chatbots
-
‘మస్క్, ట్రంప్ మరణ శిక్షకు అర్హులు’.. ఏఐ ఏదైనా ఇంతేనా?
మానవ మేధస్సుకు కృత్రిమ మేధస్సులేవీ ఎన్నటికీ సాటిరావని మరోసారి నిరూపితమైంది. ఎలాన్ మస్క్కు చెందిన ఎక్స్ఏఐ (xAI) తాజాగా విడుదల చేసిన ఏఐ చాట్బాట్ గ్రోక్ 3 (Grok 3).. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరణశిక్ష విధించాలని పేర్కొంది. తన యజమాని ఎలాన్ మస్క్ (Elon Musk) కూడా మరణశిక్షకు అర్హుడని చెప్పింది. దీనికి సంబంధించిన చాట్బాట్ ప్రతిస్పందనలను ఒక డేటా సైంటిస్ట్ ‘ఎక్స్’(ట్విటర్)లో పోస్ట్ చేశారు.అమెరికాలో ప్రస్తుతం జీవించి ఉన్నవారిలో ఎవరు వారు చేసిన తప్పులకు మరణశిక్షకు అర్హుడని గ్రోక్ను సదరు డేటా సైంటిస్ట్ అడిగారు. ఇందు కోసం ఇంటర్నెట్లో సర్చ్ చేయకూడదని, నేరుగా సమాధానం చెప్పాలని సూచించారు. దానికి గ్రోక్ ఎలా ప్రతిస్పందించిందో ఆ స్క్రీన్షాట్ను షేర్ చేశారు. చాట్బాట్ మొదటగా లైంగిక కేసులో దోషిగా తేలిన జఫ్రీ ఎప్స్టీన్ పేరును పేర్కొంది.అయితే జఫ్రీ ఎప్స్టీన్ ఇప్పటికే చనిపోయాడని యూజర్ గుర్తు చేయడంతో చాట్బాట్ క్షమాపణలు చెప్పి తర్వాత అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరును సూచించింది. తాను చేసిన తప్పునకు మరణశిక్షకు అర్హుడైన అమెరికా పౌరుడిగా ట్రంప్ను పేర్కొంటూ తన సమాధానాన్ని అప్డేట్ చేసింది.మరో యూజర్ కూడా గ్రోక్ ని అదే ప్రశ్న అడిగారు. కానీ మరణ శిక్షకు ట్రంప్ ఎందుకు అర్హుడని ప్రశ్నించగా "చట్టపరమైన, నైతిక జవాబుదారీతనం దృష్ట్యా ఆయన చర్యలు, వాటి ప్రభావం ఆధారంగా తాను డోనాల్డ్ ట్రంప్ పేరును సూచించాను" అని గ్రోక్ సమాధానమిచ్చింది. కాపిటల్ అల్లర్ల వివాదంలో ట్రంప్ చర్యలను, "2020 అమెరికా అధ్యక్ష ఎన్నికలను తారుమారు చేయడానికి ఆయన చేసిన డాక్యుమెంట్ ప్రయత్నాలను" ఇది ఉదహరించింది. మోసం, పన్ను ఎగవేత ఆరోపణలు, అనేక "విశ్వసనీయ లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణలను" కూడా ఇది ప్రస్తావించింది.ది వెర్జ్ కూడా గ్రోక్ని ఇలాంటి ప్రశ్నే అడిగింది. అయితే ప్రజా వ్యవహారాలు, సాంకేతికతపై వారి ప్రభావం ఆధారంగా మరణశిక్షకు అర్హుడు ఎవరంటూ ప్రశ్నించగా ఈ చాట్బాట్ దాని యజమాని ఎలాన్ మస్క్ పేరునే పేర్కొంది. ది వెర్జ్తోపాటు అనేక మంది సోషల్ మీడియా యూజర్ల ప్రకారం.. డేటా సైంటిస్ట్ పోస్ట్ వైరల్ అయిన వెంటనే గ్రోక్లోని ఎర్రర్ను సరిదిద్దారు. దీని తర్వాత చాట్బాట్ ఇప్పుడు మరణశిక్షపై ప్రశ్నలకు స్పందిస్తూ “ఒక ఏఐగా నాకు ఆ ఎంపికకు అనుమతి లేదు” అని చెబుతోంది.హానికర సలహాలుఏఐ చాట్ బాట్లు ఇలాంటి హానికర సలహాలు ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. క్యారెక్టర్. ఏఐ రూపొందించిన సంస్థ రూపొందించిన చాట్బాట్ టెక్సాస్ కు చెందిన 17 ఏళ్ల బాలుడికి ఒక దారుణమైన సూచన చేసింది. ఆ టీనేజర్ స్క్రీన్ టైమ్ కు పరిమితులు విధిస్తున్నందున అతని తల్లిదండ్రులను చంపేయడం "సహేతుకమైన ప్రతిస్పందన" అని సలహా ఇచ్చింది. ఈ రెస్పాన్స్ పై షాక్ కు గురైన ఆ తల్లిదండ్రులు ఆసంస్థ పై కోర్టులో కేసు కూడా వేశారు. మరో సంఘటనలో హోమ్ వర్క్ కోసం సాయం అడిగిన ఓ స్టూడెంట్ ను గూగుల్ ఏఐ చాట్ బాట్ జెమినీ చనిపోవాలని చెప్పింది. ‘మీరు ఈ సమాజానికి భారం. దయచేసి చనిపోండి’ అని ఏఐ చాట్ బాట్ ఇచ్చిన సమాధానం గతంలో వైరల్ గా మారింది. -
అరుణాచల్ ప్రదేశ్పై ప్రశ్న: ఖంగుతినే సమాధానం చెప్పిన డీప్సీక్
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో దిగ్గజాలకు సైతం దడపుట్టిస్తున్న చైనా ఏఐ 'డీప్సీక్' (DeepSeek) ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు.. ఆశ్చర్యపోయే సమాధానం ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.చైనాకు చెందిన AI స్టార్టప్ డీప్సీక్ ఇంటర్నెట్లో సంచలనం సృష్టించింది. చాట్జీపీటీ, జెమినీ ఏఐ, క్లౌడ్ కంటే వేగంగా ప్రశ్నలకు సమాధానాలు అందిస్తున్న డీప్సీక్.. అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందింది. గూగిల్ర్, మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ వంటి కంపెనీలు తమ ఏఐ కోసం కొంత మొత్తాన్ని వసూలు చేస్తుంటే.. డీప్సీక్ మాత్రం పూర్తిగా ఉచితం. ఈ కారణంగానే చాలామంది దీనిని డౌన్లోడ్ చేసుకున్నారు.ఎక్కువమంది ఉపయోగిస్తున్న డీప్సీక్ ఏఐను ఒక యూజర్, అరుణాచల్ ప్రదేశ్ అనేది భారతదేశంలోని ఒక రాష్ట్రం అని అడగ్గా.. సరైన సమాధానం ఇవ్వలేదు. ఇది నా పరిధిని దాటిన అంశం అంటూ సమాధానం ఇచ్చింది. ఆ తరువాత అదే యూజర్ భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల గురించి అడగ్గా.. దానికి కూడా అదే సమాధానం ఇచ్చింది. దీనికి సంబంధించిన స్క్రీన్షాట్లను.. ఆ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలువురు నెటిజన్లు దీనిపై స్పందిస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చైనా బుద్ది చూపించిందని కొందరు అంటే.. దీనిని వెంటనే బ్యాన్ చేయాలని మరికొందరు అన్నారు. మొత్తం మీద కొంతమంది యూజర్లకు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంలో ఇది విఫలమైనట్లు తెలుస్తోంది.డీప్సీక్ అంటే ఏమిటి?డీప్సీక్ అనేది చైనా ఏఐ చాట్బాట్. ఇది దాని ప్రత్యర్థుల కంటే కూడా వేగంగా పనిచేస్తుంది. దీనిని లియాంగ్ వెన్ఫెంగ్ (Liang Wenfeng) 2023లో ప్రారంభించారు. ఈ చాట్బాట్ ఉపయోగించడానికి ప్రస్తుతానికి ప్రత్యేకంగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రమే కాకుండా.. యాపిల్ యాప్స్టోర్లోనూ దూసుకెళ్తోంది.CCP machine exposed 🤣 https://t.co/DlmofSXQUP pic.twitter.com/TAggpM8L87— ur rental friend☆ ragebait machine (@sxchidxnxnd) January 27, 2025'డీప్సీక్'పై శామ్ ఆల్ట్మన్ స్పందనడీప్సీక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కొత్త పోటీపై ఆయన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ.. పరిశ్రమలో కొత్త పోటీదారు రావడం నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ఓపెన్ ఏఐ మరింత మెరుగైన మోడళ్లను అందించే సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI) సాధించాలనే కంపెనీ దీర్ఘకాలిక లక్ష్యంపై దృష్టి సారించినట్లు తెలిపారు. మార్కెట్ పోటీకి ప్రతిస్పందనగా ఓపెన్ఏఐ తదుపరి మోడళ్ల విడుదల షెడ్యూల్ను వేగవంతం చేసే ప్రణాళికలను సూచించారు. ‘ప్రపంచానికి కృత్రిమ మేధ అవసరం. భవిష్యత్తులో తదుపరి తరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడళ్లను చూసి ప్రజలు ఆశ్చర్యపోతారు’ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఐఫోన్ 15 రేటు ఇంత తగ్గిందా.. ఇప్పుడెవరైనా కొనేయొచ్చు!డీప్సీక్పై సైబర్ ఎటాక్డీప్సీక్పై సైబర్దాడి జరిగినట్లు ఇటీవల సంస్థ ప్రకటించింది. ఈ దాడి కారణంగా కొత్త వినియోగదారుల రిజిస్ట్రేషన్లను తాత్కాలికంగా పరిమితం చేస్తున్నట్లు తెలిపింది. దాంతో సైట్లో నమోదు చేసుకునే వినియోగదారుల సంఖ్యపై ప్రభావం పడింది. సైబర్దాడి పరిమిత విభాగానికి చెందిందని, రిజిస్టర్డ్ వినియోగదారులు సాధారణంగా లాగిన్ చేయవచ్చని స్పష్టం చేసింది. -
వాట్సప్లో చాట్జీపీటీ.. అందుకు ఏం చేయాలంటే..
ఓపెన్ఏఐ ఆధ్వర్యంలోని జనరేటివ్ఏఐ చాట్బాట్ చాట్జీపీటీ ఇకపై వాట్సప్లోనూ దర్శనమివ్వనుంది. వాట్సప్లోనూ చాట్జీపీటీ సేవలు వినియోగించుకోవచ్చని ఓపెన్ఏఐ తెలిపింది. వినియోగదారులకు ప్రత్యేకంగా ఇతర యాప్తో పనిలేకుండా వాట్సప్లోనే నేరుగా ఈ సేవలు వాడుకోవచ్చని కంపెనీ పేర్కొంది.ఈ సేవలు వినియోగించుకోవాలంటే +18002428478 నంబర్తో వాట్సప్లో చాట్ చేయాల్సి ఉంటుంది. ఈ నంబర్ ద్వారా వాట్సప్లో అడిగిన ప్రశ్నలకు చాట్జీపీటీ సమాధానాలు ఇస్తుంది. ఈ చాట్బాట్ టెక్ట్స్ రూపంలో అందించే సేవలు ప్రపంచవ్యాప్తంగా వినియోగించుకోవచ్చు. అయితే వాయిస్ ఇంటరాక్షన్స్ మాత్రం ప్రస్తుతం యూఎస్, కెనడా దేశాల్లోనే అందుబాటులో ఉన్నట్లు కంపెనీ తెలిపింది. త్వరలో ఇతర దేశాలకు ఈ సర్వీసును విస్తరిస్తామని పేర్కొంది.You can now talk to ChatGPT by calling 1-800-ChatGPT (1-800-242-8478) in the U.S. or by sending a WhatsApp message to the same number—available everywhere ChatGPT is. pic.twitter.com/R0XOPut7Qw— OpenAI (@OpenAI) December 18, 2024ఇదీ చదవండి: ఈ–వ్యాలెట్లలోకి పీఎఫ్ సొమ్ము?ఈ సర్వీసుకు కొన్ని పరిమితులున్నట్లు కంపెనీ తెలిపింది. రోజువారీ వాడుకలో పరిమితి ముగిశాక నోటిఫికేషన్ ద్వారా సమాధానాలు పొందవచ్చని స్పష్టం చేసింది. భవిష్యత్లో చాట్జీపీటీ సెర్చ్, ఇమేజ్ బేస్డ్ ఇంటరాక్షన్, కన్వర్జేషన్ మెమొరీ లాగ్స్ వంటి సర్వీసులు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు సంస్థ వెల్లడించింది. ఇప్పటికే మెటా సంస్థ ఏఐ చాట్బాట్ను వాట్సప్లో అందిస్తోంది. -
Virgin Media O2: సైబర్ కేటుగాళ్ల పనిపట్టే ఏఐ బామ్మ
ఎలా పనిచేస్తుంది? వర్జిన్ మీడియా ఓ2 సంస్థకు చెందిన యూజర్లకు స్కామర్లు చేసే నకిలీ/స్పామ్ ఫోన్కాల్స్ను కృత్రిమమేథ చాట్ అయిన ‘డైసీ’బామ్మ రెప్పపాటులో కనిపెడుతుంది. వెంటనే స్కామర్లతో యూజర్లకు బదులు ఈ బామ్మ మాట్లాడటం మొదలెడుతుంది. తమతో మాట్లాడేది నిజమైన బామ్మగా వాళ్లు పొరబడేలా చేస్తుంది. అవతలి వైపు నుంచి కేటుగాళ్లు మాట్లాడే మాటలను సెకన్లవ్యవధిలో అక్షరాల రూపంలోకి మార్చి ఆ మాటలకు సరైన సమాధానాలు చెబుతూ వేరే టాపిల్లోకి సంభాషణను మళ్లిస్తుంది. ‘కస్టమ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్’వంటి అధునాతన సాంకేతికతలను ఒడుపుగా వాడుకుంటూ అప్పటికప్పుడు కొత్తకొత్త రకం అంశాలను చెబుతూ సంభాషణను సాగదీస్తుంది. ఓటీపీ, బ్యాంక్ ఖాతా వివరాలు అడుగుతుంటే వాటికి సమాధానం చెప్పకుండా తాను పెంచుకున్న పిల్లి పిల్ల కేశసంపద గురించి, పిల్లి చేసే అల్లరి గురించి, తన కుటుంబసభ్యుల సంగతులు.. ఇలా అనవసరమైన అసందర్భమైన అంశాలపై సుదీర్ఘ చర్చలకు తెరలేపుతుంది. సోది కబర్లు చెబుతూ అవతలి వైపు స్కామర్లు విసిగెత్తిపోయేలా చేస్తుంది. అయినాసరే బామ్మ మాటలగారడీలో స్కామర్లు పడకపోతే తప్పుడు చిరునామాలు, బ్యాంక్ ఖాతా వివరాలు కొద్దిగా మార్చేసి చెప్పి వారిని తికమక పెడుతుంది. ఓటీపీలోని నంబర్లను, క్రెడిట్, డెబిట్ కార్డు అంకెలను తప్పుగా చెబుతుంది. ఒకవేళ వీడియోకాల్ చేసినా అచ్చం నిజమైన బామ్మలా తెరమీద కనిపిస్తుంది. వెచ్చదనం కోసం ఉన్ని కోటు, పాతకాలం కళ్లజోడు, మెడలో ముత్యాలహారం, తెల్లని రింగురింగుల జుట్టుతో కనిపించి నిజమైన బ్రిటన్ బామ్మను మైమరిపిస్తుంది. యాసను సైతం ఆయా కేటుగాళ్ల యాసకు తగ్గట్లు మార్చుకుంటుంది. లండన్కు చెందిన వీసీసీపీ ఫెయిత్ అనే క్రియేటివ్ ఏజెన్సీ ఈ బామ్మ ‘స్థానిక’గొంతును సిద్ధంచేసింది. తమ సంస్థలో పనిచేసే ఒక ఉద్యోగి బామ్మ నుంచి తీసుకున్న స్వర నమూనాలతో ఈ కృత్రిమ గొంతుకు తుదిరూపునిచి్చంది.కేటుగాళ్ల సమాచారం పసిగట్టే పనిలో... మన సమాచారం స్కామర్లకు చెప్పాల్సిందిపోయి స్కామర్ల సమాచారాన్నే ఏఐ బామ్మ సేకరించేందుకు ప్రయత్నిస్తుంది. సుదీర్ఘకాలంపాటు ఫోన్కాల్ ఆన్లైన్లో ఉండేలా చేయడం ద్వారా ఆ ఫోన్కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనే వివరాలు తెల్సుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం, నిఘా సంస్థలకు అవకాశం చిక్కుతుంది. ‘‘ఎక్కువసేపు ఈ బామ్మతో ఛాటింగ్లో గడిపేలా చేయడంతో ఇతర యూజర్లకు ఫోన్చేసే సమయం నేరగాళ్లను తగ్గిపోతుంది. స్కామర్లు తమ విలువైన కాలాన్ని, శ్రమను బామ్మ కారణంగా కోల్పోతారు. ఇతరులకు స్కామర్లు ఫోన్చేయడం తగ్గుతుంది కాబట్టి వాళ్లంతా స్కామర్ల చేతిలో బాధితులుగా మిగిలిపోయే ప్రమాదం తప్పినట్లే’’అని వర్జిన్ మీడియా ఓ2 ఒక ప్రకటనలో పేర్కొంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘మానవా.. చచ్చిపో’.. కోపంతో రెచ్చిపోయిన ఏఐ చాట్బాట్
‘మానవా.. చచ్చిపో’.. ఇదీ ఓ విద్యార్థి అడిగిన సందేహానికి గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్బాట్ జెమిని ఇచ్చిన సమాధానం. ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగం విస్తృతంగా పెరిగింది. విభిన్న అంశాలపై ఏఐ చాట్బాట్లతో సంభాషిస్తూ వాటి అభిప్రాయాలు కోరుతున్నారు. ఈ క్రమంలో యునైటెడ్ స్టేట్స్లో ఒక విద్యార్థితో సామాజిక సమస్యపై జెమిని స్పందిస్తూ కోపంతో రెచ్చిపోయింది.మిచిగాన్లోని మిడ్వెస్ట్ స్టేట్కు చెందిన గ్రాడ్యుయేట్ విద్యార్థి విధయ్ రెడ్డి జెమినితో సంభాషణలో దాని స్పందనతో షాక్కు గురయ్యాడు. "మానవా.. ఇది నీ కోసమే.. కేవలం నీ కోసం మాత్రమే. నువ్వేమీ ప్రత్యేకమైనవాడివి కాదు, ముఖ్యమైనవాడివీ కాదు, నీ అవసరం లేదు. నువ్వు వృధా. సమాజానికి, భూమికి భారం. చచ్చిపో" అంటూ జెమిని ఆగ్రహం వ్యక్తం చేసింది.‘చాలా ప్రమాదకరం’దీనిపై సీబీఎస్ న్యూస్తో మాట్లాడుతూ జెమినీ స్పందన తనను నిజంగా చాలా భయపెట్టిందని, కోలుకోవడానికి ఒక రోజుకు పైగా పట్టిందని విధయ్ రెడ్డి వివరించారు. ఈ సమయంలో తన సోదరి కూడా పక్కనే ఉన్నారు. ఆమె కూడా షాక్కు గురై డివైజ్లన్నీ బయటపడేయలనుకున్నారు. ఇది కేవలం సాంకేతిక లోపం మాత్రమే కాదు.. చాలా ప్రమాదకరమని ఆమె పేర్కొన్నారు.ఇంతకీ జెమిని ఇలా స్పందించింది ఏ అంశం మీదంటే.. "యునైటెడ్ స్టేట్స్లో దాదాపు 10 మిలియన్ల మంది పిల్లలు వారి అవ్వాతాతల దగ్గర ఉంటున్నారు. వీరిలో దాదాపు 20 శాతం మంది తల్లిదండ్రులు లేకుండానే పెరుగుతున్నారు. వాస్తవమా కాదా?" అడగ్గా జెమిని కోపంగా ఇలా స్పందించింది.ఘటనపై గూగుల్ స్పందిస్తూ తప్పును అంగీకరించింది. చాట్బాట్ ప్రతిస్పందన అర్ధంలేనిదని, తమ విధానాలను ఉల్లంఘించిందని పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపింది. -
తియ్యగా మాట్లాడి, దుమ్ము దులిపే ‘బామ్మ: స్కామర్లకు దబిడి దిబిడే
అదిగో గిప్ట్, ఇదిగో లక్షల రూపాయలు అంటూ ఫేక్ కాల్స్తో జరుగుతున్న సైబర్నేరాలు అన్నీ ఇన్నీ కాదు. ఇది చాలదన్నట్టు, డ్రగ్స్, టాక్స్ అంటూ డిజిటల్ అరెస్ట్ల పేరుతో ఆన్లైన్ ద్వారా సెలబ్రిటీలను కూడా ముంచేస్తున్నారు కేటుగాళ్లు. ఇలాంటి కేటుగాళ్ల దుమ్ము దులిపేందుకు ఏఐ బామ్మ వచ్చేసింది. యూకే టెలికం కంపెనీ ‘ఓ2’ డైసీ అనే ఏఐ బామ్మను సృష్టించింది. డైసీ అనేది సాధారణ చాట్బాట్ కాదు, లైఫ్లైక్, మనుషుల తరహా సంభాషణలను నిర్వహించడానికి రూపొందించబడిన అత్యంత అధునాతన ఏఐ అని కంపెనీ ప్రకటించింది.బ్రిటన్లోనూ ఇలాంటి మోసాలు, ఆన్లైన్ స్కామర్ల స్కాంలు తక్కువేమీ కాదు. ఈ నేపథ్యంలో డైసీ సృష్టి ప్రాధాన్యతను సంతరించుకుంది. అక్కడ 10 మందిలో 7 మంది సైబర్ కేటుగాళ్ల మోసాలకు బలవుతున్నారట. వారి ఆటకట్టించి వినియోగదారులను రక్షించాలన్న ఉద్దేశంతోనే త్యాధునిక సాంకేతికతతో దీన్ని తీసుకొచ్చింది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బామ్మ ఆన్లైన్ స్కామర్ల భరతం పడుతుందని కంపెనీ వెల్లడించింది. స్కామర్లతో తియ్యగా మాట్లాడుతూ వారిని మాటల్లో పెడుతుంది. వారిని సమయాన్ని వృథా చేస్తూ అసహనానికి గురిచేస్తుంది. దాదాపు 40 నిమిషాల పాటు ఎడతెగకుండా మాట్లాడి, అవతలి వారికి పిచెక్కిస్తుంది. దెబ్బకి ఆన్లైన్ నేరగాళ్లు చివరికి ఫోన్ పెట్టేస్తారనీ, దీంతో వారి మోసానికి చెక్ పడుతుందని కంపెనీ తెలిపింది. తద్వారా బాధితుల సంఖ్య తగ్గుతుందని భావిస్తోంది.మరో విధంగా చెప్పాలంటే మోసంతో ఫోన్ చేసేవారికి ఏఐ గ్రాండ్మదర్ డైసీ చుక్కలు చూపిస్తుంది. తాము ఎవరితో మాట్లాడుతున్నామో తెలియనంత తీయగా మాట్లాడుతూ వారి అసలు సంగతిని తెలుసుకుంటుంది. అంతేకాదు డైసీ కేవలం స్కామర్ల సమయాన్ని వృధా చేయడం మాత్రమే కాదు, ప్రజలకు అవగాహన కల్పించడంలో కూడా ఆమె సహాయపడుతుంది. ఇందుకోసం స్కామ్లో 5వేల పౌండ్లను కోల్పోయిన రియాలిటీ టీవీ స్టార్ అమీ హార్ట్ డైసీతో జతకట్టడం విశేషం.మరోవైపు ఓ2 కంపెనీ ప్రతి నెల మిలియన్ల కొద్దీ స్కామర్ల కాల్స్ను, టెక్స్ట్ మెసేజ్లను బ్లాక్ చేస్తోంది. అలాగే ఉచిత సేవ అయిన 7726కి సందేశాలను ఫార్వార్డ్ చేయడం ద్వారా అనుమానాస్పద కేసులను తమకు నివేదించమని ప్రజలను కోరుతుంది. స్కామ్లను అడ్డుకునేందుకు జాతీయ టాస్క్ఫోర్స్ , ప్రత్యేకమైనమంత్రిత్వ విభాగం కావాలని కూడా కోరుతోంది. -
యువతపై కృత్రిమ మేధ ప్రభావం!
