darren sammy
-
వెస్టిండీస్ ఆల్ ఫార్మాట్ హెడ్ కోచ్గా వరల్డ్కప్ విన్నర్..
వెస్టిండీస్ క్రికెట్ జట్టు ఆల్ ఫార్మాట్ హెడ్ కోచ్గా ఆ జట్టు మాజీ కెప్టెన్ డారెన్ సామీ ఎంపికయ్యాడు. మంగళవారం సెయింట్ విన్సెంట్లో జరిగిన విలేకరుల సమావేశంలో వెస్టిండీస్ (CWI) క్రికెట్ మైల్స్ డైరెక్టర్ బాస్కోంబ్ ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం విండీస్ వైట్ బాల్ హెడ్ కోచ్గా సామీ.. ఏప్రిల్ 1, 2025 నుంచి టెస్టు జట్టు ప్రధాన కోచ్ బాధ్యతలు స్వీకరించనున్నాడు. ప్రస్తుత హెడ్ కోచ్ ఆండ్రీ కోలీ స్ధానాన్ని సామీ భర్తీ చేయనున్నాడు. ఆండ్రీ కోలీ కాంట్రాక్ట్ వచ్చే ఏడాది మార్చితో ముగయనుంది.కాగా సామీ సారథ్యంలోనే రెండు టీ20 వరల్డ్కప్(2012, 2016)లను వెస్టిండీస్ క్రికెట్ జట్టు సొంతం చేసుకుంది. కాగా వన్డే ప్రపంచకప్-2023కు ఆర్హత సాధించికపోవడంతో వెస్టిండీస్ క్రికెట్పై విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో విండీస్ క్రికెట్ బోర్డు సామీని తమ జట్టు వైట్బాల్ హెడ్ కోచ్గా నియమించింది. విండీస్ వైట్బాల్ హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టిన తమ జట్టుకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అతడి నేతృత్వంలో విండీస్ మెరుగైన ఫలితాలు సాధిస్తోంది.చదవండి: శెభాష్.. గండం నుంచి గట్టెక్కించారు! మీరే నయం -
T20 World Cup 2024: పూర్వ వైభవం దిశగా వెస్టిండీస్
ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన వెస్టిండీస్ వరుస విజయలతో దూసుకుపోతుంది. ఈ ఎడిషన్లో కరీబియన్ టీమ్ పపువా న్యూ గినియా, ఉగాండ, తాజాగా న్యూజిలాండ్పై ఘన విజయాలు సాధించి గ్రూప్-సి నుంచి సూపర్-8కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది.ఈ టోర్నీలో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన విండీస్.. హ్యాట్రిక్ విజయాలు సాధించి టైటిల్ ఫేవరెట్లలో ముందు వరుసలో నిలిచింది. ఈ టోర్నీకి ముందు విండీస్ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. జట్టులో అందరూ విధ్వంసకర వీరులే అయినప్పటికీ, ఆ జట్టు 2023 వన్డే వరల్డ్కప్కు, 2022 టీ20 వరల్డ్కప్కు అర్హత సాధించలేకపోయింది.ప్రస్తుత ప్రపంచకప్లో విండీస్ మెరుపు ప్రదర్శనల వెనక ఆ జట్టు కోచ్ డారెన్ సామీ కీలకపాత్ర పోషిస్తున్నాడు. రెండు సార్లు (2012, 2016) విండీస్ను ప్రపంచ ఛాంపియన్గా నిలిపిన సామీ.. ప్రస్తుత వరల్డ్కప్లో కోచ్గా తన మార్కును చూపిస్తున్నాడు. సామీ ఆధ్వర్యంలో విండీస్ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తుంది. స్వదేశంలో ఆడుతుండటం విండీస్కు అదనంగా కలిసొస్తుంది.ఇదిలా ఉంటే, సూపర్-8కు ఇదివరకే అర్హత సాధించిన వెస్టిండీస్ గ్రూప్ దశలో తమ తదుపరి మ్యాచ్ను జూన్ 19న ఆడనుంది. సెయింట్ లూసియా వేదికగా జరిగే ఆ మ్యాచ్లో కరీబియన్ టీమ్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడనుంది. సూపర్-8 రెండో మ్యాచ్లో వెస్టిండీస్.. సౌతాఫ్రికాను ఢీకొంటుంది. -
పాకిస్తాన్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా ఆసీస్ దిగ్గజం..?
పాకిస్తాన్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా ఆసీస్ దిగ్గజ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ ఎంపిక కానున్నాడని తెలుస్తుంది. ఈ విషయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వాట్సన్తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. వాట్సన్ సమాధానం కోసం పీసీబీ ఎదురు చూస్తున్నట్లు నివేదికలు ద్వారా తెలుస్తుంది. వాట్సన్ త్వరలోనే పీసీబీ అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వి కలుస్తాడని సమాచారం. ప్రస్తుతం వాట్సన్ పాకిస్తాన్ సూపర్ లీగ్ ఫ్రాంచైజీ అయిన క్వెట్టా గ్లాడియేటర్స్కు కోచ్గా వ్యవహరిస్తున్నాడు. పీసీబీ ప్రతిపాదనకు వాట్సన్ నో చెప్పినా వారి వద్ద ప్రత్యామ్నాయ ఆప్షన్ ఉన్నట్లు సమాచారం. పీసీబీ అధికారుల దృష్టిలో విండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామి ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో సామి పీఎస్ఎల్ ఫ్రాంచైజీ పెషావర్ జల్మీకి కెప్టెన్గా వ్యవహరించి ఉండటంతో అతనికి పాక్లో భారీ క్రేజ్ ఉంది. పాక్ హెచ్ కోచ్ పదవికి వాట్సన్ నో చెబితే పీసీబీ సామినే కోచ్గా ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. కాగా, పాకిస్తాన్ టీమ్ డైరెక్టర్గా మొహమ్మద్ హఫీజ్ తొలగించబడినప్పటి నుంచి పాక్ జట్టు కోచ్ లేకుండానే ఉంది. 2023 వన్డే ప్రపంచకప్లో పేలవ ప్రదర్శన అనంతరం పీసీబీ నాటి విదేశీ కోచింగ్ సిబ్బంది మొత్తాన్ని తొలగించింది. ప్రస్తుతం పాకిస్తాన్లో పీఎస్ఎల్ సీజన్ నడుస్తుంది. ఈ లీగ్ చివరి దశకు చేరింది. లీగ్ దశలో మరో నాలుగు మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ సీజన్లో అద్భుత ప్రదర్శన చేస్తున్న ముల్తాన్ సుల్తాన్స్, పెషావర్ జల్మీ నాకౌట్ దశకు క్వాలిఫై అయ్యాయి. లాహోర్ ఖలందర్స్ లీగ్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. -
WC 2024: ఈసారి ప్రపంచకప్ వెస్టిండీస్దే: డారెన్ సామీ
టీ20 ప్రపంచకప్-2024 టైటిల్ గెలిచేది తమ జట్టేనని వెస్టిండీస్ మాజీ కెప్టెన్, పరిమిత ఓవర్ల ప్రస్తుత కోచ్ డారెన్ సామీ అన్నాడు. సొంతగడ్డపై పొట్టి ప్రపంచకప్ గెలిచిన తొలి జట్టుగా నిలుస్తామని ధీమా వ్యక్తం చేశాడు. గతేడాది తాము టీ20 ఫార్మాట్లో అద్భుత విజయాలు సాధించామని.. ఆ జోరును అలాగే కొనసాగించి విశ్వవిజేతలుగా నిలుస్తామని పేర్కొన్నాడు. కాగా అత్యధికంగా రెండుసార్లు టీ20 వరల్డ్కప్(2012,2016) గెలిచిన ఘనత వెస్టిండీస్ సొంతం. కానీ.. గత ఐసీసీ ఈవెంట్లలో దారుణ ప్రదర్శనతో విమర్శల పాలైంది . టీ20 ప్రపంచకప్-2022, వన్డే వరల్డ్కప్-2023లో గ్రూప్ స్టేజ్ కూడా దాటకుండానే నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో ప్రక్షాళన చర్యలు చేపట్టిన విండీస్ బోర్డు డారెన్ సామీకి కోచ్గా బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలో అనూహ్య రీతిలో పుంజుకున్న వెస్టిండీస్ గతేడాది వరుస టీ20 సిరీస్లు గెలిచింది. సౌతాఫ్రికా(2-1), టీమిండియా(3-2), ఇంగ్లండ్ (3-2)లను చిత్తు చేసింది. తాజాగా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్లో తలపడుతోంది. డారెన్ సామీ (PC: WC) ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్కు ముందుకు డారెన్ సామీ మాట్లాడుతూ.. ‘‘గతేడాది మా జట్టు అద్భుతమైన పురోగతి సాధించింది. 2023లో మేము ఒక్క టీ20 సిరీస్ కూడా ఓడిపోలేదు. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. జైత్రయాత్రను కొనసాగించాలని భావిస్తున్నాం. సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్ గెలిచే తొలి జట్టు మాదే అవుతుందని పూర్తి విశ్వాసంతో ఉన్నాం’’ అని పేర్కొన్నాడు. అదే విధంగా.. తమ జట్టులోని చాలా మంది ఆటగాళ్లు ఐపీఎల్ సహా ప్రపంచవ్యాప్తంగా ఇతర లీగ్లలో సత్తా చాటుతున్న విషయాన్ని డారెన్ సామీ ఈ సందర్భంగా గుర్తుచేశాడు. కాగా ఈ ఏడాది జూన్లో జరుగనున్న ప్రపంచకప్-2024 ఈవెంట్కు యూఎస్ఏతో కలిసి వెస్టిండీస్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఆస్ట్రేలియాతో సిరీస్కు వెస్టిండీస్ టీ20 జట్టు: రోవ్మన్ పావెల్ (కెప్టెన్), షాయీ హోప్, జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, జాసన్ హోల్డర్, అకీల్ హొసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడకేష్ మోటి, నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్, షెర్ఫాన్ రూథర్ఫర్డ్, రొమారియో షెపర్డ్, ఒషానే థామస్. చదవండి: విభేదాలు ఉంటేనేం.. తను నా రక్తం.. మిస్సవుతున్నా: షమీ భావోద్వేగం -
WC: 2012లో వెస్టిండీస్ అలా.. 2022లో పాకిస్తాన్ ఇలా! విండీస్ గెలిస్తే.. పాక్ మాత్రం
T20 World Cup: 2012 Winner West Indies- 2022 Winner England: వరల్డ్కప్ ఫైనల్ ఈసారి ‘టై’ కాలేదు... సూపర్ ఓవర్లు కూడా సమం కాలేదు... క్రీడా స్ఫూర్తిని ప్రశ్నించడానికి, సగం గెలుపు అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేయడానికి ఇంగ్లండ్ అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు అలాంటి చర్చే రాకుండా అద్భుత ఆటతో అందరికంటే శిఖరాన నిలిచింది. టోర్నీ ఆరంభంలో వర్షం తమ అవకాశాలను దెబ్బకొట్టినా, ఒక్కసారిగా పుంజుకొని మ్యాచ్లు వానపాలైన వేదికపైనే విశ్వ విజేతగా ఆవిర్భవించింది. వన్డే, టి20 వరల్డ్కప్లు రెండూ ఒకే సమయంలో తమ వద్ద కలిగి ఉన్న తొలి జట్టుగా చరిత్రకెక్కింది. మూడేళ్ల క్రితం వన్డే వరల్డ్కప్ గెలిచినా వివాదం వెంట తీసుకొచ్చి ఆనందం కాస్త మసకబారగా... అంతకుముందే ఆరేళ్ల క్రితం టి20 వరల్డ్కప్ ఆఖరి మెట్టుపై అనూహ్య రీతిలో ఓడింది. వాటిని మరిచేలా తాజా విజయం పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇంగ్లండ్ ఆధిపత్యాన్ని చూపించింది. వరల్డ్కప్ ఫైనల్ పోరులో 8 ఫోర్లు, 2 సిక్సర్లు... తొలుత బ్యాటింగ్ చేస్తూ.. పాకిస్తాన్ చూపిన పేలవ బ్యాటింగ్ ఇది... టి20ల్లో చివరి నాలుగు ఓవర్లంటే బౌలర్లకు డెత్ ఓవర్లు! కానీ పాక్ దానిని రివర్స్గా మార్చింది. ఆఖరి 4 ఓవర్లలో కనీసం 40 పరుగులు చేస్తే విజయంపై ఆశలు ఉంచుకోగలిగే చోట 18 పరుగులకే పరిమితమైంది. ముగింపు స్కోరుతోనే పాక్ ఓటమికి పునాది పడింది. టోర్నీ ఆసాంతం చెలరేగిన స్యామ్ కరన్ బౌలింగ్ పదును ముందు పాక్ తేలిపోయింది. 2012 ఫైనల్లో కూడా విండీస్ 137 పరుగులే చేసి విజేతగా నిలిచిన తీరు గుర్తుకొచ్చిందేమో... పాక్లో కాస్త ఆశలు పెరిగాయి! పైగా తొలి ఓవర్లోనే హేల్స్ అవుట్ కావడం, మెల్బోర్న్ మైదానం మొత్తం హోరెత్తిపోవడం ఆ జట్టును మరింత ఉత్సాహపరచింది. మధ్య ఓవర్లలో ప్రత్యర్థిని పాక్ కట్టడి కూడా చేయగలిగింది కూడా. అయితే పాక్ ఆశించినట్లుగా 1992 పునరావృతం కాలేదు. బెన్ స్టోక్స్ వారి ఆశలపై నీళ్లు చల్లాడు. 43 మ్యాచ్ల టి20 కెరీర్లో తన తొలి అర్ధసెంచరీ చేసేందుకు అతను సరైన సమయాన్ని ఎంచుకున్నట్లున్నాడు. చివరి వరకూ నిలబడి మరోసారి తన చేతుల మీదుగా ఇంగ్లండ్ను వరల్డ్కప్ చాంపియన్గా నిలిపాడు. 