Christian
-
మరోసారి మతపరమైన వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి స్టాలిన్
సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ గతేడాది వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పోలీసు కేసులు ఎదుర్కొన్న తమిళనాడు ఉప ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ యువనేత ఉదయనిధి స్టాలిన్ మరోసారి మతపరమైన వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో గురువారం జరిగిన క్రిస్మస్ కార్యక్రమంలో ఉదయనిధి మాట్లాడుతూ.. తనను తాను గర్వించదగిన క్రైస్తవుడిగా ప్రకటించుకున్నారు. తనకు అన్ని మతాలు సమానమని, మత సామరస్యానికి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. మతం పేరుతో విభజించేవారిని, విద్వేషాన్ని చిమ్మేవారికి తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు. నాకు అన్ని మతాలు సమానం‘గత ఏడాది క్రిస్మస్ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు నేను క్రిస్టియన్నని సగర్వంగా చెప్పాను. ఇది పలువురు సంఘీలకు చిరాకు తెప్పించింది. ఈ రోజు మళ్లీ చెబుతున్నా. నేను గర్వించదగిన క్రైస్తవుడిని. నేను క్రిస్టియన్ని అని మీరు అనుకుంటే, క్రిస్టియన్ని. ముస్లింనని మీరు అనుకుంటే, ముస్లింను. హిందువు అనుకుంటే, నేను హిందువును. నాకు అన్ని మతాలు సమానం. అన్ని మతాలు మనకు ప్రేమను చూపించడమే నేర్పుతాయి’అని నొక్కి చెప్పారు.బీజేపీ–అన్నాడీఎంకే మధ్య రహస్య పొత్తుమతాన్ని రాజకీయ లబ్ది కోసం వాడుకునే వారు విద్వేషాలు, విభజనను వ్యాప్తి చేస్తున్నారని ఉపముఖ్యమంత్రి ఆరోపించారు. ‘ఇటీవల అలహాబాద్కు చెందిన ఓ న్యాయమూర్తి ఒక మతాన్ని కించపరిచేలా మాట్లాడటం చూశాం. ఆయన ముస్లింలపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యక్తి న్యాయమూర్తి పదవిలో ఉంటే ఆయన కోర్టులో న్యాయం ఎలా ఆశిస్తాం?’ అని ప్రశ్నించారు. ఆయనను తొలగించడానికి లోక్సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి కాంగ్రెస్, డీఎంకే ఎంపీలు సంతకాలు చేసినా, అన్నాడీఎంకే ఎంపీలు మాత్రం సంతకాలు చేయలేదన్నారు. ‘‘బీజేపీకి బానిసలుగా కొనసాగుతున్నారు కాబట్టే.. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించిన న్యాయమూర్తిని తొలగించాలని కోరుతూ చేసిన తీర్మానానికి అన్నాడీఎంకే మద్ధతివ్వలేదు’’ అని అన్నాడీఎంకేను విమర్శించారు.చదవండి: మీరూ ఏదో ఒకరోజు సీఎం అవుతారుబీజేపీ–అన్నాడీఎంకే మధ్య రహస్య పొత్తు కొనసాగుతోందని, రాజ్యాంగ విలువల కంటే రాజకీయ విధేయతకే అన్నాడీఎంకే ప్రాధాన్యమిస్తోందని ఆయన ఆరోపించారు. కాగా, సనాతన ధర్మంపై గతేడాది ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్నే రేపాయి. ఆయనపై చాలా చోట్ల పోలీసు కేసులు నమోదయ్యాయి. -
వెలుగు ప్రదాత: జాన్ క్రిస్టియన్ ఫ్రెడెరిక్ హయ్యర్
ఆడపిల్లలకు చదువెందుకని ప్రశ్నించే రోజుల్లో పట్టుబట్టి బాలికలకు చదువు చెప్పడానికి విద్యాలయాలు స్థాపించిన మిషనరీ జాన్ క్రిస్టియన్ ఫ్రెడ్రిక్ హయ్యర్ (1793–1873). ముఖ్యంగా తెలుగునేలపై వెలుగు నింపిన మానవతామూర్తి ఆయన. జర్మనీలోని హెల్మెస్టడ్ ప్రాంతంలో 1793 జూలై 10న జన్మించిన ఈయన అమెరికా వెళ్లి ఫిలడెల్ఫియాలో వేదాంత శాస్త్రం, యూని వర్సిటీ ఆఫ్ మేరీలాండ్లో స్కూల్ ఆఫ్ మెడిసిన్ నుండి వైద్య విద్యలో ఎండీ పట్టా పొందాడు. మెడిసిన్ చదివే రోజుల్లోనే సంస్కృతం నేర్చుకున్నాడు. మిషనరీగా అభిషేకం పొంది దాదాపు 300 పైగా సండే స్కూల్స్ నెలకొ ల్పాడు. హయ్యర్ చురుకుదనాన్ని గమనించిన మెకానిక్స్ బర్గ్కు చెందిన ‘ది సెంట్రల్ మిషనరీ సొసైటీ’ వారు భారతదేశానికి మిషనరీగా ఆయన్ని ఎంపిక చేశారు. ఆ విధంగా హయ్యర్ 1842 జూలై 31న గుంటూరు వచ్చాడు. వచ్చిన వెంటనే తెలుగు నేర్చుకుని తొలి పాఠశా లను 1842 నవంబరులో ప్రారంభించాడు. అదీ కేవలం బాలికలకు మాత్రమే. నెల గడిచేసరికి ఎని మిది మంది ముస్లిం బాలికలకు పాఠశాల ప్రవేశం కల్పించాడు. అనంతరం అన్ని వర్గాల వారికి ఏడు పాఠశాలలు నెలకొల్పి బాలికలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారు. 1844 నాటికి మరో ఎనిమిది పాఠశాలలు ప్రారంభించారు.ఆ కాలంలో ప్రసూతి సమయంలో సరైన వైద్యం లభించక తల్లీ–పిల్లలు మరణించేవాళ్లే ఎక్కువ. అందుకే గుంటూరు కొత్తపేటలో 1843లో ఉచిత వైద్యాలయాన్ని తాత్కాలికంగా ఏర్పాటుచేశాడు. 1845 నాటికి రాజమండ్రి, భీమవరంలో పాఠశాలలను నెలకొల్పాడు. ఆ పరిసర ప్రాంతాల్లోనే వైద్య శాలలు ప్రారంభించాడు. హయ్యర్ ఒక ఆదర్శమూర్తిగా దర్శనమిస్తాడు. జీవిత భాగస్వామి ఎంపికలో ఇద్దరు పిల్లలున్న మేరీగాష్ అనే వితంతువును వివాహం చేసుకుని కొత్త జీవితం కల్పించాడు. తెలుగు భాషలో మంచి ప్రావీణ్యం సంపాదించి తెలుగులోనూ కీర్తనలు రాశాడని అంటారు. తెలుగు వారికి సేవచేసి విద్య, వైద్యంతో ప్రజల గుండెల్లో నిలిచిన హయ్యర్ 1873లో 80 ఏళ్ల వయసులో పెన్సిల్వేనియాలో మరణించాడు.– ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి, తెనాలి -
FACT CHECK: హే జీసస్.. రోత రాతల పాపాలను క్షమించుడి!
సాక్షి, అమరావతి: రామోజీ పచ్చ పైత్యం రోజు రోజుకీ పరాకాష్టకు చేరుతోంది. క్రైస్తవుల సంక్షేమంపై జగన్ వివక్ష అంటూ విషం చిమ్మే నీచానికి రామోజీ దిగజారిపోయారు. రాయితీలపై అడ్డగోలుగా కోత అంటూ మడత వ్యాఖ్యలు చేస్తూ ఈనాడులో అబద్ధాలు అచ్చేయడాన్ని ‘హే జీసస్.. రామోజీ రోత రాతలు చూడు ప్రభు’ అని క్రైస్తవ సమాజం వ్యాఖ్యానిస్తోంది. పాపపు రాతల తీరును క్షమించమని ప్రార్థిస్తున్నాయి. చంద్రబాబు ఐదేళ్లపాలనలో క్రైస్తవులకు అరకొర రాయితీలు, పథకాలతో సరిపెట్టినా పచ్చ కళ్లకు అంతా సవ్యంగా కన్పించింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి క్రైస్తవులకు ఆర్థిక, సామాజిక, రాజకీయంగా తోడ్పాటు అందిస్తుంటే రామోజీకి మింగుడు పడటంలేదు. ఆరోపణ: టీడీపీ హయాంలో స్వయం ఉపాధి, నైపుణ్య శిక్షణకు ప్రాధాన్యం, చర్చిలకు వెన్నుదన్ను. వాస్తవం: స్వయం ఉపాధి, నైపుణ్య శిక్షణ అంటూ కేవలం రెండు కార్యక్రమాలు అమలు చేసిన టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో క్రిస్టియన్ మైనార్టీల కోసం ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. ఆ రెండు కార్యక్రమాలే ఏదో గొప్పగా చేసేసినట్టు ఈనాడు పచ్చ కలర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆరోపణ: వైఎస్సార్సీపీ పాలనలో క్రైస్తవులకు కుచ్చుటోపీ, యువతకు శిక్షణ లేదు, వెన్ను విరిచారు. వాస్తవం: వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రిస్టియన్(మైనారిటీ) ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేసి వారికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచింది. సుమారు 6.82 లక్షల క్రైస్తవ మైనారిటీల సంక్షేమ పథకాల అమలుతో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందంజలో ఉంది. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న అమ్మఒడి, వైఎస్ఆర్ వాహన మిత్ర, లా నేస్తం, వైఎస్ఆర్ చేయూత, వంటి ఎన్నో కొత్త కార్యక్రమాలు వారి ఉన్నతికి దోహదం చేశాయి. కరోనా లాక్డౌన్ సమయంలో పాస్టర్లకు వన్–టైమ్ ప్రత్యేక ఆర్థిక సహాయం, జెరూసలేంకు తీర్థయాత్ర, చర్చిల ద్వారా, చర్చి నడిపే సంస్థలకు సహాయం అందించడం వంటి ప్రత్యేక తోడ్పాటుతో క్రిస్టియన్ మైనార్టీల్లో ఆత్మస్థైర్యం నింపింది. ఆరోపణ: ఆర్థిక సాయమూ అంతంతే వాస్తవం: చంద్రబాబు ప్రభుత్వం స్వయం ఉపాధి కోసం ఐదేళ్లలో రూ.29 కోట్లు, శిక్షణ కోసం రూ.3.55 కోట్లు ఖర్చు చేస్తే అదే గొప్ప అంటూ ఈనాడు డబ్బాలు కొట్టింది. వాస్తవానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 మార్చి వరకు క్రిస్టియన్ మైనార్టీ ఆర్థిక సంస్థ ద్వారా ఏకంగా రూ.416.58కోట్లు అందించింది. దీనిలో ఒక్క చేయూత పథకం(స్వయం ఉపాధి) ద్వారా 27,150 మందికి రూ.50.90కోట్లు అందించింది. దీంతోపాటు 90శాతం సబ్సీడీపై 90 మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లు(నిత్యావసర సరుకుల సరఫరా వాహనాలు) రూ.55 లక్షలు ఆర్థిక సాయం అందించింది. ఆరోపణ: అప్పుడలా ఇప్పుడిలా అంటూ తప్పుడు లెక్కలు వాస్తవం: టీడీపీ ప్రభుత్వం(2014–19)లో చర్చిలకు సాయం, రాయితీలపై రుణాలు, నైపుణ్య శిక్షణ వంటివి అరకొరగా జరిగితే గొప్పగా జరిగినట్టు ఈనాడు మసిపూసి మారేడు కాయ చేసింది. వైఎస్సార్సీపీ 2019–24 మధ్య క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అందించిన ఆర్థిక తోడ్పాటును ఉద్దేశ్యపూర్వకంగా విస్మరించింది. ► పాస్టర్లకు గౌరవ వేతనం కింద కోవిడ్ లాక్డౌన్ సమయంలో రూ.5వేలు చొప్పున వన్–టైమ్ గ్రాంట్గా 29,841 మందికి రూ.1490లక్షలు అందించింది. దీంతోపాటు నెలకు రూ.5వేలు చొప్పున 8427 మంది పాస్టర్లకు గౌరవ వేతనంగా రూ.7109.9లక్షలు అందించింది. ► ఇవి కాక లా నేస్తం కింద జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.5వేలు చొప్పున 2020–21లో రూ.30 లక్షలు, 2021–22లో రూ.50 లక్షలు కేటాయించింది. ► కొత్త చర్చిల నిర్మాణం, పాత చర్చిల మరమ్మత్తులు, పునరుద్ధరణ, ఇతర మౌలిక వసతుల కోసం రూ.5 లక్షలు చొప్పున, శ్మశాన వాటికల అభివృద్ధికి రూ.3 నుంచి 5 లక్షలు చొప్పున నిధులు ఇచ్చింది. ఇప్పటివరకు 98 చర్చిలకు రూ.5.67కోట్లు నిధులు అందించింది. ► జెరూసలేం, ఇతర బైబిల్ ప్రదేశాలకు తీర్థ యాత్ర పథకం కింద, వార్షిక ఆదాయం రూ.3 లక్షల కంటే తక్కువ ఉన్న ప్రతి లబ్ధిదారునికి రూ.60వేలు, వార్షిక ఆదాయం రూ.3 లక్షల కంటే ఎక్కువ ఉంటే రూ.30 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించింది. ఇప్పటివరకు 1,060 మంది లబ్ధిదారులకు రూ.591.60 లక్షలు నిధులు కేటాయించింది. -
క్రైస్తవ ఆస్తులను కొల్లగొట్టింది తెలుగు తమ్ముళ్లే బాబూ!
కర్నూలు (సెంట్రల్): రాష్ట్రంలో క్రైస్తవ మిషనరీ ఆస్తులను కొల్లగొట్టింది, అమ్ముకున్నది టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన అనుచరులేనని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. చంద్రబాబు తమతో గుంటూరు, విజయవాడ వస్తే నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఆయన ఎక్కడకు రమ్మంటే అక్కడికి వచ్చి టీడీపీ నాయకులు ఆక్రమించిన క్రైస్తవ ఆస్తుల వివరాలు ఇస్తామని, దీనిపై బహిరంగ చర్చకు రావాలని మంత్రి సవాల్ విసిరారు. శుక్రవారం కర్నూలులో ప్రభుత్వ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గురువారం విజయవాడలో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు చేసిన ఆరోపణలపై మంత్రి స్పందించారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసిన ఘనత సీఎం జగన్దని చెప్పారు. అమరావతిలో దళితుల అసైన్మెంట్ భూములను చంద్రబాబు భయపెట్టి బలవంతంగా గుంజుకున్నాడన్నారు. రేపల్లెలో 400 దళిత కుటుంబాలను వెలివేసిన చరిత్ర చంద్రబాబుదన్నారు. చివరికి దళిత కుటుంబాల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారని చెప్పి అవమానించిన వ్యక్తి ఆయన కాదా... అని ప్రశ్నించారు. దళితుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం జగన్ను మరోసారి గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. సీఎం జగన్ దళితులపై అక్రమ కేసులు ఎత్తివేస్తే బాబుకు భయమెందుకని ప్రశ్నించారు. ఎమ్మెల్యే డాక్టర్ జె.సుధాకర్, వైఎస్సార్సీపీ నాయకులు యాట ఓబులేసు, సత్తిరాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం
సాక్షి, అమరావతి: దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని గతంలోనే తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయనను క్రైస్తవ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉందన్న విషయం మీకు కూడా తెలిసిందేనన్నారు. కాగా చాలాచోట్ల శ్మశాన వాటికల సమస్య ఉందని.. దీన్ని పరిష్కరించాలని క్రైస్తవ ప్రతినిధులు సీఎంకు విన్నవించారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ శ్మశాన వాటికలపై ఇప్పటికే ప్రభుత్వం నివేదికలు తెప్పించుకుందని చెప్పారు. సచివాలయాల వారీగా ఎస్సీలకు శ్మశానవాటికలు లేనిచోట ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఈ సందర్భంగా క్రైస్తవ ప్రతినిధులు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలతో నిరుపేదలకు మేలు జరుగుతోందని కొనియాడారు. పారదర్శకంగా, వివక్షలేకుండా పథకాలు అందుతున్నాయన్నారు. డీబీటీ వల్ల చివరి లబ్ధి దారుడికి సైతం పథకాల మేలు లభిస్తోందని ప్రశంసించారు. పాస్టర్లకు గౌరవ వేతనం ఇచ్చి సహాయకారిగా నిలిచారని ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. చర్చి ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చర్చిల ఆధ్వర్యంలోని స్కూళ్లకూ, సేవా భవనాలకు మున్సిపల్ పన్నును మినహాయించాలని విన్నవించారు. జిల్లా కేంద్రాల్లో కమ్యూనిటీ హాళ్లను నిర్మించాలని సీఎంను కోరారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ల కోసం న్యాయపోరాటం చేస్తున్నామని.. దీనికి తోడుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. -
సీఎం జగన్ను కలిసిన క్రైస్తవ ప్రతినిధులు
సాక్షి, తాడేపల్లి: క్రైస్తవ ప్రతినిధులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. సీఎంతో పలు అంశాలపై క్రైస్తవ ప్రతినిధులు చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాలతో నిరుపేదలకు మేలు జరుగుతోందన్న ప్రతినిధులు.. పారదర్శకంగా, వివక్ష లేకుండా వారికి పథకాలు అందుతున్నాయని కొనియాడారు. పాస్టర్లకూ గౌరవ వేతనం ఇచ్చి సహాయకారిగా నిలవటంపై క్రైస్తవ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల శ్మశాన వాటికల సమస్య ఉందనీ, బరియల్ గ్రౌండ్స్ సమస్య ఉందని, చర్చి ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ప్రతినిధులు కోరారు. చర్చిల ఆధ్వర్యంలోని స్కూళ్లకూ, సేవా భవనాలకు మున్సిపల్ పన్ను నుంచి మినహాయింపునివ్వాలన్నారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు కోసం న్యాయ పోరాటం చేస్తున్నామనీ, దీనికి తోడుగా నిలవాలని ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలంటూ గతంలోనే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని, ఈ అంశం న్యాయస్ధానం పరిధిలో ఉందని పేర్కొన్నారు. శ్మశాన వాటికలపై ఇప్పటికే ప్రభుత్వం నివేదికలు తెప్పించుకుందని, లేని చోట ఏర్పాటుకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామన్నారు. సచివాలయాల వారీగా ఎస్సీలకు శ్మశాన వాటికలు లేనిచోట ఇప్పించేందుకు చర్యలు కూడా తీసుకుంటున్నామని సీఎం వివరించారు. చదవండి: ఆరోగ్యంగా చంద్రబాబు.. తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు: జైళ్ల శాఖ డీఐజీ -
మైనార్టీలు భయంతో బతుకుతున్నారు
రాంగోపాల్పేట్ (హైదరాబాద్): దేశంలో క్రిస్టియన్, ముస్లిం మైనార్టీలు భయంతో బతుకుతున్నారని, ఈ వర్గాలవారు దేశ పౌరులే అయినప్పటికీ ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం విమర్శించారు. శనివారం సికింద్రాబాద్లోని హరిహరకళా భవన్లో క్రిస్టియన్ కో–ఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ క్రైస్తవ హక్కుల సమా వేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని అన్నారు. దేశంలో మత స్వేచ్ఛ లేదని ధ్వజమెత్తారు. 2017–21 సంవత్సరాల మధ్య మైనార్టీలపై 2,900 దాడులు జరిగినట్టు నేషనల్ క్రైమ్ రికార్డులో నమోదైందని తెలిపారు. విదేశాల నుంచి పేదలు, షెడ్యుల్డు తెగల విద్య, ఆరోగ్యం కోసం క్రైస్తవ మైనార్టీ సంస్థలకు నిధులు అందుతుంటే 6,622 సంస్థలకు మోదీ ప్రభుత్వం లైసెన్సులు రద్దు చేసిందన్నారు. 3.30 కోట్ల క్రైస్తవ జనాభా ఉంటే క్రైస్తవ మంత్రి ఒక్కరే ఉన్నారని అన్నారు. దేశంలో 42 శాతం మంది పట్టభద్రులు నిరుద్యోగులుగా ఉన్నారని, సోనియా గాంధీ ప్రత్యేక చొరవతో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని, కానీ కాంగ్రెస్ కాకుండా మరో పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిఉంటే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదన్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా గత 20 నెలల్లో 6.8 శాతం ధరలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో మోదీ పర్యటన సందర్భంగా కేసీఆర్ను తిడుతున్నారని కానీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాట్లాడుతూ బీజేపీ జాతీయ నాయకుడు బీఎల్ సంతోష్ రాష్ట్రంలో హంగ్ ఏర్పడుతుందని, ప్రభుత్వంలో బీజేపీ కీలకంగా ఉంటుందని అన్నారని.. అంటే బీఆర్ఎస్తో కలసి పాలిస్తారనేది అర్థం అవుతోందన్నారు. కర్ణాటక ఎన్నికలు మోదీ పీఠాన్ని కదిలించాయని, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో కేంద్రంలో బీజేపీ గద్దె దిగక తప్పదని పేర్కొన్నారు. మరో మారు బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ మరో మణిపూర్లా మారుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియాను దూషించే నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని రేవంత్రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ ఠాక్రే, తదితరులు పాల్గొన్నారు. -
మానవీయ కోణంలో సంక్షేమానికి పెద్దపీట
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ మానవీయ కోణంలో ఆలోచించి అన్నివర్గాలను పేదరికం నుంచి బయటపడేసేందుకు వివిధ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. అన్ని కులాలు, మతాలను గౌరవిస్తూ.. వారికి సమానంగా సంక్షేమాన్ని అందించడమే బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. శనివారం ఎల్బీ స్టేడియంలో మైనారిటీలకు రూ. లక్ష ఆర్థిక సాయం అందించే పథకాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి ప్రసంగిస్తూ ముస్లిం, క్రైస్తవ మైనారిటీల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. గడిచిన తొమ్మిదేళ్లలో మైనారిటీల సంక్షేమం కోసం సుమారు రూ.15 వేల కోట్లను ఖర్చు చేశామని తెలిపారు. మైనారిటీ నిరుద్యోగ యువత ఆర్థికాభివృద్ధికి వంద శాతం సబ్సిడీ కింద ఒక్కో లబ్ధి దారుడికి రూ.లక్ష ఆర్థిక సహాయం అందిస్తున్నామని, ఈ పథకం కింద రాష్ట్రం మొత్తం మీద 27 వేల మందికి ప్రయోజనం చేకూరుతుందని వెల్లడించారు. తొలివిడతగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు పది వేల మందికి రూ.లక్ష చొప్పున అందిస్తున్నామని తెలిపారు. మైనారిటీలకు కార్పొరేట్ స్థాయి విద్య.. మైనారిటీ వర్గాల విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వసతులతో పాటు నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. సుమారు 204 మైనారిటీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి అందరికీ విద్య అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ప్రస్తుతం లక్షకు పైగా విద్యార్థులకు ఉచితంగా విద్య అందిస్తున్నామని చెప్పారు. హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ ప్రభాకర్రావు, ఎమ్మెల్యేలు అబ్దుల్ అహ్మద్ బిన్ బలాలా, జాఫర్ హుస్సేన్, కాలేరు వెంకటేశ్, తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహ్మద్ ఇంతియాజ్ ఇషాక్, క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజేశ్వర్ రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
క్రిస్టియన్ డయర్ ఫాల్ ఫ్యాషన్ షో.. తళుక్కుమన్న అందాల భామలు (ఫొటోలు)
-
తెలంగాణ డీహెచ్ శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు..
