్టిన తేదీలు మార్చి కార్డులు జారీ చేసేశారు. టీడీపీ నేతల కనుసన్నల్లో కొన్ని మీసేవా కేంద్రాలు ఈ రకమైన కార్డులు జారీ చేసేస్తున్నాయి. పోలవరం ముంపు గ్రామాల పరిహారం కోసం టీడీపీ నేతలు వేసిన ఎత్తుగడ ఇది. . దరఖాస్తు చేసిన ఒక్క రోజులోనే... పోలవరం ముంపు మండలాలైన వీఆర్పురం, కూనవరం మండలాల్లోని మీసేవా కేంద్రాల్లో ఓటర్ ఐడీ కార్డులను బస్పాస్ తరహాలో దరఖాస్తు చేసుకున్న ఒక్కరోజులోనే ఇచ్చేస్తున్నారు. రెవెన్యూ శాఖ ప్రమేయం లేకుండా ఓటర్ ఐడీ కార్డులను దరఖాస్తు చేసుకున్న రోజులోనే ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ మండలాల్లోని పలు గ్రామాలు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో ముంపునకు గురి కానున్నాయి. తొలివిడతగా వీఆర్పురం మండలంలోని పది గ్రామాల్లోను, కూనవరం మండలంలోని ఒక గ్రామంలో ఆర్అండ్ఆర్ సర్వే ప్రక్రియను అధికారులు చేపట్టారు. మిగిలిన గ్రామాల్లో కూడా ఈ సర్వే ప్రక్రియ త్వరలో జరగనుంది. 18 సంవత్సరాలు నిండిన యువతీ,యువకులను ఒక కుటుంబంగా గుర్తించి వారికి కూడా ప్యాకేజీ ఇవ్వనున్నారని ప్రచారం జోరుగా సాగుతున్న నేప«థ్యంలో పలువురు వ్యక్తులు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మార్గంలో డబ్బులు చెల్లించి మీసేవ కేంద్రాల ద్వారా ఓటర్ ఐడీ కార్డులను పొందుతున్నారు. . ఒక్కరోజులోనే కార్డు సిద్ధం... వాస్తవానికి 18 సంవత్సరాలు నిండిన యువతీ,యువకుడు నూతనంగా ఓటు గుర్తింపు కార్డు పొందాలంటే ముందుగా బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్ఓ) వద్ద ఫాం–6 దరఖాస్తు పూర్తి చేసి దానికి ఆధార్కార్డ్, రేషన్ కార్డు జిరాక్స్లతోపాటు చదువుకు సంబంధించి టీసీ జిరాక్స్ను కూడా జతపరచి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తును తహసీల్దార్ పరిశీలిస్తారు. రిమార్క్లు లేకుంటే ఆర్డీఓకు పంపిస్తారు. అక్కడ ఆమోదం పొందిన తర్వాత అనంతరం ఎలక్షన్ కమిషనర్ ఆధ్వర్యంలో దరఖాస్తుదారుడికి ఒక ఓటర్ ఐడీని కేటాయిస్తారు. ఈ ప్రకియకు సుమారు రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుంది. కానీ ఇవేవీ కాకుండా ఇక్కడ కొన్ని మీసేవా కేంద్రాల్లో సుమారు రూ.500 నుంచి రూ.1000 తీసుకుని అక్రమంగా ఓటరు ఐడీ కార్డులు జారీ చేస్తున్నాయి. భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం 18 ఏళ్లు నిండిన యువతీ,యువకులకులు ఓటు హక్కు పొందేందుకు అర్హులు. కానీ వీఆర్పురం, కూనవరం మండలాలకు చెందిన పలువురు 18 ఏళ్లు నిండకపోయినా పోలవరం ప్యాకేజీ వర్తిస్తుందనే అత్యాశతో అక్రమంగా మీసేవా కేంద్రాల ద్వారా ఓటర్ ఐడీ కార్డులు పొందుతున్నారు. టీడీపీ నేతల కనుసైగల్లోనే ఇక్కడంతా జరుగుతోంది. ముఖ్యంగా వీఆర్ పురంలోని టీడీపీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి తన బంధు గణమంతటికీ ఈ రకంగా కార్డులు సమకూర్చినట్టు తెలుస్తోంది. పరిహారం సొమ్మును కొట్టేసేందుకు నేతలు ఈ రకమైన కుట్రకు పాల్పడుతున్నారు. ఆ కార్డులు చెల్లవు. నిబంధనలకు విరుద్ధంగా మీసేవా కేంద్రాల ద్వారా ఓటర్ ఐడీ కార్డులు పొందారని నా దృష్టికి వచ్చింది. రెవెన్యూ శాఖ పరిశీలన లేకుండా ఓటర్ ఐడీ కార్డులు పొందడం నేరం. అక్రమంగా పొందిన కార్డులు ఆన్లైన్లో ఎంటర్ అయ్యే అవకాశం లేదు .ఇవి కేవలం స్థానికంగా సృష్టించినవి మాత్రమే. ఇలా పొందిన కార్డులను కొన్ని గుర్తించడం జరిగింది వాటిపై విచారణ చేపడుతున్నాం. బాధ్యులైన వారిపై చర్యలు చేపడతాం –జీవీఎస్ ప్రసాద్ ,తహసీల్దార్, వీఆర్పురం. -
పేకాట ఆడుతూ పట్టుబడ్డ ఆర్డీవో
ఖమ్మం: ఓ వైపు పేకాటపై సీఎం కేసీఆర్ ఉక్కుపాదం మోపుతుండగా.. మరో వైపు ప్రభుత్వ జీతం తీసుకుంటున్న అధికారులే యధేచ్చగా పేకాట ఆడుతున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెర్వుమాదారం సమీపంలో ఓ ఆర్డీవో ఇద్దరు డీటీలు, ఒక రెవెన్యూ ఇన్స్ పెక్టర్ పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. వీరంతా సదరు ఆర్డీవో ఫాంహౌస్ లో పేకాట ఆడుతుండగా సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. అయితే అధికారులు పట్టుబడ్డ విషయం బయటకి రాకుండా మేనేజ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘క్యాష్లెస్’ కాస్త ఖరీదే!!
డిజిటల్ చెల్లింపుల్లో పెరుగుతున్న సమస్యలు • కార్డులు, వాలెట్లు, నెట్ బ్యాంకింగ్కు చార్జీలు • కార్డులపై చెల్లింపులకు ఏకంగా 2 శాతంపైనే • వాలెట్లో డబ్బులు వెనక్కి తీసుకోవాలంటే తంటా • నెట్ సహా అన్ని లావాదేవీల్లో వైఫల్యాలు • ట్రాన్సాక్షన్ పూర్తి కాదు.. ఖాతాలో డబ్బులేమో మాయం • ఎక్కడికి వెళ్లాయో అర్థమవ్వదు;ఎవరినీ సంప్రదించాలో తెలీదు • కొత్త మాధ్యమాలకు కరవైన నిబంధనలు • సామాజిక మాధ్యమాలను ఆశ్రయించాలంటున్న నిపుణులు నిజం!! ఇది డిజిటల్ యుగం. మీడియా నుంచి ఆర్థిక లావాదేవీల దాకా అన్నీ డిజిటల్ మయమే. అందుకే ప్రభుత్వం కూడా చలామణిలో ఉన్న కరెన్సీని ఒక్కసారిగా రద్దు చేసి డిజిటల్ లావాదేవీల ప్రచారం మొదలుపెట్టింది. కరెన్సీ పెద్దగా అందుబాటులో లేదు కనక జనం కూడా విధిలేక డిజిటల్ లావాదేవీల వైపు అడుగులేస్తున్నారు. కాకపోతే ఇంకా చాలామందికి మొబైల్ వాలెట్లు వాడేదెలా? దానికి చార్జీలేమైనా అవుతాయా? ఇంటర్ నెట్లో బ్యాంకింగ్ లావాదేవీలు ఎలా చేయాలి? ఒకవేళ మధ్యలో ఫెయిలైతే పరిస్థితేంటి? కార్డుల ద్వారా ఎవరికైనా చెల్లింపులు చేయొచ్చా? చార్జీలేమైనా భరించాల్సి ఉంటుందా? ఇలాంటి సందేహాలు చాలానే ఉన్నాయి. వాటన్నిటికీ సమాధానమే ఈ వారం ప్రాఫిట్ ప్రధాన కథనం... మొబైల్లోనే ఉంటుంది మీ వాలెట్... సుజన ఆన్లైన్లో మొబైల్ ఫోన్ కొంటూ... మొబైల్ వాలెట్తో చెల్లించింది. లావాదేవీ పూర్తయినట్లు వాలెట్ ప్రొవైడర్ నుంచి సుజనకు మెయిల్ వచ్చింది. ఆన్లైన్ రిటైలర్ మాత్రం తనకు పేమెంట్ అందలేదన్నాడు. కాబట్టి ఫోన్ పంపలేదు. ఒక వారం గడిచింది. అయినా సుజన డబ్బులు ఆమె ఖాతాలోకి రాలేదు. ఎవరికి చెప్పాలన్నది ఆమెకు తెలియలేదు. ఏం చేయాలంటే..! పేటీఎం సహా చాలా వాలెట్లు ఫిర్యాదులు తీసుకోవటానికి ఫోన్ నెంబరేమీ ఇవ్వటం లేదు. యాప్ లేదా వెబ్సైట్ ద్వారా మెయిల్ పంపటానికి మాత్రం అవకాశం ఇస్తున్నాయి. అంటే... మనం గట్టిగా ఎవరినీ అడగటానికి లేదు. మెయిల్ ఇవ్వటం... సమాధానం వచ్చేదాకా