2012లో వెస్టిండీస్ అలా విజేతగా.. శ్రీలంక వేదికగా కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో టీ20 ప్రపంచకప్-2012 ఫైనల్లో వెస్టిండీస్ ఆతిథ్య శ్రీలంకతో తలపడింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు ఆరంభంలోనే ఓపెనర్లు జాన్సన్ చార్ల్స్(0), క్రిస్ గేల్ (3) వికెట్లు కోల్పోయినా.. వన్డౌన్ బ్యాటర్ మార్లన్ సామ్యూల్స్ 56 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 78 పరుగులు సాధించాడు. మిగిలిన వాళ్లలో డ్వేన్ బ్రావో 19, కెప్టెన్ డారెన్ సామీ 26(నాటౌట్) పరుగులు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి సామీ బృందం 137 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంకకు ఓపెనర్ మహేల జయవర్దనే 33 పరుగులతో శుభారంభం అందించగా.. మరో ఓపెనర్ తిలకరత్నె దిల్షాన్ డకౌట్ అయ్యాడు. వన్డౌన్లో వచ్చిన కుమార్ సంగక్కర 22 పరుగులు చేయగా.. నువాన్ కులశేఖర 26 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాటర్ల స్కోరు కనీసం ఐదు పరుగులు కూడా దాటకుండా విండీస్ బౌలర్లు కట్టడి చేశారు. దీంతో18.4 ఓవర్లలో 101 పరుగులకే లంక ఆలౌట్ అయింది. నాడు అదరగొట్టిన విండీస్ బౌలర్లు వెస్టిండీస్ బౌలర్లలో సునిల్ నరైన్ 3.4 ఓవర్లలో 9 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు కూల్చగా.. సామీ రెండు ఓవర్లలో 6 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. సామ్యూల్ బద్రీకి ఒకటి, రవి రాంపాల్కు ఒకటి, మార్లన్ సామ్యూల్స్కు ఒక వికెట్ దక్కాయి. ఆల్రౌండ్ ప్రతిభతో మార్లన్ సామ్యూల్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. 2022లో ఇంగ్లండ్ చేతిలో పాకిస్తాన్ ఇలా టి20 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్తో మ్యాచ్లో ఆదివారం మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. షాన్ మసూద్ (28 బంతుల్లో 38; 2 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా, కెప్టెన్ బాబర్ ఆజమ్ (28 బంతుల్లో 32; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్యామ్ కరన్ (3/12) పాక్ను పడగొట్టగా... ఆదిల్ రషీద్, జోర్డాన్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం ఇంగ్లండ్ 19 ఓవర్లలో 5 వికెట్లకు 138 పరుగులు చేసి గెలిచింది. బెన్ స్టోక్స్ (49 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో చివరి వరకు నిలిచి జట్టును గెలిపించాడు. 6 మ్యాచ్లలో 11.38 సగటు, 6.52 ఎకానమీతో 13 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ టైటిల్ విజయంలో కీలకపాత్ర పోషించిన స్యామ్ కరన్ ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా కూడా నిలిచాడు. అంతా విఫలం... ఓపెనర్లు బాబర్, రిజ్వాన్ (15) పాక్కు దూకుడైన ఆరంభం ఇవ్వడంలో విఫలమయ్యారు. తొలి నాలుగు ఓవర్లలో ఆ జట్టు ఒకే ఒక బౌండరీ (సిక్స్) కొట్టగా, తర్వాతి ఓవర్లో రిజ్వాన్ వెనుదిరిగాడు. పవర్ప్లేలో స్కోరు 39 పరుగులకు చేరింది. ధాటిగా ఆడగల హారిస్ (8)ను రషీద్ తన తొలి బంతికే అవుట్ చేయగా, 10 ఓవర్లు ముగిసేసరికి జట్టు 68 పరుగులు చేసింది. ఇందులో మూడు ఫోర్లే ఉన్నాయి! లివింగ్స్టోన్ ఓవర్లో 4, 6తో మసూద్ జోరును పెంచే ప్రయత్నం చేయగా, బాబర్ను చక్కటి రిటర్న్ క్యాచ్తో అవుట్ చేసి రషీద్ మళ్లీ దెబ్బ కొట్టాడు. ఇఫ్తికార్ (0) కూడా చేతులెత్తేయడంతో పాక్ కష్టాలు మరింత పెరిగాయి. ఇంగ్లండ్ పదునైన బౌలింగ్లో తీవ్రంగా ఇబ్బంది పడిన పాక్ బ్యాటర్లు భారీ షాట్లు ఆడటంలో పూర్తిగా విఫలమయ్యారు. డెత్ ఓవర్లలో జట్టు పరిస్థితి మరీ ఘోరంగా కనిపించింది. చివరి 4 ఓవర్లలో పాక్ కేవలం 18 పరుగులు మాత్రమే జోడించి ఓవర్కు ఒక వికెట్ చొప్పున 4 వికెట్లు కోల్పోయింది. దాంతో కనీస స్కోరును కూడా సాధించలేక పాక్ ఇన్నింగ్స్ ముగించింది. హేల్స్ విఫలం... ఛేదనలో ఇంగ్లండ్ కూడా గొప్పగా ఆడలేదు. అయితే లక్ష్యం బాగా చిన్నది కావడంతో జాగ్రత్తగా, తగిన ప్రణాళికతో ఆ జట్టు విజయాన్నందుకుంది. తొలి ఓవర్లోనే ప్రమాదకరమైన హేల్స్ (1)ను షాహిన్ అఫ్రిది అవుట్ చేయగా, జోస్ బట్లర్ (17 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్) ఇన్నింగ్స్ను నడిపించాడు. ఆపై నసీమ్ తొలి ఓవర్లోనే ఇంగ్లండ్ మూడు ఫోర్లతో ఎదురుదాడి చేసింది. రవూఫ్ తన రెండు వరుస ఓవర్లలో సాల్ట్ (10), బట్లర్లను అవుట్ చేయడంతో పవర్ప్లే ముగిసేసరికి ఇంగ్లండ్ స్కోరు 49/3 వద్ద నిలిచింది. ఈ దశలో పాక్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లండ్ బ్యాటర్లు పరుగుల కోసం తీవ్రంగా శ్రమించారు. బౌండరీలు రావడం కష్టంగా మారిపోయింది. ఒకదశలో వరుసగా 31 బంతుల పాటు ఇంగ్లండ్ బౌండరీ కొట్టలేకపోయింది! అయితే స్టోక్స్ మాత్రం పట్టుదలగా నిలబడ్డాడు. హ్యారీ బ్రూక్ (23 బంతుల్లో 20; 1 ఫోర్) అవుటైనా... సింగిల్స్తోనే పరుగులు రాబడుతూ తన వికెట్ మాత్రం అప్పగించకుండా జాగ్రత్త పడ్డాడు. గాయంతో అఫ్రిది అర్ధాంతరంగా తప్పుకోవడంతో ఆ ఓవర్ పూర్తి చేసేందుకు ఇఫ్తికార్ రాగా వరుసగా 4, 6 బాదాడు. 24 బంతుల్లో 28 పరుగులు చేయాల్సిన దశలో వసీమ్ వేసిన 17వ ఓవర్లో మొయిన్ అలీ (12 బంతుల్లో 19; 3 ఫోర్లు) 3 ఫోర్లు కొట్టడంతో పని సులువైంది. వసీమ్ వేసిన 19వ ఓవర్లో నాలుగో బంతికి ఫోర్తో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న స్టోక్స్... చివరి బంతిని మిడ్ వికెట్ దిశగా సింగిల్ తీసి ఇంగ్లండ్ను వరల్డ్ చాంపియన్గా నిలిపాడు. చదవండి: T20 WC 2022 Final: అఫ్రిది గాయపడకుంటే టైటిల్ గెలిచేవాళ్లం: పాక్ కెప్టెన్ టీ20 వరల్డ్కప్-2022 అత్యుత్తమ జట్టులో ఇద్దరు టీమిండియా క్రికెటర్లు View this post on Instagram A post shared by ICC (@icc) -
వెస్టిండీస్ మాజీ కెప్టెన్కు పాకిస్తాన్ ప్రతిష్టాత్మక అవార్డు
వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామి పాకిస్తాన్ క్రికెట్కు చేసిన అద్భుతమైన సేవలుకుగాను ‘సితార-ఎ-పాకిస్తాన్’ పౌర పురస్కారం అందుకున్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్లో పెషావర్ జల్మీ జట్టుకు డారెన్ సామి హెడ్ కోచ్గా పనిచేస్తున్నాడు. అతడు కోచ్గా బాధ్యతలు చేపట్టనప్పటి నుంచి పెషావర్ అద్భుతంగా రాణిస్తోంది. ఈ ఏడాది సీజన్లో మూడో స్ధానంలో నిలిచింది. అంతే కాకుండా యువ ఆటగాళ్లలో ప్రతిభను వెలికితీసి.. పాకిస్తాన్ క్రికెట్కు అత్యుత్తమ ఆటగాళ్లను అందించడంలో సామి కీలక పాత్ర పోషిస్తున్నాడు. అందుకుగాను పాకిస్తాన్ ప్రతిష్టాత్మక అవార్డుతో అతడిని సత్కరించింది. ఇక వెస్టిండీస్ తరపున 38 టెస్టులు, 126 వన్డేలు,68 టీ20 మ్యాచ్లు సమీ ఆడాడు.సమీ సారథ్యంలో విండీస్ జట్టు రెండు సార్లు టీ20 ప్రపంచకప్ను కైవసం చేసుకుంది. ఇక ఈ విషయాన్ని సమీ ట్విటర్ వేదికగా వెల్లడించాడు. "నేను సితార-ఈ-పాకిస్తాన్ అవార్డును అందుకుంటున్నాను. నాకు చాలా గర్వంగా ఉంది" అని సమీ ట్విటర్లో పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: ‘ప్రపంచకప్ అందుకోవడమే లక్ష్యం’ -
IND Vs WI: టీమిండియా సేఫ్ హ్యాండ్స్లో ఉంది.. అయినా మాతో అంత ఈజీ కాదు..!
Darren Sammy: త్వరలో టీమిండియాతో ప్రారంభంకానున్న పరిమిత ఓవర్ల సిరీస్ నేపథ్యంలో విండీస్ మాజీ సారధి డారెన్ సామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో తమ జట్టును ఏమాత్రం తక్కువ అంచనా వేయరాదని భారత్ను హెచ్చరించాడు. గతంలో చాలా సందర్భాల్లో టీమిండియా కంటే బలమైన జట్లకు షాకిచ్చామని, ఈ విషయాన్ని భారత్ గుర్తు చేసుకోవాలని సూచించాడు. భారత్ ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నుంచైనా త్వరగా బయటపడగలదని, ప్రస్తుతం ఆ జట్టు రోహిత్ శర్మ లాంటి గొప్ప నాయకుడి చేతుల్లో సేఫ్గా ఉందని అభిప్రాయపడ్డాడు. ఇటీవలి దక్షిణాఫ్రికా పర్యటనలో వరుస ఓటములు, కెప్టెన్సీ వివాదం వంటివి భారత్పై ఎలాంటి ప్రభావం చూపవని, స్వదేశంలో రోహిత్ సేన బెబ్బులిలా గర్జిస్తుందని తమ జట్టును అలర్ట్ చేశాడు. ఫిబ్రవరి 6 నుంచి 20 వరకు జరిగే 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్లో పోలార్డ్ సేనకు ప్రధాన ముప్పు కెప్టెన్, మాజీ కెప్టెన్ల నుంచి ఉంటుందని హెచ్చరించాడు. రోహిత్ నేతృత్వంలో టీమిండియా బలంగా కనిపిస్తుందని, విండీస్ జట్టు సైతం ఆల్రౌండర్లతో నిండి ఉందని ప్రస్తావించాడు. విండీస్ జట్టులోని కొందరు ఆటగాళ్లకు భారత్లో ఆడిన అనుభవం ఉందని, ముఖ్యంగా కెప్టెన్ పోలార్డ్కు భారత్లో పరిస్థితులపై మంచి అవగాహన ఉందని, ఇది ఓ రకంగా తమకు కలిసొచ్చే అంశమని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇంగ్లండ్తో సిరీస్లో రాణిస్తున్న కుర్రాళ్లు విండీస్కు అదనపు బలంగా మారతారని, యువకులు, అనుభవజ్ఞుల కలియకలో కరీబియన్ జట్టు టీమిండియాకు గట్టి పోటీ ఇస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. లెజెండ్స్ లీగ్ సందర్భంగా మాట్లాడుతూ.. సామి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. చదవండి: IPL 2022: వేలంలో రికార్డు ధర పలికే భారత ఆటగాళ్లు ఆ ఇద్దరే..! -
ఇండియన్ మహరాజా టీమ్ కెప్టెన్గా సెహ్వాగ్