సాక్షి, కొత్తగూడెం: తెలంగాణ డీహెచ్ శ్రీనివాస్ కొత్తగూడెంలో జరిగిన క్రిస్టమస్ వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకల సందర్భంగా శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో డీహెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. దేశంలో ఆధునికతకు మూలం క్రైస్తవులు. దేశ అభివృద్ధిలో నాటి క్రైస్తవ పాత్ర కీలకం. ఏసుక్రీస్తు దయవల్లే భారత్లో కరోనా తగ్గింది. భారత దేశ మనుగడ క్రైస్తవ మహత్యం అంటూ కామెంట్స్ చేశారు. -
ఎల్బీ నగర్ లో ‘ముక్తిఘాట్’.. ఒకేచోట హిందూ, ముస్లిం, క్రిస్టియన్ శ్మశానాలు
-
మూడుపాయల ‘ముక్తిఘాట్’.. ఒకేచోట హిందూ, ముస్లిం, క్రిస్టియన్ శ్మశానాలు
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం.. భిన్నభాషలు, సంస్కృతులు, ఆచారాలు, మతాలకు నెలవు. మతసామరస్యం, అలయ్, బలయ్, ఆత్మీయతలకు ఆలంబన. అన్ని మతాల సారం ఒక్కటేనని చాటిచెప్పే తాత్విక పునాదులపై వెలసింది. ఆ సత్యాన్ని సమున్నతంగా ఆవిష్కరించేవిధంగా ప్రభుత్వం ‘ముక్తిఘాట్’ను నిర్మించింది. దేశంలోనే మొట్టమొదటిసారి హైదరాబాద్లో మూడు మతాల సంప్రదాయాలకు అనుగుణంగా ఒకేచోట శ్మశానవాటికలు ఏర్పాటు చేసింది. ఎవరి మత సంప్రదాయాల మేరకు వారు అంతిమ సంస్కారాలను నిర్వహించేవిధంగా ముక్తిఘాట్లో హెచ్ఎండీఏ అధికారులు ఏర్పాట్లు చేశారు. ‘అంతిమంగా మనమంతా ఒక్కటే’అనే గొప్ప సందేశాన్ని ఇచ్చేవిధంగా నాగోల్ బండ్లగూడ సమీపంలోని ఫతుల్లాగూడలో రూ.16.25 కోట్ల వ్యయంతో ఇది రూపుదిద్దుకుంది. అత్యాధునిక, మౌలిక సదుపాయాలను ముక్తిఘాట్లో ఏర్పాటు చేశారు. ఆన్లైన్లో అంతిమ సంస్కారాలను వీక్షించే సదుపాయం కూడా ఉంది. మంగళవారం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఈ ముక్తిఘాట్ను ప్రారంభించారు. ముక్తిఘాట్కు అడుగులు ఇలా.. ►ఫతుల్లాగూడలోని సుమారు ఆరున్నర ఎకరాల డంపింగ్ యార్డ్ స్థలాన్ని హెచ్ఎండీఏ ముక్తిఘాట్ కోసం సేకరించింది. ఈ స్థలంలో మతసామరస్యాన్ని ప్రతిబింబించేవిధంగా ఒకేచోట హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లకు 2.5 +2+2 చొప్పున మూడు శ్మశానాలను ఏర్పాటు చేసింది. ►ముక్తిఘాట్లో కార్యాలయం, ప్రార్థనామందిరాలు, శీతలీకరణగది, మరుగుదొడ్లు, వాచ్మన్ గది, అంతిమయాత్రల వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏరియా తదితర సదుపాయాలను కల్పించింది. ►సుమారు 50 కేఎల్డీ (కిలోలీటర్ పర్ డే) సామర్థ్యం కలిగిన మురుగుశుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్ విభాగం ఆధ్వర్యంలో ఆహ్లాదకరమైన ల్యాండ్స్కేప్లను అభివృద్ధి చేసింది. హిందూ శ్మశానవాటికలో... ►పర్యావరణహితమైన పద్ధతిలో దహనసంస్కారాలు నిర్వహించేవిధంగా 140 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ పవర్ప్లాంట్లతో దహనసంస్కారాలు నిర్వహించే దహనవాటికలను ఏర్పాటు చేసింది. ►హిందూ సంప్రదాయం ప్రకారం10వ రోజు చేసే దశదిన కర్మకాండకు ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయి. ముస్లిం,క్రైస్తవ శ్మశాన వాటికల్లో.. ►శ్మశానాల్లో మూడు భాగాలు ఏర్పాటు చేశారు. ఒక్కో దాంట్లో సుమారు 550 మృతదేహాలను పూడ్చిపెట్టేందుకు అవకాశం ఉంటుంది. ఆన్లైన్ వీక్షణ సదుపాయం అనివార్య కారణాల వల్ల అంత్యక్రియలకు హాజరుకాలేకపోయిన బంధుమిత్రులు తమ ఆత్మీయుల భౌతికదేహాలను చివరిసారి చూసుకొనేందుకు ఆన్లైన్ వీక్షణ సదుపాయాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ జరిగే అంత్యక్రియలను ఎక్కడి నుంచైనా చూడవచ్చు. -
సాకర్ వరల్డ్ కప్ లో క్రిస్టియన్ రోనాల్డ్ సరికొత్త రికార్డు
-
పెళ్లికి ముందు.. వధువు హఠాన్మరణం
సాక్షి, బెంగళూరు: రోస్ వేడుకలో వధువు కుప్పకూలి మరణించింది. ఉడుపి కోళలగిరి హవంజెలో జరిగింది. హవంజెకీ చెందిన జోస్నా లూయిస్ (24)కు గురువారం పెళ్లి జరగాల్సిఉంది. పెళ్లికి ముందు రోజు క్రైస్తవ సంప్రదాయం ప్రకారం బుధవారం రాత్రి 8:30 గంటలకు బంధువుల ఇంటిలో రోస్ వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో ఆమె స్పృహ తప్పి పడిపోగా స్థానిక ఆస్పత్రికి తరతలించారు. గురువారం తెల్లవారుజామున ఆమె మృతి చెందింది. లో బీపీనే కారణమని బంధువులు తెలిపారు. చదవండి: (కుమార్తె ప్రేమవివాహం.. ఆటోతో ఢీకొట్టి.. చనిపోయాడనుకొని..) -
నెదర్లాండ్ జట్టు సలహాదారుడిగా టీమిండియా మాజీ కోచ్
టీ20 ప్రపంచకప్-2022కు ముందు నెదర్లాండ్ క్రికెట్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు సలహాదారులుగా టీమిండియా మాజీ కోచ్, దక్షిణాఫ్రికా దిగ్గజం గ్యారీ కిర్స్టన్, ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ డేన్ క్రిస్టియన్ను నెదర్లాండ్ క్రికెట్ నియమించింది. కాగా నెదర్లాండ్స్ ఆటగాళ్ళు ఆస్ట్రేలియాకు వెళ్లేముందు కేప్ టౌన్లోని గ్యారీ కిర్స్టన్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందారు. ఈ క్రమంలో మళ్లీ అతడు జట్టుతో సలహారుడిగా జతకట్టనున్నాడు. అదే విధంగా ఆడిలైడ్లో నెదార్లాండ్ ట్రైనింగ్ క్యాంప్లో జట్టుతో క్రిస్టియన్ కలవనున్నాడు. వీరిద్దరూ నెదర్లాండ్ హెడ్ కోచ్ ర్యాన్ కూక్తో కలిసి పనిచేయనున్నారు. "టీ20 ప్రపంచకప్ కోసం మా జట్టు కోచింగ్ స్టాప్లో గ్యారీ కిర్స్టన్, డాన్ క్రిస్టియన్ చేరడం మాకు చాలా సంతోషంగా ఉంది. వారి అనుభవంతో జట్టును విజయ పథంలో నడిపిస్తారని ఆశిస్తున్నాను" అని నెదర్లాండ్ క్రికెట్ బోర్డు హై పెర్ఫార్మెన్స్ మేనేజర్ రోలాండ్ లెఫెబ్రే పేర్కొన్నారు. కాగా కిర్స్టన్ 2011లో వన్డే వరల్డ్కప్ సొంతం చేసుకున్న భారత జట్టు హెడ్ కోచ్గా కిర్స్టన్ పనిచేశాడు. ఇక నెదర్లాండ్ ఈ మెగా ఈవెంట్లో తొలుత క్వాలిఫియర్ మ్యాచ్లు ఆడనుంది. డచ్ జట్టు తమ తొలి మ్యాచ్లో ఆక్టోబర్16న యూఏఈతో తలపడనుంది. చదవండి: R Ashwin Vs Ramiz Raja: పీసీబీ చైర్మన్ రమీజ్ రాజాకు అశ్విన్ దిమ్మతిరిగే కౌంటర్ -
కాంగ్రెస్ హిందూ వ్యతిరేకి
న్యూఢిల్లీ: భారత్ జోడోయాత్రలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో క్రైస్తవ మతపెద్ద ఒకరు మాట్లాడినట్లు వెలుగులోకి వచ్చిన ఓ వీడియోపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కాంగ్రెస్ హిందూ వ్యతిరేక వైఖరి బయటపడిందంటూ బీజేపీ మండిపడింది. జార్జి పొన్నయ్య అనే పాస్టర్ శుక్రవారం రాహుల్తో మాట్లాడిన వీడియోను బీజేపీ నేతలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘యేసు ప్రభువు దేవుడా, కాదా? మీరెలా భావిస్తారు?’ అని రాహుల్ ప్రశ్నించగా, ‘‘యేసు ప్రభువు నిజమైన దేవుడు. మానవుడిగా భూమిపై జీవించారు. ఆయన శక్తి దేవతల్లాంటి వారు కాదు’’ అంటూ పొన్నయ్య బదులిచ్చారు. భారత్ జోడో యాత్ర అసలు రంగు ఈ వీడియోతో బయట పడిందని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా అన్నారు. నవరాత్రులు ప్రారంభం కానున్న వేళ శక్తి దేవతను ఇలా అవమానించడం దారుణమని మండిపడ్డారు. ‘‘హిందూ దైవాలను అవమానించడం కాంగ్రెస్ పార్టీకి కొత్తేమీ కాదు. గతంలో రాముడి ఉనికిని ప్రశ్నించింది. ఎన్నికల ముందు రాజకీయ లబ్ధి కోసం రాహుల్ హిందువుగా నటిస్తుంటారు. ఒక వర్గాన్ని బుజ్జగించడానికి మరో మతాన్ని కించపర్చడం ఏమిటి?’’ అని నిలదీశారు. పొన్నయ్య గతంలో హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేసి అరెస్టయ్యాడని బీజేపీ నేత షెహజాద్ పూనావాలా అన్నారు. బీజేపీ విమర్శలను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం తిప్పికొట్టారు. ‘‘బీజేపీ విద్వేషాల ఫ్యాక్టరీ. తద్వారా పబ్బం గడుపుకోవడమే దాని పని. యాత్రకు స్పందన చూసి ఓర్వలేకపోతోంది’’ అంటూ ట్వీట్ చేశారు. భారత్ జోడో యాత్ర స్ఫూర్తిని ఎవరూ దెబ్బతీయలేరని, కుట్రదారులకు భంగపాటు తప్పదని అన్నారు. కేరళలోకి ప్రవేశం భారత్ జోడో యాత్ర శనివారం తమిళనాడు నుంచి కేరళలో అడుగు పెట్టింది. అంతకుముందు కన్యాకుమారి జిల్లాలో తమిళనాడు తొలి మహిళా బస్ డ్రైవర్, మార్తాండంలో మహిళా పారిశుద్ధ్య కార్మికులతో రాహుల్ మాట్లాడారు. నారాయణ గురు జయంతి నాడు కేరళలో అడుగుపెట్టడం సంతోషంగా ఉందన్నారు. -
సామాన్య శూద్రుడికి సెయింట్హుడ్
భారతదేశంలో సామాన్య మానవుడైన దేవసహాయం లేదా లాజరస్ (1712–1752)ను వాటికన్ 2022 మే 15న ‘పునీత హోదా’(సెయింట్ హుడ్)గా ప్రకటించడం అనేక రకాలుగా చారిత్రాత్మకమైనది. సెయింట్ పీటర్ లేదా మదర్ థెరీసా స్థాయిని కల్పించడంతో ఇది సమానం. పుట్టుక, పెరుగుదల, చావు వరకూ హింసాత్మక జీవితాన్ని గడిపిన అతి సామాన్యుడు సెయింట్గా మారడం మానవ మత చరిత్రలో ఎన్నడూ చూసి ఉండం. నీలకంఠ పిళ్లైగా జన్మించిన దేవసహాయం కుల వ్యవస్థ కారణంగానే తనచుట్టూ ఉన్న లక్షలాది మంది మగ్గిపోతున్నారని గ్రహించాడు. మానవజాతిలోని సమస్త బానిసత్వానికి వ్యతిరేకంగా జీసస్ ఎలా దారి చూపాడో, దేవసహాయం కూడా తన మరణం ద్వారా భారత్లోని శూద్రులకు అలాంటి దారి చూపాడు. హిందూ దేవాలయాల్లో ప్రార్థించినట్లు గానే, స్త్రీ పురుషులు తమకు కానుకలు (క్రైస్తవ సంప్రదాయంలో అద్భుతాలు) ఇవ్వాలని దేవసహాయంను వేడుకునే వారు. ఆయన విగ్రహం మెడలో రంగురంగుల పూలదండలను అలంకరించి పూజలు చేసేవారు. పొట్టలోనే మరణించిన తన గర్భస్థ పిండాన్ని తాను ప్రార్థించిన వెంటనే సజీవమైన పసిపాపగా చేశాడని ఒక మహిళ ఆ మహిమ గురించి పేర్కొనడం దేవసహాయంకు సెయింట్హుడ్ ఇవ్వడానికి గల ఆధారాలలో ఒకటయింది. శూద్ర మహిళలపై ఘోరమైన కుల, ఆధ్యాత్మిక, సాంస్కృతిక బంధనాలు బిగించిన వ్యవస్థలో దేవసహాయం జన్మించాడు. తల్లి దేవకి అమ్మ. ఈమె కేరళలో నాయర్ అని పిలిచే శూద్ర వ్యవసాయ ఉత్పాదక కులానికి చెందిన వ్యక్తి. హిందూ ఆలయంలో పూజలు నిర్వహించే వాసుదేవన్ నంబూద్రి అనే బ్రాహ్మణ పూజారికి పుట్టిన సంతానమే దేవసహాయం (మతం మారడానికి ముందుపేరు నీలకంఠన్ పిళ్లై). దేవకి అమ్మ, వాసుదేవన్ నంబూద్రి మధ్య ‘సంబంధం’ వారి మధ్య ప్రేమ వ్యవహారం లేదా వారు వివాహం చేసుకున్న కారణంగా ఏర్పడిన సంబంధం కాదు. నంబూద్రికి ఆమె లొంగిపోవడం అనేది నాయర్ మహిళలతో లైంగిక సంబంధాలను నిర్బంధపూరితంగా బ్రాహ్మణులు పెట్టుకునే కులకట్టు బాటులో భాగంగా జరిగింది. ఇలాంటి లైంగిక బంధాన్ని ‘సంబంధం’ అని పిలిచేవారు. ఒక శూద్రుడిగా ఇలాంటి మానవ హింస ద్వారానే బాల్యం నుంచి పెద్ద వయసు వరకూ అనుభవిస్తూ వచ్చాడు దేవసహాయం. బ్రాహ్మణ నిర్దేశకత్వంలోని ఈ సంబంధంలోని హింసాత్మక భాగం ఏమిటంటే, పిల్లలు తమకు జన్మనిచ్చిన తండ్రి ఎవరు అనేది తెలుసు కోవలసి ఉంటుంది. పైగా ఈ సంబంధం ద్వారా పుట్టిన పిల్లలు తల్లివద్ద లేక ఆమె పుట్టింట్లో పెరగాలి లేదా వ్యవసాయ పనులు చేసుకుంటూ బయట గడపాలి. చాలామంది నాయర్ కుటుంబాలు ఇలాంటి వివాహేతర సంబంధం ద్వారా పుట్టిన తమ కుమార్తెల పిల్లలను ఆమోదించి వారికి కొన్ని ఆస్తి హక్కులు కల్పించేవారు. కానీ ‘సంబంధం’లో పుట్టిన పిల్లలు తండ్రి, తల్లితో పాటు ఇతర పిల్లలు ఉన్న కుటుంబాల్లో జీవించవలసి వస్తే అది ఘోరమైన చిత్రహింస లతో కూడిన జీవితాన్ని కలిగిస్తుంది. దీనిలో ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే ఇలాంటి పిల్లలను దేవుడి బిడ్డల్లాగే చూసేవారు. వీళ్లు దేవుడిచ్చిన దౌర్భాగ్యాన్ని అనుభవిస్తూ దానికి ఎదురు తిరగలేక జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది. హిందూమతంలోని అలాంటి అమానుష జీవితానికి వ్యతి రేకంగా నీలకంఠన్ పిళ్లై తిరగబడి క్రైస్తవ మతం పుచ్చుకున్నాడు. ఆనాటి పూజారి వర్గం, క్షత్రియుల నియంత్రణలో ఉన్న రాజ్యం ఈ మతమార్పిడిని ఘోరాతిఘోరమైన నేరంగా భావించింది. క్రైస్తవు డిగా మారిన తర్వాత, దేవసహాయం కుల వ్యవస్థ కారణంగానే తన చుట్టూ ఉన్న లక్షలాది మంది ప్రజలు మగ్గిపోతున్నారని గ్రహించాడు. దీంతో దిగువ కులాలతో కలవటం ప్రారంభించాడు. కేరళలో ఇప్పటికీ నాయర్ కులం శూద్ర వ్యవసాయ కులంలో ఉన్నత శ్రేణిలో ఉంటోంది. అదే సమయంలో నాయర్లకు జంధ్యం ధరించే హక్కు లేదు. వీరికి సంçస్కృత గ్రంథాలు చదివే హక్కు లేదు. హిందూ ఆలయాల్లో వీరు పూజారులు కాలేరు. దేవసహాయం అన్ని కులాల ప్రజలతో కలిశాడనీ, అస్పృశ్యులతో కలిసి భోంచేయడం కొనసాగించాడనీ జనం చెప్పుకునేవారు. ఇది జీసస్ స్వయంగా ఇజ్రాయెల్లో అన్యజనులు, వ్యభిచారిణిలతో కలిసిన దానితో సమానం అని చెప్పుకోవచ్చు. వికీపీడియాలోని వివ రాల ప్రకారం, రాజ్యంలోని బ్రాహ్మణ పూజారి, భూస్వామ్య ప్రభువులు, రాజకుటుంబ సభ్యులు, నాయర్ కమ్యూనిటీ కలిసి దేవన్ లేదా రామయ్యన్ దలవా వద్ద దేవ సహాయంపై ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. శూద్రుల చారిత్రక బానిసత్వం, అదనంగా సంబంధం పేరిట స్త్రీ పురుషుల బంధంలో అత్యంత అవమానాలు భరించిన నాయర్ కమ్యూనిటీ కూడా విముక్తి ప్రదాత అయిన దేవసహాయంను చిత్రహింసలు పెట్టి వధించడంలో పూజారులతో, రాజుతో కలిసి పోయారు. శూద్రులలోని ఈ ప్రతిఘాతుక చైతన్యమే భారతదేశాన్ని చిరకాల బానిసల భూమిగా మార్చివేసింది. రెండువేల సంవత్సరాల క్రితం మానవజాతిలోని సమస్త బానిసత్వానికి వ్యతిరేకంగా జీసస్ ఎలా దారి చూపాడో, దేవసహాయం కూడా తన మరణం ద్వారా భారత దేశంలోని శూద్రులకు అలాంటి దారి చూపాడు. ఇప్పటికీ శూద్రులలో ఆధ్యాత్మిక బానిసత్వం కొనసాగుతోంది. క్రిస్టియన్గా మారిన తర్వాత దేవసహాయం మహారాజా మార్తాండవర్మ రాజ్యంలో నివసించసాగాడు. క్రిస్టియానిటీని స్వీకరిం చిన నాటికి ఆ రాజ్యంలో మంచి స్థానంలోనే ఉండేవాడు. కానీ 40 ఏళ్ల వయసులో అంటే 1752 సంవత్సరంలో అతడిని చంపేశారు. తమిళ–మలయాళీ ప్రాంతాన్ని చాలా కాలం పరిపాలించిన వర్మలు క్షత్రియులు. జీసస్ను శిలువ వేసిన కాలంలో జెరూసలెంలోని ఫరిసీ కౌన్సెల్ నాటి రోమన్ పాలకులపై ఒత్తిడి తెచ్చినట్లే, భారత ఉప ఖండం మొత్తంలో క్షత్రియులు పాలిస్తున్న రాజ్యాలకు బ్రాహ్మణులు న్యాయ శాసనాలు రచించేవారు. మరణ శిక్ష విధిస్తున్న సమయంలో రోమన్ పాలకుడు పొంటియనస్ పిలేట్, జీసస్ పట్ల మరీ కఠినంగా వ్యవహరించాలని అనుకోలేదు. కానీ అప్పటి పూజారి వర్గ మండలి అత్యంత క్రూరంగా వ్యవహరించి జీసస్కి శిలువ విధించింది. తలపై ముళ్ల కిరీటం పెట్టారు. గోల్గోతాలోని శిలువ వేసే ప్రాంతం వరకూ ఆయనపై శిలువ మోపి నడిపించారు. బ్రాహ్మణ ఆధిపత్యంనుంచి శూద్రులకు ఏవిధంగానూ విముక్తి లభించని విధంగా ప్రాచీన బ్రాహ్మణ న్యాయ శాస్త్రమైన మను ధర్మ శాస్త్రం శాసనాలు రూపొందిం చింది. అందుకే దేవసహాయం బ్రాహ్మణాధిపత్య హిందూయిజం నుంచి బయటపడినప్పటికీ అతడిని చిత్రహింసలు పెట్టాలని పూజారి వర్గం నిర్ణయించుకుంది. దళితులు, మత్స్యకారులు, వడ్రంగులు, గొర్రెల కాపర్లు, కుమ్మ రులు, ఇనుము, బంగారు నగల పనివారితో కలిసి భోంచేయటం ద్వారా దేవసహాయం కుల వ్యవస్థను ధ్వంసం చేయడానికి ప్రయ త్నించాడని ఆరోపించారు. పైగా మతమార్పిడిలను అతడు ప్రోత్స హించాడనీ, విదేశీయులకు సమాచారం ఇవ్వడం ద్వారా రాజద్రోహా నికి పూనుకున్నాడనీ ఆరోపణలు గుప్పించారు. జీసస్కి లాగే ముందుగా అతడిని నిర్బంధించి చిత్రహింసల ఏకాంత గదిలో ఉంచారు. మూడేళ్ల తర్వాత దేవసహాయాన్ని గొడ్డును బాదినట్లు బాది, గేదెపై కూర్చోబెట్టారు. గేదెను పురాణ గ్రంథాల ప్రకారం మృత్యుదేవత అయిన యుముడి వాహనంగా వర్ణించేవారు. గేదె వెనుక వైపు అతడిని తిప్పి గ్రామాల్లో ఊరేగిస్తూ కొరడాలతో కొట్టారు. భారతీయ ఉపఖండం మొత్తంలో అత్యధికంగా పాలను ఇచ్చే జంతువు గేదె. కానీ అది నల్లగా ఉంటుంది కాబట్టి బ్రహ్మణ పూజా రులు, క్షత్రియ పాలకులు దాన్ని దయ్యపు జంతువుగా భావించేవారు. జీసస్కు గాడిద వాహనమైనట్లే, దేవసహాయానికి గేదె దేవుడిచ్చిన వాహనంగా మారింది. ఆ గేదె ముందుకు కదులుతుండగా, రక్తమోడే టట్లు దేవసహాయాన్ని బాదారు. రోజుల తరబడి అతడికి కనీసం ఆహారం, నీరు అందించకుండా గేదెపై ఊరేగిస్తూ చిత్రహింసలు పెట్టారు. అతడిని ఎలా హింసిస్తున్నారో, బాధపెడుతున్నారో అతడి భార్య స్వయంగా చూసేలా నిర్బంధించారు. చివరకు అతడిని రాళ్లు, పొదలతో ఉన్న అడవిలో కాల్చేశారు. ఇప్పుడు దేవసహాయం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన సెయింట్ అయ్యాడు. సెయింట్గా మారిన సాధారణ మానవుడు దేవసహాయం. ప్రపంచ ఆధ్యాత్మిక వ్యవస్థలపై ఇది తీవ్ర ప్రభావం కలిగిస్తుంది. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
యేసును మురిపించిన జక్కయ్య విశ్వాసం
జీవం లేని బలమైన దుంగలు ప్రవాహంలో కొట్టుకుపోతే, జీవమున్న చిన్నారి చేపపిల్లలు ప్రవాహానికి ఎదురీదుతాయి. లోకంతో పాటు కొట్టుకుపోయే జీవితానికి జక్కయ్య అసలైన ఉదాహరణ. బోలెడు డబ్బు, సామాజిక ప్రాబల్యం జక్కయ్య సొంతం. జక్కయ్య అనే హెబ్రీ పేరుకు ‘పవిత్రుడు’ లేదా ‘నీతిమంతుడు’ అని అర్థం. జక్కయ్య ఎలాంటి వాడు కావాలని తల్లిదండ్రులు ఆశపడ్డారో వాళ్ళతనికి పెట్టిన ఈ పేరునుబట్టి అర్ధం చేసుకోవచ్చు. ధర్మశాస్త్రబద్ధంగా, తలిదండ్రులు బహుశా అతన్ని ఎనిమిది రోజుల శిశువుగా ఉన్నపుడే సున్నతి కోసం, తాముండే యెరికోకు దగ్గరే గనుక, యెరూషలేము ఆలయానికి తీసుకళ్లారేమో. పన్నెండేళ్ళు పూర్తయినపుడు యూదులంతా చేసే ‘బార్ మిట్జ్వా’ అనే ఉత్సవాన్ని కూడా అతని తల్లిదండ్రులు ఆలయంలో అట్టహాసంగా చేశారేమో. కానీ చివరికి అతని జీవితం మాత్రం వాటన్నింటికీ విరుద్ధమైంది. లోకానికి ఎదురీది మహావిశ్వాసి కావాల్సిన జక్కయ్య, లోకమలినానికి మారుపేరయ్యాడు( లూకా 19:7). ఇది అతని తల్లిదండ్రులకే కాదు, దేవునికి కూడా ఎంతో నిరుత్సాహాన్ని మిగిల్చిన పరిణామం. దేవుని ప్రేమను విస్మరించి, లోకంతో పాటు కొట్టుకోవడంలో అంతకాలం అతనికి ఆనందం, సౌలభ్యం దొరికింది. అయితే అంతమాత్రాన అతను దేవుణ్ణి ఏమీ విడిచిపెట్టలేదు. దేవుడతనికి జీవితంలో ఒక చిన్న భాగం మాత్రమే. కాకపోతే జక్కయ్యకు లోకమే సర్వస్వమ్ అయ్యింది. అదీ అతని సమస్య, అదే మనలో చాలా మందికున్న సమస్య కూడా. అలా లోకపరంగా ఎంతో ఉత్తేజంతో జీవించాడు కాని ఆత్మీయంగా చాలా స్తబ్దంగా ఉండిపోయాడు. అంటే, జక్కయ్య తాజ్ మహల్ లాంటివాడన్నమాట. తాజ్ మహల్ బాహ్యంగా కళ్ళు చెదిరేంత సుందరమైన, గొప్ప కట్టడమైనా లోలోపల కుళ్ళుకంపు కొట్టే సమాధే కదా!! రోమా ప్రభుత్వానికి పన్నులు వసూలు చేసే పనిలో జక్కయ్య తన అంతరాత్మను తాకట్టుపెట్టి అవినీతిపరుడు, ధనవంతుడు కూడా అయ్యాడు. ధనవంతుడవడం పాపం కాదు, కానీ దొడ్డిదారిలో ధనార్జన చెయ్యడం, దేవుని మీద కాకుండా, డబ్బు మీదే ఆధారపడి జీవించడం పాపం. నీతిమంతుడు ఏడుసార్లు పడ్డా తిరిగి పైకి లేస్తాడన్న బైబిల్ సూక్తి ప్రకారం (సామె 24:16), అంతగా పడిపోయిన జక్కయ్య, తన జీవితంలో ఒక దశలో ఇక తాను ఆత్మీయంగా తిరిగి పైకి లేవాలని నిర్ణయించుకున్నాడు. అందుకే యేసు వస్తున్నాడని తెలిసి యెరికోలో ఒక చెట్టెక్కి యేసు కోసం ఎదురు చూశాడు. ప్రతి విశ్వాసి జీవితంలోనూ ఇదొక మహత్తరమైన నిర్ణయం. అలాంటి నిర్ణయాన్ని ప్రభువు కూడా గొప్పగా హర్షిస్తాడు. జక్కయ్యలో ఇన్ని లోపాలున్నా అతనిలో యేసుప్రభువు చూసిన ఒక గొప్ప సుగుణమేమిటంటే, అతను కేవలం యేసు కోసమే యేసు వద్దకొచ్చాడు. జనమంతా స్వస్థతలు, సంపదలు, సమస్యల పరిష్కారం కోసం యేసు వద్దకు తరలివస్తున్న రోజుల్లో, జక్కయ్య మాత్రం యేసే కావాలనుకొని, యేసు మాత్రమే తనకు చాలుననుకొని, యేసును ఆశ్రయించాడు, అలా యేసును జక్కయ్య, అతని కుటుంబం కూడా సంపూర్ణంగా పొందారు. తన డబ్బంతా పేదలకు, తనవల్ల అన్యాయం జరిగిన వారికి పంచి, డబ్బు కన్నా యేసే తనకు ముఖ్యమని, తాను డబ్బు మనిషిని కాదని, యేసుమనిషేనని ఆచరణలో రుజువుచేసుకున్నాడు, ఇదే అత్యున్నతమైన శ్రేణికి చెందిన విశ్వాసం. అందుకే జక్కయ్య అబ్రాహాము కుమారుడన్న బిరుదును ఏకంగా యేసు నుండే పొంది, తన విశ్వాసానికి ప్రభువు నుండే ప్రామాణికతను సంపాదించుకున్నాడు. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
