devinder sharma
-
ఆహార భద్రతకు ఆ ఆదాయమే కీలకం
ప్రస్తుత వేగంతో 2050 నాటికి ప్రపంచం మొత్తానికి ఆహారాన్ని అందించడమనే పెను సవాలును ఎదుర్కోవడం దాదాపు అసాధ్యంగానే కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో బిగ్గరగానూ, స్పష్టంగానూ వ్యవసాయ శాస్త్ర వేత్తలు, పరిశోధకులు తమ లేఖ ద్వారా చేసిన హెచ్చరిక సకాలంలో వినిపించిన మేల్కొలుపులా కనపడుతోంది. ‘‘భవిష్యత్ ఆహార అవసరాలను తీర్చడానికి మనం సరైన మార్గంలో లేకపోగా, కనీసం దానికి సమీపంలో కూడా లేము’’ అని వారి లేఖ అప్రమత్తం చేసింది.14వ దలైలామా, జోసెఫ్ స్టిగ్లిడ్జ్, కైలాస్ సత్యార్థి, రాబర్ట్ హుబెర్, డరోన్ అసెమోగ్లు, సర్ జాన్ ఇ వాకర్ వంటి నోబెల్ గ్రహీ తలు, డాక్టర్ గురుదేవ్ ఎస్ ఖుష్, పెర్ పిన్ స్ట్రప్ ఆండర్సన్, రట్టన్ లాల్, హాన్స్ ఆర్ హెర్రెన్ వంటి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ గ్రహీతలు ఈ లేఖపై సంతకాలు చేసినవారిలో ఉన్నారు. ‘‘సైన్స్, ఆవిష్కరణల నాయకులుగా మేము ప్రపంచ ఆహార, పోషకాహార భద్రతకు హామీ నివ్వడానికి, ప్రపంచాన్ని మేల్కొలపటంలో, సామూహిక ఆకాంక్షలను పెంచడంలో మాతో చేరాలని, పరిశోధనాపరమైన పెద్ద ముందంజ వేయాలని మిమ్మల్ని కోరుతున్నాము’’ అని ఆ లేఖ ముగుస్తుంది.2050 నాటికి ప్రపంచం 980 కోట్ల మంది ప్రజల అవసరాలను తీర్చడానికి తగినంత ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి పూనుకుంటున్న వేళ, దాదాపు 80 కోట్లమందిని ఆకలితో అలమటింపజేస్తున్న ఆహార కొరత అనేది ఉత్పత్తి పడిపోవడం వల్లనే ఏర్పడలేదు. ఆహార కొరత కేవలం తప్పుడు విధానాల ఫలితమేనని అందరూ గ్రహించాలి. ‘హంగర్స్ టిప్పింగ్ పాయింట్’ అనే శీర్షికతో కూడిన ఆ లేఖ... ‘వాతావరణ మార్పులతో ముడిపడి ఉన్న సాధారణమైన తీవ్ర వాతావరణ ఘటనల’ గురించి ఈ శతాబ్ది మధ్యనాటికి ఆహార, పోషకాహార సంక్షోభం మరింత తీవ్రమవడం గురించి మాట్లాడుతుంది. ఇక ఆ లేఖలోనే సరిగ్గానే వేర్కొన్నట్లుగా.. నేలకోత, భూమి క్షీణత, జీవవైవిధ్య నష్టం, నీటి కొరత, సంఘర్షణలు వంటి అదనపు అంశాలు ఆహార ఉత్పాదకతను తగ్గిస్తాయి.ఇది కచ్చితంగా ఆందోళన కలిగించే విషయమే. ఆఫ్రికాకు ప్రధాన ఆహారమైన మొక్కజొన్న గురించి ఆ లేఖలో పేర్కొన్నప్పటికీ భవిష్యత్తులో ఆహార దిగుబడి తగ్గుతుందనే అంచనాల వల్ల ఆ పంటకు నిజంగానే ముప్పు పొంచి ఉంది. అయితే చేతులు కలిపి సహకరించాల్సిన తక్షణ అవసరాన్ని ప్రపంచం గ్రహించేవరకు, ఆహార, పోషకాహార భద్రతకు సంబంధించిన ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడం సాధ్యం కాదు. ఉదాహరణకు, ఆఫ్రికా తీవ్ర కొరతను ఎదుర్కొంటున్నప్పటికీ, అమెరికాలో దేశీయ మొక్కజొన్న ఉత్పత్తిలో 44 శాతం ఇథనాల్ ఉత్పత్తికి మళ్లిస్తున్నారు. అలాగే, న్యూ సైంటిస్టు జర్నల్ (2022 మార్చి 14) లోని ఒక నివేదిక ప్రకారం, 9 కోట్ల టన్నుల ఆహారధాన్యాలను ఇథనాల్ కోసం మళ్లించారు. ఇక యూరో పియన్ యూనియన్ గోధుమలు, మొక్కజొన్నతో సహా కోటి 20 లక్షల టన్నులను ఆటోమొబైల్స్ కోసం ఆహారంగా ఉపయోగిస్తోంది. ఇంకా, 35 లక్షల టన్నుల పామాయిల్ను ఈయూ డీజిల్ ఉత్పత్తి కోసం మళ్లించింది.రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆహార సరఫరాలు దెబ్బతిన్నప్పుడు ఇదంతా జరిగింది. అమెరికా, యూరోపియన్ యూనియన్ లలో జీవ ఇంధన ఉత్పత్తిలో కేవలం 50 శాతం తగ్గించినట్లయితే, అలా ఆదా చేసిన ధాన్యం... యుద్ధం వల్ల ఏర్పడిన మొత్తం ఆహార కొరతను తీర్చగలదు. గోధుమ, వరి వంటి పంటల్లో కిరణజన్య సంయోగక్రియను పెంపొందించడం, ప్రధాన తృణ ధాన్యాలలో జీవసంబంధమైన నత్రజనిని స్థిరీకరించడం, వార్షిక పంటలను శాశ్వత పంటలుగా మార్చడం, పంటల వ్యవస్థను వైవిధ్యీకరించడం, సూక్ష్మజీవులు – శిలీంధ్రాల నుండి పోషకాలు అధికంగా ఉండే ఆహార పదార్థాలను సృష్టించటం వంటి అవసరమైన పరివర్తనా ప్రయత్నాలను చేపట్టాలని ఈ లేఖ కోరుతోంది. ‘‘బిలియన్ల కొద్దీ ప్రజలకు ఆరోగ్యకరమైన, ఉత్పాదక, సురక్షితమైన జీవితాలను కల్పించడం వల్ల కలిగే ప్రయోజనం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతటా విస్తృతంంగా రాబడిని ప్రవహింపజేస్తుంది’’ అని అంగీకరించాలని ఆ లేఖ పేర్కొంది.వ్యవసాయ పరిశోధనలో పెట్టే పెట్టుబడి బహుళ రాబడిని కలిగిస్తుందని చూపడానికి తగినన్ని ఆధారాలు ఉన్నప్పటికీ, ‘‘భవి ష్యత్తులో విజయవంతమైన ఆహార వ్యవస్థను నడిపించే ఆవిష్క రణకు పునాదిగా సమాజం స్పాన్సర్ చేసిన పరిశోధన ఉండాలని’’ కూడా నివేదిక పిలుపునిచ్చింది. అయితే ప్రభుత్వ ప్రాయోజిత పరిశోధనకు ప్రాధాన్యం ఉందా, లేక ప్రైవేట్ పరిశోధనల ఆధిపత్యంపై ప్రాధాన్యం ఉందా అనేది ఇంకా అస్పష్టంగానే ఉంది. ప్రజలకు ఆరోగ్యకరమైన, తక్కువ ఖర్చుతో కూడుకున్న స్థిరమైన ఆహారాన్ని అందించడంలో బహుళ మార్కెట్ వైఫల్యాల గురించి ఈ లేఖ మాట్లాడుతుంది. అయితే ఇంకా అతి పెద్ద ఉపద్రవం ఏమిటంటే, ప్రపంచంలోని ప్రతిచోటా వ్యవసాయ ఆదాయాలను పెంచడంలో మార్కెట్ల వైఫల్యం!నా అవగాహన ప్రకారం, స్థిరమైన వ్యవసాయ జీవనోపాధికి హామీ ఇచ్చేందుకు కఠినమైన ప్రయత్నాలు చేయకపోతే భవిష్యత్తులో ఆహారం, పోషకాహార భద్రతకు సంబంధించి సవాళ్లను ఎదుర్కో వడం కష్టం కావచ్చు. ఉదాహరణకు, 2024 సెప్టెంబర్లో ముగిసిన చివరి ఐదు సంవత్సరాలకు సంబంధించిన బడ్జెట్ కోసం అమెరికా వ్యవసాయ బిల్లు రైతులకు, వ్యవసాయానికి 1.8 ట్రిలియన్ డాలర్లను కేటాయించింది. అయినప్పటికీ ఈ సంవత్సరం ఐదుగురు రైతుల్లో ఒకరు వ్యవసాయం మానేస్తారని అమెరికా అంచనా వేస్తోంది. నిజానికి, సరకుల ధరలు తక్కువగా ఉండడం, అధిక ఉత్పత్తి వ్యయం కారణంగా రైతులు ఎదుర్కొన్న నష్టాన్ని పూడ్చడానికి 10 బిలియన్ డాలర్ల తక్షణ సాయం వాగ్దానం చేసింది. అయినప్పటికీ ఈ పరిణామం జరగబోతోంది. కొత్త వ్యవసాయ బిల్లు–2024 ఆమోదం కోసం వేచి ఉంది.గత సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో 24 దేశాల్లో రైతుల నిరసన తర్వాత యూరోపియన్ యూనియన్లో హామీ ఇచ్చిన వ్యవసాయ ఆదాయం ఒక సాధారణ సూత్రంగా ముందుకొచ్చింది. పక్షం రోజుల క్రితం ఫ్రాన్స్లోని చిన్న రైతుల సమాఖ్య అయిన కాన్ఫెడరేషన్ పేజన్, వ్యవసాయ ఆదాయాన్ని వ్యవసాయ ఆహార సరఫరా గొలుసుకు చెందిన సర్దుబాటు అస్థిరతగా వదిలివేయ కూడ దని పిలుపునిచ్చింది. రైతులకు హాని కలిగించే విధంగా దిగువ స్థాయి అదనపు మార్జిన్లను సమాఖ్య ఖండించింది. దీని అర్థం ఏమిటంటే ఆహార గొలుసులోని అన్ని ఇతర వాటాదారులు భారీ లాభాలతో ముందుకు వెళ్లిపోతున్నప్పటికీ, రైతు మాత్రం దాని అంచుల వద్దే మనుగడ సాగించాల్సి వస్తుంది.భారత్లో, పంజాబ్–హరియాణా సరిహద్దులో 11 నెలలకు పైగా జరుగుతున్న రైతుల నిరసన నేపథ్యంలో గమనిస్తే, 14 ఖరీఫ్ పంటలలో ఏడింటి మార్కెట్ ధరలు కనీస మద్దతు ధర కంటే 12 నుండి 26 శాతం తక్కువగా ఉన్నాయి. సంవత్సరాలుగా, వ్యవసాయ ఆదాయాలు స్తబ్ధుగా ఉంటున్నాయి లేదా కిందికి పడిపోతున్నాయి. నిజం చెప్పాలంటే, 2050లో 150 కోట్ల మంది అదనపు ప్రజలకు ఆహారమివ్వడం కచ్చితంగా సాధ్యమే. కానీ వ్యవసాయాన్ని ఆచరణీ యమైనదిగా, లాభదాయకమైనదిగా మార్చే కార్యాచరణ విధానం కీలకం. అప్పుడే అది సాధ్యం. దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ నిపుణులు -
కనీస ధరే రైతుకు భరోసా
భారతీయ రైతులు అభివృద్ధి నిచ్చెనలో అట్టడుగున ఉండటమే కాకుండా, దాదాపు పాతికేళ్లుగా ఏటా నష్టాలను చవిచూస్తున్నారు. వ్యవసాయ మార్కెట్ శక్తుల దయాదాక్షిణ్యాలకు ప్రభుత్వాలు రైతులను వదిలేశాయి. శాశ్వత పేదరికం నుండి రైతులను బయటపడేయడానికి ఉన్న ఏకైక ఆమోదయోగ్యమైన మార్గం – కనీస మద్దతు ధరకు హామీ ఇచ్చే చట్టాన్ని తేవడమే! చట్టపరమైన కనీస మద్దతు ధర వినియోగదారులపై ధరల భారాన్ని పెంచుతుందనీ, తద్వారా అది మార్కెట్లను దెబ్బతీస్తుందనీ ఆర్థికవేత్తలు భావిస్తుంటారు. అదే కార్పొరేట్లు వినియోగదారులపై ధరల భారాన్ని మోపినప్పుడు మాత్రం వీళ్లు నిశ్శబ్దంగా ఉంటారు. చట్టబద్ధంగా హామీ ఇచ్చే కనీస మద్దతు ధరను అందించడం వ్యవసాయ రంగం ఎదురుచూస్తున్న పెద్ద సంస్కరణ.ఏకీకృత పెన్షన్ పథకం (యూపీఎస్) ప్రభుత్వ ఉద్యోగులకు గౌరవాన్ని, ఆర్థిక భద్రతను కల్పిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దాన్ని పెన్షన్ సంస్కరణ అన్నారు. దేశ ప్రగతికి గణనీయంగా దోహదపడే ప్రభుత్వ ఉద్యోగులందరి కృషిని చూసి గర్విస్తున్నామని కూడా అన్నారు.చివరిగా ఉద్యోగి పొందిన వేతనంలో 50 శాతానికి సమానమైన పెన్షన్కు హామీ ఇచ్చే యూపీఎస్, వాస్తవానికి మునుపటి మార్కెట్ అనుసంధానిత నూతన పెన్షన్ స్కీమ్(ఎన్పీఎస్) ప్రభుత్వ ఉద్యోగు లకు మేలు చేయలేదని అంగీకరించింది. ప్రభుత్వ ఉద్యోగులకు ‘నిర్ధారిత ప్రయోజనపు’ హామీ ఇవ్వడం కోసం, వాళ్లు మార్కెట్ల దౌర్జ న్యాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా కేంద్ర మంత్రిమండలి పెన్షన్ పథకాన్ని సవరించింది.ప్రధానమంత్రి అనేక సందర్భాల్లో దేశంలోని రైతులను ప్రశంసించినప్పటికీ తమ పంటలకు హామీ ధరలు ఉండాలని దీర్ఘకాలంగా చేస్తున్న డిమాండ్ను మాత్రం పట్టించుకున్న నాథుడు లేడు. ఉద్యోగు లకు భరోసా పెన్షన్ అవసరమైనప్పుడు, రైతులకు కూడా భరోసా ధర అవసరమే.ప్రపంచంలో ఎక్కడా మార్కెట్లు రైతులకు అధిక ఆదాయాన్ని అందించడం లేదు. ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో సబ్సిడీ ఆదాయ అంత రాన్ని భర్తీ చేస్తుంది. వ్యవసాయ రాయితీలను అందించడంలో చైనా అగ్రస్థానంలో ఉంది. భారతదేశం మాత్రం వ్యవసాయ మార్కెట్ శక్తుల దయాదాక్షిణ్యాలకు రైతులను వదిలేసింది. కొన్ని అధ్యయనాలు చెబుతున్నట్టుగా, భారతీయ రైతులు అభివృద్ధి నిచ్చెనలో అట్టడుగున ఉండటమే కాకుండా, దాదాపు పాతికేళ్లుగా ఏటా నష్టాలను చవి చూస్తున్నారు.శాశ్వత పేదరికం నుండి రైతులను బయటపడేయడానికి ఏకైక ఆమోదయోగ్యమైన మార్గం, వ్యవసాయ ధరలకు హామీ ఇవ్వడం కోసం ఒక చట్టబద్ధమైన ఫ్రేమ్వర్క్ను రూపొందించడం. కనీస మద్దతు ధర (ఎంఎస్పి)కి హామీ ఇచ్చే చట్టం మార్కెట్లను అస్తవ్యస్తం చేస్తుందని ఎన్డీయే ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. విచిత్రమేమిటంటే, రైతుల విషయానికి వచ్చేసరికి, విధాన నిర్ణేతలు మార్కెట్లు అస్తవ్యస్తం అవుతాయన్న పల్లవిని ఎత్తు కుంటారు. అదే ఉద్యోగుల విషయంలో అంతా బానేవుంటుంది. మార్కెట్ల అస్తవ్యస్త భయం అకస్మాత్తుగా అదృశ్యమవుతుంది.చట్టపరమైన కనీస మద్దతు ధర వినియోగదారులపై ధరల భారాన్ని పెంచుతుందనీ, తద్వారా అది మార్కెట్లను దెబ్బతీస్తుందనీ ప్రధాన ఆర్థికవేత్తలు విశ్వసిస్తున్నారు; వాస్తవంలో, ఇది కార్పొ రేట్ల లాభాలను పిండేస్తుంది కాబట్టే నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అదే స్వేచ్ఛా మార్కెట్ ప్రబోధక ఆర్థికవేత్తలు అమెరికాలోని కార్పొరేట్లు వినియోగదారులపై ధరల భారాన్ని మోపినప్పుడు మాత్రం నిశ్శబ్దంగా ఉంటారు. ఇదీ నిజానికి ధరలను వక్రీకరించడం. అందుకే ఇప్పటికే కాలిఫోర్నియా, ఫ్లోరిడా, న్యూయార్క్తో సహా 38 రాష్ట్రాలు ఈ ధరల పెరుగుదలను నిషేధించే చట్టాలను తెచ్చాయి. ఉదాహరణకు, కోవిడ్ మహమ్మారి సమయంలో హ్యాండ్ శానిటైజర్ల ధరలను 400 శాతం మేరకు పెంచిన కంపెనీలకు వ్యతిరేకంగా న్యూయార్క్ రాష్ట్రం చర్యలు తీసుకుంది. అయినప్పటికీ చాలామంది మార్కెట్ సమర్థక ఆర్థిక వేత్తలు స్పష్టంగా కనిపిస్తున్న ఈ మార్కెట్ వక్రీకరణలపై జరిగే ఇటువంటి తనిఖీలను సోవియట్ శైలి ధరల నియంత్రణగా పేర్కొంటున్నారు.రైతులకు ఆర్థిక భద్రత కల్పించాల్సిన సమయంలో మార్కెట్కు అనుకూలమైన పక్షపాత దృష్టి పెరుగుతుంది. కానీ కార్పొరేట్లు విని యోగదారుల రక్తమాంసాలను పీల్చివేయడం కోసం ధరలను పెంచి నప్పుడు మాత్రం ఎవరూ మాట్లాడరు. మార్కెట్ వక్రీకరణ అనే ఈ ద్వంద్వ ప్రమాణం రైతులకు జీవన ఆదాయాన్ని అందించే మార్గంలో అడ్డుగా నిలుస్తోంది. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా, మార్కెట్లు రైతుల హామీ ధరలకు అనుగుణంగా వాటికవే సర్దుబాటు చేసుకుంటాయి. కేవలం భావజాలమే దీనికి అడ్డు నిలుస్తోంది.మహమ్మారి తర్వాత ఆహారం, కిరాణా వస్తువుల ధరలు 53 శాతం పెరగడానికి కారణమైన కార్పొరేట్ ధరల పెరుగుదలపై నిషేధం విధించాలని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పిలుపునిచ్చారు. రిపబ్లికన్లు ఆమె వైఖరిని ‘కమ్యూనిస్ట్’ అన్నారు. మితవాద పక్షం ఏదైనా చెప్పనీ... కొందరు ఆర్థికవేత్తలు అంగీకరించినట్లుగా, ధరల పెరుగుదలపై నిషేధం అనేది మంచి ఆర్థిక శాస్త్రం, మంచి రాజకీయం అనే అభిప్రాయాన్ని ఎవరూ తిరస్కరించడం లేదు. ఈ సందర్భంగానే, ఆహార పదార్థాల ధరలను కృత్రిమంగా ఎక్కువగా ఉంచుతున్న కంపెనీలపై చర్యలు తీసుకుంటామని కమలా హారిస్ హామీ ఇచ్చారు.ఉద్యోగుల పెన్షన్ విషయానికి తిరిగి వస్తే, కేంద్ర వ్యయ శాఖ ఈ నిర్ణయాన్ని సమర్థించేందుకు అన్ని ప్రయత్నాలూ చేయడం ఆసక్తికరం. ఇది ‘ఆర్థికంగా వివేకవంతమైన’ నిర్ణయమనీ, ‘ఇది భవిష్యత్ తరాల పౌరులకు ఆర్థిక కష్టాలను నివారిస్తుం’దనీ పేర్కొంది. ఉద్యోగు లకు ఇస్తున్న హామీ పెన్ష¯Œ పథకానికి ఎవరూ వ్యతిరేకం కాదు. ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించగలుగుతున్నప్పుడు, రైతులకు ఆర్థిక భద్రత కల్పించలేకపోవడానికి కారణం ఏదీ లేదు. ఎందుకంటే రైతులు కూడా దేశ ప్రగతికి గణనీయంగా దోహదపడుతున్నారు. వారి నిర్విరామ కృషి వల్లే దేశానికి ఆహార భద్రత ఏర్పడింది.మధ్యప్రదేశ్లోని మందసౌర్ జిల్లాకు చెందిన కమలేశ్ పాటీదార్ అనే రైతు తన పదెకరాల్లోని సోయాబీన్ పంటను దున్నివేసినప్పుడు, అది ఒక గొలుసుకట్ట చర్యను ప్రేరేపిస్తుందని అతను అనుకోలేదు. ఈ సంఘటన తాలూకు వీడియో వైరల్ అయిన కొద్ది రోజులకే, చాలా మంది రైతులు తమ పంటను దున్నేశారని వార్తలొచ్చాయి.సోయాబీన్ ధరల పతనం... అది కూడా, కోత కాలానికి నెలన్నర ముందు ధరలు పడిపోవడం అనేది, రైతులు మంచి ధరను పొందే వరకు పంటను నిల్వ ఉంచుకోవాలని సూచించే మరొక ఆర్థిక నమ్మ కాన్ని పోగొట్టింది. తర్వాతైనా ఎక్కువ ధర వస్తుందనే ఆశతో కమలేష్ పాటీదార్ గత ఏడాది పండించిన పంటను అలాగే నిల్వ ఉంచు కున్నాడు. అది కూడా ఫలించలేదు.సోయాబీన్ ధరలు పన్నెండేళ్ల క్రితపు స్థాయికి పడిపోవడంతో వ్యవసాయ జీవనోపాధి ధ్వంసమైన లక్షలాది మంది రైతులకు ఇది ఆగ్రహం కలిగించింది. కనీస మద్దతు ధర కంటే చాలా తక్కువగా ఉన్న ధరలు ఉత్పత్తి ఖర్చులకు కూడా సరిపోవు. భవిష్యత్ తరాల రైతులకు మాత్రమే కాకుండా ప్రస్తుత రైతులకు కూడా ఆర్థిక కష్టాలను నివారించే భరోసా ధరల విధానం ఎప్పుడు వస్తుందా అని నేను ఎదురుచూస్తున్నాను.ఆ తర్వాత, టమోటా ధరలు 60 శాతం క్షీణించి, 25 కిలోల పెట్టెకు 300 రూపాయల కనిష్ఠ స్థాయికి చేరుకున్నాయని వార్తలొచ్చాయి. అనంతరం, బాస్మతి బియ్యం ధర క్వింటాల్కు 28 శాతం తగ్గి రూ. 2,500కు చేరుకుందని వార్తలొచ్చాయి. ఇది ఈ సంవత్సరం మాత్రమే జరిగిన ప్రత్యేకమైన ఘటనలు కావు. ఇది దేశం ఏమాత్రం ఆందోళన చెందని బాధాకరమైన వార్షిక ధోరణిగా తయారైంది.అమ్ముకోదగినంత మిగులు ఉన్న రైతులకు చట్టబద్ధంగా హామీ ఇచ్చే కనీస మద్దతు ధరను అందించడం, సన్నకారు రైతులకు ప్రత్యక్ష ఆదాయ మద్దతులను అందించడం అనేవి వ్యవసాయ రంగం ఎదురు చూస్తున్న పెద్ద సంస్కరణలుగా చెప్పాలి.దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులుఈ–మెయిల్: hunger55@gmail.com -
మద్దతు ఇవ్వడమే శాశ్వత పరిష్కారం