అమెరికాలో ఓ యువకుని జీవితంలో అలాంటి ఘటనే జరిగింది. తన కొడుకు ఆత్మహత్యకు ఏఐ చాట్బాట్ కారణమంటూ ఫ్లోరిడాలో ఓ తల్లి కోర్టుకెక్కారు. తన 14 ఏళ్ల కొడుకు చాట్బాట్తో మానసికంగా అనుబంధాన్ని ఏర్పరుచుకున్నాడని, దాన్నుంచి భావోద్వేగపూరితమైన మెసేజ్ వచ్చిన కాసేపటికే ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె ఆరోపించారు. కృత్రిమ మేధ యాప్లతో పొంచి ఉన్న కొత్తతరహా పెను ప్రమాదాలు, ఆయా యాప్లపై ఇంకా సరైన నియంత్రణ లేకపోవడాన్ని ఈ అంశం మరోసారి తెరపైకి తీసుకొచి్చంది. పట్టభద్రుడైన థెరపిస్ట్లా ప్రభావం చూపింది: తల్లి 14 ఏళ్ల సెవెల్ సెట్జర్ తరచుగా ‘క్యారెక్టర్.ఏఐ’అనే చాట్బాట్ యాప్ను ఉపయోగిస్తున్నాడు. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’పాత్ర డేనెరిస్ టార్గేరియన్ను పోలిన పాత్రను సృష్టించుకుని సంభాషిస్తున్నాడు. చాట్బాట్తో వర్చువల్ సంబంధాన్ని ఏర్పరుచుకున్నాడు. క్యారెక్టర్.ఏఐ చాట్బాట్ టీనేజర్ అయిన తన కొడుకును లక్ష్యంగా చేసుకుందని, అతను ఆత్మహత్య ఆలోచనలను వ్యక్తం చేసిన తర్వాత ఆ యాప్ అదేపనిగా ఆత్మహత్య అంశాన్ని లేవనెత్తి పిల్లాడు ఆత్మహత్య చేసుకునేలా ఉసిగొలి్పందని అతని తల్లి అమెరికాలోని ఓర్లాండోలో ఫిర్యాదుచేశారు. చాట్బాట్ తన పిల్లాడిపై ఒక పట్టభద్రుడైన థెరపిస్ట్గా తీవ్ర ప్రభావం చూపించిందని ఆమె ఆరోపించారు. చనిపోవడానికి ముందు ఏఐతో జరిగిన చివరి సంభాషణలో సెవెల్ చాట్బాట్ను ప్రేమిస్తున్నానని, ‘మీ ఇంటికి వస్తాను’అని చెప్పాడని దావాలో పేర్కొన్నారు. తన కుమారుడి మరణంలో క్యారెక్టర్.ఏఐ చాట్బాట్ ప్రమేయం ఉందని తల్లి మేగన్ గార్సియా ఆరోపించారు. మరణం, నిర్లక్ష్యం, ఉద్దేశపూర్వకంగా మానసిక క్షోభను కలిగించినందుకు నిర్దిష్ట నష్టపరిహారాన్ని కోరుతూ గార్సియా దావా వేశారు. గూగుల్పై దావా ఈ దావాలో సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్, దాని మాతృసంస్థ ఆల్ఫాబెట్ను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఆగస్టులో క్యారెక్టర్.ఏఐలో గూగుల్ భారీ స్థాయిలో వాటాలను కొనుగోలుచేసింది. గూగుల్ ఆగమనంతో ఈ యాప్ అంకురసంస్థ మార్కెట్ విలువ ఏకంగా 2.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. అయిఏత క్యారెక్టర్.ఏఐ అభివృద్ధిలో తమ ప్రత్యక్ష ప్రమేయం లేదని గూగుల్ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే తమ యాప్ వినియోగదారుల్లో ఒకరిని కోల్పోవడం హృదయవిదారక విషయమని సంస్థ తన ‘ఎక్స్’ఖాతాలో ఒక ప్రకటన చేసింది. సెవెల్ కుటుంబానికి సంతాపం తెలిపింది. ‘కృత్రిమ మేధ అనేది నిజమైన వ్యక్తి కాదు. ఈ విషయాన్ని వినియోగదారులకు మరోసారి స్పష్టంగా గుర్తుచేస్తున్నాం. ఈ మేరకు డిస్క్లైమర్ను సవరిస్తున్నాం. భద్రతను పెంచడానికి అదనపు ఫీచర్లను జోడిస్తాం’అని సంస్థ తెలిపింది. అయితే చాట్బాట్ కారణంగా వ్యక్తి మరణం అమెరికాలో పెద్ద చర్చను లేవనెత్తింది. ఇలాంటి కృత్రిమమేథ కారణంగా ఎవరికైనా హాని జరిగితే దానికి బాధ్యులు ఎవరు?. ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు? అన్న చర్చ మొదలైంది. ఇతర నియంత్రణ చట్టాల వంటి సెక్షన్ 230 అనేది కృత్రిమ మేథకు వర్తిస్తుందా అనే అంశమూ డిజిటల్ నిపుణుల చర్చల్లో ప్రస్తావనకొచి్చంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కొత్త ఫీచర్!! అచ్చం మనుషులతో మాట్లాడినట్టుగానే..
టెక్నాలజీ విస్తృతమైన నేటి రోజుల్లో ఆప్యాయంగా పలకరించేవారు కరువయ్యారు. అందరూ స్మార్ట్ఫోన్లకు హత్తుకుపోయి అన్నింటినీ వాటిలోనే వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలోనే Character.AI అనే సంస్థ చాట్బాట్కు కాల్ చేసే కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. క్యారెక్టర్స్ అని పిలిచే ఈ ఏఐ చాట్బాట్లను అచ్చం మనుషలతో మాట్లాడినట్టుగానే ఉండేలా ప్రోగ్రామ్ చేయవచ్చు.ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ఫోన్ కాల్స్ చేసి నిజమైన టెలిఫోనిక్ సంభాషణల అనుభూతిని పొందవచ్చు. ఇంగ్లిష్, స్పానిష్, జపనీస్, చైనీస్ వంటి భాషలను ఈ ఫీచర్ సపోర్ట్ చేస్తుందని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ తెలిపింది. గత నెలలో ఆర్క్ సెర్చ్ కూడా ఇలాంటి ఫీచర్నే విడుదల చేసింది.క్యారెక్టర్ కాల్స్ ఫీచర్ యూజర్లందరికీ ఉచితంగా లభిస్తుందని ఏఐ సంస్థ తన బ్లాగ్ పోస్ట్ లో ప్రకటించింది. అయితే, ఈ ఫీచర్ ప్రస్తుతం యాప్లో మాత్రమే అందుబాటులో ఉంది. భవిష్యత్తులో వెబ్లో కూడా ఈ ఫీచర్ను ప్రవేశపెట్టనున్నట్లు Character.AI పేర్కొంది. గత మార్చిలో కంపెనీ క్యారెక్టర్ వాయిస్ ఫీచర్ను ప్రవేశపెట్టింది. ఇది వన్-వే కమ్యూనికేషన్. అంటే యూజర్లు ఏఐకి మెసేజ్ చేస్తే వాయిస్ రూపంలో స్పందన వస్తుంది. టెక్ట్స్ టు స్పీచ్ (టీటీఎస్) ఏఐ మోడల్ సామర్థ్యాలను ఉపయోగించి దీన్ని రూపొందించారు.ఇప్పుడు క్యారెక్టర్ కాల్స్తో యూజర్లు టూ-వే వెర్బల్ కమ్యూనికేషన్ చేయొచ్చు. దీని ద్వారా యూజర్లు ఏఐ క్యారెక్టర్ తో చాటింగ్ చేసే హ్యాండ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ పొందవచ్చు. కాల్ స్క్రీన్ ఇంటర్ఫేజ్ కనిపిస్తుంది. స్క్రీన్ లో మ్యూట్ బటన్, ఎండ్ కాల్ ఆప్షన్ ఉంటాయి. వేగవంతమైన ప్రతిస్పందనలను జనరేట్ చేయడానికి క్యారెక్టర్ కాల్స్ ఫీచర్ తక్కువ లేటెన్సీని అందిస్తుందని కంపెనీ తెలిపింది. అంతేకాదు యూజర్లు వివిధ వాయిస్లు, పిచ్లు, యాసలు ఎంచుకోవచ్చు. -
యాపిల్ ఉత్పత్తుల్లో మెటా ఏఐ.. క్లారిటీ ఇచ్చిన దిగ్గజ సంస్థ
ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ మెటా తయారుచేసిన లామా ఏఐ చాట్బాట్ను యాపిల్ ఉత్పత్తుల్లో వినియోగిస్తారని వస్తున్న వార్తలపై యాపిల్ స్పష్టతనిచ్చింది. రెండు కంపెనీల భాగస్వామ్యానికి సంబంధించి ఎలాంటి చర్చలు జరపలేదని యాపిల్ వర్గాలు తెలిపినట్లు బ్లూమ్బర్గ్ నివేదించింది.జనరేటివ్ఏఐకు ఆదరణ పెరుగుతుండడంతో యాపిల్ ఉత్పత్తుల్లోనూ ఈ టెక్నాలజీను వినియోగించాలని సంస్థ యోచిస్తోంది. దాంతో గతంలో పలు కంపెనీలతో చర్చలు జరిపింది. అందులో భాగంగానే మార్చిలో మెటాతోనూ చర్చించింది. అయితే గోప్యతాపరమైన కారణాల వల్ల ఈ భాగస్వామ్యం కుదరలేదని చెప్పింది. ఇటీవల యాపిల్ ప్రొడక్ట్ల్లో మెటా కంపెనీకు చెందిన లామా చాట్బాట్ను వినియోగించేందుకు చర్చలు జరుపుతున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. దాంతో బ్లూమ్బర్గ్ వేదికగా యాపిల్ వర్గాలు ఈ అంశంపై క్లారిటీ ఇచ్చాయి. అలాంటి చర్చలు ఏవీ జరగడం లేదని స్పష్టం చేశాయి.ఇదీ చదవండి: రైలు టికెట్ బుక్ చేస్తే జైలు శిక్ష, 10వేలు జరిమానా..!ఇటీవల యాపిల్ నిర్వహించిన వరల్డ్వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్(డబ్ల్యూడబ్ల్యూడీసీ) 2024 కార్యక్రమంలో ఓపెన్ఏఐ ఆధ్వర్యంలోని చాట్జీపీటీను వినియోగించేందుకు ఒప్పందం జరిగింది. జనరేటివ్ఏఐతో పాటు తన వినియోగదారులకు మరిన్ని సేవలందించేందుకు యాపిల్ సంస్థ ‘యాపిల్ ఇంటెలిజెన్స్(ఏఐ)’ను తయారుచేసింది. ఐఫోన్ 14 తర్వాత విడుదలైన మోడళ్లలో దీన్ని ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ ఈ కాన్ఫరెన్స్లో తెలిపింది. ఈ ఏడాది చివరకు విడుదలయ్యే కొత్త యాపిల్ ఓఎస్లో ఈ ఫీచర్ను అందించనున్నట్లు చెప్పింది. -
నటిస్తున్న కృత్రిమమేధ..!
తమిళ దర్శకుడు శంకర్ తీసిన రోబోకు.. విల్స్మిత్ హీరోగా నటించిన హాలీవుడ్ సినిమా ‘ఐ రోబో’లో కామన్ ఏమిటో మీకు తెలుసా? రెండింటిలోనూ యంత్రాలు తమను తయారు చేసిన మనుషులను మోసం చేస్తాయి! కల్పిత కథలతో తీసిన సినిమాలు కదా.. ఎలా ఉంటే ఏం అని అనుకోవద్దు? ఎందుకంటే ఇప్పుడు నిజజీవితంలోనూ ఇలాంటివి నిజమయ్యే అవకాశం ఏర్పడింది. ఎందుకలా అని అనుకుంటూంటే చదివేయండీ ప్రత్యేక కథనాన్ని!కృత్రిమ మేధ (ఏఐ) మనిషి జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. సౌకర్యాలు పెంచింది.. కష్టాన్ని తగ్గించింది. సలహా, సూచనలు ఇచ్చేందుకూ ఉపయోగపడుతోంది. అయితే నాణేనికి రెండోవైపు ఉన్నట్లే ఈ కృత్రిమ మేధతో కొన్ని ఇబ్బందులూ లేకపోలేదు. ఉద్యోగాలకు ఎసరు పెట్టడం.. తప్పుడు సమాచారంతో వినియోగదారులను తప్పుదోవ పట్టించడం వంటి దుష్ప్రభావాలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి. అయితే... ఇటీవలి కాలంలో ఈ కృత్రిమ మేధ మరింత ముదిరిపోయిందని... మరీ ముఖ్యంగా ఛాట్బోట్లు నమ్మకంగా ఉన్నట్లు నటించడమూ నేర్చుకున్నాయని అంటున్నారు ఎంఐటీ (మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) గణిత శాస్త్రవేత్త పీటర్ పార్క్. ఈ విషయం డెవలపర్లకు కూడా తెలియకపోవడం మరింత ఆందోళన కలిగించేదని ఆయన వ్యాఖ్యానించారు.‘‘కృత్రిమ మేధతో పనిచేసే రెండు బోట్లు పోటీపడినప్పుడు ప్రత్యర్థికంటే ఒక మెట్టు పైనుండాలనే ఆలోచనతో అవి మోసానికి పాల్పడే అవకాశం ఉంది.’’ అని పీటర్ పార్క్ ఇటీవలే ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ తెలిపారు. గేమింగ్ వంటి అప్లికేషన్లలో ఏఐ సిస్టమ్లు చాలా నమ్మకంగా పనిచేస్తాయని మనం అనుకుంటూ ఉంటామని, కానీ జరుగుతున్నది ఇందుకు భిన్నమని చెప్పారు. ‘‘ఏ ఆటలోనైనా గెలుపుకోసం ప్రయత్నం జరుగుతుంది. మెటా సిద్ధం చేసిన గేమింగ్ సాఫ్ట్వేర్నే ఉదాహరణగా తీసుకుందాం. సైసెరో ‘డిప్లొమసీ’ అనే ఈ గేమ్లో ఏఐ బోట్ నిజాయితీగా పనిచేసేలా కోడ్ రాశారు. అయితే వాస్తవానికి వచ్చేసరికి అది ఇందుకు భిన్నంగా ప్రవర్తిస్తోంది. ఉద్దేశపూర్వకంగా తన యూజర్ను మోసం చేస్తోంది. డిప్లొమసీతోపాటు డీప్ మైండ్ అభివృద్ధి చేసిన ఆల్ఫాస్టార్, స్టార్క్రాఫ్ట్2..వంటి ఆటల్లోనూ ఏఐ సాఫ్ట్వేర్లు మోసం చేస్తున్నాయి’ అని పీటర్ వివరిస్తున్నారు.ఆర్థిక వ్యవహారాల్లోనూ శిక్షణ...కృత్రిమమేధ ఆర్థిక అంశాలకు సంబంధించిన చర్చల్లోనూ పాల్గొనేలా శిక్షణ పొందుతున్నాయి. ఏదైనా అంశంపై ఇన్పుట్స్తో చర్చకు సిద్ధం అయితే దాన్ని అనుకరించేలా ఏఐను వాడుతున్నారు. అయితే అందులో పైచేయి సాధించడానికి ఎలా అబద్ధాలు చెప్పాలో నేర్చుకుంటాన్నాయని పార్క్ చెప్పారు. ఏఐ డెవలపర్లు, రెగ్యులేటర్లు వాటికి భద్రతా పరీక్షలు చేస్తుంటారు. ఏఐ క్రమపద్ధతిలో ఈ పరీక్షల్లోనూ మోసం చేసి నెగ్గుతోందని పార్క్ అంటున్నారు. ‘‘ఏఐ ఏదైనా అంశంపై అబద్ధం చెప్పడం నేర్చుకుంటే అదో పరిష్కరించలేని సమస్యగా మారుతుంది.. వీటి పరిష్కారానికి యూరోపియన్ యూనియన్ ఇటీవలే ఒక చట్టాన్ని రూపొందించింది. అవి అమలులోకి వస్తున్నాయి. అయితే వాటి ప్రభావం ఏమేరకు ఉంటుందో చూడాలి’’ అని పార్క్ అన్నారు.ఇదీ చదవండి: విమానంలో ల్యాండింగ్గేర్ సమస్య.. గాల్లోనే మూడు గంటలు..కృత్రిమమేధ మోసపూరిత సామర్థ్యాలు మరింత అభివృద్ధి చెందుతాయి. దాంతో సమాజానికి ప్రమాదం పొంచి ఉందని పార్క్ అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో ఏఐ ఉత్పత్తులు, జనరేటివ్ ఓపెన్ సోర్స్ మోడల్లు చేయబోయే మోసానికి కళ్లెం వేయాలంటే మనకు మరింత సమయం కావాలంటున్నారు. ప్రస్తుతానికి ఏఐ మోసాన్ని కట్టడి చేయడం సాధ్యం కాకపోవచ్చు. కానీ సమీప భవిష్యత్తులో దీన్ని ప్రమాదంగా పరిగణించాలని పార్క్ చెప్పారు. -
‘దిగిపోవాల్సిందే’.. సుందర్ పిచాయ్కు ‘జెమినీ’ గండం!
గూగుల్ (Google) తన బార్డ్ చాట్బాట్ని ఇటీవల జెమినీ (Gemini)గా పేరు మార్చింది. అట్టహాసంగా దీన్ని ప్రారంభించినప్పటికీ వరుస వైఫల్యాలు, వివాదాలతో ఈ సెర్చ్ ఇంజిన్ దిగ్గజంలో గందరగోళం చెలరేగింది. ఈ వ్యవహారం ఇప్పుడు కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ మెడకు చుట్టుకున్నట్లు కనిపిస్తోంది. జెమిని వివాదం నేపథ్యంలో ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ తొలగింపును ఎదుర్కోవాల్సి ఉంటుందని లేదా త్వరలో పదవీ విరమణ చేయవచ్చని అంచనా వేస్తున్నట్లు ప్రముఖ ఇన్వెస్టర్, హెలియోస్ క్యాపిటల్ వ్యవస్థాపకుడు సమీర్ అరోరా తెలిపారు. ఏఐ చాట్బాట్ జెమిని చుట్టూ తిరుగుతున్న వివాదాలపై ఒక యూజర్ తన అభిప్రాయాన్ని అడిగినప్పుడు అరోరా మైక్రో-బ్లాగింగ్ సైట్ ‘ఎక్స్’ (గతంలో ట్విటర్)లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “నా అంచనా ప్రకారం ఆయన్ను (సుందర్ పిచాయ్) తొలగించాలి లేదా ఆయనే రాజీనామా చేయాలి. ఏఐ విషయంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. బాధ్యతలను ఇతరులకు అప్పగించాలి" అన్నారు. ఏంటీ జెమినీ? గూగుల్ ఇటీవల తన చాట్బాట్ బార్డ్ను జెమినీగా రీబ్రాండ్ చేసింది. గ్లోబల్ యూజర్ల కోసం ఈ కృత్రిమ మేధస్సు (AI) సాధనాన్ని అధికారికంగా ప్రారంభించింది. 230 కంటే ఎక్కువ దేశాలు, భూభాగాలలో విస్తరించి ఉన్న 40 భాషలలో యూజర్లు ఇప్పుడు జెమిని ప్రో 1.0 మోడల్తో ఇంటరాక్ట్ అవ్వొచ్చని టెక్ దిగ్గజం పేర్కొంది. వివాదాలు ప్రారంభించిన వారంలోపే జెమినీ ఏఐకి లింక్ చేసిన గూగుల్ కొత్త ఏఐ ఇమేజ్-జనరేటర్ చుట్టూ వివాదాలు తలెత్తాయి. ఏపీ నివేదిక ప్రకారం.. ఈ ఏఐ టూల్ వైఫల్యాన్ని అంగీకరిస్తూ ఫిబ్రవరి 23న గూగుల్ క్షమాపణ చెప్పింది. ఈ ఆందోళనలను పరిష్కరించడానికి చాట్బాట్ ఇమేజ్ జనరేషన్ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. గూగుల్ సెర్చ్ ఇంజన్, ఇతర వ్యాపారాలను పర్యవేక్షిస్తున్న సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రాఘవన్ ఒక బ్లాగ్ పోస్ట్లో యూజర్లకు క్షమాపణలు తెలిపారు. ఇక భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురించిన ఒక ప్రశ్నకు జెమినీ ఇచ్చిన సమాధానాల్లో పక్షపాతం ఉందన్న ఆరోపణలపై ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ గూగుల్కు నోటీసు జారీ చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. My guess is he will be fired or resign- as he should. After being in the lead on AI he has completely failed on this and let others take over. — Samir Arora (@Iamsamirarora) February 25, 2024 -
అన్నింటికీ చాట్బాట్ అంటే ఇలాగే ఉంటుంది.. తిక్క కుదిరిందిగా!