జనవరి 20 నుంచి ఒమన్ వేదికగా జరగనున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్(ఎల్ఎల్సీ) టి20 టోర్నమెంట్ షెడ్యూల్ విడుదలైంది. ఈ టోర్నీలో ఇండియన్ మహారాజా, ఆసియా లయన్స్, వరల్డ్ జెయింట్స్ టీమ్లు పాల్గొంటున్నాయి. కాగా షెడ్యూల్తో పాటు ఆయా జట్ల కెప్టెన్లను ప్రకటించారు. ఎల్ఎల్సీలో పాల్గొననున్న ఇండియన్ మహారాజా టీమ్కు.. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. వైస్ కెప్టెన్గా మరో మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ ఎంపిక కాగా.. జట్టు కోచ్గా ఆస్ట్రేలియాకు జాన్ బుచానన్ ఎంపికయ్యాడు. ఇక సెహ్వాగ్ ఇంతకముందు ఐపీఎల్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్(పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్(ఢిల్లీ డేర్డెవిల్స్) కెప్టెన్గా వ్యవహరించిన అనుభవం ఉంది. చదవండి: 'ఫుల్టైం టెస్టు కెప్టెన్'.. పెద్ద బాధ్యత మీద పడ్డట్టే ► ఇక ఆసియన్ లయన్స్ కెప్టెన్గా పాకిస్తాన్ మాజీ ఆటగాడు మిస్బా-ఉల్ హక్ ఎంపిక కాగా.. ఈ జట్టులో పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ తరపున ఆడిన మాజీ క్రికెటర్లు ఉన్నారు. వారిలో షాహిద్ అఫ్రిది, షోయబ్ అక్తర్, మహ్మద్ హఫీజ్, ఉమర్ గుల్, సనత్ జయసూర్య, తిలకరత్నే దిల్షాన్, చమిందా వాస్, హబీబుల్ బషర్ లాంటి పేరున్న క్రికెటర్లు ఉండడంతో ఆసియా లయన్స్ బలంగా కనిపిస్తుంది. వైస్ కెప్టెన్గా దిల్షాన్ ఎంపికవగా.. 1996 ప్రపంచకప్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ అర్జున రణతుంగ కోచ్గా వ్యవహరించనున్నాడు. ► వరల్డ్ జెయింట్స్ టీమ్కు వెస్టిండీస్ మాజీ ఆల్రౌండర్ డారెన్ సామీ కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఈ జట్టులోనూ పలువురు వరల్డ్ క్లాస్ క్రికెటర్లు ఉన్నారు. బ్రెట్ లీ, డానియెల్ వెటోరి, కెవిన్ పీటర్సన్, ఇమ్రాన్ తాహిర్ ఉన్నారు. వీరితో పాటు జాంటీ రోడ్స్ ప్లేయర్ కమ్ మెంటార్గా వ్యవహరించనున్నాడు. జనవరి 20న ఇండియా మహారాజాస్ వర్సెస్ ఆసియా లయన్స్ మ్యాచ్తో టోర్నీ ప్రారంభం కానుంది. మ్యాచ్లన్నీ సోనీ టెన్ వన్, టూ, త్రీలో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. చదవండి: ఫుట్బాల్ చరిత్రలో అద్భుతం.. ప్రతీ ఆటగాడి కాలికి తగిలిన బంతి ఎల్ఎల్సీ టోర్నీ షెడ్యూల్: 20/01/22: ఇండియా మహారాజాస్ వర్సెస్ ఆసియన్ లయన్స్ 21/01/22: వరల్డ్ జెయింట్స్ వర్సెస్ ఏషియన్ లయన్స్ 22/01/22: వరల్డ్ జెయింట్స్ వర్సెస్ ఇండియా మహారాజాస్ 24/01/22: ఆసియన్ లయన్స్ వర్సెస్ వరల్డ్ జెయింట్స్ 26/01/22: ఇండియా మహారాజాస్ వర్సెస్ వరల్డ్ జెయింట్స్ 27/01/22: ఆసియన్ లయన్స్ వర్సెస్ ఇండియా మహారాజాస్ -
ఫన్ 88 బ్రాండ్ కోసం.. విండీస్ క్రికెటర్ డారెన్ సామి
మరో విండీస్ క్రికెటర్ ఇండియన్ కంపెనీకి ప్రచారకర్తగా వ్యవహరించనున్నాడు. గత కొంత కాలంగా విదేశీ క్రికెటర్లకు మన దేశంలో ఉన్న క్రేజ్ను ఉపయోగించుకునేందుకు తమ సంస్థలకు ప్రచార కర్తలుగా పలు సంస్థలు ఉత్సాహం చూపిస్తున్న విషయం తెలిసిందే. ఇదే కోవలో ప్రముఖ స్పోర్ట్స్ ఫ్లాట్ఫామ్ ఫన్88, తమ బ్రాండ్ అంబాసిడర్గా డారెన్ సామిని నియమించుకుంది. కెప్టెన్గా వెస్టిండీస్ టీమ్ను టీ20 వల్డ్ కప్ విజేతగా రెండుసార్లు నిలవడంలో కీలకంగా వ్యవహరించిన సామికి, ఆయన ఆటతీరుకు భారత్, ఉపఖండంలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో హైదరాబాద్ జట్టుకు కూడా సామి ప్రాతినిధ్యం వహించాడు. మరోవైపు జాతీయ, అంతర్జాతీయ క్రీడలకు సంబంధించిన ప్రముఖ బ్రాండ్ ఫన్88. క్రికెట్, టెన్నిస్, ఫుట్బాల్, కబడ్డి, ఇంకా ఎన్నో క్రీడలకు సంబంధించిన విశేషాలను అందించే ఫన్ 88 తరపున సామి పలు రకాల ప్రచార కార్యక్రమాల్లో భాగం పంచుకోనున్నాడు. ‘రెండు దశాబ్దాలుగా 88 సంఖ్య నా జెర్సీ నెంబర్గా ఉంది. అందుకే ఈ ఒప్పందం నాకు మరింత ప్రత్యేకం. ఇప్పుడు ఫన్88 ద్వారా భారత క్రీడాభిమానులకు మరో రూపంలో చేరువకాబోతున్నాననేది నాకు ఎంతో సంతోషాన్నిస్తోంది అంటున్నారు సామి. -
ఇషాంత్ ఇప్పటికీ నా సోదరుడే
న్యూఢిల్లీ: గతంలో భావించినట్లే ఇషాంత్ శర్మను ఇప్పుడు కూడా సోదరునిలానే ఆదరిస్తున్నానని వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ స్యామీ చెప్పాడు. భారత పేసర్ ఇషాంత్ శర్మపై తనకు ఎలాంటి కోపం, పగ లేదని పేర్కొన్నాడు. సన్రైజర్స్కు ప్రాతినిధ్యం (2013, 2014) వహించిన సమయంలో జాతి వివక్షకు గురైనట్లు ఇటీవలే గుర్తించిన స్యామీ... తనను ‘కాలూ’(నల్లవాడు) అని సంబోధించిన ఇషాంత్ను క్షమించినట్లు తెలిపాడు. ‘నేను పగలు ప్రతీకారాలు పెట్టుకోను. ఇషాంత్తో దీని గురించి మాట్లాడాను. ఇది ముగిసిన అధ్యాయం. ఇంతకుముందు ఇషాంత్ను ఎలా భావించానో ఇప్పుడు కూడా సోదరునిలాగే ఆదరిస్తా. కానీ ఇకపై భవిష్యత్లో ఇలాంటి వాటిని సహించను. అది ఎవరైనప్పటికీ నేను నిలదీస్తా. జాతివివక్షను సహించను. ఇప్పటికే దీని గురించి పోరాడుతున్నా. ఇక ముందూ కొనసాగిస్తా. క్రికెట్ వర్గాల్లోనూ దీనిపై అవగాహన కల్పిస్తున్నాం’ అని విండీస్కు రెండుసార్లు టి20 ప్రపంచకప్ అందించిన స్యామీ పేర్కొన్నాడు. స్యామీ తన కెరీర్లో 232 అంతర్జాతీయ మ్యాచ్ల్లో విండీస్కు ప్రాతినిధ్యం వహించాడు. -
'ఎన్గిడి... నిజంగా నువ్వు మూర్ఖుడివి'
జోహన్నెస్బర్గ్ : అమెరికా నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్య తరువాత ప్రపంచవ్యాప్తంగా జాతి వివక్షపై నిరసనలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ హత్యోదంతం తర్వతా బ్లాక్ లైవ్స్ మేటర్ అంశంపై ప్రచారం విస్తృతంగా పెరిగింది. దీనిపై పలువురు వెస్టిండీస్ క్రికెటర్లు కూడా తమ గళం విప్పారు. క్రికెట్లోనూ వర్ణ వివక్ష ఎదుర్కొన్నామంటూ డారెన్ సామి, క్రిస్ గేల్, మైఖేల్ హోల్డింగ్ లాంటి ఆటగాళ్లు పేర్కొన్నారు. తాజాగా 'బ్లాక్ లైవ్స్ మేటర్' ఉద్యమానికి తాను మద్దతు ఇస్తానని దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ లుంగి ఎన్గిడి శుక్రవారం పేర్కొన్నాడు. ఎన్గిడి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెట్లో పెను దుమారాన్నే రేపుతున్నాయి.(అండర్సన్.. మొన్ననేగా పొగిడాం ఇంతలోనే) 'బ్లాక్ లైవ్స్ మేటర్కు నేను మద్దతు ఇస్తున్నా.. ఈ అంశంలో ఇతర ఆటగాళ్ల మద్దతు నాకు ఉంటుందనే ఆశిస్తున్నా. గడిచిన కొన్ని సంవత్సరాల్లో దక్షిణాఫ్రికాలోనూ జాత్యాహంకారం జరగుతుంది.. క్రికెట్లోనూ ఇది కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న బ్లాక్ లైవ్స్ మేటర్కు మా జట్టులోని ఆటగాళ్లు కూడా కలిసి వస్తారని ఆశిస్తున్నా’అని తెలిపాడు.' అయితే ఎన్గిడి వ్యాఖ్యలపై పలువురు మాజీ దక్షిణాఫ్రికా ఆటగాళ్లు విరుచుకుపడ్డారు. 'ఎన్గిడి నువ్వు నిజంగా మూర్ఖుడివి.. బ్లాక్ లైవ్స్ మేటర్కు మద్దతు ఇవ్వాలా వద్దా అనేది నీ ఇష్టం. నువ్వు మద్దతు ఇవ్వాలనుకుంటే ఇవ్వు. కానీ మొత్తం దక్షిణాఫ్రికా ప్రజలను ఇందులోకి లాగొద్దు.' అంటూ దక్షిణాఫ్రికా మాజీ స్పిన్నర్ పాట్ సిమ్కాక్స్ పేర్కొన్నాడు. ' బ్లాక్ లైవ్స్ మేటర్ ప్రచారం వెనుక రాజకీయ ఉద్యమం తప్ప మరొకటి లేదని నేను భావిస్తున్నా. ఎన్గిడి.. మద్దతు ఇచ్చే ముందు థామస్ సోవల్, లారీ ఎల్డర్, వాల్టర్ విలిమమ్స్ లాంటి తెల్లజాతి రైతులపై జరిగిన దారుణాలను గుర్తు తెచ్చుకోవాలి. ఈ విషయంలో నువ్వు సానుభూతి ప్రకటిస్తే బ్లాక్ లైవ్స్ మేటర్ ప్రచారంలో నేను నీతో పాటు వస్తా 'అంటూ మాజీ బ్యాట్స్మన్ బొటా డిప్పెనార్ తెలిపాడు. అయితే ఎన్గిడి వ్యాఖ్యలకు తాను మద్దతిస్తున్నట్లు విండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామి తెలిపాడు.' బ్లాక్ లైవ్స్ మేటర్ ప్రచారానికి ఎన్గిడి మద్దతివ్వడం చాలా సంతోషంగా ఉంది. నీ వెనుక ఎవరు లేకున్నా మేమంతా నీతోనే ఉన్నాం . ఈ విషయలంలో కలిసి పోరాడుదాం' అంటూ ట్విటర్లో పేర్కొన్నాడు. ఒకప్పుడు వర్ణ వివక్ష అన్న కారణంతోనే దక్షిణాఫ్రికా దశాబ్దాలకు పైగా క్రికెట్ ఆడలేదన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.('ధోనికున్న మద్దతు కోహ్లికి లేదు..') -
‘నల్లవారిని’ నిరోధించేందుకే...
సెయింట్ లూసియా: ప్రపంచ క్రికెట్లో నల్లజాతి ఫాస్ట్ బౌలర్లు తమ వేగంతో చెలరేగిపోతున్న సమయంలో వారిని అడ్డుకునేందుకే బౌన్సర్ల నిబంధనలో మార్పులు తెచ్చారని వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ స్యామీ వ్యాఖ్యానించాడు. ఇతర దేశాల పేసర్లు బౌన్సర్లు వేసినా ఎవరూ పట్టించుకోలేదని, నల్లవారిని మాత్రం కట్టి పడేశారని అతను పరోక్షంగా తమ విండీస్ జట్టు గురించి అన్నాడు. ప్రపంచ క్రికెట్పై వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ల ప్రభావం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దశాబ్దాలపాటు వారు తమ భీకర బౌలింగ్తో ప్రత్యర్థులను పడగొట్టి ఆటపై ఆధిపత్యం ప్రదర్శించారు. అయితే 90ల్లోకి వచ్చిన తర్వాత విండీస్ జోరు తగ్గింది. ‘ఒక ఓవర్కు ఒక బౌన్సర్ మాత్రమే’ అనే నిబంధనను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 1991లో తీసుకొచ్చింది. యాదృచ్ఛికం కావచ్చు కానీ అప్పటినుంచే విండీస్ క్రికెట్ పతనం ప్రారంభమైంది. ‘ఫైర్ ఇన్ బేబీలాన్ డాక్యుమెంటరీని చూడండి. జెఫ్ థాంప్సన్, డెన్నిస్ లిల్లీ తదితరులంతా కూడా బౌన్సర్లతో చెలరేగిపోయారు. అమిత వేగంతో బౌలింగ్ చేస్తూ బ్యాట్స్మెన్ శరీరంపై దాడి చేశారు. దాని గురించి ఎవరూ మాట్లాడరు. అయితే ఆ తర్వాత నల్లవారి జట్టు అదే తరహా దూకుడైన బౌలింగ్తో ప్రత్యర్థిపై చెలరేగింది. పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. అప్పుడే బౌన్సర్ల గురించి వారికి ఈ తరహా ఆలోచన వచ్చి ఉంటుంది. నల్ల జట్టును కట్టడి చేయాలనే కొత్త నిబంధన తెచ్చి ఉంటారు. నేను చెప్పేది పూర్తిగా నిజం కాకపోవచ్చు గానీ నాకు మాత్రం అలాగే అనిపించింది’ అని స్యామీ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. -
‘అతను’ నాతో మాట్లాడాడు
కింగ్స్టన్: ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడినప్పుడు వర్ణ వివక్షకు గురయ్యానంటూ వ్యాఖ్యలు చేసిన వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ స్యామీ ఇప్పుడు ఆ వివాదానికి ముగింపునిచ్చే ప్రయత్నం చేశాడు. అప్పుడు సన్రైజర్స్ జట్టు సహచరుడొకరు తనను కాలూ (నల్లోడు) అన్నాడని, ఇప్పటికైనా అతను తనతో మాట్లాడి క్షమాపణ చెప్పాలని ఇటీవల డిమాండ్ చేశాడు. తాజాగా స్యామీ శుక్రవారం దీనిపై ఒక ప్రకటన చేశాడు. సదరు క్రికెటర్ తనతో అభిమానంగా మాట్లాడాడని, ఇక ప్రత్యేకంగా క్షమాపణ కోరాల్సిన అవసరం లేదని చెప్పాడు. ‘వివాదంలో భాగమైన ఆ క్రికెటర్ నాతో మాట్లాడాడు. మా సంభాషణ బాగా సాగింది. ఈ అంశంలో చెడును చూడటంకంటే వివక్షపై తగిన అవగాహన కల్పించే ప్రయత్నం చేయాలని నిర్ణయించాం. నా సోదరుడు ప్రేమతోనే అలా మాట్లాడానని చెప్పాడు. అతని మాటలు నమ్ముతున్నాను. ఉద్దేశపూర్వంగా చేయలేదని అర్థమైంది. ఇక నేను క్షమాపణ కోరుకోవడం లేదు. అతని పేరు కూడా నేను చెప్పను. ఇకపై అలాంటిది జరగకుండా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి. నల్లజాతీయుడిగా ఉండటం నాకు ఎప్పటికీ గర్వకారణమే’ అని స్యామీ పేర్కొన్నాడు. -
ఆ మాటన్నది ఇషాంతేనా!