యూరప్లో కనివిని ఎరుగని వ్యవసాయ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్రాన్స్లో ప్రారంభమై, జర్మనీకి వ్యాపించి, రొమేనియా, నెదర్లాండ్స్, పోలండ్, బెల్జియం దేశాలను కూడా తాకాయి. మరోవైపు దేశంలో పంజాబ్, హరియాణా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల రైతులు తమ నిరసన ప్రదర్శన కోసం ఢిల్లీకి వెళ్లడానికి మళ్లీ సిద్ధమవుతున్నారు. వ్యవసాయ మార్కెట్ల క్రమబద్ధీకరణను ఎత్తివేయడం, వ్యవసాయంపై కార్పొరేట్ నియంత్రణను తీసుకురావడం ఆచరణీయమైన ప్రత్యామ్నాయాలు కావని ఐరోపా అనుభవాలు చాటుతున్నాయి. మార్కెట్లను సరళీకరించడం అనేది వ్యవసాయ ఆదాయాన్ని పెంచడంలో విఫలమయింది. అందుకే భారతీయ రైతులు కనీస మద్దతు ధర కోసం చట్టపరమైన ఫ్రేమ్వర్క్ను కోరుతున్నారు. ప్రస్తుతం వ్యవసాయదారుల నిరసనలు ఫ్రాన్స్లో ప్రారంభమై, జర్మనీకి వ్యాపించాయి. అక్కడ కోపోద్రిక్తులు అయిన రైతులు బెర్లిన్ ను దాదాపుగా స్తంభింపజేశారు. ఇప్పుడు మళ్లీ ఈ నిరసన ఫ్రాన్స్కు తిరిగి వచ్చింది. ఆగ్రహించిన రైతులు ప్యారిస్ను ట్రాక్టర్లతో ముట్టడిస్తామని హెచ్చరించారు. వ్యవసాయదారుల ప్రకంపనలు రొమేనియా, నెదర్లాండ్స్, పోలాండ్, బెల్జియంలకు కూడా విస్తరించాయి. స్పానిష్ రైతులు కూడా నిరసనల్లో పాల్గొనాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రైతులు ట్రాఫిక్ని అడ్డుకుని ప్రభుత్వ భవనాలపై పేడ చల్లుతున్నారు. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్, సభ్య దేశాలలో వ్యవసాయ సమాజంలో పెరుగుతున్న నిరుత్సాహాన్ని, నిరాశను గుర్తించడం ద్వారా బ్రస్సెల్స్లోని యూరోపియన్ పార్లమెంట్లో చర్చను ప్రారంభించారు. ‘ఎటువంటి ప్రశ్న లేకుండా, సవాళ్లు పెరుగుతున్నాయని మేము అందరం అంగీకరిస్తాము. విదే శాల నుండి పోటీ కావచ్చు, స్వదేశంలో అధిక నియంత్రణ కావచ్చు, వాతావరణ మార్పు కావచ్చు లేదా జీవవైవిధ్యం కోల్పోవడం... పేర్కొనడానికి ఇవి కొన్ని అంశాలు’ అని ఆమె అన్నారు. కానీ సమస్యలను ప్రస్తావించడంలో ఆమె విఫలమైన విషయం ఏమిటంటే... రైతులకు భరోసా ఇవ్వకపోవటం, సరైన ధరను నిరాకరించడం పైనే ప్రధానంగా రైతుల ఆగ్రహం ఉంటోందని. ఉక్రెయిన్ (లేదా ఇతర ప్రాంతాల) నుండి వస్తున్న దిగుమతులు ధరలు తగ్గడా నికి కారణమయ్యాయి. అలాగే అనేక దశాబ్దాలుగా వ్యవసాయ వాహ నాలకు ఇస్తున్న డీజిల్ సబ్సిడీని ఉపసంహరించుకున్నారు. వాస్తవికత ఏమిటంటే వ్యవసాయ ఆదాయం క్రమంగా క్షీణించడం. ‘మాకు ప్రోత్సాహకాలు అక్కర్లేదు. మా ఉత్పత్తులు విలువైనవి, అవి మంచి ధరలకు విక్రయం అవాలని మేము కోరుకుంటున్నాము’ అని ఆగ్రహించిన ఒక బెల్జియన్ రైతు చెప్పాడు. వీటన్నింటికీ నిరసనగా వేలాది ట్రాక్టర్లతో ముట్టడించడానికి యూరోపియన్ రైతులను నడిపిస్తున్న నిరాశను ఆయన క్రోఢీకరించాడు. ‘మేము చనిపోవడానికి మాత్రమే ఇక మిగిలి ఉన్నాము’ అని మరొక బెల్జియన్ రైతు వ్యాఖ్యానించాడు. ఫ్రాన్ ్స రైతులలో మూడింట ఒకవంతు మంది కేవలం నెలకు 300 యూరోల (సుమారు రూ. 27,000)తో జీవిస్తున్నారనీ, ఎంపీల భత్యాలను మరో 300 యూరోలు పెంచడాన్ని వ్యతిరేకిస్తున్నారనీ ఒక ఫ్రెంచ్ ఎంపీ ఇటీవల అన్నారు. రైతులు నిరసనల తరుణంలో ఎంపీ లకు భత్యాల పెంపుపై తీవ్ర వ్యతిరేకత వస్తుందని భావించి వాటిని తాత్కాలికంగా ఉపసంహరించుకున్నారు. జర్మనీలో 2016–23 సంవ త్సరాల మధ్య, వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అధ్వాన్నంగా ఉందని వ్యవసాయ ఆర్థిక బారోమీటర్ సూచిక చూపిస్తోంది. రొమేనియాలో నికర వ్యవసాయ ఆదాయం 2023లో 17.4 శాతం క్షీణించింది. ఈ పరిస్థితి యూరప్కే పరిమితం కాదు. ‘వారు మమ్మల్ని ప్రపంచ పటం నుండి తుడిచివేయడానికి ప్రయత్నిస్తున్నారు’ అని అమెరికాలోని చిన్న రైతులను ఉటంకిస్తూ వచ్చిన మీడియా నివేదిక లను ఇది నాకు గుర్తు చేస్తోంది. అమెరికాలో గ్రామీణ ఆత్మహత్యలు జాతీయ సగటు కంటే 3.5 రెట్లు అధికంగా ఉండటంతో, వ్యవసాయ మాంద్యంలో పెరుగుతున్న ఆటుపోట్లను పరిష్కరించడం జాతీయ సమస్యగా మారుతోంది. భారతదేశంలో 2022లో 11,290 మంది రైతులు, వ్యవసాయ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతు పట్ల మార్కెట్లు అవగాహనతో ఉన్నట్లయితే రైతులు ప్రపంచ వ్యాప్తంగా అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొనేవారు కాదు. ఇంకా, వ్యవ సాయ సంక్షోభానికి శాశ్వత పరిష్కారాన్ని కనుగొనే బదులు, వ్యవసాయం నుండి రైతులను తప్పించడానికి యూరోపియన్ దేశాల ప్రభుత్వాలకు వాతావరణ మార్పు ఉపయోగపడుతోంది. ‘రైతుల నిరసనలు సమర్థనీయమైనవే’ అని రొమేనియా ప్రధాన మంత్రి మార్చెల్ చొలాకూ అంగీకరించారు. కొత్తగా నియమితులైన ఫ్రెంచ్ ప్రధాని గాబ్రియేల్ అటల్ తమ ప్రభుత్వం ‘వ్యవసాయాన్ని అన్నింటికంటే ఉన్నత స్థాయిలో ఉంచాలని’ నిర్ణయించుకున్నట్లు చెప్పారు. వ్యవసాయానికి డీజిల్ సబ్సిడీని ఒకేసారి రద్దు చేయడానికి బదులుగా దశలవారీగా తొలగించాలని జర్మనీ ఇప్పటికే నిర్ణయించింది. ఈ హామీలు ఉన్నప్పటికీ, రైతులకు భరోసాగా ఆదాయాన్ని అందించడంలో మార్కెట్ల వైఫల్యం, వ్యవసాయ రంగంలో పెరుగు తున్న నిరుత్సాహం వెనుక ఉన్న అసలు విలన్ను యూరోపియన్ నాయకులెవరూ ఎత్తి చూపలేకపోయారనేది వాస్తవం. వ్యవసాయ మార్కెట్ల క్రమబద్ధీకరణను ఎత్తివేయడం, వ్యవ సాయంపై కార్పొరేట్ నియంత్రణను తీసుకురావడం ఆచరణీయమైన ప్రత్యామ్నాయం అయివుంటే, ఐరోపా ఇప్పుడు దశాబ్దంగా ఎక్కడో ఒకచోట పునరావృతమౌతున్న రైతుల అశాంతిని ఎదుర్కొనేందుకు ఎటువంటి కారణమూ లేకపోయేది. మార్కెట్లను సరళీకరించడం అనేది వ్యవసాయ ఆదాయాన్ని పెంచడంలో విఫల మయిందని ఇప్పుడు స్పష్టంగా చెప్పాలి. వ్యవసాయ ధరలను తక్కువగా ఉంచడం ద్వారా ఆర్థిక సంస్కరణలను ఆచరణీయంగా ఉంచడానికి రూపొందించిన స్థూల ఆర్థిక విధానాలు ప్రాథమికంగా లోపభూయిష్టంగా ఉన్నా యని ఇది చూపిస్తుంది. ఆహార ద్రవ్యోల్బణాన్ని తక్కువగా ఉంచడంపై దృష్టి కేంద్రీకరించినప్పటికీ, ద్రవ్యోల్బణం యొక్క నిజమైన చోదక శక్తులైన గృహ నిర్మాణం, విద్య, ఆరోగ్యం ఉద్దేశపూర్వకంగా దూరంగా ఉంచబడ్డాయి. అది స్థూల ఆర్థిక వంచన. రైతులు తరచుగా ఎదుర్కొంటున్న నష్టాలను పూడ్చేందుకు మరిన్ని ప్రోత్సాహకాలు అందించడం శాశ్వత పరిష్కారం కాదని స్పష్టంగా అర్థమైంది. 2020–22లో సంవత్సరానికి 107 బిలియన్ డాలర్ల భారీ మద్దతును గుమ్మరించినప్పటికీ (ఏదేమైనప్పటికీ, సబ్సిడీలు, ప్రత్యక్ష ఆదాయ మద్దతును అత్యధికంగా స్వీకరించే వారిలో యూరోపియన్ రైతులే ఎక్కువగా ఉన్నారు) వ్యవసాయ జనాభాను చెక్కుచెదరకుండా ఉంచడంలో విఫలమయ్యారు. 2023లో యూరోపియన్ వ్యవసాయ నిరసనల కోపాన్ని కూడా అది తగ్గించలేదు. 2024 ప్రారంభం ఆందోళన విస్తరిస్తున్నట్లు, ఇంకా తీవ్రతరం అవబోతున్నట్లు కనిపిస్తోంది. భారతదేశంలోని రైతు సంఘాల డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా వర్తిస్తుండటం ఇక్కడే నేను చూస్తున్నాను. ప్రోత్సాహకాల కోసం అడగడానికి బదులుగా, భారతీయ రైతులు కనీస మద్దతు ధర కోసం చట్టపరమైన ఫ్రేమ్వర్క్ను కోరుతున్నారు. కనీస మద్దతు ధరని రూపొందించే ఫార్ములాకు పునర్విమర్శ అవసరం అయినప్పటికీ, మార్కెట్ల దయాదాక్షిణ్యాలకు వదిలేస్తే, వ్యవసాయ జనాభా త్వర లోనే అంతరించిపోతుందని యూరోపియన్ రైతులు అర్థం చేసు కోవాలి. వ్యవసాయాన్ని ఆచరణీయమైనదిగా మార్చడానికి, వ్యవ సాయ ధరలకు కచ్చితమైన హామీ ఇస్తూ, నిర్దేశిత ధర కంటే తక్కువ కొనుగోళ్లకు అనుమతి లభించకుండా చూసుకోవడం ఒక్కటే మార్గం. హామీ ఇవ్వబడిన వ్యవసాయ ధరలు మార్కెట్లను అస్తవ్యస్తం చేస్తాయని ప్రధాన ఆర్థికవేత్తలు వాదిస్తారు. మార్కెట్లు సర్దుబాటు అవుతాయి, ఆ పేరుతో రైతులకు జీవన ఆదాయాన్ని తిరస్కరించ లేము. ధర విధానాలలో చరిత్రాత్మక దిద్దుబాటుకు ఇది సమయం. ఏ రైతూ బాధను అనుభవించకుండా లేదా అతని జీవితాన్ని బలవంతంగా ముగించకుండా ఇది నిలుపుతుంది. దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com -
సన్నకారుకు నారూ నీరూ!
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో ప్రస్తుతం ఒక ఫలవంతమైన మార్పు నిశ్శబ్దంగా జరుగుతోంది. ఇది సరికొత్త సన్నకారు వ్యవసాయానికి పరివర్తనను రూపొందిస్తోంది. ఏపీలో ఎనిమిది లక్షల మంది రైతులు రసాయనాల నుంచి పూర్తిగా రసాయనేతర వ్యవసాయం వైపు మళ్లారు. లేదా పరివర్తన దశలో ఉన్నారు. 2031 నాటికి రాష్ట్రంలో మొత్తం 60 లక్షల వ్యవసాయ జనాభాను రసాయనాల నుండి సహజ వ్యవసాయానికి తరలించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అంటే రైతు సంక్షేమానికి నారు, నీరు నీరు పోయడమే! కార్పొరేట్ ప్రయోజనాలకు మాత్రమే సరిపోయే కాలం చెల్లిన ఆర్థిక విధానాలను నియంత్రించడం ద్వారా ఏపీ ప్రభుత్వం ఈ అద్భుతమైన మార్పును సాకారం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా వీరపనేని గూడెం గ్రామానికి చెందిన సన్నకారు రైతు మహిళ రాధిక. ఆమెకు 1.1 ఎకరాల భూమి మాత్రమే ఉంది. దాంట్లో సహజ వ్యవసాయం సాగుతోంది. తన కొడుకు ఎంబీఏ చేశాడని, కూతురు అమెరికాలో చదువుతోందని ఆమె చెప్పినప్పుడు నేను నమ్మ లేకపోయాను. పిల్లలు బాగా చదువుతున్నందున ఆమె వ్యవసా యాన్ని ఎందుకు వదిలిపెట్టలేదని అడిగాను. అందుకు ఆమె ‘‘నేను నా పని వదులుకుని వారితో కలిసి జీవించాలని నా పిల్లలు కోరుకుంటారు. కానీ మీరు ఏం చేస్తున్నారో అది చేయండి. అలాగే నేను ఏం చేస్తూ ఆనందిస్తున్నానో ఆ పనిని చేయనివ్వండి అని వారికి చెబుతు న్నాను’’ అని పేర్కొంది. ఆమె సహజసాగు పంట పద్ధతిని అనుస రిస్తోంది, దీనినే ఏటీఎమ్ (ఎనీ టైమ్ మనీ) అని పిలుస్తారు. ఇది ఆమెకు క్రమం తప్పకుండా ఆదాయాన్ని అందిస్తోంది. ఏటీఎమ్ అనేది ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ–నిర్వహణలోని సహజ వ్యవసాయ కార్యక్రమం కింద పొందుపరిచిన కార్యకలాపాల వర్గీకర ణలో ఒక రూపం, ఇది ప్రకృతికి అనుగుణంగా వ్యవసాయం చేయ డంలో భాగం. రెండు దశాబ్దాల క్రితం ఖమ్మం జిల్లాలోని పునుకల గ్రామం నుంచి ప్రారంభమైన ఈ వ్యవసాయ– పర్యావరణ సేద్య విధానం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాల్లోని 3,730 గ్రామాలకు విస్తరించింది. ఎనిమిది లక్షల మంది రైతులు రసాయనాల నుంచి పూర్తిగా రసాయనేతర వ్యవసాయం వైపు మళ్లారు లేదా పరివర్తన దశలో ఉన్నారు. 2031 నాటికి రాష్ట్రం మొత్తం 60 లక్షల వ్యవసాయ జనాభాను రసాయనాల నుండి సహజ వ్యవసాయానికి తరలించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మైసమ్మ ఎన్టీఆర్ జిల్లా బత్తినపాడు గ్రామానికి చెందిన మహిళ. ఆమె రెండు ఎకరాల్లో పత్తి సాగు చేసేది. 2018లో సహజ వ్యవసాయం వైపు మళ్లింది. తన కూతురు ఏరోనాటికల్ ఇంజనీర్ అని చెప్పినప్పుడు, ఒక్క క్షణం నేను ఒక మధ్యతరగతి గృహిణితో మాట్లా డుతున్నట్లు అనిపించింది. అయితే వీరు చిన్న, సన్నకారు రైతులు. ఎక్కువగా మహిళలు. ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వీరు వాతావరణాన్ని తట్టుకోగల, పర్యావరణానికి ఆరోగ్యకరమైన సహజ వ్యవసాయ విధానపు సద్గుణాలు, బలాలతో పాటు దాని అపారమైన సంభావ్యత గురించి తమ అనుభవాలను పంచుకున్నారు. వారిలో కొందరికి, సగటున 1 ఎకరం కంటే తక్కువ భూమి ఉంది. కొంతమందికి 0.10 నుండి 0.50 సెంట్ల వరకు భూమి ఉంది. ఏపీసీఎన్ఎఫ్ (ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్)కి చెందిన గుంటూరు ప్రధాన కార్యాలయంలో వీరు సమావేశ మయ్యారు. దీనిని ప్రభుత్వ యాజమాన్యంలోని రైతు సాధికార సంస్థ (ఆర్వైఎస్ఎస్) నిర్వహిస్తోంది. ప్రధాన స్రవంతి ఆలోచన ఆచరణీయమైన ప్రత్యామ్నాయాలను అమలు చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తుందో వెనువెంటనే స్పష్ట మైంది. చిన్న భూకమతాలు తరచుగా పనికిరానివిగా పరిగణించ బడతాయి కాబట్టి భూ సంస్కరణలు, కార్మిక సంస్కరణల పేరుతో ఆర్థికవేత్తలు, కార్పొరేట్ నాయకులు వ్యవసాయం నుండి వారిని మిన హాయించాలని వాదించారు, చిన్న కమతాల్లో పనిచేసేవారిని పట్టణ శ్రామికశక్తిలో ఏకీకృతం చేయాలని కోరుతారు. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక రూపకల్పన చిన్న, సన్నకారు రైతులను ఆర్థిక భారంగా మారుస్తుంది. కానీ కొద్దిగా చేయూత నివ్వడంతోపాటు తగిన మార్కె టింగ్ కార్యక్రమాలు ఈ పొలాలను ఆచరణీయంగా మార్చగలవు, ఇవి భూగ్రహాన్ని వేడి చేయవు. గాలి, నీరు, నేలను విషపూరితం చేయవు. 50 సంవత్సరాల కాలంలో 51 దేశాలలో నిర్వహించిన అధ్యయనాల నుండి సేకరించిన డేటాతో కొంతకాలం క్రితం ‘నేచర్’ పత్రికలో వచ్చిన ఒక వ్యాసం నాకు గుర్తొస్తోంది. సాధారణంగా భావించే అవగాహనకు విరుద్ధంగా, చిన్న పొలాలు మరింత ఉత్పాద కత కలిగి ఉండి పర్యావరణపరంగా స్థిరమైనవి అని ఆ వ్యాసంలో పేర్కొన్నారు. కానీ అలాంటి అధ్యయనాలు ప్రధాన స్రవంతి సైన్స్ విధానంలో భాగం కావు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు, మీడియా, విధాన నిర్ణేతలు వ్యవసాయ వ్యాపార దిగ్గజాల వాణిజ్య ప్రయోజనాలను దశాబ్దాలుగా ఆమోదించారు. ఇవి సాంద్ర వ్యవసాయాన్ని మినహాయించి, పర్యావరణపరంగా ఆరోగ్యకరమైన, సమాన ఉత్పాదక, స్థిరమైన ఆహార వ్యవస్థ వైపు వెళ్లే ప్రయత్నాలను నిరోధించాయి. అయినప్పటికీ ఒక నిశ్శబ్ద మార్పు జరుగుతోంది. ఇది కొత్త వ్యవసాయానికి పరివర్తనను రూపొందిస్తోంది. నేను దీనిని కొత్త వ్యవ సాయం అని పిలుస్తాను. ఎందుకంటే మిగులు ఉత్పత్తిపై ఎక్కువగా ఆధారపడే సాంప్రదాయిక ఏకరూప వ్యవసాయ పద్ధతులు వ్యవ సాయ భూములను ఎండిపోయేలా చేశాయి. భూములను నిర్వీర్యంగా మార్చాయి, భూగర్భ జలాలను తోడేశాయి. ఆహార గొలుసును కలుషితం చేశాయి. పైగా వ్యవసాయ జనాభా వ్యవసాయాన్ని విడిచిపెట్టి వలస వెళ్లవలసి వచ్చింది. ఇంకా ఇది మానవ వ్యాధులు, వాతావరణ అత్యవసర పరిస్థితుల అధిక భారానికి చెందిన ద్వంద్వ సవాళ్లకు దోహదపడింది. అయితే, పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా, భవిష్యత్తులో ఈ రకమైన వ్యవసాయం పరిమిత పాత్రతో మిగిలిపోతుంది. అందుకే ఆహార వ్యవస్థను వ్యవసాయ – పర్యావరణ వ్యవస్థ వైపు మళ్లించడం అనేది ఆహార భద్రత, పోషణను మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరిస్తుంది. ఆర్థికంగా లాభదాయక మైన జీవనోపాధిని ప్రోత్సహిస్తుంది. తద్వారా ఉపాధి కల్పనకు దోహదం చేస్తుంది. వ్యవసాయం గురించి పునరాలోచించడం ఈ కాలపు అవసరం. ఫిలిప్పీన్స్ నుండి వియత్నాం వరకు, కంబోడియా నుండి మెక్సికో వరకు; భారతదేశం నుండి అమెరికా వరకు, వ్యవసాయ–పర్యావరణ శాస్త్రం వైపు ఒక బలమైన, శక్తిమంతమైన ఉద్యమంగా నెమ్మదిగానే కావచ్చు కానీ స్థిరంగా విధానాలలో మార్పును తీసుకువస్తోంది. అయితే కార్పొరేట్ ప్రయోజనాలకు మాత్రమే సరిపోయే కాలం చెల్లిన ఆర్థిక విధానాలను విస్మరించాల్సిన అవసరం మాత్రం ఉంది. వ్యవ సాయ పరిశోధన, విద్య కోసం పర్యావరణ స్థిరత్వం వైపు పరివర్తనను ఎంచుకోవడం కూడా చాలా ముఖ్యమైనది. జన్యుపరంగా మార్పు చెందిన బీటీ పత్తి విఫలం కావడం వల్ల కలిగే విధ్వంసాన్ని తీసుకోండి. వెండి బుల్లెట్గా కీర్తించబడినది దుమ్ములో కలిసిపోయింది. మరోవైపు సేంద్రియ పద్ధతిలో పత్తి సాగు చేస్తున్న ఎన్టీఆర్ జిల్లాకు చెందిన లక్ష్మీనారాయణ వంటి రైతుల్లో నాకు ఆశ కనిపిస్తోంది. అతని పొలంలో 100 కంటే ఎక్కువ బంతులతో పెద్ద సంఖ్యలో మొక్కలు ఉన్నాయి. 50 కంటే ఎక్కువ ఆరోగ్యకరమైన బంతులు ఉన్న మొక్కను మంచి పంటగా పేర్కొనవచ్చు. ఎకరాకు 12 నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చిందని, ఇది చాలా ప్రోత్సా హకరంగా ఉందన్నారు. అదే విధంగా అదే జిల్లాకు చెందిన గోపాల రావు 3.5 ఎకరాల్లో సేంద్రియ వరి సాగు చేశాడు. రెండేళ్ల క్రితం సేంద్రియ వ్యవసాయానికి మారిన ఆయన ఎకరాకు దాదాపు 30 క్వింటాళ్ల పంట వస్తుందని చెప్పారు. రసాయనేతర వ్యవసాయం కాబట్టి ఇది సాంద్ర వ్యవసాయంతో సానుకూలంగా పోలిక అవుతుంది. దీనికి మరిన్ని పరిశోధనలు, ప్రభుత్వ రంగ పెట్టుబడులు అవసరం. ఏమైనా మనం వెనక్కి తగ్గకూడదు. చిన్న, సన్నకారు రైతులను చేయి చేయి పట్టి సరైన దిశలో నడిపిద్దాం. అప్పుడే వ్యవసాయం మరింత ఆశాజనకం అవుతుంది. దేవిందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ నిపుణులు -
ఆకలిపై పోరాటం జరిపిన శాస్త్రవేత్త