బాబును ఏకిపారేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే
సాక్షి, గుంటూరు/విజయవాడ: క్రైస్తవ సమాజం పట్ల ప్రతిపక్షనేత చంద్రబాబు అవలంభిస్తున్నతీరుపై ఫిలిప్ సి తోచర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మత రాజకీయాలు చేయడంలో చంద్రబాబుకు ఎవ్వరూ సరిలేరని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు మెడలో శిలువ వేసుకొని బైబిల్ చదువుతూ నా జన్మధన్యమైందని ప్రకటించుకున్న ఆయన.. ఇప్పుడు దేవాలయాలపై జరుగుతున్న దాడులకు క్రైస్తవ సమాజాన్ని నిందించడం సరికాదని హితవు పలికారు. కాగా, క్రైస్తవ మతంపై ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే (ఆంగ్లో ఇండియన్) ఫిలిప్ సి తోచర్ శనివారం ఆ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై సోమవారం ఆయన సాక్షి టీవీతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చు పెడుతున్న చంద్రబాబు వైఖరి అసహ్యం కలిగిస్తుందని, తన ఉనికిని చాటుకోవడం కోసం చంద్రబాబు ఎంత నీచానికైనా దిగజారుతారని ఫిలిప్ మండిపడ్డారు. వ్యక్తులను, వ్యవస్థలను వాడుకొని వదిలి వేయటంలో చంద్రబాబు దిట్ట అని ఆయన పేర్కొన్నారు. గతంలో చాలా సందర్భాల్లో చంద్రబాబు ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడ్డారని గుర్తు చేశారు. ఓట్ల కోసమే చంద్రబాబు క్రైస్తవులను వాడుకుంటాడని, ఇప్పుడు అతని అసలు రంగు బయటపడటంతో రానున్న ఎన్నికల్లో క్రైస్తవ సమాజం అతనికి తగిన గుణపాఠం నేర్పుతుందని హెచ్చరించారు. క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీసినందుకు అతను తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రజాకర్షక పతకాలకు లభిస్తున్న ఆదరణను చూసి చంద్రబాబుకు మతి భ్రమించిందని ఫిలిప్ అన్నారు. తాను అధికారంలోకి రావడం అసంభవమని తెలిసి ఫ్రస్ట్రేషన్ లో ఏదోదో మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారేమోనన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. తాను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయటం సరైన నిర్ణయమేనని పేర్కొన్నారు. ఫిలిప్ సి తోచర్ 2014–19 మధ్య ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఆంగ్లో ఇండియన్ కోటాలో నామినేటెడ్ సభ్యుడిగా టీడీపీ నుంచి ఎన్నికయ్యారు. -
‘నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడు’
శరీరంలో కళ్ళది, వాటిని కాపాడే కనురెప్పలది చాలా కీలకమైన పాత్ర. కనురెప్ప రక్షక కవచంగా ఉంటూ కనుగుడ్డును కాపాడటమే కాదు, తన నిరంతర కదలికల ద్వారా ఎప్పటికప్పుడు తేమను ఒక పొరలాగా కనుగుడ్డుపై వ్యాపింపజేస్తూ కంటి పనితీరును మెరుగుపర్చుతుంది. తానే సృష్టించిన అలాంటి కనుపాపను, కనురెప్పలను ప్రస్తావిస్తూ దేవుడు జెకర్యా ప్రవక్త ద్వారా తన ప్రజలకిచ్చిన భద్రతా వాగ్దానం ఎంతో ఆదరణకరమైనది కూడా. ‘నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడు’ అన్నాడు దేవుడు తన ప్రజలతో (జఖర్యా 2:8). దేవుడు మనపట్ల తన ప్రేమను వ్యక్తపర్చిన ఈ వచనం అసమానమైనది. ఇక మోషే అయితే, తమ 40 ఏళ్ళ అరణ్య ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ, దేవుడు తమను కనుపాపలాగా కాపాడాడని స్తుతించాడు(ద్వితీ 32:10). ఎవరైనా సరే తనకు, తన కుటుంబానికి కోరుకునేది సంపూర్ణమైన భద్రత. ప్రాచీనకాలంలో రాజులు భద్రత కోసం ఎల్తైన స్థలాలు, కొండల మీద తమ కోటలు, తామున్న పట్టణాల చుట్టూ ఎత్తైన ప్రాకారాలు కట్టుకునేవారు. కాని 30 వేల అడుగుల ఎత్తున ఎగిరే యుద్ధ విమానాల నుండి క్షణాల్లో ఎగిసి వచ్చే క్షిపణులు, అత్యంత విధ్వంసకమైన బాంబులున్న నేటి కాలంలో ఎత్తైన ప్రాకారాలు, కోటగోడలకు, అసలు ‘ఎత్తు’ అనే మాటకే అర్థం లేకుండా పోయింది. కంటికి కనిపించని ఒక చిన్న వైరస్ అనే క్రిమి, ఇంతటి మహాప్రపంచాన్ని వణికిస్తోందంటే, దేవుని ఈ వాగ్దానం మరుగున పడిందా? లేక మనిషి తన భద్రత కోసం తాను చేసే భద్రతా వ్యూహాలు, ఏర్పాట్లు, తయారుచేసుకున్న ఆయుధాలు పూర్తిగా విఫలమయ్యాయా? మనిషి కనుగుడ్డును ముట్టడమే కష్టమైతే, దేవుని కనుగుడ్డును ముట్టడం మరెంత కష్టం? ఆయన బిడ్డలమైన మనల్ని శత్రువు ముట్టడం, నష్టపర్చడం, మనపై దాడి చెయ్యడం కూడా అంతే అసాధ్యమంటాడు దేవుడు. మరి ప్రపంచమంతటా నెలకొన్న కనీ వినీ ఎరుగని భద్రతారాహిత్యానికి కారణం ఏమిటి? అన్న ప్రశ్నకు మనం తప్పక జవాబు తెలుసుకోవాలి. జఖర్యా ప్రవచించే నాటికి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు 70 ఏళ్ళ బబులోను చెరనుండి విడుదలై అప్పుడప్పుడే యెరూషలేముకు తిరిగొచ్చారు. దేవుని ప్రజల్ని, దేవుడే చెరలోకి పంపడమేమిటన్న ప్రశ్న వాళ్లందరిలోనూ ఉంది. కొందరు, బబులోను చక్రవర్తి మమ్మల్ని చెర పాలు చేసి దేవుని కనుగుడ్డును ముట్టినట్టే కదా? అని జఖర్యా ప్రవక్తను నిలదీసి ఉంటారు కూడా. అయితే తమ ప్రవర్తన మార్చుకొమ్మని రెండొందల ఏళ్ల పూర్వమే యెషయా ప్రవక్త ద్వారా హెచ్చరించినా ప్రజలు మారలేదు. దేవుని భయం సమసిపోయి, ప్రజలు కేవలం పేరుకే దేవుని ప్రజలుగా జీవిస్తున్న కారణంగానే వారి జీవితాలలో, సమాజంలో భద్రత కరువైంది. దేవుని హెచ్చరికల్ని పెడచెవిన పెడితే తీవ్ర పర్యవసానాలు తప్పవు. విధేయులై దేవుని ప్రసన్నతను, అపారమైన ఆశీర్వాదాలను పొందని వారు, దేవునికవిధేయులై జీవితాలు, కుటుంబాల్లో బాగుపడ్డవారు మీకెక్కడా కనిపించరు. దేవుని వాగ్దానాలు నెరవేరాలంటే దేవునికి విధేయత చూపాలి, దేవునిలో అంతకంతకూ ఎదిగిన అనుభవం కూడా ఉండాలి. అలా కాకుండా ఎంతో వాక్యం తెలిసినా విశ్వాసంలో ఎదగక, డబ్బు, అధికారం, పేరు, ఆరోగ్యం, సంపద ఎంత ఉంటే అంత ఆశీర్వాదమన్న ‘బాలశిక్షస్థాయి’ విశ్వాసం లోనే ఉండిపోతే, అదే అన్ని సమస్యలకు మూలం. ప్రజల్లో మార్పునకు కూడా అదే ఆటంకం. మనం నమ్మే లోక నియమాలను, మనకు నచ్చని దైవిక విధివిధానాలకు అన్వయించే ‘అతి పోకడలే’ ఈ రోజు మనమెదుర్కొంటున్న ఒక ముఖ్యమైన ఆత్మీయ రుగ్మత. మారని దేవునితో సాగే మన సాంగత్యానికి రుజువేమిటంటే, దినదినం మనం దేవుని సారూప్యంలోకి మారడమే!! మనం దేవుని ప్రజలమైతే, మన పరలోకపు తండ్రియైన దేవుని లక్షణాలు లోకానికి మనలో స్పష్టంగా కనిపించాలి. ఆ స్థాయిలో మనలో దేవుని ఆశీర్వాదాలకు, భద్రతకు అంతు ఉండదు. అపుడు, మనల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడే అంటాడు దేవుడు!! – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
త్వరలో క్రిస్టియన్ భవన్ నిర్మాణం పూర్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని క్రైస్తవుల సమస్యల పరిష్కారం కోసం సలహా సంఘం ఏర్పాటు చేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. సీఎం కేసీఆర్ కేవలం మాటల సెక్యూలరిస్ట్ కాదని, ఆచరణలో గుండెల నిండా లౌకికవాదాన్ని నింపుకున్నారన్నారు. మంత్రుల నివాస ప్రాం గణంలోని క్లబ్హౌజ్లో శుక్రవారం జరిగిన క్రైస్తవ మత పెద్దల ఆత్మీయ సమ్మేళనంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్తో కలసి ఆయన పాల్గొన్నారు. దేశ, రాష్ట్రాభివృద్ధిలో మిషనరీల పాత్ర ఎవరూ కాదనలేరని, కరోనా పరిస్థితుల్లో మిషనరీ ఆసుపత్రుల సేవలు మరువలేనివని కేటీఆర్ ప్రశంసించారు. సమ్మిళిత అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని, క్రైస్తవ భవన నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేస్తామని హామీనిచ్చారు. 8 వేల మందికి విద్యాబోధన: కొప్పుల రాష్ట్రంలో క్రైస్తవుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న 204 రెసిడెన్షియల్ పాఠశాలల్లో 8 వేల మంది క్రైస్తవ విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు. క్రైస్తవ శ్మశాన వాటికల కోసం స్థలాలు కేటాయించడంతో పాటు, వాటిని అభివృద్ధి కూడా చేస్తున్నామన్నారు. క్రైస్తవ సంస్థల ఆస్తులను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని ఆయన హామీనిచ్చారు. కోవిడ్ పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ అన్నారు. వంద దేశాల కంటే ఎక్కువ జనాభాను కలిగి ఉన్న హైదరాబాద్ శరవేగంగా విస్తరిస్తోందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాజేశ్వర్రావు, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్, సికింద్రాబాద్ బిషప్ తుమ్మ బాల తదితరులు పాల్గొన్నారు. -
సెరెనా అదిరెన్...
తనకెంతో కలిసొచ్చిన వేదికపై అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ శుభారంభం చేసింది. మార్గరెట్ కోర్ట్ (ఆస్ట్రేలియా) పేరిట ఉన్న అత్యధిక గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్స్ (24) ఆల్టైమ్ రికార్డును సమం చేసేందుకు మళ్లీ ప్రయత్నిస్తున్న 38 ఏళ్ల సెరెనా ఈ క్రమంలో కొత్త రికార్డును సృష్టించింది. యూఎస్ ఓపెన్ టోర్నమెంట్ చరిత్రలోనే అత్యధిక మ్యాచ్ల్లో విజయాలు అందుకున్న ప్లేయర్గా సెరెనా ఘనత వహించింది. 101 విజయాలతో అమెరికాకే చెందిన మరో దిగ్గజం క్రిస్ ఎవర్ట్ పేరిట ఇన్నాళ్లూ ఉన్న రికార్డును 102వ విజయంతో సెరెనా బద్దలు కొట్టింది. 1998లో తొలిసారి యూఎస్ ఓపెన్లో ఆడిన సెరెనా ఈ మెగా టోర్నీలో ఆరుసార్లు చాంపియన్గా నిలిచింది. ఈసారీ సెరెనా గెలిస్తే అత్యధికసార్లు యూఎస్ ఓపెన్ విజేతగా నిలిచిన క్రీడాకారిణిగా క్రిస్ ఎవర్ట్ (6 సార్లు) పేరిటే ఉన్న రికార్డును సవరించి చరిత్ర పుటల్లోకి ఎక్కుతుంది. న్యూయార్క్: కరోనా వైరస్ భయంతో యూఎస్ ఓపెన్ టోర్నీకి టాప్–10లోని ఆరుగురు క్రీడాకారిణులు గైర్హాజరీ అయిన స్థితిలో... అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని... చరిత్రలో స్థానం సంపాదించేందుకు అమెరికా మహిళా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ తొలి అడుగు వేసింది. గత రెండేళ్లలో ఫైనల్కు చేరుకొని రన్నరప్ ట్రోఫీతోనే సరిపెట్టుకున్న సెరెనా ఈసారి మాత్రం ట్రోఫీని ముద్దాడాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో మూడో సీడ్ సెరెనా 7–5, 6–3తో తన దేశానికే చెందిన క్రిస్టీ ఆన్పై విజయం సాధించింది. 81 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లోసెరెనా 13 ఏస్లు సంధించింది. కెరీర్లో 20వసారి యూఎస్ ఓపెన్లో ఆడుతున్న సెరెనా తాజా గెలుపుతో ఈ మెగా టోర్నీ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన ప్లేయర్గా (పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాలు కలిపి) తనకంటూ ప్రత్యేక స్థానాన్ని లిఖించుకుంది. 101 విజయాలతో క్రిస్ ఎవర్ట్ (అమెరికా) పేరిట ఉన్న ఈ రికార్డును సెరెనా అధిగమించింది. ఒకవేళ సెరెనా ఈసారి చాంపియన్గా నిలిస్తే అత్యధికంగా ఏడుసార్లు యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పుతుంది. 1998లో ఈ టోర్నీలో అరంగేట్రం చేసిన సెరెనా ఆరుసార్లు విజేతగా (1999, 2002, 2008, 2012, 2013, 2014)... నాలుగుసార్లు రన్నరప్గా (2001, 2011, 2018, 2019) నిలిచింది. 2003, 2017లలో సెరెనా ఈ టోర్నీలో ఆడలేదు. యూఎస్ ఓపెన్కు సన్నాహాల్లో భాగంగా రెండు టోర్నీలు ఆడిన సెరెనా రెండింటిలోనూ క్వార్టర్ ఫైనల్ దాటలేదు. ఆడిన ఐదు మ్యాచ్ల్లోనూ ఆమె మూడు సెట్లపాటు పోరాడాల్సి వచ్చింది. ‘యూఎస్ ఓపెన్లో ఆడేందుకు వచ్చిన ప్రతిసారీ ఏదో ఒక రికార్డు బద్దలు కొట్టానని నాతో చెబుతుంటారు. అయితే నేనెప్పుడూ రికార్డుల కోసం ఆడలేదు. వాటి గురించి ఆలోచించడంలేదు. టైటిల్ గెలవడమే నా ముందున్న లక్ష్యం’ అని సెరెనా వ్యాఖ్యానించింది. మాజీ చాంపియన్ క్లియ్స్టర్స్కు నిరాశ... ఎనిమిదేళ్ల తర్వాత గ్రాండ్స్లామ్ టోర్నీలో పునరాగమనం చేసిన మూడుసార్లు యూఎస్ ఓపెన్ చాంపియన్ కిమ్ క్లియ్స్టర్స్ (బెల్జియం)కు నిరాశ ఎదురైంది. తొలి రౌండ్లో 37 ఏళ్ల క్లియ్స్టర్స్ 6–3, 5–7, 1–6తో ఎకతెరీనా అలెగ్జాండ్రోవా (రష్యా) చేతిలో ఓడిపోయింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్ల్లో రెండో సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా) 6–2, 6–2తో విక్మాయెర్ (బెల్జియం)పై, తొమ్మిదో సీడ్ యోహానా కొంటా (బ్రిటన్) 7–6 (9/7), 6–1తో హీథెర్ వాట్సన్ (బ్రిటన్)పై, ఐదో సీడ్ సబలెంకా (బెలారస్) 7–6 (7/1), 6–4తో ఒషీన్ డోడిన్ (ఫ్రాన్స్)పై, ఏడో సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) 6–1, 6–1తో తిమియా బాబోస్ (హంగేరి)పై, ప్రపంచ మాజీ నంబర్వన్ అజరెంకా (బెలారస్) 6–1, 6–2తో బార్బరా హాస్ (ఆస్ట్రియా)పై గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించారు. మూడో రౌండ్లో కెర్బర్, క్విటోవా.... మహిళల సింగిల్స్లో మాజీ విజేత కెర్బర్ (జర్మనీ), ఆరో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్), ఎనిమిదో సీడ్ పెట్రా మార్టిక్ (క్రొయేషియా), 14వ సీడ్ అనెట్ కొంటావె (ఎస్తోనియా) మూడో రౌండ్లోకి చేరారు. రెండో రౌండ్లో కెర్బర్ 6–3, 7–6 (8/6)తో ఫ్రీడ్సామ్ (జర్మనీ)పై, మార్టిక్ 6–3, 6–4తో కాటరీనా బొండారెంకో (ఉక్రెయిన్)పై, కొంటావె 6–4, 6–1తో కయా యువన్ (స్లొవేనియా)పై, క్విటోవా 7–6 (7/3), 6–2తో కొజ్లోవా (ఉక్రెయిన్)పై గెలిచారు. అయితే 12వ సీడ్ వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్) 1–6, 2–6తో సస్నోవిచ్ (బెలారస్) చేతిలో... 30వ సీడ్ మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్) 6–1, 6–7 (2/7), 0–6తో గ్రషెవా (రష్యా) చేతిలో ఓడిపోయారు. వీనస్ రికార్డు... అత్యధికసార్లు యూఎస్ ఓపెన్లో ఆడిన క్రీడాకారిణిగా వీనస్ విలియమ్స్ (అమెరికా) రికార్డు సృష్టించింది. సెరెనా అక్క అయిన 40 ఏళ్ల వీనస్ యూఎస్ ఓపెన్లో 22వసారి బరిలోకి దిగింది. అయితే ఆమెకు తొలి రౌండ్లోనే ఓటమి ఎదురైంది. కరోలినా ముచోవా (చెక్ రిపబ్లిక్) 6–3, 7–5తో వీనస్ను ఓడించింది. ఇప్పటిదాకా మార్టినా నవ్రతిలోవా (21 సార్లు) పేరిట ఉన్న రికార్డును వీనస్ సవరించింది. ముర్రే అద్భుతం... పురుషుల సింగిల్స్ విభాగంలో మాజీ చాంపియన్ ఆండీ ముర్రే (బ్రిటన్) అద్భుత విజయం సాధించాడు. దాదాపు 20 నెలల తర్వాత తొలి గ్రాండ్స్లామ్ మ్యాచ్ ఆడిన ముర్రే 4–6, 4–6, 7–6 (7/5), 7–6 (7/4), 6–4తో యోషిహిటో నిషియోక (జపాన్)పై గెలుపొందాడు. 4 గంటల 39 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో ముర్రే తొలి రెండు సెట్లు కోల్పోయి ఆ తర్వాత వరుసగా మూడు సెట్లు గెలిచి ఊపిరి పీల్చుకున్నాడు. వరుసగా రెండు సెట్లు చేజార్చుకున్నాక విజయాన్ని అందుకోవడం ముర్రే కెరీర్లో ఇది పదోసారి కావడం విశేషం. మూడో సీడ్ మెద్వెదేవ్ (రష్యా), రెండో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా), ఎనిమిదో సీడ్ బాటిస్టా అగుట్ (స్పెయిన్), పదో సీడ్ రుబ్లెవ్ (రష్యా) కూడా రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. దివిజ్ శరణ్ జంట ఓటమి పురుషుల డబుల్స్లో దివిజ్ శరణ్ (భారత్)–నికోలా కాచిచ్ (సెర్బియా) జంట తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. శరణ్–కాచిచ్ ద్వయం 4–6, 6–4, 3–6తో కూలాఫ్–మెక్టిక్ (క్రొయేషియా) జంట చేతిలో ఓడిపోయింది. -
అస్పృశ్యతపై ఒక సమరయుని సమరం!
ఒకసారి ఎంతో భావగర్భితమైన ఉపమానాన్ని యేసుప్రభువు చెప్పాడు. ఇజ్రాయెల్ దేశంలో ఉత్తరాన యేసుప్రభువు నివసించిన నజరేతు గ్రామమున్న గలిలయ ప్రాంతానికి, దక్షిణంలోని యెరూషలేము పట్టణానికి మధ్య రాకపోకలకు రెండు మార్గాలున్నాయి. ఒకటేమో సమరయ గ్రామాల గుండా వెళ్లే దగ్గరి మార్గం. కానీ సమరయులు అంటరానివారు గనుక సనాతన యూదులు ఆ మార్గంలో వెళ్లేవారు కాదు. రెండవది దూరమార్గం కానీ సనాతన యూదులుండే యెరికో లాంటి పట్టణాల గుండా వెళ్లే మార్గం. అయితే దొంగల బెడద కూడా బాగా ఉన్న మార్గమది. ఒకసారి ఆ మార్గంలోనే సనాతన యూదుడొకతను ప్రయాణమై వెళ్తూ దొంగల బారినపడ్డాడు. దొంగలతన్ని బట్టలతో సహా పూర్తిగా దోచుకొని విపరీతంగా కొట్టి కొనప్రాణాలతో దారిపక్కన పడేశారు. అపుడు అతనిలాగే సవర్ణులు, సనాతనులైన ఒక యాజకుడు, లేవీయుడు అటువైపు వచ్చికూడా అతన్ని పరామర్శించకుండా వెళ్లిపోగా, ఒక సమరయుడు అటుగా వెళ్తూ అతన్ని చూసి, పరామర్శించి, అతని గాయాలు కట్టి, ఆ మార్గంలోనే ఉన్న ఉన్న ఒక పూటకూళ్లవాని ఇంట్లో అతన్నిచేర్చి, అతనికయ్యే ఖర్చంతా భరించాడు. మనవాళ్లే కదా అనుకున్న యాజకుడు, లేవీయుడు స్వార్ధపరులై అతన్ని ముట్టుకోవడం కాదు కదా కనీసం చూడకుండా మొహం చాటేసి వెళ్ళిపోగా, ఏ అంటరాని వాళ్లకయితే దూరంగా ఉండాలనుకొని యెరికో దారినెన్నుకొని ఆపదల్లో పడ్డాడో, ఆ అంటరానివాడే ఆప్తుడై అన్ని సపర్యలూ చేసి క్షతగాత్రుని బతికించాడు. మతపరంగా ప్రముఖులు, జ్ఞానులైన ఆ యాజకుడు, లేవీయుడి కన్నా. అంటరానివాడైన ఆ సమరయుడే నిజమైన పొరుగువాడు, అసలైన విశ్వాసి అని యేసుప్రభువు తేల్చి, విశ్వాసానికి నిజమైన ప్రామాణికతనిస్తూ, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలన్న నియమం కన్నా అతున్నతమైనది మరొకటి లేదని బోధించాడు. అలా క్రైస్తవానికి ఈ బోధే మూలరాయి అయ్యింది. అయితే యేసుక్రీస్తు జీవితంలో నుండి పెల్లుబికిన ఇలాంటి విశిష్టమైన బోధలతో ఆవిర్భవించిన ‘క్రైస్తవం’,ఒక ‘మతం’ స్థాయికి దిగజారడంతో సమస్యలన్నీ మొదలయ్యాయి. నిజమైన ప్రేమ, సోదరభావం, సౌభ్రాతృత్వానికే కాదు, స్వార్ధం, పగ, ద్వేషం, వివక్షకు కూడా కుల, మత, ప్రాంతీయాది విభేదాల్లేవు, సరిహద్దులు అసలే లేవన్నదే ఇందులోని తాత్పర్యం!! ఈ సూక్ష్మం అర్ధమైతే, క్రైస్తవంలోనే కాదు ప్రపంచంలోనే అసలు సమస్యలు లేవు. ’అయ్యో! మన మనవాడే కదా!’’ అన్న జాత్యాభిమానంతోనైనా ఆపదలో ఉన్న వాడిని ఆదుకోని ’పచ్చి స్వార్థపరులు’ ఆ యాజకుడు, లేవీయుడైతే,‘నన్ను అంటరాని వాణ్ని చేసిన దుర్మార్గుడితను’ అని ఈసడించుకోకుండా, అతన్ని కాపాడిన ‘మహోన్నతమైన ప్రేమ, మానవత్వం’ ఆ సమరయుడిది. మనం తరచుగా వాడే ‘మనవాడు’, ‘పగవాడు’ అన్న పదాలు ఎంత అర్ధరహితమైనవో తెలిపే బోధ ఇది. మనల్ని ఆపదలో ఆదుకున్నవాడే మనవాడు, పొరుగువాడనీ, మొహం చాటేసే ‘మనవాళ్ళు’ పగవారికన్నా తక్కువైనవారేమీ కాదని తెలుపుతూ, మానవత్వాన్నే పునర్నిర్వచించిన పునాదిరాయి ఈ బోధ! పెద్దలు సౌకర్యార్థమై కొన్ని శాఖల్ని మనలో ఏర్పాటుచేసినా, ఒక డినామినేషన్ కాకి మరో డినామినేషన్ మీద వాలనంత వైషమ్యం, ప్రేమకు, ఐక్యతకు మారుపేరైన క్రైస్తవంలో మనకెందుకుందో లోకానికి, దేవునికి కూడా ఒకరోజున మనం సంజాయిషీ చెప్పాలి. ప్రాణం మీది తీపితో ఒక సర్జరీ చేయించుకునేటపుడు ‘డాక్టర్’ మనవాడా?’ అని ఆలోచించని వారికి, పిల్లలకు చదువు చెప్పేవాళ్ళు ‘మనవాళ్ళా’? అని అడగని వారికి, కొన్ని సందర్భాల్లోనే ‘మనవాళ్ళా?’ అనడిగే సంకుచితత్వమా? పుట్టుకతోనే ఎవరూ విశ్వాసులు కాదు. అలాగని ఎన్నేళ్లైనా క్రీస్తు సారూప్యం ఏర్పడకుంటే, అసలు క్రైస్తవులమే కాదు!! – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ సంపాదకుడు – ఆకాశధాన్యం -
దాతృత్వం.. ప్రార్థన.. ఉపవాసం..