చూడటం.... అంతే చేయగలిగింది. అయితే చాలా వరకూ మెయిళ్లకు ఈ సంస్థలు స్పందించి లావాదేవీల్ని పరిష్కరిస్తున్నాయి. ‘‘లావాదేవీలు నిర్వహించే మాధ్యమాన్ని బట్టి లావాదేవీ సెటిల్మెంట్ ఉంటుంది. కొన్ని సార్లు ట్రాన్సాక్షన్లు ఫెయిలవుతాయి. ఇలాంటపుడు ఆ లావాదేవీ మొత్తం తిరిగి మనకు చేరడానికి కొన్ని సెకన్ల నుంచి ఏడు పనిదినాల సమయం పట్టొచ్చు. ఇంకా ఎక్కువ సమయం పడితే.. అపుడు ఆ డబ్బులు పూల్ అకౌంట్లో ఉంటాయి. వాలెట్స్/ బ్యాంకులు.. పేమెంట్ నెట్వర్క్ ప్రొవైడర్తో కలిసి ఈ అకౌంట్లను నిర్వహిస్తాయి’’ అని పేయూ ఇండి యా సర్వీస్ డెలివరీ హెడ్ హరి వేలాయుధన్ చెప్పారు. వాలెట్లు ఎలా వాడాలి? పేటీఎం, మొబిక్విక్, ఆక్సిజన్, ఫోన్పే, స్వైపే... ఇలా రకరకాల మొబైల్ వాలెట్లు అందుబాటులో ఉన్నాయి. దేని ప్రయోజనాలు దానివి. దేని నష్టాలు దానివి. ఎందుకంటే అన్ని వాలెట్లూ అన్ని లావాదేవీలకూ వాడలేం. ఉదాహరణకు మనం ఒక దుకాణంలో పేటీఎం ద్వారా చెల్లించాలని భావిస్తే... సదరు దుకాణదారుడు కూడా పేటీఎం వాడుతుండాలి. తను వేరే వాలెట్ వాడితే కుదరదు. వీటిని వాడాలనుకున్న వారు మొబైల్ ఫోన్లో ఆండ్రాయిడ్ లేదా యాపిల్ ప్లే స్టోర్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. మన వివరాలతో రిజిస్టర్ చేసుకుని... మనకున్న ఆన్లైన్ బ్యాంకు ఖాతా నుంచో, లేకపోతే క్రెడిట్/డెబిట్ కార్డు నుంచో దీన్లో డబ్బులు వేయాలి. అప్పటి నుంచి వాడటం మొదలుపెట్టొచ్చు. చార్జీలెలా ఉంటాయంటే... వాలెట్లలో ఉన్న ప్రస్తుతం చాలా వాలెట్లు మనం లావాదేవీలు చేసేటపుడు ఎలాంటి చార్జీలూ వసూలు చేయటం లేదు. కాకపోతే వాలెట్లో డబ్బులు వేసేటపుడు మన బ్యాంకులు మాత్రం లావాదేవీ చార్జీ తీసుకుంటున్నాయి. ఒకవేళ మనం వాలెట్లో ఉన్న డబ్బుల్ని బ్యాంకు ఖాతాలో వేసుకోవాలన్నా ఇవి 1–4 శాతం మధ్య చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఇవన్నీ గమనించి వాడాల్సి ఉంటుంది. మీ బ్యాంకంతా... ఇంటర్నెట్లోనే రాజేష్ తన బ్యాంకు ఖాతా నుంచి మొబైల్ వాలెట్కు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా డబ్బు బదిలీ చేశాడు. బ్యాంకు ఖాతా నుంచి డబ్బు వెళ్లింది. కానీ వాలెట్లో జమ కాలేదు. ఎందుకిలా? బ్యాంకును ఫోన్లో సంప్రదించాడు. ‘‘సర్! ఇది రెండంచెల వ్యవస్థ. రెండింటి మధ్య పేమెంట్ గేట్వే ఉంటుంది. ఇది బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు తీసుకొని.. దాన్ని వాలెట్లో జమ చేస్తుంది. గేట్వేకు చేరక ముందే లావాదేవీ ఫెయిలయి ఉండొచ్చు. సర్వర్ పనిచేయకపోవడం, నెట్వర్క్ సమస్యలు ఉండొచ్చు. గేట్వే కంపెనీలు బ్యాంకులతో రోజూ లావాదేవీలను సెటిల్ చేస్తాయి. ఇది జరిగి మీ ఖాతాలోకి డబ్బులు రావటానికి 1–2 పనిదినాలు పట్టొచ్చు’’ అని బ్యాంకు ఎగ్జిక్యూటివ్ వివరించాడు. ఒకవేళ పేమెంట్ గేట్వే డబ్బుల్ని తీసుకున్నాక లావాదేవీ ఫెయిలైతే ఆ డబ్బులు వాలెట్కు చేరుతాయి. అదీ కథ. ‘‘నిజమే! వాలెట్ నుంచి బ్యాంక్కు డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేసేటపుడు ఎక్కువ సమస్యలొస్తున్నాయి’’ అని పేటీఎం సీనియర్ వైస్ప్రెసిడెంట్ దీపక్ అబాట్ చెప్పారు. ‘‘బ్యాంకుల్లో రద్దీ వల్ల రిఫండ్ ఆలస్యం కావొచ్చు. మేం వాటికి రెఫరెన్స్ నంబర్ను పంపిస్తాం. బ్యాంకులో జరిగే ప్రక్రియతో మాకెలాంటి సంబంధం ఉండదు. మా దగ్గరకొచ్చిన కస్టమర్లకు ఏం చేయాలో సూచనలు మాత్రమే ఇవ్వగలం’’ అని వివరించారాయన. నెట్బ్యాంకింగ్ చేసేదెలా? ఇంటర్ నెట్ బ్యాంకింగ్ చేయడానికి మీకు మొదట బ్యాంకు ఖాతా ఉండాలి. తరవాత బ్యాంకు బ్రాంచిలో సంప్రదిస్తే వారు చిన్న దరఖాస్తు తీసుకుని నెట్బ్యాంకింగ్ ఐడీ ఇస్తారు. పాస్వర్డ్ను పోస్ట్లో పంపిస్తారు. ఈ ఐడీ, పాస్వర్డ్ సాయంతో నెట్బ్యాంకింగ్ లావాదేవీలు చేయొచ్చు. ఈ నెట్బ్యాంకింగ్ ద్వారా బిల్లులు చెల్లించటంతో పాటు, ఇతరుల బ్యాంకు ఖాతాలకు, మొబైల్ వాలెట్లకు డబ్బులు బదిలీ చేయొచ్చు. ఇపుడు ప్రతి బ్యాంకూ మొబైల్ యాప్లు తెచ్చింది. మొబైల్ యాప్ ద్వారానే నెట్బ్యాంకింగ్ లావాదేవీలన్నీ జరుపుకోవచ్చు. వాలెట్లతో పోలిస్తే వీటికి భద్రత ఎక్కువ. చార్జీలూ తక్కువ. చార్జీలూ ఉంటాయి... ఇతరుల ఖాతాల్లోకి డబ్బులు బదిలీ చేయాలంటే వారిని మీ పేయీలుగా జత చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్నాక... ఇమీడియెట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్)తో పాటు నెఫ్ట్, ఆర్టీజీఎస్ ద్వారా డబ్బులు బదిలీ చేయొచ్చు. ప్రతి లావాదేవీకీ కొంత చార్జీ ఉంటుంది. ఇది రూ.2–5 మధ్య ఉంటుంది. ఎక్కువ మొత్తాలకైతే ఆర్టీజీఎస్, తక్కువ మొత్తాలకైతే నెఫ్ట్, తక్షణం (సెకన్లలో) డబ్బు బదిలీ కావాలంటే ఐఎంపీఎస్ వాడాలి. ఐఎంపీఎస్కు కాస్త ఎక్కువగా రూ.5 వరకూ చార్జీలవుతాయి. కార్డు వాడొచ్చు... కానీ చార్జీలుంటాయ్ సౌమ్య ఓ షాపులో సరుకులు కొని డెబిట్ కార్డుతో చెల్లించబోయింది. స్వైప్ చేశాక.. కాసేపటికి ట్రాన్సాక్షన్ తిరస్కరణకు గురైనట్లు అక్కడ మెసేజీ కనిపించింది. కానీ మొబైల్కు మాత్రం బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. బ్యాంకును సంప్రదిస్తే... ఆ డబ్బులు తిరిగి వస్తాయని, కంగారు పడొద్దని చెప్పారు. కంగారు సంగతి సరే! ముందు దుకాణదారుకు చెల్లించటానికి డబ్బులుండాలి కదా!! అనుకుంది. స్నేహితుల సాయంతో పని పూర్తిచేసింది. కార్డులు వాడటమెలా? నిజానికి ప్రభుత్వమిపుడు కరెన్సీని తగ్గించి డిజిటల్ లావాదేవీల్ని ప్రోత్సహిస్తోంది. నెట్బ్యాంకింగ్, మొబైల్ వాలెట్ల వంటివి కాస్త ఇంటర్నెట్ పరిజ్ఞానం ఉన్నవారికే కాగా... అందరికీ చేతనైనది కార్డుల వాడకమే. ఎందుకంటే దేశంలో చాలా కుటుంబాలకు బ్యాంకు ఖాతాలున్నాయి. వారికి డెబిట్ కార్డులూ ఉన్నాయి. కొందరికైతే క్రెడిట్ కార్డులుంటాయి. షాపుల్లో చెల్లింపులకు కార్డులు వాడొచ్చు. ఇంటర్నెట్లో కూడా ఈ కార్డుల ద్వారా లావాదేవీలు జరపొచ్చు. ఈ కార్డుల వాడకానికి కావాల్సిన పిన్ నంబరును బ్యాంకులే ఇస్తాయి. చార్జీలతో జాగ్రత్త! డిజిటల్ లావాదేవీల్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం... డిజిటల్ లావాదేవీలు జరిపేవారిపై చార్జీలను కూడా బాదుతుండటం గమనార్హం. కార్డుల ద్వారా చెల్లింపులు స్వీకరించే ప్రతి వ్యాపారీ... చివరికి అలా స్వీకరించిన డబ్బును