ఆయనను తరచుగా భారతదేశ హరిత విప్లవ పితామహుడిగా కీర్తిస్తారు. ఘనత వహించిన శాస్త్రవేత్త–వ్యవహర్త అయిన ప్రొఫెసర్ ఎం.ఎస్. స్వామినాథన్కు ‘వరల్డ్ ఫుడ్ ప్రైజ్’ తొలి అవార్డు వచ్చినప్పుడు, ఆయన్ని అప్పటి ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ కర్ట్ వాల్డ్హీమ్ ఒక లేఖలో ‘లివింగ్ లెజెండ్’ అని ప్రశంసించారు. స్వామినాథన్ మరణంతో ఒక శకం ముగిసింది. ‘ఓడ నుండి నోటికి’ అనే దుర్భర స్థితిలో ఉండిన దేశం ఆయన మార్గదర్శకత్వంలో వ్యవసాయంలో అద్భుతమైన విజయం సాధించింది. హరిత విప్లవ రూపశిల్పి అయినప్పటికీ ఎరువులు అధికంగా వాడితే కలిగే ప్రతికూల పరిణామాలు ఆయనకు తెలుసు. అలాగే రైతు క్షేమాన్నే ఎల్లవేళలా తలిచారు. ‘హరిత విప్లవ చరిత్ర వాస్తవానికి నాటి ప్రధాని ఇందిరా గాంధీతో కలిసి నేను చేసిన అరగంట కారు ప్రయాణంలో లిఖితమైంది,’ అని ఒకసారి స్వామినాథన్ నాతో చెప్పారు. వ్యవసాయ విప్లవానికి మద్దతు ఇవ్వడానికి కావలసిన రాజకీయ సంకల్పాన్ని పొందడం ఎంత కష్టమనే నా ప్రశ్నకు ఆయన జవాబిస్తూ, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీతో కలిసి న్యూఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్గా పూసా కాంప్లెక్స్లో ఒక భవన ప్రారంభోత్సవానికి వెళ్లిన సంగతిని గుర్తు చేసుకున్నారు. దారిలో ప్రధాని ఆయన్ని అడిగారు: ‘‘స్వామీ, మీరు చెబుతున్న కొత్త గోధుమ పొట్టి వంగడాల రకాలకు నేను అనుమతిస్తాను. కానీ, కొన్నేళ్లలో ఒక కోటి టన్నుల మిగులు గోధుమలు చూపుతానని మీరు నాకు మాటివ్వగలరా? ఈ ‘బ్లడీ అమెరికన్ల’ హింస నాకు తప్పాలి.’’ స్వామినాథన్ మాటిచ్చారు, తర్వాతిదంతా చరిత్ర! ‘ఓడ నుండి నోటికి’ అనే దుర్భర స్థితిలో ఉండిన దేశం అనంతరం వ్యవసాయంలో అద్భుతమైన విజయం సాధించింది. భారతదేశాన్ని స్వయం సమృద్ధ దేశంగానే కాకుండా, నికర ఎగుమతిదారుగా మార్చింది. తగిన విధానాల ద్వారా మద్దతు లభ్యమైన హరిత విప్లవ వీరోచిత గాథ, ప్రధానంగా ఆకలి ఉచ్చు నుండి బయటపడే లక్ష్యంపై దృష్టి పెట్టింది. 1943 బెంగాల్ క్షామం తర్వాత కేవలం నాలుగు సంవత్సరాల లోపే స్వాతంత్య్రం రావడంతో, ఆకలిని అధిగమించే సవాలు అప్పటికి ఎదుర్కోలేదు. దశాబ్దాలుగా, ఉత్తర అమెరికా నుండి పీఎల్–480 పథకం కింద భారత్కు ఆహారం వస్తూ ఉండేది. 1970ల మధ్య నాటికి భారతదేశంలోని సగం జనాభా కబేళాలకు దారి తీస్తుందని కొందరు నిపుణులు అంచనా వేశారు. ఆ తర్వాత దేశ క్షుద్బాధపై పోరాడేందుకు స్వామినాథన్ చేసిన తీవ్రాతితీవ్ర ప్రయత్నం, ప్రపంచం వీక్షించిన అత్యంత ముఖ్యమైన ఆర్థిక పరిణామాలలో ఒకటిగా చరిత్రలో నిలిచిపోతుంది. ఇది దేశంలోని కోట్లాది ప్రజల జీవితాలను మార్చడమే కాకుండా, మిగిలిన ప్రపంచానికి కూడా స్ఫూర్తిగా నిలిచింది. హరిత విప్లవానికి రూపశిల్పిగా ఉన్నప్పటికి కూడా, స్వామినాథన్ కు వ్యవసాయంలో ఎరువులు అధికంగా వాడితే కలిగే ప్రతికూల పరిణామాల గురించి తెలుసు. ఆయన ప్రతి కోణంలోనూ దూరదృష్టి గలవారు. రాబోయే పరాజయం గురించి అనేకసార్లు ముందే హెచ్చరించారు. హరిత విప్లవం ప్రారంభమైన కొన్ని సంవత్సరాల తర్వాత, 1968 లోనే ఆయన ఇలా రాశారు: ‘‘నేల సారాన్ని, నేల నిర్మాణాన్ని పరిరక్షించకుండా భూమిపై తీవ్ర ఒత్తిడి కలిగించే సేద్యం చేయడం అంతిమంగా ఎడారుల పుట్టుకకు దారి తీస్తుంది. పురుగు మందులు, శిలీంద్ర (ఫంగస్) సంహారిణులు, కలుపు సంహారకాలను విచక్షణారహితంగా ఉపయోగించడం వలన ధాన్యాలు లేదా ఇతర తినదగిన భాగాలలో చేరే విషపూరిత అవశేషాల వల్ల క్యాన్సర్, ఇతర వ్యాధులకు సంబంధించిన ప్రతికూల మార్పులు సంభవించవచ్చు. భూగర్భ జలాలను అశాస్త్రీయంగా తోడిపారేయడం వల్ల ఈ అద్భుతమైన మూలధన వనరు వేగంగా తరిగిపోతుంది.’’ ఫిలిప్పీన్ ్సలోని అంతర్జాతీయ ధాన్య పరిశోధనా సంస్థ (ఐఆర్ఆర్ఐ) డైరెక్టర్ జనరల్గా స్వామినాథన్ ఉన్న సమయంలోనే ఇండోనేషియా అధ్యక్షుడు సుహార్తో నుంచి ఆయనకు అసాధారణ కబురు వచ్చింది. ఇండోనేషియా వరి పంటను బ్రౌన్ ప్లాంట్హాపర్ తెగులు నాశనం చేయడంతో, స్వామినాథన్ ఒక పరిష్కార మార్గాన్ని అందించాలని సుహార్తో కోరారు. ఇండోనేషియాకు వెళ్లిన శాస్త్రవేత్తల బృందాన్ని ఒకచోట చేర్చి, వారికి మరిన్ని శక్తిమంతమైన పురుగు మందులను ఉపయోగించాలని సూచించడానికి బదులుగా, వరి పంటపై ఉపయోగించే పురుగు మందులను నిషేధించాలని సుహార్తోకు స్వామినాథన్ సలహా ఇచ్చారు. అదే సమయంలో సమీకృత తెగులు నిర్వహణను ప్రారంభించాలని చెప్పారు. సుహార్తో అధ్యక్ష హోదాలో 57 పురుగు మందులను నిషేధించారు. ప్రొఫెసర్ స్వామినాథన్ టెక్నాలజీని గుడ్డిగా విశ్వసించేవారు కాదని చాలామందికి తెలియదు. జన్యుమార్పిడి పంటలకు వ్యతిరేకంగా ప్రచారం తారస్థాయికి చేరిన రోజుల్లో, బీటీ వంకాయల వాణిజ్యీకరణకు వ్యతిరేకంగా తాత్కాలిక నిషేధం విధించడంపై అప్పటి పర్యావరణ మంత్రి జైరాం రమేష్కు ఆయన ప్రతిస్పందన గమనించదగ్గది. చెన్నైలోని ఎం.ఎస్.స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్లో జరిగిన ఒక సమావేశంలో, ఆయన ఒక మునగకాయ స్లయిడ్ను ప్రదర్శించి, ఆ తర్వాత ‘విటమిన్ ఏ’ని కలిగిన జన్యుమార్పిడి బియ్యం ఆవశ్యకతపై ఒక ప్రశ్నను సంధించారు. అన్నంతోపాటు కలిపి వండిన మునగ ఆకులు మన సాంప్రదాయ ఆహారంలో భాగమనీ, ఇవి తమకు తాముగా విటమిన్ ఏ అందించగలవనీ ఆయన ఉద్దేశ్యం. స్వామినాథన్ పదే పదే లేవనెత్తిన పర్యావరణ పరమైన ఆందోళనలను విధాన నిర్ణేతలు తగిన విధంగా పరిష్కరించినట్లయితే, భారతీయ వ్యవసాయరంగం తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకునేది కాదు. ఆయన అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రాల కన్సార్టియంకు చెందిన మొక్కల జన్యు వనరులపై సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్కు కూడా నాయకత్వం వహించారు. నేను ఆ సమయంలో మేధా సంపత్తి హక్కులపై సీసీఐఏఆర్ సెంట్రల్ అడ్వైజరీ బోర్డు సభ్యుడిని. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న మొక్కల జన్యు వనరులను ప్రైవేట్ కంపెనీలకు ఏకమొత్తంగా విక్రయించడాన్ని నిలువరించడంలో ఆయన పోషించిన పాత్ర గుర్తింపు పొందలేదు. ప్రపంచ జీవవైవిధ్యానికి చెందిన అపారమైన సంపదను ప్రైవేటీకరించడానికి జరిగిన ప్రతి ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి ఆయన చేసిన తీవ్రమైన ప్రయత్నాలకు నేనే సాక్షిని. స్వామినాథన్ 2004లో జాతీయ రైతుల కమిషన్ చైర్పర్సన్ గా నియమితులైనప్పుడు, కమిషన్ నివేదికకి చెందిన జీరో డ్రాఫ్ట్ను రాయమని నన్ను ఆహ్వానించారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా దానిపై చర్చించి, తుది నిర్ణయం తీసుకోవాలి. రైతును కేంద్ర స్థానంలో ఉంచి, ఆపై అతని పరిస్థితిని ఎలా మెరుగుపరచవచ్చో చూడాలని నాకు ఆదేశం ఇచ్చారు. అయితే కేవలం రైతుపై మాత్రమే దృష్టి పెట్టడం కాకుండా, వివిధ వాటాదారులను కూడా అందులో చేర్చాలని తర్వాత చెప్పినప్పుడు, నేను క్షమాపణలు చెప్పాను. అయితే, ఆ మొత్తం కాలం రైతులకు ఆదాయ భద్రత కల్పించడంపై స్వామినాథన్ దృష్టి సారించారు. ఆహారోత్పత్తిని పెంచడంలో రైతులు పోషిస్తున్న పాత్రను ఆయన అభినందించేవారు. కానీ రైతు సమాజం దుఃస్థితికి ఎప్పుడూ బాధపడేవారు. 2004, 2006 మధ్య ఐదు భాగాలుగా సమర్పించిన స్వామినాథన్ కమిషన్ నివేదిక, భారతీయ వ్యవసాయంలో ఉత్పాదకత, లాభదాయకత, స్థిరత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో రూపొందింది. ఇది దేశవ్యాప్తంగా రైతు సంఘాలకు కీలకమైన అంశంగా నిలుస్తోంది. సగటు(వెయిటెడ్ యావరేజ్) మీద 50 శాతం లాభం రైతులకు అందించాలన్న ఆయన సూచనను ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఈ గొప్ప దార్శనికుడికి దేశం అర్పించే అత్యుత్తమ నివాళి ఏమిటంటే, స్వామినాథన్ కమిషన్ నివేదికను అక్షరమక్షరం అమలు చేయడమే! దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ నిపుణులు -
సాగుబడి లాభసాటి కావాలంటే...
న్యూఢిల్లీలోని ఆజాద్పూర్ మండిలో కూరగాయలమ్మే వ్యక్తి తాలూకు ఒక వీడియో వైరల్ అయ్యింది. దిగమింగుకోవడం కష్టమైపోయిన ఆయన కన్నీళ్లలో తన ఆర్థిక బాధ స్పష్టంగా కనిపించింది. జీవనోపాధి కోసం ఎక్కువ మంది ఆధారపడి ఉన్నందున, వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చే సవాలును ఆర్థికవేత్తలు స్వీకరించాలి. ఇప్పుడున్న ఆర్థిక నమూనాను ధిక్కరించయినా రైతుల చేతులకు ఎక్కువ ఆదాయాన్ని అందించాలి. వచ్చే ఐదేళ్లను పూర్తిగా వ్యవసాయాన్ని పునర్నిర్మించడానికి కేటాయించాలి. సంస్కరణలు ప్రారంభించినప్పటి నుండి పరిశ్రమలకు ఇచ్చినన్ని వనరులు, ప్రోత్సాహకాలు, ఆర్థిక ఉద్దీపనలను ఇప్పుడు వ్యవసాయానికి అందించాలి. ప్రతి రైతు, కూలీ కన్నీళ్లు తుడవడానికి ఇది తప్ప వేరే మార్గం లేదు. కొన్నిసార్లు మాటల కంటే నిశ్శబ్దం మరింత బిగ్గరగా మాట్లాడుతుంది. న్యూఢిల్లీలోని ఆజాద్పూర్ మండిలో ఓ కూరగాయల అమ్మకందారుపై తీసిన,గుండెను పిండేసే వీడియో క్లిప్ వైరల్గా మారింది. పెరిగిన ధరలకు టమోటాలు కొనలేకపోతే ఖాళీ బండితో తిరిగి వెళతావా అని అడిగినప్పుడు, ఆయన మూగబోయాడు. అదే సమయంలో తన కన్నీళ్లను అదుపులో పెట్టుకోలేకపోయాడు. ఆయన మౌనమే శక్తిమంతమైన సమాధానం అయింది. మార్కెట్లోకి వచ్చే కొత్త కార్ మోడళ్లు, సూపర్స్టోర్లను ముంచెత్తుతున్న సరికొత్త ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల వెంటపడుతున్న దేశ ప్రజల సున్నిత హృదయాలకు ఆ చిన్న వీడియో షాక్ కలిగించింది. తాజా ఆటోమొబైల్స్ గురించి, సరికొత్త ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల గురించి టీవీ షోలు నిత్యం మోతమోగిస్తున్నప్పుడు, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ గురించి ఎప్పటికప్పుడు నివేదికలు వెలువడుతున్న ప్పుడు, ఒక వీడియో క్లిప్... మధ్యతరగతిని మైకం నుంచి బయటకు లాగడమే కాకుండా కఠినమైన వాస్తవాలను వారి ముఖాముఖి తీసు కొచ్చింది. న్యూఢిల్లీకి చెందిన కూరగాయలమ్ముకునే రామేశ్వర్పై చిత్రించిన క్లిప్ సరిగ్గా అటువంటి ఉదాహరణే. దిగమింగుకోవడం కష్టమైపోయిన ఆయన కన్నీళ్లలో తన ఆర్థిక బాధ స్పష్టంగా కనిపించింది. ఎంత సంపాదించారని ప్రశ్నించగా, రోజుకు రూ.100–200కు మించి రావడం లేదన్నాడు. ఆయన సమాధానం భారతదేశ పేదరిక స్థాయిలనే కాకుండా, పెరుగుతున్న అసమానతల విస్ఫోటనాన్ని కూడా బయటపెట్టింది. అయితే మహారాష్ట్రలోని ఠిక్పుర్లీకి చెందిన 45 ఏళ్ల చెరకు రైతు, కూలీ గురించి చాలామందికి తెలియదు. భారతి పాటిల్ అనే ఆ రైతు, ఒక పరిశోధనా వేదికతో మాట్లాడుతూ, ‘‘గత ఐదేళ్లుగా మా కూలీలు పెద్దగా మారలేదు. నోట్ల రద్దుకు ముందు రోజుకు 100 రూపాయలు వచ్చేది, ఇప్పుడు సాయంత్రం 5 గంటల వరకు పనిచేసినా మాకు రూ. 150 మాత్రమే చేతికి అందుతోంది’’ అని పేర్కొన్నారు. మరో మాటలో చెప్పాలంటే, ఒక సన్నకారు చెరకు రైతుకు ఒక రోజుకు దక్కుతున్న మొత్తాన్ని ఇది బయటపెడుతుండగా, మహారాష్ట్రలోని చక్కెర బెల్ట్లో రోజువారీ కూలీ గత ఐదేళ్లలో రూ.50 మాత్రమే పెరిగిందని కూడా వెల్లడవుతోంది. నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నా సన్నకారు రైతులు, రైతు కూలీలు ఏటా అదే తక్కువ కూలీ మొత్తంతో ఎలా బతుకుతున్నారనేది జీర్ణించుకోవడం కష్టం. ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేసినప్పుడు నిజమైన కూలీల పెరుగుదల సున్నాకు దగ్గరగానే ఉంది. ఏరకమైన అర్థవంతమైన పెరుగుదలా కనబడలేదు. వాస్తవానికి, కొన్ని అధ్యయనాలు 2013 –17 మధ్య నిజమైన వేతనాలు తగ్గుముఖం పట్టడం లేదా స్తబ్ధుగా ఉండటాన్ని సూచించాయి. దేశంలోని 90 కోట్ల మంది కార్మికులలో చాలా మంది అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాల పట్ల భ్రమలు కోల్పోయారనీ, దీంతో వారు ఉద్యోగాల కోసం వెతకడం కూడా మానేశారనీ 2022 ఏప్రిల్లో సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎమ్ఐఈ) పేర్కొంది. ఈ కారణం వల్లే 2021–22లో దేశ ఉపాధిలో 45.5 శాతంగా ఉన్న వ్యవసాయ రంగం వాటా, మహమ్మారి ముందు స్థాయికి చేరలేదని పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే పేర్కొంది. అప్పుడు శ్రామిక శక్తిలో 42.5 శాతంతో వ్యవసాయరంగ జనాభా వాటా సాపేక్షంగా తక్కువగా ఉందని ఈ నివేదిక తెలిపింది. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్ విధించిన తర్వాత వారి గ్రామాలకు తిరిగి వచ్చిన 10 కోట్ల మంది కార్మికులలో గణనీయమైన భాగం మళ్లీ నగరాలకు తిరిగి రాలేదు. అదేవిధంగా, బంగ్లాదేశ్లో కూడా ఈ సంవత్సరం వ్యవసాయంపై ఆధారపడటం పెరిగింది. బంగ్లాదేశ్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం, వ్యవసాయ రంగంలో సంవత్సర ప్రాతిపదికన చూసిన ప్పుడు 2023 ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో అత్యధిక ఉద్యోగాల కల్పన జరిగింది. అదే సమయంలో నగరాల్లో అధికారిక ఉపాధి అవకాశాలు లేకపోవడాన్ని సూచిస్తున్నందున ఇది మంచి సంకేతం కాదని కొందరు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అసమానత ఎంత నిరుత్సాహకరంగా మారుతున్నదో ముందుగా చూద్దాం. ప్రపంచ స్థాయిలో అధ్వాన్నంగా పెరుగుతున్న అసమానతలను ‘వరల్డ్ ఇన్–ఈక్వాలిటీ రిపోర్ట్’ వెల్లడించింది. తాజా నివేదిక ప్రకారం, ప్రపంచ జనాభాలో అత్యంత సంపన్నులైన 10 శాతం మంది మొత్తం సంపదలో 76 శాతాన్ని కలిగి ఉన్నారు. అయితే దిగువ సగం మంది కేవలం 3 శాతం సంపద కలిగి ఉన్నారు. భారతదేశంలో కూడా అగ్రశ్రేణి 1 శాతం మంది, దేశ సంపదలో 40.5 శాతాన్ని కలిగి ఉన్నారని ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ చెబుతోంది. ధనికులు సంపదను కూడబెట్టుకోవడం కొనసాగిస్తుండగా, పేదలు పేదరికంలోకి మగ్గిపోయేలా ఆర్థిక రూపకల్ప నను మన విధాన నిర్ణేతలు అల్లుకుంటూ వచ్చారు. పెట్టుబడిదారీ వ్యవస్థ ఎంత బలంగా పాతుకుపోయిందంటే, అసమానతలను అంతం చేయడంపై పెద్ద చర్చ జరుగుతున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి 500 మంది అత్యంత సంపన్నులు 2023 మొదటి ఆరు నెలల్లోనే తమ సంపదకు మరో 852 బిలియన్ డాలర్లను జోడించుకున్నారు. ప్రపంచ బ్యాంక్ ప్రమాణాల ప్రకారం, రోజుకు నాలుగు డాలర్ల కంటే తక్కువ ఆదాయంతో బతుకుతున్న ‘బ్రిక్స్’ దేశాల జనాభాలో ఇండియా మొదటిస్థానంలో ఉంది. 91 శాతం జనాభా నిర్దేశిత ప్రమాణానికి కిందికి ఉంది. 50.3 శాతంతో రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా కంటే కూడా ఇది ఎంతో ఎక్కువ. వ్యవసాయాన్ని అతి పెద్ద ఉపాధి కల్పనారంగంగా పరిగణనలోకి తీసుకుంటే, అసమానతలను తగ్గించడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే, వనరులను అవసరం ఉన్న చోట ఉపయోగించడమే. పైనుంచి కిందికి ప్రవహించే విఫల ‘ట్రికిల్ డౌన్’ ఆర్థిక వ్యవస్థను కొనసాగించ డానికి బదులుగా– దిగువ, మధ్య స్థాయులను పైకి తేవడం మీద దృష్టి పెట్టడమే అసలైన కర్తవ్యం కావాలి. భారతదేశం, బంగ్లాదేశ్లలో జీవనోపాధి కోసం ఎక్కువ భాగం వ్యవసాయంపై ఆధారపడి ఉన్నందున, గ్రామీణ పరిశ్రమలను ప్రోత్స హించడం ద్వారా వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చే సవాలును ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తలు స్వీకరించాలి. దిగువ స్థాయి నుండి సంపదను పిండుకునే బదులు, ఇప్పుడున్న ఆర్థిక నమూనాను ధిక్క రించయినా రైతుల చేతులకు ఎక్కువ ఆదాయాన్ని అందించాలి. సజీవ వ్యవసాయం అనేది ఈ కాలపు అవసరం. ప్రతి రైతు, కూలీ కన్నీళ్లు తుడవడానికి ఇది తప్ప మరో మార్గం లేదు. వచ్చే ఐదేళ్లను వ్యవసాయాన్ని పునర్నిర్మించడానికి కేటాయించాలని నా సూచన. సంస్కరణలు ప్రారంభించినప్పటి నుండి పరి శ్రమలకు మనం ఇచ్చినన్ని వనరులు, ప్రోత్సాహకాలు, ఆర్థిక ఉద్దీపన లను ఇప్పుడు వ్యవసాయానికి అందించాలి. ఆరోగ్యకరమైన, సంప న్నమైన, పునరుత్పత్తి చేసే తదుపరి దశ సంస్కరణలకు నాంది పలికేందుకు కేవలం ఐదేళ్ల పాటు, చిన్న తరహా వ్యవసాయాన్ని, పర్యా వరణపరంగా స్థిరమైన వ్యవసాయాన్ని పునర్నిర్మించాలి. కేవలం ఐదేళ్లు – ఇంతమాత్రమే నేను అడుగుతున్నది! దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com -
పొలం నుంచి వైఫల్యం వరకు...