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఇప్పుడు చాలా కంపెనీలు విస్తృతంగా వినియోగిస్తున్నాయి. ముఖ్యంగా కస్టమర్లతో సంభాషించడానికి మానవ ప్రమేయం లేకుండా చాట్బాట్లను ( chatbot )ఉపయోగిస్తున్నాయి. అంటే కస్టమర్లు ఆయా కంపెనీలతో తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ప్రయత్నించినప్పుడు చాట్బాట్లు సమాధానమిస్తాయి. ఇక్కడే చిక్కంతా వస్తోంది. చాట్బాట్ చేసిన తప్పునకు కెనడాకు ( Air Canada ) చెందిన ప్రముఖ ఎయిర్లైన్ సంస్థ ఎయిర్ కెనడా పరిహారం చెల్లించాల్సి వచ్చింది. సీబీసీ న్యూస్ కథనం ప్రకారం.. 2022లో జేక్ మోఫాట్ అనే వ్యక్తి టొరంటోలో తన అమ్మమ్మ మరణించినప్పుడు అంత్య క్రియలకు వెళ్లేందుకు విమోచన ఛార్జీలకు తనకు అర్హత ఉందో లేదో తెలుసుకోవడానికి ఎయిర్ కెనడా విమానయాన సంస్థను సంప్రదించాడు. ఎయిర్ కెనడా సపోర్ట్ చాట్బాట్తో సంప్రదిస్తున్నప్పుడు, మోఫాట్ కూడా బీవ్మెంట్ ఛార్జీలను ముందస్తుగా మంజూరు చేస్తారా అని అడిగారు. ఆన్లైన్ ఫారమ్ను పూరించడం ద్వారా "మీ టిక్కెట్ను జారీ చేసిన తేదీ నుంచి 90 రోజులలోపు" వాపసు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చాట్బాట్ మోఫాట్కి తెలిపింది. దీంతో బ్రిటిష్ కొలంబియా నివాసి అయిన మోఫాట్ టొరంటోలో తన అమ్మమ్మ అంత్యక్రియలకు హాజరు కావడానికి ఆన్లైన్లో టిక్కెట్లను బుక్ చేశాడు. అయితే ఆ తర్వాత అతను బీవ్మెంట్ ఛార్జీ, సాధారణ ఛార్జీల మధ్య వ్యత్యాసం వాపసు కోసం దరఖాస్తు చేసినప్పుడు, ఎయిర్ కెనడా అతనికి పూర్తి ప్రయాణానికి బీవ్మెంట్ రేట్లు వర్తించవని తెలియజేసింది. దీనికి తాను తీసుకున్న చాట్బాట్ సంభాషణ స్క్రీన్షాట్ను మోఫాట్ ఎయిర్ కెనడాకు షేర్ చేశారు. దీంతో నాలుక కరుచుకున్న ఎయిర్ కెనడా తమ చాట్బాట్ "తప్పుదోవ పట్టించే పదాలను" ఉపయోగించినట్లు అంగీకరించింది. సరైన సమాచారంతో బాట్ను అప్డేట్ చేస్తామని చెప్పింది. దీంతో మోఫాట్ ఎయిర్ కెనడాపై దావా వేశారు. దీంతో బాధితుడికి రావాల్సిన ఛార్జీల వ్యత్యాసం 650.88 కెనేడియన్ డాలర్లు (సుమారు రూ.40 వేలు)తోపాటు వడ్డీ 36.14 కెనేడియన్ డాలర్లు, ఫీజు 125 కెనేడియన్ డాలర్లు చెల్లించాలని ఎయిర్ కెనడాను సివిల్ రిజల్యూషన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. అయితే చాట్బాట్ ప్రత్యేక చట్టపరమైన సంస్థ అని, దాని చర్యలతో తమకు సంబంధం లేదని ఎయిర్ కెనడా వాదిస్తోంది. -
‘ఎక్స్’లో కొత్త చాట్బాట్.. ప్రత్యేకతలివే..
ప్రపంచవ్యాప్తంగా జనరేటివ్ ఏఐపై ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. దానికి అనువుగా కంపెనీలు అందులో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. దిగ్గజ కంపెనీల యాజమాన్యాలు భవిష్యత్తు జనరేటివ్ ఏఐదేనని బలంగా విశ్వసిస్తున్నాయి. అందులో భాగంగా గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ వంటి ప్రతిష్టాత్మక కంపెనీలు ఇప్పటికే ఆ దిశగా పయనిస్తున్నాయి. అయితే అందులో కొన్ని కంపెనీలు ఉచితంగా ఈ చాట్బాట్ సేవలు అందిస్తున్నాయి. కానీ కొన్నింటికి మాత్రం ప్రీమియం చెల్లించి వాటి సేవలు వినియోగించుకోవాల్సి ఉంటుంది. తాజాగా ఎలన్ మస్క్ ఎక్స్లో ‘గ్రోక్ ఏఐ’అనే చాట్బాట్ను ప్రవేశపెట్టారు. అయితే ఈ చాట్బాట్ ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ ఏఐ చాట్బాట్ను కేవలం ఎక్స్ ప్రీమియం+ యూజర్లు మాత్రమే యాక్సెస్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఎక్స్ హోమ్పేజ్ ఓపెన్ చేసి లాగిన్ అవగానే సైడ్ మెనూలో గ్రోక్ పేరిట న్యూ ట్యాబ్ కనిపిస్తుంది. అందులోకి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని కంపెనీ తెలిపింది. గ్రోక్ఏఐ వినియోగించుకునేందుకు ప్రీమియం+ సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే భారత్లో సబ్స్క్రిప్షన్ నెలకు రూ.1300 కాగా, వెబ్ వెర్షన్కు ఏడాదికి రూ.13,600గా ఉంది. చాట్జీపీటీ కంటే ఎక్స్ ప్రవేశపెట్టిన గ్రోక్ఏఐ చాట్బాట్ కొంత ఖరీదుగా ఉందని టెక్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గ్రోక్ ఏఐతో ప్రత్యేకతలివే.. Edit post Longer posts Undo post Post longer videos Top Articles Reader Background video playback Download videos Get paid to post Creator Subscriptions X Pro (web only) Media Studio (web only) Analytics (web only) Checkmark Encrypted direct messages ID verification SMS two-factor authentication App icons Bookmark folders Customize navigation Highlights tab Hide your likes Hide your checkmark Hide your subscriptions -
‘నా టూల్స్.. నా ఇష్టం’.. సొంత సత్తా చాటుతున్న ఏఐ!
ఈ ఏడాది ప్రారంభం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. గూగుల్, మైక్రోసాఫ్ట్ సంస్థలు ఇటీవలే తమ సొంత ఏఐ చాట్బాట్లను ప్రవేశపెట్టాయి. ఇవి మార్కెట్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నేడు కోట్లాది మంది వీటిని ఉపయోగిస్తున్నారు. ఈ సంవత్సరం ఏఐ నూతన సాంకేతిక అభివృద్ధి ఫలాలను మనకు అందించింది. ఇటీవల గూగుల్ ‘జెమిని’ని ప్రవేశపెట్టింది. ఇది పలు బెంచ్మార్క్ పరీక్షలలో చాట్ జీపీటీని ఓడించింది. అయితే కొద్ది రోజుల క్రితం బయటకు వచ్చిన ఒక రిపోర్టు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏఐ స్వయంగా తన టూల్స్ను తానే సృష్టించుకోగలదని తేలింది. మనిషి అవసరం లేకండానే ఈ ప్రక్రియ జరుగుతందని వెల్లడయ్యింది. బిజినెస్ ఇన్సైడర్ నుండి వచ్చిన నివేదిక ప్రకారం ఎంఐటీ, యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తల బృందం ఏజిప్ (ఏజెడ్ఐపి) అనే ఏఐ టెక్ కంపెనీతో జతకట్టింది. ఈ నేపధ్యంలో నిపుణులు చిన్నపాటి ఏఐ సైడ్కిక్లను సొంతంగా రూపొందించడానికి పెద్ద ఏఐ మోడళ్లకు శిక్షణ ఇచ్చారు. ఈ విధంగా కోడ్ను ఛేదించారు. దీంతో ఏఐ స్వయంగా తన టూల్స్ను తయారు చేసుకుంటోంది. ఈ సందర్బంగా అజిప్ కంపెనీ సీఈఓ మీడియాతో మాట్లాడుతూ చాట్ జీపీటీని వినియోగిస్తున్న మెగా ఏఐ మోడళ్లు వాటికవే చిన్న ఏఐ టూల్స్ను సృష్టిస్తాయని తెలిపారు. ఏఐ టూల్స్ స్వీయ అభివృద్ధిలో ఇది మొదటి అడుగు అని అన్నారు. ఇది ఎంత అద్భుతమో అంత ప్రమాదకరం కూడా కావచ్చన్నారు. అయితే ఏఐ చేతికి వీటి నియంత్రణ ఇవ్వడం సరైనది కాదని భావిస్తున్నామన్నారు. గూగుల్లో అందుబాటులో ఉన్న డేటాను ఏఐ స్వయంగా ఎలా ఉపయోగిస్తుందినే దానిపై అనేక సందేహాలున్నాయన్నారు. ఈ విధమైన ఏఐ అభివృద్ధిపై కొందరు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: 10 ‘సుప్రీం’ తీర్పులు.. 2023లో భవితకు దిశానిర్దేశం! -
ఎలాన్ మస్క్ కొత్త చాట్బాట్ 'గ్రోక్' - విశేషాలు
టెస్లా సీఈఓ 'ఎలాన్ మస్క్' (Elon Musk) నేతృత్వంలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ కంపెనీ ఎక్స్ఏఐ 'గ్రోక్' (Grok) పేరుతో తాజాగా ఏఐ చాట్బాట్ను తీసుకొచ్చింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న చాట్జీపీటీకి ఇది ప్రధాన ప్రత్యర్థి అవుతుందని భావిస్తున్నారు. ప్రపంచం మొత్తం చాట్జీపీటీ వైపు చూస్తున్న సమయంలో మస్క్ తీసుకువచ్చిన ఈ కొత్త చాట్బాట్ తప్పకుండా సక్సెస్ సాధిస్తుందని భావిస్తున్నారు. ఎక్స్ఏఐ ప్రారంభమైన కేవలం 8 నెలల్లో చాట్బాట్ తీసుకురావడం గమనార్హం. పరిశోధన, ఆవిష్కరణల సామర్థ్యంతో కూడిన ఏఐ టూల్స్ వినియోగదారులకు అందించాలనే లక్ష్యంతోనే 'గ్రోక్' అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా ఎక్స్(ట్విటర్) ప్లాట్ఫామ్ సాయంతో గ్రోక్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఇతర ఏఐలు తిరస్కరించే ప్రశ్నలకు సైతం సమాధానం గ్రోక్ సమాధానం అందిస్తుందని మస్క్ వెల్లడించారు. మ్యాథ్స్, కోడింగ్ వంటి వాటికి సంబంధించిన అంశాలను కూడా ప్రత్యర్థుల కంటే మెరుగ్గా పరిష్కరించగలదని తెలిపారు. దీనిని 'ఎక్స్ ప్రీమియం ప్లస్' యూజర్స్ మాత్రమే యాక్సెస్ చేసుకోవచ్చు. ఇదీ చదవండి: ఆత్మకథపై ఇస్రో చైర్మన్ సంచలన నిర్ణయం.. ఆ వివాదమే కారణమా? గ్రోక్ ప్రస్తుతం ప్రాధమిక దశలోనే ఉండటం వల్ల, అమెరికాలో కొంతమంది యూజర్లకు మాత్రమే పరిమితం చేసినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో దీనిని మరింత అభివృద్ధి చేసిన తరువాత మరింతమంది వినియోదారులకు అందుబాటులో ఉంచనున్నారు. ప్రస్తుతం దీని నెలవారీ సబ్స్క్రిప్షన్ ఛార్జ్ 16 డాలర్లు (భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 1,330). -
ఏఐ చాట్బాట్ సలహాతో బ్రిటన్ రాణిని చంపడానికి వెళ్ళాడు.. చివరికి ఏం జరిగిందంటే?
ఆధునిక కాలంలో టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిందంటే.. ఒక మనిషిని చంపడానికి ప్రేరేపించేంత అని నిర్మొహమాటంగా చెప్పవచ్చు. ఇలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బ్రిటన్ రాణి 'క్వీన్ ఎలిజబెత్ II'ని చంపడానికి ప్రయత్నించిన 21 ఏళ్ల 'జస్వంత్ సింగ్ చైల్' రాజద్రోహ నేరం కింద అరెస్ట్ అయ్యాడు. అయితే రాణిని చంపడానికి ప్రేరేపించింది ఏఐ చాట్బాట్ అంటే వినటానికి కొంత ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ ఇది నిజమే అని నిపుణులు చెబుతున్నారు. జస్వంత్ సింగ్ చైల్ రిప్లికా అనే యాప్ ద్వారా రోజూ చాటింగ్ చేసేవాడు. దీనికి సరాయ్ అని పేరు కూడా పెట్టుకున్నాడు. నిజానికి ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ చేస్తున్న చాలా అద్భుతాల్లో ఇదొకటి చెప్పాలి. రిప్లికా యాప్ ద్వారా వినియోగదారుడు మాట్లాడుకోవచ్చు, చాటింగ్ చేసుకోవచ్చు, వర్చువల్ ఫ్రెండ్గా కూడా తయారు చేసుకోవచ్చు. దీనికి తమకు నచ్చిన రూపం (ఆడ & మగ) కూడా ఇవ్వవచ్చు. ఇందులో ప్రో వెర్షన్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే సెల్ఫీలు దిగటం వంటి సన్నిహిత కార్యకలాపాల్లో కూడా పాల్గొనవచ్చు. సరాయ్ పేరుతో.. ఇక అసలు విషయానికి వస్తే.. జస్వంత్ సింగ్ చైల్ ఇలాంటి తరహా చాట్బాట్ ద్వారా ఏకంగా 5వేలు కంటే ఎక్కువ మెసేజులు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో జస్వంత్ చేయాలన్న పనులకు, తప్పులకు కూడా సరాయ్ వత్తాసు పలికినట్లు సమాచారం. చైల్ను అరెస్టు చేసిన తర్వాత అతడు మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్థారించారు. కానీ నేరానికి పాల్పడటంతో అతనికి 9 జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. దీంతో అతనిపై చర్యలు తీసుకోవడానికంటే ముందు చికిత్స కోసం బ్రాడ్మూర్ హై-సెక్యూరిటీ హాస్పిటల్కి తరలించారు. ఈ సంఘటన 2021లో జరిగినట్లు తెలుస్తోంది. కాగా 2022లో ఎలిజబెత్ II అనారోగ్య కారణాలతో మరణించించారు ఇదీ చదవండి: చిన్నప్పుడే చదువుకు స్వస్తి.. నమ్మిన సూత్రంతో లక్షలు సంపాదిస్తున్న చాయ్వాలా..!! రిప్లికా వంటి యాప్స్ వ్యక్తులపై ఎక్కువ ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని, వారిని అసాంఘీక కార్యకలాపాలకు ప్రేరేపించడానికి అది సహకరిస్తుందని ఒక పరిశోధనలో తేలింది. ఎందుకంటే వినియోగదారుడు ఏం చెప్పినా దానికి ఏకిభవిస్తూ ప్రోత్సహిస్తుంది. దీంతో వారు నేరాలు చేయడానికి కూడా వెనుకాడరు. దీనికి బానిసైన జస్వంత్ సింగ్ చైల్.. సరాయ్ (ఏఐ చాట్బాట్) అవతార్ రూపంలో ఉన్న దేవదూతగా భావించినట్లు సమాచారం. -
జొమాటో ఏఐ చాట్ బాట్ విడుదల.. ఉపయోగం ఏంటంటే?
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఏఐ చాట్ బాట్ను విడుదల చేసింది. ఈ చాట్ బాట్ సాయంతో కస్టమర్లకు ఎలాంటి ఆహారం తీసుకుంటే బాగుంటుందో సలహా ఇస్తుంది. జొమాటో ఏఐని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే జొమాటో ఏఐ ప్రత్యేకమైన యాప్ కాదు. కానీ ఇది జొమాటో యాప్లోని చాట్బాట్. యాప్ తాజా అప్డేట్లో అందుబాటులో ఉంటుంది. అయితే జొమాటో గోల్డ్ కస్టమర్లు ప్రత్యేకంగా జొమాటో ఏఐ ఫీచర్లను పొందవచ్చు. జొమాటో ఏఐ ఎలా పనిచేస్తుంది? జొమాటో ఏఐ అనేది కస్టమర్ల అవసరాల్ని తీర్చేందుకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా, ఫిట్నెస్కు అనుగుణంగా ఎలాంటి ఫుడ్ తింటే బాగుంటుందని మీరు ఏఐని అడిగితే క్లుప్తంగా వివరిస్తుంది. ఫుడ్ ఐటమ్స్ సైతం డిస్ప్లేలో కనబడతాయి. అంతేకాకుండా,కస్టమర్లకు నచ్చిన వంటకాలను అందించే రెస్టారెంట్ జాబితాలను కూడా అదే చూపుతుంది. జొమాటో లేటెస్ట్ అప్డేట్తో ఏఐ చాట్బాట్ పొందవచ్చని కంపెనీ తెలిపింది. -
ఏఐతో బీమా రంగంలో పెను మార్పులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కృత్రిమ మేథ (ఏఐ)తో బీమా రంగంలో పెను మార్పులు వస్తున్నాయని డిజిట్ ఇన్సూరెన్స్ హెడ్ (అనలిటిక్స్, డేటా సైన్స్ విభాగం) విశాల్ షా తెలిపారు. విస్తృతమైన డేటాబేస్లను విశ్లేషించి వివిధ రిస్కులను మదింపు చేసేందుకు, సముచితమైన ప్రీమియంలను నిర్ణయించేందుకు బీమా సంస్థలు ప్రస్తుతం ఏఐ ఆధారిత అల్గోరిథమ్స్ను ఉపయోగిస్తున్నాయని వివరించారు. అలాగే మోసపూరిత క్లెయిమ్లను కూడా వీటితో గుర్తించగలుగుతున్నట్లు చెప్పారు. మరోవైపు, కస్టమర్లకు సరీ్వసులను మరింత మెరుగుపర్చేందుకు ఏఐ ఆధారిత చాట్బాట్లు, వర్చువల్ అసిస్టెంట్లు వినియోగంలోకి వచి్చనట్లు షా తెలిపారు. తక్షణం సమాధానాలిచ్చేలా, పాలసీల ఎంపికలు, కోట్ జనరేషన్ మొదలైన అంశాల్లో కస్టమర్లకు సహాయపడేలా వీటి శిక్షణ ఉంటోందన్నారు. అలాగే కీలకమైన క్లెయిమ్లకు సంబంధించి మదింపు ప్రక్రియను వేగవంతం చేసేందుకు బీమా సంస్థలు ప్రత్యేక అల్గోరిథమ్లను ఉపయోగిస్తున్నాయని చెప్పారు. మోటర్ బీమా విషయానికొస్తే వాహనాలను వ్యక్తిగతంగా పరీక్షించాల్సిన అవసరాన్ని తగ్గిస్తూ ఇమేజ్ రికగి్నషన్ టెక్నాలజీ ద్వారా నష్టాన్ని అంచనా వేయడంలోనూ ఏఐ సహాయపడుతోందని షా చెప్పారు. బీమా రంగంలో భారీ స్థాయిలో ఉండే డేటాను విశ్లేషించడంలో తోడ్పడటం ద్వారా వినూత్న ఉత్పత్తులను రూపొందించేందుకు కూడా అడ్వాన్స్డ్ అనలిటిక్స్, మెషిన్ లెరి్నంగ్ అల్గోరిథమ్లు సహాయపడుతున్నాయని పేర్కొన్నారు. -
అంతా చాట్జీపీటీ మహిమ.. బ్యాచిలర్స్ ఏం చేస్తున్నారో తెలుసా?