తన బ్యాంకు ఖాతాలోకి తెచ్చుకోవాల్సి ఉంటుంది. అలా బ్యాంకు ఖాతాలోకి డబ్బులు తీసుకునేటపుడు బ్యాంకులు 2 నుంచి 4 శాతం చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఇవన్నీ తామెందుకు భరించాలని భావిస్తున్న వ్యాపారులు.... ఆ చార్జీల్ని కూడా కస్టమర్లపైనే వేస్తున్నారు. వీటిని భరించటమెందుకని భావిస్తున్న కస్టమర్లు... కార్డు బదులు నగదు ఇవ్వటానికే మొగ్గు చూపుతున్నారు. ఇదంతా ఒక గొలుసు వ్యవస్థ. ఇటీవలే పెట్రోలు బంకులు ఈ విషయంపై సమ్మె చేశాయి. తమను కస్టమర్ల నుంచి చార్జీలు వసూలు చేయొద్దని చెబుతూ... తమ వద్ద నుంచి మాత్రం బ్యాంకులు చార్జీలు వసూలు చేస్తుండటాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. సమ్మె చేస్తామన్నారు. కార్డులు తీసుకోకూడదని కూడా ఒక దశలో నిర్ణయించారు. చివరికి ప్రభుత్వం జోక్యం చేసుకుని కొంత గడువు అడగటంతో వెనక్కి తగ్గారు. నిజానికిది ఒక్క పెట్రోలు బంకుల సమస్య మాత్రమే కాదు. కార్డుల్ని స్వీకరించే వారందరి సమస్య. కొన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు ఎలాంటి లావాదేవీలూ లేని లైఫ్టైమ్ ఫ్రీ కార్డులు జారీ చేస్తున్నాయి. కానీ తమకు చార్జీలవుతున్నాయి కాబట్టి వ్యాపారులు ఈ కార్డుదారుల నుంచి కూడా చార్జీలు వసూలు చేస్తున్నారు. ఇది 4 శాతం వరకూ ఉండటంతో కస్టమర్లు గగ్గోలు పెడుతున్నారు. మనలో ఆ సత్తా ఉందా? వాలెట్లెలా వాడాలి? కార్డులెలా వాడాలి? నెట్ బ్యాంకింగ్ ఎలా చేయాలి? చార్జీలెంత? అనే విషయాలన్నీ పక్కనబెడితే... ఆసలు డిజిటల్ లావాదేవీల్ని ప్రోత్సహించే వ్యవస్థ మన దగ్గర ఉందా? అన్నది మరో ప్రశ్న. ఎందుకంటే డిజిటల్ లావాదేవీల్లో ఫెయిలవటం సాధారణంగా మారిపోయింది. ఇక మోసగాళ్ల సంగతి సరేసరి. అనుక్షణం అప్రమత్తంగా లేకపోతే ఖాతాలో డబ్బులు మాయం. పైపెచ్చు కొత్తగా వస్తున్న డిజిటల్ మాధ్యమాలకు సరైన నిబంధనలు కూడా లేవు. ఉదాహరణకు డబ్బులు తీసుకెళ్లడానికి ఏటీఎంకు వెళతాం. అక్కడ డబ్బులు రావు. కానీ డబ్బులు కట్ అయినట్లు మన మొబైల్కి మేసేజ్ మాత్రం వస్తుంది. తర్వాత మళ్లీ మన ఖాతాలో ఆ డబ్బులు జమవుతాయి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు.. సమస్య పరిష్కారానికి ఆర్బీఐ కొన్ని నిబంధనలు పెట్టింది. ఏటీఎంలో డబ్బులు రాకుండా, మన అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయితే.. ఈ విషయాన్ని బ్యాంకుకు ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు అందిన ఏడు పనిదినాల్లో బ్యాంకులు ఆ సమస్యలను పరిష్కరించాలి. లేకుంటే అవి రోజుకు రూ.100 జరిమానా భరించాలి. కానీ వాలెట్స్, యూపీఐ వంటి కొత్త పేమెంట్ చెల్లింపు మాధ్యమాలకు వచ్చేసరికి ఇలాంటి నిబంధనలు లేవు. లావాదేవీలకు, ఉద్యోగుల సంఖ్యకు పొంతన లేదు.. ‘‘పెద్ద నోట్ల రద్దు తరవాత లావాదేవీల పరిమాణం 10 రెట్లు పెరిగింది. కానీ ఉద్యోగుల సంఖ్య మాత్రం 1.5–2 రెట్లే పెరిగింది. అందుకే ఫెయిలైన లావాదేవీల పరిష్కారానికి కొన్ని సంస్థలు ఎక్కువ రోజుల సమయం తీసుకోవచ్చు’ అని మొబిక్విక్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) ఆకాశ్ గుప్తా చెప్పారు. వాలెట్ సంస్థలు వారి సిబ్బందిని వేగంగానే పెంచుకుంటున్నాయని తెలియజేశారు. ‘నవంబర్కు ముందు మొబిక్విక్లో 160 మంది ఉద్యోగులు ఉన్నారు. మార్చి చివరి నాటికి వీరి సంఖ్య 1,000కి చేరొచ్చు’ అని తెలిపారు. సోషల్ మీడియాను వాడేసుకోవచ్చు... లావాదేవీ ఫెయిలయ్యాక రెండు నుంచి ఏడు రోజుల్లోగా రిఫండ్ రాకపోతే.. వెంటనే వాలెట్ సర్వీస్ ప్రొవైడర్ను సంప్రదించాలి. మీకు వచ్చిన రెస్పాన్స్ సంతృప్తికరంగా లేకపోతే ఇంకా గట్టిగా ప్రయత్నించండి. ప్రతి వాలెట్ సంస్థ వాటి వెబ్సైట్లో సమస్య పరిష్కారపు నిబంధనలను పొందుపరిచే ఉంటుంది. అక్కడ సంబంధిత అధికారుల వివరాలు ఉంటాయి. వారిని సంప్రదించాలి. ‘‘చిట్టచివరిగా గ్రీవెన్స్ అధికారి వద్ద సమస్య కచ్చితంగా పరిష్కారమవ్వాలి. అక్కడా కాకపోతే మీరు ఆర్బీఐ గ్రీవెన్స్ సెల్ను సంప్రదించొచ్చు’ అని ఫ్రీచార్జ్ అధికార ప్రతినిధి చెప్పారు. సమస్యను బ్యాంక్ లేదా వాలెట్ సోషల్ మీడియా పేజ్లో పోస్ట్ చేస్తే త్వరగా పరిష్కారం కావచ్చని చిల్లర్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ చెప్పారు. ‘సంస్థలు వారి సోషల్ మీడియా ఇమేజ్కు అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. మీ సమస్య ఏడు రోజులు దాటినా కూడా తీరకపోతే.. అప్పుడు మీరు ఆయా సంస్థల సోషల్ మీడియా పేజ్లను వాడుకోండి’ అని సూచించారు. – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం -
ప్రతి ఒక్కరికీ ‘ఇ–మనీ’ కార్డులు
ఏలూరు (మెట్రో) : జిల్లాలో నగదురహిత లావాదేవీల్లో భాగంగా ‘ఇ–మనీ ఈజ్మై మనీ’ కార్డులను అందచేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్టు ఏలూరు ఆర్డీవో నంబూరి తేజ్భరత్ చెప్పారు. కలెక్టరేట్లో బుధవారం నగదురహిత లావాదేవీలపై పెట్రోల్, గ్యాస్ కంపెనీల డీలర్లతో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నగదురహిత లావాదేవీల్లో జిల్లా దేశానికే ఆదర్శంగా నిలిచేలా వినూత్న విధానాన్ని ప్రవేశపెట్టనున్నామని చెప్పారు. జిల్లాలో 18 ఏళ్లు నిండి బ్యాంక్ ఖాతా లేని వారికి ఖాతాలు ప్రారంభింపచేయడంతో పాటు, ప్రతి ఒక్కరికీ ‘ఇ–మనీ ఈజ్మై మనీ’ కార్డులను అందిస్తామన్నారు. ఈ కార్డులో వ్యక్తి పేరు, ఎంఎంఐడీ, మొబైల్ నెంబర్, వర్చ్యువల్ ఐడీ, క్యూఆర్ కోడ్, బ్యాంకు అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్ వివరాలు ఉంటాయన్నారు. స్మార్ట్ ఫోన్ లేకపోయినా, ఇంటర్నేట్ లేకపోయినా కార్డును ఉపయోగించి ఎంఎంఐడీ విధానం ద్వారా నగదు రహిత లావాదేవీలను భద్రతతో నిర్వహించుకోవచ్చన్నారు. టెక్నాలజీ వినియోగం ప్రారంభంలో కొంత ఇబ్బందిగా ఉన్నా భవిష్యత్లో సులభంగా మారుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి సయ్యద్ యాసిస్, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎం.సుబ్రహ్మణ్యేశ్వరరావు, నిక్నెట్ సైంటిస్ట్ శర్మ, భారత పెట్రోలియం సేల్స్ అధికారి ప్రవీణ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ అధికారి దుర్గాప్రసాద్, గ్యాస్, పెట్రోలు డీలర్లు పాల్గొన్నారు. -
2022 నాటికి వాటి అవసరమే ఉండదట!