రహస్యంగా సాగాలి!పాత నిబంధన కాలంలో దేవుడు తన న్యాయసంవిధాన సూత్రావళిగా మోషేకిచ్చిన పదాజ్ఞలతో కూడిన ధర్మశాస్త్రానికి పొడిగింపుగా, కొత్తనిబంధన కాలపు విశ్వాసులకు కరదీపికగా, యేసుప్రభువే స్వయంగా ఆ ధర్మశాస్త్రానికిచ్చిన వినూత్నమైన భాష్యం ఆనాడు యేసుప్రభువు కొండమీది చేసిన ప్రసంగం!! ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా అమలుపర్చడమే దేవుని ప్రసన్నుని చేసుకోగలిగిన ఏకైక మార్గమైతే, అది మానవమాత్రులకెంత అసాధ్యమో ధర్మశాస్త్రమే రుజువు చేస్తుంది. అత్యున్నతమైన ధర్మశాస్త్రపు పవిత్రతా స్థాయిని ప్రామాణికం చేసుకుంటే, ఈ లోకంలో అందరూ పాపులే అని నిర్వచిస్తుంది బైబిల్ (రోమా 3:23). అందువల్ల కొత్తనిబంధన కాలపు విశ్వాస జీవితానికి యేసు ప్రభువు వారి కొండమీది ప్రసంగం పునాది లాంటిది. దేవుని మహిమ కోసం విశ్వాసి బాహాటంగా చెయ్యవలసిన అనేక విషయాలతోపాటు, దేవుని మహిమ కోసం, తన మేలుకోసం విశ్వాసి పరమ రహస్యంగా చేయవలసిన మూడు ప్రధానమైన అంశాలను కూడా యేసుప్రభువు తన కొండమీది ప్రసంగంలోనే ప్రకటించాడు. విశ్వాసి మొదటిగా తన ‘దాన ధర్మాలను’, రెండవదిగా’ ప్రార్థనను’, మూడవదిగా తన ‘ఉపవాస దీక్ష’ను చాలా గుప్తంగా, రహస్యంగా చెయ్యాలని యేసుప్రభువు ఆదేశించాడు. ఇవి సలహాలు కాదు, ప్రభువిచ్చిన చాలా స్పష్టమైన ఆదేశాలు. అది తెలియకే, గోప్యత లోపించిన మన ప్రార్ధనలు, దానధర్మాలు, ఉపవాస దీక్షలు ఈనాడు బహిరంగ ప్రచార వేదికలయ్యాయి, వాటివల్ల బోలెడు పేరుప్రఖ్యాతులైతే వస్తాయేమో కాని వాటి అసలు ఫలాలు, ఆశీర్వాదాలు మాత్రం మనకు, మన కుటుంబాలకూ రావడం లేదు. విశ్వాసి ఇతరులకు ఒక చేతితో చేసే సహాయం మరో చేతికి తెలియకూడదని, అదంతా రహస్యంగా జరగాలని ప్రభువు ఆదేశించాడు. మనం మన పొరుగువారికి, పేదలకు చేసే సహాయం లేదా ధర్మం ఎంత రహస్యంగా ఉంటే దానివల్ల దేవుని ఆశీర్వాదాలు మనకు అంత ధారాళంగా ప్రతిఫలంగా లభిస్తాయి. చర్చికి కానుకగా బెంచీలిచ్చి, వాటి వెనక తమ పేర్లు రాయించుకుంటే, ఆ పేర్లు ఈ లోకంలోనే ఉండిపోతాయి కానీ పరలోకంలో దేవుని జీవగ్రంథంలో మాత్రం రాయబడవన్నది తెలుసుకోవాలి. పేదలకు చేసే ధర్మం గురించి యేసు ఇలా చెప్పాడు కానీ దేవునికిచ్చే కానుకల గురించి కాదంటూ కొందరు పాస్టర్లు తమ స్వార్థం కోసం దీనికి వక్రభాష్యం చెబుతారు. ఒక పేద విధవరాలు గుప్తంగా ఇచ్చిన చిరుకానుకను ప్రభువెందుకు శ్లాఘించాడో అర్థమైతే, ఈ వాస్తవమేమిటో బోధపడుతుంది. ఇక ప్రార్థనయితే, గది తలుపు లేసుకొని మరీ రహస్యంగా చేయాలన్నది ప్రభువాదేశం. కానీ ఆనాటి పరిసయ్యుల్లాగే, జీవితం లో ఎన్నడూ రహస్య ప్రార్థన చెయ్యని వారు కూడా మైకుల్లో సుదీర్ఘంగా ప్రార్థన చేసేందుకు ఉబలాట పడుతుంటారు. దేవుని సంబోధిస్తూ, దేవునికే చేసే మన ప్రార్థన అసలు ఇతరులెందుకు వినాలి? చర్చిల్లో ప్రార్థనలకు, కుటుంబ ప్రార్థనలకు అతీతమైనది, ఆశీర్వాదకరమైనది విశ్వాసి తన ప్రభువుతో ఏకాంతంగా చేసే రహస్య ప్రార్ధన. ఇదే బలమైన ప్రార్థనాజీవితమంటే!! పోతే అందరికీ తెలిసేలా ఉపవాస దీక్షలు చెయ్యడానికి కూడా తాను వ్యతిరేకమని, అదంతా వృథా ప్రయాస అని కూడా ప్రభువు స్పష్టం చేశాడు. ఈ మూడూ ఎంత రహస్యంగా చేస్తే అవి మనకంత ఆశీర్వాదకరమవుతాయి. అవెంత బహిరంగంగా చేస్తే, మనమంతటి వేషధారులమవుతాము. దేవుని ఆశీర్వాదాలు కావాలంటే, దేవుడు చెప్పినట్టు చేయాలి కదా... అలా కాకుండా మాకు తోచినట్టే చేస్తాం అంటే, ఎండమావుల్లో నీళ్లు వెదకడమే కాదా?? – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
పవన్ సుడో సెక్యులరిస్టు..
సాక్షి, విశాఖపట్నం: జనసేన అధినేత పవన్కల్యాణ్పై ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ లీడర్ల ఫోరం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రెండు మతాల మధ్య చిచ్చు పెట్టేవిధంగా పవన్కల్యాణ్ వ్యాఖ్యలు ఉన్నాయని క్రిస్టియన్ నేతలు పేర్కొన్నారు. పవన్కల్యాణ్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీసేలా పవన్కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఫోరం తప్పుబట్టింది. పవన్ సుడో సెక్యులరిస్టుగా మాట్లాడుతున్నారన్నారు. ప్రభుత్వంపై బురదచల్లేందుకే పవన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని పలు విమర్శలు వస్తున్నాయి. ఇటీవల తిరుపతిలో పర్యటించిన పవన్ కళ్యాణ్ మతాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడారు. తిరుపతిలో అన్యమత ప్రచారం పెరిగిపోయిందంటూ ఒక మతాన్ని కించపరిచేలా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. విజయవాడ పున్నమి ఘాట్లో మత మార్పిడిలు జరుగుతున్నాయంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీవారే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ధారూరు క్రిస్టియన్ జాతరకు ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: వికారాబాద్ సమీపంలోని ధారూరులో క్రిస్టియన్ జాతర నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. సికింద్రాబాద్ నుంచి బీదర్కు ఈనెల 15, 17 తేదీల్లో నాలుగు సర్వీసులు నడుపుతోంది. బీదర్ నుంచి ధారూరుకు కూడా నాలుగు సర్వీసులు తిప్పుతోంది. ఈ సందర్భంగా యశ్వంత్పూర్–బీదర్, నాందేడ్–బెంగళూరు, బెం గళూరు సిటీ–నాందేడ్ ఎక్స్ప్రెస్ రైళ్లకు ధారూరు స్టేషన్లో తాత్కాలిక స్టాప్ను కల్పించారు. -
కొండపైన దర్శనం...లోయల్లో సేవా సాఫల్యం...
యేసుప్రభువు గలిలయ సముద్ర తీరంలోని ఒక కొండ పైన చేసిన ప్రసంగంలో మానవాళికి ‘పరలోక ధన్యత’ను ప్రకటించాడు. పేదరికం, శ్రమలు, లేమి, ఆకలిదప్పుల వంటి ఎలాంటి సామాజిక అపశ్రుతులకు, ప్రతికూలతలకూ తావులేని ‘దేవుని రాజ్యాన్ని ‘తన కొండ మీది ప్రసంగం’ ద్వారా ఆవిష్కరించాడు. అక్కడినుండి ఆరంభమై, మరో కొండయైన గొల్గొతాపై జరుగనున్న తన సిలువ యాగం దాకా సాగనున్న‘మానవాళి రక్షణ మార్గ ప్రయాణం’లో మజిలీగా శిష్యుల్లో పేతురు, యాకోబు, యోహాను అనే ముగ్గురిని వెంటతీసుకొని రూపాంతర కొండగా పిలిచే మరో కొండకు యేసుప్రభువు వెళ్ళాడు. అక్కడ యేసుప్రభువు ఆ ముగ్గురికీ తన పరలోక మహిమ రూపాన్ని చూపించాడు. పాత నిబంధన నాటి మోషే, ఏలీయా కూడా కొండ మీదికి దిగి రాగా అక్కడ యేసుప్రభువుతో వారి ‘శిఖరాగ్ర సమావేశం’ జరిగింది. అయితే యేసుప్రభువు, మోషే, ఏలీయాలు పాల్గొన్న అత్యంత ప్రాముఖ్యమైన ఆ ఆధ్యాత్మిక శిఖరాగ్ర సమావేశానికి దేవుడు పేతురు, యాకోబు, యోహానులనే అల్ప మానవులను కూడా పిలవడమే ఆశ్చర్యం కలిగించే అంశం. యేసు దేవస్వరూపుడు, మోషే ధర్మశాస్త్ర యుగానికి ప్రతినిధి, ఏలియా ప్రవక్తలకు ప్రతినిధి కాగా, మరి పేతురు, యాకోబు, యోహాను ఎవరికి ప్రతినిధులు? యేసుప్రభువు తన సిలువ యాగం ద్వారా ఆవిష్కరించబోతున్న సరికొత్త దేవుని రాజ్యంలో సభ్యులుగా చేరబోతున్న విశ్వాసులందరికీ ఆనాడు వాళ్ళు ప్రతినిధులు. ఆ శిఖరాగ్ర సమావేశంలో ‘ఇక్కడే ఉండిపోవడానికి పర్ణశాలలు కడతానంటూ’ పేతురు చేసిన వ్యాఖ్యను, ‘ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి’ అంటూ ఈ సమావేశాన్ని నిర్వహించిన పరిశుద్ధాత్ముడు వారినుద్దేశించి ఇచ్చిన ఆజ్ఞను సువార్త భాగాలు ప్రస్తావించాయి. లోక మలినానికి దూరంగా ఉన్నహిమాలయాలతో సహా మహా పర్వతాల్ని ఆధ్యాత్మిక స్థావరాలుగా అన్ని మతాల్లాగే యూదు మతం కూడా పరిగణించేది. గొప్ప ఆధ్యాత్మిక దర్శనాలను దేవుడు తన ప్రజలకు కొండ పైన ఇస్తాడు. కానీ ఆ దర్శనాల నెరవేర్పు కోసం‘సేవా క్షేత్రాలను’ మాత్రం కొండ కింది లోయల్లోని సామాన్య ప్రజల సమక్షంలో చూపిస్తాడు. ’కొండ మీదే ఉండిపోదాం’ అని ఎవరికి, మాత్రం ఉండదు? పేతురుకు కూడా అలాగే అనిపించింది, కానీ ‘దర్శన సాఫల్యం’ మాత్రం లోయల్లోని పాపులు, కరడు గట్టిన నేరగాళ్లు, దుర్మార్గులకు దేవుని ప్రేమను ప్రకటించడంలో ఉందని, అందుకు యేసు మాట వినండని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. దేవుని పక్షంగా మాట్లాడటం అంటే ప్రసంగించడం అందరికీ ఇష్టమే, కానీ దేవుని మాటలు వినడమే చాలా కష్టం. కానీ యేసు తన తండ్రి మాటలు విని, లోబడి లోయల్లోకి దిగి వెళ్లి వారిని ప్రేమించి ప్రాణత్యాగం చేశాడు. పేతురు, యాకోబు, యోహాను కూడా భూదిగంతాలకు వెళ్లి దేవుని ప్రేమను ప్రకటించి హత సాక్షులై తమ దర్శనసాఫల్యం పొందారు. అలా లోయల్లోని గొంగళిపురుగులను తమ అద్భుతమైన పరిచర్యతో విశ్వాస పరివర్తన చెందిన సీతాకోక చిలుకలుగా మార్చడానికి ఆనాటి రూపాంతర పర్వత శిఖరాగ్ర సమావేశం దిశానిర్దేశం చేసింది. కేవలం యూదులకే అంతవరకూ పరిమితమైన విశ్వాస జీవితం, నాటి రూపాంతరానుభవపు సార్వత్రిక దర్శనంతో, సర్వలోకానికి వర్తించే అపూర్వ ప్రేమమార్గమైంది. స్వనీతి, తామే జ్ఞానులం, తామే అధికులమన్న అహంకారానికి ప్రతీకగా మారిన యూదులు అనే గొంగళిపురుగు నుండే, సాత్వికత్వం, ప్రేమ, క్షమా అనే ఆత్మీయ సౌందర్యానికి ప్రతీకగా ‘క్రైస్తవం’ ఆవిర్భవించింది. – రెవ.డా.టి.ఏ.ప్రభుకిరణ్ సంపాదకులు, ఆకాశధాన్యం ఇ–మెయిల్: prabhukirant.@gmail.com -
దేవుని అండతోనే మహా విజయాలు!!
కండబలంతోనే బతికేటట్లయితే, దేవుడు సృష్టించిన ఈ విశాల విశ్వంలో ఈగలు, దోమల్లాంటి అల్పజీవులకు అసలు తావుండేది కాదు. ఏలా లోయలో ఫిలిష్తీయులతో భీకరయుద్ధం జరుగుతుంటే, ఇశ్రాయేలీయుల సైనికులైన తన ముగ్గురు అన్నల క్షేమ సమాచారం తెలుసుకోవడానికి దావీదు యుద్ధభూమికి వెళ్ళా డు. అక్కడ ఫిలిస్తీయుడైన గొల్యాతు అనే మహాబలుడు తన కండలు ప్రదర్శిస్తూ, ధైర్యముంటే వచ్చి తనతో తలపడమంటూ సవాలు చెయ్యడం, ఇశ్రాయేలీయులంతా అతనికి జడిసి గుడారాల్లో దాక్కోవడం దావీదు చూశాడు. గొల్యాతు రూపంలో ‘భయం’ రాజ్యమేలుతున్న యుద్ధభూమిలో, విశ్వాసులుగా నిర్భయంగా జీవించాల్సిన, రోషంతో యుద్ధం గెలవాల్సిన ఇశ్రాయేలీయులు తమ విజయం పైన, ప్రాణాలపైన ఆశలొదిలేశారు, దేవుణ్ణి కూడా వదిలేశారు, వాళ్ళ రాజైన సౌలయితే, అంతా వదిలేసి గడగడలాడుతూ కూర్చున్నాడు. ఆ స్థితిలో దావీదు గొల్యాతుతో తాను యుద్ధం చేస్తానన్నాడు. బక్కగా, పీలగా, ఇంకా లేత ప్రాయంలో ఉన్న దావీదు ఏ విధంగానూ గొల్యాతుకు సమఉజ్జీ కాదనుకున్నారంతా. అయితే తనతో దేవుడున్నాడన్న కొండంత విశ్వాసంతో, దావీదు అందరి అంచనాలను ముఖ్యంగా శత్రువుల అంచనాలను తలకిందులు చేస్తూ, వడిశెల రాయితో గొల్యాతును మట్టికరిపించి అతని కత్తితోనే అతని శిరచ్ఛేదనం చేశాడు, దేవుని ప్రజలకు గొప్పవిజయాన్ని అనూహ్యంగా సాధించి పెట్టాడు. దేవుడెంత శక్తిమంతుడో, గొప్పవాడో ఇశ్రాయేలీయులందరికీ తమ పూర్వీకులు చెప్పిన విషయాల ద్వారా తెలిసినా, దేవుని బాహుబలం తమను కూడా నాటి యుద్ధంలో గెలిపిస్తుందన్న ‘ఆచరణాత్మక విశ్వాసం’లోకి వారు ఎదగలేకపోయారు. అయితే దేవుడు తనతో ఉండగా శత్రువుల బలం, మారణాయుధాలు, వీటన్నింటికీ అతీతమైన విజయం తన సొంతమని నమ్మిన ‘ఆచరణాత్మకవిశ్వాసం’తో దావీదు యుద్ధాన్ని గెలిపించాడు. నేలలో పడ్డ ఒక ‘ఆవగింజ’ అతి చిన్నదే అయినా, కొన్ని రోజుల్లోనే మట్టిపెళ్ళల్ని, రాతి కుప్పల్ని పెకిలించుకొని పైకొచ్చి వృక్షంగా ఎదుగుతుంది. ప్రతి విశ్వాసిలో కూడా దేవుడు నిక్షిప్తం చేసిన కార్యసాధక మహాశక్తి ఇది. ఆవగింజలోని ఈ శక్తి దేవుడిచ్చే తేమ, సూర్యరశ్మితో వృక్షరూపం దాల్చినట్టే, దేవుని సహవాసం, ప్రేమ, సాయం తోడైన మన విశ్వాసంతో మహాద్భుతాలు జరుగుతాయన్నది బైబిల్ చెప్పే గొప్ప సత్యం. మారణాయుధాలతో, కండబలంతో కాక, దేవుని పట్ల గల అచంచల విశ్వాసమనే మహాయుధంతోనే వాటిపై విజయం సాధించగలమన్నది ఈ దావీదు ఉదంతం తెలిపే వెల లేని ఆత్మీయ పాఠం. – రెవ.డా.టి.ఏ.ప్రభుకిరణ్ -
ప్రేయర్ కోసం వస్తే.. చితక్కొట్టాడు..!
సాక్షి, హైదరాబాద్ : రోగాలు నయం చేస్తానని.. దయ్యాలు వదిలిస్తానని మాయమాటలు చెప్పి అమాయక ప్రజల్ని మోసం చేస్తున్నఓ క్రిస్టియన్ మత బోధకుడు కటకటాల పాలయ్యాడు. దైవ ప్రార్థనల కోసం వచ్చిన వారిపై మత్తుమందు ప్రయోగించి శారీరకంగా హింసించిన శాంసన్ అనే క్రిస్టియన్ మత బోధకున్ని మారేడ్పల్లి పోలీసులు అరెస్టు చేసి సికింద్రాబాద్ కోర్టులో హాజరుపర్చారు. కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. వివరాలు.. విజయ్కుమార్ అనే ప్రభుత్వోద్యోగి గత ఆరునెలలుగా శాంసన్ దగ్గర ప్రేయర్ చేయించుకుంటున్నాడు. అక్కడికి వెళ్లగానే విజయ్కుమార్ నోట్లో శాంసన్ మత్తు కలిగిన స్ర్పే కొట్టేవాడు. విజయ్కుమార్ స్పృహ తప్పిన అనంతరం మొహం, చెంపలు, వీపుపై కొట్టేవాడు. ఇలా గత కొంతకాలంగా జరుగుతోంది. ఉన్న సమస్యలు తొలగకపోగా.. కొత్తగా శారీరక సమస్యలు కూడా మొదలవవ్వడంతో విజయ్కుమార్కు అనుమానం వచ్చింది. ఈ విషయంపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే, కోర్టు ఆవరణలో శాంసన్ వెకిలిగా ప్రవర్తించాడు. అక్కడకు వచ్చిన మహిళలు, యువతుల ఫొటోలు తీశాడు. దీనిపై న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో అతనిపై మరో కేసు కూడా నమోదైంది. రోగాలు నయం చేస్తానని చెప్పి శాంసన్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని.. లైంగికంగా లోబర్చుకున్నాడని పలువురు మహిళలు, యువతులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సమస్యల పరిష్కారంకోసం వస్తే.. ఇల్లుకు వాస్తు సరిగా లేదని, దానిని అమ్మేసి డబ్బులు ఇవ్వాలని శాంసన్ ఒత్తిడి తేచ్చాడని బాధితులు ఆరోపించారు. నిందితుడికి కఠిన శిక్ష పడుతుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. మోసగాళ్లబారిన పడకుండా అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. -
సర్వమానవ సార్వత్రిక దార్శనికుడు ఫిలిప్పు...