న్యూఢిల్లీ: సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడే సమయంలో తాను వర్ణ వివక్షకు గురయ్యానంటూ వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ స్యామీ చేసిన వ్యాఖ్యల వివాదం ముదిరింది. 2013–14 సీజన్లలో సన్రైజర్స్కు ప్రాతినిధ్యం వహించినప్పుడు సహచర ఆటగాళ్లు తనను ‘కాలూ’ (నల్లోడు) అంటూ పిలిచారని, అప్పట్లో దాని అర్థం తనకు తెలీదన్న స్యామీ... ఇప్పుడు వారంతా తనకు క్షమాపణ చెప్పాలని కోరుతున్నాడు. పాత ఇన్స్టాగ్రామ్ పోస్ట్లను బట్టి చూస్తే ఈ మాటలన్నది భారత పేసర్ ఇషాంత్ శర్మ అని తెలుస్తోంది. సహచరులతో కలిసి దిగిన నాటి ఫోటోలో ఇషాంత్... ‘నేను, భువీ, కాలూ, గన్ సన్రైజర్ (స్టెయిన్)’ అంటూ పోస్ట్ చేశాడు. ‘నన్ను అప్పట్లో ఆ మాట ఎవరెవరు అన్నారో వారందరూ నాతో మాట్లాడే ప్రయత్నం చేయండి. మీలో చాలా మంది దగ్గర నా ఫోన్ నంబర్ ఉంది. ఇతర సోషల్ మీడియా కూడా ఉంది. మీరేం అన్నారో మీకు తెలుసు. రంగు గురించి మాట్లాడటం అంటే అది ఏ రూపంలోనైనా వివక్షగానే భావించాలి. నేను చాలా బాధపడుతున్నాను. వేర్వేరు జట్లకు ఆడిన సమయంలో డ్రెస్సింగ్ రూమ్కు సంబంధించి నాకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. అందరినీ నా సోదరుల్లా భావించాను. ఈ అంశంలో మీరు నాకు క్షమాపణ చెప్పడంలో తప్పు లేదు’ అని స్యామీ వ్యాఖ్యానించాడు. విండీస్ ఆటగాడి ఆరోపణలపై ఇషాంత్ గానీ, సన్రైజర్స్ యాజమాన్యం గానీ స్పందించలేదు. -
దక్షిణాది ప్లేయర్లపైనే వర్ణ వివక్ష: పఠాన్
న్యూఢిల్లీ: దేశవాళీ క్రికెట్లో దక్షిణాది ప్లేయర్లు వర్ణ వివక్షకు గురవుతారని భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తెలిపాడు. ఉత్తరాది, పశ్చిమ ప్రాంతాలకు మ్యాచ్ల నిమిత్తం వెళ్లినపుడు వారు వర్ణానికి సంబంధించిన వ్యాఖ్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నాడు. ఈ అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరముందని పఠాన్ అభిప్రాయపడ్డాడు. ‘దక్షిణాది నుంచి వచ్చిన క్రికెటర్లలో కొందరు ఉత్తర భారతంలో వర్ణ వివక్షకు గురవుతుంటారు. అక్కడి ప్రజలు జాత్యహంకారులు కాదు కానీ ఏదో ఒకటి చేసి, ఎవరో ఒకర్ని వింత పేరుతో పిలవడం ద్వారా అందరిలో గుర్తింపు తెచ్చుకోవాలని అలా ప్రవర్తిస్తారు’ అని పఠాన్ అన్నాడు. మరోవైపు ఐపీఎల్ సందర్భంగా విండీస్ ప్లేయర్ డారెన్ స్యామీ వర్ణ వివక్ష వ్యాఖ్యలకు గురైన అంశం తనకు తెలియదని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. ‘2014లో స్యామీతో పాటు నేనూ సన్రైజర్స్కు ఆడాను. అప్పట్లో ఈ అంశంపై ఎలాంటి చర్చ జరుగలేదు. ఇది నిజంగా జరిగి ఉంటే కచ్చితంగా చర్చనీయాంశమయ్యేది. కాబట్టి నాకు దీనిపై అవగాహన లేదు’ అని ఇర్ఫాన్ వివరించాడు. అప్పట్లో రైజర్స్కు ప్రాతినిధ్యం వహించిన పార్థివ్ పటేల్, వేణుగోపాలరావు కూడా స్యామీపై చేసిన వర్ణ వివక్ష వ్యాఖ్యలు తమ దృష్టికి రాలేదని పేర్కొన్నారు. -
నన్ను ‘కాలూ’ అని పిలిచారు
కింగ్స్టన్: ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంగా తాను కూడా జాతి వివక్ష వ్యాఖ్యల్ని ఎదుర్కొన్నానని వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ స్యామీ అన్నాడు. సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన సమయంలో తనతో పాటు శ్రీలంక క్రికెటర్ తిసారా పెరీరా వర్ణ వివక్షకు గురయ్యాడని తెలిపాడు. ‘సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సమయంలో నన్ను, పెరీరాను ‘కాలూ... కాలూ’ (నల్లోడు) అని పిలిచేవారు. అప్పుడు దానర్థం మాకు తెలిసేది కాదు. భారత్లో ‘కాలూ’ అంటే ‘బలమైన వ్యక్తి’ అని పిలుస్తున్నారేమో అనుకునేవాడిని. కానీ ఈ మధ్యే ఆ పదానికి అర్థం తెలుసుకున్నా. చాలా బాధగా ఉంది’ అని స్యామీ ఇన్స్టాగ్రామ్ వేదికగా పేర్కొన్నాడు. అయితే ఏ ఐపీఎల్ సీజన్ సందర్భంగా తాను ఈ వివక్షను ఎదుర్కొన్నాడో స్యామీ తెలపలేదు. జెంటిల్మెన్ క్రీడ క్రికెట్లో ఉన్న జాత్యాంహకారం పట్ల తీవ్రంగా పరిగణించాలని ఇటీవలే అతను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి విజ్ఞప్తి చేశాడు. ఇప్పటివరకు 38 టెస్టులు, 126 వన్డేలు, 68 టి20లు ఆడిన స్యామీ.... విండీస్కు కెప్టెన్గా రెండు టి20 ప్రపంచకప్లను అందించాడు. -
'నన్ను చాలా దారుణంగా అవమానించారు'
జమైకా : వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామి వర్ణ వివక్షతపై తన ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో సన్రైజర్స్కు ఆడినప్పుడు తనపై జాత్యంహకార వ్యాఖ్యలు చేశారని మండిపడ్డాడు. అమెరికాలో జాత్యహంకార దాడిలో ప్రాణాలు కోల్పోయిన జార్జి ప్లాయిడ్కు మద్దతుగా అక్కడి స్థానికులతో కలిసి నిరసన వ్యక్తం చేసిన సామి ఇలాంటివి జరగడం దారుణమని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా తాను కూడా వర్ణ వివక్ష వ్యాఖ్యలు ఎదుర్కొన్నట్లు ఇన్స్టాగ్రామ్ ద్వారా సామి పేర్కొన్నాడు.('ఆరోజు రితికా అందుకే ఏడ్చింది') 'నేను ఐపీఎల్లో సన్రైజర్స్ జట్టుకు ఆడేటప్పుడు నాతో పాటు శ్రీలంక ఆటగాడు తిసార పెరీరాను 'కలు' అనే పదంతో పిలిచేవారు.అప్పట్లో కలు అంటే బలమైన నల్ల మనిషి అని అనుకున్నా. ఆ సమయంలో వారు నన్ను పొగుడుతున్నారని భావించాను. కానీ ఇప్పుడు ఆ పదానికి అసలైన అర్థం ఏంటో తెలుసుకున్నా. తనతో పాటు పెరీరాపై జట్టులోని ఆటగాళ్లు జాత్యహంకార పదం ఉపయోగించారు. వారు నన్ను చాలా దారుణంగా అవమానించారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి వారిపై చాలా కోపంగా ఉంది.' అంటూ చెప్పుకొచ్చాడు. (షికారుకని వచ్చి షార్క్కు చిక్కాడు) అంతకుముందు ట్విటర్ వేదికగా అమెరికాలో జాత్యహంకారానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలంటూ ఐసిసి, ఇతర క్రికెట్ బోర్డులకు సామి విజ్ఞప్తి చేశాడు. 'ఐసిసితో పాటు ఇతర బోర్డులకు ఒక విజ్ఞప్తి.. నాలాంటి నల్లజాతి వారికి ఏమి జరుగుతుందో మీరు చూడడం లేదా? ఈరోజు అమెరికాలో జరిగిన సంఘటన ప్రపంచంలో ఎక్కడైనా జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు నిశబ్ధంగా ఉండాల్సిన సమయం మాత్రం కాదు. సామాజిక అన్యాయంపై స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది' అంటూ పేర్కొన్నాడు. కాగా విండీస్ స్టార్ ఓపెనర్ క్రిస్ గేల్ కూడా ఫ్లాయిడ్ మరణానికి సంతాపం తెలిపాడు .తాను కూడా జాత్యహంకారానికి గురయ్యాడని ఒక ప్రకటనలో తెలిపాడు. క్రికెట్లో జాత్యహంకారం లేదనేది ఒక అపోహ మాత్రమే అని గేల్ చెప్పుకొచ్చాడు. -
క్రికెట్ ప్రపంచం గళం విప్పాల్సిందే
కింగ్స్టన్: జాత్యహంకారంపై క్రీడా లోకం మండిపడుతోంది. సోమవారం ఫార్ములావన్ రేసర్లు గళం విప్పగా... మంగళవారం క్రికెట్, గోల్ఫ్, బాక్సింగ్, ఫుట్బాల్ వర్గాలు శ్రుతి కలిపాయి. వెస్టిండీస్ క్రికెట్ మాజీ కెప్టెన్ డారెన్ స్యామీ వర్ణ వివక్ష హత్యపై ఘాటుగా స్పందించాడు. గతవారం అమెరికాలో ఓ శ్వేతజాతి పోలీస్ అధికారి కర్కశంగా ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ ఊపిరి తీశాడు. దీన్ని ఫార్ములావన్ చాంపియన్ హామిల్టన్ ఖండించాడు. తాజాగా స్యామీ మాట్లాడుతూ ‘అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)తో పాటు సభ్యదేశాలన్నీ ఈ దారుణ దురాగతాన్ని ఖండించాలి. లేదంటే ఈ జాత్యహంకారంలో వీళ్లంతా భాగస్వాములేనని భావించాల్సి వస్తుంది’ అని తీవ్ర స్థాయిలో ట్వీట్ చేశాడు. ఇది కేవలం అమెరికాకే పరిమి తం కాలేదని, జాతి వివక్ష అనేది ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సామాజిక పిశాచి అని పేర్కొన్నాడు. తను కూడా ఈ వివక్షకు గురైనట్లు డాషింగ్ బ్యాట్స్మన్ క్రిస్ గేల్ చెప్పాడు. శ్రీలంక మాజీ కెప్టెన్ సంగక్కర మాట్లాడుతూ పక్షపాతానికి, జాత్యహంకారానికి చోటు లేని సంస్కృతి కోసం మనమంతా కృషి చేయాలన్నాడు. నిజమైన స్వేచ్ఛ, సమానత్వం ఉన్న ప్రపంచాన్ని నిర్మించాలని, అమెరికాలో ప్రస్తు తం ఎగిసిపడుతున్న నిరసన జ్వాలలు మనందరికీ ఓ గుణపాఠం లాంటిదని అన్నాడు. దిగ్గజ గోల్ఫర్ టైగర్ వుడ్స్ మౌనం వీడి మాట కలిపాడు. ‘నేను ఎల్లప్పుడూ చట్టాన్ని గౌరవిస్తాను. శాంతిభద్రతల కోసం సుశిక్షితులైన అధికార్లు ఇలా తమ పరిధిని నిర్దయగా అతిక్రమించడం నన్ను తీవ్రంగా బాధిస్తోంది. ఫ్లాయిడ్ హత్య నన్ను కలచివేసింది. అతని కుటుంబసభ్యుల మీదే నా ధ్యాస, సానుభూతి వెళుతోంది’ అని ట్వీట్ చేశాడు. బాక్సింగ్ లెజెండ్, అజేయ చాంపియన్ ఫ్లాయిడ్ మేవె దర్... జాత్యహంకారానికి బలైన జార్జ్ అంతి మ సంస్కారాల్లో పాల్గొంటానని, ఖర్చులు భరిస్తానని చెప్పాడు. దీనికి జార్జ్ కుటుంబసభ్యులు అంగీకరించారు. ఈ నెల 9న అతని అంత్యక్రియలు జరుగుతాయి. అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య (ఫిఫా) నిరసన గళమెత్తే ఆటగాళ్లను నిరోధించరాదని, మ్యాచ్లకు అనుమతించాలని కోరింది. ప్రజల్లో బలమైన ఈ సెంటిమెంటును అణచివేయరాదని కోరింది. జర్మనీలో ఈ వారాంతంలో మ్యాచ్లు జరగను న్నాయి. కొందరు ఆటగాళ్లు జార్జ్కు న్యాయం చేయాలని నల్ల రిబ్బన్లతో బరిలోకి దిగనున్న నేపథ్యంలో ‘ఫిఫా’ ఇలా స్పందించింది. -
పాక్ పౌరసత్వం కోసం సామీ దరఖాస్తు!