న్యూఢిల్లీ: డిజిటల్ లావాదేవాలకు లభిస్తున్న ప్రోత్సాహం నేపథ్యంలో రానున్నకాలంలో ఏటీఎం కార్డులు, మెషీన్లకు ఇక కాలం చెల్లినట్టేనట. పెద్ద నోట్ల రద్దు తరువాత, 2022 నాటికి ఏటీఎంకార్డులు, పీఓఎస్ మెషీన్ల అవసరం ఉండదని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ అభిప్రాయపడ్డారు. యూత్ ప్రవాసీ భారతీయ దివస్ 2017లో బాగంగా నిర్వహించిన సెషన్లో ప్రసంగించిన కాంత్, ప్రతి భారతీయుడూ కేవలం తన బొటనవేలిని, మొబైల్ ఫోన్ ద్వారా అన్ని లావాదేవీలు జరుపుతున్న నేపథ్యంలో ఇక కార్డులు వ్యర్థంగా మారిపోతాయని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల, డిజిటల్ చెల్లింపులు భారీ స్థాయిలో జరుగుతాయని, ప్రపంచంలోనే వందకోట్ల (బిలియన్) మొబైల్ కనెక్షన్లు, వందకోట్ల బయోమెట్రిక్లను కలిగిన ఏకైక దేశంగా భారత్ అవతరించిందని కాంత్ పేర్కొన్నారు. ఇటీవల విడుదల భీమ్ యాప్ , ఆధార్ ఆధారిత సేవలను గుర్తు చేశారు. సాంకేతికంగా శరవేగంగా జరుగుతున్న మార్పులు, డిజిటల్ చెల్లింపుల పురోగతి కారణంగా మరో మూడేళ్లలోనే భారత్లో ఏటీఎంలు, క్రిడిట్ కార్టులు అదృశ్యం కానున్నాయని చెప్పారు. ద్రవ్య సాంకేతికత మరియు సామాజిక ఆవిష్కరణల పరంగా భారత్ శరవేగంగా మార్పులకు గురికానుందని, ఈ నేపథ్యంలో వచ్చే రెండున్నరేళ్ల కాలంలోనే భారత్లో డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, ఏటీఎంలు, పీఓఎస్ మెషీన్లు దండగే అని చెప్పారు. ఆదార్ కార్డ్ ఆధారిత టెక్నాలజీ వల్ల ప్రతి లావాదేవీ కూడా కేవలం 30 సెకన్లలో పూర్తవుతుందన్నారు. దేశంలోఇంతవరకు 85శాతం లావాదేవీలు నగదు రూపంలో జరుగుతుండగా, దేశంలో అతికొద్దిమంది మాత్రమే పన్నులు చెల్లిస్తున్నారని అందుకే డిజిటల్ లావాదేవీలు, నియత ఆర్థిక వ్యవస్థను రూపొందిం చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చట్టబద్ధంగా రెండు లక్షల కో్ట్ల డాలర్లు చలామణిలో ఉంటూ మరొక లక్ష కోట్ల డాలర్లు అనియతరంగంలో నల్ధ ఆర్థిక వ్యవస్థగా ఉంటున్న స్థితిలో భారత్ పది లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలంటే అసాధ్యమన్నారు. ఇలాంటి నేపథ్యంలో భారత్ అభివృద్ధి చెందడమే సాధ్యం కాదని చెప్పారు. వ్యాపార సరళీకరణలో ప్రభుత్వం చేపట్టిన వివిధ సంస్కరణలు ఎఫ్ డీఐ వృద్ధికి దారితీసిందన్నారు. దేశంలో ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారానికి, ఉద్యోగ సృష్టిలో ప్రభుత్వ కృషిని ఆయన నొక్కి చెప్పారు. యూరోప్, అమెరికాలో జనాభా పెద్దవాళ్ల సంఖ్య పెరుగుతోంటే, మనదేశంలో మాత్రం యువత సంఖ్య బాగాపెరుగుతూ ఉండడం అతిపెద్ద సాంఘిక, ఆర్థిక అద్భుతమని చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లో నెలకొన్న సంక్లిష్ట పరిస్థితుల్లోనూ భారత్ వృద్ధి రేటు 7.6 శాతంతో కొనసాగడం గమనించాలన్నారు. అభివృద్ధిలో కుంటుపడిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఇప్పటికీ ఒయాసిస్గానే ఉందని నీతి అయోగ్ సీఈఓ అభిప్రాయపడ్డారు. -
హ్యాకింగ్కు గురై నేనే డబ్బులు కోల్పోయాను
-
డిజిటల్ లావాదేవిలపై ఫిర్యాదుల వెల్లువ
-
చేతులెత్తేశారు!