ఆదిమ చర్చిలో సామాజిక పరిచర్య కోసం ఎంపిక చేయబడి అభిషేకం పొందిన ఏడుగురిలో ఫిలిప్పు ఒక పరిచారకుడు. అయితే యెరూషలేములోని ఆదిమ చర్చి ఎంతో వేగంగా, బలంగా విస్తరించడం చూసిన యూదు మత ఛాందసులు అసూయచెంది నూతనంగా చర్చిలో చేరుతున్న క్రైస్తవ విశ్వాసులను హింసించడం ఆరంభించడంతో యెరూషలేములోని విశ్వాసులంతా యూదా దేశం వదిలి పలు ప్రాంతాలకు చెదిరిపోయారు. అక్కడి ప్రతి విశ్వాసి ఒక సువార్తికుడై దేవుని ప్రేమను ప్రకటించడంతో చెదిరిపోయిన వారి ద్వారా సువార్త కొత్త ప్రాంతాలకు వ్యాపించి చర్చిలు, విశ్వాసుల సంఖ్య మరింత విస్తరించింది. అంటే చర్చిని, విశ్వాసులను కట్టడి చేయడానికుద్దేశించిన యూదుల చిత్రహింసల వ్యూహం ఎంతగా విఫలమైందంటే, అది చర్చిని అణిచివెయ్యలేకపోయింది సరికదా, చర్చి మరింత ఉధృతంగా విస్తరించడానికే ఇలా దోహదపడింది.ఆ కాలంలో ఫిలిప్పు మాత్రం యెరూషలేము నుండి సమరయ ప్రాంతానికి వెళ్లి అక్కడి అసంఖ్యాకులైన సమరయులకు సువార్త ప్రకటిస్తే వాళ్లంతా ఇనుమడించిన ఉత్సాహంతో క్రైస్తవ విశ్వాసులయ్యారు. ఇది నిజంగా విప్లవాత్మకమైన పరిణామం. ఎందుకంటే సమరయులు యూదులకు అస్పృశ్యులు, ఆ కారణంగా వాళ్లంటే చిన్న చూపు. యూదా సామ్రాజ్యాన్ని అషూరులు పాలిస్తున్నప్పుడు, కొందరు యూదులు అషూరు స్త్రీలను వివాహమాడిన కారణంగా పుట్టినవారే సమరయులు. అలా వాళ్ళు మిశ్రమ జాతికి చెందినవారన్న నెపంతో వారికి యెరూషలేము దేవాలయ ప్రవేశాన్ని కూడా చాందస యూదులు నిషిద్ధించారు. అయినా సమరయులు మాత్రం యూదు మతవిధులే పాటిస్తూ, ఆ దేవుణ్ణే ఆరాధిస్తూ మెస్సీయా ఆగమనాన్ని కాంక్షించేవారు. అలా వారిని దూరం పెట్టిన యూదులే ఇపుడు క్రైస్తవ విశ్వాసులై ఫిలిప్పు నాయకత్వంలో తమవద్దకొచ్చి యేసు సువార్త చెబుతుంటే అత్యుత్సాహంతో వాళ్లంతా కొత్త విశ్వాసంలో చేరారు. యూదులకు, సమరయులకు మధ్య 800 ఏళ్లుగా నెలకొన్న వైషమ్యాన్ని, అగాథాన్ని ఇలా క్రైస్తవం దూరం చేసి సమరయులను విశ్వాసులను చేసి వారికి ఆత్మగౌరవాన్నిచ్చింది, వారిలో అత్యానందాన్ని నింపింది.ఫిలిప్పుతో దేవుడొకసారి దర్శన రీతిన మాట్లాడి దక్షిణానికి వెళ్లి యెరూషలేము నుండి గాజాకు వెళ్లే దారిలో ఒక వ్యక్తిని కలుసుకొమ్మని ఆదేశించాడు. ఇథియోపియా రాణి గారి ఖజానాదారుడు, ఇథియోపియా దేశపు ఉన్నతాధికారియైన ఒక నపుంసకుడు అక్కడ ఫిలిప్పుకు తారసపడ్డాడు. అతను యెరూషలేముకొచ్చి దేవుని ఆరాధించి రథంలో తిరిగి వెళుతూ యెషయా గ్రంథాన్ని చదవడం ఫిలిప్పు కనుగొన్నాడు. యేసుప్రభువు సిలువ ఉదంతాన్నంతా యెషయా తన గ్రంథంలో పరోక్షంగా చెప్పిన 53వ అధ్యాయాన్ని అతడు చదువుతుండగా ఫిలిప్పు ఆ భాగాన్ని ఆధారం చేసుకొని యేసుప్రభువు సువార్తను అతనికి ప్రకటిస్తే, అతను అక్కడికక్కడే మారు మనసు పొంది విశ్వాసియై ఇథియోపియా వెళ్ళాడు. అంటే యెరూషలేములో శత్రువులు విశ్వాసులు హింసిస్తే సువార్త సమరయకు, అక్కడినుండి ఈ విశ్వాసి ద్వారా ఇథియోపియా దేశానికి అంటే మొదటిసారిగా ఆఫ్రికా ఉపఖండానికి కూడా వ్యాపించిందన్న మాట. అస్పృశ్యులైన జాతివిహీనులు, నపుంసకులు అనే తారతమ్యం లేకుండా సర్వమానవ సార్వత్రిక దర్శనంతో ఫిలిప్పు దేవుని రాజ్యాన్ని నిర్మించాడు. విశ్వాసి ఆత్మపూర్ణుడైతే ఎంత బలంగా అతన్ని దేవుడు వాడుకొంటాడన్నదానికి ఫిలిప్పు నిదర్శనం. విశ్వాసులు ఫిలిప్పు లాగా ఆత్మపూర్ణులైతే సువార్త వ్యాప్తికి సరిహద్దులు లేవు, దాన్ని అడ్డుకోగల అవరోధాలు కూడా లేవు.యెరూషలేములో అతనెప్పుడూ ప్రసంగాలు చెయ్యలేదు. ఎందుకంటే అతని పరిచర్యలో ఇతరులకు సహాయం చెయ్యడమే తప్ప ప్రసంగాలుండవు. కానీ సమరయలో అతను సువార్త ప్రకటించే మహా వక్త అయ్యాడు, వేలాది మందికి దేవుని ప్రేమను ప్రకటించి వారికి ఆత్మీయ తండ్రి అయ్యాడు. సమరయ, ఇథియోపియా దేశాలకు తొలిసారిగా సువార్త చేరవేసిన ఆద్యుడయ్యాడు. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
విశ్వాసికి ప్రభువే భద్రతావలయం
క్రైస్తవుడుగా మారిన పౌలు మీద యూదులు, ముఖ్యంగా వారిలోని సద్దూకయులు అనే తెగవారు పగబట్టి ఎలాగైనా సరే అతన్ని చంపేవరకు పచ్చినీళ్ళు కూడా ముట్టకూడదని శపథం చేశారు. కోటలోనే కావలిలో ఉన్న పౌలును విచారణకోసమని బయటికి రప్పించి ఆయన్ని చంపేయాలన్నది వారి కుట్ర. అయితే పౌలు మేనల్లుడు అది విని వెళ్లి భద్రతాధిపతులకు చెబితే ఆ రాత్రే ఇద్దరు శతాధిపతులు, 200 మంది సైనికులు, 200 మంది ఈటెలు విసిరేవారితోపాటు 70 మంది గుర్రపు రౌతులతో భద్రతనిచ్చి పౌలును అత్యంత సురక్షితంగా వారు కైసరయకు పంపారు (అపో.కా.23:12–25). మన ఆయుష్కాలపు లెఖ్ఖ దేవుని జీవగ్రంథంలో రాయబడి ఉందని బైబిల్ చెబుతోంది (కీర్తన 139:16). అంటే మన ఆయుష్కాలాన్ని తగ్గించే శక్తి కానీ, పెంచే శక్తి గాని మనుషుల చేతుల్లో లేదన్నది దాని తాత్పర్యం. ఇపుడు అందరికీ అందుబాటులో ఉన్న ఈ బైబిల్ గ్రంథమే ఆ కాలంలోనూ ‘తోరా’ పేరుతో అప్పటి యూదులకు కూడా అందుబాటులో ఉన్నా, ప్రతి విశ్రాంతి దినం నాడు వాళ్లంతా దాన్ని చదువుతున్నా, ఈ వాక్యం అందులో రాయబడి ఉన్నదని తెలిసినా, సద్దూకయులు దేవుని ఈ వాక్యానికి విరుద్ధంగా పౌలును చంపి ఆయన ఆయుష్కాలాన్ని తగ్గించేద్దామనుకున్నారు. వాళ్ళు పౌలు హత్యకు కుట్రనైతే చేశారు కానీ మూడు విషయాలను మర్చిపోయారు. మానవుని ఆయుష్కాలాన్ని తన వశంలో పెట్టుకున్న దేవుని సాన్నిధ్యం అనునిత్యం పౌలుకు తోడుగా ఉన్నదని వాళ్ళు మర్చిపోయారు. ఆ కారణంగానే తమ కుట్ర సంగతి విని అధికారులకు చేరవేసే ఒక వ్యక్తిని పౌలు మేనల్లుడి రూపంలో దేవుడే అక్కడ ఏర్పాటు చేశాడని కూడా వాళ్లకు తెలియదు. అన్నింటికన్నా ముఖ్యంగా, పౌలు ప్రాణాపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నపుడు దేవుడే ఆయనతో అంతకుముందు రాత్రి మాట్లాడి ‘ధైర్యంగా ఉండు, యెరూషలేము లోలాగే నీవు రోమా పట్టణంలో కూడా నన్ను గూర్చి సాక్ష్యమియ్యవలసి ఉన్నది’ అని వెల్లడించాడు (23:11). అంటే కనీసం రెండున్నర ఏళ్ళ తర్వాత రోమాకు వెళ్లే వరకు నీకు ఆయుష్కాలమున్నదని దేవుడు ఆయన్ను హత్యచేయాలని కుట్ర పన్నుతున్న యూదుల మధ్య ఉన్నపుడే పౌలుకు తెలియజేశాడన్నమాట!!! దేవుని ఈ ‘భద్రతా వలయం’ విశ్వాసి చుట్టూ ఉన్నంతవరకు విశ్వాసిని ఈ లోకం కానీ, అతని శత్రువులు కానీ, మరే ఇతర ప్రమాదాలు కానీ ఏమీ చేయలేవని దాని అర్థం. మరణం కనుచూపు మేరలోనే ఉన్నట్టు కనిపిస్తున్నా అది విశ్వాసిని తాకడానికి దేవుని సెలవు కావాలి. దేవుడు తన కృపకొద్దీ అతడికి ఈ పరిరక్షణా వ్యవస్థను ఏర్పర్చి, దాన్ని తన పర్యవేక్షణలోనే పెట్టుకున్నాడు. రోగాలు, బాధలు, ప్రమాదాలు, కుట్రలు, కుతంత్రాలు ఉప్పెనలా మీద పడుతున్నా మన ప్రాణం మీద మాత్రం వాటికి అధికారం లేదు. ఆ విషయాన్నే దేవుడు తన భక్తుడైన యోబు విషయంలో అపవాదికి ఆజ్ఞ ఇచ్చాడు (యోబు 2:6). దేవుని కృపకు, ప్రేమకు ఇది పరాకాష్టే కదా!! అందుకే శత్రువుల భయంతో వాళ్ళ కుట్రల మధ్య దినమొక గండంగా బతికిన దావీదు తన కీర్తనలో ‘గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా నేను ఏ అపాయానికీ భయపడను. ఎందుకంటే నీ దుడ్డు కర్ర, నీ దండం ఆదరిస్తుంది‘ అంటాడు (23:4). చివరికి మరణం సంభవించినపుడు కూడా విశ్వాసికి దాంట్లో భయపడేదేమీ లేదు. మరణం విశ్వాసికి ఒక గదిలోనుండి మరో గదిలోకి వెళ్లడం లాంటిదే. కాకపోతే ఆనందమేమిటంటే వదిలేసే గదిలోనూ దేవుడు విశ్వాసి వెన్నంటే ఉంటాడు, మరణానంతరం అతడు ప్రవేశించే కొత్తగదిలోనూ అతనికి స్వాగతమివ్వడానికి దేవుడు ఎదురుచూస్తుంటాడు. ఆ ఆనందంతోనే పౌలు ‘మనం బతికినా, చనిపోయినా ప్రభువు వారమేనన్న’ ధీమా వ్యక్తం చేస్తాడు (రోమా 8:14). ప్రభువుకోసం బతకడంలోని ఆనందాన్ని అనుభవించని వాడికి ప్రభువుకోసం చనిపోయే ధైర్యముండదు. ఆ కారణం వల్లే జీవితంలో ఎంతో ధైర్యంగా బతికిన వారు వాళ్ళు కూడా మరణానికి భయపడుతుంటారు. ప్రభువు కోసం జీవించడంలో, మరణించడంలో కూడా విశ్వాసి నిర్భయుడు. అందువల్ల దేవుని గ్రంథంలో లెక్కించి రాయబడిన రోజులు పూర్తి కాకమునుపు విశ్వాసిని మరణం ఒడిలో వేయగల శక్తి ఏదీ ఈ లోకంలో లేనే లేదు. రెవ.డా.టì .ఎ.ప్రభుకిరణ్ email: prabhukirant@gmail.com పఠనీయం అవిద్యానాం అంతస్తిమిర మిహిర ద్వీపనగరీజడానాం చైతన్య స్తబక మకరంద శ్రుతిఝరీదరిద్రాణాం చింతామణి గుణనికా, జన్మజలధౌనిమగ్నానాం దంష్ట్ర్రామురరిపు వరాహస్య భవతీ! పఠించే విధానం: ఈ శ్లోకాన్ని 40 రోజులపాటు ప్రతిరోజూ ప్రాతఃకాలంలో స్నానం చేసి 11మార్లు పఠించి అమ్మవారికి ధూపదీప హారతులివ్వాలి. పారాయణ ఫలం: సంసారకష్టాలు తొలగి ప్రశాంతత లభిస్తుంది. ధనహీనులకు దారిద్య్ర బాధలు తొలగి ధనప్రాప్తి కలుగుతుంది. ధనుఃపౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాఃవసన్త స్సామన్తో మలయమరుదాయోధన రథఃతథాప్యేక స్సర్వం హిమగిరిసుతే కామపి కృపామ్అపాఙ్గాత్తే లబ్ధ్యా జగదిదమనఙ్గో విజయతే పారాయణ విధానం: స్నానం చేసి శుచిగా ఉండి ఈ శ్లోకాన్ని 108 రోజులపాటు రోజుకు 108 మార్లు పఠించాలి. చెరకు రసాన్నిౖ నెవేద్యంగా సమర్పించాలి. పారాయణ ఫలం: దంపతుల మధ్య అన్యోన్యత పెరిగి సత్సంతానం కలుగుతుంది. -
అయ్యప్పకు ముస్లిం–క్రైస్తవ స్నేహితులు
తిరువనంతపురం: కఠినమైన అయ్యప్ప దీక్షలో ఉన్న స్వాములు మసీదు చుట్టూ ప్రదక్షిణలు చేయడం, చర్చి కొలనులో స్నానాలు చేయడాన్ని ఎవరైనా విశ్వసిస్తారా? ఇది మత సామరస్యానికి సంబంధించిన కల్పిత కథ అనుకుంటే పొరబడినట్లే. శబరిమల అయ్యప్పస్వామి కొలువైన కేరళలో చాలా ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. మండాలం–మకరవిలక్కు యాత్రకు వచ్చే స్వాములు శబరిమలకు 60 కిలోమీటర్ల దూరంలో కొట్టాయం జిల్లాలో ఉన్న ఎరుమేలి నాయనార్ జుమా మసీదు(వావర్పల్లి మసీదు) చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. తిరుగు ప్రయాణంలో ఆ పక్కనే అలప్పుజలో ఉన్న ఆర్థంకల్ సెయింట్ అండ్రూస్ బాసిలికా చర్చి ఆవరణలోని చెరువులో స్నానాలాచరిస్తారు. నవంబర్–జనవరి నెలల మధ్య ఎన్నో ఏళ్లుగా ఇదొక ఆనవాయితీగా కొనసాగుతోంది. దీని వెనుక ఓ ఆసక్తికర కథ ఉంది. నమాజ్.. ప్రదక్షిణలు పండాలం రాజు దత్తపుత్రుడైన స్వామి అయ్యప్పకు హజ్రత్ వావర్ షా అనే ముస్లిం, ఆర్థంకల్ వెలుథచన్ అనే క్రైస్తవ బోధకులు మంచి స్నేహితులుగా ఉండేవారని ఇక్కడి వారు చెప్పుకుంటుంటారు. వారి మధ్య స్నేహానికి, మత సామరస్యానికి గుర్తుగా అయ్యప్ప దీక్షాపరులు వావర్ పేరుతో ఉన్న మసీదు చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు. కేరళతోపాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా స్వాములు వస్తుంటారని వావర్ మసీదు జాయింట్ సెక్రటరీ హకీం తెలిపారు. ‘స్వాములు మసీదు ప్రార్థన మందిరం లోపలికి మాత్రం ప్రవేశించరు. మసీదు చుట్టూ ప్రదక్షిణలు చేసి, టెంకాయ కొట్టి, కానుకలు సమర్పించి శబరిమల సందర్శనకు బయల్దేరుతారు. మసీదు లోపల నమాజ్ జరుగుతుండగా వెలుపల అయ్యప్ప భక్తులు శరణం అయ్యప్ప అంటూ ప్రదక్షిణలు చేయడం ఓ అరుదైన దృశ్యం. అయ్యç ప్ప, వావర్ల మధ్య స్నేహగాథ కేరళలో మత సామరస్యం, లౌకికత ఎంతగా ఉందో చెప్పేందుకు ఇది ఒక ఉదాహరణ’ అని హకీం అన్నారు. ఈ మసీదు వద్దే వావర్ స్వామి అనే ఆలయం కూడా ఉంది. యాత్ర ముగించుకున్న భక్తులు అర్థంకల్ బాసిలికా చర్చి వద్దకు చేరుకుంటారు. ‘చర్చి ఆవరణలోని చెరువులో లేక సమీపంలోనే ఉన్న సముద్రంలో స్నానాలు చేసి, స్వాములు దీక్షను విరమిస్తారు. చర్చిలోని సెయింట్ సెబాస్టియన్ విగ్రహం వద్ద పూజలు చేస్తారు’ అని ఫాదర్ క్రిస్టోఫర్ ఎం.అర్థస్సెరిల్ తెలిపారు. -
సుబ్బరామయ్య
‘మా అబ్బాయిని ఎక్కడ చేర్చమంటావ్?’ అని అడిగితే.. ‘మంచి క్రిస్టియన్ కాలేజ్ చూసి చేర్పించు’ అని చెప్పడు సోమశేఖరశాస్త్రి. ‘ఏదో ఒక క్రిస్టియన్ కాలేజ్లో చేర్పించు’ అంటాడు. ‘‘నిరుత్సాహపరచడం కాదు కానండీ.. మీ అబ్బాయికి సీటు వస్తుందని ఖాయంగా చెప్పలేను’’ అని అప్లికేషన్ పెట్టిన రోజే సోమశేఖర శాస్త్రికి చెప్పాడు ఆఫీస్ క్లర్క్! అది క్రిస్టియన్ కాలేజ్. ఆ కాలేజ్లో కొడుక్కి సీటు సంపాదించడం కోసం.. అవసరమైతే వాటికన్ సిటీ నుంచైనా రికమండేషన్ లెటర్ తెచ్చుకోడానికి సిద్ధంగా ఉన్నాడు సోమశేఖర్. క్రిస్టియన్ కాలేజ్ అంటే అంత గురి సోమశేఖర్కి. పద్ధతులు నేర్పిస్తారు. జీవితాన్ని ఒక గాడిలో పడేస్తారు. అందుకే ఎవరైనా.. ‘మా అబ్బాయిని ఎక్కడ చేర్చమంటావ్?’ అని అడిగితే.. ‘మంచి క్రిస్టియన్ కాలేజ్ చూసి చేర్పించు’ అని చెప్పడు సోమశేఖర్. ‘ఏదో ఒక క్రిస్టియన్ కాలేజ్లో చేర్పించు’ అంటాడు. అడ్మిషన్స్ క్లోజ్ చేస్తుండగా చివరి వడపోతలో అవంత్కి సీటొచ్చింది! ‘‘అదృష్టం. మీ వాడికి ముందున్న అప్లికెంట్ క్యాన్సిల్ చేసుకోవడంతో ప్రయారిటీ లిస్ట్లో మీ వాడికొచ్చింది’’ చెప్పాడు క్లర్క్. ‘‘సంతోషం’’ అన్నాడు సోమశేఖర్. అయితే అవంత్ సంతోషంగా లేడు. అతడి ఫ్రెండ్స్ వేరే కాలేజ్లో చేరారు. ‘అందరం ఒకే కాలేజ్లో చేరదాం’ అని ఇంటర్లో ఫైనల్ ఎగ్జామ్ రాసిన రోజే అనుకున్నారు ఫ్రెండ్సంతా. అదొక బాధ ఉండిపోయింది అవంత్లో. మామూలు బాధ కాదు. మనోవేదన. మొదటిరోజు కాలేజ్ అంతా తిప్పిచూపించారు కొత్త విద్యార్థులకు. విద్యార్థులు కొత్తే కానీ, కాలేజీ కొత్తదేం కాదు. ఓ డెబ్భై ఏళ్ల నుంచి ఉంది. కాలేజీ అనే కానీ, యూనివర్శిటీ క్యాంపస్లా ఉంటుంది. బయటి ప్రపంచానికి కనిపించదు. అడవి మధ్యలో ఉన్నట్లు ఉంటుంది. క్యాంపస్లోనే కాలేజ్ బిల్డింగ్లకు కొద్ది దూరంలో హాస్టల్స్. వాటిల్లో అరల్లాంటి గదులు. ఆ గదుల్లో ఒక గది అవంత్ది. గదికి ఒక్కరే ఉంటారు. కాలేజ్లో చేర్పించి, బస్సెక్కి వెళ్లేటప్పుడు కొడుక్కి చెప్పాడు సోమశేఖర్.. ‘‘ఇప్పుడు లోపలికి వెళ్తున్నావ్. డిగ్రీ సర్టిఫికెట్తోనే మళ్లీ నువ్వు బయటికి రావడం’’ అని. ఆయన ఉద్దేశం ‘అంత గొప్ప కాలేజ్ ఇది’ అని చెప్పడం. రెండో రోజు కూడా అవీ ఇవీ చూపించి, కొత్త విద్యార్థులందర్నీ.. వేరుగా ఉన్న ఒక క్లాస్రూమ్ దగ్గరకి తీసుకెళ్లారు. ఆ రూమ్కి తాళం వేసి ఉంది. మిగతా క్లాస్రూమ్లన్నీ రిన్నొవేషన్తో నిన్న మొన్న కట్టినట్లు కొత్తవిగా ఉంటే, అదొక్కటీ పాతదిగా ఉంది. గోడమీద ‘సుబ్బరామయ్య క్లాస్ రూమ్’ అని రాసి ఉన్న చిన్న బోర్డు ఉంది. ‘‘ముప్ఫై ఏళ్ల క్రితం ఈ క్లాస్రూమ్లోనే సుబ్బరామయ్య మాస్టారు పాఠాలు చెప్పేవారు. ఈ కాలేజీకి మాస్టారిగా రాక ముందు సుబ్బరామయ్య గారు ఈ కాలేజీలోనే విద్యార్థి. లెక్చరర్ అయ్యాక.. విద్యార్థులలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆయనకే చెప్పుకునేవారు. అందుకే సుబ్బరామయ్యగారు చనిపోయాక, ఆయన క్లాస్రూమ్ని ఆయనకే ఉంచేసింది కాలేజ్ యాజమాన్యం. ఇందులో తరగతులు జరగవు. ఏ విద్యార్థికైనా కష్టం వచ్చినప్పుడు మాత్రం క్లాస్రూమ్ తాళాలిచ్చి కాసేపు లోపల కూర్చొని రమ్మని పంపుతారు. అదొక సంప్రదాయంగా వస్తోంది. సుబ్బరామయ్యగారే ఇప్పటికీ లోపల ఉండి, కష్టం చెప్పుకోడానికి వచ్చిన విద్యార్థి కన్నీళ్లు తుడిచి పంపిస్తాడని ఒక నమ్మకం’’ అని చెప్పాడు గుంపును తీసుకొచ్చిన లెక్చరర్. ‘‘అంటే సార్.. సుబ్బరామయ్య మాస్టారి ఆత్మ లోపల తిరుగుతోందా?’’ అని అడిగాడో విద్యార్థి. ఆ గది వైపు పరిశీలనగా చూశాడు అవంత్. మూడో రోజు నుంచి రెగ్యులర్ క్లాసులు. ఈసురోమంటూ బుక్స్ పట్టుకుని కాంపౌండ్లో తన హాస్టల్ రూమ్ నుంచి కాలేజ్ బిల్డింగ్ వైపు ఒక్కడే నడుచుకుంటూ వెళ్తున్నాడు అవంత్. అతడి మనసంతా.. ఊరికి దగ్గర్లో తన ఫ్రెండ్స్ చేరిన కాలేజ్లోనే ఉంది. ‘‘బాబూ.. ఇలారా..’’ కాంపౌండ్లో చెట్టుకింద అరుగు మీద కూర్చొని ఉన్న ఓ ముసలాయన.. అవంత్ని పిలిచాడు. తలంతా నెరిసి, మనిషి వంగిపోయి ఉన్నాడు.అవంత్ ఆయన దగ్గరకు వెళ్లాడు. ‘‘కూర్చో’’ అన్నాడు ఆ మనిషి. కూర్చున్నాడు. ‘‘ఏంటలా ఉన్నావు?’’ అని అడిగాడు. ‘‘మీరెవరు?’’ అడిగాడు అవంత్. నవ్వాడాయన. ‘‘నేనెవర్నీ కాదు.ఎప్పుడైనా ఇక్కడికి వచ్చిపోతుంటాను’’ అన్నాడు. ‘‘మీరెందుకు ఇక్కడికి వచ్చి వెళుతుంటారు?’’ అడిగాడు అవంత్. ‘‘నలభై ఏళ్ల క్రితం నేనూ ఇక్కడే చదువుకున్నాను. ఇక్కడే పాఠాలు చెప్పాను. అందుకే అప్పుడప్పుడూ వచ్చి, కాసేపు కూర్చొని వెళుతుంటాను. మనసులో నీకేదైనా కష్టం ఉంటే అలా దిగాలుగా ఉండకు. ఎవరికైనా చెప్పుకో’’ అన్నాడు. మౌనంగా ఉన్నాడు అవంత్. ‘‘పోనీ.. నాకు చెప్పు’’ అన్నాడు. అవంత్ చెప్పలేదు. క్లాస్రూమ్కి వెళ్లిపోయాడు. క్లాస్లన్నీ అయ్యేసరికి సాయంత్రం అయింది. అవంత్కి మాత్రం ఒక ఏడాది అయినట్లుగా ఉంది. అంత భారంగా కూర్చున్నాడు. అక్కడి నుంచి అతడు నేరుగా హాస్టల్కి వెళ్లలేదు. లెక్చరర్స్ క్వార్టర్స్కి వెళ్లాడు. అక్కడి నుంచి ‘సుబ్బరామయ్య క్లాస్రూమ్’ తాళాలు అడిగి తెచ్చుకున్నాడు. తాళాలు తీసి ‘సుబ్బరామయ్య క్లాస్రూమ్’లోకి వెళ్లి కూర్చున్నాడు అవంత్. క్లాస్రూమ్లో ఉన్నట్లే మూడు వరుసల్లో బెంచీలు ఉన్నాయి. మధ్య వరుసలో ముందు బెంచీలో కూర్చున్నాడు. ఎదురుగా డయాస్ మీద లెక్చరర్ కూర్చునే కుర్చీ ఉంది. వెనుక పెద్ద బ్లాక్ బోర్డు. కాసేపలా కూర్చున్నాడు. తర్వాత బెంచీకి తల ఆన్చి కళ్లు మూసుకున్నాడు. ‘ఎందుకు నాన్నా.. నా ఫ్రెండ్స్ చదివే కాలేజ్లో నన్ను చేరనివ్వలేదు?’ అని బాధగా అనుకున్నాడు. డయాస్ మీద కుర్చీ కదిలిన చప్పుడైంది. కళ్లు తెరిచి, తల పైకెత్తి చూశాడు. ఎ.. దు..రు.. గా.. కుర్చీలో..!! దఢేల్మని తలుపు తెరుచుకుని బయటికి వచ్చాడు అవంత్. క్లాస్రూమ్కి తాళం వేశాడు. పరుగు పరుగున నడుస్తూ ఓ చోట ఆగాడు. పూర్తిగా చీకటి పడకుండానే కాంపౌండ్లో లైట్లు వెలిగాయి. ఇంటికి ఫోన్ చేశాడు అవంత్. అవంత్ తల్లి లిఫ్ట్ చేసింది. ‘‘అమ్మా.. నాన్నకెలా ఉంది?’’ అని అడిగాడు. ‘‘ఏంట్రా ఆ కంగారు? నాన్నకెలా ఉంటుంది? బాగానే ఉంది. సంతోషంగా ఉన్నారు. కాలేజీలో నీకు సీటొచ్చినట్లు లేదాయనకి. ఆయనకే వచ్చినట్లుంది. ఇదిగో మాట్లాడు’’ అంది ఆవిడ. ‘‘నాన్నా.. ఎలా ఉన్నావ్?’’.. అడిగాడు అవంత్, సోమశేఖర్ లైన్లోకి రాగానే. పెద్దగా నవ్వాడాయన. ‘‘నువ్వెలా ఉన్నావో చెప్పరా. కాలేజ్ ఎలా ఉంది?’’ అన్నాడు. ‘‘బాగుంది నాన్నా.. చాలా బాగుంది. మళ్లీ చేస్తా’’ అని ఫోన్ కట్ చేశాడు అవంత్. మర్నాడు హాస్టల్ నుంచి కాలేజ్కి నడుస్తుంటే మళ్లీ ఆ ముసలాయన అక్కడే కూర్చొని కనిపించాడు అవంత్కి. ‘‘ఒక్కరోజులో అలవాటు పడినట్లున్నావ్ కాలేజ్కి. ముఖంలో సంతోషం కనిపిస్తోంది. ఏదో జరిగింది కదా’’ అన్నాడు ఆయన. అవంత్ ఆయన వైపే పరిశీలనగా చూసి, ‘ఈయనగానీ సుబ్బరామయ్య మాస్టారు కాదు కదా’ అనుకున్నాడు. అనుకుని...‘‘లేదు, ఏం జరగలేదు’’ అని చెప్పి అక్కడి నుంచి వచ్చేశాడు.వెళుతున్న అవంత్నే సంతృప్తిగా చూస్తూ.. ‘ఎవరికి ఎవరి చేత చెప్పించాలో వారి చేతే చెప్పించాలి’ అనుకున్నాడు ముసలాయన. - మాధవ్ శింగరాజు -
క్రైస్తవుల ఓట్ల కోసం బీజేపీ సరికొత్త వ్యూహం