దేశ వ్యవసాయదారుల వ్యధలను ఎవరూ గుర్తిస్తున్నట్లు కనిపించడం లేదు. లేదా వారి గురించి కనీసంగానైనా సరే ఎవరూ ఆలోచిస్తున్నట్లు లేదు. ‘నేను దాన్ని పెంచాను. నేనే దాన్ని ధ్వంసం చేస్తున్నాను. ఇలా చేయడం చాలా కష్టంగా ఉంది కానీ నేను ఏం చేయగలను? గిట్టుబాటు ధరైనా రాకుంటే..’ అని కూరగాయలు, పండ్లు పండించే రైతు ఆవేదన చెందుతున్నాడు. పంట ఉత్పత్తికి ఎకరాకు వేలాది రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఆ పంట మొత్తాన్ని నాశనం చేయడమనేది రైతుల జీవితాలను దారుణంగా దెబ్బతీస్తుంది. ‘పొలం నుంచి వైఫల్యం వరకు’ అనే ఈ పునరావృత రైతు గాథ దేశంలో ప్రతిచోటా కనిపిస్తున్నదే. అంతేకాదు... కొన్ని సంవత్సరాలుగా ఈ విఫలగాథ మరింతగా విస్తృతమవుతూ వస్తోంది! ఈ సంవత్సరం క్వింటాల్ బంగాళా దుంపల ధర రూ. 500లకు పడిపోయి నప్పుడు (గత సంవత్సరం రూ. 1,200లు సగటు ధర పలికింది) ఒక రైతు మీడియాతో ఏం చెప్పాడంటే... ‘‘క్వింటాల్ బంగాళా దుంపలను 900 నుంచి 1000 రూపాయల ధరకు తక్కువ అస్సలు అమ్మలేము. ఎందుకంటే ఈ రేటు వద్ద అయితేనే మాకు దిగుబడి ఖర్చులు రావడమే కాకుండా కాస్త లాభం కళ్ల చూడగలం’’ అని. అయితే ఇప్పుడు బంగాళాదుంపల ధర ఏమాత్రం పెరిగే సూచనలు కనిపించకపోవడంతో రానున్న కాలంలో బంగాళా దుంపల ఉత్పత్తిదారులు గడ్డు కాలాన్నే ఎదుర్కోనున్నారు. పంజాబ్లోనే కాదు, బెంగాల్, బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలో కూడా బంగాళాదుంపల ధర ఘోరంగా పతనం కానుంది. క్యాలిఫ్లవర్, క్యాబేజి, టమోటా ధరలు కూడా పడిపోయాయి. కేజీకి 3 రూపాయల ధర కూడా పలకదని గుర్తించక ముందే పంజాబ్లో రైతులు తమ పంటను ఇప్పటికే ధ్వంసం చేయడం ప్రారంభించారు. ‘నేను దాన్ని పెంచాను. నేను దాన్ని ధ్వంసం చేస్తున్నాను. ఇలా చేయడం చాలా కష్టంగా ఉంది. కానీ నేను ఏం చేయగలను..’ అని కూరగాయలు పండించే రైతు ఒకరు అన్నారు. వీటి ఉత్పత్తికి ఎకరాకు రూ. 30 వేలు ఖర్చు పెట్టిన తర్వాత ఆ పంట మొత్తాన్నీ నాశనం చేయడమనేది ఈ రైతుల జీవితాలను దారుణంగా దెబ్బతీయకుండా ఉంటుందా?! ఇటీవల తెలంగాణలోని జహీరాబాద్ జిల్లా ప్రాంతాల గుండా నేను ప్రయాణిస్తున్నప్పుడు, అక్కడ విరివిగా పండిన టమోటాకి కూడా ఇదే గతి పట్టడం చూశాను. టమోటా పంటను ఎందుకు పండించడం లేదని అడిగాను. నిరాశతో కనిపించిన టమోటా రైతు ఒకరు నాతో మాట్లాడుతూ, మార్కెట్ ధర కిలో టమోటాకు 2 రూపాయలు పలుకుతున్నప్పుడు టమోటాలను బుట్టల్లో సర్దడం, వాటిని రవాణా చేయడం వంటివాటికి అదనపు ఖర్చు పెట్టాలని తానను కోవడం లేదని చెప్పాడు. ‘మీకు ఎన్ని టమోటాలు కావాలంటే అన్నీ తీసుకోండి’ అని అతను నిస్పృహతో అన్నాడు. ‘పొలం నుంచి వైఫ ల్యానికి’ సంబంధించిన ఈ గాథను నేను ప్రతి చోటా చూస్తున్నాను. దేశ వ్యవసాయదారుల వ్యధలను ఎవరూ గుర్తిస్తున్నట్లు కనిపించడం లేదు. లేదా వారి గురించి కనీసంగానైనా సరే ఎవరూ ఆలో చిస్తున్నట్లు లేదు. నేను ఎందుకిలా చెబుతున్నానంటే, ఛత్తీస్గఢ్ నుంచి పక్షం రోజుల క్రితం ఒక నివేదిక వచ్చింది. మహాసముండ్కి చెందిన ఒక రైతు రాయపూర్ మండీకి వంకాయ పంటను తీసుకెళితే అతడికి రూ. 1,475 రూపాయలు మాత్రమే ఆదాయం వచ్చిందనీ, రవాణా ఖర్చులు, ఇతర ఖర్చుల కింద అదనంగా 121 రూపాయలను రైతే చెల్లించాల్సి వచ్చిందనీ ఆ వార్త తెలిపింది. అంతకు ముందు నెల రోజుల క్రితం వెల్లుల్లి రైతులు తమ పంట మొత్తాన్ని స్థానిక నదుల్లో కలిపేశారన్న వార్తలు మీడియాలో రాజ్యమేలాయి. తర్వాత ఉల్లి పాయల సాగుదార్ల వ్యధలకు సంబంధించిన వార్తలు కూడా బయటికి వచ్చాయి. మరో మాటలో చెప్పాలంటే, దేశంలో ఈ పరిస్థితి రోజువారీ కార్యక్రమంలా సాగుతోంది. కొన్ని సంవత్సరాలుగా, పొలం నుంచి వైఫల్యానికి సంబంధించిన గాథ మరింతగా విస్తృతమవుతూ వచ్చింది. పొలంలో రైతు చిందిస్తున్న రక్తం మీడియాలో పేజీలకు మాత్రమే పరిమితమవుతోంది. స్టాక్ మార్కెట్లో రక్త పాతాన్ని దేశం చూస్తున్నప్పుడు కలుగుతున్నటువంటి తీవ్ర స్పందన రైతుల వ్యధల పట్ల కలగడం లేదు. ఇది చాలదన్నట్లుగా, మార్కెట్లో జోక్యం చేసుకునే వ్యవస్థ (ఎమ్ఐఎస్)ను మరింతగా బలోపేతం చేయడంలో ఎలాంటి ప్రయో జనాన్నీ మన ఆర్థిక మంత్రి చూడడం లేదు! సమృద్ధిగా పంటలు పండి ధరలు పడిపోయినప్పుడు లేదా పంటలు చేతికొచ్చిన సమయంలో ఉత్పత్తి ధరకంటే తక్కువ ధరకు పడిపోయినప్పుడు ఎమ్ఐఎస్ రంగంలోకి దిగుతుందన్నది తెలిసిందే. 2023 బడ్జెట్ ఖర్చుల కింద, ధర మద్దతు పథకం (పీఎస్ఎస్), ఎమ్ఐఎస్లకు కేటా యింపులను బాగా తగ్గించినట్లు కనిపిస్తోంది. గత ఏడాది ఎమ్ఐఎస్కి బడ్జెట్లో రూ. 1,500 కోట్లు కేటాయించగా, ఈ సంవత్సరం దాన్ని కేవలం లక్ష రూపాయలకు కోసిపడేశారు. బడ్జెట్లో పొందుపర్చిన ఈ కేటాయింపు, కొద్దిమంది వెల్లుల్లి ఉత్పత్తిదారులకు కలిగిన నష్టాలను పూరించడానికైనా సరిపోతుందని నేను భావించడం లేదు. 2018–19 బడ్జెట్లో రూ. 500 కోట్ల కేటాయింపుతో ప్రారంభించిన ఆపరేషన్ గ్రీన్స్ స్కీమ్ను గుర్తుంచుకోండి. టమోటో, ఉల్లి పాయలు, బంగాళాదుంపలు మామూలుగా ఎదుర్కొంటున్న అస్థిర ధరల నియంత్రణకు ఉద్దేశించినట్లు చూపించినప్పటికీ అవసరమైన దానికంటే తక్కువగా బడ్జెటరీ కేటాయింపులు చేశారు. ఆపరేషన్ ఫ్లడ్ ప్రాతిపదికన, కనీసం ఈ మొత్తాన్నయినా ప్రకటించారు. ఈ పథకాన్ని అన్ని పండ్లు, కూరగాయలకు వర్తింపచేస్తూ, ఆత్మనిర్భర్ అభియాన్ కింద ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ స్కీమ్ని మరింతగా విస్తరించింది. కానీ 2023 నాటికి ఈ పథకాన్ని దాదాపుగా విస్మరించేశారు. కూరగాయల ధరలు (పండ్ల విషయంలో కూడా) పడిపోయిన ప్రతి సందర్భంలోనూ నేను ట్వీట్ చేసినప్పుడు, ఇవి పాడైపోయే సరకులు అని సాధారణ పల్లవి పాడుతూ వచ్చేవారు. సాధారణ ప్రజానీకం నుంచి ఈ మాటలు వింటే వాటిని సులువుగా పక్కనపెట్టేయవచ్చు కానీ విధాన నిర్ణేతలు ఇంత భిన్నంగా ఉండ టానికి ఇది కారణం కాకూడదు. అమెరికాలో కూడా, ధరలు పడిపోయినప్పుడు రైతులు నష్ట పోకుండా ఒక యంత్రాంగాన్ని ఏర్పర్చారు. పాలధరలు పడి పోయిన సమయాల్లో స్కూల్ ఫీడింగ్ ప్రోగ్రామ్లలో పొందు పరిచేలా రైతులు మరింత చీజ్ని తయారు చేయాలని రైతులను కోరే యంత్రాంగాన్ని అమెరికా రూపొందించింది. అలాగే స్ట్రాబెర్రీ ధరలు పతనం అయే సమయాల్లో ఇదే విధమైన కార్యక్రమాలు ఉంటున్నాయి. ప్రతిదీ సజావుగా ఉంటుందని చెప్పలేం కానీ, వ్యవ సాయ క్షేత్రాల నష్టాలను తగ్గించడానికి ఇప్పటికీ ప్రయత్నాలు జరుగు తున్నాయి. భారత్లో తగిన ఉష్ణోగ్రతా నియంత్రిత నిల్వ సౌకర్యాలు, ప్రాసె సింగ్పై ఆధారపడి ఉండే వాల్యూ ఛెయిన్ని పునర్నిర్మించడానికి, స్థానికంగా అందుబాటులో ఉంచేందుకు చిత్తశుద్ధితో కూడిన ప్రయ త్నాలు చేపట్టాలి. ధరల క్షీణత పథకాన్ని అమలు చేసే యంత్రాంగం ద్వారా దీన్ని అమలు చేయాలి. కానీ మధ్యప్రదేశ్లో గతంలో స్కీమ్ పైఫల్యం చెందడం అనేది పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలి. అయితే మరింత ముఖ్యంగా ధరల అస్థిరత్వాన్ని అధిగమించడానికి రైతుల కోసం గ్యారంటీ ధరకు హామీ పడటం మార్గదర్శక స్ఫూర్తిగా ఉండాలి. కూరగాయల పెంపకందార్లకు గ్యారంటీ ధరను అందిస్తున్న కేరళ స్కీమ్ నుంచి వెలికివచ్చిన పాఠాలను నేర్చుకోవలసి ఉంటుంది. రైతుల కోసం భవిష్యత్తులో పండ్లు, కూరగాయల ధరలను స్థిరీకరించడంలోనే కాదు.. వైవిధ్యభరితమైన పంటల వైపు మారే విషయంలో వారికి సహకారం అందివ్వడంలో ఆపరేషన్ గ్రీన్స్ కి అతి పెద్ద సవాలు ఎదురవుతోంది. వినియోగదారులు ఇప్పటికే అత్యధిక మార్కెట్ ధరను చెల్లిస్తున్నారు. కానీ భారీగా ఆర్గనైజ్ అయివుండే వ్యాపారంలో కూడా జరిగే బేరసారాల్లో రైతులే నిండా మునిగి పోతున్నారు. కాబట్టి పొలం నుంచి వైఫల్యానికి చెందిన గాథ మారాల్సి ఉంది. కొనసాగుతున్న వ్యవసాయ దుఃస్థితికి గాను సప్లయ్ – డిమాండును మాత్రమే మనం నిందిస్తూ కూర్చోలేము. దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com -
రావాల్సిన ‘చిరు’ విప్లవం
ఐక్యరాజ్యసమితి 2023ను చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. కిలో బియ్యం పండించేందుకు 3–5 వేల లీటర్ల నీళ్లు అవసరం కాగా, చిరుధాన్యాలకు 200 లీటర్లు చాలు. వాటి పర్యావరణ హితాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులకు కనీస మద్దతు ధర నిర్ణయించాలి. ఆంధ్రప్రదేశ్లో ‘టీటీడీ’ ఆధ్వర్యంలో 11 ధార్మిక ప్రాంతాలకు వీటిని అందించేట్టుగా చేసుకున్న ఒప్పందం లాంటిది పంజాబ్ లాంటి రాష్ట్రాలు అనుసరించవచ్చు. చిరుధాన్యాల హల్వా, పాయసాలు ప్రసాదంగా మంచి ప్రత్యామ్నాయాలు. దేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 12 కోట్ల మంది చదువుకుంటున్నారు. మధ్యాహ్న భోజనంలో వారంలో ఒక పూటైనా చిరుధాన్యాలు అందిస్తే వీటి డిమాండ్ పెరిగి, రైతులను ఆ దిశగా మళ్లేట్టు చేస్తుంది. ఈ ఏడాదిని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి తీర్మానించింది. దీంతో ఈ అద్భుత సిరిధాన్యాలపై మరోసారి అందరి దృష్టి కేంద్రీకృతం కానుంది. 2023 ఏడాది ముగిసేలోపు ఈ చిరుధాన్యాలను తృణప్రాయంగా పక్కనబెట్టే మానసిక స్థితి నుంచి అందరూ బయటపడతారని నేనైతే నమ్మకంగా ఉన్నాను. ప్రతిగా... ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అదృశ్య ఆకలి ప్రమాదాన్ని భారత్ కూడా సమర్థంగా ఎదుర్కునే అవకాశం లభిస్తుంది. ఒకప్పుడు వీటిని తృణధాన్యాలని పిలిచేవారు. ఇవి ముతకగా ఉండవచ్చునేమో కానీ, ఆరోగ్యానికి హాని చేసేవి కాదు. నిజానికి పోష కాలతో నిండి ఉంటాయి. వాతావరణాన్ని తట్టుకోగల తెలివైన పంటలు కూడా. మెట్ట, వర్షాధారిత ప్రాంతాల్లో ఎంచక్కా పండించు కోవచ్చు. చిరుధాన్యాల జాబితాలోకి సజ్జలు, జొన్న, రాగులతోపాటు ఇతర చిన్న సైజు గింజలుండే ఆరు ధాన్యాలు(కొర్ర, అండుకొర్ర, అరికె, ఊద, సామ, వరిగ) వస్తాయి. చాలాకాలంగా వీటిని ఉద్దేశ పూర్వకంగానే నిర్లక్ష్యం చేశారు. యూరోపియన్ లేదా అమెరికన్ ఆహార శైలుల్లోకి ఇవి ఇమడకపోవడం ఒక కారణం. సంప్రదాయ సాగు నుంచి మళ్లించాలి... అయితే మిల్లెట్స్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా తదితర పౌర సమాజ వర్గాలు చిరుధాన్యాల ప్రయోజనాలపై చేసిన విస్తృత స్థాయి ప్రచారం పుణ్యమా అని ఇప్పుడు వీటికి మరోసారి ప్రాధాన్యం ఏర్పడుతోంది. ప్రజా పంపిణీ వ్యవస్థలోకి వీటిని చేర్చడం కారణంగా ఇప్పుడు వైవిధ్యభరిత ఆహార, పంటల వ్యవస్థలకు మార్గం సుగమమైంది. చిరుధాన్యాల లాభాల గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. ఈ ఏడాదిలో వీటి గురించి మరింత వింటాం కూడా. ప్రజల్లో అవగాహన మరింత పెంచడం, దిగుబడుల పెంపు, ఆహార శుద్ధికి అవకాశాలు కల్పించడం, సేకరణ మెరుగుపరచడం వంటి అంశాలపై ఈ ఏడాది చర్చోపచర్చలు జరగనున్నాయి. అయితే చిరుధాన్యాల సాగును మరింతగా పెంచాలంటే, నీటి అవసరాలు ఎక్కువగా ఉండే వరి సాగు నుంచి రైతులను మళ్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం చిరుధాన్యాల సాగు రైతులకు లాభదాయకంగా ఉండాలి. అయితే ఇది చెప్పినంత సులువైన పనేమీ కాదు. సంప్రదాయ పంటల సాగు నుంచి రైతును ఇంకో దిశకు మళ్లించడం కోసం గతంలోనూ కొన్ని విఫలయత్నాలు జరిగిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. ఒక కిలో బియ్యం పండించేందుకు ప్రాంతం, వాతావరణాలను బట్టి మూడు నుంచి ఐదు వేల లీటర్ల నీరు అవసరమవుతుంది. కానీ చిరుధాన్యాల విషయంలో నీటి అవసరం కేవలం 200 లీటర్లు మాత్రమే. పైగా వీటి సాగులో రసాయన ఎరువులు, క్రిమి, కీటక నాశినుల వాడకమూ పెద్దగా ఉండదు. పోషకాలూ మెండుగా ఉంటాయి. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ‘కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్స్ అండ్ ప్రైజెస్’ (సీఏసీపీ) చిరుధాన్యాల ధరల నిర్ణయానికి కొత్త ఫార్ములాను రూపొందించాలి. పర్యావరణానికి చిరు ధాన్యాలు అందించే తోడ్పాటును కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వినియోగదారుడికి అందే ధరలో రైతుకు దక్కేది కొంతే కాబట్టి ధరలు నిర్ణయించే తీరు మారడం ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. పండించే పంటకు కచ్చితంగా కొంచెం పెద్ద మొత్తంలోనే ధర లభిస్తుందని తెలిస్తే రైతుకూ, సమాజానికీ లాభం. స్ఫూర్తిదాయకమైన ఏపీ మోడల్ చిరుధాన్యాలకు మద్దతుధరలు కొత్తగా నిర్ణయించడంతోపాటు వరి పంటకు పేరెన్నికగన్న పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో చిరుధాన్యాల సాగును పెంచాలి. 1950లో అవిభాజ్య పంజాబ్లో సుమారు 11 లక్షల హెక్టార్లలో సజ్జలు సాగవుతూండేవి. ఇప్పుడు ఇది వెయ్యి హెక్టార్ల కనిష్ఠానికి పడిపోయింది. గోధుమ, వరి పంటలను మార్చి మార్చి వేయడమన్న విధానానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల పరిస్థితి ఇంతకు దిగజారింది. పప్పులు, నూనెగింజలతోపాటు చిరుధాన్యాల సాగు మళ్లీ చేపట్టడం మేలైన ముందడుగు అవుతుంది. ఇలా పంటల వైవిధ్యానికి చిరుధాన్యాలు చేర్చడం వల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయి. పర్యావరణ విధ్వంసానికి కారణమైన హరిత విప్లవ దుష్ప రిణామాలను చక్కదిద్దగలగడం ఒకటైతే... చిరుధాన్యాలకు డిమాండ్ పెంచడం రెండోది. చిరుధాన్యాల సాగు విషయంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలను పంజాబ్ పరిగణనలోకి తీసుకోవడం మంచిది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని 11 ధార్మిక ప్రాంతాల్లో సెంటర్ ఫర్ సస్టెయినబుల్ అగ్రికల్చర్ (సీఎస్ఏ), రైతు సాధికార సంస్థ, ఏపీ మార్క్ఫెడ్ కలిసికట్టుగా ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో భాగంగా 12 రకాల పంటలను 15,000 టన్నుల మేరా సహజసేద్య విధానంలో అందించాలి. ఇందులో భాగంగా కనీస మద్దతు ధర కంటే పది శాతం ఎక్కువ ధర రైతుకు లభించనుంది. ఒకవేళ మార్కెట్లో ఆయా పంటకు ఎక్కువ ధర ఉంటే... అదనంగా ఇంకో పదిహేను శాతం చెల్లిస్తారు. కర్ణాటకలోనూ గతంలో రాగుల సాగును ప్రోత్సహించేందుకు కనీస మద్దతు ధర కంటే 40 శాతం ఎక్కువ చెల్లించారు. పంజాబ్లోని వేల గురుద్వారాలను దృష్టిలో ఉంచుకుంటే చిరుధాన్యాలకు, అదికూడా సేంద్రీయ ఉత్పత్తలకు మంచి డిమాండే ఉంటుంది. శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ వంటి సంస్థల సాయంతో సేంద్రీయ లంగర్ ఏర్పాటుకు ప్రయత్నించవచ్చు. ఇందులో వడ్డించే ఆహార పదార్థాల్లో చిరుధాన్యాలను చేర్చవచ్చు. ఆ మాటకొస్తే చిరుధాన్యాల హల్వా, పాయసాలు ప్రసాదంగా మంచి ప్రత్యామ్నాయాలవుతాయి. చిరుధాన్యాల సక్రమ నిల్వ, సరఫరాల బాధ్యతను మార్క్ఫెడ్ వంటి సంస్థలకు పంజాబ్ అప్పగించవచ్చు. ఖేతీ విరాసత్ మిషన్ వంటి లాభాపేక్ష లేని సంస్థలకు సేంద్రీయ వ్యవసాయ సముదాయాల ఏర్పాటు పనులు అప్పగించవచ్చు. నాణ్యతను నిర్ధారించేందుకు అవసరమైన చర్యలూ సులువుగా చేపట్టవచ్చు. పాఠశాలల డిమాండ్ కూడా చేరితే... పంజాబ్లో సుమారు 30 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠ శాలల్లో చదువుతున్నారు. వీరికందించే మధ్యాహ్న భోజన పథకంలో ప్రారంభంలో వారానికి ఒకసారి చిరుధాన్యాలను కూడా చేరిస్తే విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుంది. తద్వారా స్థానికంగానే వీటి సరఫరాకు అవకాశం ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్లో టీటీడీ నిర్ణయించినట్లే చిరుధాన్యాలను పంజాబ్లోనూ స్థానిక రైతుల నుంచి మాత్రమే సేకరిస్తామని చెప్పవచ్చు. కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్లో సుమారు 110 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీరికి వారంలో ఒకసారి చిరుధాన్యాలను వడ్డిస్తున్నారు. అయితే ఈ డిమాండ్ను తట్టుకోవడం కష్టమవుతోంది. పంజాబ్ మొత్తమ్మీద చిరు ధాన్యాలను వడ్డిస్తే పరిస్థితి ఎలా ఉండనుందో ఇట్టే అర్థం చేసు కోవచ్చు. పాఠశాలలు, గురద్వారాలతో ఏర్పడే డిమాండ్ను తట్టు కునేందుకు పంజాబ్ ప్రభుత్వం, రైతులు ఏదో ఒక మాయ కచ్చితంగా చేయగలరు. జాతీయ స్థాయిలో చూస్తే సుమారు 12.7 లక్షల ప్రభుత్వ పాఠశాలల్లో 12 కోట్ల మంది చదువుకుంటున్నారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా వీరందరికీ చిరుధాన్యాలు ఏదో ఒక స్థాయిలో అందించడం రైతులను చిరుధాన్యాల సాగుకు మళ్లించేందుకు మేలిమి మార్గం కాగలదు. పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రార్థనాలయాల సాయంతో చిరుధాన్యాల సాగు, వినియోగాన్ని పెంచడం సుసాధ్య మవుతుంది. పంజాబ్ ఈ దిశగా అడుగులేసి దేశంలో చిరుధాన్యాల విప్లవాన్ని సృష్టించాలని ఆశిద్దాం! దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com -
GM Mustard: ఆధారాలు లేకుండానే అనుమతులా?