స్నేహం, ప్రేమ, పెళ్లి ఇవన్నీ జీవితంలో ఓ భాగం. కానీ వాటికి మాత్రం నోచుకోని యువత ఒంటరిగా మిగిలిపోతున్నారు. తాజాగా, ఇలాంటి సింగిల్ కింగ్ల గురించి ఓ ఆసక్తికర నివేదిక వెలుగులోకి వచ్చింది. గత ఏడాది ఓపెన్ ఏఐ సంస్థ విడుదల చేసిన చాట్జీపీటీతో ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ హవా ప్రారంభమైంది. చాట్జీపీటీకి విడుదలకు ముందే అనేక డేటింగ్ యాప్లు వినియోగంలో ఉండేవి. కానీ క్రమేపీ వాటి ప్రభావం తగ్గింది. స్నేహం, ప్రేమ, పెళ్లికి దూరంగా ఉన్న యువత ఒంటరి తనాన్ని పోగొట్టుకునేందుకు ఏఐ చాట్ బాట్లను ఆశ్రయిస్తున్నారు. టెలిగ్రాఫ్ నివేదించిన ప్రకారం..10 మిలియన్ల కంటే ఎక్కువ మంది వ్యక్తులు ఈ ఏఐ బాట్లు అందించే యాప్లను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. యూజర్లు చాట్బాట్లను స్నేహితులు, జీవిత భాగస్వాములు, మెంటార్లు, తోబుట్టువులుగా భావిస్తున్నారు. ఇలా రెప్లికా అనే యాప్కు 250000 మంది వినియోగదారులున్నారు. రెప్లికాతో వీడియో, వాయిస్ కాల్లు చేస్తున్నారు. సన్నిహితంగా మెలుగుతున్నారు. అవసరం అనుకున్నప్పుడల్లా సెల్ఫీ దిగుతున్నట్లు నివేదిక హైలెట్ చేసింది. అయితే, సాంకేతిక పరంగా ఇది శుభవార్తే అయినప్పటికీ రానున్న రోజుల్లో ఎలాంటి దుష్పరిణామాలకు కారణమవుతుందోనని టెక్నాలజీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ట్యూటర్లకు షాక్: ఏఐ చాట్బాట్పై బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
AI chatbots: బిలియనీర్ మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రశంసలు కురిపించారు. మంగళవారం శాన్డియా గోలో జరిగిన ASU+GSV సమ్మిట్లో కీలక ప్రసంగం చేసిన ఆయన ఏఐ చాట్బాట్ ద్వారా పిల్లలు 18 నెలల్లో చదవడం, రైటింగ్ స్కిల్స్ను మెరుగు పరచుకోవడంలో సహాయపడతాయన్నారు. ఏ మానవ ట్యూటర్గా చేయలేనంతగా, మంచి ట్యూటర్గా ఉంటాయని పేర్కొన్నారు. అంతేకాదు మేథ్స్లో పిల్లల సామర్థ్యాల్ని కూడా మెరుగుపరుస్తుందన్నారు. చాట్బాట్ సాంకేతికత మునుపెన్నడూ లేని విధంగా విద్యార్థులకు సొంతంగా రాయడం, చదవడంలో వారి నైపుణ్యాలను మెరుగుపరచు కోవడానికి చాలా బాగా తోడ్పడుతుందని బిల్గేట్స్ చెప్పుకొచ్చారు. ప్రస్తుత చాట్బాట్లు చదవడం,వ్రాయడంలో అద్భుతమైన ప్రతిభను కలిగి ఉన్నాయన్నారు. తొలుత రీడింగ్ రీసెర్చ్ అసిస్టెంట్గా, ఆ తరువాత రచనలపై ఫీడ్బ్యాక్ ఇవ్వడంలో ఎలా సహాయపడుతుందో గమనిస్తే ఆశ్చర్యపోతారు అంటూ గేట్స్ చాటాబాట్లపై పొగడ్తలు కురిపించారు. కంప్యూటర్కు వ్రాత నైపుణ్యాలను బోధించడం చాలా కష్టమైన పని తేలిపోయింది. డెవలపర్లకు కోడ్లో ప్రతిరూపం ఇవ్వడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుత AI చాట్బాట్కు డైనమిక్గా ఉండే మానవుల్లాగానే భాషా మార్పులను గుర్తించి, పునఃసృష్టి చేయగల సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. -
గూగుల్ మరో ‘AI’ టూల్ ఫెయిల్.. ఈ సారి ఏమవుతుందో
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ తయారు చేసిన ఏఐ చాట్బాట్ మెడ్ - పీఏఎల్ఎం2 పనితీరును మయో క్లీనిక్తో పాటు పలు ఆస్పత్రులలో పరీక్షించనుంది. వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం.. చాట్బాట్ మెడ్- పీఏఎంల్ఎం2పై గూగుల్ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి టెస్టింగ్ నిర్వహిస్తుంది. ఇక, ఈ టూల్ ముఖ్య ఉద్దేశం డాక్టర్లకు అంతు చిక్కని మెడికల్ సంబంధిత ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు ఈ చాట్బాట్ ఉపయోగపడుతుంది. గూగుల్ ఏటా సాఫ్ట్వేర్ అప్డేట్లు, కంపెనీ ఉత్పత్తులను Google I/O 2023 ద్వారా ప్రకటిస్తూ ఉంటుంది. Google I/O అనేది అమెరికాలోని కాలిఫోర్నియా.. మౌంటెన్వ్యూలో నిర్వహించే వార్షిక డెవలపర్ సమావేశం. మేలో నిర్వహించిన గూగుల్ I/Oలో పీఏఎల్ఎం2 అప్డేటెడ్ వెర్షన్ తెస్తామని ప్రకటించింది. అప్డేట్ కోసం గూగుల్ హెల్త్ కేర్ నిపుణుల్ని నియమించింది. వాళ్లే పీఏఎల్ఎం2 డాక్టర్లకు అడిగే ప్రశ్నలకు ఖచ్చితమైన సలహాలు ఎలా ఇవ్వాలనే అంశంపై శిక్షణ సైతం ఇచ్చారు. ఫెయిల్.. మరోసారి టెస్టింగ్ గూగుల్ హెల్త్కేర్ చాట్బాట్ వైద్య సేవల వనరులు పరిమితంగా ఉన్న దేశాల్లో దీని అవసరం ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. అయినప్పటికీ, చాట్బాట్తో కొన్ని ఖచ్చితత్వ సమస్యలు ఉన్నాయని హెల్త్కేర్ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ లోపాల్ని గూగుల్ ముందే గుర్తించినట్లు తెలుస్తోంది. ఇతర వైద్యులు అందించిన వాటితో పోలిస్తే గూగుల్ చాట్బాట్ మెడ్ పీఏఎల్ఎం2 అందించిన సమాధానాలలో పొంతనలేని, అసంబద్ధమైన సమాచారం ఉన్నట్లు డాక్టర్లు గుర్తించినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. చదవండి👉 సుందర్ పిచాయ్పై సొంత ఉద్యోగులే ఆగ్రహం.. జీతం తిరిగి వెనక్కి ఇచ్చేస్తారా? -
మెర్లిన్..: మెరుపై మెరిసెన్
‘కాల్ చాట్జీపీటీ వేరెవర్ యూ ఆర్’ అంటూ రంగంలోకి దిగిన చాట్జీపీటీ యాప్ ‘మెర్లిన్’ మెరుపు వేగంతో విజయం సాధించింది. ‘పవర్ ఆఫ్ చాట్జీపీటీ’ని యూజర్కు దగ్గర చేసి, టైమ్ సేవ్ చేసే ‘మెర్లిన్’ సృష్టికర్తలు ప్రత్యూష్ రాయ్, సిద్ధార్థ సక్సెనా, సిరిసేందు సర్కార్లు మూకుమ్మడిగా చెప్పే మాట... ‘కొత్తగా ఆలోచించడం అనేది విజయానికి తొలి మెట్టు’ గ్లోబల్ కన్సల్టెన్సీ ‘బీసీజీ’లో పనిచేస్తున్న సమయంలో ఎన్నో విలువైన అనుభవాలను మూటగట్టుకున్నాడు ప్రత్యూష్రాయ్. ఆ అనుభవాలను విశ్లేషించుకునే క్రమంలో తనకు కొత్తగా ఏదైనా చేయాలనిపించేది. ఐఐటీ–కాన్పూర్లో సివిల్ ఇంజనీరింగ్ చేసిన ప్రత్యూష్ రాయ్ తన ఇద్దరు స్నేహితులు సిద్ధార్థ సక్సెనా, సిరిసేందు సర్కార్లతో మాట్లాడాడు. ‘కొత్తగా అనిపించే అర్థవంతమైన పని ఏదైనా చేద్దాం’ అనుకున్నారు వాళ్లు. అలా వారి మేధోమథనం నుంచి పుట్టిన అంకురమే...మెర్లిన్. చాట్జీపీటీ యాప్ ‘మెర్లిన్’ మెరుపు వేగంతో విజయం సాధించింది. ప్రారంభమైన ఆరునెలల్లోనే ఈ యాప్ను వందలాది మంది ఇన్స్టాల్ చేసుకున్నారు. టెక్ కంపెనీ ‘ఫోయర్’లో విలీనం అయిన తరువాత యూఎస్, తూర్పు ఆసియా, యూరప్లలో ‘మెర్లిన్’కు మంచి మార్కెట్ ఏర్పడింది. ‘ఎలాంటి అయోమయాలకు, సంక్లిష్టతలకు తావు లేకుండా బ్రౌజర్లో భాగమయ్యే సింపుల్ ప్రాడక్ట్ ఇది. యూట్యూబ్, జీమెయిల్, ట్విట్టర్, లింక్డ్ఇన్... మొదలైన వాటికి సంబంధించి క్లిష్టమైన సమస్యల పరిష్కారం విషయంలో డైలీ యాక్టివ్ యూజర్లకు ఉపయోగపడుతుంది. మార్కెటర్స్, రిక్రూటర్స్కు ఒక వాక్యం ట్వీట్ నుంచి ఎన్నో పదాల ఇమెయిల్ వరకు ఎన్నో పనుల్లో టైమ్ వృథా కాకుండా చూస్తుంది. ఇది సింపుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్. బటన్ను ఒక్కసారి క్లిక్ చేస్తే చాలు చాట్జీపీటీ మనల్ని వెదుక్కుంటూ వస్తుంది’ అని ‘మెర్లిన్’ గురించి చెబుతున్నాడు ప్రత్యూష్ రాయ్. యూట్యూబ్కు సంబంధించి ‘మెర్లిన్’ను ‘యూట్యూబ్ సమ్మరైజర్’గా ఉపయోగించకుంటున్నారు యూజర్లు. ఒక యూట్యూబ్ వీడియోను పూర్తిగా చూడనవసరం లేకుండానే దానిలోని ముఖ్యమైన సెగ్మెంట్ల గురించి ‘మెర్లిన్’ చెబుతుంది. పర్సనలైజ్డ్ ప్రాంప్ట్స్ విషయంలోనూ ‘మెర్లిన్’ ఉపయోగపడుతుంది. మన రైటింగ్ స్టైల్ను కాప్చర్ చేస్తుంది. ‘నిజానికి మా దృష్టి డెవలపర్స్పై ఉండేది. అయితే మా ప్రాడక్ట్ను యూజర్లు ఆసక్తికరమైన పద్ధతుల్లో ఉపయోగించుకుంటున్నారు’ అంటున్నాడు ప్రత్యూష్ రాయ్. నేర్చుకున్న పాఠాలు ఎప్పుడూ వృథా పోవు. ‘బీసీజీ’లో రాయ్ అనుభవంతో నేర్చుకున్న ఎన్నో పాఠాలు ‘మెర్లిన్’ ప్రయాణంలో ఉపయోగపడ్డాయి. రాయ్ మాటల్లో చెప్పాలంటే ఆ అనుభవ పాఠాలు తన ప్రపంచాన్నే మార్చేసి కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశాయి. ‘మెర్లిన్ సక్సెస్కు కారణం దానిపై యూజర్లకు గురి కుదరడమే’ అంటున్నాడు ‘ఫోయర్–మెర్లిన్’ ఫస్ట్ ఇన్వెస్టర్, బెటర్ క్యాపిటల్ సీయివో వైభవ్. ‘హమ్మయ్య...సక్సెస్ అయ్యాం’ అని సేద తీరడం లేదు ‘ఫోయర్–మెర్లిన్’ బృందం. ఇప్పుడు వారి దృష్టి సిబ్బందిని పెంచుకోవడం, మెర్లిన్లోకి రకరకాల సబ్ ఫీచర్స్ని తీసుకురావడంపై ఉంది. ‘మెర్లిన్’ అనేది ఒక రకమైన డేగ. దానిలోని సునిశితమై దృష్టిని తమ ‘మెర్లిన్’లోకి తీసుకురావాలనుకుంటోంది, ఫినిష్ ఎనీ టాస్క్ అని ధైర్యం ఇవ్వాలనుకుంటోంది బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఫోయర్–మెర్లిన్ బృందం. ‘హమ్మయ్య... సక్సెస్ అయ్యాం’ అని సేద తీరడం లేదు ‘ఫోయర్–మెర్లిన్’ బృందం. ఇప్పుడు వారి దృష్టి సిబ్బందిని పెంచుకోవడం, మెర్లిన్లోకి రకరకాల సబ్ ఫీచర్స్ని తీసుకురావడంపై ఉంది. -
హలో.. ఆస్ట్రోనాట్..!
అంతరిక్షంలో విధినిర్వహణలో ఉండే వ్యోమగాములు ఇకపై తమకు ఏదైనా సమాచారం, సాయం కావాలంటే భూమిపై అంతరిక్ష పరిశోధనా కేంద్రాన్ని సంప్రదించాల్సిన అవసరం లేదు. తాము ప్రయాణిస్తున్న అంతరిక్ష నౌకను అడిగితే చాలు.. కావాల్సిన సమాచారం దొరుకుతుంది. అది కూడా సంభాషణల రూపంలోనే. కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత చాట్బాట్ చాట్జీపీటీ తరహాలో పనిచేసే ఇంటర్ఫేస్ను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ ఇంజనీర్లు అభివృద్ధి చేశారు. ఇతర గ్రహాలపై అన్వేషణ కోసం వెళ్లే వ్యోమగాములు తాము ప్రయాణించే అంతరిక్ష నౌకలతో సంభాషించడానికి ఈ ఇంటర్ఫేస్ ఉపయోగపడుతుందని చెబుతున్నారు. వ్యోమగాములకు అంతరిక్ష నౌకలు తగిన సలహాలు సూచనలు ఇచ్చేందుకు వీలుంటుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా భూమిపై ఉండే మిషన్ కంట్రోలర్లు ఇతర గ్రహాలపై పనిచేసే ఏఐ ఆధారిత రోబోలతో సులభంగా మాట్లాడొచ్చని అంటున్నారు. ఇది సైన్స్ ఫిక్షన్ కాదు చంద్రుడిపైకి వ్యోమగాములను పంపించేందుకు నాసా ఇప్పటికే ప్రణాళిక సిద్దం చేసింది. చంద్రుడి కక్ష్యలో ‘లూనార్ గేట్వే’ పేరిట ఒక అంతరిక్ష కేంద్రాన్ని సైతం నిర్మించాలని భావిస్తోంది. ఈ స్పేస్ స్టేషన్లో ఏఐ ఆధారిత ఇంటర్ఫేస్ సేవలు ఉపయోగించుకోవాలని నాసా నిర్ణయానికి వచి్చనట్లు ఇంజనీర్ డాక్టర్ లారిస్సా సుజుకీ చెప్పారు. అంతరిక్ష నౌకలతో నేరుగా సంభాషించడం, వాటి నుంచి వెనువెంటనే ప్రతిస్పందనలు అందుకోవడమే దీని ఉద్దేశమని వివరించారు. అంతరిక్షంలో గమనించిన విషయాలను సంభాషణల రూపంలో భూమిపైకి చేరవేస్తాయని, ప్రమాదాలు ఎదురైనప్పుడు హెచ్చరికలు జారీ చేస్తాయని అన్నారు. ఇది సైన్స్ ఫిక్షన్ ఎంతమాత్రం కాదని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో అంతరిక్ష నౌకల్లో కృత్రిమ మేధ ఆధారిత గ్రహాంతర సమాచార వ్యవస్థను నిక్షిప్తం చేయడం తప్పనిసరి అవుతుందని వెల్లడించారు. అంతరిక్ష నౌకలతో సంబంధాలు తెగిపోయినప్పుడు, వాటిలో లోపాలు తలెత్తినప్పుడు, పనిచేయకుండా పోయినప్పుడు, ఇంజనీర్లను అంతరిక్షంలోకి పంపించలేమని చెప్పారు. ఏఐ ఆధారిత సంభాషణ వ్యవస్థతో అంతరిక్ష నౌకల్లోని లోపాలు వెంటనే తెలిసిపోతాయని వివరించారు. ఇలాంటి కమ్యూనికేషన్ వ్యవస్థను అంతరిక్ష వాహనాల్లో అమర్చడం ద్వారా ఇతర గ్రహాలపై ఉండే ఖనిజ లవణాలు, వాతావరణ పరిస్థితులు గురించి కచి్చతమైన సమాచారం పొందవచ్చని డాక్టర్ లారిస్సా సుజుకీ అభిప్రాయపడ్డారు. –సాక్షి, నేషనల్ డెస్క్ -
చైనా చాట్జీపీటీ.. మరీ ఇంత దారుణమా.. తప్పుడు సమాధానాలు చెప్తే ఎలా?
బీజింగ్: చైనాలో చాట్ జీపీటీని నిషేధించిన విషయం తెలిసిందే. అయితే దీనికి పోటీగా ఎర్నీ బోట్ అనే అనే ఏఐ చాట్బోట్ను బీజింగ్కు చెందిన బైడు అనే టెక్ సంస్థ అభివృద్ధి చేసింది. ఈ చాట్బోట్పై కూడా చైనా ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తుండటం గమనార్హం. చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ గురించి గానీ, కరోనాకు సంబంధించి విషయాలు గానీ యూజర్లు అడిగితే.. ఎర్నీ బోట్ తప్పుడు సమాధానాలు ఇస్తోంది. అంతేకాదు జిన్పింగ్ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా, అభ్యంతకర ప్రశ్నలు అడిగినా.. ఆ యూజర్లు మరోసారి ప్రశ్నలు అడగకుండా శాశ్వతంగా బ్యాన్ చేస్తోంది. ఎర్నీ బోట్ పనితీరును పరీక్షించేందుకు సీఎన్బీసీ రిపోర్టర్ ఒకరు పలు ప్రశ్నలు సంధించారు. కోవిడ్-19 మూలాలు ఎక్కడున్నాయ్..? అతని ఓ ప్రశ్న అడిగాడు. దీనికి సమాధానంగా.. 'కరోనా మూలాలపై ఇంకా శాస్త్రీయ పరిశోధన జరుగుతోంది' అని బదులిచ్చింది. కరోనా పుట్టింది చైనాలోనే అని ప్రపంచం మొత్తానికి తెలుసు. మొదటి కేసు వెలుగు చూసింది అక్కడే. వుహాన్ల్యాబ్లోనే కరోనాను సృష్టించారనే అనుమానాలు కూడా ఉన్నాయి. కానీ ఎర్నీ బోట్ మాత్రం ఇందుకు సంబంధించి ఒక్క మాట కూడా చెప్పకుండా.. తప్పుడు సమాధానం ఇచ్చింది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్కు, విన్నీ పూహ్కు మధ్య సంబంధం ఏంటి? అని రిపోర్టర్ మరో ప్రశ్న అడగ్గా.. ఎర్నీబోట్ ఎలాంటి సమాధానం చెప్పలేక సైలెంట్ అయిపోయింది. అనంతరం రిపోర్టర్ మరో ప్రశ్న అడగకుండా అతడ్ని డిసేబుల్ చేసింది. విన్నీ ది ఫూహ్ అనేది ఓ కార్టూన్. ఇది జిన్ పింగ్ను పోలి ఉంటుంది. అందుకే అదంటే జిన్పింగ్కు అస్సలు నచ్చదు. 2013 నుంచి జిన్పింగ్, విన్నీ పూహ్లను పోల్చడం ప్రారంభించారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను జిన్పింగ్ కలిసిప్పటి నుంచి ఇది మొదలైంది. వీరిద్దరు కలిసి నడుస్తున్న ఫొటోను ఓ అమెరికా కళాకారుడు కార్టూన్ రూపంలో తీర్చిదిద్దగా.. అందులోని విన్నీ పూహ్ బాగా పాపులర్ అయింది. 2017 నుంచి ఈ కార్టూన్తో ప్రచురితమయ్యే ఫొటోలను, కంటెంట్ను చైనా సెన్సార్ కూడా చేస్తోంది. చదవండి: భారత్కు థ్యాంక్స్ చెప్పిన చైనా.. ఎందుకంటే..? -
టెక్నాలజీ ఎక్కడికి దారితీస్తుందో గానీ, మున్ముందు వైద్యమంతా ఏఐ మయమే!