సాక్షి, న్యూఢిల్లీ : అరుణాచల్ ప్రదేశ్లో క్రైస్తవ మిషనరీలు మత మార్పిడులకు పాల్పడకుండా నిరోధించేందుకు 1978లో మత మార్పిడుల వ్యతిరేక చట్టాన్ని తీసుకొచ్చారు. దేశంలో అలాంటి చట్టాన్ని తీసుకొచ్చిన మూడవ రాష్ట్రం అరుణాచల్. అంతకుముందు 1967లో ఒరిస్సాలో, 1968లో మధ్యప్రదేశ్లో తీసుకొచ్చారు. స్థానిక మతాలను, వారి సంప్రదాయాలను పరిరక్షించాలనే లక్ష్యంతోనే అరుణాచల్లోనూ ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అన్ని రాష్ట్రాల్లోగానే దీన్ని మత మార్పిడిల వ్యతిరేక లేదా నిరోధక చట్టం అనకుండా ‘అరుణాచల్ ప్రదేశ్ మత స్వేచ్ఛా చట్టం’ అని నామకరణం చేశారు. బలవంతంగా, ప్రోద్బలంతో లేదా మరే ఇతర తప్పుడు మార్గాల ద్వారా ఒక మతం నుంచి మరో మతంలోకి ప్రజలను తీసుకోరాదని చట్టం నిర్దేశిస్తోంది. క్రైస్తవ మిషనరీల ప్రోద్బలంతో రాష్ట్రంలో వారి సంఖ్య నానాటికి పెరిగిపోతోందని, న్యీషి, డోన్యీ–పోలో, రంగ్ఫ్రా, గ్యాటీ అండా, అమిక్ మతాయ్.. స్థానిక జాతులు లేదా మతాల ప్రాభవం తగ్గి, అవి ఉనికినే కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్న కారణంగా నాడు మత మార్పిడుల వ్యతిరేక చట్టాన్ని తీసుకొచ్చారు. 1971లో అరుణాచల్ రాష్ట్రంలో క్రైస్తవుల సంఖ్య జనాభాలో ఒక శాతం ఉండగా, 2011లో నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో క్రైస్తవుల సంఖ్య 30 శాతానికి చేరుకుంది. అదే 51.6 శాతం ఉన్న స్థానిక మతాల ప్రజల సంఖ్య 26 శాతానికి పడిపోయింది, మత మార్పిడుల నిరోధక చట్టాన్ని పటిష్టంగా అమలు చేయక పోవడం వల్ల రాష్ట్రంలో క్రైస్తవుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఈ పరిస్థితుల్లో, చట్టం వచ్చిన 40 ఏళ్ల అనంతరం తమ బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని ఎత్తివేయాలనుకుంటోందని రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖందు ఇటీవల ప్రకటించడం ప్రజా వర్గాల్లో ఆశ్చర్యం కలిగిస్తోంది. క్రైస్తవుల పట్ల వివక్ష చూపుతున్న ఈ చట్టం నిజమైన లౌకికవాద స్ఫూర్తికి విరుద్ధమని కూడా ఆయన వ్యాఖ్యానించడం మరింత ఆశ్చర్యం కలిగిస్తోంది. మంచి విద్యను, మంచి వైద్యాన్ని అందిస్తామన్న హామీతోనే స్థానికంగా క్రైస్తవ మతం ఎదిగిందని ‘అరుణాచల్ తెగల అధ్యయన సంస్థ’కు చెందిన జుమ్యిర్ బసర్ తెలిపారు. సంప్రదాయబద్ధమైన చికిత్సా విధానంపైనా ప్రజలకు పెద్దగా నమ్మకం లేకుండా పోయిందని, పైగా ఆ వైద్యంలో ఖర్చుతో కూడుకున్న సంప్రదాయాలున్నాయని ఆమె వివరించారు. స్థానిక ప్రజలు ప్రోద్బలంతో తమ మతంలోకి రాలేదని, తమ మతాన్ని మనస్ఫూర్తిగా నమ్మి వచ్చారని అరుణాచల్ క్రైస్తవ సంస్థకు చెందిన టొకో టెకీ చెప్పారు. రాజ్యాంగం లౌకికవాద స్ఫూర్తికి భిన్నంగా ఉన్న చట్టాన్ని ఎత్తివేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం వివేకమైన నిర్ణయమని టెకీ వ్యాఖ్యానించారు. ఎప్పటి నుంచో ఈ చట్టాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్న క్రైస్తవ సంఘాల సభ్యుల్లో ఆయన ఒకరు. చట్టం ప్రకారం మత మార్పిడులు జరుగ కూడదుగానీ స్థానిక ప్రజలు కైస్తవాన్ని జీవన విధానంగా ఎంపిక చేసుకున్నారని ‘అరుణాచల్ చర్చి పునురుద్ధణ మండలి’ అధ్యక్షుడు న్యాక్డో టాసర్ వ్యాఖ్యానించారు. 1970 చివర్లో, 1980 మొదట్లో కొన్ని సార్లు మాత్రమే మత మార్పిడుల నిరోధక చట్టాన్ని వినియోగించారని, ఆ తర్వాత ఎప్పుడూ లేదని అరుణాచల్ యూనివర్శిటీలో చరిత్రను బోధించే అధ్యాపకుడు నాని బాత్ తెలిపారు. చట్టాన్ని ఎత్తివేస్తే అడ్డూ అదుపూ లేకుండా మత మార్పిడులు పెరిగిపోతాయని స్థానిక మతం న్యీషి సాంస్కృత సంఘానికి చెందిన పై ధావే ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో క్రైస్తవుల ఓట్లను దృష్టిలో పెట్టుకొనే చట్టాన్ని ఎత్తివేయడానికి కుట్ర పన్నిందని ఆరోపించారు. సహజంగా బీజేపీకి క్రైస్తవులు వ్యతిరేకులు. వారి డిమాండ్ను అంగీకరించడం ద్వారా వారి మద్దతును కూడగట్టవచ్చని బీజేపీ భావిస్తున్నట్లు ఉంది. బీజేపీ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పట్ల స్థానికంగా పనిచేస్తున్న ఆరెస్సెస్ న్యాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. స్థానిక మతాల పిల్లల పాఠశాలలకు, సాంస్కృతిక కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం ద్వారా వారిని హిందూమతంలోకి తీసుకరావడానికి ఆరెస్సెస్ కార్యకర్తలు కృషి చేస్తున్నారు. 1991 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 22 శాతం మంది హిందువులు ఉండగా, 2011 నాటికి వారి సంఖ్య 29 శాతానికి పెరిగింది. ఓ దశలో బాగా పెరిగిన హిందువుల సంఖ్య సామాజిక అంతరాల వైషమ్యాల కారణంగా పడిపోయింది. అరుణాచల్ తర్వాత మత మార్పిడుల నిరోధక చట్టాన్ని చత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాలు తీసుకొచ్చారు. -
అన్య మతస్తులకు పదవులివ్వడం ధర్మ విరుద్ధం
విజయనగరం టౌన్: తిరుమల తిరుపతి దేవస్థానం పదవులను అన్యమతస్తులకు ఇవ్వడం హిందూ ధర్మ విరుద్ధమని రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య జిల్లా అధ్యక్షుడు కె.పి.ఈశ్వర్ అన్నారు. తన నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన సంఘ ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హిందువులు కానివారిని తక్షణమే ఆయా పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సనాతన హిందూ ధర్మానికి, భారతీయ సంప్రదాయానికి కేంద్రమైన టీటీడీ దేవస్థానంలో ట్రస్టు బోర్డు పదవులు అన్యమతస్తులకు కట్టబెట్టడం తీవ్ర అపచారమన్నారు. వేంకటేశ్వరస్వామివారికి విరుద్ధంగా చర్యలు చేపట్టిన ప్రభుత్వాలు అధికారానికి దూరమైన ఘటనలను సీఎం చంద్రబాబునాయుడు గుర్తుచేసుకోవాలన్నారు. తప్పిదాన్ని తక్షణమే సరిదిద్దుకోకుంటే రానున్న ఎన్నికల్లో ఓటమి చవిచూడక తప్పదని జోస్యం చెప్పారు. ట్రస్టు బోర్డు సభ్యురాలు ఎమ్మెల్యే అనిత స్వయంగా తను క్రిస్టియన్ అని చెప్పినప్పటికీ ఆమెను ట్రస్టుబోర్డు సభ్యురాలిగా నియమించిన చంద్రబాబు హిందువుల మనోభావాలను దెబ్బతీశారని విమర్శించారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి దార్లపూడి సత్యప్రసాద్, ఉపాధ్యక్షుడు గుర్రాజు, జిల్లా శాఖ ప్రతినిధులు కె.వి.రమణమూర్తి, ఆర్.వెంకటరావు, ఎ.నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. -
38 వేల అడుగుల ఎత్తు నుంచి ఫొటోలు
సాక్షి, వెబ్ డెస్క్ : ఒక్క చిత్రంతో వంద మాటలను పలికించొచ్చని అంటారు. 38 వేల అడుగుల ఎత్తు నుంచి భూమి, ఆకాశ అందాల చిత్రాలను కెమెరాలో బంధించి అబ్బా అనిపించారు ప్రముఖ ఫొటోగ్రాఫర్ క్రిస్టియన్. బోయింగ్ 747-8 విమానంలో పైలట్తో పాటు కాక్పిట్లో కూర్చొని ప్రయాణించిన క్రిస్టియన్ కళ్లు మిరుమిట్లు గొలిపే చిత్రాలను తీశారు. ఆ తీసిన ఫొటోలు బాగా పాపులర్ అయ్యాయి. మరి వాటిపై ఓ లుక్కేయండి. అలస్కాలో సూర్యాస్తమయ సమయంలో తీసిన చిత్రమిది మంగోలియాలో సూర్యస్తమయ సమయంలో తీసిన పర్వతాల ఫొటో ఇది. చంద్రుని కాంతిలో మిరుమిట్లు గొలుపుతున్న మంగోలియా ఉత్తర ధ్రువం నుంచి వస్తున్న అద్భుత వెలుగును క్రిస్టియన్ తన కెమెరాలో ఇలా బంధించారు. -
చేతి రాతతో బైబిల్...
విశ్రాంత జీవితానికి కొత్త అర్థాన్ని చెబుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఓరుగల్లు వాసి వడ్డేపల్లి గోపాల్. చేతి రాతతో తెలుగులో బైబిల్ రాసిన ఏకైక వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఇత్తడి రేకులపై చేతితో బైబిల్ను తెలుగులో రాస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. రచయితగా, గాయకుడిగా, శిల్పిగా, చిత్రకారుడిగా కూడా రాణిస్తున్నారు. వరంగల్లోని రంగంపేటకు చెందిన వడ్డేపల్లి కనకయ్య–పార్వతమ్మ దంపతుల కుమారుడు గోపాల్ 1948లో జన్మించారు. రంగంపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టెన్త్ వరకు చదువుకు న్నారు. 1982లో వరంగల్ కేఎంసీలో అటెండర్గా చేరారు. ఉమ్మడి కరీం నగర్ జిల్లా మహాముత్తారంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీనియర్ అసిస్టెంట్గా 2006లో ఉద్యోగ విరమణ పొందారు. క్రైస్తవుడైన గోపాల్ బైబిల్ను పలుసార్లు పఠనం చేయడం ప్రారంభించారు. దీంతో చేతితో బైబిల్ను రాయాలనే సంకల్పించారు. 18 నెలలు..1,029 పేజీలు.. 1,029 పేజీల బైబిల్ను పలుమార్లు చదివిన తర్వాత చేతితో రాయాలని నిర్ణయించారు. ఎగ్జిక్యూటివ్ బాండ్ పేపర్ను చిరిగిపోకుండా తీసుకుని.. చదివే వీలుగా బట్టర్ పేపర్ను మధ్యలో ఏర్పాటుచేశారు. సుమారు 20 కిలోల బరువుతో 1,029 పేజీల పుస్తకాన్ని ప్రత్యేకంగా బైండింగ్ చేయించారు. 2011 జనవరిలో బాల్పాయింట్ పెన్నుతో రాయడం ప్రారంభించి.. 2012 జూన్ 13న బైబిల్ను పూర్తి చేశారు. యేసు క్రీస్తు మాటలు ఎరుపు రంగు, కీర్తనలు ఆకుపచ్చ రంగు, ప్రకటన గ్రంథం నీలి రంగు, రాజుల మొదటి గ్రంథం నలుపు రంగు, దిన వృత్తాంతం వయిలెట్, హీజ్కీయా గ్రంథం ముదురు నీలి రంగులో అందించారు. గోపాల్ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అనే గ్రంథాన్ని రాశారు. ఇందులో 626 పాటలు, 26 మంది రచయితలను పరిచయం చేశారు. ఇత్తడి రేకులపై బైబిల్.. ఎగ్జిక్యూటివ్ పేపర్తో రూపొందించిన బైబిల్ కాలగమ నంలో పాడైపోతుందని భావించిన గోపాల్ మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. నీళ్లు, నిప్పులో పడినా పాడైపోకుండా ఉండేందుకు ఇత్తడి రేకులపై బైబిల్ రాయాలని నిర్ణయించారు. 2017 జూన్ నుంచి ఇత్తడి రేకులపై బాల్పాయింట్ పెన్నుతో బైబిల్ను రాస్తున్నారు. గోపాల్ రాసిన గ్రంథాలు.. గోపాల్ సంఖ్యల ప్రాధాన్యత అనే పుస్తకాన్ని 2010లో రచించారు. యేసేబు కన్నకలలు ఇతి వృత్తంతో 2014 లో కలవరం అనే పుస్తకానికి నాంది పలికారు. 2015లో నయమాను కుష్టు రోగి, 2016లో ప్రార్థన మరియు కృప అంశాలు అనే పుస్తకాన్ని రాశారు. ప్రస్తుతం ఆత్మ అనే పుస్తకాన్ని రాస్తున్నారు. – కాజీపేట అర్బన్ భవిష్యత్ తరాల కోసం.. భవిష్యత్ తరాల కోసం ఇత్తడి రేకులపై బైబిల్ను రాస్తున్నా. చేతితో బైబిల్ను రాయడం దైవ సంకల్పం. చేతితో రాసిన బైబిల్ను వీక్షించేందుకు వరంగల్లోని రంగంపేటను సందర్శించవచ్చు, వివరాలకు 9491065030లో సంప్రదించవచ్చు. – గోపాల్, చేతిరాత బైబిల్ సృష్టికర్త -
ప్రభుత్వంపై కేథలిక్ బిషప్ సంచలన ఆరోపణలు
సాక్షి, న్యూఢిల్లీ : మత విశ్వాసాల ఆధారంగా దేశం విభజించబడిందని.. కేథలిక్ బిషప్ కాన్ఫెరెన్స్ ఆఫ్ ఇండియా (సీబీసీఐ) ఆరోపించింది. ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి పరిణామాలు చోటు చేసుకోవడం దురదృష్టమని సీబీసీఐ తెలిపింది. ప్రస్తుతం దేశంలోని వర్గాలన్నీ మత ప్రాతిపదికన చీలిపోయాయని, ఇటువంటి పరిస్థితులకు వ్యతిరేకంగా అందరూ పోరాడాలని సీబీసీఐ పిలుపునిచ్చింది. ప్రస్తుత ప్రభుత్వంపై విశ్వాసం సన్నిగిల్లుతోందని.. క్రైస్తవ సమాజం నుంచి ఈ భయం మరింత ఎక్కువగా ఉందని సీబీసీఐ అధ్యక్షుడు, కార్డినల్ బసిలియోస్ క్లీమేస్ చెప్పారు. అమాయకులైన మతాధికారులపై ప్రభుత్వం అన్యాయంగా కేసులు పెడుతోందని ఆయన అన్నారు. అమాయక, పేద మతాధికారులను ఇబ్బందులు పెట్టడం మంచిది కాదన్నారు. ఈ పరిస్థితుల్లో మాకు ప్రభుత్వం మీద నమ్మకం సన్నగిల్లుతోందని ఆయన.. ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. గత వారం మధ్యప్రదేశ్లోని సాత్నా పట్టణంలో 30 మంది మతాధికారులు కారోల్స్ పాడుతుండగా.. అరెస్ట్ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అలాగే గ్రామాల్లోని ప్రజలను భజరంగ్ దళ్ కార్యకర్తలు బలవంతంగా మతమార్పిడులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. -
దైవదూషణ: క్రైస్తవుడికి మరణదండన!
ఇస్లామాబాద్: దైవదూషణ చేశాడని ఆరోపిస్తూ పాకిస్థాన్లో ఓ క్రైస్తవుడికి మరణదండన విధించారు. స్నేహితుడికి వాట్సాప్లో ఓ పద్యాన్ని పంపడమే అతని నేరం. నదీమ్ జేమ్స్ మసిహ్ ఈ మేరకు ఉరిశిక్ష ఎదుర్కొంటున్నాడు. వాట్సాప్లో తనకు ఓ పద్యాన్ని పంపించాడని, అది దైవదూషణ చేసేవిధంగా ఉందంటూ జేమ్స్పై అతని స్నేహితుడు యాసిర్ బషీర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, డిఫెన్స్ లాయర్ మాత్రం తన క్లయింట్ అమాయకుడని, అతను ఓ ముస్లిం బాలికతో సంబంధం కలిగి ఉండటంతోనే అతనిపై తప్పుడు అభియోగాలు మోపారని తెలిపారు. అతనికి విధించిన మరణదండనను లాహోర్ హైకోర్టులో సవాల్ చేస్తామని చెప్పారు. పంజాబ్ ప్రావిన్స్లోని సరా ఈ ఆలంజిర్కు చెందిన జేమ్స్పై దైవదూషణ ఫిర్యాదు రావడంతో ఉన్మాద మూక నుంచి తప్పించుకునేందుకు ఇంటి నుంచి పారిపోయాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. ఛాందసవాదుల నుంచి బెదిరింపుల నేపథ్యంలో లాహోర్కు 200 కిలోమీటర్ల దూరంలోని గుజరాత్ జైల్లోనే అతని కోర్టు విచారణ సాగింది. న్యాయమూర్తి అతనికి మరణదండనతోపాటు రూ. మూడు లక్షలు జరిమానా విధించారు. ప్రస్తుతం జేమ్స్ కుటుంబాన్ని భద్రతాపరమైన కస్టడీలోకి తీసుకొని.. గుర్తుతెలియని ప్రాంతానికి తరలించారు. పాకిస్థాన్లో క్రైస్తవులు..! ప్రధానంగా ముస్లింలు మెజారిటీ గల పాకిస్థాన్లో సుమారు 20లక్షల మంది క్రైస్తవులు ఉంటారు. దైవదూషణ ఆరోపణలతో మైనారిటీ క్రైస్తవులపై ఛాందసవాద, అతివాద గ్రూపులు, ఉగ్రవాదులు తరచూ దాడులు జరుపుతున్నారు. 2015లో ఖురాన్ను కించపరిచారనే ఆరోపణలతో క్రైస్తవుల దంపతులిద్దరినీ ఇటుకల బట్టీలో వేసి తగులబెట్టిన ఘటన చోటుచేసుకుంది. దైవదూషణ ఆరోపణలతో రెండేళ్ల కిందట లాహార్లో 125 క్రైస్తవ గృహాలను తగలబెట్టారు. -
క్రిస్టియన్ వదిలినా.. ధోని వదలడు
-
క్రిస్టియన్ వదిలినా.. ధోని వదలడు
పుణె: ఐపీఎల్-10లో భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత రైజింగ్ పుణె వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోని అద్భుత కీపింగ్ తో అదరగొడుతున్నాడు. గత మ్యాచ్ లో ఢిల్లీ ఆటగాడు శ్యామ్యుల్స్ ను రెప్పపాటులో స్టంప్ అవుట్ చేసి ఔరా అనిపించుకున్నధోని, తాజా కింగ్స్ పంజాబ్ మ్యాచ్ లో ఓ క్యాచ్ ను అద్భుతంగా పట్టి ఆశ్చర్య పరిచాడు.. ఉనద్కత్ వేసిన 13 ఓవర్ నాలుగో బంతికి స్వప్నిల్ సింగ్ స్లిప్ లో ఉన్న క్రిస్టియన్ కు క్యాచ్ ఇవ్వగా బంతి అతని వేళ్లకు తగిలి పైకి లేచింది. వెంటనే అప్రమత్తమైన ధోని బంతిని అందుకున్నాడు. 'నీవు వదిలినా నేను వదలను' అన్నట్లు ధోని పట్టిన క్యాచ్ ను చూసిన వారంతా హతాశులయ్యారు. ఇక బెంగళూరు మ్యాచ్ లో డివిలియర్స్ ను స్టంప్ అవుట్ చేసిన విధానం కూడా కీపింగ్ లో ధోనికి ఎవరూ సాటిలేరని నిరూపించింది. ఇలా ఈ సీజన్ లో అంతగా బ్యాట్ ఝులిపించకపోయినా తన కీపింగ్ తో మాత్రం అభిమానులను అలరిస్తున్నాడు. ఇప్పటికే ఐపీఎల్ లో 100 మంది అవుట్ చేసిన ఘనతను అందుకున్న ధోని వికెట్ల వెనుకాల చిరుతలా కదులుతూ ప్రత్యర్ధులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. -
ఐపీఎల్: జెర్సీ ఒకరిది.. ఆటగాడు ఒకరు
కోల్ కతా: ఈడెన్ గార్డెన్ లో రైజింగ్ పుణే, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. చివరి ఓవర్లో సిక్స్ కొట్టి గెలిపించిన పుణే ఆటగాడు డాన్ క్రిస్టియన్ ఓ తప్పిదం చేశాడు. ధోని అవుట్ అయిన అనంతరం క్రీజులోకి వచ్చిన ఈ ఆస్ట్రేలియా ఆటగాడు తన జెర్సీ కి బదులు 55 నెంబర్ గల బెన్ స్టోక్స్ జెర్సీ ధరించి బ్యాటింగ్ కు దిగాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిపై క్రిస్టియన్ స్పందించాడు. 'ఈ రాత్రి ఇది ఒక గొప్ప విజయం. త్రిపాఠి బ్రిలియంట్. జెర్సీ ఉతకడానికి వెళ్లోచ్చిన సమయంలో స్టోక్సీ, నా జెర్సీలు తారుమారయ్యాయి, నేనే తప్పుగా స్టోక్స్ జెర్సీ తీసుకున్నాను' అని క్రిస్టియన్ ట్వీట్ చేశాడు. ఈ ఘటనతో క్రిస్టియన్ క్రికెట్ నియమ నిబంధనలను ఉల్లంఘించనట్లైంది. రిఫరీలు తీవ్రంగా పరిగణిస్తే అతను ఒక మ్యాచ్ కు దూరమయ్యే అవకాశం ఉంది. అయితే ఈ మ్యాచ్ లో పుణే కోల్ కతా పై 4 వికెట్ల తేడాతో నెగ్గి ఫ్లే ఆఫ్ అవకాశాలు మెరుగుపరుచుకుంది. ఇక మే 4 క్రిస్టియన్ జన్మదినం కావడంతో సహచరులతో బర్త్ డే సంబరాలు జరుపుకున్నాడు. Great win tonight, Tripathi brilliant!! Re the shirt mix up, both mine and Stokesy's shirts were drying out and I grabbed the wrong one! — Daniel Christian (@danchristian54) 3 May 2017 -
క్రైస్తవ ఆస్తుల కబ్జాను సహించం
- న్యాయం జరిగే వరకు క్రైస్తవులకు అండగా ఉంటాం - స్పందించకుంటే ఉద్యమం ఉద్ధృతం - ఎమ్మెల్యే ఐజయ్య హెచ్చరిక కర్నూలు(టౌన్): టీడీపీ పాలనలో క్రైస్తవ మత సంస్థల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని ఎమ్మెల్యే ఐజయ్య ఆందోళన వ్యక్తం చేశారు. కోల్స్ కళాశాల ఆస్తులను కబ్జా చేశారని, ఇలాంటి ఘటనలను చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. క్రైస్తవ సంస్థల స్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ బాప్టిస్టు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కోల్స్ కళాశాల వద్ద చేపట్టిన రిలే నిరహార దీక్షలు మంగళవారంనాటికి 6వ రోజుకు చేరాయి. దీక్షల్లో ఎమ్మెల్యే ఐజయ్య పాల్గొని సంఘీభావం తెలిపారు. టీడీపీ ప్రభుత్వం దళితులు, మైనార్టీల పట్ల వివక్ష చూపుతోందన్నారు. క్త్రెస్తవుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. క్రైస్తవ సంస్థల ఆస్తులను కబ్జా చేస్తున్న అధికార పార్టీ నేతలకు ప్రభుత్వంతోపాటు అధికారులు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. క్రయవిక్రయాలకు అనుమతి లేకున్నా అధికార పార్టీ నేతల అండతో ఆస్తులను కరిగించేస్తున్నారన్నారు. అన్యాయం జరిగిందని క్త్రెస్తవులంతా గగ్గోలు పెడుతున్నా అధికారపార్టీ నేతలు ఎందుకు నోరుమెదపడం లేదని ఐజయ్య ప్రశ్నించారు. దొంగలు.. దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అక్రమంగా రిజిస్ట్రేషన్లను రద్దు చేయకుంటే క్రైస్తవులకు మద్దతుగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన లేవదీస్తామని హెచ్చరించారు. పలువురి మద్దతు, పూర్వ విద్యార్థుల ర్యాలీ.. రిలే నిరహార దీక్షలు చేస్తున్న క్త్రెస్తవ సంఘాల నాయకులకు మద్దతుగా 1985 సంవత్సరానికి చెందిన కోల్స్ కాలేజీ విద్యార్థులు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర నాయకులు దండు శేషుయాదవ్, దళిత న్యాయవాదుల సంఘం నాయకులు జయరాజు, బీసీ సంఘం జేఏసీ నాయకులు రవికుమార్, శ్రీరాములు, కోల్స్ చర్చి సంఘం అధ్యక్షులు లింకన్, అనిల్నాథ్, పాస్టర్లు విజయకుమార్, సజీవన్ తదితరులు దీక్షల్లో పాల్గొని మద్దతు తెలిపారు. -
దీక్షలను విజయవంతం చేయాలి
సూర్యాపేటమున్సిపాలిటీ : ఆల్ ఇండియా దళిత క్రైస్తవ సమితి ఆధ్వర్యంలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ ఆగస్టు 11న ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిర్వహించే ఉపవాస దీక్షలను విజయవంతం చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేజే ఉదయ్బాబు అన్నారు. బుధవారం స్థానిక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరారు. బిల్లు ప్రవేశపెట్టి దళితులకు న్యాయం చేయాలన్నారు. సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొండ రవి, రాష్ట్ర కార్యదర్శి మీసాల ప్రసాద్, ఎస్.వెంకటేశ్, నియోజకవర్గ ఇన్చార్జి కొత్తపల్లి ప్రశాంత్, గంట జీవన్కుమార్, కీసర అరవింద్రెడ్డి, జాకోబ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇరాక్ లో బయటపడ్డ పురాతన క్రైస్తవ క్షేత్రం!