ప్రశ్నలు వేయడం, వాటికి సమాధానాలు కనుక్కోవడంతోనే సైన్స్ ప్రస్థానం మొదలవు తుందని మా సైన్స్ టీచర్ చెబుతూండేది. ఇంకోలా చెప్పాలంటే... సైన్స్ ఎల్లప్పుడూ ప్రశ్నలకు సిద్ధంగా ఉంటుందీ అనాలి! దీనివల్ల సాంఘిక, ఆర్థిక ఆందోళనలకు తావిచ్చే, పర్యావరణ విధ్వంసానికి దారితీసే అపోహలను తొలగించుకోవచ్చు. అందుబాటులో ఉన్న సాక్ష్యాలపై వ్యాఖ్యానం చేయవచ్చు. అయితే ఆర్థిక ప్రయోజనాల కారణంగా సత్యాన్వేషణ తాలూకూ గొంతుకలను నొక్కివేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ క్రమంలో ప్రదర్శించే సాక్ష్యాలు కూడా నమ్మదగ్గవిగా ఉండవు. విషయం ఏమిటంటే... జన్యుమార్పిడి పంటలపై ఎప్పుడు చర్చ మొదలైనా, సాక్ష్యాల ఆధారంగా ముందుకెళ్లాలని కొందరు శాస్త్రవేత్తలు చెబుతూంటారు. తద్వారా శాస్త్రీయ సమాచారం, వాదం, ప్రజా విచారణలన్నీ పక్కకు తొలగిపోయేలా చేస్తూంటారు. దేశంలోకి మొట్టమొదటి జన్యుమార్పిడి పంట బీటీ కాటన్ను 2001లో వాణిజ్యస్థాయిలో విడుదల చేశారు. అప్పట్లో జరిగిన జెనెటిక్ ఇంజినీరింగ్ అప్రైజల్ కమిటీ (జీఈఏసీ) సమావేశాల్లో పాల్గొన్న వారిలో నేనూ ఉన్నాను. జన్యుమార్పిడి పంటల ప్రవేశంపై తుది నిర్ణయం తీసుకునే ఈ జీఈఏసీ సభ్యులతోపాటు, ‘జెనిటిక్ మ్యానిపులేషన్ అండ్ ద మానిటరింగ్ కమిటీ’కి సంబంధించిన పర్యవేక్షణ బృందం కూడా ఈ సమావేశంలో పాల్గొంది. బీటీ పత్తి విత్తనాన్ని అభివృద్ధి చేసిన మహికో – మోన్శాంటో సభ్యులు, కొంతమంది పౌర సమాజపు ప్రతినిధులు కూడా అందులో ఉన్నారు. రెండు నెలలు ఆలస్యంగా నాటినా ఆ ఏడాది పత్తి పంట దిగుబడి యాభై శాతం ఎక్కువైనట్లు దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం చెబుతోందని సమావేశంలో ప్రస్తావించారు. బీటీ కాటన్ కారణంగానే ఇలా జరిగిందనడంతో ఆశ్చర్యం వేసింది నాకు. ఆ సమాచారం తప్పనీ, అశాస్త్రీయమైందనీ, దాన్ని ఏదైనా పరిశోధన సంస్థతో నిర్ధారించాలనీ నేను పర్యవేక్షణ కమిటీ ఛైర్మన్, అప్పటి ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్) డిప్యూటీ డైరెక్టర్ను కోరాను. సాధారణ పరిస్థితుల్లో ఎదిగేందుకు ఐదు నెలల సమయం తీసుకునే పంటలో రెండు నెలలు ఆలస్యంగా విత్తినా అధిక దిగుబడి సాధించడం దాదాపు అసాధ్యం. వ్యవసాయ పరి శోధనల్లో విత్తనాలు వేసే సమయం చాలా ముఖ్యమైన అంశమన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి అంశంలో ఒక ప్రైవేట్ కంపెనీకి మినహాయింపు ఇస్తే, భవిష్యత్తులో యూనివర్సిటీ శాస్త్రవేత్తలను కూడా విత్తిన సమయం గురించి పట్టించుకోవద్దని చెప్పే అవకాశం ఏర్పడుతుంది. జీఈఏసీ ఛైర్మన్కు నేను వేసిన ప్రశ్న ఏమిటంటే– రెండు నెలలు ఆలస్యంగా విత్తినా దిగుబడి పెరగడ మంటే... అది రైతులకు చాలా ప్రయోజనకరమైంది కాబట్టి, రైతులందరూ రెండు నెలలు ఆలస్యంగా విత్తుకోవాలని ఎందుకు సలహా ఇవ్వకూడదూ? అని! ఈ సమావేశం పూర్తయిన తరువాత సాయంకాలం ఐసీఏఆర్ ఉన్నతాధికారి ఒకరు నాతో మాట్లాడుతూ, బీటీ విత్తనాల ట్రయల్స్ ఇంకో ఏడాది చేయాల్సిందిగా మహికో–మోన్శాంటో కంపెనీని కోరినట్లు తెలిపారు. అవసరమైనంత మేర అన్ని పరీక్షలు పూర్తి చేసినట్లు మోన్శాంటో చెప్పినా జన్యుమార్పిడి పంటల అనుమతిని ఒక ఏడాది ఆలస్యం చేయగలిగామన్నమాట. ఆ సమావేశంలో ప్రశ్నలేవీ వేయకుండా ‘సాక్ష్యాల’ ఆధారంగా అనుమతులిచ్చి ఉంటే ఏడాది ముందుగానే జన్యుమార్పిడి పంటలు దేశంలోకి వచ్చేసి ఉండేవి. బీటీ వంకాయపై నిషేధం దేశంలోకి బీటీ వంకాయ అనుమతిని నిరాకరిస్తూ 2010లో అప్పటి పర్యావరణ శాఖ మంత్రి జైరామ్ రమేశ్ ఒక ప్రకటన చేశారు. ‘డెసిషన్ ఆన్ కమర్షియలైజేషన్ ఆఫ్ బీటీ బ్రింజాల్(బీటీ వంకాయ వాణిజ్యీకరణ మీద నిర్ణయం)’ పేరుతో అప్పట్లో 19 పేజీల డాక్యుమెంట్ ఒకటి విడుదలైంది. దీనిపై శాస్త్రవేత్తలు ఎన్ని మాటలు చెప్పినా నా అంచనా ప్రకారం ప్రతి వృక్ష శాస్త్రవేత్తా కచ్చితంగా చదవాల్సిన డాక్యుమెంట్ అది. దేశ విదేశాల్లోని శాస్త్రవేత్తలతో, ఏడు దఫాలుగా ప్రజలతో సంప్రదింపుల తరువాత జైరామ్ రమేశ్ ఆ డాక్యుమెంట్ను విడుదల చేశారు. జన్యుమార్పిడీ టెక్నాలజీపై రైతులు, ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు దేశం మొత్తమ్మీద వంకాయ పండించే ప్రాంతాల్లో సంప్రదింపులు జరపడం ఇదే తొలిసారి. జాగరూకత, ముందస్తు జాగ్రత్త, సిద్ధాంతాల ఆధారంగా జైరామ్ రమేశ్ ఒక నిర్ణయం తీసుకుంటూ... ఏ కొత్త టెక్నాలజీ అయినా ఆయా సముదాయాల సామాజిక, సాంస్కృతిక విలువలకు ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు. మీడియాలో ఒక వర్గం జన్యుమార్పిడి పంటలపై బహిరంగ విచారణను తోసిపుచ్చింది. అంతా బూటకం అని కొట్టి పారేసింది కూడా. అయితే ప్రజలు లేవనెత్తిన కీలకమైన అభ్యంతరాలను మంత్రి గుర్తించి తగు నిర్ణయం తీసుకోవడం మాత్రం నాకు ఆనందం కలిగించింది. అంతేకాదు... జన్యుమార్పిడి విత్తన సంస్థల అధ్యయనాల నియమాలు, సమాచారాన్ని విశ్లేషించిన తీరు, ఫలితాలన్నింటినీ ప్రస్తావిస్తూ డాక్యుమెంట్ను రూపొందించడమూ ప్రశంసనీయమైన అంశం. జాగరూకతతోనే ముందుకు వాస్తవ పరిస్థితులకూ, కొందరు సేకరించే సాక్ష్యాలకూ మధ్య ఉన్న అంతరం సైన్స్ ఆధారిత పద్ధతుల అవసరాన్ని మరోసారి నొక్కి చెబుతోంది. శాస్త్రపరమైన విచారణను పరిమితం చేయడం మార్కెట్ పోకడల్లో ఒకటి. వ్యాపార ప్రయోజనాలను కాపాడేందుకు మార్కెట్లు సైన్స్ను తొక్కేసేందుకూ ప్రయత్నిస్తూంటాయి. జీఎం ఆవాల విషయంలో జరుగుతున్నదీ అదే. జీఈఏసీ ఇటీవలే దీనికి పర్యావరణ అనుమతులు ఇచ్చేసింది. ఈ డీఎంహెచ్–11 జన్యుమార్పిడి ఆవాల పంట దిగుబడి సామర్థ్యం ఎంతన్నది ఐసీఏఆర్కూ తెలియక ముందే పర్యావరణ అనుమతులు రావడం గమనార్హం. దేశ వంటనూనె దిగుమతులను ఈ సరికొత్త ఆవాల ద్వారా తగ్గించుకోవచ్చు అన్న భావనను కలిగిస్తున్నారు. అయితే దీని దిగుబడి చాలా తక్కువ అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటే అదెంత తప్పుడు భావనో అర్థమైపోతుంది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం... జీఎం ఆవాల పరీక్షలకు అన్ని ప్రోటోకాల్స్ను ఢిల్లీ యూనివర్సిటీ స్వయంగా సిద్ధం చేసింది. విద్యార్థినే ప్రశ్నాపత్రం తయారు చేయమని అడగటం లాంటిది ఇది. అంతేకాదు... హెర్బిసైడ్ల(గడ్డిమందుల)ను తట్టుకునే ఆవాల వెరైటీ బీటీ వంకాయ మాదిరిగా కనీస పరీక్షలను కూడా ఎదుర్కోలేదు. జీఎం ఆవాల పరీక్షల్లో ఆరోగ్య నిపుణులు ఎవరూ లేకపోవడం, తేనెటీగలపై జీఎం ఆవాల ప్రభావం ఏమిటన్నది పరిశీలించకపోవడం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న లోపాలు. ఇన్ని లోపాల మధ్య జీఈఏసీ విత్తనాల వృద్ధికి ఎలా అనుమతిచ్చిందో అర్థం కావడం లేదు. సైన్స్ అంటే సత్యాన్ని వెతకడం. ఇటాలియన్–బ్రిటిష్ ప్రొఫెసర్ మైకెలా మాసిమీ 2017లో లండన్ రాయల్ సొసైటీ అవార్డు అందుకుంటున్న సందర్భంగా చేసిన ప్రసంగంలో అచ్చంగా ఈ వ్యాఖ్యే చేశారు. ‘‘ప్రజలకు సైన్స్ విలువను అర్థమయ్యేలా చేయడం మన బాధ్యత అని నేను నమ్ముతున్నాను. కచ్చితత్వం, సాక్ష్యాలు, సిద్ధాంతాలపై విశ్వాసం, కచ్చితమైన పద్ధతులను అవలంబించడం వంటి వాటిని కూడా నిశితంగా పరిశీలించాలి’’! (క్లిక్ చేయండి: జనం మేలుకోకపోతే జీఎం పంటల వెల్లువే!) - దేవీందర్ శర్మ ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com -
‘రాజుగారు’ ఒక ఆశాకిరణం
వాతావరణ మార్పు నుండి జెనిటిక్ ఇంజనీరింగ్ వరకు, వాయు కాలుష్యం నుండి ప్లాస్టిక్ ముప్పు వరకు మానవాళి బాధ్యత వహించవలసిన అనేక చర్చనీయాంశాలను బ్రిటిష్ సింహాసనాన్ని కొత్తగా అధిష్ఠించిన ఛార్లెస్ ఏనాడో తన ప్రాధాన్యాలుగా చేసుకున్నారు. జీవావరణానికి హితంగా ఉండేలా తన అలవాట్లను మార్చుకున్నారు. రసాయన రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత గురించి మాట్లాడడమే కాక, పునరుత్పాదక వ్యవసాయం కోసం ఒక స్వచ్ఛంద సంస్థను కూడా నెలకొల్పారు. పర్యావరణ పరిరక్షణపై ఆయనకున్న దృఢమైన నిబద్ధత ఆయనను కేవలం ఉత్సవ చక్రవర్తిగా ఉంచకపోవచ్చు. ప్రపంచంలో నిస్పృహలు పెరుగుతున్న సమయంలో ఈ కొత్త రాజు కొత్త రాచరిక పాత్రను సులభంగా పోషించగలరు. మనోహరమైన చిద్విలాసాలు, ప్రజాసమూ హాలకు అభివాదాలు, కార్యక్రమాల ప్రారం భోత్సవాలు.. ఇటువంటి సాధారణ కర్తవ్యాల వరకే రాచరికాలు పరిమితమై ఉన్న తరుణంలో బ్రిటిష్ సింహాసనాన్ని అధిష్ఠించిన మూడవ ఛార్లెస్ రాజు తన సొంతవైన ఆలోచనలతో, సున్నితమైన వ్యక్తిత్వంతో, భూగ్రహాన్ని రక్షించాలన్న ప్రబలమైన కాంక్షతో ‘హరిత చక్రవర్తి’గా అవతరించగలరన్న ఆశలు రేకెత్తిస్తున్నారు. ‘‘ఆయన తన ఇరవైల ప్రారంభంలో భవిష్యత్ కాలుష్య దుష్ప్రభావాలపై ప్రభావ వంతమైన ప్రసంగాలు చేశారు. తన మధ్యవయస్సులో ఆర్థిక, పర్యా వరణ, సామాజిక అంశాల మధ్య సమతూకం సాధించే అత్యున్నత స్థాయి సుస్థిరతలకు చొరవ చూపారు. ఈ ఏడాది జనవరిలో తన 73 ఏళ్ల వయసులో వాతావరణ మార్పును నియంత్రించేందుకు అత్యవ సర చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి, వ్యాపార దిగ్గజాలకు స్పష్టమైన పిలుపు నిచ్చారు’’ అని ‘టైమ్’ పత్రిక రాసింది. రానున్న కాలంలో కానున్న రాజుగా మొన్నటి వరకు ఆయన సాగించిన ప్రయాణాన్ని ఈ నాలుగు మాటల్లో ఆ పత్రిక సముచిత పరిచింది. బ్రిటన్ రాజైన వెంటనే, బ్రిటిష్ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు ‘చరిత్ర నాపై మోపిన బాధ్యత ఎంత బరువైనదో తెలుస్తోంది’ అని ఛార్లెస్ అన్నారు. తనెంతో శ్రద్ధ వహిస్తూ వచ్చిన స్వచ్ఛంద కార్య కలాపాలకు, ఇతర విధులకు ఇకపై తన సమయాన్ని, శక్తిని కేటా యించడం మునుపటి స్థాయిలో సాధ్యం కాదని స్పష్టం చేశారు. అయితే ఆయన యోగ్యతలను, పర్యావరణ పరిరక్షణపై ఆయన కున్న దృఢమైన నిబద్ధతను గుర్తెరిగిన చరిత్ర ఆయన్ని కేవలం ఉత్సవ చక్రవర్తిగా ఉంచగలదని నేను భావించడం లేదు. ఎలిజబెత్ రాణి అంత్యక్రియలకు ఐరోపా దేశాల రాచరిక కుటుంబాల నుంచి హాజ రైన వారిలో జపాన్ చక్రవర్తి దంపతులు సహా అందరూ అనామకంగా ఉన్న రాజులు, రాణులే. వారందరిలోనూ ఉన్న సారూప్యం ఒక్కటే. వారిలో ఎవరి జీవితాలూ సునిశితమైన గమనింపులతో గడుస్తున్నవి కావు. వారు తమ మనోభావాలను బయటి వ్యక్తం చేసేవారు కాదు కనుక ప్రజా జీవనంలో వారి గురించి మాట్లాడటానికి ఉన్నది చాలా తక్కువ. పైగా అది వారు ఎంపిక చేసుకుని, అనుసరిస్తున్న జీవనశైలి కూడా. కానీ ఛార్లెస్ అలా కాదు. తన మనోభావాలను వెల్లడించడానికి ఆయన ఏనాడూ సంకోచించలేదు. అది వ్యతిరేకమైన ఫలితాన్నే ఇచ్చినా ధైర్యంగా నిలబడి ఉన్నారు. ఉదాహరణకు ఆయన నిశ్చితాభి ప్రాయాలు ఇలా వ్యక్తం అయ్యేవి : ‘రసాయనాల వాడకం వ్యవసా యానికి వినాశకరంగా పరిణమిస్తుంది. అనేక విధాలుగా భారీ నష్టాన్ని కలిగిస్తుంది. కాలుష్య కారకాలైన ఉద్గారాలు విపరీతంగా వెలువడతాయి’ అనేవారు. లేదా, ‘చిన్న పొలాలు కనుమరుగైతే అది బ్రిటిష్ గ్రామీణ ప్రాంతాల హృదయాన్నే చీల్చివేస్తుంది’ అని చెప్పే వారు. విధ్వంసక వ్యవసాయం, మత్స్య పరిశ్రమలకు రాయితీలు అనే అంశాలు తరచు ఆయన మాటల్లో వెల్లడయేవి. రసాయన రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత గురించి మాట్లాడడమే కాకుండా, పునరుత్పాదక వ్యవసాయం కోసం ఒక స్వచ్ఛంద సంస్థను కూడా నెలకొల్పారు. జీవావరణానికి హితంగా ఉండేలా తన అలవాట్లను మార్చు కున్నారు. మాంసాహారాన్ని దాదాపుగా త్యజించారు. పశుగణాభివృద్ధి అవసరాన్ని తగ్గిస్తే ఉద్గారాలను నియంత్రించవచ్చు అన్న ఆలోచనే ఆయన్ని శాకాహారం వైపు మళ్లించింది. పాల ఉత్పత్తులను తీసు కోవడాన్ని కూడా ఛార్లెస్ తగ్గించారు. ‘కాప్–26’ సదస్సుకు ముందు ఆయన తన ఆస్టన్ మార్టిన్ కారును బయో–ఇథనాల్తో నడుపు తున్నట్లు వెల్లడించడం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుందని ‘ది గార్డియన్’ ఒక వార్తాకథనం రాసింది. ఇంగ్లిష్ వైట్ వైన్ అవశేషాలు, జున్ను తయారీలోని పాల విరుగుడుల మిశ్రమమే ఆ బయో– ఇథనాల్. దాని ద్వారా ఛార్లెస్ తన ప్రజలకు ఒక స్పష్టమైన ఆచరణా త్మక సందేశాన్ని అందిస్తున్నారు. ‘మీ వంతుగా ఉద్గారాలను తగ్గిం చండి, తద్వారా పర్యావరణాన్ని రక్షించడంలో ప్రధాన పాత్ర పోషించండి’ అన్నదే ఆ సందేశం. వాతావరణ మార్పు నుండి జెనిటిక్ ఇంజనీరింగ్ వరకు, వాయు కాలుష్యం నుండి ప్లాస్టిక్ ముప్పు వరకు, సేంద్రియ వ్యవసాయం నుండి ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన వరకు... బాధ్యత వహించవలసిన అనేక చర్చనీయాంశాలను ఛార్లెస్ ఏనాడో తన ప్రాధాన్యాలుగా చేసు కున్నారు. దీనిని ఎలాగైనా పిలవండి. విపరీతం అనండి, అతిమోహం అనండి. ఒకటి మాత్రం వాస్తవం. ఆయన బాగా చదివినవారు. విషయంపై అవగాహన లేకుంటే, ఆధిపత్య కథనాలను సవాలు చేయడం అంత సులభమేమీ కాదు. అది కూడా డబ్బు మూటలతో పెద్ద పెద్ద కంపెనీలు ఆ కథనాలకు మద్దతు ఇస్తున్నప్పుడు! దీనిని బట్టి ఆయన తన పాలనను ఎలా నిర్వహిస్తారు, తన కొత్త పాత్రను ఎలా మలుచుకుంటారు అనేవి ఆధారపడి ఉంటాయని భావిస్తు న్నాను. అంతకంటే కూడా ఆయన తను ఎలా గుర్తుండి పోవాలని అనుకుంటున్నారో అది కూడా కీలక పాత్ర వహిస్తుంది. నేను బాగా ఇష్టపడే మరొక చక్రవర్తి కూడా ఈ సందర్భంలో గుర్తుకు వస్తున్నారు. థాయ్లాండ్ రాజు భూమిబోల్ అదుల్యాతేజ్ 1946లో సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత 70 సంవత్సరాలు పరిపాలించారు. ప్రజల అభివృద్ధి అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రత్యక్షంగా వారితో సమయం గడపడం అనే ఆయన మానవీయ దృక్పథానికి విద్యార్థిగా ఉండగా నేను ఆకర్షితుడనయ్యాను. ఒక రాజుగా ఆయనకు అంత చేయవలసిన అవసరం లేదు. కానీ ఆర్థిక శ్రేయస్సు, ప్రజా సంక్షేమంపై ఆయన ఆసక్తి చివరికి ఆయన ఓ ‘సమృద్ధ ఆర్థిక వ్యవస్థ’ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేయడానికి దోహద పడింది. 1997లో ఆసియా ఆర్థిక సంక్షోభం సమయంలో ఉన్నప్పుడు టెలివిజన్ ప్రసంగంలో ఆయన ఇలా అన్నారు: ‘‘దేశం పులిగా మారా లని దేశ ప్రజలు పిచ్చిగా కోరుకుంటున్నారు. పులిగా ఉండటం ముఖ్యం కాదు. దేశం సమృద్ధ ఆర్థిక వ్యవస్థను కలిగి ఉండటం ముఖ్యం. సమృద్ధిగా అంటే, మనల్ని మనం పోషించుకోవడానికి తగి నంతగా.’’ ఈ మాటలు ప్రస్తుతం భారత్కు కూడా వర్తిస్తాయి. ఏదేమైనా అభివృద్ధి చక్రానికి స్థిరత్వపు ఇరుసు లాంటి ఆ ‘సమృద్ధ ఆర్థిక వ్యవస్థ’ సిద్ధాంతం నేడు థాయ్లాండ్లోని 23 వేల గ్రామాల్లో ఆచరణలో ఉంది. ఎగుమతులపై దృష్టి పెట్టడానికి బదులు, స్వయం సమృద్ధిని నిర్మించడం అనే భావనపై ఆ సిద్ధాంతం ఆధారపడి ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మట్టి పునరుత్పత్తి, సూక్ష్మక్రిమి కణాల సేకరణలతో పాటు అనేక అభివృద్ధి ప్రణాళికల కోసం కృషి చేసిన థాయ్ రాజును ఐక్యరాజ్య సమితి 2006లో తన మొదటి ‘మానవాభివృద్ధి అవార్డు’కు ఎంపిక చేసింది. ఆయనకు ప్రపంచంలోని మొట్టమొదటి, ఏకైక ‘అభివృద్ధి రాజు’గా గుర్తింపు ముద్ర వేస్తూ, ఆనాటి సమితి ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్... ‘‘థాయ్లాండ్లోని పేద, అత్యంత బలహీన వర్గాల ప్రజల చెంతకు.. వారి స్థితి, జాతి లేదా మతంతో సంబంధం లేకుండా థాయ్ రాజు వెళ్లారు. వారి జీవితాలను వారే తమ చేతుల్లోకి తీసుకునే సాధికారతను వారికి ఇచ్చారు’’ అని కీర్తించారు. అనేక విధాలుగా ఛార్లెస్ కూడా తనను కేంద్ర స్థానంలో నిలబెట్టే ఒక వారసత్వాన్ని పంచుకున్నారు. ప్రపంచానికి ఇప్పుడు సుస్థిరతపై దృష్టిని మళ్లించగల కొన్ని తెలివైన స్వరాల అవసరం ఉంది. పర్యావరణ పరిరక్షణతో పాటు, అసమానతలు మరింత పెరిగేందుకు దారితీసిన ఆర్థిక మాంద్యంపై కచ్చితంగా ఆయన దృష్టి సారించాలి. ఎలాంటి రాజకీయ వివాదాలలోకీ వెళ్లకుండా, నిస్పృహలు పెరుగు తున్న ఈ సమయంలో ఆశలను పెంపొందించేందుకు ఈ కొత్త రాజు ఒక కొత్త రాచరిక పాత్రను సులభంగా పోషించగలరని నేను విశ్వసి స్తున్నాను. వ్యాసకర్త: దేవీందర్ శర్మ, ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు (‘ది ట్రిబ్యూన్’ సౌజన్యంతో) ఈ–మెయిల్: hunger55@gmail.com -
ఉన్నవాళ్లకే మరిన్ని రాయితీలా?
పేదలకు అత్యవసరమైన ఉచితాలను ‘పప్పు బెల్లాలు’ అంటూ చాలామంది గగ్గోలు పెడుతుంటారు. కానీ కార్పొరేట్ కంపెనీలకు అందుతున్న రాయితీల గురించి ఎవరూ మాట్లాడరు. వ్యవసాయ రుణాలను మాఫీ చేసినప్పుడు రుణ సంస్కృతిని అవి విచ్ఛిన్నపరుస్తున్నాయని చాలామంది ఆక్షేపించారు. కానీ భారీ ఎత్తున కార్పొరేట్ పన్నులు తగ్గించడం అనేది ఆర్థిక పురోగతికి దారి తీస్తుందని వీరే తప్పుడు సూత్రాలు వల్లిస్తున్నారు. గత అయిదేళ్లలో రూ.10 లక్షల కోట్ల కార్పొరేట్ నిరర్థక రుణాలను మాఫీ చేసినట్లు కేంద్రప్రభుత్వం ఇటీవలే పార్లమెంటుకు తెలిపింది. అత్యంత సంపన్నుల జేబుల్లో డబ్బును తేరగా పోయడం ద్వారా ఇప్పటికే ఉన్న సంపద అసమానత్వం మరింతగా పెరిగింది. సంపన్నులకు యాభై సంవత్సరాలుగా లభిస్తున్న పన్ను రాయితీలు ఏమాత్రం తగ్గడం లేదని ఒక అధ్యయనాన్ని ఉల్లేఖిస్తూ ‘బ్లూమ్బెర్గ్’లో ఒక కథనం ప్రచురితమైంది. లండన్లోని కింగ్స్ కాలేజీకి చెందిన ఇద్దరు పరిశోధకులు అధునాతనమైన గణాంక విధానాన్ని ఉపయోగించడమే కాకుండా, 18 పురోగామి ఆర్థిక వ్యవస్థలు అనుసరించిన విధానాలను పరిశీలించారు. సాక్ష్యాధారాలు లేకుండా అనుభవపూర్వకంగా చాలామంది ఇంతకాలంగా చెబుతున్నదాన్ని వీళ్లు ససాక్ష్యంగా నిరూపించారు. అనేకమంది భారతీయ ఆర్థికవేత్తలు కార్పొరేట్ పన్నులను తగ్గించాల్సిన అవసరాన్ని సమర్థించడానికి అనేక ప్రయత్నాలు చేశారు. కానీ ఈ ఇద్దరు పరిశోధకుల అధ్యయనం (కొద్దిమంది ఇతరులు కూడా) స్పష్టంగా ఒక విషయాన్ని బయటపెట్టింది. పన్ను రాయితీ అనేది ఆర్థిక పురోగతికి సహాయం చేయలేదు. అది మరిన్ని ఉద్యోగావశాలను కూడా కల్పించలేదు. డబ్బును తేరగా అత్యంత సంపన్నుల జేబుల్లో పోయడం ద్వారా ఇప్పటికే ఉన్న సంపద అసమానత్వాన్ని మరింతగా పెంచడంలో పన్ను రాయితీ సాయపడింది. భారతదేశంలో రైతులతో సహా పేదలకు అందిస్తున్న ఉచితాలను ‘పప్పు బెల్లాల’ సంస్కృతి అంటూ ఎన్నో వార్తాపత్రికల కథనాలు ధ్వజమెత్తుతున్నాయి. అదే సమయంలో కార్పొరేట్ సంస్థలకు అంది స్తున్న భారీ స్థాయి ఉచితాల గురించి ఇవి ఏమాత్రం ప్రస్తావించడం లేదు. కొద్దిమంది వ్యాఖ్యాతలను మినహాయిస్తే– మాఫీలు, ట్యాక్స్ హాలిడేలు, ఉద్దీపన ప్యాకేజీలు, పన్ను తగ్గింపులు వంటి కార్పొరేట్ సబ్సిడీల విస్తృతి, స్వభావాన్ని చాలామంది దాచిపెడుతున్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంకు ‘ఫలితం ఇవ్వని ఉచితాలు’ అంటూనే, ఆ మాటకు అర్థమేమిటో స్పష్టంగా నిర్వచించలేక పోయినప్పటికీ, భారత్లో కార్పొరేట్ పన్నుల తగ్గింపు కూడా ఈ విభాగంలోనే చేరతుందని అంతర్జాతీయ అధ్యయనాలు తెలుపు తున్నాయి. కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ ఆర్థిక వేత్త జెఫ్రీ సాచెస్ను గతంలో ఒక ప్రశ్న అడిగారు. పారిశ్రామిక ఉత్పత్తిని ఏమాత్రం పెంచనప్పుడు లేదా అదనపు ఉద్యోగాలను సృష్టించలేకపోయినప్పుడు కార్పొరేట్లకు భారీస్థాయి పన్ను తగ్గింపు ద్వారా ఏం ఫలితం దక్కింది అని ప్రశ్నించారు. పన్ను రాయితీల ద్వారా ఆదా అయిన డబ్బు కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్ల జేబుల్లో పడిందని ఆయన క్లుప్త సమాధానం ఇచ్చారు. కొన్ని ప్రముఖ ఆర్థిక వ్యవస్థల్లో కేంద్ర బ్యాంకులు వాస్తవంగా అత్యంత ధనవంతుల జేబుల్లోకి చేరేలా అదనపు డబ్బును ముద్రించాయి. 2008–09 కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిన రోజుల్లో పరిమాణాత్మక సడలింపు అనే పదబంధాన్ని వ్యాప్తిలోకి తీసుకొచ్చారు. ఈ పేరుతో ధనిక దేశాలు 25 లక్షల కోట్ల డాలర్ల అదనపు డబ్బును ముద్రించాయి. తక్కువ వడ్డీరేటుతో, అంటే సుమారు రెండు శాతంతో ఫెడరల్ బాండ్ల రూపంలో ఆ సొమ్మును సంపన్నులకు జారీ చేశాయి. ఈ మొత్తం డబ్బును వాళ్లు అభివృద్ధి చెందుతున్న దేశాల స్టాక్ మార్కెట్లలో మదుపు చేశారు. అందుకే ఆ కాలంలో బుల్ మార్కెట్లు ఎలా పరుగులు తీశాయో చూశాం. మోర్గాన్ స్టాన్లీకి చెందిన రుచిర్ శర్మ ఒక వ్యాసంలో కరోనా మహమ్మారి కాలంలో జరిగిన తతంగంపై రాశారు. మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో 9 లక్షల కోట్ల డాలర్ల నగదును అదనంగా ముద్రించారనీ, కునారిల్లిపోయిన ఆర్థిక వ్యవస్థలకు ఉద్దీపన ప్యాకేజీలను అందించడమే దీని లక్ష్యమనీ చెప్పారు. కానీ ఉద్దీపన ప్యాకేజీల కోసమని కేటాయించిన ఈ మొత్తం నగదు స్టాక్ మార్కెట్ ద్వారా అత్యంత సంపన్నుల జేబుల్లోకి వెళ్లిపోయిందని వెల్లడించారు. ఈ భారీమొత్తం ఏ రకంగా చూసినా ఉచితాల కిందకే వస్తుంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కల్లోల పరిస్థితుల్లో ఉన్న 2008–09 కాలంలో భారతదేశంలో 1.8 లక్షల కోట్ల రూపాయలను ఆర్థిక ఉద్దీపన పేరుతో పరిశ్రమ వర్గాలకు అందుబాటులో ఉంచారు. ఈ భారీ ప్యాకేజీని ఒక సంవత్సరం తర్వాత ఉపసంహరించుకోవాలి. కానీ ఒక వార్తా నివేదిక ప్రకారం, ప్రభుత్వంలో ఎవరో ‘నల్లాను ఆపేయడం’ మర్చిపోయారు. దీని ఫలితంగా ఉద్దీపన కొనసాగుతూ వచ్చింది. మరో మాటల్లో చెప్పాలంటే, ఆ తర్వాత పదేళ్ల కాలంలో భారత పరిశ్రమ దాదాపుగా రూ. 18 లక్షల కోట్ల డబ్బును ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా అందుకుంది. దీనికి బదులుగా ఈ మొత్తాన్ని వ్యవసాయ రంగానికి అందుబాటులోకి తెచ్చి ఉంటే, ప్రధానమంత్రి కిసాన్ పథకంలో భాగంగా మన రైతులకు యేటా ఒక్కొక్కరికి 18 వేల రూపాయల మేరకు అదనంగా ప్రత్యక్ష నగదు మద్దతు కింద అంది ఉండేది. సెప్టెంబర్ 2019లో భారత పరిశ్రమకు మరోసారి రూ. 1.45 లక్షల కోట్ల పన్నులను ప్రభుత్వం తగ్గించింది. చాలామంది ఆర్థిక వేత్తలు గ్రామీణ డిమాండును ప్రోత్సహించడం కోసం ఆర్థిక ఉద్దీపనను అందించాలని కోరుతున్న సమయంలో మళ్లీ కార్పొరేట్ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం కరుణించింది. దాదాపు రూ.2.53 లక్షల కోట్ల మేరకు వ్యవసాయ రుణాలను మాఫీ చేసినప్పుడు రుణ సంస్కృతిని అవి విచ్ఛిన్నపరుస్తున్నాయని ఆర్థికవేత్తలు ఆరోపించారు. కానీ భారీ ఎత్తున కార్పొరేట్ రుణాలను మాఫీ చేయడం వల్ల ఆర్థిక పురోగతికి దారి తీస్తుందని తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. గత అయిదేళ్లలో రూ. 10 లక్షల కోట్ల కార్పొరేట్ నిరర్థక రుణాలను కొట్టేసినట్లు ప్రభుత్వం ఇటీవలే పార్లమెంటుకు తెలిపింది. కార్పొరేట్ పన్నులు తగ్గించడం ద్వారా వచ్చే ప్రయోజనాలు సగటు మనిషిని చేరుకోలేదు. సంపన్నులు మాత్రమే వాటినుంచి లబ్ధిపొందారు. ఇది సంపన్నులకు, పేదలకు మధ్య అంతరాన్ని మరింతగా పెంచింది. వ్యవసాయ రుణాలను మాఫీచేసినప్పుడు బ్యాంకులు తమకు రావలసిన అసలు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి డిమాండ్ చేసి మరీ తీసుకుంటాయి. కానీ కార్పొరేట్ రుణాలను మాఫీ చేసినప్పుడు బ్యాంకులు పైసా డబ్బును కూడా వసూలు చేయలేక దెబ్బతింటాయి. దేశంలో రుణాలు చెల్లించే సామర్థ్యం ఉండి కూడా ఎగవేస్తున్న సంస్థలు 10 వేల వరకు ఉంటాయి. రెండు వేలమంది రైతులు తీసుకున్న రుణాలను చెల్లించలేదని జారీ చేసిన అరెస్టు వారెంట్లను కొన్ని నెలలక్రితం పంజాబ్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. కానీ ఉద్దేశ పూర్వకంగా రుణాలు ఎగ్గొడుతున్న వారిని మాత్రం స్వేచ్ఛగా వదిలేస్తున్నారు. మునుపటి ప్రణాళికా సంఘం సబ్సిడీపై కార్యాచరణ పత్రాన్ని రూపొందించింది. న్యూఢిల్లీలో ఎకరాకు రూపాయి చొప్పున 15 ఎకరాల భూమిని ఒక కార్పొరేట్ ఆసుపత్రికి సబ్సిడీల పేరిట అప్పనంగా ధారపోశారని ఇది బయటపెట్టింది. ఐటీ రంగంతో సహా ప్రైవేట్ ఆసుపత్రులు, పరిశ్రమలకు తరచుగానే చదరపు మీటరుకు ఒక రూపాయి చొప్పున భూమిని ధారపోస్తున్నారు. అదే సమయంలోనే మౌలిక వసతుల కల్పనకు, వడ్డీ, మూలధనం, ఎగుమతులతో పాటు విద్యుత్, నీరు, ముఖ్యమైన సహజ వనరులకు కూడా సబ్సిడీలు అందిస్తున్నారు. ఇవి చాలవన్నట్లుగా పలు రాష్ట్రాలు నూరు శాతం పన్ను మినహాయింపు, ‘ఎస్జీఎస్టీ’ మినహాయింపు వంటి ప్రోత్సాహకాలను అందజేస్తున్నాయి. ఈరకంగా కార్పొరేట్ ఇండియా కూడా భారీ సబ్సిడీలు, ఉచితాల మీదే ఎలా బతుకీడుస్తోంది అనేది అధ్యయనం చేయడం ఆసక్తికరంగా ఉంటుంది. దీంతో అమూల్యమైన వనరులు హరించుకుపోతున్నాయి. పేదలకు కొద్ది మొత్తం ఉచితాలు మిగులుతున్నాయి. - దేవీందర్ శర్మ ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
చేద్దామా? చద్దామా?