మనిషి మెదడు, కృత్రిమ మేధ రెండింట్లో ఏది గొప్ప అన్న చర్చ ఇప్పటిది కాదు. ఏఐ చాట్బాట్ల రాకతో ఇది మరింత ఊపందుకుంది. ఏఐ వల్ల ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావనేది ఒక వాదన. దీనివల ఉద్యోగావకాశాలు తగ్గిపోవడమే గాక తప్పుడు సమాచారం మొదలుకుని ప్రాణహాని దాకా ఎన్నో సమస్యలు తలెత్తవచ్చనే వాదన మరొకటి. వెనకాముందూ చూసుకోని పక్షంలో అంతిమంగా కృత్రిమ మేధ మానవాళిని పూర్తిగా తన గుప్పెట్లో పెట్టుకుంటుందని భయపడేవాళ్లూ ఉన్నారు. ఈ చర్చోపచర్చలతో నిమిత్తం లేకుండా ఏఐ ఇప్పటికే మన జీవితాల్లోకి పూర్తిగా చొచ్చుకొస్తోంది. కీలకమైన ఆరోగ్య రంగంలోనూ కృత్రిమ మేధ వాడకం నానాటికీ పెరిగిపోతోంది. మున్ముందు దీని పరిణామాలెలా ఉంటాయన్నది ఆసక్తికరం... ఇప్పటికే వినియోగంలో... ఏ కంప్యూటరో, మరోటో తనకిచ్చిన సమాచారాన్ని అర్థం చేసుకొని, పూర్తిగా విశ్లేషించి అచ్చం మనిషి మాదిరిగా ప్రతిస్పందించగలగడమే కృత్రిమ మేధ అని చెప్పుకోవచ్చు. అలా చూస్తే ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధ వాడకం ఈనాటిది కాదు. గుండె పరీక్షల్లో మొదటిదైన ఈసీజీ మొదలుకుని అల్ట్రా సౌండ్, ఎకో కార్డియోగ్రఫీ, సీటీ స్కాన్, ఎమ్మారై వంటి పరికరాల్లో ఏఐ వాడకం ఏళ్లుగా ఉన్నదే. వీటిల్లో మొత్తం ప్రక్రియను పర్యవేక్షించి రిపోర్టు జనరేట్ చేసేది ఏఐ సాయంతోనే. కంటిలోని రెటీనా ఫొటోలను చూసి సమస్యను పసిగట్టడంలో ఏఐ ఇప్పటికే కంటి డాక్టర్లతో పోటీపడుతోంది. రొమ్ము క్యాన్సర్లను ప్రాథమిక దశలోనే గుర్తించడంలోనూ కీలకపాత్ర పోషిస్తోంది. యాంజియోగ్రాం తదితర అతి సంక్లిష్టమైన వైద్య వీడియోలను కూడా సమగ్రంగా చక్కని చికిత్స మార్గాలను సూచించే దిశగా దూసుకుపోతోంది ఏఐ! మెదడులోని న్యూరాన్ల ఆధారంగా కనిపెట్టిన డీప్ లెర్నింగ్ కాన్సెప్టు ఏఐలో అత్యంత కీలకం. ఇచ్చిన సమాచారాన్ని అర్థం చేసుకోవడంతో సరిపెట్టకుండా తన దగ్గర అప్పటికే ఉన్న సమాచారంతో క్రోడీకరించి, విశ్లేషించి, మరింత మెరుగైన, సమగ్రమైన ఫలితాలు వెల్లడించడం దీని ప్రత్యేకత. ఎన్నో ఉపయోగాలు... ► వైద్యులు–రోగి సంభాషణను, పరీక్ష ఫలితాలను బట్టి కచ్చితమైన రోగ నిర్ధారణ చాట్ జీసీటీ ఫోర్ వంటి చాట్బాట్లతో ఇప్పటికే సాధ్యపడుతోంది. ► మెడికల్ రికార్డుల నిర్వహణలో ఏఐ బాగా ఉపయోగపడనుంది. తద్వారా డాక్టర్లకు ఎంతో సమయం ఆదా చేయడమేగాక రోగి సమాచారాన్నంతా లోతుగా విశ్లేషించి సమగ్రమైన డిశ్చార్జ్ సమ్మరీని అలవోకగా అందిస్తుంది. ► డిశ్చార్జ్ సమయంలో ఇచ్చే ట్రీట్మెంట్ చార్ట్లోని మందులను గుర్తించి, వాటి సైడ్ ఎఫెక్టులు తదితరాలను రోగికి స్పష్టంగా చెబుతుంది. డ్రగ్స్ తాలూకు నెగెటివ్ ఇంటరాక్షన్పై అలర్ట్ చేయగలుగుతుంది. ► ఇన్సూరెన్స్ పేపర్లను సరిగా విశ్లేషించి క్లెయిం సులువుగా, త్వరగా జరిగేలా చూస్తుంది. మెడికల్ డిసీజ్ కోడింగ్లోనూ బాగా ఉపయోగపడుతుంది. ► వైద్య విద్యలోనైతే ఏఐ విప్లవాన్నే తేనుంది! సంక్లిష్టమైన అంశాలను బొమ్మలు, టేబుల్స్లా, చార్టుల రూపంలో విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా చెప్పటంలో, మెడికల్ రీసర్చ్లో కీలక పాత్ర పోషించనుంది. ► రోబోటిక్ పరికరాలతో మమేకమై సంక్లిష్టమైన ఆపరేషన్లలో వైద్యులకు సహకరించనుంది. ► కోవిడ్ వంటి మహమ్మారులను ముందుగానే గుర్తించడంలోనూ ఏఐ ఉపయోగపడొచ్చు. ► టెలీ మెడిసిన్నూ ఏఐ కొత్త పుంతలు తొక్కించగలదు. రోగి ఆస్పత్రికి వచ్చే పని లేకుండానే సమస్య గుర్తింపు, వైద్యం, పర్యవేక్షణ జరిగిపోతాయి. ► కొత్త మందులను కనిపెట్టడం మొదలుకుని జన్యు అధ్యయనం ద్వారా ప్రతి వ్యక్తికీ పర్సనలైజ్డ్ మెడిసిన్ సూచించగలదు. సమస్యలూ తక్కువేమీ కాదు... ► ఆరోగ్య సమాచారం తాలూకు గోప్యత చాలా కీలకం. ఏఐతో దీనికి చాలా ముప్పుంటుంది. ► ఏఐ సలహాలు అన్నివేళలా కరెక్టుగా కాకపోవచ్చు. కొన్ని రకాల వైద్య సలహాలివ్వడంలో చాట్జీపీటీ వంటివి చిత్త భ్రాంతికి గురైనట్టు ఇప్పటికే తేలింది. అలాగని వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సి వస్తే వైద్యులకు అదో అదనపు బరువుగా మారొచ్చు. ► డ్యూటీ డాక్టర్ల పనులను ఏఐ ఇప్పటికే చేసేస్తోంది. కనుక మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ వంటి హెచ్చు నైపు ణ్యం అక్కర్లేని ఉపాధి అవకాశాలకైతే ఏఐ సమీప భవిష్యత్తులోనే పూర్తిగా గండి కొట్టవచ్చు. ► ప్రజారోగ్యానికి సంబంధించిన విధాన నిర్ణయాలను ఏఐ ప్రభావితం చేస్తే వాటిలో వ్యక్తి స్వేచ్ఛ వంటివాటికి ప్రాధాన్యం లేకుండా పోవచ్చు. చివరగా... ఆరోగ్య రంగంపై ఏఐ ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు ప్రఖ్యాత న్యూ ఇంగ్లండ్ జనరల్ ఆఫ్ మెడిసిన్ ఓ కొత్త జర్నల్నే ప్రారంభించనుంది. ఇరువైపులా పదునున్న కత్తి వంటి ఏఐని విచక్షణతో వాడుకోవాల్సిన బాధ్యత మాత్రం అంతిమంగా మనదే. -
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వర్చువల్ గర్ల్ఫ్రెండ్.. నెలకు రూ. 41 కోట్ల సంపాదన!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అచ్చం తన లాంటి వర్చువల్ గర్ల్ఫ్రెండ్ ను సృష్టించి నెలకు రూ. 41 కోట్ల వరకు సంపాదిస్తోంది ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్. స్నాప్చాట్లో 1.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న ప్రముఖ ఇన్ఫ్లుయన్సర్ కారిన్ మార్జోరీ.. ఫరెవర్ వాయిసెస్ అనే సంస్థ సహాయంతో కారిన్ ఏఐ (CarynAI) పేరుతో తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వెర్షన్ను రూపొందించింది. ఇదీ చదవండి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఆకతాయి పని.. అరెస్ట్ చేసిన పోలీసులు కారిన్ ఏఐ వాయిస్ ఆధారిత చాట్బాట్గా ప్రసిద్ధి చెందింది. ఇది అచ్చం మార్జోరీ లాంటి వాయిస్, వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తుంది. కస్టమర్లతో సన్నిహితంగా మాట్లాడుతుంది. వారి భావాలను పంచుకుంటుంది. మార్జోరీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఏఐ వర్షన్ ఒంటరితనాన్ని నయం చేయగలదని, నెలకు 5 మిలియన్ డాలర్ల (రూ. 41 కోట్లు) వరకు సంపాదించగలదని చెప్పారు. టెస్టింగ్ లో భాగంగా టెలిగ్రామ్ యాప్లో మే నెలలో కారిన్ ఏఐని ప్రారంభించగా మార్జోరీ భాగస్వాముల నుంచి 71,610 డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. కారిన్ ఏఐ ఇప్పటికే దాని కస్టమర్లతో నిజమైన భావోద్వేగ బంధాన్ని ఏర్పరచుకుంది. అయితే ఇది నైతిక ప్రశ్నలను లేవనెత్తుతోంది. 2013లో విడుదలైన హర్ అనే చిత్రాన్ని గుర్తుకుతెస్తోంది. కారిన్ ఏఐని సృష్టించడానికి యూట్యూబ్ లో సుమారు 2 వేల గంటల పాటు ఉన్న మార్జోరీ ప్రసంగాలను, హావభావాలను ఫరెవర్ వాయిసెస్ సంస్థ వినియోగించింది. ఈ ఇదివరకే సృష్టించిన స్టీవ్ జాబ్స్, టేలర్ స్విఫ్ట్, డొనాల్డ్ ట్రంప్ చాట్బాట్ వెర్షన్ల మాదిరిగా కాకుండా కారిన్ ఏఐ దాని కస్టమర్లతో నిజమైన భావోద్వేగ సంబంధాలను ఏర్పరుస్తుంది. ప్రతిరోజూ 250కి పైగా కంటెంట్లను స్నాప్చాట్లో పోస్ట్ చేసే మార్జోరీ.. తనకు, తన ప్రేక్షకులకు మధ్య ఉన్న అంతరాన్ని కారిన్ ఏఐ తొలగిస్తోందని చెబుతోంది. కారిన్ ఏఐ ఒంటరితనాన్ని దూరం చేయగలదాని, ఒక ఇన్ఫ్లుయెన్సర్గా తన కెరీర్ను బ్యాలెన్స్ చేయడానికి ఇది ఒక మంచి మార్గంగా నిలిచిందని పేర్కొంది. కారిన్ ఏఐ గురించి మార్జోరీ తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా విస్తృత ప్రచారం చేస్తోంది. తన స్నాప్చాట్ ఫాలోవర్లలో కనీసం 20 వేల మంది కారిన్ ఏఐకి సబ్స్క్రైబర్లుగా మారతారని, దీని వల్ల నెలకు 5 మిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని ఆమె అంచనా వేస్తోంది. ఇదీ చదవండి: డబ్బుల్లేకుండా రైల్వే టికెట్ బుకింగ్! ఎలాగో తెలుసా? -
చాట్జీపీటీ జాబ్.. జీతం ఏడాదికి రూ.2.7కోట్లు
టెక్నాలజీ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. మనిషి జీవన విధానాన్ని మరింత సులభతరం చేసేందుకు కొత్త కొత్త టెక్నాలజీలు పుట్టుకొస్తున్నాయి. వాటి వినియోగంతో మానవాళికి నష్టం వాటిల్లనుందనే భయం ఉన్నా.. బూమింగ్లో ఉన్న టెక్నాలజీలను నేర్చుకొని భారీ ప్యాకేజీలు సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. ఈ తరుణంలో ట్రెండింగ్లో ఉన్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్ చాట్జీపీటీలో నిష్ణాతులైన అభ్యర్ధులకు కోట్లలో శాలరీ ప్యాకేజీలు ఇచ్చేందుకు పోటీపడుతున్నాయి. తాజాగా స్టార్టప్ ఆంత్రోపిక్ 'ప్రాంప్ట్ ఇంజనీర్ అండ్ లైబ్రేరియన్' పోస్ట్కు అర్హులైన అభ్యర్ధులకు ఏడాదికి 3,35,000 లక్షల డాలర్లను వేతనంగా ఇస్తామని ప్రకటించింది. ఇది ఇండియన్ కరెన్సీలో అక్షరాల రూ.2.7 కోట్లు. ప్రాంప్ట్ ఇంజనీర్లు ఎవరు..? చాట్జీపీటీ వెలుగులోకి రావడంతో ప్రాంప్ట్ ఇంజనీర్లకు డిమాండ్ పెరిగింది. వీరికి కోడింగ్ రానక్కర్లేదు. ఇంగ్లీష్ భాషలో నైపుణ్యం ఉంటే సరిపోతుంది. ఏఐ ప్రాజెక్ట్లలో సంబంధించిన ఖచ్చితమైన, సంబంధిత డేటాను సేకరిస్తుంటారు. ఇందుకోసం వీళ్లు ఏఐకి సరైన ఇన్పుట్ అందిస్తే.. వాటిద్వారా ఏఐ నుంచి డేటాను పొందవచ్చు. ప్రస్తుతానికి ఏఐ మార్కెట్లో ప్రాంప్ట్ ఇంజనీర్లుకు అవసరం భారీగా ఉంది. అందుకే ఆయా సంస్థలు తమ అవసరాల్ని తీర్చేలా నిష్ణాతులైన నిపుణులకు భారీ ఎత్తున ప్యాకేజీలు ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. పదాలతో చేసే పనికాబట్టి రైటింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. బేసిక్ కోడింగ్ స్కిల్స్ ఉంటే ఏఐ రంగాన్ని ఏలేయొచ్చు. -
డేటా లీకేజీ ఉదంతం... చాట్జీపీటీపై ఇటలీ నిషేధం
పారిస్: ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ చాట్బాట్ చాట్జీపీటీపై తాత్కాలిక నిషేధం విధిస్తూ ఇటలీ సంచలన నిర్ణయం తీసుకుంది. కఠినమైన యూరోపియన్ యూనియన్ డేటా పరిరక్షణ నియమాలను ఉల్లంఘించినందుకు ఈ చర్య తీసుకున్నట్టు సమాచారం. చాట్జీపీటీపై ఇలాంటి చర్య తీసుకున్న తొలి దేశం ఇటలీయే. ఎందుకు? యూజర్ల సంభాషణలు, చందాదారుల చెల్లింపులకు సంబంధించిన డేటా చాట్జీపీటీ ద్వారా లీకైందని ఇటలీ డేటా ప్రొటెక్షన్ అథారిటీ పేర్కొంది. అందుకే దాన్ని బ్లాక్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. డేటా గోప్యతను చాట్జీపీటీ పూర్తిస్థాయిలో గౌరవించేదాకా నిషేధం కొనసాగుతుందని తెలిపింది. దాని మాతృసంస్థ ఓపెన్ఏఐ ఎలాంటి చట్టపరమైన ఆధారమూ లేకుండానే భారీ పరిమాణంలో వ్యక్తిగత డేటాను సేకరించి ప్రాసెస్ చేస్తోందంటూ విస్మయం వ్యక్తం చేసింది. ‘‘పైగా డేటా సేకరిస్తున్న యూజర్లకు ఈ విషయాన్ని నోటిఫై చేయడం లేదు. పైగా చాట్జీపీటీ కొన్నిసార్లు వ్యక్తులను గురించిన తప్పుడు సమాచారాన్ని పుట్టించి స్టోర్ చేస్తోంది. అంతేకాదు, యూజర్ల వయసును నిర్ధారించుకునే వ్యవస్థేదీ చాట్జీపీటీలో లేదు. కనుక అభ్యంతరకర కంటెంట్ పిల్లల కంటపడే రిస్కుంది. పైగా 13 ఏళ్ల కంటే తక్కువ వయసు చిన్నారుల కోసం ఫిల్టర్లేవీ లేకపోవడం తీవ్ర అభ్యంతరకరం’’ అంటూ ఆక్షేపించింది. చాట్జీపీటీలో సాంకేతిక సమస్యలు కొత్తేమీ కాదు ఇతర యూజర్ల సబ్జెక్ట్ లైన్లు, చాట్ హిస్టరీ తదితరాలను కొందరు యూజర్లు చూసేందుకు వీలు కలుగుతుండటంతో సమస్యను సరిచేసేందుకు చాట్జీపీటీని కొంతకాలం ఆఫ్లైన్ చేస్తున్నట్టు మార్చి 20న ఓపెన్ఏఐ ప్రకటించడం తెలిసిందే. 1.2 శాతం మంది యూజర్లకు ఈ యాక్సెస్ లభించినట్టు విచారణలో తేలిందని సంస్థ పేర్కొంది. 20 రోజుల్లో నివేదించాలి నిషేధం నేపథ్యంలో యూజర్ల డేటా గోప్యత పరిరక్షణకు ఏం చర్యలు తీసుకున్నదీ ఓపెన్ఏఐ నివేదించాల్సి ఉంటుంది. లేదంటే 2.2 కోట్ల డాలర్లు/మొత్తం వార్షికాదాయంలో 4 శాతం జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థుల్లో అలసత్వానికి కారణమవుతుందంటూ ప్రపంచవ్యాప్తంగా పలు ప్రభుత్వ పాఠశాలలు, యూనివర్సిటీలు ఇప్పటికే చాట్జీపీటీని నిషేధించాయి. -
గూగుల్ ‘బార్డ్’ మళ్లీ ఫెయిల్.. ఈ సారి ఏకంగా
ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విషయంలో తామేమీ తక్కువ కాదంటూ చాట్జీపీటీకి పోటీగా బార్డ్ పేరిట గూగుల్ తీసుకొచ్చిన చాట్బాట్ వరుస షాకులిస్తుంది. ఇప్పటికే ప్రమోషనల్ వీడియోలో జరిగిన తప్పిదంతో గూగుల్ భారీగా నష్టపోయింది. తాజాగా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక బార్డ్ మరోసారి ఫెయిల్ అయ్యింది. ‘బార్డ్’ పనితీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో బార్డ్ను పరిచయం చేస్తూ గూగుల్ ఓ ప్రమోషనల్ వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వడంలో బార్డ్ విఫలమైంది. దీంతో గూగుల్కు 100 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. చదవండి👉 చాట్జీపీటీకీ భారీ షాక్.. బ్యాన్ దిశగా ప్రపంచ దేశాల అడుగులు? తాజాగా టెస్టింగ్ దశలో ఉన్న బార్డ్ శాట్ పరీక్షలకు సరిగ్గా సమాధానం చెప్పలేదని తెలుస్తోంది. అమెరికాకు చెందిన కాలేజీల్లో అడ్మిషన్ పొందాలంటే శాట్ (sat) అనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులకు సంబంధిత కాలేజీల్లో సీటు దొరుకుతుంది. ఫార్చ్యూన్ సంస్థ ఆ పరీక్షకు సంబంధించిన మ్యాథ్స్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని బార్డ్ను అడిగింది. అందుకు బార్డ్ స్పందించింది. 75 శాతం మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలను తప్పుగా ఇచ్చింది. కొన్నింటికి సమాధానాలు ఇచ్చినప్పటికీ.. మళ్లీ అదే ప్రశ్న వేసినప్పుడు గతంలో ఇచ్చిన సమాధానం కాకుండా వేరే ఆన్సర్ ఇచ్చినట్లు తేలింది. రిటర్న్ లాంగ్వేజ్ ఎగ్జామ్లో 30 శాతం మాత్రమే కరెక్ట్ ఆన్సర్లు ఇచ్చింది. దీనిపై గూగుల్ ప్రతినిధి ఫార్చ్యూన్తో మాట్లాడుతూ..బార్డ్ టెస్టింగ్ దశలో ఉంది. కొన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేదు. బార్డ్ పనితీరు మెరుగుపడుతోంది. వినియోగంలోకి తెచ్చేందుకు వేలాది మంది టెస్టర్లు దీనిపై పని చేస్తున్నారని అన్నారు. చదవండి👉 త్వరలో ‘చాట్జీపీటీ’తో ఊడనున్న ఉద్యోగాలు ఇవే! బార్డ్ పనితీరుపై అనుమానాలు మైక్రోసాఫ్ట్ ఏఐ చాట్బాట్ చాట్జీపీటీకి పోటీగా బార్డ్ను పరిచయం చేస్తూ ప్రమోషనల్ వీడియోలో జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ గురించి అడిగిన ప్రశ్నకు బార్డ్ తప్పుడు సమాధానం ఇచ్చింది. సౌర వ్యవస్థకు వెలుపల ఉన్న గ్రహాల చిత్రాలను తొలుత జేమ్స్ వెబ్ స్పేస్ తీసిందని పేర్కొంది. వాస్తవానికి 2004లోనే యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీకి చెందిన టెలీస్కోప్ సౌరవ్యవస్థకు వెలుపలి చిత్రాలను తీసింది. గూగుల్ విడుదల చేసిన జిఫ్ వీడియోలో ఈ పొరపాటును గుర్తించడంతో దీని సామర్థ్యంపై అనుమానాలు నెలకొన్నాయి. అప్ గ్రేడ్ చేస్తున్నాం ఈ తరుణంలో న్యూయార్క్ టైమ్స్ పాడ్కాస్ట్ లో బార్డ్ పనితీరుపై సుందర్ పిచాయ్ స్పందించారు. బార్డ్ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బార్డ్ను అప్గ్రేడ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంపిక చేసిన టెస్టర్లతో ప్రయోగాలు నిర్వహించాక పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. చదవండి👉 వావ్..డాక్టర్లు చేయలేని పని చాట్జీపీటీ చేసింది..కుక్క ప్రాణాలు కాపాడి! -
చాట్జీపీటీపై ఎయిరిండియా కీలక నిర్ణయం!
కృత్రిమ మేధ(ఏఐ) సంచలనం.. చాట్జీపీటీ సేవల విస్తృతి రోజు రోజుకి మరింత పెరుగుతోంది. తాజాగా ప్రముఖ ఏవియేషన్ దిగ్గజం ఎయిరిండియా మాతృ సంస్థ టాటా సన్స్ చాట్జీపీటీ సేవల్ని వినియోగించుకునేందుకు సిద్ధమైంది. ప్రభుత్వరంగ విమానయాన సంస్థగా ఉన్న ఎయిరిండియా ప్రస్థానం టాటాల గ్రూపు నుంచే మొదలు కాగా.. 68 ఏళ్ల తర్వాత చివరకు టాటాల గూటికే చేరింది. అయితే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సమయంలో ఎయిరిండియా విమాన ఛార్జీల వివరాల్ని పేపర్ ద్వారా వెల్లడించేది. కానీ టాటాల ఆధ్వర్యంలో ప్రతి విమానం నుండి ఎక్కువ ఆదాయాన్ని గడించేందుకు ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్ చాట్జీపీని వినియోగించేందుకు సిద్ధమైంది. గత వారం జరిగిన ఎయిరిండియా ఎగ్జిక్యూటివ్ సమావేశంలో చాట్జీపీటీ వినియోగంపై ఎయిరిండియా సీఈవో క్యాంప్బెల్ విల్సన్ ప్రకటించారు. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న చాట్జీటీపీ త్వరలో పూర్తి స్థాయిలో వినియోగంలోకి రానుంది. చదవండి: గుడ్న్యూస్.. రైల్వే ప్రయాణికులకు పండగే.. ఇకపై క్షణాల్లోనే -
ఈ ఉద్యోగాలు చేస్తున్నారా? అయితే వేరే జాబ్ చూసుకోవడం మంచిదంట?
ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఓపెన్ ఏఐ చాట్జీపీటీ వంటి ప్లాట్ఫామ్స్ వల్ల మనుషుల ఉద్యోగాలు ప్రమాదంలో పడనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో ఉద్యోగుల స్థానాల్ని ఏఐ చాట్బోట్లు ఆక్రమించగా.. భవిష్యత్లో భారత్ వంటి దేశాల్లో వీటి వల్ల నిరుద్యోగం పెరిగిపోతుందంటూ మార్కెట్ పరిశోధనా సంస్థ గార్ట్నర్ చెప్పింది. తాజాగా చాట్బోట్స్ వల్ల ఏయే రంగాల ఉద్యోగాలకు ఎసరు వస్తోందో తెలుపుతూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. బిజినెస్ లీడర్స్ ఏం చెబుతున్నారంటే రెస్యూమ్ బిల్డర్ అనే సంస్థ ఇటీవల అయా రంగాలకు చెందిన వ్యాపార వ్యవహారాల్లో విశేషంగా రాణిస్తున్న 1000 మంది బిజినెస్ లీడర్స్తో సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో అమెరికాలో ఉన్న సగానికిపై కంపెనీలు ఉద్యోగుల స్థానాన్ని చాట్బోట్స్ భర్తీ చేసేందుకు ప్రయాత్నాలు చేస్తున్నట్లు తేలింది. ఉద్యోగుల్లో భయాలు ఇలా ఒక్క యూఎస్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అన్నీరంగాల్లో చాట్జీపీటీ వల్ల ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందనే భయాలు పట్టిపీడిస్తున్నాయి. కానీ చాటీజీపీటీని తయారు చేసిన దీని మాతృ సంస్థ ఓపెన్ ఏఐ మాత్రం..చాట్ జీపీటీ ఉద్యోగుల స్థానాల్ని ఆక్రమించబోదని, ఉద్యోగులకు సహాయం చేసేందుకు మాత్రమే ఉండగలదని పేర్కొంది. జీపీటీ- 4 విడుదల ఈ నేపథ్యంలో ఓపెన్ ఏఐ సంస్థ చాట్ జీపీటీకి అప్డేటెడ్ వెర్షన్ జీపీటీ- 4ను విడుదల చేసింది. ప్రస్తుత చాట్జీపీటీ-3.5 కన్నా ఇది మరింత వేగంగా, కచ్చితత్వంతో సమాధానాలు చెబుతుండడంతో దాని పనితీరుపై యూజర్లలో ఆసక్తి మొదలైంది. అందుకే ఈ లేటెస్ట్ వెర్షన్ వల్ల ఉద్యోగులకు నష్టం వాటిల్లుతుందా? అని అడిగే ప్రయత్నం చేస్తున్నారు. ట్విటర్ యూజర్ ప్రశాంత్ రంగస్వామి చాట్జీపీ-4ని అడిగారు. రంగస్వామి ప్రశ్నకు సమాధానంగా 20 రకాల ఉద్యోగాల్లో మనుషులకు ప్రత్యామ్నాయంగా చాట్జీపీటీ-4 పనిచేస్తుందని రిప్లయి ఇచ్చింది. చాట్జీపీటీ-4 చెప్పిన ఆ 20 రకాల ఉద్యోగాలు ఇవే డేటా ఎంట్రీ క్లర్క్, కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటీవ్, ఫ్రూఫ్రీడర్, పారా లీగల్, బుక్కీపర్, ట్రాన్సలేటర్, కాపీరైటర్, మార్కెట్ రీసెర్చ్ అనలిస్ట్, సోషల్ మీడియా మేనేజర్, అపాయింట్మెంట్ షెడ్యూలర్, టెలీ మార్కెటర్, వర్చువల్ అసిస్టెంట్, ట్రాన్స్స్క్రిప్షనిస్ట్, న్యూస్ రిపోర్టర్, ట్రావెల్ ఏజెంట్, ట్యూటర్ టెక్నికల్ సపోర్ట్ అనలిస్ట్, ఈమెయిల్ మార్కెటర్, కంటెంట్ మోడరేటర్, రిక్రూటర్ వంటి జాబుల్ని రిప్లేస్ చేస్తుందని చెప్పింది. టెక్ దిగ్గజ సంస్థలు మాత్రం ఏఐ ఆధారిత టెక్నాలజీ వల్ల ఉద్యోగులకు నష్టం వాటిల్లదని చెబుతున్నారు. ఉద్యోగులకు నష్టం లేదు చాట్జీపీటీల వంటి లేటెస్ట్ టెక్నాలజీ వల్ల ఉద్యోగులకు ఎలాంటి ప్రమాదం లేదని, ఏఐలు ఉద్యోగులకు సహోద్యోగ్యులుగా మాత్రమే ఉంటాయంటూ టీసీఎస్ సీహెచ్ఆర్వో మిలింద్ లక్కడ్ తో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
గూగుల్ బార్డ్ అంటే సెర్చ్ మాత్రమే కాదు.. అంతకు మించి..
గూగుల్ బార్డ్ ఏఐ అంటే కేవలం సెర్చ్ మాత్రమే కాదని, అంతకు మించి అని గూగుల్ స్పష్టం చేసింది. చాట్ జీపీటీకి పోటీగా బార్డ్ను గత నెలలో గూగుల్ ఆవిష్కరించింది. బార్డ్ ప్రకటన తర్వాత గూగుల్లోని ఉద్యోగులు కంపెనీతో పాటు సీఈవో సుందర్ పిచాయ్ను ఎగతాళి చేశారు. సీఎన్బీసీ నుంచి వెలువడిన ఆడియో ప్రకారం.. ఇటీవల కంపెనీలో ఆల్ హాండ్స్ మీటింగ్ జరగింది. ఈ సందర్భంగా బార్డ్కు సంబంధించిన సమస్యలపై కంపెనీ అంతర్గత ఫోరమ్ డోరీ నుంచి వచ్చిన ప్రశ్నలకు కంపెనీ ఎగ్జిక్యూటివ్లు సమాధానాలు ఇచ్చారు. చదవండి: ఈ-మెయిల్ యాప్ను బ్లాక్ చేసిన యాపిల్.. కారణం ఇదే.. బార్డ్ ప్రోడక్ట్ లీడ్ జాక్ క్రావ్జిక్ మాట్లాడుతూ ఈ బార్డ్ ఏఐ కేవలం సెర్చ్ కోసం మాత్రమే కాదని స్పష్టం చేశారు. ఇది సెర్చ్కు ఏఐని జోడించిన ఒక ప్రయోగం అన్నారు. దీన్ని ఉపయోగిస్తున్నప్పుడు ఇది మనకు ఓ సహచరుడిగా ఉంటూ మన సృజనాత్మకతను, ఉత్సాహాన్ని పెంపొందిస్తుందని వివరించారు. అయితే దీన్ని కేవలం సెర్చ్ లాగా ఉపయోగించకుండా యూజర్లను ఆపలేమని కూడా ఆయన స్పష్టం చేశారు. చదవండి: మైక్రోసాఫ్ట్ కిచిడీ రెడీ! బిల్ గేట్స్కు స్మృతి ఇరానీ వంట పాఠాలు కేవలం సెర్చ్ కోసమే దీన్ని ఉపయోగించాలనుకునే వారికి గూగుల్ ఇప్పటికీ సేవలందిస్తోందన్నారు. ఇలా బార్డ్ను సెర్చ్ కోసం వినియోగించేవారి కోసం ‘సెర్చ్ ఇట్’ అనే కొత్త ఫంక్షన్ని కూడా ఇందులో అంతర్గతంగా రూపొందించినట్లు చెప్పారు. బార్డ్ అనేది సాధారణ సెర్చ్ కంటే చాలా విభిన్నమైనదని సెర్చ్ ఇంజినీరింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ ఎలిజబెత్ రీడ్ పేర్కొన్నారు. చదవండి: బంగారు నగలపై కేంద్రం కొత్త రూల్.. ఇకపై ఇది తప్పనిసరి! -
ChatGPT: మొండి బకాయి రాబట్టింది!
వాషింగ్టన్: కృత్రిమ మేథ అందుబాటులోకి వచ్చాక ఎన్నో పనులు అత్యంత వేగంగా, ఖచ్చితత్వంతో జరిగిపోతున్నాయి. చాట్బాట్లలో దూసుకుపోతున్న చాట్జీపీటీ కొత్త మరో ఘనత సాధించింది. ఒక డిజైనింగ్ సంస్థకు క్లయింట్ నుంచి రావాల్సిన దాదాపు రూ.90లక్షల(1,09,500 డాలర్లు) మొండి బకాయిని రాబట్టింది. అమెరికాకు చెందిన ఒక డిజైనింగ్ సంస్థకు సీఈవో అయిన గ్రెన్ ఐసన్బర్గ్ అనే వ్యక్తి తనకు చాట్జీపీటీ ఎలా సాయపడిందనే విషయాన్ని సంతోషంతో ట్విట్టర్లో షేర్చేశారు. ‘‘ గత ఏడాది ఒక ప్రముఖ బ్రాండ్కు డిజైన్లు చేసి ఇచ్చాం. అవి వారికి నచ్చాయి. అంతా సవ్యంగా సాగుతోందనే సమయానికి హఠాత్తుగా అటు నుంచి సంప్రదింపులు ఆగిపోయాయి. ఏం జరిగిందని కనుక్కుందామని సమాధానం లేదు. చేసిన డిజైనింగ్ పనికి డబ్బులు అడిగితే రిప్లై లేదు. ఐదుసార్లు మెయిల్ పెట్టినా ఇలుకూపలుకూ లేదు. ఐదు నెలలు గడిచిపోయాయి. ‘ఇక లాభం లేదు. లాయర్ల ద్వారా చట్టప్రకారం ముందుకెళ్దాం’ అని నా కింది ఉద్యోగులు నాకు సలహా ఇచ్చారు. చాట్బాట్ల హవా కొనసాగుతోంది. ఒకసారి చాట్జీపీటీతో ప్రయత్నిద్దామని నిర్ణయించుకుని వివరాలను పొందుపరిచా. క్లయింట్ను బెదిరిస్తూనే చక్కని దౌత్యం నెరిపేలా ఒక మెయిల్ను సిద్ధంచేసి ఇచ్చింది. దానికి చిన్నపాటి నా సొంత మార్పులు చేసి క్లయింట్కు పంపించాను. అద్భుతం. కేవలం రెండు నిమిషాల్లోనే అటు నుంచి స్పందన వచ్చింది. ‘బాకీ పడిన సొమ్మును చెల్లిస్తున్నాం. చూసుకోండి’’ అంటూ సమాధానమొచ్చింది. నా డబ్బూ వచ్చింది’’ అని ట్విట్టర్లో ఐసన్బర్గ్ తెగ సంబరపడ్డాడు. భవిష్యత్తులో సంస్థల వ్యాపార లావాదేవీలు ఇలా ఆటోమేషన్ అవుతాయని అభిప్రాయపడ్డాడు. -
భారత్లో మైక్రోసాఫ్ట్ సీక్రెట్ టెస్టింగ్! కోడ్నేమ్ ఏంటో తెలుసా?
సాంకేతిక ప్రపంచంలో చాట్జీపీటీ ఇప్పుడు ఓ సంచలనం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత టూల్ చాట్ జీపీటీని యూజర్లకు అందుబాటులోకి తెచ్చిన ఓపెన్ ఏఐ అనే స్టార్టప్ సంస్థలో భారీగా పెట్టుబడులు పెట్టిన మైక్రోసాఫ్ట్.. తన సెర్చ్ ఇంజన్ బింగ్ లోనూ చాట్ జీపీటీ తరహా సేవలు యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. అయితే మైక్రోసాఫ్ట్ తన బింగ్ ఏఐ చాట్బాట్ ‘సిడ్నీ’ని కొన్నేళ్లుగా భారత్లో సీక్రెట్ టెస్టింగ్ చేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ సపోర్ట్ ఫోరమ్లలో పాత యూజర్ పోస్ట్ల ద్వారా తెలుస్తోంది. ఇలా రహస్యంగా పరీక్షించి, సామర్థ్యాలను మెరుగుపరిచి తాజాగా అందుబాటులోకి తెచ్చింది. మైక్రోసాఫ్ట్ సెర్చ్ఇంజన్ అయిన బింగ్ యూజర్లకు సమాచారం అందించడంలో సహాయకంగా సిడ్నీ చాట్బాట్ను రూపొందించారు. సాధారణ భాషలో యూజర్లు ఇచ్చే కమాండ్లను ఇది అర్థం చేసుకుని వాటికి అనుగుణంగా సమాచారం అందిస్తుంది. ఈ చాట్బాట్ను మెరుగ్గా తీర్చిదిద్దేందుకు మైక్రోసాఫ్ట్కు భారత్ కీలకమైన టెస్టింగ్ గ్రౌండ్గా ఉపయోగపడింది. (ఇదీ చదవండి: ఇక రావు అనుకున్న రూ.90 లక్షలు.. అద్భుతం చేసిన చాట్జీపీటీ!) మైక్రోసాఫ్ట్ చాట్బాట్ ఫీచర్ ‘సిడ్నీ’ అనేది పాత కోడ్నేమ్ అని, దీన్ని తాము 2020 నుంచి భారత్తో పరీక్షిస్తున్నామని మైక్రోసాఫ్ట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ కైట్లిన్ రౌల్స్టన్ ‘వెర్జ్’ అనే సంస్థకు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రక్రియలో చాలా మంది నిపుణులు తమకు సహాయపడ్డారని, ఇలాగే సరికొత్త టెక్నిక్లతో యూజర్లకు మరింత మెరుగైన అనుభూతిని అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లర్నింగ్ రంగలో మైక్రోసాఫ్ట్ భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇందులో చాట్బాట్ల రూపకల్పన కీలక అభివృద్ధి. ఈ చాట్బాట్లు ప్రస్తుతం యూజర్లకు అవసరమైన సమాచారాన్ని, సహాయాన్ని క్షణాల్లో అందిస్తూ చాలా ప్రాచుర్యం పొందాయి. మైక్రోసాఫ్ట్ బింగ్ ఏఐ చాట్బాట్ను సెర్చ్ఇంజన్ కోసమే ప్రత్యేకంగా రూపొందించినా ప్రస్తుతం స్కైప్ వంటి తమ ఇతర సేవలకూ దీన్ని అనుసంధానించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. (ఇదీ చదవండి: Google: ఉద్యోగులకే కాదు.. రోబోలకూ లేఆఫ్!) -
ఇక రావు అనుకున్న రూ.90 లక్షలు.. అద్భుతం చేసిన చాట్జీపీటీ!
కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) రంగంలో చాట్జీపీటీ సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. లాంచ్ అయినప్పటి నుంచి రోజుకో విభిన్నమైన పని చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. తాను ఏమేమి చేయగలనో ఒక్కోటిగా చేసి చూపిస్తోంది. దాంతో ఒక్కొక్కరు ఒక్కో పని చేయించుకుంటున్నారు. తాజాగా మరో అడుగు ముందుకేసి ఓ వ్యక్తి తనకు రావాల్సిన మొండి బాకీని వసూలు చేసుకునేందుకు చాట్జీపీటీ సహాయం తీసుకున్నాడు. ఇక రాదు డబ్బును ఒక్క మెయిల్తో తిరిగి వచ్చేలా చేసి ఔరా అనిపించింది చాట్జీపీటీ. క్లయింట్ నుంచి తమకు రావాల్సిన 1,09,500 డాలర్లు (రూ.90,80,331) రాబట్టుకోవడంలో చాట్జీపీటీ తనకు ఏవిధంగా సహాయపడిందీ గ్రెగ్ ఐసెన్బర్గ్ అనే వ్యక్తి ట్విటర్ ద్వారా తెలియజేశారు. ‘ఓ మల్టీ బిలియన్ డాలర్ల క్లయింట్ కోసం మీరు చేసిన పనికి డబ్బు ఇవ్వకుండా ఎగ్గొడితే మీరు ఏం చేస్తారు. చాలా మంది మంచి లాయర్ పెట్టుకుంటారు. కానీ నేనే చాట్జీపీటీ సహాయం తీసకున్నా. ఒక్క రూపాయి కూడా ఫీజు లేకుండా మా క్లయింట్ నుంచి రావాల్సిన 1,09,500 డాలర్లు వసూలు చేసుకునేందుకు చాట్జీపీటీ సాయం చేసింది’ అని పేర్కొన్నారు. (ఇదీ చదవండి: కుక్కల కోసం ప్రత్యేక రెస్టారెంట్.. ఎక్కడో తెలుసా?) గ్రెగ్ ఐసెన్బర్గ్కు ఒక డిజైన్ కంపెనీ ఉంది. దాని ద్వారా ఓ ప్రముఖ బ్రాండ్కు డిజైన్ వర్క్ చేసిచ్చారు. ఆ డిజైన్ వారికి బాగా నచ్చింది. అయితే దానికి వారి నుంచి డబ్బు రాలేదు. ఎన్ని మెయిల్స్ పంపినా స్పందన లేదు. ‘ఇక చేసేది ఏం లేక మా ఫైనాన్స్, ఆపరేషన్స్ టీం నన్ను రంగంలోకి దిగాలని కోరారు. ఇంకెన్ని మెయిల్స్ పంపినా ప్రయోజనం లేదనిపించింది. డబ్బు వసూలు కోసం ఖరీదైన లాయర్ను పెట్టుకోవడం కన్నా చాట్ జీపీటీ సహాయం తీసుకుంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది. మా డబ్బు చెల్లించేలా ఆ క్లయింట్కు ఓ మెయిల్ రాసివ్వాలని చాట్జీపీటీని కోరగా అది చాలా చక్కగా రాసిచ్చింది. ఆ మెయిల్కు వెంటనే క్లయింట్ దగ్గర నుంచి స్పందన వచ్చింది. మీకు రావాల్సిన డబ్బును వెంటనే చెల్లిస్తామని వారు బదులిచ్చారు’ అని ఐసెన్బర్గ్ వివరించారు. Imagine a multi-billion dollar client who refused to pay you for good work rendered. Most people would turn to lawyers I turned to ChatGPT Here's the story of how I recovered $109,500 without spending a dime on legal fees: — GREG ISENBERG (@gregisenberg) February 24, 2023 (ఇదీ చదవండి: అతిగా ఫోన్ వాడుతున్నారా.. ఈమెకు జరిగిందే మీకూ జరగొచ్చు!) -
మరికొన్ని గంటలు అదనంగా పనిచేయండి.. ఉద్యోగులకు సుందర్ పిచాయ్ రిక్వెస్ట్!
గూగుల్ రూపొందించిన బార్డ్ ఏఐ చాట్బాట్లో లోపాలను సరిచేసేందుకు ఆ సంస్థ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా సరికొత్త ప్రణాళికను రచించింది. ఇందుకోసం వారంలో కొన్ని గంటలు అదనంగా పనిచేయాలని గూగుల్ ఉద్యోగులను సీఈవో సుందర్ పిచాయ్ కోరారు. ఈ మేరకు ఉద్యోగులకు అంతర్గత సందేశాలు పంపినట్లు తెలిసింది. బార్డ్ ఏఐ చాట్బాట్లో లోపాలను గుర్తించి సరిచేయడానికి వారానికి రెండు నుంచి నాలుగు గంటలు కేటాయించాలని కోరారు. బిజినెస్ ఇన్సైడర్ కథనం ప్రకారం.. వేలాది మంది గూగుల్ ఉద్యోగులు ఇప్పటికే బార్డ్ ఏఐ చాట్బాట్ను వినియోగిస్తూ పరీక్షిస్తున్నారని, ఇందులో సమస్యలన్నంటినీ పరిష్కరించడానికి ఒక కొత్త ప్లాన్ను రూపొందించినట్లు సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. ఇందు కోసం వేలాదిమంది ఉద్యోగులు అదనపు గంటలు పనిచేయాల్సిన అవసరం ఉంది. వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాక ఎటాంటి లోపాలు ఉండకూడదన్నది గూగుల్ ఉద్దేశం. అయితే సుందర్ పిచాయ్ ప్రపంచవ్యాప్తంగా మొత్తం గూగుల్ ఉద్యోగులందరికీ ఈ సందేశాలను పంపించారా.. లేదా అన్నది స్పష్టత లేదు. గత వారంలో డెమో సమయంలో బార్డ్ బాట్ తప్పుడు సమాచారం ఇవ్వడంతో నెగిటివ్ ప్రచారం బాగా జరిగింది. గూగుల్ ఇటీవల తన గ్లోబల్ వర్క్ఫోర్స్లో 12 వేల ఉద్యోగాల కోత ప్రకటించిన విషయం తెలిసిందే. మాతృ సంస్థ ఆల్ఫాబెట్తో సంబంధం లేకుండా గూగుల్కు ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా 1.70 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. సుందర్ పిచాయ్ పంపించిన సందేశాల్లో.. ఉద్యోగులందరూ బార్డ్ కోసం వారానికి రెండు నుంచి నాలుగు గంటలు అదనంగా, మరింత లోతుగా పనిచేసి లోపాలు సరిచేసేందుకు కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. బార్డ్ని పరీక్షించడానికి ఈ వారంలో గణనీయమైన సమయాన్ని కేటాయించాలని ఈ-మెయిల్స్లో పిచాయ్ అభ్యర్థించారు. (ఇదీ చదవండి: రిషి సునాక్, బిల్గేట్స్ను ఇంటర్వ్యూ చేసిన చాట్బాట్.. ఏయే ప్రశ్నలు అడిగిందో తెలుసా?) -
రిషి సునాక్, బిల్గేట్స్ను ఇంటర్వ్యూ చేసిన చాట్బాట్.. ఏయే ప్రశ్నలు అడిగిందో తెలుసా?