ఉగ్ర భూతం కోరలు చాచిన యుద్ధభూమిలో చారిత్రక క్రైస్తవ క్షేత్ర మూలాలు వెలుగు చూశాయి. ఐఎస్ ఐస్ ఆక్రమిత ఇరాక్ మోసుల్ నగర శివార్లలో వందల ఏళ్ళనాటి పురాతన కట్టడాలు బయట పడినట్లు ఉపగ్రహ చిత్రాలు వెల్లడించాయి. డైర్ మార్ ఎలియా గా పిలిచే ఆ ప్రాంతం ఇప్పుడు వందల ఏళ్ళ చరిత్రకు నిదర్శనంగా నిలుస్తోంది. తుపాకులు, బాంబుల మోతలతో దద్దరిల్లుతున్న మోసుల్ నగర శివార్లలో బయటపడ్డ చారిత్రక అవశేషాలు.. అక్కడో క్రైస్తవ క్షేత్రం ఉండేదని నిరూపిస్తున్నాయి. భూమినుంచీ బయటపడ్డ ఆ పురాతన నిర్మాణాలు సుమారు పథ్నాలుగు వందల ఏళ్ళ క్రితం నాటివిగా శాటిలెట్ చిత్రాలద్వారా తెలుస్తోంది. సెయింట్ ఎలిజా గా పిలిచే ఆ నిర్మాణ ఉపగ్రహ చిత్రాలను పరిశీలించిన 'ఆల్ సోర్స్ అనాలసిస్' నిపుణల విశ్లేషణల ప్రకారం ఆ భారీ కట్టడాలు సహజంగానే కూలిపోయినట్లు తెలుస్తుండగా... ఆ కూల్చివేత ఉద్దేశ్య పూర్వకంగానే జరిగిందని మరి కొందరు నిపుణులు సూచిస్తున్నారు. 2014 సంవత్సరంలో ఆప్రాంతాన్ని పరిశీలించేందుకు ముందు, తర్వాత చిత్రాలను చూస్తే తెరమరుగైన చారిత్రక విషయాలెన్నో వెల్లడయ్యాయి. అప్పట్లో రాళ్ళు, ఇసుకతో ఆ నిర్మాణాలను చేపట్టినట్లుగా ఆల్ సోర్సెస్ ద్వారా తెలుస్తోంది. అక్కడ మనం ఎప్పుడూ చూడని సుమారు ఇరవై వెలకట్టలేని గొప్ప భవనాలు ఉండేవని, అవి యుద్ధసమయంలో నాశనమైనట్లు విశ్లేషణలు చెప్తున్నాయి. అయితే రెండోసారి తీసిన ఉపగ్రహ చిత్రాల్లో పరిశీలిస్తే ఆ భవనాలు అప్పట్లో బుల్డౌజర్ తో కూల్చివేసినట్లు కొన్ని ఆధారాలు తెలుపుతున్నాయి. కాగా ఐఎస్ ఐఎస్ ఈ కూల్చివేతలకు కారణంగా సూచించలేమని ఆల్ సోర్సెస్ చెప్తోంది. కాగా ఐఎస్ ఐఎస్ తీవ్రవాదులు మోసుల్ నగరాన్నిస్వాధీనం చేసుకున్న2014 జూన్ కు కొద్ది నెలల తరువాత అంటే సుమారు ఆగస్టు చివరి లేదా సెప్టెంబర్ మొదట్లో ఈ నాశనం జరిగి ఉండొచ్చని ఇమేజరీ పిన్ పాయింట్ విశ్లేషణలు తెలుపుతున్నాయి. -
మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు
మధురై: రెండు వేర్వేరు మతాలకు చెందినవారు ఒకే మత ఆచారం ప్రకారం పెళ్లి చేసుకుంటే ఆ వివాహం చట్టబద్ధం కాదని మద్రాసు హైకోర్టు గురువారం సంచలన తీర్పును వెలువరించింది. రెండు విభిన్న మతాలకు చెందిన స్త్రీ, పురుషుడు ఏదో ఒక మతాచారం ప్రకారం పెళ్లి చేసుకుంటే చెల్లదని చెప్పింది. కేవలం ప్రత్యేక వివాహ చట్టం ప్రకారమే రెండు మతాల మధ్య జరిగిన వివాహాలు చెల్లుబాటవుతాయని స్పష్టం చేసింది. ఓ హిందూ మతానికి చెందిన అమ్మాయి, క్రైస్తవమతానికి చెందిన అబ్బాయి గుడిలో వివాహం చేసుకున్నారు. అయితే, ఈ వివాహాన్ని అంగీకరించని అమ్మాయి తల్లిదండ్రులు తమ కూతురు కనిపించడం లేదని మద్రాసు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో దీనిని విచారించిన హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పి.ఆర్. శివకుమార్, జస్టిస్ వి.ఎస్.రవి తీర్పును వెలువరించారు. దీని ప్రకారం ఇద్దరు వేర్వేరు మతాలకు చెందిన వారు వివాహం చేసుకోవాలనుకుంటే ముందు వారిలో ఒకరు మరొకరి మతాన్ని స్వీకరించాలని ఆ తర్వాత జరిగే వివాహమే చెల్లుబాటవుతుందని పేర్కొంది. 1954 ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం, మత మార్పిడి అవసరం లేకుండానే వీరి వివాహాన్ని నమోదు చేయాల్సి వుందని సూచించింది. మేజర్ అయిన ఆ యువతికి ఎక్కడికైనా వెళ్లి నివసించే హక్కు ఉందని, ఆమెకు తల్లిదండ్రులు, ఇతరుల రక్షణ అవసరం లేదని కూడా చెప్పింది. -
అదేం కష్టం కాదు!
‘‘రెండు భిన్న మతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించడం కష్టమని చాలామంది అనుకుంటారు. కానీ, కష్టమేం కాదని నేనంటాను. అందుకు నిదర్శనం నా కుటుంబమే. మా అమ్మగారు క్రిస్టియన్, నాన్నగారు ముస్లిమ్. మా అమ్మా, నాన్నల వైవాహిక జీవితం ఇతరులు ఆదర్శంగా తీసుకునేంత ఆనందంగా ఉంటుంది. మా ఇంట్లో అసలు కుల, మతాల ప్రసక్తే రాదు. నేను చర్చ్కి వెళతాను. మసీదులకూ వెళతాను. హిందూ దేవాలయాలనూ సందర్శిస్తాను. అంతెందుకు మా ఇంట్లో పూజా మందిరం కూడా ఉంది. నేను రోజూ పూజలు చేయను కానీ, అప్పుడప్పుడు దీపం వెలిగిస్తా. ఎవరైనా ‘నువ్వేంటి దీపాలు వెలిగిస్తున్నావ్?’ అనడిగితే.. ‘నాకు లేని అభ్యంతరం మీకెందుకు?’ అంటాను. దేవుళ్లందరూ సమానమనే భావన నాది. నా అభిప్రాయంతో కొంతమంది ఏకీభవించకపోవచ్చు. కానీ, ఎవరి అభిప్రాయం వారిది.. ఎవరి నమ్మకం వారిది.’’ - క్రతినా కైఫ్ -
మెర్రీ క్రిస్మస్
ఏసు క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రపంచ వ్యాప్తగా క్రైస్తవులు గురువారం క్రిస్మస్ను ఘనంగా జరుపుకోనున్నారు. జిల్లాలోనూ ఈ పండగను ఘనంగా జరుపుకునేందుకు చర్చి లను తీర్చిదిద్దారు. బుధవారం రాత్రి నుంచి ప్రత్యేక ప్రార్థనలు జరుపుతున్నారు. 12 గంటలు దాటినా తరువాత హ్యాపీ క్రిస్మస్ అంటూ ఒకరినొకరు శుభాకాంక్షలు తెలిపారు. నగరంతో పాటు ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు, డోన్ తదితర ప్రాంతాల్లోని చర్చిలను ముస్తాబు చేశారు. నగరంలోని సీఎస్ఐ చర్చిలో యేసుక్రీస్తు జన్మదినాన్ని గుర్తు చేస్తూ అందంగా పశు వుల పాకను తీర్చిదిద్దారు. చర్చిల్లో బెలూన్లు, రంగు రంగుల కాగితాలతో పాటు క్రిస్మస్ ట్రీ, శాంతాక్లాజ్ తాత నమూనా చిత్రాలు ప్రదర్శించారు. క్రైస్తవుల ఇళ్లలోను స్టార్లు వెలిశాయి. అలాగే సీక్యాంప్ మందిరం, స్టాంటన్ మెమోరియల్ చర్చి, గిప్సన్ చర్చి, రాక్వుడ్ చర్చి, యేరుషలేమ్, సీసీ చర్చి, బిషప్ చర్చిలు విద్యుత్ దీపాలంకరణతో వెలుగు లీనుతున్నాయి. - కర్నూలు హాస్పిటల్ చర్చీలకు కేకులు పంపిణీ చేసిన భారతి సిమెంట్స్ కర్నూలు (ఓల్డ్సిటీ): భారతి సిమెంట్స్ యాజమాన్యం.. బుధవారం నగరంలోని ప్రముఖ చర్చీలకు భారీ కేకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఉర్దూ ట్రైనింగ్ స్కూల్ రోడ్డులోని సీఎస్ఐ చర్చి నుంచి ప్రారంభించారు. భారతి సిమెంట్స్ ఏరియా సేల్స్ మేనేజర్ ఎ.విజయభాస్కర్ చేతుల మీదుగా కేక్ను అందజేశారు. అనంతరం పాస్టర్ బి.ఎస్.వేదనాయకం ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సర్వమానవాళి సుఖ శాంతులతో వర్ధిల్లాలంటూ ఆ ఏసు కృప అందరిపై ఉండాలని దీవెనలు అందించారు. ఏటా క్రిస్మస్ పండుగకు కేకులు పంపడం ఆనవాయితీగా చేసుకున్న భారతి సిమెంట్స్ వారిని అభినందిస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. సేల్స్మేనేజర్ విజయభాస్కర్ మాట్లాడుతూ.. తమ సంస్థ వినియోగదారులకు మూడు రెట్లు మెరుగైన సిమెంట్ అందిస్తుందన్నారు. భారతి సిమెంట్స్ తరఫున క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో డాక్టర్ టి.ఎస్.వేదనాయకం, ఎం.ఎస్.జాన్సన్బాబు, జార్జిరాజు, జాన్ చంద్రమోహన్, సుధీర్, జయకుమార్, సుశీల పాల్గొన్నారు. నేడు ఆరాధన గురువారం ఉదయం క్రిస్మస్ ఆరాధన ఉంటుంది. క్రైస్తవులు చర్చిలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. పాస్టర్లు దైవ సందేశం అందిస్తారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. జైలు, అనాథాశ్రమాలు, శిశుభవన్లు, వృద్ధాశ్రమాలు, పాఠశాలల్లో వస్త్రదానం, అన్నదానం వంటి కార్యక్రమాలు ఉంటాయి. -
మెర్రీ క్రిస్మస్
తిరుపతి కల్చరల్: ఏసుక్రీస్తు పుట్టిన పర్వదినమైన క్రిస్మస్ సందర్భంగా జిల్లాలోని చర్చిలన్నీ రంగు రంగుల విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. గురువారం క్రిస్మస్ పర్వదినం కావడంతో బుధవారం రాత్రి నుంచే చర్చిలు క్రిస్మస్ వేడుకలతో కళకళలాడాయి. చర్చిల్లో ఆకర్షణీయంగా క్రిస్మస్ ట్రీలు కొలువుతీర్చారు. ఏసు త్యాగనిరతిని, లోకానికి అందించిన శాంతి సందేశాన్ని తెలిపే చిత్రాలు, బొమ్మలతో అలంకరణలు చేశారు. బుధవారం అర్ధరాత్రి క్రిస్మస్ కేక్లు కట్ చేసి ఏసు పుట్టిన రోజు సంబరాలను జరుపుకున్నారు. క్రిస్టియన్లందరూ పరస్పరం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. భక్తి శ్రద్ధలతో పరిశుద్ధ క్రిస్మస్ ప్రార్థనలు నిర్వహించారు. బిషప్లు, పాస్టర్లు చర్చిల్లో ఏసు జన్మ చరిత్రను తెలుపుతూ శాంతి సందేశాలు అందించారు. క్రిస్టియన్లు అందరూ కుంటుంబ సమేతంగా చర్చిలకు చేరుకుని ప్రార్థనలు చేశారు. తిరుపతి నగరంలోని వెస్ట్ చర్చి, ఈస్ట్ చర్చిలో, సౌత్ ఆంధ్రా లూథరన్ సంఘం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చర్చిల్లో పిల్లలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పవిత్ర క్రిస్మస్ను పురస్కరించుకుని పేదలకు అన్నదానం, వస్త్ర దానాలు చేశారు. ఒక్క తిరుపతి నగరంలోనే కాదు.. మదనపల్లె, చిత్తూరు, శ్రీకాళహస్తి, పుంగనూరు, పలమనేరు తదితర పట్టణాలతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోని చర్చిల్ల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. లోకరక్షకుడి జన్మదినం క్రిస్మస్ ప్రజల రక్షణకై లోకరక్షకుడు ప్రభువైన ఏసుక్రీస్తు దివి నుంచి భువికి దిగివచ్చిన శుభదినమే క్రిస్మస్. క్రిస్మస్ అంటే వెలుగు. పాపంతో నిండిన చీకటి లోకానికి ఏసుక్రీస్తు వెలుగుగా అవతరించాడు. ఏసు ప్రసాదించిన వె లుగు జనులకు పవిత్ర త్రోవ చూపి సత్యమార్గంలో నడిపించింది. దీవించి నిత్య జీవితమును అనుగ్రహించిన రక్షకుడు ఏసుక్రీస్తు. అలాంటి వెలుగును అందరూ కలిగి ఉండాలని క్రిస్మస్ సందర్భంగా యావన్మందికి క్రిస్మస్ శుభాకాంక్షలు. -బి.అరుణోదయకుమార్, కోశాధికారి, సౌత్ ఆంధ్రా లూథరన్ సంఘం -
మనకు తెలిసిన మధుర గీతం... నడిపించు నా నావ
నడిపించు నా నావ.. నడిసంద్రమున దేవా... అన్న పాట తెలుగు క్రైస్తవలోకాన్ని మనోహరమైన ఆత్మీయతానుభవాల అత్యున్నతమైన అంచుల్లోకి తీసుకెళ్లిన భక్తి గీతం. ఈ పాట పాడని క్రైస్తవుడు లేడు, మోగని చర్చి లేదు, మారు మోగని క్రైస్తవ సభలు లేవు. మహాద్భుత క్రైస్తవ వక్తగా, రచయితగా, కవిగా ప్రసిద్ధి చెందిన రెవ. డా. ఎ.బి. మాసిలామణి రాసిన ఆణిముత్యంలాటి భక్తి గీతమది. లక్షలాది హృదయాలను స్పృశించిన మధురగీతం అది. జీవితంలో వైఫల్యానికి, విజయానికి మధ్యగల అగాథంలో యేసుక్రీస్తు నిండితే, అదెంత ఫలభరితమో తెలుపుతూ పరోక్షంగా అపోస్తలుడైన పేతురు జీవితానుభవాల పందిరికి అల్లిన గీతం అది. ఎంతో సరళమైన భాషతో అత్యంత ప్రగాఢమైన భావాలను శ్రోతల హృదయాల్లో గుమ్మరించడం మాసిలామణికి వెన్నతో పెట్టిన విద్య. నడిపించు నా నావ పాటలో ప్రభుమార్గము విడిచితిని- ప్రార్థించుట మానితిని ప్రభువాక్యము వదిలితిని- పరమార్థము మరచితిని ప్రపంచ నటనలలో - ప్రావీణ్యమును పొంది ఫలహీనుడనై- ఇప్పుడు పాటింతు నీ మాట అన్న చరణం మాసిలామణి నిజాయితీకి, నిష్కల్మషత్వానికి, నిర్భయత్వానికి నిదర్శనం. దేవుడు నిర్దేశించిన స్థాయిని అందుకోలేక పడిపోవడం, మళ్లీ లేవడం అందరి అనుభవమే అయినా ప్రతి ఒక్కరూ తాము అందుకు మినహాయింపు అన్న పద్ధతిలో డబ్బా వాయించుకుంటున్న పరిస్థితుల్లో, తాను మాత్రం అందరిలాంటి వాడనేనని ఒప్పుకున్న మహనీయుడు మాసిలామణి. ప్రపంచస్థాయి వక్తగా అత్యున్నతమైన స్థితిలో ఉన్న తరుణంలో 1972లో నడిపించు నా నావ అనే ఈ పాట రాయడం, అందులో ఈ చరణాన్ని చేర్చడం మాసిలామణి సాహసానికి తార్కాణం. ఎలాంటి వ్యక్తినైనా తడిమి లేపి ప్రభువు పాదాలవద్ద పడవేసే శక్తి ఆయన పాటకుందంటే దానిక్కారణం ఆ పాటలు ఆయన జీవితానుభవాల్లో పుట్టడమే. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో 1914లో జన్మించిన మాసిలామణి పూర్వీకులు తమిళ ప్రాంతం వారు. ఎంతో సాదాసీదా క్రైస్తవ కుటుంబంలో పుట్టినా అత్యున్నత స్థాయికి ఎదిగి ఎన్నో లక్షలాదిమందికి ఆశీర్వాదకారకుడైన మహా దైవజనుడు మాసిలామణి.ఆయన తర్వాత నేనే అని చెప్పుకునే వాళ్లున్నా, ఆయనది మొదటి స్థానమైతే వాళ్లది వందవ స్థానమవుతుంది. మధ్యలో ఉన్న సంఖ్యలన్నీ ఖాళీయే! ఆయనలాంటి వక్త, రచయిత, కవి మళ్లీ పుడితే అది మహాద్భుతమే అవుతుంది. ఆ అద్భుతం జరిగినా జరగకున్నా మాసిలామణి జ్ఞాపకాలు, ప్రసంగాలు, పాటలు కనీసం వెయ్యితరాలకు వెలుగుబాటలు. మాసిలామణి గీత రచయిత -
క్రిష్టియన్ మైనార్టీకి ‘మొండి చేయి’
ఇద్దరు ముస్లిం మైనారిటీలకు అవకాశం మేయర్తో క్రిష్టియన్ సెల్ రాష్ట్ర కార్యదర్శి స్వామిదాస్ వాగ్వాదం అనంతపురం మెడికల్: అన్ని వర్గాలకు పెద్ద పీట వేస్తామని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ నగర పాలక సంస్థ కో-ఆప్షన్ ఎన్నికల్లో క్రిష్టియన్ మైనార్టీకి మొండి చేయి చూపింది. ఎంపీ దివాకర్రెడ్డి, చీఫ విప్ కాలవ శ్రీనివాసులు సూచించిన వారికి ఇచ్చిన ప్రాధాన్యత క్రిష్టియన్ మైనార్టీకి ఇవ్వలేదని ఆ పార్టీకి చెందిన కార్యకర్తలే ఆరోపిస్తున్నారు. బుధవారం జరిగిన కో-ఆప్షన్ ఎన్నికల్లో మైనార్టీ కోటా కింద ఉన్న రెండు స్థనాలను ముస్లిం వర్గాలక కేటాయించడం వివాదాస్పదమయ్యింది. క్రిష్టియన్ వర్గాలను విస్మరించారంటూ టీడీపీ క్రిష్టియన్ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఈటె స్వామిదాస్ మేయర్ మదమంచి స్వారూపతో వాగ్వాదానికి దిగారు. వివరాల్లోకి వెలితే... కార్పొరేషన్ కౌన్సిల్లో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక విషయంలో మైనార్టీ కోటా కింద ఉండే రెండు స్థానాల్లో ఒకటి ముస్లిం వర్గాలకు, మరొకటి క్రిష్టియన్ వర్గాలకు కేటాయించడం ఆనవాయితీ. ఈసారి క్రిష్టయన్ మైనార్టీకి అవకాశం కల్పించలేదు. దీంతో ఈటెస్వామిదాస్ స్థానం దక్కలేదు. అభ్యర్థులను ఖరారు చేస్తూ పంపిన షీల్డ్ కవర్లో ఆయన పేరు లేదు. మైనార్టీ కోటా కింద ఎన్నికైన ఇద్దరిలో ఎంపీ దివాకర్రెడ్డి వర్గానికి చెందిన షరీనా, చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు తరఫున మున్వర్ ఉన్నారు. దీంతో ఈటెస్వామిదాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ పోడియ వద్దకు వచ్చి మైక్ తీసుకుని... పార్టీకి మొదటి నుంచి పనిచేస్తున్న వారికి అవకాశం ఇవ్వలే దు.. మైనార్టీ కోటా కింద రెండు ముస్లిం వర్గాలకే ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై మేయర్ స్పందిస్తూ స్వామిదాస్ నుంచి మైక్ లాక్కున్నారు.ఇది పార్టీ తీసుకున్న నిర్ణయమని, పార్టీ ఎవరిని సూచించిందో వారినే సభ్యులుగా ఎన్నుకున్నారని ఆమె వివరించారు. సందర్భంగా మేయర్తో ఈటెస్వామిదాస్ వాగ్వాదానికి దిగారు. కో-ఆప్షన్ సభ్యునిగా ఎన్నికైనా కృష్ణకుమార్, మరికొందరు కల్పించుకుని ఆయనను శాంతింపచేశారు. -
మతం కానివాడ్ని పెళ్లి చేసుకుందని.. మరణ శిక్ష!