కరాచీ: వెస్టిండీస్ ఆల్రౌండర్ డారెన్ డారెన్ సామీ త్వరలో పాకిస్తాన్ పౌరునిగా మారే అవకాశాలు కనబడుతున్నాయి. తాజాగా పాకిస్తాన్ పౌరసత్వం కోసం సామీ దరఖాస్తు చేసుకున్నాడట. అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలోనే పాకిస్తాన్ పౌరసత్వాన్ని పొందుతాడు. 2004లో విండీస్ తరఫున అరంగ్రేటం చేసిన సామీ ఆ జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. 2016లో డారెన్ సామీ కెప్టెన్సీలో విండీస్ జట్టు టీ20 వరల్డ్కప్ను సొంతం చేసుకుంది. విండీస్ తరఫున 38 టెస్టుల్లో, 126 వన్డేల్లో, 68 టీ20ల్లో ప్రాతినిథ్యం వహించిన సామీ.. 2017 సెప్టెంబర్లో చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. కాగా విండీస్ బోర్డుతో విభేదాల నేపథ్యంలో చాలాకాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో విదేశీ లీగ్ల్లో ఆడుతూ సత్తాచాటుతున్నాడు. ముఖ్యంగా పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) ప్రారంభమైన్పపటికి నుంచి రెగ్యులర్గా ఆడుతున్నాడు. పీఎస్ఎల్లో పెషావర్ జెల్మీకి కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. పీఎస్ఎల్ మెరుపులు మెరిపిస్తూ అక్కడి అభిమానుల మనసులను గెలుచుకున్నాడు. ఎంతలా అంటే.. సామి తమ దేశం తరుపున ఆడాలని కోరుకునే ఫ్యాన్స్కు కొదవేలేదు.ఇదిలా ఉండగా.. అతనికి గౌరవ పౌరసత్వం ఇవ్వాలని ఆ దేశ ప్రెసిడెంట్కు దరఖాస్తు అందింది. పీఎస్ఎల్ జట్టు పెషావర్ జల్మీ ఓనర్ జావిద్ ఆఫ్రిది తాజాగా సామీ దరఖాస్తును పరిశీలనకు పంపించాడు. -
పాక్ అభిమానులను ఫూల్స్ చేసిన క్రికెటర్
సాక్షి, హైదరాబాద్ : ఏప్రిల్ 1 సందర్భంగా వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామీ అభిమానులను సరదాగా ఆటపట్టించాడు. ఇటీవల పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో అదరగొట్టిన ఈ విండీస్ స్టార్.. అక్కడ ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. పీఎస్ఎల్లో సామీ పెష్వార్జల్మీ జట్టుకి సారథ్యం వహించిన విషయం తెలిసందే. అయితే గత కొన్నాళ్లుగా విండీస్ జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న సామీ.. తాను మళ్లీ తన దేశానికి పాత్రినిధ్యం వహించాలనుకుంటున్నానని, పాక్లో జరుగుతున్న టీ20 సిరీస్లో పాల్గొంటానని ట్వీట్ చేశాడు. ‘మీరు ఇది నమ్మలేరు.. నేను మెరున్(విండీస్ జెర్సీ) జెర్సీ వేసుకొని పాక్లో మెరుస్తాను.’ అని ట్వీట్లో పేర్కొన్నాడు. ఈ ట్వీట్తో షాక్కు గురైన అభిమానులు ఆనందంతో పరవశించిపోయారు. ముఖ్యంగా పాక్ నెటిజన్లు సామీ రాకను స్వాగతిస్తూ ట్వీట్ల మీద ట్వీట్లు చేశారు. మీ జల్మీ జట్టు సహచరుడు హసన్ అలీ నిన్ను తొలి బంతిని అవుట్ చేయడానికి సిద్దంగా ఉన్నాడు.’ అని ఒకరనగా నీ మాటలు నాకు తియ్యని పాటగా వినబుడుతున్నాయని మరొకరు కామెంట్ చేశారు. అయితే మరికొద్ది సేపట్లోనే వారి ఆనందం ఆవిరయ్యేలా చేశాడు ఈ విండీస్ మాజీ కెప్టెన్. ‘ఇది నేను ఊహించలేదు.. ఇంతటితో మెరున్ జెర్సీలో ఆడాలనే నా ఆలోచన ముగిసింది.’ అని ఏప్రిల్ ఫూల్ చేశాడు. అయితే ఈ ప్రాంక్పై సామీ క్షమాపణలు కోరుతూ చాలా మంది తాను జట్టులోకి తిరిగి రావలని కోరుకుంటున్నారని మరో ట్వీట్ చేశాడు. సామీ ట్వీట్కు పాక్ అభిమానులు స్పందించడానికి కూడా ఓ కారణం ఉంది. 9 ఏళ్ల తర్వాత విండీస్ జట్టు పాక్లో పర్యటిస్తుంది. పైగా ఈ సిరీస్కు విండీస్ సీనియర్ ఆటగాళ్లు సైతం దూరమయ్యారు. ఈ నేపథ్యంలోనే సామీ ట్వీట్కు వారు అంతగా స్పందించారు. I am sorry guys... but wow so many ppl want to see me back.. #AprilFoolsPrank pic.twitter.com/vzJiCTQFfN — Daren Sammy (@darensammy88) April 1, 2018 Sammy you are welcome always. But this time round your Zalmi mate HASSAN ALI will be waiting to get youout the first ball. Will be good to see you on the field again. I can say on behalf of all Pakistanis that Pakistan genuinely loves you for the way you have loved Pakistan. — MasoodSharif Khattak (@MSharifKhattak) April 1, 2018 -
సూపర్ డ్యాన్స్ : ఇక్కడ బ్రావో.. అక్కడ సామీ
-
వైరల్ : ఇక్కడ బ్రావో.. అక్కడ సామీ
సాక్షి, స్పోర్ట్స్ : మైదానంలో వైవిధ్యమైన డ్యాన్స్లతో ఆడుతూ..పాడుతూ ప్రేక్షకులను అలరించే విషయంలో వెస్టిండీస్ ఆటగాళ్లు ఎప్పుడూ ముందుంటారు. వినూత్నమైన డ్యాన్స్లను పరిచయం చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటారు. ఇలాంటి డ్యాన్స్లను విండీస్ ఆల్రౌండర్ డ్వాన్ బ్రావో ఐపీఎల్లో మనకెన్నో సార్లు చూపించాడు. అయితే పాకిస్తాన్ సూపర్లీగ్లో ఈ బాధ్యతను మరో ఆల్రౌండర్ డారెన్ సామీ తీసుకున్నాడు. తన ఆట పాటతో చిందేస్తూ అభిమానులు, తోటి ఆటగాళ్లలో జోష్ నింపుతున్నాడు. ఈ లీగ్లో పెష్వార్ జల్మీ జట్టుకు సారథ్యం వహిస్తున్న ఈ ఆల్ రౌండర్ తమ జట్టు ఫైనల్కు చేరిందన్న ఆనందంతో తోటి దేశవాళి ఆటగాడైన ఆండ్రూ ఫ్లెచర్తో కలిసి హోటల్ గదిలో సందిడి చేశాడు. ఫేమస్ బ్రిటీష్ కమెడియన్ మైఖల్ డపా ఆలపించిన ‘మ్యాన్స్ నాట్ హాట్’ అనే ర్యాప్ సాంగ్ పాడుతూ డ్యాన్స్ ఇరగదీశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఇప్పటి వరకు పీఎస్ఎల్ లీగ్ మ్యాచ్లు దుబాయ్లో జరగగా.. ఫైనల్ మ్యాచ్కు కరాచీ ఆతిథ్యం ఇవ్వనుంది. ఆదివారం జరిగే తుది పోరులో పెష్వార్ జల్మీ, ఇస్లామాబాద్ యూనైటెడ్ జట్లు తలపడనున్నాయి. -
గాయంతో క్రీజులోకి.. కెప్టెన్ కీలక ఇన్నింగ్స్!
-
గాయంతో క్రీజులోకి.. కీలక ఇన్నింగ్స్!
షార్జా: గాయంతో బాధపడుతూ క్రీజులోకి దిగినా భారీ హిట్టింగ్తో జట్టును గెలిపించాడు పెషావర్ జల్మీ కెప్టెన్ డారెన్ స్యామీ. గురువారం సాయంత్రం జరిగిన ఉత్కంఠపోరులో క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టుపై పెషావర్ను విజేతగా నిలిపాడు స్యామీ. గాయంతో ఉన్న స్యామీ ఏం ఆడతాడులే అనుకుంటే భారీ షాట్లతో ఏకంగా మ్యాచ్నే దూరం చేశాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో భాగంగా పెషావర్ జల్మీతో జరిగిన మ్యాచ్లో క్వెట్టా గ్లాడియేటర్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లాడి 142 పరుగులు చేసి పెషావర్కు ఓ మోస్తరు లక్ష్యాన్ని నిర్ధేశించింది. 143 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన డారెన్ స్యామీ జట్టు తొలుత బాగానే పరుగులు సాధించినా చివర్లో ఒత్తిడికి లోనైంది. తమీమ్ ఇక్బాల్-మహ్మద్ హఫీజ్ లు 54 పరుగుల భాగస్వామ్యం అనంతరం పెషావర్ టీమ్ వికెట్ కోల్పోయింది. పరుగులు రాకపోవడం, వికెట్ పడటంతో స్యామీ సేన విజయానికి 7 బంతుల్లో 16 పరుగులు కావాలి. ఎడకాలికి గాయంతో బాధపడుతున్నా స్యామీ క్రీజులోకి వచ్చాడు. 19వ ఓవర్ చివరి బంతికి సిక్సర్ బాది పెషావర్లో ఆశలు నింపాడు. గ్లాడియేటర్ బౌలర్ అన్వర్ అలీ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్ రెండో బంతిని సిక్సర్గా మలిచిన స్యామీ, నాలుగో బంతిని లాంగాఫ్ దిశగా ఫోర్ కొట్టగానే సంబరాలు మొదలయ్యాయి. కేవలం 4 బంతులాడిన కెప్టెన్ స్యామీ 2 సిక్సర్లు, ఫోర్ బాది 16 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో పెషావర్ జల్మీ నాలుగో స్థానంలో నిలిచింది. -
ఇదే నా మీ తొలి చర్య?
ఆంటిగ్వా: వెస్టిండీస్ కోచ్ ఫిల్ సిమ్మన్స్ను అర్థాంతరంగా తొలగించడంపై ఆ జట్టు మాజీ టీ 20 కెప్టెన్ డారెన్ స్యామీ తీవ్రంగా ధ్వజమెత్తాడు. అనవసరపు పట్టింపులకు పోయి జట్టును సర్వం నాశనం చేయడమే విండీస్ క్రికెట్ బోర్డు లక్ష్యంగా కనబడుతుందని విమర్శనాస్త్రాలు సంధించాడు. మరో రెండు రోజుల్లో యూఏఈలో పాకిస్తాన్తో ద్వైపాక్షిక సిరీస్ పెట్టుకుని కోచ్ పదవి నుంచి సిమ్మన్స్ తప్పించడం బోర్డు అనాలోచిత చర్యగా స్యామీ పేర్కొన్నాడు. విండీస్ క్రికెట్ ను గాడిలో పెట్టడానికి చేపట్టిన తొలి చర్య ఇదేనా? అంటూ బోర్డు పెద్దలను ప్రశ్నించాడు. 'నన్ను తొలగించడంతో బోర్డు పెద్దల నైజం బయటపడింది. ఇప్పుడు ఒక పబ్లిసిటీ స్టంట్లో భాగంగా కోచ్నే తీసేశారు. అది కూడా ఒక పర్యటనకు రెండు రోజుల ముందు కావడం బోర్డు దురుసు ప్రవర్తనకు అద్దం పడుతుంది. గుడ్డిగా వెళితే ఫలితాలు కూడా అలానే ఉంటాయి. మనం తీసుకున్న గోతిలో మనమే పడతామన్న సంగతి గుర్తించుకుంటే మంచిది' అని స్యామీ చురకలంటిచాడు. -
'నన్ను స్యామీ అభినందించాడు'
పోర్ట్ ఆఫ్ స్పెయిన్:వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ స్యామీతో తనకు ఎటువంటి విభేదాలు లేవని ఇటీవల టీ 20 కెప్టెన్గా ఎంపికైన కార్లోస్ బ్రాత్ వైట్ స్పష్టం చేశాడు. ప్రస్తుత వెస్టిండీస్ జట్టులో చెప్పుకోదగ్గ విభేదాలు కూడా ఏమీ లేవన్నాడు. విండీస్ టీ 20 జట్టుకు కెప్టెన్ గా ఎంపికైన అనంతరం తనను మొదటి అభినందించింది స్యామీయేనని బ్రాత్ వైట్ పేర్కొన్నాడు. 'నేను కెప్టెన్గా ఎంపికయ్యాక స్యామీతో మాట్లాడా. అతని నుంచి నాకు అభినందనలతో పాటు దీవెనలు కూడా లభించాయి. అదే కాకుండా త్వరలో భారత జట్టుతో ఆడబోయే టీ 20 సిరీస్ ఒక ఛాలెంజ్గా తీసుకోవాలని స్యామీ అన్నాడు. ఒక సీనియర్గా ఆటగాడిగా స్యామీ తగిన సూచనలు చేశాడు. స్యామీ ఇలా చెప్పడం నా కెప్టెన్సీ సమర్ధవంతంగా చేయడానికి ఉపయోగపడుతుంది'అని బ్రాత్ వైట్ అన్నాడు. కొన్నినెలల క్రితం భారత్లో జరిగిన టీ 20 వరల్డ్ కప్ను విండీస్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఆ జట్టుకు స్యామీ కెప్టెన్ కాగా, బ్రాత్ వైట్ అప్పుడు జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. కాగా, విండీస్తో బోర్డుకు ఆటగాళ్లకు మధ్య చోటు చేసుకున్న విభేదాల కారణంగా కొంతమంది సీనియర్లు జట్టుకు దూరమయ్యారు. దాంతో పాటు స్యామీని టీ 20 కెప్టెన్సీ నుంచి తప్పించి బ్రాత్ వైట్కు అప్పగించారు. -
డారెన్ స్యామీ ఆవేదన
సెయింట్ జాన్స్(ఆంటిగ్వా): వెస్టిండీస్కు రెండు టీ 20 వరల్డ్ కప్లు అందించిన ఏకైక కెప్టెన్ డారెన్ స్యామీ. అయితే స్యామీని టీ 20 కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ వెస్టిండీస్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని తన ఫేస్బుక్ అకౌంట్లో అభిమానులకు తెలియజేసిన స్వామీ ఆవేదన వ్యక్తం చేశాడు. కేవలం సెలక్టర్లు తనతో 30 సెకెండ్లపాటు మాత్రమే మాట్లాడి కెప్టెన్సీ తొలిగిస్తున్నట్లు చెప్పడం తీవ్ర వేదనకు గురిచేసిందన్నాడు. 'శుక్రవారం సెలక్టర్ల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ సారాంశ ఏంటంటే నన్ను కెప్టెన్సీ తప్పిస్తున్నట్లు విండీస్ సెలక్షన్ కమిటీ చైర్మన్ తెలిపారు. ఆ విషయాన్ని కూడా 30 సెకెండ్లలోముగించి కాల్ కట్ చేశారు. మా బోర్డు ఇలా చేయడం నన్ను తీవ్రంగా కలిచివేసింది. టీ 20 కెప్టెన్సీ నియమాకానికి కొత్త వ్యక్తి అన్వేషణలో ఉన్నట్లు మా సెలక్షన్ చైర్మన్ పేర్కొన్నారు. విండీస్ సెలక్టర్లను నా ఆట ఆకట్టుకోలేదట. ఈ కారణం చేతనే కెప్టెన్సీ నుంచి తొలిగిస్తున్నట్లు చెప్పారు. ఇక విండీస్ కు టీ 20 కెప్టెన్ గా ఎంపిక కాలేనేమో' అని స్యామీ ఆందోళన వ్యక్తం చేశాడు. -
స్యామీ స్టేడియంలో స్యామీ..