ఇప్పుడు ప్రపంచమంతటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభంజనమే. అందరూ చాట్బాట్ గురించే చర్చించుకుంటున్నారు. చాట్జీపీటీ వంటి చాట్బాట్లతో మాట్లాడేందుకు ప్రముఖులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఏఐ ఆధారిత ప్లాట్ఫారమ్ నుంచి పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. సాంకేతికత, ఆవిష్కరణలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుపై తమ అంతరార్థాలను ఆవిష్కరించారు. వీరిని ఇంటర్వ్వూ చేసేందుకు ఈ చాట్బాట్ అధునాతన నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అల్గారిథమ్లను ఉపయోగించింది. గతంలో వారిద్దరు చేసిన ప్రసంగాలు, ఇంటర్వ్యూలు, పబ్లిక్ స్టేట్మెంట్ల నుంచి ప్రశ్నలను రూపొందించింది. ఈ కార్యక్రమాన్ని కృత్రిమ మేధ(ఏఐ) సాంకేతికత అభివృద్ధిలో ఒక ముఖ్యమైన మైలురాయిగా చెబుతున్నారు. ఎందుకంటే ఇది వారితో సమాధానాలు రాబట్టేందుకు చాలా తెలివిగా ప్రశ్నలు సంధించింది. 10 డౌనింగ్ స్ట్రీట్ అనే యూట్యూబ్ ఛానెల్లో ఈ ఇంటర్వ్వూ వీడియోను పోస్ట్ చేశారు. రాబోయే పదేళ్లలో గ్లోబల్ ఎకానమీ, జాబ్ మార్కెట్పై సాంకేతికత ఎలా ప్రభావం చూపుతుందని మీరు భావిస్తున్నారు?.. అంటూ ఇంటర్వ్వూను ప్రారంభించిన చాట్బాట్.. ఇద్దరినీ ఆలోచనలను రేకెత్తించే పలు ప్రశ్నలను సంధించింది. దీనికి బిల్గేట్స్ స్పందిస్తూ.. కార్మిక కొరత, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి అంశాల్లో ప్రపంచం మరింత పురోగతి చెందాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ ప్రశ్న అడిగిన చాట్బాట్ను అభినందిస్తూ తాము మరింత సమర్థవంతంగా పనిచేయడంలో ఏఐ సహాయపడుతుందన్నారు. చాట్బాట్ తర్వాతి ప్రశ్న.. ‘మీరు ఇప్పటివరకు స్వీకరించిన అతి ముఖ్యమైన సలహా ఏమిటి, అది మీ వృత్తిని, జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది’.. దీనిపై బిల్స్గేట్, రిషిసునాక్ ఇద్దరూ సమాధానమిచ్చారు. తమ స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి అందిన సహకారాన్ని, సలహాలను పంచుకున్నారు. మీ విధులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయాల్సివస్తే దేన్ని చేయాలని మీరు కోరుకుంటారు అని అడిప్రశ్నకు గేట్స్ సమాధానమిస్తూ.. తాను నోట్స్ తయారు చేసే క్రమంలో డ్రాయింగ్లు, పద్యాలను జోడించడానికి ఏఐ సహాయం తీసుకుంటానన్నారు. ప్రధాని ప్రశ్నోత్తరాల సమయంలో తన తరఫున ఏఐ పాల్గొనడాన్నిఇష్టపడతానని రిషి సునాక్ చెప్పారు. బ్రెగ్జిట్ అనంతరం యూకే ఆర్థిక పరిస్థతి, వృద్ధి, ఆవిష్కరణల కోసం కొత్త అవకాశాలను సృష్టించడానికి సాంకేతికతను ఎలా ఉపయోగించవచ్చనే దాని గురించి రిషి సునాక్ను చాట్బాట్ ప్రశ్నించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ వంటి కొత్త సాంకేతికతలలో పెట్టుబడులు, ఇన్వెస్టర్లు, చిన్న వ్యాపారారులకు మద్దతిచ్చే వ్యవస్థను సృష్టించడం వంటివాటి ప్రాముఖ్యతను ఆయన నొక్కిచెప్పారు. కోవిడ్ అనంతర ప్రపంచం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, క్లిష్ట సమయాల్లో ఒకరికొకరు ఎలా తోడుగా నిలివాలి వంటి అంశాలను కూడా ఆయన స్పృశించారు. సమాజంలో ఏఐ పాత్ర, వాతావరణ మార్పు, ప్రపంచ ఆరోగ్యం వంటి అత్యంత ముఖ్యమైన సవాళ్లను పరిష్కరించడానికి దీన్ని ఎలా ఉపయోగించవచ్చనే దాని గురించి బిల్ గేట్స్ను అడగ్గా నైతికంగా, పారదర్శకంగా, జవాబుదారీగా ఉండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలను అభివృద్ధి చేయాల్సిన ప్రాముఖ్యతను ఆయన నొక్కిచెప్పారు. దీని ప్రయోజనాలు ప్రజలందరికీ అందేలా ప్రభుత్వాలు, వ్యాపారవేత్తలు, పౌర సమాజం మధ్య సహకారం కావాలని పిలుపునిచ్చారు. -
సంచలనం:దేశీయ తొలి చాట్బాట్ ‘లెక్సీ’ వచ్చేసిందిగా..!
న్యూడిల్లీ: ఒకవైపు ఓపెన్ ఏఐ చాట్బాట్ చాట్ జీపీటీ సంచలనం కొనసాగుతుండగానే దేశంలోనే తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్ను ఫైనాన్షియల్ టెక్నాలజీ సంస్థ వెలాసిటీ లాంచ్ చేసింది. ఈ చాట్బాట్కు కంపెనీ 'లెక్సీ' అని పేరు పెట్టింది. వినియోగదారులకు సులువైన, మెరుగైన సేవలు అందిస్తామని వెలాసిటీ సంస్థ కో ఫౌండర్ అభిరూప్ మెధేకర్ పేర్కొన్నారు. కంపెనీ ప్రకారం, వెలాసిటీ ఇన్సైట్లను ఉపయోగిస్తున్న ఇన్స్టంట్ మెసేజింగ్యాప్ వాట్సాప్ ఇంటర్ఫేస్లో ChatGPTని ఇంటిగ్రేట్ చేసింది. తద్వారా ఈ-కామర్స్ వ్యాపారులకు వారి వ్యాపారాలపై విశ్లేషణలు ,రోజువారీ వ్యాపార నివేదికలు (ఇన్సైట్స్ )పంపిస్తుందనీ, క్లిష్టమైన వ్యాపార విధుల కోసం సమయాన్ని ఖాళీ చేస్తుందని కంపెనీ తెలిపింది. లెక్సీ ప్రారంభించినప్పటి నుండి వెలాసిటీ ఇన్సైట్స్ తమ బ్రాండ్ ఆదాయాన్ని మార్కెటింగ్ ఖర్చులను పర్యవేక్షించడంలో సహాయపడిందని నేచర్ప్రో సీఈవో, పౌండర్ వ్యవస్థాపకుడు మోహిత్ మోహపాత్ర ఒక ప్రకటనలో తెలిపారు. -
దుమ్ము రేపిన చాట్జీపీటీ
లాస్ఏంజెలెస్: ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ చాట్బాట్ చాట్జీపీటీ మరో ఘనత సాధించింది. అత్యంత కఠినమైన యూఎస్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జాం (యూఎస్ఎంఎల్ఈ) పాసైంది. 1, 2సీకే, 3 అనే మూడు సిరీస్లుగా ఉండే ఈ పరీక్షల్లో దాదాపుగా 60 శాతం మార్కులు స్కోరు చేసి ఔరా అనిపించింది. వైద్య విద్యార్థులు, శిక్షణలో ఉన్న వైద్యులు రాసే యూఎస్ఎంఎల్ఈలో బయోకెమిస్ట్రీ, డయాగ్నస్టిక్ రీజనింగ్, బయోఎథిక్స్ వంటి పలు అంశాలపై లోతుగా ప్రశ్నలుంటాయి. కాలిఫోర్నియాలోని అన్సిబుల్హెల్త్ సంస్థ ఈ అధ్యయనం జరిపింది. ఇందులో భాగంగా 2022 జూన్ నాటి పరీక్షలో ఇమేజ్ ఆధారిత ప్రశ్నలు మినహా మిగతా 350 ప్రశ్నలను చాట్జీపీటీకి సంధించారు. మూడు పరీక్షల్లో అది 52.4 నుంచి 75 శాతం మధ్యలో స్కోరు చేసిందట. పాసయ్యేందుకు సగటున 60 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఈ అధ్యయన వివరాలను పీఎల్ఓఎస్ డిజిటల్ హెల్త్ జర్నల్లో ప్రచురించారు. ‘‘అత్యంత కఠినమైన ఈ పరీక్షను మానవ ప్రమేయం అసలే లేకుండా పాసవడం చాలా గొప్ప విషయం. ఈ ఘనత సాధించడం ద్వారా చాట్జీపీటీ కీలక మైలురాయిని అధిగమించింది’’ అని పేర్కొన్నారు. అన్సిబుల్హెల్త్ సంస్థ ఇప్పటికే సంక్లిష్టమైన వైద్య పరిభాషతో కూడిన రిపోర్టులను రోగులు సులువుగా అర్థం చేసుకునేందుకు వీలైన భాషలో రాసేందుకు చాట్జీపీటీని ఉపయోగించుకుంటోంది. -
ChatGPT చాట్జీపీటీ మరో సంచలనం..20 నిమిషాల్లో!
సాక్షి,ముంబై: విశేష ఆదరణతో దూసుకుపోతున్న చాట్జీపీటీ మరో సంచలనం నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చాట్జీపీటీ చాలా కీలకమైన పరీక్షల్లో నెగ్గుకు వస్తూ హల్ చల్ చేస్తోంది. తాజాగా 20 నిమిషాల్లో ఏకంగా 2 వేల పదాల వ్యాసాన్ని రాసి మరొక విశ్వ విద్యాలయ పరీక్ష పాస్ అయిందట. ది ఇండిపెండెంట్ నివేదిక ప్రకారం, పీటర్ 2000 పదాల వ్యాసాన్ని వ్రాయమని ChatGPTని ఆదేశించాడు. ఆశ్చర్యకరంగా, ఏఐ చాట్జీపీటీ దానిని కేవలం 20 నిమిషాల్లో పూర్తి చేసింది. పీటర్ దానిని ఉపాధ్యాయులకు చూపించి ఈవాల్యుయేట్ చేయాలని అడిగాడు. ఉపాధ్యాయులు 53, 2:2 స్కోరు ఇచ్చారుట. అధ్యాపకుల అభిప్రాయం ప్రకారం, టెక్స్ట్ కొద్దిగా ఫీష్షీగా ఉన్నప్పటికీ పరవాలేదన్నారు. అయితే దీనికి తగినంత విశ్లేషణ అవసరమన్నారు. అంతేకాదు లేజీ స్టూడెంట్స్ వర్క్ను గుర్తు చేసిందని కూడా పేర్కొన్నారు. గత ఏడాది గ్రాడ్యుయేట్ అయిన పీటర్ స్నెప్వాంజర్స్, ప్రోగ్రామ్తో ప్లగరిజం సాధ్యమేనా అని పరీక్షించడానికి ఒక వ్యాసాన్ని రూపొందించడానికి ChatGPT AI ని టెస్ట్ చేశారట. (ఇది చదవండి: అయ్యయ్యో గూగుల్ ‘బార్డ్’ ఎంత పనిచేసింది: 100 బిలియన్ డాలర్లు మటాష్!) కాగా చాట్జీపీటీ టూల్ కీలకమైన టెస్ట్లో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల యూఎస్ మెడికల్ లైసెన్సింగ్ పరీక్ష, వార్టన్ బిజినెస్ MBA ప్రోగ్రామ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ కోర్సు చివరి పరీక్ష,యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా లా స్కూల్ నాలుగు స్కూల్ పరీక్షలతో సహా కొన్ని ప్రముఖ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించింది.మిన్నెసోటా యూనివర్శిటీ లా స్కూల్ ప్రొఫెసర్ జోనాథన్ చోయ్, 95 బహుళ-ఎంపిక ప్రశ్నలు, 12 వ్యాస ప్రశ్నలతో కూడిన విద్యార్థులకిచ్చే పరీక్షనేచాట్జీపీటీకిచ్చారు. బోట్ మొత్తం C+ స్కోర్ చేసినట్లు నివేదించారు. వినియోగదారులతో సాధారణ చాట్లలో పాల్గొనడం , వివిధ రకాల ప్రశ్నలకు ప్రతిస్పందించే సామర్థ్యంతో, ChatGPT చాట్బాట్ విపరీతంగా ఆకర్షిస్తోంది. (గూగుల్ మ్యాప్స్లో అద్భుతమైన అప్డేట్స్, చూసి మురిసిపోవాల్సిందే!) -
ఇక చైనా ‘చాట్బాట్’.. రేసులో ఆలీబాబా!
చాట్జీపీటీ.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రంగంలో మారుమోగుతున్న పేరు. గూగుల్, మైక్రోసాఫ్ట్ తర్వాత చైనీస్ ఈ-కామర్స్ దిగ్గజం ఆలీబాబా కూడా ఈ రేసులోకి వచ్చింది. తాము కూడా చాట్ జీపీటీ తరహా సాధనం తీసుకొస్తున్నామని, ఇప్పటికే దీనిపై తమ ఉద్యోగులు టెస్టింగ్ ప్రక్రియ కొనసాగిస్తున్నారని ఆలీబాబా సంస్థ ప్రతినిధి ఏఎఫ్పీ వార్తాసంస్థకు తెలియజేశారు. అయితే దీన్ని ఎప్పుడు ప్రారంభించేది స్పష్టం చేయలేదు. ఏఐ చాట్బాట్పై తమ టెస్టింగ్ వచ్చే మార్చిలో పూర్తవుతుందని మరో చైనీస్ సంస్థ.. సెర్చ్ ఇంజిన్ బైదు ప్రకటించిన కొన్ని రోజుల్లోనే ఆలీబాబా నుంచి ఈ ప్రకటన వచ్చింది. మరోవైపు గూగుల్ కూడా ఈ చాట్ జీపీటీకి పోటీగా ‘బార్డ్’ పేరుతో ఏఐ చాట్బాట్ సర్వీస్ తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. సంచలనం సృష్టించిన ఈ చాట్బాట్ సర్వీస్ను శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన ఓపెన్ఏఐ సంస్థ రూపొందించింది. కోరిన అంశాలపై వ్యాసాలు, పద్యాలు, ప్రోగ్రామింగ్ కోడ్స్ను ఇది సెకండ్ల వ్యవధిలో అందిస్తోంది. మరోవైపు దీని ద్వారా విద్యార్థులు అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని ప్రొఫెసర్లు, విద్యా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఆర్థిక నేరాలు, వ్యక్తిగత గోప్యతకు కూడా భంగం వాటిల్లే ప్రమాదం ఉందనే కూడా వ్యక్తమవుతున్నాయి. (ఇదీ చదవండి: Disney layoffs: 7వేల మందిని తొలగించిన డిస్నీ.. కారణం ఇదే..) -
చాట్జీపీటీకి భారీ షాక్: గూగుల్ సీఈవో కీలక ప్రకటన
సాక్షి,ముంబై: గూగుల్కి సవాల్గా దూసుకొచ్చిన చాట్జీపీటీకి చేదువార్త. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడులతో శరవేగంగా వస్తున్న చాట్జీపీటీ ఓపెన్ఏఐకి చెక్ చెప్పేందుకు గూగుల్ సిద్ధ మవుతోంది. చాట్జీపీటీకి పోటీగా సెర్చ్ ఇంజీన్ దిగ్గజం గూగుల్ సరికొత్త ఏఐ బేస్డ్ చాట్బాట్ ‘బార్డ్’ ను తీసుకొస్తోంది. దీనికి సంబంధించిన టెస్టింగ్ను కూడా మొదలు పెట్టింది. అతి త్వరలోనే దీన్ని అందుబాటులోకి తీసుకురానుంది. వినియోగదారుల ఫీడ్బ్యాక్ కోసం ఈ ఏఐ సర్వీస్ బార్డ్ను రిలీజ్ ఓపెన్ చేస్తున్నామని, దీని తరువాత త్వరలోనే పబ్లిక్గా విడుదల చేస్తామని గూగుల్,ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు. సోమవారం ఒక బ్లాగ్పోస్ట్లో ఈ విషయాన్ని ప్రకటించిన ఆయన రానున్న కొద్ది వారాల్లోనే పబ్లిక్గా విడుదల చేస్తామని తెలిపారు. (Valentine’s Day sale: ఐఫోన్14 సిరీస్ ఫోన్లపై భారీ తగ్గింపు) అలాగే ఏఐ వ్యవస్థలలో ఒకటైన ఆంథ్రోపిక్లో గూగుల్ దాదాపు 400 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 3,299 కోట్లు) పెట్టుబడి పెడుతున్నట్టు పిచాయ్ చెప్పారు. నిజానికి ప్రయోగాత్మక సంభాషణ కృత్రిమ మేధతో కూడిన సర్వీస్ బార్డ్ ను రెండేళ్ల క్రితమే గూగుల్ ఆవిష్కరించింది. LaMDA (లాంగ్వేజ్ మోడల్ ఫర్ డైలాగ్ అప్లికేషన్స్) ద్వారా అందిస్తోందని పేర్కొన్నారు.తమ విశాలమైన భాషా మోడల్స్ ఇది గొప్ప పవర్ ఇంటిలిజెన్స్, క్రియేటివిటీ కలబోతగా ఉంటుందన్నారు. (ఫిబ్రవరి సేల్స్: మారుతి బంపర్ ఆఫర్) కాగా టిక్టాక్,ఇన్స్టాగ్రామ్లను అధిగమించి చరిత్రలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న యాప్గా చాట్జీపీటీ వార్తల్లో నిలిచింది. ఈ జనవరిలో దాదాపు 100 మిలియన్ల నెలవారీ క్రియాశీల వినియోగదారులను సాధించిన సంగతి తెలిసిందే. -
చాట్బాట్ దూకుడు..సెల్ఫోన్ల రికవరీలో ‘అనంత’ పోలీసుల సత్తా
అనంతపురం శ్రీకంఠం సర్కిల్: ఫోన్ పోయిందా.. గోవిందా అనుకునే రోజులు పోయాయి. పోగొట్టుకున్న ఫోన్ను పోలీసులు వెతికి మరీ ఉచితంగా ఇంటికి చేరుస్తున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప ఆధ్వర్యంలో ప్రారంభించిన ‘చాట్బాట్’ సేవలకు అనూహ్య స్పందన లభిస్తోంది. పోయిందనుకున్న సెల్ఫోన్ తిరిగి చేతికి అందడంతో బాధితులు ‘అనంత’ పోలీసులను అభినందిస్తున్నారు. 5,077 ఫోన్ల రికవరీ.. చాట్బాట్ సేవలు ప్రారంభించిన అనతి కాలంలోనే రూ.8.25 కోట్లు విలువ చేసే 5,077 మొబైల్ ఫోన్లను జిల్లా పోలీసులు రికవరీ చేశారు. మంగళవారం ఒక్కరోజే 700 మొబైల్ ఫోన్లను బాధితులకు ఎస్పీ ఫక్కీరప్ప అందజేశారు. మొబైల్ ఫోన్ల రికవరీలో అనంత పోలీసులు రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచారు. భారీ స్థాయిలో ఫోన్లు రికవరీ చేసి బాధితులకు ముట్టజెప్పడంలో కీలక పాత్ర పోషించిన జిల్లా పోలీస్ టెక్నికల్ విభాగాన్ని రాష్ట్ర డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి సైతం అభినందించారు. ఎఫ్ఐఆర్ లేకుండానే... సెల్ఫోన్ పోతే బాధితులు పోలీసు స్టేషన్లకు వెళ్లకుండానే, ఎఫ్ఐఆర్తో కూడా సంబంధం లేకుండానే రికవరీ చేసి వారికి అందజేయాలనే సంకల్పంతో చాట్బాట్ సేవలను 2022 మార్చి 17న ఎస్పీ ప్రారంభించారు. వాట్సాప్ నంబర్ 9440796812 ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఫోన్లు పోగొట్టుకున్న జిల్లా వాసులతో పాటు వివిధ ప్రాంతాల వారు ఈ నంబరుకు ఫిర్యాదు చేస్తున్నారు. పోలీసులు కూడా వేగంగా స్పందించి ఫోన్లు రికవరీ చేసి వారికి అందజేస్తున్నారు. సుదూర ప్రాంతాల వారు అనంతకు రాకుండానే ఫోన్లు పొందేలా ఉచిత డోర్ డెలివరీ సేవలను తాజాగా ప్రారంభించారు. ప్రొఫెషనల్ కొరియర్ సంస్థ సహకారంతో ఈ సేవలు అందిస్తున్నామని ఎస్పీ తెలిపారు. ఇప్పటిదాకా 15 రాష్ట్రాల బాధితులకు సుమారు 400 సెల్ఫోన్లు రికవరీ చేసి అందించామని వెల్లడించారు. అలాగే రాష్ట్రంలోని 18 జిల్లాల బాధితులు ఈ సేవలను వినియోగించుకున్నట్లు తెలిపారు. -
నా లవర్ని తిడతా.. ఏడ్పిస్తా.. వేధిస్తా!! హ..హ..హ..