సెకనుకు సుమారు 13.3 హిరోషిమా అణ్వాయుధాలు లేదా రోజుకు 11,50,000 అణ్వాయుధాలు పడితే ఎలా ఉంటుంది? ప్రస్తుతం భూగోళం ఎదుర్కొంటున్న సమస్య ఇంత తీవ్రంగా ఉంది. ఈ మంటలు పుట్టించే వేడికి ఏ దేశమూ మినహాయింపు కాదు. చల్లటి ప్రాంతాలుగా పేరొందిన యూరోపియన్ దేశాలు సైతం ఎండలకు మాడిపోతున్నాయి. ఇంకోవైపు కనీవినీ ఎరుగని స్థాయిలో వర్షాలు పడుతున్నాయి. వాతావరణం అదుపు తప్పిందన్నది నిజం. ఎప్పటికో అనుకున్నది ఇప్పటికే వచ్చేసింది. కొందరు నమ్ముతున్నట్టు ఏ కొత్త టెక్నాలజీనో వచ్చి అమాంతం సమస్యను పరిష్కరించలేదు. ప్రభుత్వాల స్థాయిలో, వ్యక్తిగత స్థాయిలో చర్యలు మొదలుకావాలి. లేదంటే, ‘వాతావరణ ఆత్మహత్యలే’ శరణ్యం. విపరీత వాతావరణం పుణ్యమా అని గత వారంలో స్పెయిన్, పోర్చుగల్లలో వెయ్యి మంది ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి ఏమిటన్నది అర్థం చేసుకోవచ్చు. బ్రిటన్లోనైతే రికార్డులు బద్దలు కొడుతూ 40 డిగ్రీల సెల్సియస్కు చేరుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకుని జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించేశారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెరస్ ఈ వడగాడ్పులను సామూహిక ఆత్మహత్యలకు ఏమాత్రం తీసిపోని పరిణామమని హెచ్చరించారు. వాతావరణ మార్పుల మీద జరిగిన రెండు రోజుల సమావేశంలో 40 దేశాలకు చెందిన మంత్రులతో మాట్లాడుతూ... ‘‘మానవాళిలో సగం ఇప్పటికే వరదలు, కరవులు, తుపాన్లు, కార్చిర్చుల ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ ప్రమాదం నుంచి ఏ దేశానికీ మినహాయింపు లేదు. అయినా మనం శిలాజ ఇంధనాల వ్యసనాన్ని కొనసాగి స్తున్నాం. ఇప్పుడు మన ముందు ఒక అవకాశం ఉంది. కలిసికట్టుగా సమస్యను అధిగమించే ప్రయత్నం చేద్దామా? లేక అందరమూ కలిసికట్టుగా ఆత్మహత్య చేసుకుందామా? నిర్ణయం మన చేతుల్లోనే ఉంది’’ అని వ్యాఖ్యానించారు. ప్రకృతి వైపరీత్యాల ప్రకోపం పతాక స్థాయికి చేరిన ఈ తరుణంలో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి హెచ్చరిక అనూహ్యమేమీ కాదు. ఎవరో అన్నట్లు... ఇవి వాతావరణ మార్పులు కాదు, ‘వాతావరణ ఆత్మహత్యలు’. యూరప్, ఉత్తర అమెరికాల్లో చాలా భాగాల్లో కార్చిచ్చులు కలవరపెడుతున్నాయి. ఇంకోవైపు భారత్లో కనీవినీ ఎరుగని స్థాయిలో వర్షాలు పడుతున్నాయి. ధ్రువ ప్రాంతాల్లో ఏటికేడాదీ కుంచించుకుపోతున్న మంచు! అదే సమ యంలో ఆఫ్రికాలోని పలు ప్రాంతాల్లో కరవు పరిస్థితులు! ఇవన్నీ చూస్తే ప్రపంచ వాతావరణం అదుపు తప్పినట్లే కనిపిస్తోంది. వాతా వరణ మార్పుల ప్రభావం ఎలా ఉంటుందో తెలిసినప్పటికీ... ఎప్పుడో వస్తున్నాయనుకున్నవి ఇప్పుడే వచ్చేస్తూండటం, జరుగు తున్న నష్టం తీవ్రంగా ఉండటం ఆందోళన కలిగించే విషయం. ఒహాయో యూనివర్సిటీ మాజీ గణిత శాస్త్రవేత్త ఇలియట్ జాకబ్సన్‘వాచింగ్ ద వరల్డ్ గో బై’ పేరుతో ఓ లెక్క చెప్పారు. ‘‘ఈ గ్రహంపై సెకనుకు 13.3 హిరోషిమా అణు బాంబులు పేలితే పుట్టేంత వేడి పుడుతోంది. అంటే రోజుకు 11,50,000 అణు బాంబులంత వేడన్నమాట’’ అని విస్పష్టంగా పేర్కొన్నారు. సముద్ర జలాల ఉష్ణోగ్రతలు కూడా సెకనుకు 12 హిరోషిమా అణుబాంబుల స్థాయిలో పెరుగుతున్నాయని ఆయన చెప్పారు. తలుచుకుంటేనే భయం పుట్టే స్థాయి. అయినా సరే, మనం కలిసికట్టుగా పనిచేసేం దుకు సిద్ధంగా లేము. అందుకేనేమో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి కూడా ప్రభుత్వాలు చెప్పేదొకటీ, చేసేది ఇంకోటీ అని నిష్టూరమాడారు. పచ్చిగా మాట్లాడాల్సి వస్తే దేశాలన్నీ అబద్ధాలు చెబుతున్నాయన్నారు. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ తాజా నివేదిక విడుదలైన సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఈ శతాబ్దాంతానికి భూమి సగటు ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ పెరగకూడదనుకుంటే... 2022 నాటికి కర్బన ఉద్గారాలు పతాకస్థాయికి చేరాలని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఇంకోలా చెప్పాలంటే, 2023 నుంచి ఉద్గారాలు గణనీయంగా తగ్గాలే తప్ప మరి పెరగకూడదన్నమాట. అయితే వాస్తవ పరిస్థితులు దీనికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. కానీ సమయమేమో మించిపోతోంది. హెచ్చరికలు బేఖాతరు... వాతావరణం మనకిప్పటికే అన్ని రకాల హెచ్చరికలు చేస్తున్నా అన్నీ బేఖాతరవుతున్నాయి. రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, ఆర్థిక వేత్తలు, శాస్త్రవేత్తలు, మీడియా ప్రతినిధులు కూడా నిమ్మకు నీరెత్తి నట్లు వ్యవహరిస్తున్నారు. సమాజాన్ని ప్రభావితం చేయగల వీరు ఇస్తున్న సందేశమేమిటి? ఏం ఫర్వాలేదు; కొత్త కొత్త టెక్నాలజీ లొస్తున్నాయి; వాతావరణ సమస్యలకు ఇవి సమాధానం చెబుతాయి; అందోళన అనవసరం అని! ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత ప్రకృతి వైపరీ త్యాలకూ వాతావరణ మార్పుల ప్రభావానికీ సంబంధం లేదని కూడా కథనాలు వెలువడుతున్నాయి! అంతేకాకుండా... ఆర్థికాభివృద్ధి పేరుతో ప్రకృతి వనరుల విధ్వంసాన్ని కూడా కొందరు సమర్థించుకుంటున్నారు. ఈ రకమైన ఆర్థిక విధానాలకు ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. శిలాజ ఇంధనాలను త్యజించాలన్న డిమాండ్ పెరుగుతోంది కూడా. ప్రధాన స్రవంతిలోని ఆర్థికవేత్తలకు భిన్నంగా ఆలోచిస్తున్న బ్రిటిష్ మంత్రి జాక్ గోల్డ్ స్మిత్ ఒక ట్వీట్ చేస్తూ... ‘‘యూరప్ మొత్తమ్మీద కార్చిచ్చులు చెలరేగుతున్నాయి. ఉష్ణోగ్రతల రికార్డులు బద్ధలవు తున్నాయి. అడవులు, పర్యావరణ వ్యవస్థలు కూడా రికార్డు వేగంతో నశించిపోతున్నాయి. అయినా పర్యావరణ పరిరక్షణకు డబ్బులు ఖర్చు చేయడం ఏమంత లాభదాయకం కాదనే రాజకీయ నేతలు మళ్లీ పదవులకు ఎన్నికవుతున్నారు’’ అని వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్య సమితి మాజీ ప్రధాన కార్యదర్శి బాన్ –కీ మూన్ గతంలో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ను ఉద్దేశించి మాట్లాడుతూ, వాతావరణ విధ్వంసానికి కారణమవుతున్న ఆర్థిక విధానాలను చక్కదిద్దే నాయకత్వపు అవసరం ఇప్పుడు ఎంతైనా ఉందని చెప్పడం ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. ఈ సమస్యకు పరిష్కారం కూడా ఇదేననీ, రాజకీయ నేతలు ఈ గట్టి నిర్ణయం తీసుకోలేకపోతున్నారనీ నా నమ్మకం కూడా. అభివృద్ధికి సూచిక స్థూల జాతీయోత్పత్తి అన్న వ్యామోహం నుంచి బయటపడనంత వరకూ వాతావరణ సమస్య లకు పరిష్కారం లభించనట్లే. మనకిష్టమైనా, కాకపోయినా సరే... ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ నిర్మాణం సమాజంలో అంతరాలను పెంచిం దన్నది మాత్రం నిజం. అంతేకాకుండా... పర్యావరణ సమస్యలను తెచ్చిపెట్టిందీ, ప్రపంచం అంతరించిపోయే స్థితికి చేర్చింది కూడా ఇవే. కాబట్టి ఆర్థిక వ్యవస్థ సమూల ప్రక్షాళన తక్షణావసరం. ప్రస్తుత అస్తవ్యస్త వ్యవహారం ఇకపై ఎంతో కాలం కొనసాగే అవకాశాలు లేవు. బహుశా ప్రస్తుతం వీస్తున్న వడగాడ్పులు ఓ షాక్ థెరపీనేమో. మానవాళి మేల్కొనేందుకు అవసరమైనదే కావచ్చు. నిర్మాణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాల్సిన అవసరాన్ని గుర్తుచేసే సందర్భమూ ఇదే. ఎందుకంటే, ఇది పోతే ఇంకోటి ఉందిలే అని భూమి గురించి అనుకోలేము కదా! కర్బన ఉద్గారాలకు, వాతావరణ సమస్యలకు, సంపద సృష్టికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందన్నది నిర్వివాదాంశం. ఆర్థికాభివృద్ధి ఎంత ఎక్కువైతే, అంతేస్థాయిలో కర్బన ఉద్గారాలూ పెరుగుతాయి. స్థూలజాతీయోత్పత్తిని పెంచు కోవాలన్న తపనలో భూమి వేడి కూడా పెరిగిపోతోంది. ఈ నేపథ్యం లోనే మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీకి చెందిన డాక్టర్ హెర్మన్ డాలీ ‘స్టెడీ స్టేట్ ఎకానమీ’కి మద్దతిచ్చారు. ‘‘ప్రతి రాజకీయ నాయ కుడూ వృద్ధికి అనుకూలంగా ఉన్నాడు. అర్థం చేసుకోదగ్గ విషయమే. కానీ అసలు ప్రశ్నకు సమాధానం మాత్రం దాటవేస్తారు’’ అని ఆయన పేర్కొన్నారు. అయితే, వృద్ధి మనల్ని నిజంగానే ధనవంతులను చేస్తోందా? లేక లాభాలకంటే ఖర్చుల్ని ఎక్కువ చేస్తోందా? అన్నది కూడా ఆలోచించాలి. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థను సమర్థిస్తున్న వారు సమాధానమివ్వాల్సిన ప్రశ్న కూడా ఇదే. ఆర్థికవేత్తల ఆలోచనలు ఎలా ఉన్నా, సామాన్యుల వ్యవహారశైలిలోనూ కొన్ని మార్పులు అని వార్యం. వినియోగాన్ని తగ్గించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల ప్రభా వాన్ని తగ్గించుకోవచ్చు. వాతావరణ సమస్య మనం సృష్టించింది కాకపోయినా, ఇప్పటివరకూ కొనసాగడంలో మాత్రం మనవంతు భాగస్వామ్యం తప్పకుండా ఉంది. దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
రైతులు కిందికి... పరిశ్రమలు పైకి...
ప్రపంచవ్యాప్తంగా రైతులు తమ ఉత్పత్తి ఖర్చులను రాబట్టుకోవడానికి తపన పడుతున్న సమయంలోనే ఆక్స్ఫామ్ నివేదిక షాకింగ్ నిజాన్ని వెల్లడించింది. గత రెండేళ్లలో ఆహార రంగ పరిశ్రమకు సంబంధించిన 62 మంది అత్యంత సంపన్నుల క్లబ్లో చేరిపోయారు. ఒక కార్గిల్ ఫుడ్ పరిశ్రమ కుటుంబంలోనే 12 మంది బిలియనీర్లు అయ్యారనీ, కోవిడ్కు ముందు ఈ కుటుంబంలో 8 మంది బిలియనీర్లు ఉండేవారనీ ఈ నివేదిక తెలిపింది. సరకుల ధరలు విపరీతంగా పెరగడం, ఆహార రంగ ద్రవ్యోల్బణం పెరిగిపోవడం, భూమి విలువలు రికార్డు స్థాయిలో పెరగడం, సాంకేతిక ఆవిష్కరణలు వెల్లువలా కొనసాగడం... ఉత్పాదకత పెంపుదల పేరుతో, ఆహార రంగ పరిశ్రమలో లాభాలు ఆకాశాన్నంటుతున్నాయి. సంపద పంపిణీలో ఎవరినీ వెనక్కు నెట్టకూడదనే సంక్షేమ భావన ఎప్పుడో గాలికి ఎగిరిపోయింది. కానీ ఆహార సరఫరా చైన్ సంస్థలు లాభాల మేటతో మురిసిపోతుండగా నిజమైన ఆహార ఉత్పత్తిదారైన రైతు ఎందుకు చిక్కిపోతున్నాడనే విషయం ఎవరికీ పట్టడం లేదు. అంతర్జాతీయ దిగ్గజ కంపెనీ అయిన కార్గిల్తో సహా నాలుగు ఆహార ధాన్యాల వాణిజ్య కంపెనీలు అంతర్జాతీయ ఆహార వాణిజ్యంలో 70 శాతాన్ని నియంత్రిస్తున్నాయి. కోట్లాదిమంది రైతులు ప్రతిఏటా సాగిస్తున్న ఆహార ఉత్పత్తులను వాణిజ్య కంపెనీలు సరఫరా చేస్తున్నాయి. మరో మాటలో చెప్పాలంటే రైతులు ఉత్పత్తి చేస్తున్న సంపదను చాలా సులభంగా, వాణిజ్య కంపెనీలు చప్పరించి వేస్తున్నాయి. వ్యవసాయరంగంలో సమస్యలకు పరిష్కారం అని చెబుతూ సాంకేతిక సంపన్న సంస్థలు నిత్యం సాంకేతిక మార్గాలను ప్రోత్సహిస్తున్నది నిజం. బతకడం ఎలాగా అని రైతులు ఘర్షణ పడుతున్న సమయంలోనే టెక్నాలజీ కంపెనీల స్టాక్లు అమాంతం పెరిగిపోతున్నాయి. రుఫో క్వాంటిటేటివ్ అనే పారిస్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రైవేట్ ఇన్వెస్టర్, ‘ఆహారం సిలికాన్ వేలీలో పెరగదు’ (ఫుట్ డజ్ నాట్ గ్రో ఇన్ సిలికాన్ వేలీ) అనే చక్కటి ఆలోచనా త్మకమైన వ్యాసంలో ఈ ప్రశ్నను లేవనెత్తారు. ‘స్టాండర్డ్ సోషల్ ఇన్నోవేషన్ రివ్యూ’లో రుఫో ఈ వ్యాసం ప్రచురించారు. ‘మానవ చరిత్రలో ఏ దశలో కంటే కూడా ఆహార వ్యవస్థలో గత వందేళ్లలోనే అనేక ఆవిష్కరణలు జరిగాయి. ఈ ఆవిష్కరణలు అన్నిటి లక్ష్యం ఏమిటంటే ఆహార ధరలను తగ్గిస్తూ పోవడం, రైతులను దారిద్య్రం ఊబిలోకి నెట్టడం, పర్యావరణాన్ని ధ్వంసం చేయడం మాత్రమే’’ అని ఆ వ్యాసంలో రుఫో పేర్కొన్నారు. నిజానికి, ఈ సాంకేతిక ఆవిష్కరణలు అత్యధిక వ్యవసాయ ఆదాయాలకు దారితీయాలి. వాస్తవానికి రైతులు ఎంత ఎక్కువగా ఉత్పత్తి చేస్తే అంత అధికంగా వారి ఆదాయం తగ్గిపోతోంది. ఉదాహరణకు, ఈరోజు కెనడాలో ఒక గోధుమ రైతు సాధిస్తున్న మార్కెట్ ధరను పోల్చి చూస్తే, ఆ రైతు ముత్తాత ఆరు రెట్లు ఎక్కువగా సంపాదించేవాడు. ఇప్పుడు పంజాబ్ విషయానికి వద్దాం. పంజాబ్ వార్షిక పంట ఉత్పత్తి ప్రపంచంలోనే అత్యధికంగా ఉంటున్నప్పటికీ పర్యావరణ విధ్వంసానికి కేంద్రంగా మారిపోయింది. టెక్నాలజీ ఇక్కడ పంట దిగుబడిని పెంచి ఉండవచ్చు. కానీ భూగర్భజలాన్ని మితిమీరి తోడేయడం వల్ల జలధారలు లోలోపలే ఎండిపోయాయి. రసాయన పెట్టుబడులు పర్యావరణాన్ని కుళ్లబొడిచేశాయి. నేల సాంద్రత క్షీణించి పోయింది. పంటల కుదుళ్లను తగులబెట్టడం వల్ల ఆ కాలుష్యం వాతావరణంలో కలిసిపోతోంది. వీటన్నింటి కారణంగా దేశ ధాన్యాగారమైన పంజాబ్ ఇప్పుడు ఆరోగ్య కరమైన, నిలకడైన వ్యవసాయ వ్యవస్థ వైవు పరివర్తన కోసం విలపిస్తోంది. టెక్నాలజీ రాజకీయాలు ఎలా పనిచేస్తాయో అర్థం చేసు కోవడానికి పంజాబ్ ఒక మంచి అవకాశాన్ని అందిస్తోంది. భూగర్భ జలాలను పరిరక్షించడంపై కొనసాగుతున్న చర్చ, కొన్ని దశాబ్దాల క్రితం ఫిలిప్పైన్స్లోని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థను సందర్శించిన రోజులను నాకు మళ్లీ గుర్తుకు తెచ్చింది. వరి విత్తనాలను విత్తినా లేదా మొక్కలను నాటినా పంట దిగుబడిలో పెద్దగా తేడా ఉండదని అక్కడ ఒక అధ్యయనాన్ని చూశాను. ఆ అధ్యయనం తెలిపిన అంశాలపై ఆసక్తితోనూ, ఆసియాలోని పలు ప్రాంతాల్లో వరిగింజలను పొలంపై చల్లడం గతంలో ఎక్కువగా పాటించేవారని తెలిసి ఉండటంతోనూ, ఆ పరిశోధనా కేంద్రంలోని ఒక సీనియర్ రైస్ సైంటిస్టును దీనిపై ప్రశ్నించాను. ఆయన చెప్పిన సమాధానం నన్ను నివ్వెరపర్చింది. ‘మేం ట్రాక్టర్ పరిశ్రమకు సహాయం చేయాలని ప్రయత్నిస్తున్నాము. ఆసియా ఖండంలో 97 శాతం వరకు వరినే పండిస్తారు’ ఫిలిప్పైన్స్ లోని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ మరొక అధ్యయనం ప్రకారం, వరిపొలంలో నేరుగా పురుగుమందులను చల్లినా, స్ప్రేయర్ ద్వారా చల్లినా క్రిమి సంహారక సామర్థ్య విషయంలో పెద్దగా తేడా ఉండదని తెలిసింది. కానీ మనం తెగుళ్లను సంహరించడానికి స్ప్రేయర్లే సమర్థమైనవని నూరిపోస్తున్నాం. విధానపరమైన మద్దతు, సబ్సిడీలు, సులభరీతిలో రుణ లభ్యత వంటి కారణాల వల్ల రైతులు మరింతగా యంత్రాలను కొనడానికి ముందు కొస్తున్నారు. రైతులు ముందుకు రావటం అనటం కంటే వారిచేత అవసరానికి మించి యంత్రాలను కొనిపిస్తున్నారు అంటే బాగుంటుంది. టెక్నాలజీని ఎవరూ వ్యతిరేకించరు. కానీ ఎల్లప్పుడూ ఖరీదైన బ్రాండెడ్ సాంకేతిక ఆవిష్కరణలే ఎందుకు అన్నదే ప్రశ్న. దివంగత సురీందర్ దలాల్ ఆవిష్కరించిన పత్తిపంటపై పురుగుమందులు చల్లే ‘నిదాన’ మోడల్ టెక్నాలజీ చాలా తక్కువ ఖర్చుతో సమర్థంగా పని చేస్తుంది. అయితే దీనికి యంత్రాలు అవసరం లేదు కాబట్టి హరియాణాలో నిదాన మోడల్ టెక్నాలజీని కొనేవారే లేకుండా పోయారు. వ్యవసాయంలో విదేశీ పెట్టుబడుల తగ్గింపు, తక్కువ మెషిన్లు అవసరమయ్యే స్వావలంబన టెక్నాలజీల వినియోగం వైపు మన ఆలోచనలు మారాల్సిన అవసరం ఉంది. (క్లిక్: ఆయన పర్యటన ఏం సాధించినట్లు?) - దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com -
ఇప్పటికీ నేర్వని ఆహార పాఠాలు