గ్రాస్ ఐస్లెట్: కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో డారెన్ స్యామీ కొత్త రికార్డు నమోదు చేశాడు. కరీబియన్ లీగ్ లో సెయింట్ లూసియా జూక్స్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సామీ.. ఆ లీగ్లో తొలిసారి అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించాడు. గురువారం రాత్రి సెయింట్ కిట్స్-నేవిస్ పాట్రియోట్స్తో జరిగిన మ్యాచ్లో స్యామీ 35 బంతుల్లో ఐదు సిక్సర్లు, రెండు ఫోర్లుతో చెలరేగి 59 పరుగులు సాధించాడు. తద్వారా ఈ లీగ్లో అత్యధిక స్కోరును నమోదు చేశాడు. తాజా విజయంతో సెయింట్ లూసియా లీగ్ లోని తదుపరి ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఇదిలా ఉండగా, డారెన్ స్యామీ నేషనల్ స్టేడియంలోనే ఆ క్రికెటర్ సీపీఎల్ అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేయడం మరో విశేషం. ఈ మ్యాచ్లో సెయింట్ లూసియా జూక్స్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ లూసియా జూక్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఆ జట్టులో చార్లెస్ (25),మైక్ హస్సీ(26)లు ఫర్వాలేదనిపించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన సెయింట్ కిట్స్ 20.0 ఓవర్లలో 139 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. సెయింట్ కిట్స్ జట్టులో డు ప్లెసిస్(48), స్మట్స్(30) మినహా ఎవరూ రాణించకపోవడంతో ఓటమి తప్పలేదు. -
క్రిస్ గేల్ను టార్గెట్ చేస్తున్నారు
లండన్: వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్మన్ క్రిస్ గేల్ వినోదం పంచేవాడని, అతడిని విమర్శించడంలో అర్థంలేదని విండీస్కు రెండుసార్లు టి-20 ప్రపంచ కప్ అందించిన సారథి డారెన్ సామీ అన్నాడు. మీడియా ప్రతినిధులతో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ విమర్శలపాలవుతున్న క్రిస్ గేల్ను సామీ సమర్థించే ప్రయత్నం చేశాడు. 'నావరకు మన క్రికెట్ హీరోల్లో క్రిస్ ఒకడు. అతను వినోదం కలిగిస్తుంటాడు. జట్టు సభ్యుడిగా గేల్ను గౌరవిస్తా. గేల్ను విమర్శించడంలో కారణం కనిపించడంలేదు. నేనెప్పుడూ గేల్కు మద్దతుగా ఉంటా. ఎందుకంటే క్రికెట్ మైదానంలో అతను ఏం చేశాడన్నదే ముఖ్యం. క్రికెటర్లుగా మాకు బాద్యత ఉంది. అభిమానులు మమ్మల్ని గమనిస్తుంటారు. అయితే కొన్నిసార్లు న్యూస్ పేపర్ హెడ్లైన్స్ కోసం క్రిస్ను టార్గెట్ చేస్తున్నారని భావిస్తున్నా' అని సామీ చెప్పాడు. బిగ్బాష్ టి-20 లీగ్ సందర్భంగా బ్రిటీష్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గేల్ అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల ఐపీఎల్ సందర్భంగా మీడియా ప్రతినిధులతో ద్వందార్థాలు వచ్చేలా గేల్ మాట్లాడాడు. ఐపీఎల్ టోర్నీ ముగిసిన తర్వాత గేల్పై విచారణ చేపడతామని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా చెప్పారు. ఈ నేపథ్యంలో సామీ స్పందించాడు. -
కామెంటేటర్గా స్యామీ
కోల్కతా: సరిగ్గా నెల రోజుల క్రితం ఈడెన్ గార్డెన్స్లో వెస్టిండీస్ కెప్టెన్గా టి20 ప్రపంచకప్ను అందుకున్న డారెన్ స్యామీ... అదే ఈడెన్ గార్డెన్స్లో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా కామెంటేటర్ అవతారం ఎత్తాడు. కోల్కతా, పంజాబ్ల మధ్య బుధవారం జరిగిన మ్యాచ్ ద్వారా కామెంటేటర్గా అరంగేట్రం చేశాడు. గతేడాది ఐపీఎల్లో బెంగళూరుకు ఆడిన స్యామీని ఈసారి వేలంలో ఏ జట్టూ తీసుకోలేదు. -
స్యామీకి వివ్ రిచర్డ్స్ మద్దతు
ఆంటిగ్వా: ఇటీవల జరిగిన వరల్డ్ ట్వంటీ 20లో విజేతగా నిలిచినా, తమ క్రికెట్ బోర్డు నుంచి సరైన సహకారం అందలేదన్న వెస్టిండీస్ కెప్టెన్ డారెన్ స్యామీ వ్యాఖ్యలకు ఆ దేశ మాజీ దిగ్గజ ఆటగాడు వివ్ రిచర్డ్స్ మద్దతుగా నిలిచాడు. ' స్యామీ అబద్దాలకోరు అని నేను అనుకోవడం లేదు. స్యామీ నిజాయితీగానే మాట్లాడాడు. అతను చేసిన వ్యాఖ్యలు మనసు నుంచి ఎటువంటి కలష్మం లేకుండా వచ్చినవే. ఇక్కడ ఏమి జరిగిందో అందరికీ తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో విండీస్ కప్ గెలవడం నిజంగా అభినందనీయం. ఇప్పుడు విండీస్ ఆటగాళ్లకు స్యామీ ఒక ప్రతినిధిగా ఉన్నాడు. రాబోవు రోజుల్లో బోర్డు నుంచి ఎటువంటి సంకేతాలొచ్చినా ఇలానే విజయాలతోనే ముందుకు సాగండి' అని రిచర్డ్స్ సూచించాడు. వరల్డ్ టీ 20కప్ను విండీస్ గెలిచిన అనంతరం పోస్ట్ మ్యాచ్ ఇంటర్యూలో ఆ దేశ క్రికెట్ బోర్డు తీరును స్యామీ తప్పుబట్టిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనేందుకు ఇండియాలో అడుగుపెట్టేనాటికి జట్టుకు యూనిఫామ్ కూడా లేదని, అయినాసరే పోరాడామని, చివరికి ప్రపంచ విజేతగా నిలిచామని స్యామీ పేర్కొన్నాడు. తమ పట్ల విండీస్ బోర్డు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని స్యామీ ఆవేదన వ్యక్తం చేశాడు. -
వెస్టిండీస్ కెప్టెన్కు అరుదైన గౌరవం
టి-20 ప్రపంచ కప్ సాధించిన వెస్టిండీస్ కెప్టెన్ డారెన్ స్యామీకి స్వదేశంలో అరుదైన గౌరవం దక్కింది. సెయింట్ లూసియాలోని ది బ్యూసెజోర్ క్రికెట్ స్టేడియానికి స్యామీ పేరు పెట్టారు. ఈ స్టేడియం పేరును డారెన్ స్యామీ నేషనల్ క్రికెట్ స్టేడియంగా మార్చాలని నిర్ణయించారు. సెయింట్ లూసియా క్రికెటర్లు స్యామీ, జాన్సన్ చార్లెస్లకు ప్రధాని కెన్నీ డీ ఆంథోనీ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్టేడియం పేరు మార్పు విషయాన్ని ప్రకటించారు. స్టేడియంలోని ఓ స్టాండ్కు చార్లెస్ పేరు పెట్టనున్నారు. స్వదేశంలో తనకు లభించిన స్వాగతసత్కారాల పట్ల స్యామీ ఉప్పొంగిపోయాడు. 'నాకు అరుదైన గౌరవం దక్కింది. అందరికీ ధన్యవాదాలు. సెయింట్ లూసియన్స్ ఎంతో ప్రేమిస్తారు. ఎయిర్పోర్టులో ప్రేమాభిమానాలు, గౌరవం దక్కాయి. ఓ మై గాడ్.. థ్యాంక్యూ వెరీ మచ్' అని స్యామీ ఉద్వేగంతో అన్నాడు. కరీబియన్ దీవులు వెస్టిండీస్ జట్టు పేరుతో అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న సంగతి తెలిసిందే. టి-20 ప్రపంచ కప్ విజేత జట్టులో కెప్టెన్ స్యామీ, జాన్సన్ చార్లెస్ సెయింట్ లూసియాకు చెందినవారు. స్యామీ సారథ్యంలో విండీస్ రెండుసార్లు టి-20 ప్రపంచ కప్ సాధించింది. ఈ ఘనత సాధించిన ఏకైక కెప్టెన్ స్యామీ కావడం విశేషం. -
'స్యామీ.. నీకిది తగదు'
అంటిగ్వా: వెస్టిండీస్ క్రికెట్ పెద్దలపై విమర్శనాస్త్రాలు సంధించిన ఆ దేశ టీ 20 కెప్టెన్ డారెన్ స్యామీపై విండీస్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆటగాళ్లు అనవసర, అసందర్భ వ్యాఖ్యలు చేయడం తగదని బోర్డు అధ్యక్షుడు డేవ్ కామోరూన్ మండిపడ్డారు. 'స్యామీ నీకిది తగదు. బోర్డుకు విరుద్ధంగా మాట్లాడటం ఎంతమాత్రం సరికాదు. అసందర్భంగా వ్యాఖ్యలు చేసి బోర్డును రచ్చకీడ్చకండి. బోర్డుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం క్షమార్హం కాదు' అని ట్విట్టర్లో మందలించారు. వరల్డ్ టీ 20కప్ను విండీస్ గెలిచిన అనంతరం పోస్ట్ మ్యాచ్ ఇంటర్యూలో స్యామీ మాట్లాడుతూ వారి క్రికెట్ బోర్డు తీరును తప్పుబట్టిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనేందుకు ఇండియాలో అడుగుపెట్టేనాటికి జట్టుకు యూనిఫామ్ కూడా లేదని, అయినాసరే పోరాడామని, చివరికి ప్రపంచ విజేతగా నిలిచామని స్యామీ పేర్కొన్నాడు. తమ పట్ల విండీస్ బోర్డు చులకన భావంతో వ్యవహరిస్తోందనడానికి ఇదే ఉదాహరణని స్యామీ ఆవేదన వ్యక్తం చేశాడు. -
స్యామీ.. నీ కన్నీరు వృథాకావద్దు!
కోల్ కతా: క్రికెట్ లో గెలుపు, ఓటముల సంగతి పక్కన పెడితే ఒక జట్టు మ్యాచ్ ఆడాలంటే యూనిఫామ్ తప్పనిసరి. మండల స్థాయిలోనే ఈ నిబంధన కచ్చితంగా అమలవుతుంది. అలాంటిది ప్రపంచ క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక ఘనత ఉన్న వెస్టిండీస్ జట్టుకు కనీసం యూనిఫామ్ కుట్టించే దిక్కులేకుండా పోయింది! వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనేందుకు ఇండియాలో అడుగుపెట్టేనాటికి జట్టుకు యూనిఫామ్ కూడా లేదని, అయినాసరే పోరాడామని, చివరికి ప్రపంచ విజేతగా నిలిచామని చెప్పాడు విండీస్ కెప్టెన్ డారెన్ స్యామీ. మ్యాచ్ అనంతరం ఈ మాటలు చెబుతూ స్యామీ కంటతడి పెట్టిన వైనం అందరినీ ఆలోచింపజేసింది. అనిశ్చితికి మారుపేరైన విండీస్ క్రికెట్ బోర్డును బోనులో నిల్చొబెట్టినట్టైంది. క్రికెట్ లో కేవలం కాసుల వర్షమేకాదు, కొందరు ఆటగాళ్ల కన్నీటి ధారలూ ఉంటాయని మరోసారి నిరూపించింది. పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో స్యామీ మాట్లాడుతూ.. 'మొదటిగా భగవంతుడికి కృతజ్ఞతలు. మా జట్టులో ఒక పాస్టర్ ఉన్నాడు. అతనితో కలిసి మేం కూడా నిరంతరం ప్రార్థనలు చేశాం. ఈ విజయం మాకు కలకాలం గుర్తుండిపోతుంది. ఎందుకంటే.. సరిగ్గా నెలన్నర కిందట విండీస్ టీమ్ వరల్డ్ కప్ ఆడుతుందా? లేదా? అనే సంశయం నెలకొంది. అనేక విషయాల్లో విండీస్ బోర్డు నిర్లక్ష్యానికి ఆటగాళ్లు బలయ్యే పరిస్థితి. మొత్తానికి 15 మందిమి ఎంపికయ్యాం. దుబాయ్ లో ప్రాక్టీస్ క్యాంప్ ఏర్పాటుచేశారు. జట్టుకు కొత్త మేనేజర్ గా లూవీస్ ను నియమించారు. ఆయనకు అనుభవం లేదు. ఇండియాకు వెళ్లాల్సిన సమయం దగ్గరపడుతోంది. అప్పటికింకా యూనిఫామ్ సిద్ధంకాలేదు. మమ్మల్ని దుబాయ్ లోనే వదిలేసి మేనేజర్ వెళ్లిపోయాడు. మేం కోల్ కతా చేరుకున్నాం. మొత్తానికి మొదటి మ్యాచ్ కు ముందే యూనిఫామ్ లతో తిరిగొచ్చాడు మా మేనేజర్. విండీస్ బోర్డు పెద్దలు మమ్మల్ని పట్టించుకోలేదు. దీంతో కొంత మంది దృష్టిలో మేం చులకనైపోయాం. 'వెస్టిండీస్ ప్లేయర్లకు బ్రెయిన్ లేదు' అంటూ ఇంగ్లిష్ క్రికెటర్ మార్క్ నికోలస్ చేసిన వ్యాఖ్యలు మమ్మల్నీ తీవ్రంగా బాధించాయి. అయినాసరే మేం ఓర్చుకున్నాం. కోచింగ్ స్టాఫ్ మా వెన్నంటే ఉన్నారు. కరీబియన్ కమ్యూనిటీ(కారికామ్) పెద్దలు నిరంతరం ఫోన్లు చేస్తునే ఉన్నారు. నిరుత్సాహ పడొద్దంటూ మెసేజ్ లు, మెయిల్స్ పెట్టారు. ఫైనల్ మ్యాచ్ రోజున ఉదయం గ్రెనడా నుంచి కరీబియన్ ప్రధాని కీత్ మిఛెల్ మాతో ఫోన్లో మాట్లాడారు. వెస్టిండీస్ క్రికెట్ టీమ్ ఒకరో, ఇద్దరో ఆటగాళ్లపై ఆధారపడేదికాదు. జట్టులో ఉండే 15 మందీ మ్యాచ్ విన్నర్లే. ఎవరికివారు తమంతటతామే బాధ్యత తీసుకున్నారు. అందుకే ఈ 15 మందికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. భవిష్యత్ లో మేం కలిసి ఆడొచ్చు, ఆడకపోవచ్చు. కానీ మా అందరికీ ఇది చిరస్మరణీయ విజయం. ఈ విజయం కరీబియన్ ఫ్యాన్స్ కు అంకితం' అని ఈ ప్రపంచకప్ కోసం తామెంతగా కష్టపడింది చెప్పుకొచ్చాడు. స్యామీ ఎమోషనల్ స్పీచ్ కు సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన వస్తోంది. ఎంతో ప్రతిభ ఉన్న ఆటగాళ్ల విషయంలో విండీస్ క్రికెట్ బోర్డు తీరు మారాలనడమేకాక, 'స్యామీ.. నీ కన్నీరు వృథా కావద్దు' అని అభిమానులు కోరుకుంటున్నారు. -
మీకు హోలీ.. మాకు విజయ సంబరాలు
వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియాను మానసికంగా దెబ్బతీయడానికి వెస్టిండీస్ సీనియర్ ఆల్ రౌండర్ డారెన్ సామీ తనవంతు ప్రయత్నం మొదలుపెట్టాడు. ఈనెల 6వ తేదీన ఇరు దేశాల మధ్య మ్యాచ్ ఉంది. అదే రోజు హోలీ పండుగ కూడా ఉంది. భారతీయులంతా హోలీ సంబరాలు చేసుకుంటుంటే.. తాము విజయ సంబరాలు చేసుకుంటామని వ్యాఖ్యానించాడు. టీమిండియా ప్రస్తుతం టోర్నమెంటులో చాలా బాగా ఆడుతోందని, ప్రత్యర్థి ఎవరైనా వాళ్లకు తగిన గౌరవం ఇవ్వాల్సిందేనని అన్నాడు. భారతదేశంపై తమకు మంచి మ్యాచ్లే ఉన్నాయని, అయితే భారతజట్టును కొట్టాలంటే మాత్రం 'ఎ' గ్రేడ్ గేమ్ ఆడాల్సి ఉంటుందని చెప్పాడు. -
కాస్త మానవత్వం ఉంటే సరిపోయేది!