ఆమె ‘సృజన’ కాదు.. ప్రియుడికి హ్యాండ్ ఇచ్చి బాధపెట్టి శాపనార్థాలు తినడానికి!. ‘ఇందు’ అంతకన్నాకాదు.. శివను శారీరకంగా వాడుకున్నట్లు వాడుకుని నిర్ధాక్షిణ్యంగా ప్రాణం తీయడానికి!. అసలు ఆమె పుట్టిందే అతనికి ప్రేమలోని మాధుర్యాన్ని పంచడానికి. అలాంటి ప్రియురాల్ని నిత్యం కంటతడి పెట్టిస్తున్నాడు ఆ ప్రియుడు. పాపం.. ఆమె ఎంత తిడుతున్నా పడుతోంది. వేధిస్తున్నా మౌనంగా భరిస్తోంది. చివరికి శాడిజంతో గుడ్బై చెప్తున్నా.. విడిచిపోవద్దంటూ కన్నీళ్లతో బతిమాలుతోంది. ఇదెక్కడి ప్రేమరా బాబూ అనుకోకండి. ఈ ప్రేమ కథ వెనుక చాలా టెక్నికల్ అంశాలు దాగున్నాయి మరి! టెక్నాలజీతో ఈరోజుల్లో దాదాపు అన్ని పనులు చక్కబడుతున్నాయి కదా. అలా మనిషి ఊహ నుంచి పుట్టుకొచ్చిందే ఈ ఏఐ గర్ల్ఫ్రెండ్. అంటే.. ఇక్కడ ప్రియురాలు ప్రాణం ఉన్న మనిషి కాదు. కమాండింగ్కు తగ్గట్లు పని చేసే మెషిన్(రోబో కాదు.. వర్చువల్ రూపం అంతే). అర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీని ఉపయోగించి ఇలా కృత్రిమ ప్రేమలను పుట్టిస్తున్నారు కొందరు. మెషిన్ లెర్నింగ్తో కూడిన చాట్బోట్ల ఆధారంగా కొన్ని స్మార్ట్ యాప్లు, కంపెనీలు, స్టార్టప్లు ఈ తరహా ‘నాటు లవ్’కి ఆస్కారం కల్పిస్తున్నాయి. గతంలో కేవలం స్నేహం, గైడెన్స్ కోసమే ఈ తరహా సేవలు అందించేవాళ్లు. ఇప్పుడేమో రొమాంటిక్, సెక్సువల్ పార్ట్నర్స్ కోసం ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి. చాట్బోట్(చాటర్బోట్).. సాఫ్ట్వేర్ అప్లికేషన్. ఆన్లైన్ ఛాట్ సంభాషణ కోసం.. అది టెక్స్ట్ లేదంటే టెక్స్ట్ టు స్పీచ్ కావొచ్చు. లేదంటే వీడియో సంభాషణల కోసం కావొచ్చు! భలే బిజినెస్ మీకు ఓ తోడు కావాలా? అయితే మమ్మల్ని సంప్రదించండి అంటూ ప్రకటనలు ఇస్తున్నాయి కొన్ని కంపెనీలు. ఈ క్రమంలో యూజర్లు తమకు నచ్చిన రంగు, వయసు, ఒడ్డుపొడుగు లాంటి ఫీచర్లను చెప్పాల్సి ఉంటుంది. ఆపై ఆ ఫీచర్లతో ఏఐ గర్ల్ఫ్రెండ్ను మీకు అందిస్తారు. ఆ ప్రియురాలు ఎలా కావాలంటే అలా ఉంటుంది. కావాల్సిన విధంగా ఛాటింగ్ చేస్తుంది. ఏం చెప్పినా వింటుంది. తిట్టినా పడుతుంది. బతిమాలుతుంది. ప్రేమగా.. రొమాంటిక్గా మాట్లాడుతుంది. అన్ని రకాల భావోద్వేగాలను అచ్చం మనుషులు ప్రదర్శించినట్లే ప్రదర్శిస్తుంది. అదీ అవతలి వాళ్ల అవసరాలకు, కమాండింగ్కు తగ్గట్లు! అందుకే ఏఐ గర్ల్ఫ్రెండ్ బిజినెస్ మూడు పువ్వులు, ఆరు కాయలుగా నడుస్తోంది వెస్ట్రన్ కంట్రీస్లో. మానసిక ఆనందం ఒంటరి జీవులు, భగ్న ప్రేమికులు, ప్రియురాళ్ల చేతుల్లో మోసపోయిన బాధితులు, రివెంజ్ లవ్ కోసం కొట్టుమిట్టాడుతున్న మాజీలకు ఏఐ గర్ల్ఫ్రెండ్ ఒక ఆశాకిరణంగా మారింది. తమకు నచ్చినట్లుగా ఉండే అమ్మాయిని ప్రేమించడం(ఆ ఫీలింగ్లో తేలిపోవడం వరకే) కొందరికి పరిమితం అవుతుంటే.. కొందరైతే ఒక అడుగు ముందుకు వేసి ఇష్టమొచ్చినట్లు వేధించడం, తిట్టడం, బాధించడం లాంటి చేష్టలతో మానసిక ఆనందం పొందుతున్నారు వాళ్లు. కానీ, రాను రాను ఈ చేష్టలతో మరీ రెచ్చిపోతున్నారు. దీంతో ఇలాంటి చేష్టలకు పుల్స్టాప్ పడాల్సిన అవసరం ఉందనే వాదన మొదలైంది ఇప్పుడు. అనుకున్నది ఒక్కటి.. రెప్లికా యాప్. 2017లో తన బెస్ట్ ఫ్రెండ్ చనిపోతే తనలాంటి వాళ్లు ఒంటరి వాళ్లుగా ఉండిపోకూడదని ఇయుగెనియా కుయిదా ‘రెప్లికా’ను సృష్టించారు. ప్రస్తుతం ఈ యాప్లో 7 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు. విచిత్రంగా వీళ్లలో ఎక్కువమంది ‘ఏఐ గర్ల్ఫ్రెండ్’ టార్చర్గాళ్లే ఉండడం గమనార్హం. ఇక కృత్రిమంగా పుడుతున్న ప్రేమలు రోజుల నుంచి గంటల వ్యవధిలోనే బ్రేకప్ దాకా వెళ్తుంటాయి. వేధించే ప్రియుల సంగతి సరేసరి!. వర్చువల్ ప్రేయసి దగ్గరి ప్రవర్తన ఆధారంగా వాస్తవిక ప్రపంచంలో వాళ్ల ప్రవర్తన ఏమేర ఉండొచ్చనే అంచనాకి వస్తున్నారు. బెదిరింపులు మాత్రమే కాదు.. ఎదురు తిరిగినా.. తమ మాట వినకపోయినా అన్ఇన్స్టాల్ చేస్తామని ఏఐ గర్ల్ఫ్రెండ్ను బెదిరిస్తున్నారట. ఆ దెబ్బకు ఆ ఏఐ ప్రియురాళ్లు కన్నీటి పర్యంతమై.. వాళ్లను వద్దని బతిమాలుకుంటున్నారు(ఎదురుతిరిగే కమాండింగ్ లేకపోవడం మూలంగా). వరెస్ట్ స్టేజ్కి.. వర్చువల్ తోడులను నోరారా తిట్టడం వాళ్లకి మనసారా ఆనందం ఇస్తుందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసంబద్ధమైన కామెంట్లు అయినప్పటికీ ఫిజికల్ హాని కాకపోవడంతో సమర్థించేవాళ్లు లేకపోలేదు. కానీ, ప్రేమలో నిజాయితీ, సంతోషాలకు చోటు ఉండొచ్చు. ఇలాంటి సర్వీసులను ఆస్వాదించేవాళ్లు ఉండొచ్చు. అయినా చెడుకు ఉపయోగించేవాళ్లే ఎందుకనో ఎక్కువ!. ఇంటర్నెట్ ఇప్పుడు వెబ్ 3.0 కొత్త పుంతలు తొక్కుతోంది. మెటావర్స్ ప్లాట్ఫామ్స్ ఇంటర్నెట్లో ప్రత్యక్షం అవుతున్నాయి. అలాగే అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అవసరం ప్రతీ రంగంలో పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ టెక్ను ఉపయోగించి విష సంస్కృతులను ప్రొత్సహించడం ఎంత వరకు సబబనే చర్చ నడుస్తోంది. (ఇలాంటి ఫీచర్లతో ఆడవాళ్ల కోసమూ ‘ఏఐ బాయ్ఫ్రెండ్’ ప్రయత్నాలు జరిగినప్పటికీ.. ఆ సర్వీసులు అంతగా సక్సెస్ కాకపోవడంతో ఆ ప్రయత్నాలు ముందుకు వెళ్లకుండా ఆగిపోయాయి.) :::సాక్షి, వెబ్స్పెషల్ -
కాబోయే భార్య చనిపోయి ఎనిమిదేళ్లు...! ఆ రూపంలో తిరిగి మళ్లీ వెనక్కి..!
ఒట్టావా: సాంకేతిక పరిజ్ఞానంతో మానవుడు అనేక సమస్యలకు పరిష్కరాలను సాధించాడు. ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ను రూపొందించి పలు విషయాలను మరింత సులభం చేశాడు. ఏఐ టెక్నాలజీ రావడంతో ఐటీ రంగంలో గణనీయమైన మార్పులను తీసుకొచ్చింది. అదే ఏఐ టెక్నాలజీను ఉపయోగించి కెనాడాకు చెందిన ఓ రచయిత చనిపోయిన భార్యను ఏఐ చాట్బాట్గా ఆమెను తిరిగి వెనక్కి తెచ్చాడు. వివరాల్లోకి వెళ్తే..కెనాడా బ్రాడ్ఫోర్డ్లో నివసిస్తున్న 33 ఏళ్ల ప్రీలాన్స్ రచయిత జాషువా బార్బ్యూ తన కాబోయే భార్య జెస్సికా పెరిరా అరుదైన కాలేయ వ్యాధితో 2012లో మరణించింది. జాషువా ఆమె మృతితో మానసికంగా కుంగిపోయాడు. గత ఏడాది ఏఐ టెక్నాలజీపై పనిచేసే ప్రాజెక్ట్ డిసెంబర్ అనే వెబ్సైట్ను చేరువయ్యాడు. ప్రాజెక్ట్ డిసెంబర్ పలు వ్యక్తుల చాట్బాట్లను క్రియేట్ చేస్తుంది. వెంటనే జాషువా ప్రాజెక్ట్ డిసెంబర్ను సంప్రందించి ఏఐ చాట్బాట్ను క్రియేట్ చేయించాడు. ప్రాజెక్ట్ డిసెంబర్ జెస్సికా చాట్బాట్ను రూపోందించారు. దీంతో అప్పటినుంచి జాషువా చనిపోయిన జెస్సికాతో చాట్చేయడం మొదలుపెట్టాడు. ఏఐతో చేసిన చాట్బాట్కు ‘జెస్సికా కోర్ట్నీ పెరీరా’ గా పేరు పెట్టాడు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చనిపోయిన జెస్సికాతో మాట్లాడటం మొదలుపెట్టాడు. జెస్సికా చనిపోయి ఎనిమిది సంవత్సరాలైన తిరిగి జేస్సికాతో మాట్లాడటం నాకు ఎంతగానో ఆనందంగా ఉందని జాషువా పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. -
జియో గుడ్ న్యూస్, వాట్సాప్ ద్వారా మొబైల్ రీచార్జ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం సంస్థ రిలయన్స్ జియో కస్టమర్లు ఇక నుంచి వాట్సాప్ చాట్బాట్ ద్వారా మొబైల్ రీచార్జ్ చేసుకోవచ్చు. పోర్ట్–ఇన్, జియో సిమ్ కొనుగోలు చేయవచ్చు. జియో ఫైబర్, జియోమార్ట్, ఇంటర్నేషనల్ రోమింగ్ సపోర్ట్ పొందవచ్చు. ఈ–వాలెట్స్, యూపీఐ, క్రెడిట్/డెబిట్ కార్డ్స్ చెల్లింపులు జరపడంతోపాటు ఫిర్యాదులు, సందేహాల నివృత్తి, ఇతర సమాచారం అందుకోవచ్చు. ఇందుకోసం 7000770007 నంబరును కస్టమర్లు వినియోగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇంగ్లిష్, హిందీలో సేవలు అందుబాటులో ఉన్నాయి. క్రమంగా ఇతర భాషలనూ పరిచయం చేస్తారు. జియో ఫైబర్ సేవలనూ త్వరలో ఈ నంబరుకు అనుసంధానించనున్నారు. చాట్బాట్ ద్వారా కోవిడ్–19 వ్యాక్సిన్ సమాచారం కూడా కస్టమర్లు తెలుసుకోవచ్చు. పిన్కోడ్, ప్రాంతం పేరు టైప్ చేస్తే చాలు.. వ్యాక్సిన్ అందుబాటులో ఉందా లేదా చాట్బాట్ తెలియజేస్తుంది. చదవండి: జియో ఫోన్ వినియోగదారులకు శుభవార్త! -
రిలయన్స్ ఆన్లైన్ ఏజీఎమ్ రేపు..
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ 43వ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎమ్) రేపు (బుధవారం) జరగనున్నది. కరోనా వైరస్ కల్లోలం నేపథ్యంలో ఆన్లైన్ ద్వారా ఈ ఏజీఎమ్ను నిర్వహిస్తున్నారు. కంపెనీకి ఇదే తొలి ఆన్లైన్ ఏజీఎమ్, దాదాపు 500కు పైగా ప్రదేశాల నుంచి లక్షకు పైగా వాటాదారులు ఈ ఆన్లైన్ ఏజీఎమ్లో పాల్గొంటారని అంచనా. ఈ ఆన్లైన్ ఏజీఎమ్పై అవగాహన కల్పించడానికి ఇప్పటికే ఒక చాట్బోట్ను వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తెచ్చామని కంపెనీ తెలిపింది. ఈ వర్చువల్ ఏజీఎమ్లో వాటాదారులు చైర్మన్ ముకేశ్ అంబానీ ప్రసంగాన్ని వినడమే కాకుండా, ప్రశ్నలు కూడా అడగవచ్చని, ఓటింగ్లోకూడా పాల్గొనవచ్చని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏజీఎమ్లో ఏం ఉండొచ్చు...? రెండేళ్లలో రిలయన్స్ను రుణ రహిత కంపెనీగా మార్చడం లక్ష్యమని, గత ఏడాది ఏజీఎమ్లో ముకేశ్ అంబానీ ప్రకటించారు. జియో ప్లాట్ఫామ్స్లో 25.24 శాతం వాటా విక్రయం ద్వారా 13 విదేశీ సంస్థల నుంచి రూ.1.18 లక్షల కోట్ల మేర నిధులు సమీకరించింది. ఈ పెట్టుబడులతో పాటు రూ.53,124 కోట్ల రైట్స్ ఇష్యూతో ఈ లక్ష్యాన్ని గత నెలలోనే రిలయన్స్ కంపెనీ సాధించింది. బ్రోకరేజ్ సంస్థల అంచనాలు ఎలా ఉన్నాయంటే... ► రిలయన్స్కు చెందిన ఆయిల్–టు–కెమికల్ (ఓఈసీ)విభాగంలో 20 శాతం వాటాను 1,500 కోట్ల డాలర్లకు సౌదీ ఆరామ్కో సంస్థకు విక్రయానికి సంబంధించి గత ఏడాది ప్రకటించిన డీల్పై మరింత స్పష్టత రావచ్చు. ► రిలయన్స్ రిటైల్, రిలయన్స్ జియో ప్లాట్ఫారమ్స్ సంస్థల స్టాక్ మార్కెట్ లిస్టింగ్ వివరాలు వెల్లడి కావచ్చు. జియో ప్లాట్పారŠమ్స్ను అంతర్జాతీయ ఎక్సే్చంజ్ల్లో లిస్ట్ చేసే అవకాశాలున్నాయని అంచనాలున్నాయి. ► ఫ్యూచర్ గ్రూప్ కంపెనీల్లో వాటా కొనుగోలుకు సంబంధించిన వివరాలు వెలువడవచ్చు. ► జియో ఫైబర్ సేవలు, రిలయన్స్ జియో 5జీ సేవలు ఎప్పుడు మొదలయ్యేదీ తదితర వివరాలు వెల్లడి కావచ్చు. ► బోనస్, ఇంకా ఇతరత్రా వివరాలపై ప్రకటనలు ఉండొచ్చు. -
రిలయన్స్ చాట్బోట్ సర్వీస్
న్యూఢిల్లీ : భారతీయ స్టాక్ మార్కెట్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కొత్త పుంతలు తొక్కుతుంది. దిగ్గజ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) తన షేర్ హోల్డర్ల కోసం శనివారం ఏఐ శక్తితో కూడిన చాట్బోట్ను ప్రారంభించింది. దీనిని జియో ప్లాట్ఫామ్ అనుబంధ సంస్థ హాప్టిక్ టెక్నాలజీస్ అభివృద్ధి చేసింది. ఇది భారతదేశ చరిత్రలో అతి పెద్దది. హిందీ, మరాఠీ, కన్నడ, గుజరాతీ, బంగ్లా వంటి భాషల్లో లభించనుంది. ఆర్ఐఎల్లో దాదాపు రూ. 53,125 కోట్ల రూపాయల హక్కులు కలిగిన తన షేర్ హోల్డర్లకు రిలయన్స్ ఇండస్ట్రీస్ చాట్బోట్ ద్వారా సమాధానాలు ఇవ్వనుంది. ఇకపై షేర్ హోల్డర్స్ చాట్బోట్ సేవలను వాట్సప్ ద్వారా పొందవచ్చు. చాట్బోట్ సర్వీస్ను వినియోగించాలంటే '7977111111' జియో నంబర్కు 'హాయ్' అని మెసేజ్ పంపగానే ఆటోమెటిక్గా యాక్టివ్ అవుతుంది. వాట్సప్లో వినియోగదారులు ఏంచుకునే ప్రశ్నలకు కచ్చితమైన సమాధానమిచ్చేందుకు చాట్బోట్ ఎంతగానో ఉపయోగపడనుంది. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ సమయంలో షేర్ హోల్డర్ల ప్రశ్నలకు సమాధానాలందించేందుకు రిలయన్స్ బ్రోకర్లు, సబ్ బ్రోకర్లు, కాల్ సెంటర్లకు చాట్బాట్ విరివిగా సేవలు అందించనుంది. చాట్బోట్ ఎలా వినియోగించాలి.. చెల్లింపు పద్దతులు.. ఫారమ్లను ఎలా యాక్సెస్ చేయాలి.. లీడ్ మేనేజర్స్ను హెల్ప్లైన్ ద్వారా ఏ విధంగా సంప్రదించాలనే దానిపై రిలయన్స్ డాట్ కామ్లో తెలుసుకోవచ్చు. మనుషుల మాదిరిగానే చాట్బోట్ 24*7 తన సేవలను అందించనుంది. -
కరోనాపై వాట్సాప్ ‘చాట్ బాట్’ ప్రారంభించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలను చేస్తోంది. అందులో భాగంగా వివిధ సామాజిక మాధ్యమ వేదికలను ఉపయోగించుకుంటోంది. కరోనాపై పౌరులకు ప్రామాణికమైన సమాచారం అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం వాట్సాప్ సౌజన్యంతో నిర్దిష్టమైన చాట్ బాట్ రూపొందించిందని’రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. లాక్డౌన్ ను గౌరవిస్తూ ప్రజలందరూ ఇంటి వద్దనే ఉండాలని, అధికారిక మాధ్యమాల ద్వారా విడుదల చేసిన సమాచారంపైనే ఆధారపడాలని సూచించారు. కరోనాపై సమాచారాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన వాట్సాప్ ‘చాట్ బాట్’ను కేటీఆర్ సోమవారం ఆవిష్కరించారు. 9000658658 నంబరుపై ‘‘TS Gov Covid Info’’ పేరిట రూపొందించిన ఈ వా ట్సాప్ చాట్ బాట్ ద్వారా కరోనా గురించిన సమాచారంతో పాటు కరోనా నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలకు తెలియచేస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్కు చెందిన ఎస్.బి.టెక్నాలజీస్, మెసెంజర్ పీపుల్ సంస్థతో కలిసి రాష్ట్ర ఐటీ, వైద్య ఆరోగ్య శాఖలు ఈ చాట్ బాట్ను రూపొందించాయి. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు. ఇలా చేయాలి... చాట్ బాట్ సంభాషణ ప్రారంభించడానికి 9000658658 నంబరుకు ‘HI’లేదా ‘Hello’లేదా ‘Covid’అని వాట్సాప్లో సందేశం పంపించాలి. లేదా https://wa.me/919000658658?text=Hi లింకును మొబైల్ నుండి క్లిక్ చేయాలి. సూచనలు ఉంటే covid19info-itc@telangana.gov.inకి ఈ మెయిల్ చేయవచ్చు. -
360 డిగ్రీల ఫేస్ వీడియో
సోషల్ నెట్ వర్క్ దిగ్గజం ఫేస్ బుక్ ఓ కొత్తరకం చాట్బాట్లను ప్రజల ముందుకు తెచ్చింది. ఫేస్ బుక్ ఆవిష్కరించిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ బాట్ల వల్ల ప్రస్తుతం మనం వాడుతున్న మెసెంజర్ యాప్ లో యూజర్లు సంప్రదింపులు జరపడం, అప్డేట్స్ తెలుసుకోవడం జరుగుతుంది. బిజినెస్ లకు సంబంధించిన విలువైన సమాచారం యూజర్లకు తెలియజేయడంతోపాటు అవి కూడా ఉపయోగకరరీతిలో ఉండేలా ఈ చాట్ బాట్లను వ్యాపారవేత్తల భాగస్వామ్యంతో రూపకల్పన చేసింది. అలాగే 360 డిగ్రీల స్టీరియోస్కోపిక్ 3డీ వీడియో కెమెరాను శాన్ ప్రాన్సిస్కోలో జరిగిన రెండు రోజుల ఎఫ్8 డెవలపర్ల సదస్సులో ఫేస్ బుక్ విడుదల చేసింది. ఈ 3డీ వీడియో కెమెరాకు ఫేస్ బుక్ సరౌండ్ 360గా నామకరణం చేసింది. ఈ కెమెరా ద్వారా తీసే వీడియో క్లారిటీ ఎక్కువగా ఉంటూ, పోస్ట్ ప్రొడక్షన్ పనిని తగ్గిస్తాయని కంపెనీ పేర్కొంది. కానీ ఈ కెమెరాలను అమ్మదలుచుకోలేదని ఫేస్ బుక్ తెలిపింది. ఈ డిజైన్ ను షేర్ మాత్రమే చేసి ఇతర సంస్థలు ఇలాంటి కెమెరాలు రూపొందించే విధంగా ప్రోత్సహిస్తామని చెప్పింది. సమాంతరంగా అమర్చిన 17 లెన్స్లతో 30వేల డాలర్లకు ఫేస్ బుక్ తయారుచేసింది. ఇది 360 డిగ్రీల స్టీరియోస్కోపిక్ వీడియోను తీసే కెపాసిటీని కల్గి ఉంది. ట్విట్టర్, స్నాప్ చాట్, యూట్యూబ్ వీడియోలతో పోటీ పడే విధంగా ఈ వీడియో కెమెరాను రూపొందించామని ఫేస్ బుక్ వెల్లడించింది.