‘ఎక్కడి నుంచైనా రేషన్ సరుకులకు’ బ్రేక్ - కార్పొరేషన్ పరిధిలో రేషన్ షాపు నిర్వాహకుల ససేమిరా - కోటా కార్డులకే సరుకులిస్తామని స్పష్టం - ఇతరులకు ఇవ్వలేమని తేల్చిన వైనం - వలస కుటుంబాలకు తప్పని అవస్థలు - 28 షాపులకు అధిక రేషన్ కోటా ఇవ్వండి - ప్రభుత్వాన్ని కోరిన జిల్లా జాయింట్ కలెక్టర్ సాక్షి ప్రతినిధి, కర్నూలు: రేషన్ సరుకులు ఏ రేషన్ దుకాణంలోనైనా తీసుకునేందుకు ఉద్దేశించిన ఈ–పాస్ విధానం అమలుకు బ్రేక్ పడుతోంది. నిర్ణీత కోటా కార్దుదారులకు మించి రేషన్ కోసం ఇతర ప్రాంతాల వారు వస్తుండటంతో తమ పరిధిలోని కార్డుదారులకు చివరకు సరుకులు లేకుండా పోతున్నాయని కొద్ది మంది రేషన్షాపు యాజమాన్యాలు వాపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరి పరిధిలోని కార్డుదారులకు వారే రేషన్ ఇవ్వాలని... వేరే షాపునకు వస్తే సరుకులు ఇవ్వమని తేల్చి చెప్పేందుకు రేషన్షాపు యాజమాన్యాలు నిర్ణయించాయి. వాస్తవానికి ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఈ–పాస్ విధానంలో కుటుంబంలోని సభ్యులు ఎవరైనా వేలిముద్రలు వేసి రాష్ట్రంలోని ఏ రేషన్షాపు నుంచైనా రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పించారు. అయితే, తాజాగా రేషన్షాపు యాజమాన్యాలు తీసుకున్న నిర్ణయంతో ఎక్కడైనా రేషన్ విధానానికి బ్రేకులు పడనున్నాయి. ఈ నేపథ్యంలో కార్డుదారుల అధిక రద్దీ ఉన్న షాపులకు అదనపు కోటా సరుకులను ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్(జేసీ) సీహెచ్ హరికిరణ్ కోరారు. మా కార్డులకే రేషన్ జిల్లాలో 11 లక్షల 52 వేలకుపైగా రేషన్కార్డులు ఉన్నాయి. ఈ కార్డుదారులకు రేషన్ సరుకులను సరఫరా చేసేందుకు వీలుగా 2,414 రేషన్ షాపులు ఉన్నాయి. ఈ–పాస్ విధానం అమలుతో జిల్లాలో ఏ కార్డుదారైనా ఎక్కడైనా రేషన్ తీసుకునే వెసులుబాటు కలిగింది. గ్రామాల్లో రేషన్కార్డులు ఉండే అనేక మంది కూలీ కోసం పొట్టచేతబట్టుకుని కర్నూలు నగరానికి వచ్చి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ–పాస్ విధానం అమలుతో ప్రధానంగా బతికేందుకు వలస వచ్చిన కుటుంబాలు తాము పనిచేస్తున్న ప్రాంతాల్లో ఉండే షాపులల్లోనే రేషన్ సరుకులను తీసుకుంటున్నారు. అయితే, వీరు ముందుగానే రేషన్ సరుకులు తీసుకోవడంతో ఆ షాపు పరిధిలో ఉండే కార్డుదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీరికి సరుకులు కాస్తా మిగలడం లేదు. ఫలితంగా వీరు రేషన్షాపు డీలర్లతో వాదనకు దిగుతున్నారు. ప్రధానంగా కార్పొరేషన్ పరిధిలోని 28 రేషన్షాపులల్లో ఈ సమస్య ప్రధానంగా ఉంది. దీంతో వీటికి అదనపు కోటా రేషన్ సరుకులను ఇవ్వాలని ప్రభుత్వాన్ని జేసీ కోరారు. అదనపు కోటా ఇవ్వండి ప్రధానంగా కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని 28 షాపుల్లో సరఫరా చేసిన కోటాకు మించి రేషన్దారులు సరుకుల కోసం వస్తున్నారని అధికారులు లెక్క తేల్చారు. గత మూడు నెలల కాలాన్ని పరిగణలోనికి తీసుకుని ఎక్కడైతే కార్డులకు మించి సరుకులు కావాలనే డిమాండ్ ఉందో.. అలాంటి షాపులను గుర్తించారు. ఈ విధంగా ఎంపిక చేసిన 28 రేషన్ షాపులకు అదనపు కోటా సబ్సిడీ సరుకులకు సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్(జేసీ) సీహెచ్ హరికిరణ్ పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులకు తాజాగా లేఖ రాశారు. ఇందుకు ప్రభుత్వం స్పందించి అదనపు కోటా సరఫరా చేస్తే ఈ–పాస్ విధానం అమలుకు ఇబ్బంది తలెత్తకుండా ఉండే అవకాశం ఉంది. లేనిపక్షంలో ఎక్కడి నుంచైనా రేషన్ సరుకులకు తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన ఈ–పాస్ విధానం అమలుపై నీలినీడలు కమ్ముకోనున్నాయి. ప్రభుత్వాన్ని కోరాం జిల్లాలో కొన్ని రేషన్షాపుల వద్ద ఈ–పాస్ విధానంలో ఇతర ప్రాంతాలకు చెందిన వారు రేషన్ సరుకులను తీసుకుంటున్నారు. దీంతో ఆయా షాపుల పరిధిలోని కార్డుదారులు డీలర్లతో వాగ్వాదానికి దిగుతున్నారని సమాచారం అందింది. అందువల్ల ఈ విధంగా సమస్యలున్న 28 రేషన్షాపులకు అదనపు కోటా సరుకులను సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని కోరాం. అనుమతి వచ్చిన వెంటనే ఇబ్బందులు లేకుండా చూస్తాం. – హరికిరణ్, జాయింట్ కలెక్టర్ -
ముక్క కలిపితే కోట్లు రాలాల్సిందే..
– రైజింగ్లో అధికార పార్టీ నేత – తాజాగా రూ.3 కోట్ల గెలుపు – రూ.కోటి పోగొట్టుకున్న ముఖ్య నేత సోదరుడు? – కర్నూలు, శివారు ప్రాంతాల్లో ఆట – హోటళ్లు, తోటలే అడ్డా ఆ నేత పేక ముక్కలు కలిపితే.. అవతలి వ్యక్తి చిత్తవ్వాల్సిందే. కోరుకున్న ముక్కలు కూడబలుక్కున్నట్లు ఆయన చేతిలో ఒదిగిపోతుంటే.. ‘ఆసు’కవిత్వం కోట్లు రాలుస్తోంది. శివారు తోటలు.. నగర హోటళ్లు ఈ ఆటకు దాసోహం కాగా, నేతల నోట ఈ రైజింగ్ హ్యాండ్ చర్చనీయాంశంగా మారింది. ఇంకేముంది.. విదేశీయానాలు, ఖరీదయిన పార్టీలకు ఈ పేకాట ‘కింగ్’ పెట్టింది పేరు. సాక్షి ప్రతినిధి, కర్నూలు: బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అధికార పార్టీ నేత పేకాట జోరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ మధ్యకాలంలో ఏకంగా రూ.3 కోట్లు గెలుచుకున్నట్టు సమాచారం. ఇందులో ముఖ్యనేత సోదరుడివే కోటి రూపాయలు ఉన్నట్టు తెలిసింది. గతంలో కూడా నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఆడిన ఆటలో సదరు నేత ఏకంగా రూ.70 లక్షలు గెలుచుకున్నారు. ఈ డబ్బుతోనే భారీగా పాణ్యం నియోజకవర్గంలో పార్టీ చేసుకున్నారనే గుసగుసలు అప్పట్లోనే వచ్చాయి. మరోవైపు ఊహించనిస్థాయిలో వస్తున్న ఆదాయంతో విదేశీయానాలు కూడా బాగానే చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అన్నను ఆడించావో.. వాస్తవానికి ఈ పేకాటలో జిల్లాలోని అధికార పార్టీ నేతలందరూ పాలుపంచుకుంటున్నట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది. భారీగా కోట్లలో జరుగుతున్న ఈ దందా నగరం చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న తోటలతో పాటు కర్నూలులోని పెద్ద పెద్ద హోటళ్లలోనూ సాగుతోందని సమాచారం. ఇందులో వేల రూపాయలతో ఒక్కో ఆట సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యనేత సోదరుడు కూడా ఆటలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ఏకంగా కోటి రూపాయలు పోగొట్టుకున్నారని సమాచారం. ఈ విషయం తెలిసిన మరో సోదరుడు.. తన అన్నతో ఆడితే ఖబడ్దార్ అంటూ రూ.3 కోట్లు గెలుచుకున్న మరో నాయకుడిని బెదిరించారు. మరోసారి అన్నతో ఆడినట్టు తెలిస్తే మంచిది కాదని హెచ్చరికలు కూడా జారీచేశారు. అసలు ఆదాయం కంటే.. పేకాటలో రైజింగ్ హ్యాండ్లో ఉండి భారీగా సంపాదిస్తున్న సదరు నేత వాస్తవానికి ప్రస్తుతం ఉన్న పోస్టు కోసం కోట్లలోనే ఖర్చు చేశారు. ఈ పోస్టు వచ్చినప్పటికీ అంతో ఇంతో పర్సెంటేజీలు తీసుకుంటూ పనులు చేస్తున్నప్పటికీ ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటోంది. ఈ నేపథ్యంలో ముక్కల ఆటలో కోట్లు సంపాదించడం ప్రారంభించారు. ఫలితంగా అసలు పోస్టు ఆదాయం కంటే కొసరుగా ఈ పేకాటతో వస్తున్న ఆదాయమే బాగుందని సదరు నేత సంబరపడిపోతున్నారట. ఈ విధంగా సంపాదించిన డబ్బుతో విదేశీయానాలు కూడా బాగానే చేస్తున్నట్టు సమాచారం. సదరు నేత పాస్పోర్టును గమనిస్తే ఎన్ని దేశాలు తిరిగాడో తెలుస్తుందని అధికారపార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే అనేక సందర్భాల్లో ఏదో ఒక సమస్యతో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్న సదరు నేత.. ఇప్పుడు పేకాటతో ఏకంగా ‘కోట్లలో వ్యక్తిగా’ నిలుస్తున్నారనే చర్చ జరుగుతోంది. మొత్తం మీద ఇంత భారీ మొత్తంలో సాగుతున్న ఈ పేకాట దందా వైపు కనీసం కన్నెత్తి చూసేందుకు పోలీసులు జంకుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
పురోహితులకు గుర్తింపు కార్డులివ్వాలి
భూదాన్పోచంపల్లి కృష్ణ పుష్కరాల సందర్భంగా జిల్లాలోని ప్రతి పురోహితుడికి గుర్తింపుకార్డులు ఇవ్వాలని తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పోచంపల్లి రమణారావు ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం మండలంలోని జిబ్లక్పల్లి గ్రామంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ మహా పుష్కరాలు తెలంగాణకు తొలి పండుగ అన్నారు. తెలంగాణలో మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాలకు పరిమితమైన ఈ మహోత్సవంలో ఎక్కువ సంఖ్యలో పురోహితులు అవసరమై ఉంటారని, ఈ రెండు జిల్లాల పురోహితులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. -
కదిలిన రవాణా కార్డుల స్పీడ్ పోస్ట్...