భారత్తో సిరీస్ నుంచి తప్పుకోవడంతో తమపై తీవ్ర విమర్శలు వస్తున్నాయని, నిస్సహాయ స్థితిలో కూడా నిజంవైపే నిలబడ్డామని వెస్టిండీస్ క్రికెటర్ డారెన్ స్యామీ వ్యాఖ్యానించాడు. ‘ఎప్పుడూ చిరునవ్వుతోనే, విండీస్ పట్ల విధేయతతోనే ఆడాం. మేం అడిగిందల్లా ఈ సిరీస్ కోసం పాత కాంట్రాక్ట్నే కొనసాగించమని. అందుకోసం కాస్త మానవత్వం ఉంటే చాలు. అదే జరిగితే ఇలా చేసేవాళ్లమా’ అని స్యామీ ట్వీట్ చేశాడు. -
నా అవసరం లేదనిపించింది
రిటైర్మెంట్కు ఐపీఎల్ కారణం కాదు: స్యామీ న్యూఢిల్లీ: టెస్టులకు గుడ్బై చెప్పడానికి ఐపీఎల్ కారణం కాదని వెస్టిండీస్ టి20 కెప్టెన్ డారెన్ స్యామీ స్పష్టం చేశాడు. ఇటీవల వెస్టిండీస్ టెస్టు జట్టుకు సారథిగా స్యామీని తప్పించి దినేష్ రామ్దిన్ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. దీంతో స్యామీ ఈ ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ‘ఈ విషయంలో సెలక్టర్లతో పూర్తిగా చర్చించాను. టెస్టు జట్టును మరో మెట్టు మీదికి తీసుకెళ్లాలని వారు ఆలోచిస్తున్నారు. వారు చెప్పింది పూర్తిగా విన్నాక జట్టుకు కెప్టెన్గా, ఆటగాడిగా నా అవసరం లేదనిపించింది. దీంతో టెస్టుల నుంచి తప్పుకోవడమే మేలనుకున్నాను. అయితే నా ఈ నిర్ణయానికి కారణం ఐపీఎలో మరొకటో కాదు. గతంలో అన్ని ఫార్మాట్లకు నేను కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించాను. జట్టులో స్థిరత్వం కోసం నన్ను కెప్టెన్గా ఉండమన్నారు. మార్పు అనేది సహజమే’ అని సన్రైజర్స్ హైదరాబాద్కు ఆడుతున్న స్యామీ తెలిపాడు. -
టెస్టులకు స్యామీ గుడ్బై
సెయింట్ జాన్స్ (ఆంటిగ్వా, బార్బుడా): వెస్టిండీస్ ఆల్రౌండర్ డారెన్ స్యామీ టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు స్యామీ శుక్రవారమే తమకు సమాచారం అందించినట్లు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తెలిపింది. అయితే మిగిలిన రెండు ఫార్మాట్లలో ఆడతానని, టి20 జట్టు సారథిగా కొనసాగుతానని చెప్పినట్లు పేర్కొంది. విండీస్ టెస్టు జట్టు కెప్టెన్గా తన స్థానంలో వికెట్కీపర్ రామ్దిన్ను నియమించిన కొద్ది గంటల్లోనే స్యామీ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవడం విశేషం. 2010 అక్టోబర్లో విండీస్ టెస్టు జట్టు పగ్గాలు చేపట్టిన స్యామీ.. 30 మ్యాచ్లకు సారథ్యం వహించాడు. కెరీర్లో మొత్తం 38 టెస్టు మ్యాచ్లు ఆడాడు. 1323 పరుగులు చేసి 84 వికెట్లు తీసుకున్నాడు. -
టెస్టు క్రికెట్కు సామీ గుడ్ బై
బ్రిడ్జిటౌన్: వెస్టిండీస్ ఆల్రౌండర్ డారెన్ సామీ టెస్టు క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. విండీస్ క్రికెట్ కెప్టెన్గా ఉద్వాసనకు గురైన సామీ అనూహ్యంగా రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. గత శుక్రవారం సామీని కెప్టెన్గా తొలగించి వికెట్ కీపర్ దినేశ్ రాందిన్ను నియమించారు. టెస్టు క్రికెట్ నుంచి సామీ దూరమైనా ఇతర ఫార్మాట్లకు అందుబాటులో ఉంటాడని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు బోర్డుకు తెలియజేశాడని పేర్కొంది. విండీస్ టి-20 జట్లుకు సామీనే సారథ్యం వహిస్తున్నాడు. అక్టోబర్ 2010 నుంచి మే 2014 వరకు టెస్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. తన సారథ్యంలో ఆడిన 30 టెస్టుల్లో 8 విజయాలు, 12 పరాజయాలు, 10 డ్రాలు నమోదు చేశాడు. -
డారెన్ స్యామీపై వేటుకు రంగం సిద్ధం
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్ ఆల్రౌండర్ డారెన్ స్యామీపై వేటు వేసేందుకు రంగం సిద్దమయింది. టెస్టు కెప్టెన్సీ నుంచి అతడిని తొలగించనున్నారు. అతడి స్థానంలో వికెట్ కీపర్ దినేష్ రామ్దిన్కు బాధ్యతలు అప్పగించనున్నారు. న్యూజిలాండ్తో జరగనున్న సిరిస్కు విండీస్ టెస్టు కెప్టెన్గా రామ్దిన్ను నియమించనున్నారని 'ట్రినిడాడ్ గార్డియన్' వెల్లడించింది. రామ్దిన్ నియామకానికి కరేబియన్ సెలెక్టర్లు ఆమోదం తెలిపారని పేర్కొంది. కెప్టెన్సీ చేపట్టడానికి రామ్దిన్ కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. డారెన్ స్యామీ ప్రస్తుతం భారత్లో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఆడుతున్నాడు. హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టుకు అతడు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2010లో వెస్టిండీస్ కెప్టెన్ స్యామీ నియమితుడయ్యాడు. 2013లో వన్డే కెప్టెన్సీ నుంచి అతడిని తొలగించి ఆల్రౌండర్ డ్వేన్ బ్రేవోకు అప్పగించారు. -
విండీస్దే టి20 సిరీస్
చెలరేగిన స్యామీ ఇంగ్లండ్తో రెండో మ్యాచ్లోనూ గెలుపు బ్రిడ్జ్టౌన్: ఇంగ్లండ్తో మూడు మ్యాచ్ల టి20 సిరీస్ను వెస్టిండీస్ మరో మ్యాచ్ మిగిలివుండగానే 2-0తో గెలుచుకుంది. మంగళవారం రాత్రి జరిగిన రెండో వన్డేలో కెప్టెన్ స్యామీ (9 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్లు) విజృంభించడంతో విండీస్ 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. బట్లర్ (43 బంతుల్లో 67; 5 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. గాయపడిన నరైన్ స్థానంలో జట్టులోకి వచ్చిన విండీస్ బౌలర్ సాంటొకీ (4/21) నాలుగు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ను నియంత్రించాడు. అనంతరం విండీస్ 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. ఒక దశలో 15 ఓవర్లలో 111/2తో విజయం దిశగా సాఫీగా సాగిపోతున్న వెస్టిండీస్.. ఆపై వెంట వెంటనే మూడు వికెట్లు కోల్పోయి ఇక్కట్లలో పడింది. అయితే స్యామీ చెలరేగి మరో ఏడు బంతులు మిగిలివుండగానే విండీస్కు విజయాన్నందించాడు. సాంటొకీకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. -
విండీస్ జట్టులోకి క్రిస్ గేల్ పునరాగమనం
వెస్టిండీస్ జట్టులోని కీలక ఆటగాళ్లు క్రిస్ గేల్, డారెన్ సామీ, మార్లన్ శామ్యూల్స్.. ఈ ముగ్గురికీ తమ జాతీయ జట్టులోకి మళ్లీ పిలుపు వచ్చింది. విండీస్ తరఫున ఐర్లండ్ జట్టుతో వన్డేలతో పాటు టి-20 మ్యాచ్లు కూడా ఆడేందుకు వారిని పిలిచారు. న్యూజిలాండ్ పర్యటనలో మోకాలి గాయం కారణంగా జట్టుకు దూరమైన గేల్, మళ్లీ ఆడబోతున్నాడు. సామీ, సామ్యూల్స్ కూడా గాయాల బారిన పడి, మళ్లీ జాతీయ జట్టులోకి వస్తున్నారు. 23 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ మిగెల్ కమిన్స్ను కూడా వన్డే జట్టులోకి తీసుకోగా, రవి రాంపాల్ను మాత్రం కేవలం టి-20లోకే తీసుకున్నారు. రాంపాల్ న్యూజిలాండ్ పర్యటనలో ఉండగా బొటనవేలుకు గాయం కావడంతో సగంలోనే తిరిగొచ్చేశాడు. న్యూజిలాండ్ టూర్లో చెత్తగా ఆడిన టినో బెస్ట్, జాన్సన్ చార్లెస్, నర్సింగ్ దేవ్ నరైన్, చాద్విక్ వాల్టన్లను జట్టు నుంచి తప్పించారు. ఆల్రౌండర్ పొలార్డ్కు మోకాలి గాయం కావడంతో అతడినీ తీసుకోలేదు. క్రిష్మర్ సంటోకీ, డ్వేన్ స్మిత్ ఇద్దరినీ టి20 జట్టులోకి తీసుకున్నారు. -
విండీస్ను గెలిపించిన స్యామీ
ఆక్లాండ్: న్యూజిలాండ్ పర్యటనలో వెస్టిండీస్ జట్టుకు తొలి విజయం దక్కింది. ఇది వరకే టెస్టు సిరీస్ను కోల్పోయిన పర్యాటక జట్టు వన్డే సిరీస్లో మాత్రం శుభారంభం చేసింది. ఆల్రౌండర్ డారెన్ స్యామీ (27 బంతుల్లో 43 నాటౌట్; 5 ఫోర్లు; 3 సిక్స్లు) సుడిగాలి ఇన్నింగ్స్తో చెలరేగడంతో కివీస్తో గురువారం జరిగిన తొలి వన్డేలో విండీస్ రెండు వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో ఐదు వన్డే సిరీస్లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 42.1 ఓవర్లలో 156 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ మెకల్లమ్ (57 బంతుల్లో 51; 5 ఫోర్లు; 1 సిక్స్), నాథన్ మెకల్లమ్ (64 బంతుల్లో 47; 2 ఫోర్లు; 3 సిక్స్లు) మాత్రమే రాణించారు. దాదాపు రెండేళ్ల విరామానంతరం జట్టులోకి వచ్చిన జెస్సీ రైడర్ పరుగులేమీ చే యకుండా నిరాశపరిచాడు. విండీస్ బౌలర్ల ధాటికి ఏడుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. డ్వేన్ బ్రేవోకు నాలుగు వికెట్లు, హోల్డర్, రాంపాల్లకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన విండీస్ తడబడినప్పటికీ 27.3 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసి నెగ్గింది. 96 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తున్న విండీస్ను చివర్లో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ స్యామీ ఆదుకున్నాడు. ఎదురుదాడే లక్ష్యంగా బ్యాట్కు పనిచెప్పడంతో పరుగులు వేగంగా వచ్చాయి. బౌండరీలతో విరుచుకుపడి జట్టు విజయాన్ని ఖరారు చేశాడు. మెక్లీంగన్కు ఐదు వికెట్లు, మిల్స్కు రెండు వికెట్లు దక్కాయి. ఇరు జట్ల మధ్య రెండో వన్డే 29న జరుగుతుంది. -
రెండో వన్డేలో భారత్ ఓటమి