నిలకడైన ఆహార వ్యవస్థలను నిర్మించుకోవడం, ఆహార స్వావలంబనను ప్రోత్సహించడానికి బదులుగా, మన విధాన నిర్ణేతలు అంతర్జాతీయ మార్కెట్ నిబంధనలను పొడిగించుకుంటూ పోతున్నారు. అంటే దీనర్థం మార్కెట్ శక్తులు తమ ఇష్టానుసారం రాజ్యమేలడానికి అవకాశం ఇవ్వడమే! ప్రపంచంలోని అతి పెద్ద కంపెనీలు ఈ సంవత్సరం ఇప్పటికే రికార్డు స్థాయిలో లాభాలు ఆర్జించాయని అంతర్జాతీయ మీడియా కోడై కూస్తోంది. బడా కంపెనీలు లాభాలు ఆర్జిస్తున్నాయంటే ప్రపంచం ముందు క్షుద్భాధ సమస్య పొంచి ఉన్నదని ఆర్థం. అదీ ఆహార ఉత్పత్తులు తగ్గకుండానే సంక్షోభం ఏర్పడే పరిస్థితి. ఆహార వ్యవస్థలను సంస్కరించడంలోని వైఫల్యం అంతర్జాతీయ ఆహార సంక్షోభానికి దారితీసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 కోట్ల మంది ప్రజలు తీవ్రమైన ఆకలి బాధలను, ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నారని ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవ సాయ సంస్థ (ఎఫ్ఏఓ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ క్యు డోంగ్యు మే 4న పేర్కొన్నారు. వాస్తవానికి ఆయన చెప్పదలుచుకున్న విషయం మరొకటి ఉంది. గ్రామీణ జీవనాన్ని తీవ్రంగా ధ్వంసం చేసినందువల్లే పేదరికం అంచుల్లో ఉన్న ప్రజానీకం మరింతగా క్షుద్బాధా రేఖ కంటే దిగువకు పడిపోయారని అంతర్జాతీయ సమాజానికి ఆయన చెప్ప దలిచారు. నిజానికి ప్రపంచం ఇప్పటికే మూడో అంతర్జాతీయ ఆహార సంక్షోభం ముంగిట్లో ఉందని చాలామంది భావిస్తున్నారు. నిలకడైన ఆహార వ్యవస్థలపై అంతర్జాతీయ నిపుణుల ప్యానెల్ మరొక కచ్చితమైన శీర్షికతో రూపొందించిన ప్రత్యేక నివేదిక ఉక్రె యిన్పై రష్యా ఆక్రమణ నుంచి తలెత్తిన తీవ్రమైన ఆహార పరిస్థితిని వివరించడానికి పూనుకుంది. అలాగే ఆహార వ్యవస్థల సంస్కరణల్లో వైఫల్యం వల్ల గత 15 సంవత్సరాల్లో మూడో అంతర్జాతీయ ఆహార సంక్షోభం ఎలా ఏర్పడింది అనే ప్రశ్నకు సమాధానం వెతకడానికి ప్రయత్నించింది. 2007–08లో మొట్టమొదటి ప్రపంచ ఆహార సంక్షోభం వచ్చినప్పుడు దాదాపు 37 దేశాలు ఆహార దాడులను ఎదు ర్కోవలసి వచ్చింది. అది కూడా ప్రపంచ ఆహార ఉత్పత్తిలో ఏమాత్రం తగ్గుదల కనిపించని సమయంలో ఈ ఉత్పాతం సంభవించింది. ఉక్రెయిన్ యుద్ధం కంటే ముందుగానే ఆహార ధరలు సరికొత్త శిఖరాలను చేరుకున్నాయి. 2007–08 నాటి ఆహార సంక్షోభ కాలాని కంటే మించి ఆహార ధరలు పెరిగాయి. మొక్కజొన్నలు, పప్పులు, వెజిటబుల్ ఆయిల్, పత్తి, సోయాబీన్, చక్కెర వంటి ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. యుద్ధం ప్రారంభం కాకముందే, ఆహార ధరలు రికార్డు స్థాయికి చేరడంతో, ప్రపంచం ఆహార సంక్షోభం దిశగా వేగంగా పయనించింది. దురదృష్టవశాత్తూ, ఈ కారణాలవల్లే మొదటి ప్రపంచ ఆహార సంక్షోభం చెలరేగిందని గ్రహించాలి. ఆహార రంగంలో సంస్థాగత సమస్యలను పరిష్కరించడంలో వైఫల్యం కారణంగానే ఇప్పుడు మరో దఫా ఆహార సంక్షోభం పొంచి ఉంది. గత ఆహార సంక్షోభాల నుంచి ఎవరూ ఏ రకంగానూ పాఠాలు నేర్వనట్లు కనిపిస్తోందని ఐపీఈఎస్–ఫుడ్ కో–చైర్ అలివర్ డి షుట్టర్ పేర్కొన్నారు. కాగా ఈ విషయంపైనే ఈ సంస్థ వైస్–చైర్ జెన్నిఫర్ క్లాప్ పెరుగుతున్న ఆహార ధరలపై జూదమాడటం మొదలై పోయిం దని చెప్పారు. దీనివల్ల ప్రపంచంలో అత్యంత నిరుపేదలు తీవ్రమైన ఆకలి సమస్యలో కూరుకుపోతున్నారని ఆమె అన్నారు. ఫ్యూచర్స్ మార్కెట్లను పర్యవేక్షించడం, ‘సట్టా’ వ్యాపార తీరు తెన్నులకు వ్యతిరే కంగా పోరాడాల్సిన అవసరం గురించి జి–7 దేశాల వ్యవసాయ మంత్రులు అప్పట్లోనే మాట్లాడారు. అయినప్పటికీ ధరలలో ఊహా గానాలను నియంత్రించడంలో జి–7 దేశాల కూటమి విఫలమైంది. 2007–08 కాలంలో ఆహార సంక్షోభం ఏర్పడిన సమయంలో మితిమీరిన సరుకుల వర్తకం, ఊహాగానాలు (స్పెక్యులేషన్) అంత ర్జాతీయ ధరలు చుక్కలంటడానికి చోదక శక్తగా పనిచేశాయని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కౌన్సిల్ పేర్కొంది. దానికి అనుగుణంగా ఫ్యూచర్స్ మార్కెట్లు ఆనాటి ఆహార సంక్షోభానికి 75 శాతం వరకు కారణమయ్యాయని ఆరోపించింది. స్పెక్యులేషన్ అనేది బడా వ్యవసాయ వాణిజ్య కంపెనీలకు భారీ లాభాలను ఆర్జించి పెట్టగా, లక్షలాదిమంది ఆకలితో పడి ఉండాల్సిన పరిస్థితికి అది ఎలా కారణమైందో వివరిస్తూ అమెరికాలోని పాపులర్ టీవీ అయిన ‘డెమాక్రసీ నౌ’ వివరణాత్మక కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. ఆ సమయంలో అంతర్జాతీయ ఆహార ఉత్పత్తి క్షీణించిపోలేదు. అయినా సరే వ్యవసాయ ఉత్పత్తుల ధరలు చుక్కలనంటాయి. అంటే మొదటి ఆహార సంక్షోభం నుంచి ఎవరూ ఏ రకమైన గుణపాఠాలు నేర్చుకోలేదని ఇది సూచిస్తుంది. నిలకడైన ఆహార వ్యవస్థలను నిర్మించుకోవడం, ఆహార స్వావలంబనను ప్రోత్సహిం చడానికి బదులుగా, మన విధాన నిర్ణేతలు అంతర్జాతీయ మార్కెట్ నిబంధనలను పొడిగించుకుంటూ పోతున్నారు. అంటే మార్కెట్ శక్తులు తమ ఇష్టానుసారం రాజ్యమేలడానికి అవకాశం ఇవ్వడమే! దీనివల్ల అంతర్జాతీయ వ్యవసాయ సప్లయ్ చైన్లను నిర్మించడంపైనే దృష్టి పెడతారు. తద్వారా వేళ్లమీద లెక్కించదగిన కొన్ని కంపెనీలపైనే ఆధారపడటం పెరుగుతుంది. ఆ తర్వాత ఆ కంపెనీలు తమ ఇష్ట ప్రకారం ధరలు పెంచుకుంటూ పోతాయి. ప్రపంచంలో అతిపెద్ద ఆహార కంపెనీల్లో ఒకటైన ‘కార్గిల్’ ఈ సంవత్సరం ఇప్పటికే రికార్డు స్థాయిలో లాభాలు సాధించిందని ‘గార్డియన్’ పత్రిక నివేదించింది. అనేకానేక పరిశ్రమల్లో వేళ్లమీద లెక్కబెట్టగలిగన దిగ్గజ కంపె నీలు మార్కెట్ను శాసిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గతంలోనే చెప్పారు. చాలా తరచుగా ఇవి చిన్న చిన్న పోటీ దారులను నిర్మూలించడానికి తమ శక్తిని ఉపయోగిస్తున్నాయనీ, కొత్త వాణిజ్య సంస్థల ఆవిర్భవాన్ని అడ్డుకుంటున్నాయనీ పేర్కొన్నారు. దీనికి ఉదాహరణగా పశుసంపద పరిశ్రమను ఆయన ఎత్తి చూపారు. ఇది మొత్తంగా నాలుగు బడా కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోయి అవి మార్కెట్ ధరలను శాసిస్తున్నాయి. కానీ అధిక ధరలకు కారణమవుతున్న కంపెనీలపై ప్రజాగ్రహం రగలకపోవడమే ఆశ్చర్యంగా ఉంది. కమోడిటీ ట్రేడింగ్ కార్యకలాపాల్లో అనేక పెట్టుబడి మదుపులు పెరుగుతున్నాయి. కానీ గోధుమ కాంట్రాక్ట్లలో ఫ్యూచర్ ట్రేడింగ్ లలోని పదిమంది కొనుగోలుదార్లలో కనీసం ఏడుగురు స్పెక్యులేటర్లే అని తెలిసింది. దీనివల్ల సరుకుల ధరలు పెరిగిపోయాయి. ప్రపంచ బ్యాంకు ప్రకారం వ్యవసాయ ధరల సూచి గత ఏడాదితో పోలిస్తే ఇప్పటికే 41 శాతం ఎక్కువగా పెరిగింది. గోధుమ ధరలు 60 శాతం పెరగగా, మొక్క జొన్న ధర 54 శాతం పెరిగింది. ఆహార ధరల పెరుగుదలకు, స్పెక్యులేషన్కి మధ్య ప్రత్యక్ష లింకు ఉందని ఇది సూచించదు కానీ, భారత్లో పెరుగుతున్న వ్యాపార ప్రయోజనాలను ఇది కచ్చితంగా ఎత్తి చూపుతుంది. ఉదాహరణకు... ఇప్పుడు భారత్ అవధులు లేని గోధుమ ఎగుమతులు చేయాలని వాణిజ్య వర్గాలు కోరుతున్నాయి. ఎందుకంటే ఈ ఎగుమతుల ద్వారా పెరుగుతున్న లాభాలను, ఇంకా పెరుగుతున్న ధరలను వీరు చూస్తున్నారు. అంతర్జాతీయ ఆహార ధరల్లో పెరుగుదల పేద దేశాలను దారుణంగా దెబ్బతీస్తోంది. అదే సమయంలో దిగుమతులు కూడా ఖరీదైనవిగా మారుతున్నాయి. ఇప్పటికే సూడాన్ నుంచి అఫ్గానిస్తాన్ వరకు 53 పేద దేశాలు తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొం టున్నాయి. ఈ క్షుద్బాధా సమస్యే క్షామానికి దారితీసి విస్తృత సంఖ్యలో మరణాలకు కారణమవుతోందని ఎఫ్ఏఓ చెబుతోంది. కొన్ని దేశాలు ఇప్పటికీ సంఘర్షణను ఎదుర్కొంటున్నప్పటికీ ఆహార భద్రతను ప్రోత్సహించే దిశగా అంతర్జాతీయ ప్రయత్నాలు తగి నంతగా జరగలేదు. అదేవిధంగా, ప్రాంతీయ ఆహార రిజర్వులను ఏర్పర్చుకోవాలి. దీనివల్ల ఆహార సరఫరాలు ఏ కా>రణం వల్ల తగ్గిపోయినా పెద్ద ప్రభావం చూపకపోవచ్చు. యుద్ధం, వాతావరణ మార్పు, దారిద్య్రం, ఆర్థిక ప్రకంపనలు వంటి పలు అంశాల వల్లే ఆహారధరలు పెరుగుతున్నాయని సాధారణంగా భావిస్తున్నప్పటికీ అసలు సమస్య ఏమిటంటే ఆహార దిగుమతులపై అతిగా ఆధారపడుతుండటమే. ఉదాహరణకు రష్యా, ఉక్రెయిన్ ప్రాంతం 30 దేశాలకు గోధుమలను సరఫరా చేస్తోంది. వాస్తవానికి ఇలా ఆహారాన్ని దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో అధిక భాగం ఆహార స్వావలంబన దేశాలుగా మారవచ్చు. ఇక్కడే మనం పాఠాలు నేర్వాల్సి ఉంది. వ్యాసకర్త: దేవీందర్ శర్మ ఆహార, వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com (‘ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
వ్యాపారులకో నీతి... రైతులకో నీతి
దేశంలో ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగ్గొడుతున్న 1,913 మంది కార్పొరేట్ వ్యాపారుల వద్ద పేరుకుపోయిన మొండి బకాయిలు రూ.1.46 లక్షల కోట్లు. వీరిని అరెస్టు చేయడం కాదు కదా, వారి పేర్లను కూడా బహిర్గతం చేయరు. మరోవైపున రెండు వేల మంది పంజాబీ రైతులపై అరెస్టు వారంట్లు జారీ అయ్యాయి. పంజాబ్లోని 71 వేల మంది రైతుల మొత్తం బకాయిలు రూ. 3,200 కోట్లు మాత్రమే. రైతులను ఎంతగా అవమానిస్తున్నారంటే దాని పర్యవసానంగా వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తద్భిన్నంగా, ఇలాంటి శిక్షలు, అవమానాల నుంచి కార్పొరేట్ వర్గాలు తప్పించుకుంటూ స్వేచ్ఛను ఆస్వాదిస్తున్నాయి. రైతుల బకాయిలను స్వాధీన పర్చుకోవడానికి నిరంకుశ పద్ధతులు సరైన మార్గం కాదు. పంజాబ్ రాష్ట్ర సహకార వ్యవసాయ అభివృద్ధి బ్యాంకు (పీఏడీబీ) రుణ బకాయిలను వసూలు చేసుకోవడానికి గాను ఐదు ఎకరాలకు మించి భూములున్న దాదాపు రెండు వేలమంది రైతులపై అరెస్టు వారెంట్లు జారీ చేసింది. అదే సమయంలో జాతీయ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు వందలాదిమంది బడా బకాయిదారుల పేర్లను కూడా బయటపెట్టకుండా గత పదేళ్ల కాలంలోనే 11.68 లక్షల కోట్ల మొండి బకాయిలను మాఫీ చేసేశాయి. అంటే వేరు వేరు వర్గాలకు వేరు వేరు సత్కారాలన్నమాట! పంజాబ్లోని 71 వేల మంది రైతుల మొత్తం బకాయిలు రూ. 3,200 కోట్లు. ఈ బకాయిల స్వాధీన ప్రక్రియను వేగవంతం చేయడానికి సహకార బ్యాంకు రుణ ఎగవేతదారులకు వ్యతిరేకంగా మధ్యవర్తిత్వం, ఒప్పించడంతోపాటు అరెస్ట్ వారెంట్లు కూడా జారీచేసింది. వీళ్ల న్యాయం బాగానే ఉంది. కానీ 34 ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు నిశ్శబ్దంగా 2020–21 ఆర్థిక సంవత్సరంలో 2.02 లక్షలకోట్ల మేరకు కార్పొరేట్ సంస్థలు చెల్లించాల్సిన బకాయిలను మాఫీ చేసిపడేశాయి. ఇక 2021–22 ఆర్థిక సంవత్సరం తొలి ఆరునెలల కాలంలోనే ఈ బ్యాంకులు వరుసగా రూ. 46,382 కోట్లు, రూ. 39,000 కోట్ల మొండిబకాయిలను రద్దుచేశాయి. కార్పొరేట్ రుణ ఎగవేతదారులకు వ్యతిరేకంగా అరెస్టు వారెంట్లను జారీ చేసినట్టు ఎన్నడైనా విన్నారా? సంపన్నులైన రుణ ఎగవేత దారులు చాలామంది తప్పించుకుని విదేశాలకు చెక్కేస్తుంటే, మన దేశంలోని ఒక రైతు లేదా ఒక చిన్న రుణ గ్రహీత పట్ల రుణ వసూలు ప్రక్రియలో ఇంత అన్యాయంగా, ఇంత చెడుగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? రైతులకు అరెస్టు వారెంట్లు జారీ చేసిన ఘటనతో పంజాబ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు రావడంతో ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా రైతులపై అన్ని వారంట్లనూ ఉపసంహరించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే అంతకంటే పెద్ద ప్రశ్న ఏమిటంటే, రైతులకు జైలు శిక్ష విధించేటంత కఠిన వైఖరిని ఎందుకు ప్రదర్శిస్తున్నారు అనేదే. రైతులను ఎంతగా అవమానిస్తున్నారంటే దాని పర్యవసానంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తద్భిన్నంగా, ఇలాంటి శిక్షలకు, అవమానాలకు వ్యతిరేకంగా మన కార్పొరేట్ వర్గాలు పూర్తిగా తప్పించుకుంటూ స్వేచ్ఛను ఆస్వాదిస్తున్నాయి. రుణాలను ఎగవేస్తున్న మన బడా కంపెనీల పట్ల భారత రిజర్వ్ బ్యాంకు కల్పిస్తున్న రక్షణ కవచం తీరు ఇదే మరి. సంపన్నులు నష్ట భయం లేకుండా సంతోషంగా గడుపుతుండగా, రైతులు నిరాశా నిస్పృహల్లో కూరుకుపోతున్నారు. రెండు సెక్షన్ల బ్యాంకు రుణాల ఎగవేతలకు రెండు రకాల నిబంధనలు ఉన్నట్లు కనిపిస్తోంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934లోని సెక్షన్ ‘45ఈ’ని ఉపయోగించి, కార్పొరేట్ డిఫాల్టర్ల గుర్తింపును బహిర్గతం చేయడానికి బ్యాంకింగ్ రెగ్యులేటర్ తిరస్కరిస్తోంది. దీనికి గోప్యతను ప్రధాన కారణంగా చెబుతున్నారు. న్యాయస్థానం ఆదేశాలతో కొంతమంది డిఫాల్టర్ల పేర్లను బయటపెట్టారు. కార్పొరేట్ డిఫాల్టర్లకు సంబంధించినంతవరకూ రుణ రికవరీ ట్రిబ్యునల్స్కి వెళ్లడం, ‘సెక్యూరిటైజేషన్ అండ్ రికన్స్ట్రక్షన్ ఆఫ్ పైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్’ కింద చర్య తీసుకోవడంతో సహా బ్యాంకులు సొమ్ము రాబట్టుకోవడానికి ఎలాంటి యంత్రాంగాన్నయినా ఉపయోగించవచ్చు. అలాగే ‘ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్’ కింద నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో కేసులు నమోదు చేయవచ్చు. బకాయిలు రాబట్టడం ఇప్పటికీ సంతృప్తికరంగా లేనందున, ఈ లక్ష్యం కోసం ‘బ్యాడ్ బ్యాంక్’ నెలకొల్పాలన్న తాజా నిర్ణయం కూడా తీసుకున్నారు. బకాయి రూణాన్ని రద్దు చేయడం అంటే రుణ మాఫీ వంటిది కాదని నాకు తెలుసు. నిరర్థక రుణాన్ని మరొక బ్యాంక్ లెడ్జర్కి మార్చినప్పటికీ బ్యాంకుల ద్వారా రికవరీ ప్రక్రియ కొనసాగుతుంది. వాయిదాలో ఉన్న బకాయిలలో పది శాతం కూడా బ్యాంకులు వసూలు చేయలేకపోయాయని పలు ఆర్టీఐ ఆధారిత నివేదికలు చూపుతున్నాయి. మిగిలివున్న బకాయిలు ఇక ఎన్నటికీ వసూలు కావు. వ్యవసాయ రంగంలోని ఎగవేతదారులకు కూడా దీన్నే వర్తింపజేయవచ్చు. రుణాలు చెల్లించలేకపోయిన రైతులను కటక టాలలో బంధించడానికి బదులుగా, బకాయి రుణాలను కూడా మరొక లెడ్జర్కి పంపించి రుణాల రికవరీ ప్రక్రియను కొనసాగిం చాలని బ్యాంకులు ఎందుకు ఆదేశించ కూడదు? ఈలోగా రైతులు తమ వ్యవసాయ కార్యకలాపాలను కొనసాగించడాన్ని ఎందుకు అను మతించకూడదు? రైతులపై వ్యతిరేకతను ప్రతి దశలోనూ ప్రదర్శించడం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. వ్యవసాయ కమ్యూనిటీ మీద వ్యతిరేకత, ద్వేషభావం పెరుగుతున్నాయి. అది కూడా విద్యాధికుల్లో ఈ వ్యతిరేకత పెరిగిపోతోంది. వ్యవసాయ రుణాల మాఫీని ఏ రాష్ట్రప్రభుత్వమైనా ప్రకటిస్తే చాలు... మీడియా విరుచుకపడుతోంది. రైతురుణాల మాఫీని నిలిపివేయాలని ప్యానెల్ చర్చలు గావుకేకలు పెడుతుంటాయి. దీనికి బదులుగా ప్రతి ఆరునెలలకోసారి కార్పొరేట్ నిరర్థక రుణాలను గణనీయంగా బ్యాంకులు రద్దు చేస్తున్నాయి. కార్పొరేట్ రుణాల రద్దును నిలిపివేయాలని టీవీల్లో జరిగిన చర్చలను మీరు చూసి ఎన్నాళ్లయిందో గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి. మరొక పాలసీ నిర్ణయం స్పష్టంగా ఈ వివక్షను ఎత్తిచూపిస్తోంది. మధ్యప్రదేశ్, హరియాణాతో సహా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, రైతులు తమ పంటలను కనీస మద్దతు ధరకు మండీల్లో అమ్ముకున్న తర్వాత దాన్నుంచి కిసాన్ క్రెడిట్ కార్డు కింద చెల్లించని బకాయలను తీసివేశాయి. ఇది క్రూరం, అన్యాయం మాత్రమే కాదు; రైతుల కోసం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని తొక్కిపడేసే ధోరణిని ఇది సూచిస్తుంది. పంట నుంచి చెల్లించని మొత్తాలని ఇది తీసివేస్తోంది. రైతు నుంచి బ్యాంకు రుణాలను రికవరీ చేసుకోవడానికి కనీస మద్దతు ధర ఒక సమర్థనీయమైన పరికరంగా ఉంటోంది. కానీ పరిశ్రమలకు తాజా రుణాలను జారీ చేసేటప్పుడు నిరర్థక రుణాల మొత్తాన్ని ఆ రుణం నుంచి బ్యాంకులు ఎందుకు తీసుకోలేవు? నిరర్థక రుణాలను రికవరీ చేసే ఒక సాధనమైన ఐబీసీ ప్రొసీడింగ్స్ ప్రకారం పరిశ్రమలు సగటున 65 నుంచి 95 శాతం వరకు నిరర్థక రుణాలను కలిగి ఉంటున్నాయి. అయినా సరే ఇవి బ్యాంకులనుంచి తాజా రుణాలు పొందగలుగుతున్నాయి. బ్యాంకులు ఈ కార్పొరేట్ సంస్థల తాజా రుణాల నుంచి తమ పాత బాకీలను చెల్లింపు చేసుకోవు. భారీగా కార్పొరేట్ మొండి బకాయిలను రద్దు చేస్తున్నప్పుడు కూడా ఏ బ్యాంకూ కొత్త రుణాలను జారీ చేసేటప్పుడు అంతకుముందు చెల్లించని రుణాన్ని కొత్త రుణాలనుంచి తీసుకుందామని భావించదు. 2020 జూన్ నెలలో మీడియాలో వార్తల ప్రకారం దేశంలో ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగ్గొడుతున్న 1,913 మంది వద్ద పేరుకుపోయిన మొండి బకాయిలు రూ.1.46 లక్షల కోట్లు. వీరిని అరెస్టు చేయడం కాదు కదా, వారి పేర్లను కూడా బహిర్గతం చేయరు. మరోవైపున కో ఆపరేటివ్ బ్యాంక్ మాత్రం రెండు వేలమంది పంజాబీ రైతులపై వారంట్లు జారీ చేసింది. వ్యవసాయం తీవ్ర నిçస్పృహ మధ్య కొనసాగుతోంది. రైతుల బకాయిలను స్వాధీన పర్చుకోవడానికి నిరంకుశ పద్ధతులు అవలం బించడం సరైన మార్గం కాదని బ్యాంకులు గ్రహించాలి. ఏ సందర్భంలో అయినా రైతులపై అరెస్టు వారెంట్లు జారీ చేసినట్లయితే, అదేవిధమైన న్యాయ నిబంధనను కార్పొరేట్ రుణ ఎగవేతదారులకు కూడా పొడిగించాల్సి ఉంటుందని ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. సమాన న్యాయానికి ఇది తగు సమయం కాదా? వ్యాసకర్త: దేవీందర్ శర్మ ఆహార, వ్యవసాయ నిపుణులు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
స్వావలంబన లేని సంస్కరణలు ఏల?