సత్తుపల్లి టౌన్: ‘రవాణా’కు పోస్టల్ బ్రేకులు’ అనే శీర్షికన బుధవారం ‘సాక్షి’లో ప్రచురితైమన కథనానికి జిల్లా రవాణాశాఖాధికారి మోహిమిన్ స్పందించారు. రవాణా శాఖ జారీ చేసిన కార్డుల స్పీడ్పోస్టుల బిల్లుల విషయంపై జిల్లా తపాల శాఖాధికారితో మాట్లాడారు. దీంతో స్పీడ్ పోస్టుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. సత్తుపల్లి తపాల శాఖ కార్యాలయంలో పెండింగ్లోఉన్న 823 డ్రైవింగ్ లైసెన్స్లు, ట్రాన్స్ఫర్, వాహనాల రిజిస్ట్రేషన్ కార్డులను సంబంధిత వాహనదారులకు స్పీడ్ పోస్ట్ చేశారు. ఈ కార్డులు ఏడు రోజుల్లో చేరతాయని సత్తుపల్లి పోస్ట్మాస్టర్ ఎం.వీరవెంకయ్య ‘సాక్షి’కి తెలిపారు. -
అక్కరకు రాని కార్డులు
పేరుకే రుణఅర్హత కార్డులు కౌలు రైతులకు దక్కని పంట రుణాలు 4702 మందికి కార్డుల జారీ పరిశీలనలో 2,628 మంది రైతులు 70మందికి కూడా రుణాలివ్వని వైనం కరీంనగర్ అగ్రికల్చర్ : చేనుచెలకల్లో కాయాకష్టం చేసుకునే రైతులకు నానా కష్టాలు వస్తున్నాయి. ఉన్న భూమిని నమ్ముకున్న సన్నచిన్నకారు రైతుకు ఒక కష్టమైతే.. ఇతరుల భూమిని కౌలుకు తీసుకుని సాగుచేసుకునే వారికి కన్నీళ్లే మిగులుతున్నాయి. సాగుచేసుకుని బతుకుతామనుకున్న వారి ఆశలు అధికారులు, బ్యాంకర్ల తీరుతో ఆవిరవుతున్నాయి. కౌలుదారుల కష్టాలు తీరుస్తామంటూ ప్రత్యేక చట్టం తీసుకొచ్చినా ప్రయోజనం శూన్యం. రుణఅర్హత కార్డులిచ్చి సాగురైతులతో సమానంగా పథకాలు వర్తింపజేస్తామన్న హామీలు వట్టిదే అయింది. ‘ఏపీ ల్యాండ్ లైసెన్స్డ్ కల్టివేటర్స్ ఆర్డినెన్స్ 2011’ ను చట్టాన్ని తీసుకొచ్చింది. కౌలురైతులను గుర్తించి వారికి రుణఅర్హత కార్డులను ఏటా జారీ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కౌలుదారుల గుర్తింపు ప్రక్రియ మొదలైంది. నాలుగు నెలలు కావస్తున్నా ఆ ప్రక్రియ పూర్తికాలేదు. జిల్లాలో లక్షకు పైగా కౌలు రైతులుండగా.. కేవలం 8,106 మంది దరఖాస్తులు చేసుకున్నారంటే అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. వ్యవసాయ, రెవెన్యూ యంత్రాంగం మధ్య సమన్వయం కొరవడి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించకపోవడంతో కౌలుదారుల గుర్తింపు ప్రక్రియ ముందుకు సాగడంలేదు. ఇప్పటివరకు అందులో 4,702 మందినే అర్హులుగా గుర్తించారు. అందులో 1,422మంది రెన్యువల్ చేసుకున్నవారే కావడం గమనార్హం. మరో 776 దరఖాస్తులను వివిధ కారణాలతో తిరస్కరించారు. 2,628 దరఖాస్తులు పరిశీలించాల్సి ఉంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెలన్నర గడిచినా గుర్తించిన కౌలురైతుల్లో రెన్యువల్ చేసుకున్న వారిలో 70 మందికి కూడా రుణాలివ్వలేదని తెలిసింది. ఎందుకీ కార్డులు..? కౌలుచట్టం ద్వారా పంటరుణాలు, పంటలబీమా, పరిహారం, రాయితీలు, ప్రోత్సాహకాలు అందని ద్రాక్షగా మారాయి. 2011 నుంచి కౌలురైతులకు రుణఅర్హత కార్డులు జారీ చేస్తున్నారు. ఏటా దరఖాస్తుల సంఖ్యతోపాటు అర్హులు, రుణం పొందినవారి సంఖ్య తగ్గడంతో కౌలురైతులకు నిరాశే ఎదురైంది. గతేడాది 14,541 మందికి రుణ అర్హతకార్డులిచ్చారు. అందులో ఈ యేడాది 1,422 మంది రైతులు మాత్రమే రెన్యువల్ చేసుకున్నారంటే పరిస్థితిని అర్థంచేసుకోవచ్చు. బ్యాంకుల నుంచి అప్పులు పుట్టకపోవడంతో ప్రైవేట్ వ్యాపారుల వద్ద రుణాలు తీసుకుని వాటిని చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బ్యాంకర్ల మెలికలు రుణాల కోసం ప్రదక్షిణలు చేస్తున్నా బ్యాంకులు మొహం చాటేస్తున్నాయి. సరైన అవగాహన లేక భూయజమానులు కౌలుపత్రాలు ఇవ్వడానికి ముందుకు రావడంలేదు. భూయాజమానుల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయలేకపోవడంతో కౌలు రైతులు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారని స్పష్టమవుతోంది. గతంలో ఇచ్చిన రుణఅర్హత కార్డులపై పంటరుణాలు అందకపోవడంతో రైతుల్లో నిర్లిప్తత వ్యక్తమవుతోంది. అప్పటికే సదరు భూములపై సొంతందారులు రుణం తీసుకుంటుండడంతో అదే భూమికి పంట రుణం ఎలా ఇవ్వమంటారని బ్యాంకర్లు ప్రశ్నిస్తున్నారు. పట్టాదారు, కౌలుదారుల మధ్య నెలకొంటున్న వివాదాలను సాకుగా చూపి రుణాలు ఇచ్చేందుకు వెనుకడుగు వేస్తున్నారు. సర్కార్ శాశ్వత పరిష్కారంతో న్యాయం చేయాలని కౌలు రైతులు వేడుకుంటున్నారు. -
పేకాట అడ్డాపై దాడి: 8మంది అరెస్ట్
తూఫ్రాన్ (మెదక్) : పేకాట స్థావరంపై పోలీసులు మెరుపుదాడి చేసి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన మెదక్ జిల్లా తూఫ్రాన్ మండలంలో జరిగింది. సీఐ రమేశ్బాబు తెలిపిన వివరాల ప్రకారం... రావెల్లి గ్రామ సమీపంలోని మామిడి తోట వద్ద శుక్రవారం సాయంత్రం కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు ఎస్.ఐ.వెంకటేశ్ సిబ్బందితో కలిసి వెళ్లి దాడి చేయగా కొందరు పారిపోగా 8 మందిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.14, 085, రెండు బైక్లు, 6 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. -
పది మంది పేకాట రాయుళ్లు అరెస్ట్
హైదరాబాద్ : లాడ్జ్లో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు 10 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 55 వేల నగదుతోపాటు 8 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన నగరంలోని సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గణేష్ లాడ్జ్లో ఆదివారం చోటుచేసుకుంది. -
పేకాట స్థావరంపై పోలీసుల దాడి
సదాశివనగర్: నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలం రామిరెడ్డి గ్రామంలో పేకాట ఆడుతున్న స్థావరంపై ఆదివారం పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాటాడుతున్న 10 మందిని అరెస్ట్ చేసి సుమారు రూ.5 వేల నగదు, 8 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఐదుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్
హైదరాబాద్ : పేకాట స్ధావరంపై దాడి చేసిన పోలీసులు పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఐదు సెల్ఫోన్లు, రూ. 11వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని లక్ష్మారెడ్డిపాలెంలోని ఓ ఇంట్లో సోమవారం సాయంత్ర చోటుచేసుకుంది. -