విశాఖపట్నంలోని స్టేడియానికి, కరీబియన్ దీవుల్లోని సెయింట్ లూసియా అనే చిన్న దేశంలో ఉన్న స్టేడియానికి చాలా పోలికలు ఉంటాయి. మైదానంలో నిలుచుంటే రెండు చోట్లా ఒకే రకమైన కొండలు, వాతావరణం కనిపిస్తుంది. వెస్టిండీస్ క్రికెటర్ డారెన్ స్యామీది సెయింట్ లూసియానే. వైజాగ్ స్టేడియాన్ని చూసి తన హోమ్ గ్రౌండ్ అనుకున్నాడేమో..! చెలరేగిపోయాడు. భారత బౌలర్లను చీల్చి చెండాడి... మూడు వన్డేల సిరీస్లో వెస్టిండీస్ ఆశలు సజీవంగా నిలబెట్టాడు. విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి పొలార్డ్ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడం వల్ల... ఈ సిరీస్లో డారెన్ స్యామీ వెస్టిండీస్ జట్టులో ఉన్నాడు. ఇటీవల తన ఫామ్ అంత ఘోరంగా ఉంది. కానీ అదే స్యామి... తనకు లభించిన చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వెస్టిండీస్కు చారిత్రక విజయాన్ని అందించాడు. విశాఖ నగరంలో ఒక్క ఓటమి కూడా ఎరగని భారత్కు షాకిచ్చాడు. భారత పర్యటనలో వరుస ఓటముల నుంచి విండీస్ను ఒడ్డున పడేశాడు. స్యామీ (45 బంతుల్లో 63 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) సంచలన బ్యాటింగ్తో... ఆదివారం వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ 2 వికెట్ల తేడాతో భారత్పై గెలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. సెంచరీ చేజారినా...విరాట్ కోహ్లి (100 బంతుల్లో 99; 9 ఫోర్లు) చక్కటి ఇన్నింగ్స్తో పాటు కెప్టెన్ ధోని (40 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపులు భారత స్కోరులో కీలక పాత్ర పోషించాయి. వెస్టిండీస్ 49.3 ఓవర్లలో 8 వికెట్లకు 289 పరుగులు చేసినెగ్గింది. స్యామీతో పాటు విండీస్ తరఫున మరో ముగ్గురు బ్యాట్స్మెన్ అర్ధసెంచరీలు చేశారు. పావెల్ (70 బంతుల్లో 59;7 ఫోర్లు, 1 సిక్స్), డారెన్ బ్రేవో (54 బంతుల్లో 50; 8 ఫోర్లు) చక్కటి భాగస్వామ్యంతో నిలబెడితే...ఆ తర్వాత స్యామీ, సిమన్స్ (74 బంతుల్లో 62; 5 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడారు. తాజా ఫలితంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమంగా నిలిచింది. మూడో వన్డే బుధవారం కాన్పూర్లో జరుగుతుంది. స్యామీకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. కోహ్లి నిలకడ... టాస్ గెలిచిన విండీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా... వికెట్పై బౌన్స్ను రామ్పాల్ చక్కగా ఉపయోగించుకున్నాడు. గత ఐదు అంతర్జాతీయ ఇన్నింగ్స్లలో వరుసగా మూడు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలతో భీకరమైన ఫామ్లో కనిపించిన రోహిత్ శర్మ (12) జోరుకు రామ్పాల్ బ్రేక్ వేశాడు. ధావన్ (37 బంతుల్లో 35; 5 ఫోర్లు) కొద్దిగా దూకుడు ప్రదర్శిస్తూ చక్కటి షాట్లతో అలరించినా పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. మరోవైపు కోహ్లి మాత్రం తనదైన శైలిలో ఇన్నింగ్స్ను నిర్మించాడు. భారీ షాట్లకు పోకుండా సింగిల్స్పైనే దృష్టి పెడుతూ సాగాడు. కోహ్లితో జత కలిసిన యువరాజ్ (49 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్) చాలా జాగ్రత్తగా ఆడాడు. విశాఖలో తన రికార్డును కొనసాగిస్తూ కోహ్లి 59 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే 69 పరుగుల భాగస్వామ్యం అనంతరం స్యామీ బౌలింగ్లో యువీ నిష్ర్కమించాడు. కోహ్లితో కొద్ది సేపు ఇన్నింగ్స్ను నడిపించిన రైనా (24 బంతుల్లో 23; 2 ఫోర్లు) కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఈ దశలో విండీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు రాలేదు. రెండో పవర్ప్లేలో భారత్ 2 వికెట్లు కోల్పోయి 15 పరుగులు మాత్రమే చేయగలిగింది. నరైన్ 41, 45 ఓవర్లను మెయిడిన్గా వేశాడు. అయితే చివర్లో ధోని మెరుపులతో భారత్ మెరుగైన స్థితిలో నిలిచింది. ఆఖరి 5 ఓవర్లలో భారత్ 62 పరుగులు చేసింది. కీలక భాగస్వామ్యాలు... భువనేశ్వర్ మరో సారి తన తొలి స్పెల్లో భారత్కు శుభారంభం అందించాడు. తన మూడో ఓవర్లో చక్కటి క్యాచ్తో చార్లెస్ (12)ను అవుట్ చేశాడు. ఆ వెంటనే శామ్యూల్స్ (8) వెనుదిరిగాడు. అయితే ఈ దశలో పావెల్, డారెన్ బ్రేవో కలిసి జట్టు పరిస్థితిని చక్కదిద్దారు. భువీ బౌలింగ్లో పావెల్ వరుసగా 3 ఫోర్లు కొట్టగా...మోహిత్ బౌలింగ్లో బ్రేవో అదే పని చేశాడు. ఈ దశలో నాలుగు బంతుల వ్యవధిలో బ్రేవో ఇచ్చిన మూడు క్యాచ్లు చేజారడంతో అతని అర్ధ సెంచరీ పూర్తయింది. అయితే అశ్విన్ ఈ తప్పును సరి దిద్దాడు. బ్రేవోను అవుట్ చేసి 100 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెర దించిన అతను...పావెల్ను కూడా అవుట్ చేశాడు. కొద్ది సేపటికే డ్వేన్ బ్రేవో (18)ని భువీ అవుట్ చేశాడు. ఈ దశలో సిమన్స్, స్యామీ కలిసి 12.3 ఓవర్లలోనే 82 పరుగులు జోడించారు. ఆఖర్లో కొద్దిగా తడబడినా...స్యామీ గట్టెక్కించాడు. స్కోరు వివరాలు: భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) స్యామీ (బి) రామ్పాల్ 12; ధావన్ ఎల్బీడబ్ల్యు (బి) పెర్మాల్ 35; కోహ్లి (సి) హోల్డర్ (బి) రామ్పాల్ 99; యువరాజ్ (సి) శామ్యూల్స్ (బి) స్యామీ 28; రైనా (సి) డ్వేన్ బ్రేవో (బి) రామ్పాల్ 23; ధోని (నాటౌట్) 51; జడేజా (బి) రామ్పాల్ 10; అశ్విన్ (సి) చార్లెస్ (బి) హోల్డర్ 19; భువనేశ్వర్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు (లెగ్బైస్ 1, వైడ్లు 9) 10; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 288. వికెట్ల పతనం: 1-21; 2-69; 3-138; 4-203; 5-209; 6-240; 7-287. బౌలింగ్: రామ్పాల్ 10-0-60-4; హోల్డర్ 10-0-63-1; డ్వేన్బ్రేవో 8-0-54-0; పెర్మాల్ 10-0-55-1; నరైన్ 10-2-39-0; స్యామీ 1-0-11-1; సిమన్స్ 1-0-5-0. వెస్టిండీస్ ఇన్నింగ్స్: చార్లెస్ (సి) అండ్ (బి) భువనేశ్వర్ 12; పావెల్ (స్టంప్డ్) ధోని (బి) అశ్విన్ 59; శామ్యూల్స్ (సి) ధోని (బి) మోహిత్ శర్మ 8; డారెన్ బ్రేవో (సి)ధోని (బి)అశ్విన్ 50; సిమన్స్ ఎల్బీడబ్ల్యు (బి) జడేజా 62; డ్వేన్ బ్రేవో (సి) ధావన్ (బి) భువనేశ్వర్ 18; స్యామీ (నాటౌట్) 63; హోల్డర్ (సి)ధోని (బి) షమీ 7; నరైన్ (సి) సబ్ రాయుడు (బి) షమీ 0; పెర్మాల్ (నాటౌట్ ) 0; ఎక్స్ట్రాలు (లెగ్బైస్ 7, వైడ్లు 3) 10; మొత్తం (49.3 ఓవర్లలో 8 వికెట్లకు) 289. వికెట్ల పతనం: 1-14; 2-23; 3-123; 4-147; 5-185; 6-267; 7-285; 8-285. బౌలింగ్: భువనేశ్వర్ 9-1-56-2; మోహిత్ 6.3-0-48-1; షమీ 7-0-55-2; అశ్విన్ 10-1-37-2; రైనా 7-0-42-0; జడేజా 10-1-44-1. మంచు కూడా ముంచింది... వర్షం కారణంగా మ్యాచ్ జరుగుతుందా? లేదా అని భయపడితే... వరుణుడు కరుణించాడు. కానీ అనూహ్యంగా మంచు భారత జట్టును ముంచింది. వెస్టిండీస్ బ్యాటింగ్ సమయంలో తీవ్రంగా మంచు కురవడం వల్ల భారత బౌలర్లు, ఫీల్డర్లు బాగా ఇబ్బందిపడ్డారు. ముఖ్యంగా స్పిన్నర్లకు ఏ మాత్రం పట్టు చిక్కలేదు. ఎన్నో బంతులు అదుపులో లేకుండా చేయి దాటాయి, నియంత్రణ లేకుండా ఫుల్ టాస్లుగా మారాయి. మంచు కారణంగా క్యాచ్లు కూడా జారాయి. ధోని కెప్టెన్సీ రికార్డు 150 వన్డేల్లో జట్టుకు సారథ్యం వహించిన తొలి కీపర్గా ధోని రికార్డు సృష్టించాడు. అత్యధిక మ్యాచ్ల్లో కెప్టెన్గా వ్యవహరించిన రెండో భారతీయుడిగా అజహర్ (174) తర్వాతి స్థానంలో ఉన్నాడు. మంచు ప్రభావం ఉన్న మ్యాచ్ల్లో టాస్ గెలవడం చాలా ముఖ్యం. క్లిష్ట పరిస్థితుల్లోనూ మా బౌలర్లు మ్యాచ్ను చివరి ఓవర్ వరకూ తీసుకురాగలిగారు. - ధోని వరుసగా విఫలమవుతున్నప్పటికీ నాకు మరో అవకాశం ఇచ్చిన జట్టు సభ్యులకు కృతజ్ఞతలు. సిమ్మన్స్, నేను మంచి సమన్వయంతో ఆడగలిగాం. చివరి 10 ఓవర్లలో 90కి పైగా పరుగులు సాధించాలనుకున్నాం. కీలక మ్యాచ్లో మెరుగ్గా రాణించినందుకు ఆనందంగా ఉంది. - స్యామీ -
సచిన్ను తొలి బంతికే అవుట్ చేయాలని ఉంది : వెస్టిండీస్ కెప్టెన్ స్యామీ
కోల్కతా: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ చివరి టెస్టులో ప్రత్యర్థులుగా ఆడటం తమకు గర్వకారణంగా ఉందని, అయితే అతడిని తొలి బంతికే అవుట్ చేయాలనే కోరిక కూడా ఉందని వెస్టిండీస్ టెస్టు కెప్టెన్ డారెన్ స్యామీ అన్నాడు. ‘సచిన్ చివరి మ్యాచ్లో అతడిని అవుట్ చేసిన బౌలర్ చరిత్రలో నిలుస్తాడు. కాబట్టి మాస్టర్ను అవుట్ చేయాలని మా జట్టులో ప్రతి బౌలర్ తహతహలాడుతున్నాడు. ఆఖరి టెస్టు సమయంలో వాతావరణం కచ్చితంగా ఉద్విగ్నంగా ఉంటుంది. కానీ అంత గొప్ప మ్యాచ్లో గెలవడం ఇంకా బాగుంటుంది. కాబట్టి మేం మరింత కష్టపడతాం’ అని స్యామీ చెప్పాడు. 2011లో సచిన్ వందో సెంచరీ కోసం అందరూ ఎదురుచూస్తున్న సమయంలో వెస్టిండీస్ షాక్ ఇచ్చింది. 94 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సచిన్ ఇచ్చిన క్యాచ్ను స్యామీ అందుకుని యావత్ భారతదేశాన్ని నిరాశపరిచాడు. ఈసారి కూడా తమ దగ్గర అలాంటి ప్రణాళికలే ఉన్నాయని విండీస్ కెప్టెన్ చెప్పాడు. సచిన్ ఎంతోమందితో పాటు తనకు కూడా హీరోనే అని చెప్పాడు. ‘సచిన్ను ఇష్టపడని వారెవరైనా ఉంటారా? అలాంటి దిగ్గజాలు ఎప్పటికీ ఆడుతూనే ఉండాలని కోరుకోవాలి. తను ఇకపై ఆడడనే విషయం మాకే ఎలాగో అనిపిస్తోంది. కాబట్టి కోట్లాది మంది భారతీయుల మనోభావాలని మేం అర్థం చేసుకోగలం’ అని స్యామీ చెప్పాడు. తమలో చాలామంది సచిన్ పలకరిస్తేనే పొంగిపోతారని, కనిపించిన ప్రతి ఒక్కరినీ గుడ్మార్నింగ్ అంటూ విష్ చేసే గొప్ప వ్యక్తని మాస్టర్ను పొగడ్తల్లో ముంచెత్తాడు. పదేళ్ల క్రితం తాను సచిన్ దగ్గర తీసుకున్న ఆటోగ్రాఫ్ను జాగ్రత్తగా భద్రపరచుకున్నానని స్యామీ చెప్పాడు. -
భారత్ చేరిన విండీస్ క్రికెట్ జట్టు
కోల్కతా: వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత్ చేరుకుంది. ధోని సేనతో ఇక్కడ రెండు టెస్టులు, మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు డారెన్ స్యామీ నేతృత్వంలోని విండీస్ జట్టు సోమవారం కోల్కతాకు వచ్చింది. స్థానిక విమానాశ్రయం నుంచి కట్టుదిట్టమైన భద్రత మధ్య విండీస్ ఆటగాళ్లు నేరుగా తాము బస చేసే హోటల్కు వెళ్లారు. సచిన్కు ఫేర్వెల్ టోర్నీ అయినా ఈ సిరీస్లో తొలి టెస్టు ఇక్కడి ఈడెన్ గార్డెన్స్లో వచ్చే నెల 6 నుంచి 10 వరకు జరగుతుంది. ఇది సచిన్కు 199వ టెస్టు కాగా... 200 టెస్టు ముంబైలోని వాంఖడేలో 14 నుంచి 18 వరకు జరగుతుంది. పర్యాటక జట్టు మొదట ఉత్తరప్రదేశ్ జట్టుతో మూడు రోజుల సన్నాహక మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ జాదవ్పూర్ యూనివర్సిటీ గ్రౌండ్లో 31న మొదలవుతుంది. ముందనుకున్న షెడ్యూలు ప్రకారం ఈ మ్యాచ్ కటక్లో జరగాల్సివున్నప్పటికీ ఎడతెరిపిలేని వర్షాల వల్ల కోల్కతాకు మార్చారు. టెస్టు సిరీస్ తర్వాత జరిగే మూడు వన్డేల సిరీస్లో రెండో వన్డే నవంబర్ 24న విశాఖపట్నంలో జరగనుంది. -
విండీస్ కెప్టెన్గా స్యామీ
సెయింట్ జాన్స్: వచ్చే నెలలో జరగనున్న భారత్ పర్యటన కోసం వెస్టిండీస్ టెస్టు జట్టును ఎంపిక చేశారు. మొత్తం 15 మంది సభ్యుల బృందాన్ని సెలక్షన్ కమిటీ ప్రకటించింది. పేసర్ డారెన్ స్యామీకి మరోసారి జట్టు పగ్గాలు అప్పగించారు. భారత్, వెస్టిండీస్ల మధ్య రెండు టెస్టులు (నవంబర్ 6 నుంచి 10; 14 నుంచి 18 వరకు) జరుగుతాయి. ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్న వెస్టిండీస్ ‘ఎ’ జట్టులోని ఏడుగురు ఆటగాళ్లకు జాతీయ జట్టులో చోటు దక్కింది. జట్టు: స్యామీ (కెప్టెన్), బెస్ట్, డారెన్ బ్రేవో, చందర్పాల్, కొట్రీల్, డియోనరైన్, ఎడ్వర్డ్స్, గేల్, పెరుమాల్, పావెల్, రామ్దిన్, రోచ్, శామ్యూల్స్, షిల్లాంగ్ఫోర్డ్, వాల్టన్.