-
టీడీపీ- బీజేపీ కూటమిని ఓడించండి
తెలంగాణ క్రైస్తవ సేన పిలుపు హైదరాబాద్: దళిత క్రైస్తవుల విషయంలో మోసపూరితంగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం, బీజేపీల అక్రమ కూటమిని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని తెలంగాణ క్రైస్తవ సేన పిలుపునిచ్చింది. ఓట్ల కోసం దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేరుస్తానని చంద్రబాబు హామీ ఇస్తే.. దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తామని మతతత్వ బీజేపీ పేర్కొందని సేన వ్యవస్థాపక అధ్యక్షుడు నాగళ్ల పోచయ్య పేర్కొన్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ టీడీపీ హామీ ఇచ్చి మోసం చేస్తుండగా.. చట్టసభల్లో దళిత క్రైస్తవుల బిల్లు రాకుండా బీజేపీ అడ్డుకుంటోందని మండిపడ్డారు. తమ విషయంలో కాంగ్రెస్ పార్టీ గోడ మీది పిల్లివాటంగా వ్యవహరిస్తూ 60 ఏళ్లుగా మోసం చేస్తూనే ఉందన్నారు. గిరిజనులకు, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ క్రైస్తవులు, దళిత క్రైస్తవుల గురించి స్పందించకపోవడం విచారకరమన్నారు. -
పొత్తుల కల్లోలం
టీడీపీలో ఆరని జ్వాల సీట్లు కోల్పోనున్నామని తెలుగుతమ్ముళ్ల బెంగ ముస్లిం, క్రిష్టియన్ ఓటర్ల ప్రభావం పడుతుందని ఆవేదన సాక్షి ప్రతినిధి, కడప: ‘కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లు’గా తెలుగుదేశం, బీజేపీ పొత్తు నిలుస్తోంది. భారతీయ జనతా పార్టీతో పొత్తు కారణంగా తెలుగుతమ్ముళ్లు చిర్రెత్తుతున్నారు. అధికారంలోకి వస్తామనే ఊహాల్లో చంద్రబాబు విహరిస్తుంటే, సీట్లు కోల్పోతున్నామనే బెంగతో కొందరు, ఏకంగా రాజకీయ భవిష్యత్తే తెరమరుగవుతున్నదని మరికొందరు మదనపడుతున్నారు. మొత్తంమీద జిల్లా టీడీపీలో అంతర్మధనం తీవ్రతరమైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను అడుగడుగునా తీసుకుంది. వాటిని ఎండగడుతూ ప్రజావిశ్వాసాన్ని చూరగొనాల్సిన ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అధికార పక్షానికి అండగా నిలిచింది. అధికార పార్టీపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడితే విప్ జారీ చేసి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసి అధికారంలో నిలిపిన ఏకైక ప్రతిపక్ష చరిత్రను తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది. నిస్సిగ్గుగా అధికార పార్టీకి అండగా నిలిచిన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు కీర్తి గడించారు. ఇది చాలదన్నట్లు రాష్ట్ర విభజన అంశంలో సైతం తెలుగుదేశం పార్టీ నేల విడిచి సాము చేసింది. ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రధాన ప్రతిపక్షం రెండు కళ్ల సిద్ధాంతంతో వ్యవ హరించి, తెలంగాణకు అనుకూలంగా నిలిచింది. దీంతో ఆపార్టీ పూర్తి స్థాయిలో ప్రజా విశ్వాసం కోల్పోయింది. ఎన్నికలు సమీపించే కొద్దీ రకరకాల జిమ్మిక్కులు ప్రదర్శిస్తూ తనకు తానుగా బలపడ్డాననే భావనను వ్యక్తం చేస్తూ లేని ఊపును తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లు పరిశీలకులు పేర్కొంటున్నారు. రాజకీయంగా కాలం చెల్లిన నేతలను అక్కున చేర్చుకుంటూ బలం పెరిగిందని తనకు తాను సర్టిఫికేట్ ఇచ్చుకున్నట్లు భావిస్తున్నారు. ఈనేపధ్యంలో తాజాగా బీజేపీ పొత్తుతో తెలుగుతమ్ముళ్లు కుదేలవుతున్నారు. శాపంగా మారిన పొత్తు వ్యవహారం.... రాజకీయంగా ఈమారు అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే భావిస్తున్న తెలుగు తమ్ముళ్లకు బీజేపీ పొత్తు శాపంగా పరిగణించిందని పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇరువురి మైత్రిలో భాగంగా కడప, రాజంపేట అసెంబ్లీ, రాజంపేట పార్లమెంటు స్థానాలను బీజేపీ కోరుతోంది. అయితే కడప అసెంబ్లీ, రాజంపేట పార్లమెంటు సీట్లు బీజేపీకి ఖరారైనట్లు తెలుస్తోంది. రాజంపేట అసెంబ్లీ వ్యవహారంలో కొంత ప్రతిష్టంభన నెలకొన్నట్లు సమాచారం. ఆసీటు కూడా తమకే దక్కనుందనే విశ్వాసాన్ని భాజపా శ్రేణులు పేర్కొంటున్నాయి. దీంతో తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రంగా మదనపడుతున్నారు. కడపలో టీడీపీ టికెట్ కోసం ఇంతకాలం మూడు గ్రూపులు, ఆరు వర్గాలుగా పార్టీ నేతలు వ్యవహరించారు. ప్రస్తుతం బీజేపీకి కేటాయించడంపై టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేని పరిస్థితి నెలకొంది. అలాగే టీడీపీ టికెట్ ఆశించి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న మాజీ కాంగ్రెస్ నేత మేడా మల్లికార్జునరెడ్డి పరిస్థితి ‘కుడితిలో పడ్డ ఎలుక’అన్న చందంగా తయారైందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వీరి పరిస్థితి ఇలా ఉంటే ప్రధానంగా జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం నియోజకవర్గాలకు చెందిన నాయకులకు బీజేపీతో పొత్తు మింగుడు పడని వ్యవహారంగా కన్పిస్తోందని పరిశీలకులు పేర్కొంటున్నారు. ఎంతో కొంత పోటీ ఇవ్వగలమనే భావనలో ఉన్న ఆయా ప్రాంతాల నేతలకు ముస్లీం, క్రిష్టియన్ మైనార్టీ ఓట్లను కోల్పోవాల్సి వస్తుందనే అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో గెలుపును ప్రభావితం చేసే స్థితిలో ఆయా వర్గాలు ఉండడమే అందుకు కారణంగా పలువురు చెప్పుకొస్తున్నారు. సీట్లు ప్రకటించడంలో ప్రతిష్టంభన... బీజేపీ పొత్తు కారణంగా ఒక విధమైన బెంగతో వ్యవ హరిస్తున్న తెలుగుదేశం పార్టీ నేతల్లో కొందరికి సీట్ల కేటాయింపులో సైతం మరో రకమైన బెంగ తప్పలేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. టీడీపీ రెండు విడతలుగా జాబితాను ప్రకటిస్తే జిల్లాలో ఐదుగురి పేర్లు మాత్రమే ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడు, ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న మల్లేల లింగారెడ్డి పేరు రెండు జాబితాల్లో లేకపోవడాన్ని ఆయన అనుచరులు జీర్ణించుకోలేకున్నారు. ‘ముందుచొచ్చిన చెవులు కంటే వెనుక వచ్చిన కొమ్ములు వాడి’ అన్నట్లుగా తెలుగుదేశాధీశుని వైఖరి కన్పిస్తున్నదని వారు బహిరంగంగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అదే పరిస్థితి రాయచోటిలో సైతం ఉత్పన్నమైంది. పార్టీకి అండగా నిల్చిన మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు కుటుంబాన్ని కాదని మాజీ ఎమ్మెల్యే రమేష్రెడ్డిని ప్రోత్సహిస్తుండటంతో రగిలిపోతున్నట్లు సమాచారం. అటు పొత్తు ఇటు అధినేత వైఖరితో జిల్లాలోని తెలుగుతమ్ముళ్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. -
పాగా వేద్దాం..!
పాతబస్తీ నుంచి న్యూసిటీలోకి మజ్లిస్ 18 అసెంబ్లీ, మూడు లోక్సభ స్థానాలకు పోటీ బీసీ,ఎస్సీ,క్రిస్టియన్లకు రెండు లోక్సభ, ఐదు అసెంబ్లీ సీట్లు మహిళలకు దక్కని ప్రాధాన్యం సాక్షి,సిటీబ్యూరో: ఇప్పటివరకు పాతబస్తీకే పరిమితమైన మజ్లిస్ పార్టీ ఈసారి గ్రేటర్వ్యాప్తంగా ఎన్నికల బరిలో దిగింది. మొత్తం మూడు లోక్సభ, 18 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈసారి జరుగుతున్న ఎన్నికలు రసవత్తరంగా ఉండడంతో సాధ్యమైనంత వరకు పోటీలో ఉంచింది. ఎస్సీ,బీసీ,మైనార్టీ ఐక్యత పేరుతో లోక్సభ,అసెంబ్లీ సీట్ల కేటాయింపులో ఆయా సామాజికవర్గాలకు తగిన ప్రాధాన్యం కల్పించింది. గ్రేటర్లో మొత్తం 24 నియోజకవర్గాలకుగాను పోటీకి దిగిన 18 స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపగా..అందులో ఐదుస్థానాలను బీసీ,ఎస్సీ,క్రిస్టియన్ మైనార్టీలకు కేటాయించి, మిగిలిన 13 సీట్లలో ముస్లిం మైనార్టీలకు ప్రాధాన్యం కల్పించింది. రెండు లోక్సభ, ఐదు అసెంబ్లీల్లో : మజ్లిస్ పార్టీలో బీసీ,ఎస్సీ,క్రిస్టియన్ మైనార్టీవర్గాలకు రెండు లోక్సభ, ఐదు అసెంబ్లీసీట్లు దక్కాయి. సికింద్రాబాద్ లోక్సభ నుంచి దళితుడైన నార్ల మోహన్రావు, మల్కాజిగిరి లోక్సభకు వెనుకబడిన తరగతులకు చెందిన దివాకర్ ధరణికోటలకు అవకాశం కల్పించింది. అంబర్పేట, ఉప్పల్ నియోజకవర్గాల నుంచి దళితులైన నలిగంటి శరత్, యుగేందర్లకు అవకాశం దక్కగా, జూబ్లీహిల్స్ స్థానానికి చిన్నశ్రీశైలంయాదవ్ కుమారుడైన నవీన్యాదవ్, మల్కాజిగిరి సీటు ధరణికోట సుధాకర్కు కేటాయింపుతో బీసీలకు ప్రాధాన్యం కల్పించినట్లయ్యింది. అలాగే సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి క్రిస్టియన్ మైనార్టీవర్గానికి చెందిన జెమ్స్సిల్వెస్టర్కు అవకాశం కల్పించారు. ఐదుగురు సిట్టింగులే : నగరంలో మజ్లిస్ పార్టీ తరఫున ఒక ఎంపీ, ఐదుగురు ఎమ్మెల్యేలు తిరిగి సిట్టింగ్ స్థానాల నుంచే నామినేషన్ల దాఖలు చేశారు. అదేవిధంగా జీహెచ్ఎంసీ కార్పొరేటర్తోపాటు మరో కార్పొరేటర్ భర్త అసెంబ్లీస్థానాలకు, మరో మాజీకార్పొరేటర్ భర్త లోక్సభ నుంచి పోటీలో ఉన్నారు. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి రెండుసార్లు ప్రాతినిధ్యం వహించిన అసదుద్దీన్ ఒవైసీ మళ్లీ బరిలో దిగారు. చాంద్రాయణగుట్ట నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ, చార్మినార్ నుంచి పాషాఖాద్రీ, మలక్పేట నుంచి అహ్మద్బలాల, యాకుత్పురా నుంచి ముంతాజ్ఖాన్, బహుదూర్పురా నుంచి మోజంఖాన్లు మరోమారు అదృష్టం పరీక్షించుకోనున్నారు. మరో రెండు సిట్టింగ్ స్థానాలైన కార్వాన్ నుంచి కార్పొరేటర భర్త కౌసర్ మొయినోద్దీన్, నాంపల్లి నుంచి డిప్యూటీ మాజీమేయర్, కార్పొరేటర్ జాఫర్హుస్సేన్ మేరాజ్లు తలపడుతున్నారు. సాధారణ కార్యకర్తలకే : ఈసారి ఎన్నికల్లో పార్టీ సాధారణ కార్యకర్తలకు కూడా అవకాశం కల్పించింది. సిట్టింగ్ స్థానాలను వదిలి మిగిలిన లోక్సభ,అసెంబ్లీ స్థానాలకు కొత్తవారినే బరిలోకి దించింది. శేరిలింగంపల్లి నుంచి నజీర్ఖాన్, పటాన్చెరు నుంచి సయ్యద్హ్రమత్, కుత్బుల్లాపుర్ నుంచి మహ్మద్గౌసోద్దీన్, మహేశ్వరం నుంచి షేక్అహ్మద్, ముషీరాబాద్ నుంచి ఖాసీంషాహీన్, రాజేంద్రనగర్ నుంచి జాకీర్ హుస్సేన్జావిద్లకు అవకాశం దక్కింది. ఇప్పటివరకు ఉన్న స్థానాలతోపాటు ఈసారి కొత్తగా సీట్లను కైవసం చేసుకునేందుకు పార్టీ శ్రేణులు సమాయత్తమవుతున్నారు. -
న్యాయవాది తీరుపై క్రైస్తవ ప్రచారకుల ఆందోళన
ప్రత్తిపాడు, న్యూస్లైన్ :న్యాయవాది తీరుకు నిరసనగా ప్రత్తిపాడులో క్రైస్తవ ప్రచారకులు, సంఘ సభ్యులు, ప్రజలు ఆదివారం ఆందోళన చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి. సెయింట్ జోసెఫ్స్ ఆస్పత్రి ఆవరణలో హెచ్ఐవీ బాధిత చిన్నారులకు వసతి గృహంగా వినియోగిస్తున్న భవనాన్ని మూసేస్తూ స్థానిక న్యాయవాది జనిపల్లి ప్రసాద్బాబు బహుళ అంతస్తుల నిర్మాణం చేపట్టారు. ఇరువర్గాలకు మందడి స్థలాన్ని న్యాయవాది ఆక్రమించాడని క్రైస్తవ ప్రచారకులు ఆరోపిస్తున్నారు. వసతి గృహం కిటికీలు మూతపడడమే కాకుండా న్యాయవాది భవనంలోని వాడకం నీరు వసతిగృహంలోకి వస్తుందన్నారు. ఆక్రమణలు తొలగించాలని కోరిన తమను అసభ్యపదజాలంతో దూషించిన న్యాయవాదిపై చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి మదర్ సుపీరియర్ శోభ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 70 ఏళ్లుగా సేవలు అందిస్తున్న ఆస్పత్రి సిస్టర్స్ను, శోభను దూషించడం దారుణమని ఆర్సీఎం చర్చి కమిటీ సభ్యులు విమర్శించారు. చర్చి కమిటి అధ్యక్షుడు బి. మధుబాబు, ఉపాధ్యక్షుడు డేగల వసంత్, కార్యదర్శి ఎన్. బులిబాబు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు కడుగుల నూకరాజు, మాజీ వార్డు సభ్యుడు కాకర ప్రకాష్, కిర్లంపూడి ఆర్సీఎం చర్చి సంఘ సభ్యులు బాతు అప్పారావు, బులిపే గోపి, కాకర రాజు తదితరులు న్యాయవాది ఇంటి వద్ద రహదారిపై రాస్తారోకో చేశారు. రెండు గంటల పాటు ఈఆందోళన కొనసాగింది. తాను ఆక్రమణలకు పాల్పడలేదని న్యాయవాది ప్రసాద్బాబు చెబుతున్నారు. ప్రత్తిపాడు సీఐ టి. రామ్మోహన్రెడ్డి ఇరువర్గాలతో స్థానిక పోలీస్ స్టేషన్లో జరిపిన చర్చలు విఫలం కావడంతో చర్చి కమిటీ సభ్యులు, గ్రామస్తులు ధర్నా కొనసాగించారు. సమస్య పరిష్కారం అయ్యేవరకూ ఆందోళన సాగుతుందని స్పష్టం చేశారు. కాగా ఇరు వర్గాల పరస్పర ఫిర్యాదులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. -
కరుణామయుడు
-
మలబారులో తెలుగు వెలుగులు
ఒక ప్రాంత సంస్కృతి గురించి తెలుసుకోవాలంటే అక్కడ విహారయాత్రలు చేయనక్కర్లేదు.. ఒక ప్రాంత జీవనశైలిని అర్థం చేసుకోవాలంటే వారితో కలిసి జీవించనక్కర్లేదు.. అధ్యయనం ద్వారా మరో ప్రాంత సంస్కృతీ సంప్రదాయాల గురించి చాలా సులభంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదే ఆలోచనతో తమ కళాశాల విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు కాలికట్లోని మలబార్ క్రిస్టియన్ కాలేజీ వాళ్లు. ప్రత్యేకించి తెలుగు వారి జీవన శైలి గురించి, తెలుగు సంస్కృతి గురించి, ఈ సంస్కృతిలోని ప్రముఖ వ్యక్తుల గురించిన వివరాలను అందించేందుకు ఈ ప్రదర్శన నిర్వహించారు. ఇటీవలే ఈ కార్యక్రమం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలను ఆ కాలేజీ చరిత్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ వశిష్ట్ అందించారు. తాము ప్రతియేటా తమకళాశాల విద్యార్థుల కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటామని ఆయన తెలిపారు. తెలుగు సినిమా, తెలుగు సంస్కృతుల గురించి ప్రత్యేకమైన ఆసక్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. 2007 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రతియేటా నిర్వహిస్తున్నామన్నారు. తెలుగు భాష గురించి, తెలుగు సినిమా గురించి ఆసక్తితో ఉన్న విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారని ఆయన తెలిపారు. దాదాపు 1,200 మంది స్ట్రెంగ్త్ ఉన్న తమ కాలేజీలో ఈ కార్యక్రమానికి మంచిస్పందన వచ్చిందని ఆయన వివరించారు. ప్రత్యేకించి కేరళ యువతలో తెలుగు సినిమా గురించి విపరీతమైన ఆసక్తి ఉందని, అనేక తెలుగు సినిమాలు మలయాళంలోకి డబ్బింగ్ అవుతున్నాయని వశిష్ట్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రదర్శన నిర్వహించడం తెలుగు సినిమాలపై ఆసక్తి ఉన్న యువతకు ఆకర్షణీయంగా మారిందన్నారు. సినిమాల ద్వారా జాతీయ సమగ్రతను చాటడానికి, తెలుగు సంస్కృతిపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతోందని వశిష్ట్ పేర్కొన్నారు. ఈ ఏడాది నిర్వహించిన కార్యక్రమానికి ’ది లెజెండ్స్ ఆఫ్ తెలుగు సినిమా’ అని పేరుపెట్టుకొన్నామని, ఈ కార్యక్రమాన్ని ఇటీవలి కాలంలోనే రెండుసార్లు నిర్వహించామని తెలిపారు. దీనిపై మంచి స్పందన వచ్చిందని, విద్యార్థులతో పాటు బయటి వాళ్లు కూడా ప్రదర్శనను చూడటానికి వచ్చారని ఆయన తెలిపారు. తెలుగు సినిమా ప్రముఖులు, వారి సినిమా బయోగ్రఫీ, తెలుగు వార్తాపత్రికలు, ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ ప్రాంతాలకు సంబంధించిన ఫోటోలను ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో తెలుగు వారి మనస్సాక్షి ’సాక్షి’కి ప్రముఖ స్థానం దక్కింది. ఐదేళ్ల ప్రస్థానం పూర్తి చేసుకొన్న సాక్షిని ప్రతిష్టాత్మక పత్రికగా అభివర్ణిస్తూ నిర్వాహకులు ప్రదర్శనలో స్థానమిచ్చారు. -
వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి బెరుుల్ మంజూరు
‘ప్రజలకిచ్చిన మాట కోసం.. తండ్రి ఆశయ సాధన కోసం.. ఎన్ని కష్టాలెదురైనా వెనుదిరగని జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సచ్చీలత రుజువైంది. ఎవరెన్ని కుట్రలు పన్నినా.. ఎన్ని కుతంత్రాలు చేసినా.. ధర్మ పీఠం ముందు నిలబడవని మరోసారి రుజువైంది. కోట్లాది ప్రజల అభిమానం.. ఎందరో ఆత్మీయుల దీవెనల ఫలితంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి బెయిల్ మంజూరైంది. మా రాజన్న బిడ్డ మా మధ్యకు ఎప్పుడొస్తాడా అని ఎదురుచూస్తున్న మాకు కోర్టు తీర్పుతో పండగొచ్చింది’ ‘పశ్చిమ’ ప్రజలు ఉద్వేగంతో చెప్పిన మాటలివి. వైఎస్ జగన్మోహన్రెడ్డికి బెరుుల్ మంజూరైందన్న విషయం తెలియగానే పట్టరాని సంతోషంతా జనమంతా రోడ్లపైకి వచ్చారు. సంబరాలు చేసుకున్నారు. ఇన్నాళ్లూ ఆవేదనతో కన్నీరొలికిన వారి కళ్లు ఆనంద బాష్పాలతో తడిశాయి. ‘జయహో జగన్’ నినాదాల నడుమ ఊరూవాడా సంబరాలు మిన్నంటాయి. సాక్షి, ఏలూరు : జననేత.. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి బెరుుల్ మంజూరైన విష యం తెలియగానే జిల్లా ప్రజలంతా రోడ్లపైకి వచ్చారు. ఆనందోత్సాహాలతో నృత్యాలు చేశారు. బాణసంచా కాల్చారు. స్వీట్లు పం చారు. వాహనాల్లో వెళుతున్న వారు సైతం ఎక్కడికక్కడ ప్రజలతో కలిసి పండగ చేసుకున్నారు. న్యాయమే గెలిచిందంటూ నినాదాలు చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి బెయిల్ పిటీషన్పై తీర్పు వెలువడనుందన్న సమాచారంతో సోమవారం ఉదయం ఆయన అభిమానులు పలు ప్రాంతాల్లో పూజలు చేశారు. తాడేపల్లిగూడెం గ్రామదేవత బలుసులమ్మకు పానకాలు పోశారు. కుల, మతాలకు అతీతంగా హిందూ, ముస్లిం, క్రైస్తవులు పూజలు, ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. పెదపాడు మండలం అప్పనవీడులో అభయాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేయించారు. మధ్యాహ్నం నుంచి ప్రజలు టీవీ లకు అతుక్కుపోయారు. అనుక్షణం ఉత్కంఠకు లోనయ్యారు. సాయంత్రం 5 గంటల సమయంలో ఆయనకు బెయిల్ మంజూరైందన సమాచారం తెలుసుకుని హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ నాయకుల ఇళ్లవద్ద పం డగ వాతావరణం నెలకొంది. వైసీపీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు జీలుగుమిల్లి జగదాంబ ఆలయంలో కుంకుమ పూజలు నిర్వహించారు. బెయిల్ సమాచారం తెలియగానే నాయకులు ఒకొరినొకరు అలిం గనం చేసుకుని సంతోషం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ మేకా శేషుబాబు పాలకొల్లు గాంధీబొమ్మల సెంటర్లో కేక్కట్ చేసి కార్యకర్తలు, అభిమానులకు పంచారు. వైఎస్ నిలువెత్తు విగ్రహానికి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అల్లు వెంకట సత్యనారాయణ, నాయకులు గుణ్ణం నాగబాబు, ముచ్చర్ల శ్రీరామ్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మోటార్ సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. నరసాపురం పట్టణం బాణసంచా కాల్పులతో దద్దరిల్లిపోయింది. వేలాది మంది బస్టాండ్ సెంటర్కు చేరుకుని వేడుక చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజును అభినందలతో ముంచెత్తారు. భుజాలపై ఎత్తుకుని ఊరేగించారు. భీమవరం పట్టణంలో పెద్దఎత్తున వేడుకలు చేశారు. పార్టీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వచ్చీపోయేవారికి స్వీట్లు పంచిపెట్టి ఆనందం పంచుకున్నారు. ఆచంటలో మాజీ ఎమ్మెల్యే మోచర్ల జోహార్వతి ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నిడదవోలు నియోజకవర్గ సమన్వయకర్త రాజీవ్కృష్ణ ఆధ్వర్యంలో గణేష్ చౌక్లో స్వీట్లు పంచి, మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సమిశ్రగూడెంలో ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన, ముస్లిం యూత్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, పెండ్యాల లో బాణా సంచా కాలుస్తూ భారీ ర్యాలీ చేశారు. బసివిరెడ్డి పేటలో వైఎస్సార్ సీపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు మేడపాటి లక్ష్మీనారాయణ రెడ్డి అధ్వర్యంలో కేక్కట్ చేశారు. ఉండ్రాజవరం మండలం పాలంగిలో జిల్లా కార్యవర్గ సభ్యుడు బసవ గణేష్ స్వీట్లు పంచారు. జంగారెడ్డిగూడెంలో వైసీపీ శ్రేణులు బాణా సంచా కాల్చి, స్వీట్లు పంచారు. వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేశారు. షిర్డీసాయిఆలయంలో పూజలు నిర్వహించారు. ఉంగుటూరు నియోజకవర్గ కన్వీనర్ పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో నిడమర్రు, గణపవరంలో భారీగా సంబరాలు చేశారు. వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. కొవ్వూరులో మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ మెరకవీధిలో, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు పరిమిహరిచరణ్ మెయిన్ రోడ్డులో వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి, కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. వీరవాసరంలో జాతీయ రహదారి 216పై వెళ్లే ప్రయాణికులకు, వాహనచోదకులకు స్వీట్లు పంచారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్ తోట గోపి ఆధ్వర్యంలో పోలీస్ ఐలండ్ వద్ద సంబరాలు చేశారు. వచ్చీపోయేవారికి మిఠాయిలు పంచారు. భారీ ఎత్తున బాణా సంచా కాల్చి, బైక్ ర్యాలీ చేశారు. సమైక్య ఉద్యమానికి దేవుడిచ్చిన రథసారథి జగన్ సాక్షి, ఏలూరు : సమైక్యాంధ్ర ఉద్యమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని దేవుడిచ్చిన రథసారథి అని ఆ పార్టీ జిల్లా కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అభివర్ణించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి సోమవారం బెయిల్ మంజూరైన సందర్భంగా బాలరాజు అమితానందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యాయం, ధర్మం రెండూ వైఎస్ జగన్వైపే ఉన్నాయన్నారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీ వీధుల్లో తిరుగుతూ వైఎస్ జగన్కు బెయిల్ రాకుండా అడ్డుకోవడానికి ఎన్ని కుట్రలు పన్నినా చివరకు న్యాయమే గెలిచిందన్నారు. రాష్ట్ర ప్రజలు సరైన నాయకుడి కోసం ఎదురుచూస్తున్న తరుణంలో వైఎస్ జగన్ బయటకు రావడంతో సమైక్య ఉద్యమం మరింత ఉధృతం కానుందన్నారు. ఆయనకు బెయిల్ వచ్చిందనే వార్త సర్వమత వేడుక అని, రాష్ట్రంనుంచి ఇక అంగుళం కూడా ముక్కలవదని బాలరాజు పేర్కొన్నారు. -
జగన్ కోలుకోవాలని క్రైస్తవుల ప్రార్థనలు
వర్సోవ, న్యూస్లైన్: సమైక్యాంధ్ర కోసం దీక్షబూనిన వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆరోగ్యం వెంటనే కుదుట పడాలని కోరుతూ ‘పాట్నర్స్ ఆఫ్ బైబిల్ గాస్పెల్ మినిస్ట్రీస్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అంధేరి పశ్చిమంలోని వర్సోవ ప్రాంతంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫౌండర్ అధ్యక్షులు రెవ. జయరాజు, సంఘం పెద్దలు ప్రార్థనల్లో పాల్గొన్నారు. ‘వైఎస్ఆర్ కుటుంబం చీకటిలో దీపంలా సమాజానికి వెలుగులు పంచింది’’ అని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమానికి డానియేలు, హిజయన్న, జి.లింగన్న, శాంతి రాజు, జి.ఇసాకు, జి.ఏసయ్య, పి.ఇమ్మాన్యుయేలు తదితరులు పాల్గొన్నారు.