పేకాట శిబిరంపై దాడి: ఐదుగురి అరెస్ట్
యాకుత్పురా (హైదరాబాద్) : ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న ఐదుగురిని పోలీసులు గురువారం పట్టుకున్నారు. ఎస్సై పరశురాం తెలిపిన వివరాల ప్రకారం.. యాకుత్పురా నాగబౌలి ప్రాంతానికి చెందిన మహ్మద్ కమర్ (40) కొన్ని రోజులుగా తన ఇంట్లో పేకాట శిబిరం నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి మరో ఏడుగురితో కలసి పేకాట ఆడుతుండగా రెయిన్బజార్ పోలీసులు దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.7 వేల నగదు స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
పేకాట రాయుళ్ల అరెస్ట్
రంగారెడ్డి: మీర్పేట్లోని టీచర్స్ కాలనీలో పేకాట స్ధావరంపై పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాటాడుతున్న ఆరుగుర్ని ఎస్ఓటీ పోలీసులు రెడ్ హ్యండెడ్ గా పట్టుకొని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.54 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి స్టేషన్కు తరలించారు. -
పదిమంది పేకాట రాయుళ్ల అరెస్ట్
గోరంట్ల (అనంతపురం) : గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రాల్లో పేకాట ఆడుతున్న పదిమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 47 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా గోరంట్ల మండలం భగవంతంపల్లి గ్రామ శివారులో శనివారం చోటుచేసుకుంది. -
రైల్వే బుకింగ్కి కార్డులు
ఆన్లైన్ ద్వారా రైల్వే టికెట్లను వేగంగా బుక్ చేసుకోవడానికి ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్సీటీసీ) ప్రీపెయిడ్ కార్డులను ప్రవేశపెట్టింది. ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి ఐఆర్సీటీసీ-యూబీఐ ప్రీపెయిడ్ కార్డులను అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్డులను ఉపయోగిస్తే... త్వరితగతిన టికెట్లను బుకింగ్ చేసుకునే వెసులుబాటుతో పాటు రివార్డు పాయింట్లు, రూ. 2 లక్షల ఉచిత ప్రమాద బీమా రక్షణను కల్పిస్తోంది. వర్చువల్, ఫిజికల్ కార్డుల రూపంలో అందిస్తున్న ఈ ప్రీపెయిడ్ కార్డుల్లో గరిష్టంగా రూ. 10,000 నుంచి రూ. 50,000 వరకు నగదును నింపుకోవచ్చు. కార్డు తీసుకున్న మొదటి ఆరు నెలల్లో మొదటి ఐదు లావాదేవీలపై ఎటువంటి రుసుములు ఉండవు. -
కౌలు రైతుకు మొండిచేయి
కౌలు రైతులకు ప్రభుత్వాలు రేపిన ఆశలు ఓటికుండలయ్యాయి. రుణ అర్హత కార్డుల పేరుతో చేసిన హడావిడి కార్డులకే పరిమితమైంది. 2014-15 ఏడాదికి గాను జిల్లాలో 5698 మంది కౌలు రైతులను రుణం పొందేందుకు అర్హులుగా ప్రకటించారు. మిగతా రైతులతో సమానంగా వీరికీ రుణాలిస్తామని ప్రకటించిన ప్రభుత్వం, బ్యాంకర్లు చివరకు మొండిచేయి చూపారు. అర్హులైన వారిలో ఇప్పటి వరకు 11 మందికే రుణం దక్కింది. రబీ సీజను కూడా ముగుస్తున్న నేపధ్యంలో మిగిలిన వారిలో ఎంతమందికి రుణాలు దక్కుతాయనేది అనుమానమే. కడప అగ్రికల్చర్ : రుణ అర్హత కార్డుల వల్ల కౌలు రైతులకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసినా వాస్తవంగా ఎందుకు పనికిరావని తేలిపోయింది. 2014-15 సంవత్సరానికి కార్డులు జారీ చేసేందుకు మే నెలలో రెవిన్యూ గ్రామాల వారీగా గ్రామసభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలోని 945 రెవిన్యూ గ్రామాలలో సభలు నిర్వహించి 6300 దరఖాస్తులు స్వీకరించారు. అందులో 602 మందిని అనర్హులుగా తేల్చారు. మిగిలిన 5698 మందికి రుణాలు అందిస్తామని చెప్పారు, ఖరీఫ్ సీజన్ పోయింది, రబీ సీజన్ కూడా పూర్తి కావస్తున్నా ఇప్పటి వరకు కేవలం 11 మంది రైతులకు రూ.1.65 లక్షల రుణం మాత్రమే అందించారు. ఇలా ఉంది మన ప్రభుత్వ వ్యవసాయ రుణాల పంపిణీ తీరు అని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. 2011-12లో ప్రభుత్వం తొలిసారిగా కౌలురైతులను ఆదుకునేందుకు కౌలు రుణ అర్హత చట్టాన్ని తీసుకువచ్చి, కార్డుల జారీ ప్రక్రియను చేపట్టింది. ఇవి ఏడాది పాటు చెల్లుబాటు అయ్యేటట్లు చర్యలు తీసుకున్నారు. ఈ కార్డుల ద్వారా సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, ఇన్పుట్ సబ్సిడీ పొందవచ్చు. ప్రధానంగా బ్యాంకుల నుంచి పంట రుణాలు పొందే వీలుంటుందని స్పష్టం చేశారు. అయితే ఈ కార్డులను బ్యాంకర్లు ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకపోవడం గమనార్హం. 2012-13లో జిల్లాలో 2088 మంది అర్హత సాధించారు. వీరిలో 1205 మందికి రూ.1.65 కోట్ల రుణం ఇచ్చారు. అటు తరువాత 2013-14లో 9905 మందికి కార్డులు ఇవ్వగా అతి కష్టమీద 1410 మందికి * 2.04 కోట్లు మాత్రమే రుణం అందిచారు. అయితే సబ్సిడీ విత్తనాలు, ఎరువులు అందనేలేదు. ఇన్పుట్ సబ్సిడీ సంగతి సరేసరి. యజమానులే సంబంధిత భూములపై అన్ని ప్రయోజనాలు పొందారు. ఇక మీకొచ్చేది ఏమి లేదంటూ బ్యాంకర్లు, అధికారులు తేల్చిచెప్పారు. చివరికి ఈ కార్డుల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని కౌలు రైతులు గ్రహించారు. ముగుస్తున్న సీజన్... అందరికీ రుణాలు అనుమానమే.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి కొద్ది రోజుల్లో ఇంకెంతమంది కౌలు రైతులకు రుణాలు అందుతాయన్నది ప్రశ్నార్థకమే. కౌలు రైతులు రుణ అర్హత కార్డులను నమ్ముకుని పంటల సాగు కోసం ప్రయివేటుగా అప్పులు తెచ్చుకున్నారు. రుణాలపై ప్రభుత్వం ఎటూ తేల్చి చెప్పకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. అందునా ఈ నెలాఖరు వరకే పంట రుణాలు ఇచ్చేదని, అటు తరువాత రుణాలు ఇచ్చేది లేదని బ్యాంకర్లు చెబుతున్నారు. ఈ స్థితిలో రుణ అర్హత కార్డులు పొంది కూడా ప్రయోజనం లేకుండా పోయిందని కౌలు రైతులు మధన పడుతున్నారు. -
దీపం బుడ్డితో చీకటి పోరు చేస్తన్నాం
పురుగులు, రాళ్ల బియ్యం ఇస్తన్నారు వైఎస్సార్ సీపీ అధినేత జగన్ ముందు బాధితుల రోదన కష్టాలు తీరేంతవరకూ పోరాడదామని భరోసా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నాలుగో రోజు పర్యటన మరమ్మతులకు రూ.50 వేలివ్వాలి కొత్త ఇళ్లు నిర్మించాలి ప్రభుత్వానికి జగన్ డిమాండ్ తల్లీ... మిమ్మల్ని చూసేందుకు ఎవరైనా వచ్చారా.. ప్రభుత్వ ఉద్యోగి వచ్చి ఏమైనా రాసుకున్నారా? ఎవరూ రానేదు బాబూ.. దీపం బుడ్డితో చీకటి పోరు చేస్తన్నాం. మా బాధలు ఎవరూ పట్టించుకోట్లేదు. సాయం ఏదైనా చేశారా తల్లీలేదు బాబూ...అర్ధరాత్రి 12 గంటలప్పుడు పాలు, పులిహోర ప్యాకెట్లు విసిరేసి పోనారంట. మాలో కొందరు తెచ్చుకున్నారు. కొందరికి దొరకనే లేదు. పురుగులు, రాళ్లతో ఉన్న బియ్యం ఇస్తన్నారు. ఎంత కష్టంలో ఉంటే మాత్రం అలాంటి బియ్యం ఎలా తినాల. మా బతుకులు కుక్కల కంటే హీనంగా ఉన్నాయ్. పాలు, పులిహోర బాగున్నాయా అమ్మా.. అయ్యో.! బాబూ.. పాలు విరిగిపోనాయి..పసోళ్లు ఆకలితో ఏడుస్తుంటే అటూ ఇటూ వెళ్లి పాలు అడిగి తెచ్చుకుంటున్నాం. పులిహోర పాసికంపు కొడుతుంటే తినలేక పారేసినాం. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం పర్యటించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, బాధితుల మధ్య జరిగిన సంభాషణ ఇది. సాక్షి, విశాఖపట్నం: పెను విపత్తు వచ్చి ఆరు రోజులు గడుస్తున్నా కనీసం ఓదార్పునకు నోచుకోని అభాగ్యుల వద్దకు జగన్ వెళ్లారు. కూలిన ఇళ్లల్లోకి వెళ్లి పరిశీలించారు. వారి కష్టాలు చూసి కన్నీళ్లు తుడిచారు. ఉదయం గాంధీనగర్లో జగన్ పర్యటించారు. ‘ఎండలో అలోలచ్చనా అంటూ కాలం గడుపుతున్నాం బాబూ’ అంటూ లక్ష్మమ్మ జగన్ను చూడగానే బోరున విలపించింది. మీకు బియ్యం కార్డులు ఉన్నాయా, పింఛన్లు వస్తున్నాయా అని జగన్ ప్రశ్నించగా, కార్డులున్నా ఎవరికీ పింఛన్ రావడం లేదని అక్కడి వారు బదులిచ్చారు. తన భర్త చనిపోయి నెలరోజులు కాకుండానే ఉన్న గూడు కూడా తుపానుకు ఎగిరిపోయిందని, చీకట్లో బతుకుతున్నామని, పాములు వచ్చేస్తున్నాయని గొంతేని మహాలక్ష్మి వాపోయింది. పురుగుల బియ్యం ఇచ్చారు సాకేతపురం చేరుకున్న జగన్కు మాడుగుల అప్పలతల్లి తనకు ప్రభుత్వం ఇచ్చిన బియ్యం తీసుకొచ్చి ‘ఇదిగో బాబూ.. పురుగులు, రాళ్లు ఉన్న ఈ బియ్యం ఇచ్చారు. ఇష్టం లేదంటే పట్టికెళ్లడం మానేయమంటున్నారు. ఏం చేస్తాం.. తప్పని సరై తెచ్చుకుంటున్నాం.’ అని చూపించింది. పొట్నాల వరలక్ష్మి ఇంటికి వెళ్లి కూలిన స్లాబును జగన్ చూశారు. అక్కడి నుంచి స్టీల్ప్లాంట్ మీదుగా ఇస్లాంపేట వెళ్తూ ప్లాంట్ ఉద్యోగులను పలకరించారు. ఇస్లాంపేట్లో తుపానుకు కూలిన 150 ఏళ్లనాటి జామియా మసీదును సందర్శించారు. మినార్ పునర్నిర్మాణానికి జగన్ హామీ మినార్ పునర్నిర్మాణానికి ప్రభుత్వం సాయం చేసినా చేయకపోయినా తన వంతు సహకరిస్తానని ముస్లింలకు భరోసా ఇచ్చారు. ప్రభుత్వ సాయం అందేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. మత పెద్దలు సర్ధార్ మాస్టర్, గఫూర్మాస్టర్లు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అనంతరం జగన్కు వినతి పత్రం అందజేశారు. కళాశాలలో శాశ్వత అధ్యాపకులను నియమించాలని, పక్కా ఇళ్లు, మసీదు నిర్మించాలని, హెచ్పీసీఎల్ వంటి సంస్థల్లో స్థానిక ముస్లింలకు శాశ్వత ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వాన్ని తమ తరపున కోరాలని జగన్కు విజ్ఞప్తి చేశారు. అక్కడి నుంచి బర్మాకాలనీకి చేరుకుని కాందశీకుల ఇళ్లను పరిశీలించారు. పరామర్శకైనా ఎవరూ రాలేదు ‘తిండి పెట్టకపోయినా పర్లేదు. కనీసం పరామర్శించడానికి కూడా ఎవరూ రాలేరు. కనీసం పారలు, గునపాలు ఇస్తే మా ప్రాంతాన్ని మేమే శుభ్రం చేసుకుంటామని అడిగినా నగరపాలక సంస్థ వాళ్లు అవి లేవంటున్నారు.’ అని కర్రిరాజు, గోకరకొండ శ్యామల జగన్కు తమ పరిస్థితిని వివరించారు. ముగ్గురు పిల్లలతో రేకుల షెడ్డులో ఉన్నామని, తుపానుకు అదీ పడిపోయిందని రీసు కనకరాజు, పూర్ణ దంపతులు తమ ఇంటిని చూపించారు. డెయిరీ కాలనీలో ప్రజలు తాము డ్రెయిన్ వల్ల పడుతున్న ఇబ్బందులను చూపించారు. గాజువాక నుంచి సెప్టిక్ ట్యాంకుల్ని ఈ డ్రెయిన్లో వదులుతున్నారని, సముద్రం పోటెత్తితే పొంగి కాలనీ మునిగిపోతోందని ఎం.కె.ఎన్.మూర్తి వివరించారు. డ్రెయిన్లో ఏటా పూడిక తీయించి, ఇరువైపులా గోడ నిర్మిస్తే కాస్త ఊరట లభిస్తుందనగా, ఆ పని సాధనకు అవసరమైతే ప్రజలతో కలిసి ధర్నాలు, ఆందోళనలు చేయాలని పార్టీ నేతలకు జగన్ సూచించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాత్రివేళ 12 గంటలప్పుడు పులిహోర ప్యాకెట్లు విసిరేసి పోకుండా ప్రతి ఇంటికి వెళ్లి తలుపు తట్టి సాయం చేయాలన్నారు. రూ.పది విలువైన పులిహోర ఇచ్చి సాయం చేసేస్తున్నామనడం ధర్మమేనా? అని ప్రశ్నించారు. ఇంటి మరమ్మతులకు తక్షణమే రూ.50 వేలు ఇవ్వాలి. 250 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులను తట్టుకునేలా కొత్త ఇళ్లు నిర్మించాలి. దానికి ఎంత ఖర్చయినా ఎస్టిమేషన్ వేసి కట్టించాలి.’ అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అక్కడి నుంచి అశోక్నగర్ చేరుకొని బాధితులను పరామర్శించారు. జగన్ వెంట పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి గొల్ల బాబూరావు, తలసిల రఘురామ్, సమన్వయకర్తలు మళ్ల విజయప్రసాద్, కోలా గురువులు, చొక్కాకుల వెంకటరావు, తిప్పల నాగిరెడ్డి, కర్రి సీతారామ్, పార్టీ నేతలు కొయ్య ప్రసాదరెడ్డి, సత్తి రామకృష్ణారెడ్డి, పసుపులేటి ఉషాకిరణ్, భాస్కర్రెడ్డి, ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని ఉన్నారు. లారీ వెనక పరుగు తీశామన్నా ఆకలితో చచ్చిపోయేలా ఉన్నామన్నా. పిల్లలు, ముసలోళ్ల పరిస్థితైతే మరీ దారుణంగా ఉందన్నా. ఎవరైనా వస్తారేమో, సాయం చేస్తారేమో అని ఎదురుచూసినా ఎవరూ రాలేదన్నా. బ్రిడ్జి కింద అది కట్టకముందు నుంచీ ఉన్నాం. మేమెలా ఉన్నామని ఎవరూ పట్టించుకోవట్లేదు. బ్రిడ్జి మీద బియ్యం లారీ వెళ్తుంటే ఆపమని లారీ వెనక పరుగెత్తినా ఆపలేదు. -ఆసనాల గౌరి, గాంధీనగర్ ఈ బియ్యం కుక్కలు కూడా ముట్టవు మంచి బియ్యం ఇస్తామని గవర్నమెంటోళ్లు ఈ బియ్యం ఇచ్చారు. పురుగులు పట్టేసున్నాయ్. ఇవి ఎవరు తింటారు. వండి పెడితే కుక్కలు కూడా ముట్టుకోవడం లేదు. ఎప్పుడూ ఇవే ఇస్తున్నారు. మా బాధలు వినడానికి నువ్వొక్కడివే వచ్చావ్. -బంగారి రాజ్యలక్ష్మి, సాకేతపురం -
పేకాట.. ప్రాణం తీసింది!!
-
నిరుద్యోగులంతా ఒక్కసారే పోటెత్తారు!
-
'ప్రజా సేవలన్నీ ప్రజల ముందుకే'