భారతదేశంలో వ్యవసాయ వాణిజ్య కంపెనీలను పైకి తీసుకురావడానికి కమీషన్ ఏజెంట్లను నిందించే ప్రక్రియను పద్ధతి ప్రకారం కొనసాగిస్తున్నారు. వ్యవసాయరంగంలో మధ్య దళారీలను నియంత్రించాల్సిందే. కానీ, మాంస పరిశ్రమను బలోపేతం చేయాలని తలపెట్టిన ప్రయత్నం, కొన్ని కంపెనీల చేతుల్లో మార్కెట్ కేంద్రీకృతం అవడానికి కారణమయ్యిందని అమెరికన్ అనుభవం చెబుతోంది. మార్కెట్ చలన సూత్రాలు అమెరికా రైతులకు ప్రశాంతమైన జీవితాన్ని అందించడంలో మళ్లీ విఫలమయ్యాయి. రైతుల పంటలకు మద్దతు ధర కల్పించాలనే కీలక సమస్యను గుర్తించడంలో విఫలమవుతున్నందునే అంతర్జాతీయంగా రైతులు నిరంతర నష్టాలు అనే పెను భారాన్ని మోయవలసి వస్తోంది. అమెరికా వ్యవసాయ రంగంలో గత అర్ధ శతాబ్ధంపైగా ప్రవేశపెడుతూ వచ్చిన మార్కెట్ సంస్కరణల వైఫల్యం నుంచి మన విధాన నిర్ణేతలు, ఆర్థిక వేత్తలు ఎలాంటి గుణపాఠాలూ నేర్చుకోవడం లేదు. చివరకు ఇటీవలే వివా దాస్పదమైన మూడు వ్యవసాయ సంస్కరణ చట్టాలను రద్దుచేసిన తర్వాత కూడా, సరఫరా–డిమాండ్ మధ్య సమతౌల్యమే ధరలను నిర్ణయిస్తుందని ఇప్పటికీ వీరు పాత పాటే వల్లె వేస్తున్నారు. మార్కెట్ చలన సూత్రాలు అమెరికా రైతులకు ప్రశాంతమైన జీవితాన్ని అందిం చడంలో మరోసారి విఫలమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ వాస్తవాన్ని చక్కగా గుర్తిం చారు. ఇటీవలే ఒక ప్రకటనలో యాభై ఏళ్లకు ముందు అమెరికా రైతులు మాంసాహార ఉత్పత్తులపై సంపాదించిన రాబడుల్లో సగం కూడా ఇప్పుడు వారికి లభించడం లేదని బైడెన్ చెప్పారు. ‘‘50 ఏళ్ల క్రితం అమెరికాలో రైతులు, బీఫ్ ఉత్పత్తిపై వెచ్చించిన ప్రతి డాలర్కి 60 సెంట్ల రాబడిని సంపాదించేవారు. ఈరోజు వారికి 39 సెంట్లు మాత్రమే దక్కుతోంది. అలాగే 50 ఏళ్ల క్రితం పందుల్ని పెంచిన రైతులు వెచ్చించిన ప్రతి డాలర్ ఖర్చుకు 48 నుంచి 50 సెంట్ల రాబడి సాధించేవారు. కానీ ఈరోజు వారి రాబడి 19 సెంట్లకు పడిపోయింది. అదే సమయంలో బడా కంపెనీలు మాత్రం భారీ లాభాలను సాధిస్తున్నాయి.’’ ఒక సంవత్సర కాలంలో బీఫ్ ధరలు 21 శాతం, పంది మాంసం ధర 17 శాతం, చికెన్ ధర 8 శాతం పెరిగినట్లు అమె రికా వ్యవసాయ విభాగం (యూఎస్డీఏ) అంచనా వేసిన సమయం లోనే రైతుల రాబడి ఇంతగా పడిపోయిందని గ్రహించాలి. ‘‘వ్యవసాయ వాణిజ్య సంస్థల లాభాలు పెరిగే కొద్దీ దుకాణాల్లో సరకుల ధరలు కూడా భారీగా పెరుగుతూ వచ్చాయి. కానీ మార్కె ట్లకు తమ ఉత్పత్తులను తీసుకొచ్చిన రైతులకు దక్కాల్సిన ధరలు మాత్రం పడిపోయాయి’’ అంటూ అమెరికా అధ్యక్షుడు మరిన్ని వివ రాలు తెలిపారు. అమెరికా వ్యవసాయ శాఖ కార్యదర్శి టామ్ విల్సక్ దీనికి బలం చేకూరుస్తూ ట్వీట్ చేశారు. ‘‘ఈ వేసవిలో, లోవా రాష్ట్రంలో ఒక రైతును కలిశాను. ‘ఒక పశువును 150 డాలర్లకు అమ్మి నేను నష్టపోయాను. కానీ దాని మాంసాన్ని ప్రాసెస్ చేసి అమ్మినవాడు మాత్రం ఒక్కో పశువుకు 1,800 డాలర్ల లాభం సంపాదించాడు’ అని ఆ రైతు వాపోయాడు.’’ ఒకవైపు రైతుల ఆదాయాన్ని హరిస్తూ, మరో వైపు లాభాలు ఆర్జిస్తున్న మాంసాహార ప్రాసెసింగ్ కంపెనీల లాభాలు ఏ స్థాయిలో ఉంటున్నాయో ఈ ఒక్క ఉదాహరణ నుంచే ఊహించు కోవచ్చని టామ్ చెప్పారు. భారతదేశంలో, రైతులను నిలువుదోపిడీ చేస్తున్నందుకు వ్యాపా రులను, లాభాలు దండుకుంటున్న కమిషన్ ఏజెంట్లను మనం కచ్చి తంగా నిందించాల్సిందే. అమెరికాలో 85 శాతం మాంస పరిశ్రమను నియంత్రిస్తున్న నాలుగు మాంసాహార దిగ్గజ సంస్థలను వాస్తవానికి భారీస్థాయి దళారీలనే చెప్పాలి. వీళ్లు సముద్ర సొరచేపలకు ఏమాత్రం తక్కువ కాదు. భారతదేశంలో వ్యవసాయ వాణిజ్య కంపెనీలను పైకి తీసుకురావడానికి కమీషన్ ఏజెంట్లపై నిందమోపే ప్రచారాన్ని పద్ధతి ప్రకారం చేస్తూ వస్తున్నారు. మధ్య దళారీలను నియంత్రించాల్సిందే. కానీ, మాంస పరిశ్రమను బలోపేతం చేయాలని తలపెట్టిన ప్రయత్నం, కొన్ని కంపెనీల చేతుల్లో మార్కెట్ కేంద్రీకృతం అవడానికి కారణమయ్యిందని అమెరికన్ అనుభవం చెబుతోంది. మాంస ఉత్ప త్తుల ధరలు పడిపోవడంతో తరాలుగా పశువులు, పందులు, కోళ్లను పెంచుతున్న రైతు కుటుంబాలు కుప్పగూలిపోయాయి. వ్యవసాయంలో స్వేచ్ఛా మార్కెట్ల రాకతో జరిగిన విధ్వంసం అమెరికా వ్యవసాయరంగం కుప్పగూలిపోయిన తీరుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. అదే క్రమంలో రైతులకు న్యాయమైన ధరలను కల్పించడంలో సరఫరా–డిమాండ్ సమతౌల్యం మరింత చెత్త ఫలితాలను తీసుకొచ్చింది. మొదట్లో ఈ పతనం వ్యవసాయ సరు కులు, పాల పరిశ్రమలో సంభవించగా ఇప్పుడు పశుమాంస వ్యవ సాయం దాని బారినపడింది. వ్యవసాయ దిగుబడుల నుంచి రిటైల్ మార్కెట్ దాకా సప్లయ్ చైన్ క్రమం మొత్తంగా బలపడుతూ వచ్చింది. నిజానికి ఈ కేంద్రీకరణ గుత్తాధిపత్యానికి, బలప్రదర్శనకు దారి తీసింది. వ్యవసాయ వాణిజ్య కంపెనీలు, సిండికేట్గా ఏర్పడిన క్రమం అనేది అటు వ్యవసాయ ఉత్పత్తిదారులనూ, ఇటు వినియోగ దారులనూ నిర్దాక్షిణ్యంగా దోపిడీ చేయడంతో ముగిసింది. తమ రక్త మాంసాలను బహుళజాతి కార్పొరేషన్లు పీల్చేస్తుండటానికి వ్యతిరే కంగా అమెరికా జాతీయ రైతుల యూనియన్ దేశవ్యాప్త ప్రచారాన్ని నిర్వహిస్తోంది. కార్పొరేట్ గుత్తాధి పత్యాన్ని బద్దలు చేసి రైతులకు న్యాయం చేయడం, యాంటీ–ట్రస్ట్ చట్టాలను కఠినంగా అమలు చేయాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. అమెరికా ప్రభుత్వం రైతుల డిమాండ్ల పట్ల స్పందించింది. ధరలను భారీగా పెంచేలా ఆర్థిక వ్యవస్థను నడుపుతున్న కొన్ని వ్యవసాయ వాణిజ్య దిగ్గజ సంస్థలపై వేటు వేయాలని దేశాధ్యక్షుడు బైడెన్ పిలుపునిచ్చారు. పరిశ్రమలోని దిగ్గజాలతో పోటీ పడేందుకు చిన్నతరహా మాంసాహార ప్రాసెసింగ్ విభాగాల్లో ఒక బిలియన్ డాలర్ల మేరకు పెట్టుబడులను ప్రభుత్వం ఆమోదించింది. ఇది సమగ్ర పరి ష్కారం కానప్పటికీ, ఉత్పత్తిదారులు, వినియోగదారులు ఇరువు రిపై తీవ్ర ప్రభావం చూపుతున్న కార్పొరేట్ గుత్తసంస్థల విధ్వంసాన్ని కాస్త అర్థం చేసుకోవడానికి ప్రభుత్వ చర్య తోడ్పడింది. వ్యవసాయ సరు కులు, పశుసంపదను ఉత్పత్తి చేసే రైతులకు మద్దతు ధర కల్పించడమే ఉత్తమమార్గం. భారతీయ రైతులు కూడా కనీస మద్దతు ధరకు చట్ట బద్ధతను కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మద్దతు ధరకు దిగువన ఎలాంటి వ్యాపార లావాదేవీలూ సాగవద్దన్నదే రైతుల డిమాండ్. యూరప్లో కూడా తమను వెంటాడుతున్న వ్యవసాయ సంక్షోభం నుంచి బయట పడేయడానికి న్యాయమైన ధరలకు హామీ కల్పించాలని రైతులు పదేపదే నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా వ్యవసాయ రంగ ఆదాయాలు పడి పోతుం డటమే... ప్రపంచ వ్యవసాయ సంక్షోభానికి ప్రధాన కారణం. వ్యవ సాయ సంక్షోభం, పరిష్కారాలపై కెనడా జాతీయ రైతుల యూనియన్ 2005లో ఒక నివేదికను సమర్పించింది. గత 20 ఏళ్లుగా వ్యవసాయ ఆదాయాల్లో కనీవినీ ఎరుగని సంక్షోభానికి కారణాలను ఈ నివేదిక వివరించింది. 1985, 2005 మధ్య వ్యవసాయ ఆదాయాలు తిరోగ మన ధోరణిలో కొనసాగాయి. గత 20 ఏళ్ల కాలంలో ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేసిన తర్వాత వ్యవసాయ పంటల ధరలు స్తబ్దతలో ఉండిపోయిన వైనాన్ని అంక్టాడ్ (యూఎన్సీటీఏడీ) కూడా స్పష్టంగా పేర్కొంది. 1930లలో మహా మాంద్య సంవత్సరాల్లో కంటే 2005లో రైతుల పంటలు మరింతగా పతనమయ్యాయని కెనడియన్ ఎన్ఎఫ్యు పేర్కొంది. ప్రపంచం ఆర్థికాభివృద్ధి దిశలో పయనిస్తున్న, స్టాక్ మార్కెట్ చెలరేగుతున్న సమయంలో రైతు రాబడులు ఇంతగా పతనం చెందడం గమనార్హమని ఎన్ఎఫ్యూ చెప్పింది. ఈ సంక్షోభ నివారణకు అది చేసిన 16 ప్లాన్ ప్యాకేజీలో రైతుకు మద్దతు ధర అనేది తొలి స్థానంలో నిలబడింది. రైతులు తమ పంటలకు పెడుతున్న పెట్టుబడుల్లో 95 శాతానికి హామీ ఇచ్చేలా వ్యవసాయ ఆదాయ మద్దతు కార్యక్రమాన్ని అమలు చేయాలని ఎన్ఎఫ్యూ ఆ దేశ ప్రభుత్వాన్ని కోరింది. అలాగే శ్రమశక్తి, యాజమాన్య నిర్వహణ, పెట్టుబడులకు కూడా న్యాయమైన రాబడిని కల్పించాలని కోరింది. కానీ అమెరికా లాగే కెనడా ప్రభుత్వం కూడా మద్దతు ధరపై రైతుల చట్టబద్ధమైన డిమాండును విస్మరించింది. రైతులు కనీసంగా జీవించడానికి అనువైన ఆదాయం వారికి కల్పిం చడం అత్యవసరం అవుతున్న సమయంలో ప్రపంచం మొత్తంగా కేంద్రస్థానంలో ఉంటున్న బలమైన ఆర్థిక చింతన రైతుల ప్రాణాధార సమస్యను గుర్తించడంలో విఫలమవుతోంది. దీని ఫలితంగానే ప్రపంచ వ్యాప్తంగా రైతులు నిరంతర నష్టాలతో ఆహార ఉత్పత్తి చేయడం అనే పెను భారాన్ని మోయవలసి వస్తోంది. వ్యాసకర్త: దేవీందర్ శర్మ ఆహారం, వ్యవసాయరంగ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
ఈ వ్యవసాయం ఓ ఆశాకిరణం
పురుగుమందులను, రసాయనిక ఎరువులను వాడకుండా సాగుతున్న ప్రకృతి వ్యవసాయం ఒక సరికొత్త సామాజిక ఉద్యమంలా ఆవిర్భవించింది. ఈ నూతన వ్యవసాయం ఇప్పుడు అంతర్జాతీయంగా ఒక ఆశాకిరణంగా కనిపిస్తోంది. ఛిన్నాభిన్నమైపోయిన ఆహార వ్యవస్థను ఇది చక్కదిద్దుతోంది. ప్రకృతి వ్యవసాయంతో పంటలకు పట్టే తెగుళ్ల కేసులు 86 శాతం పడిపోయాయి. ప్రతి రైతు కుటుంబం ఆరోగ్య ఖర్చులకు పెడుతున్న మొత్తంలో 50 శాతం దాకా తగ్గిపోయింది. వ్యవసాయ ఖర్చులు 68 శాతం తగ్గిపోయాయి, పంట దిగుబడుల్లో 88 శాతం పెరుగుదల నమోదైంది. పంటల రకాలను బట్టి, రాబడి 8 నుంచి 111 శాతం వరకు పెరిగింది. ఇది భవిష్యత్ సమాజ ఆహారానికి నిలకడైన మార్గంవైపుగా జరుగుతున్న మౌలిక పరివర్తన. దేశంలో రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకంతో ఛిన్నాభిన్నమైపోయిన ఆహార వ్యవస్థను ప్రకృతి వ్యవసాయం ఎలా చక్కదిద్దుతుంది అనేది పెద్ద ప్రశ్న. ఈ విషయంపై స్పష్టత కోసం, భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) మాజీ డైరెక్టర్ జనరల్కి నేను కాల్ చేసి, కమ్యూనిటీ నేతృత్వంలో వ్యవసాయం సాగుతున్న ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని గ్రామాలను సందర్శించాల్సిందిగా అభ్యర్థించాను. పురుగుమందులను వాడకుండా నడుస్తున్న ఈ నూతన వ్యవసాయ వ్యవస్థ ఏపీలో ఒక సరికొత్త సామాజిక ఉద్యమంలా ఆవిర్భవించిందని చెప్పాను. ఆయన నా మాటలు ఓపిగ్గా విన్నారు. పురుగుమందులు లేని వ్యవసాయ వ్యవస్థ ఏపీ రైతులను ఎలా ఆకట్టుకుందీ, ఒక సురక్షితమైన, ఆరోగ్యకరమైన వ్యవసాయ విధానం వైపుగా రైతుల పరివర్తన ఎలా జరిగిందీ వివరంగా తెలుసుకోదలిచినట్లు ఆయన చెప్పారు. నా కాల్ ముగించిన వెంటనే ఆయన హైదరాబాద్ లోని ఐసీఏఆర్ డైరెక్టరేట్ను సంప్రదించారు. ప్రకృతి వ్యవసాయంపై ప్రాథమిక అంచనా నిమిత్తం, ఏపీలోని కొన్ని గ్రామాలను సందర్శించడానికి శాస్త్రవేత్తల బృందాన్ని పంపించాలని ఆయన ఆదేశించారు. కొద్ది రోజుల తర్వాత ఆయన నాకు కాల్ చేసి ఈ అంశంపై తానందుకున్న నివేదిక చాలా సానుకూలంగా ఉందనీ, ఇప్పటికే అమలవుతున్న వ్యవసాయ విధానాల నుంచి కొత్త పద్ధతికి మారడానికి రైతాంగం ఆలోచనల్లోనే సమూల మార్పులు అవసరమనీ తెలిపారు. పురుగుమందుల అవసరం లేని సాగు వ్యవస్థ వైపు మళ్లడానికి ఉన్న అపారమైన అవకాశాలను ఎంత త్వరగా చూడగలం అని చెప్పడానికే నేను ఈ కథనాన్ని ఇక్కడ పొందుపర్చాను. ఈ నూతన వ్యవసాయ వ్యవస్థ ఇప్పుడు అంతర్జాతీయంగా ఒక ఆశాకిరణంగా కనిపిం చడానికి ముందుగా, ఒక చిన్న చొరవ ద్వారా ప్రారంభమైందని తెలుసుకుంటే మన హృదయాలు ఉప్పొంగుతాయి. కమ్యూనిటీ స్థాయిలో ప్రకృతి వ్యవసాయ (సిఎమ్ఎన్ఎఫ్) కార్యక్రమం అని మనం చెప్పుకుంటున్నది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల్లోని 3,780 గ్రామాలకు విస్తరించింది. దాదాపు 7 లక్షలమంది రైతులు ఇప్పుడు ఈ మార్గంలో పయనిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రపంచంలోనే అతి పెద్ద వ్యవసాయ పర్యావరణ వ్యవస్థగా ఆవిర్భవించింది. గ్లోబల్ అలయెన్స్ ఫర్ ది ఫ్యూచర్ ఆఫ్ ఫుడ్ సంస్థ తాజాగా విడుదల చేసిన ‘నిజమైన విలువ : ఆహార వ్యవస్థ పరివర్తన సానుకూల ప్రభావాల వెల్లడి’ అనే నివేదిక ఈ కార్యక్రమాన్ని, ఛిన్నాభిన్నమైన ఆహార వ్యవస్థలను సమర్థంగా చక్కదిద్దగల ఆరు అంతర్జాతీయ ప్రేరణల్లో ఒకటిగా పేర్కొంది. ప్రపంచం ఎదురుచూస్తున్న గొప్ప మార్పునకు ఇది ఒక నాందీవాచకమై నిలిచిందని ఈ నివేదిక ప్రశంసించింది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కొనసాగుతున్న సహజ వ్యవసాయ విధానం 8 లక్షల హెక్టార్లలో అమలవుతోంది. వికేంద్రీకరించిన వ్యవసాయ వ్యవస్థ కింద నడుస్తున్న ఈ కార్యక్రమం ప్రభుత్వ యాజమాన్యంలోని లాభాలతో నిమిత్తం లేని రైతు సాధికార సంస్థ (ఆర్వైఎస్ఎస్) ద్వారా కొనసాగుతోంది. ఒక్కొక్కటి 2 వేల కుటుంబాలను పర్యవేక్షిస్తున్న 12,500 గ్రామ కౌన్సిళ్లతో విజయవంతమైన ఈ కార్యక్రమం పరస్పర అనుసంధానంతో నడుస్తోంది. దీంట్లో స్థానికంగా గుర్తింపు పొందిన ఒక రైతు నిపుణుడు, ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతు, వ్యవసాయ నిపుణుడితో కూడిన ముగ్గురు ముఖ్యమైన రైతుల బృందం నిత్యం ఈ విధానంలో సాగు చేస్తున్న తోటి రైతులకు సూచనలు అందిస్తూ మార్గదర్శకత్వం వహిస్తుంటుంది. పై నివేదిక పేర్కొన్నట్లుగా స్థానికంగా ప్రకృతి వ్యవసాయ సూత్రాల అమలులో మహిళా బృందాలు గొప్ప పాత్ర పోషిస్తున్నాయి. మహిళా శక్తి ఒక సమాజాన్ని ఎలా మార్చివేయగలదో తెలుసుకోవాలంటే ఏపీలో 70 లక్షల మంది మహిళలు 6,52,440 స్వయం సహాయక బృందాలను ఏర్పర్చి నిర్వహిస్తున్న వైనాన్ని మీరు స్వయంగా వచ్చి చూడాలి. ప్రకృతి వ్యవసాయ ఉద్యమానికి ‘ఆధ్యాత్మిక పెట్టుబడి’లాగా పేరొందిన ఈ మహిళా బృందాలు నిర్ణయాలను తీసుకోవడంలో ముందంజ వేస్తున్నాయి. నా పర్యటనల సందర్భంగా మహిళా శక్తి సామర్థ్యాలను చూసి నిజంగానే ఆశ్చర్యపోయాను. రుణాలను పంపిణీ చేయడంలో, పంట దిగుబడి సరఫరాలను నిర్వహించడంలో, ఆహార ధాన్యల నిల్వల నిర్వహణ, ప్రాసెస్ చేయడంలో, తమకు తెలిసిన జ్ఞానాన్ని పరస్పరం పంచుకోవడంలో వీరి ప్రతిభ అసాధారణం. ప్రకృతి వ్యవసాయ ఉద్యమాన్ని ఏది ముందుకు తీసుకెళుతోందో, నూతన వ్యవసాయ శక్తి కేంద్రాలుగా మహిళలు ఎలా వ్యవహరిస్తున్నారో తెలుసుకోవాలంటే మీరు స్వయం సహాయక బృందాల సమావేశాలకు తప్పకుండా హాజరై పరిశీలించాల్సి ఉంది. హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ సస్టెయినబుల్ అగ్రికల్చర్ కార్యనిర్వాహక డైరెక్టర్ డాక్టర్ జీవీ రామాంజనేయులు ఈ పురుగుమందుల రహిత వ్యవసాయానికి సమర్థ ప్రచారకర్త. వ్యవసాయ పర్యావరణ వ్యవస్థలపై అపార విశ్వాసం ఉన్న ఈయన, మహిళా స్వయం సహాయక బృందాల సమావేశాలకు నన్ను తీసుకెళ్లారు. కమ్యూనిటీ స్థాయిలో ప్రకృతి వ్యవసాయంలో నిమగ్నమై ఉన్న 38 ఎన్జీవోలలో ‘సెంటర్ ఫర్ సస్టెయినబుల్ అగ్రికల్చర్’ తలమానికంలా ఉంది. ఈ సంస్థ వరంగల్ జిల్లాలోని ఒక గ్రామం మొత్తాన్ని సేంద్రియ వ్యవసాయం వైపు మరల్చడమే కాకుండా, ఈ గ్రామంలో వ్యవసాయ కో ఆపరేటివ్ను కూడా ఏర్పర్చింది. అప్పటి నుంచి మరో ఆరు సేంద్రియ వ్యవసాయ గ్రామాలు తయారయ్యాయి. పురుగుమందుల వాడకం పూర్తిగా నిలిపివేయడంతోపాటు, రసాయనిక ఎరువులను తగ్గించి వాడటంతో పంటలకు పట్టే తెగుళ్ల కేసులు 86 శాతం పడిపోయాయి. అంతే కాకుండా ప్రతి రైతు కుటుంబం ఆరోగ్య ఖర్చులకు పెడుతున్న మొత్తంలో 50 శాతం దాకా తగ్గిపోయింది. వైద్య ఖర్చులు అమాంతంగా పెరిగిపోవడం, దేశంలో రైతుల ఆత్మహత్యల పెరుగుదలకు కారణమైంది. ఈ నేపథ్యంలో రైతులను రుణాల విషవలయం నుంచి తప్పించడమే ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం లక్ష్యం. పైగా ప్రకృతి వ్యవసాయంతో రైతులకు వ్యవసాయ ఖర్చులు 68 శాతం తగ్గిపోయాయి, పంట దిగుబడుల్లో 88 శాతం పెరుగుదల నమోదైంది. వ్యవసాయ పంటల రకాలను బట్టి వ్యవసాయ రాబడి 8 నుంచి 111 శాతం వరకు పెరిగింది. ప్రకృతి వ్యవసాయంలో పంటలకు 55 శాతం నీళ్లు, విద్యుత్ మాత్రమే అవసరమవుతాయి. దీనివల్ల కాలుష్య ఉద్గారాలు 55 నుంచి 99 శాతం దాకా తగ్గిపోయే అవకాశముంది. నేల క్షయాన్ని నిరోధించడం ద్వారా ఏటా రూ. 12.3 లక్షల కోట్ల ఖర్చును ఆదా చేయవచ్చు కూడా! తమ భూముల్లో 43 శాతం దాకా వానపాములు పెరిగినాయని, 52 శాతం దాకా నేల గుల్ల అయిందని, పచ్చదనం 36 దాకా పెరిగిందని రైతులు చెప్పారు. పైగా తాము పండించిన పంటల రుచి ఎంతో మెరుగైందని 95 శాతం రైతులు చెప్పడంతో నేను ఆశ్చర్యపోయాను. రసాయనాలు లేని ఆహారాన్ని 70 శాతం దాకా స్థానికంగా వాడుతున్నారు. దీంతో పీచుపదార్థం సమృద్ధిగా ఉన్న పోషకాహారం తీసుకోవడం బాగా పెరిగింది. ఏపీ వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు ప్రకృతి వ్యవసాయం కోసం ఒక విధానపరమైన చట్రాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో వ్యవసాయ జనాభాను మొత్తంగా రసాయన రహిత సేద్యం వైపు మళ్లించేందుకు బడ్జెట్లో మద్దతు కూడా అవసరం. ప్రపంచంలో ప్రతి విజయవంతమైన మార్పు వెనుక ఒక శక్తిమంతమైన ఉత్ప్రేరకం ఉంటుంది. ప్రస్తుతం ఆర్వైఎస్ఎస్కో చైర్మన్గా ఉంటున్న సీనియర్ రిటైర్డ్ ప్రభుత్వాధికారి విజయకుమార్ థిల్లామ్... ఏపీలో ప్రకృతి వ్యవసాయ పరంగా జరుగుతున్న అద్భుతమైన పరివర్తనకు ప్రేరణ. ఏపీలో స్మార్ట్ వ్యవసాయం పేరిట జరుగుతున్న గొప్ప పరివర్తనకు ఈయనే మూలకర్తగా ఉన్నారు. ఇది ఏపీకి గర్వకారణమే కాదు.. భవిష్యత్ సమాజ ఆహారానికి నిలకడైన మార్గం వైపుగా జరుగుతున్న మౌలిక పరివర్తన కూడా! -దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహారం, వ్యవసాయరంగ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com -
లాభం శూన్యం... నష్టాలు అనంతం!
ఒక సగటు భారతీయరైతు సాధారణ కూలీ కంటే ఘోరమైన స్థితిలో ఉన్నాడని జాతీయ గణాంకాల సంస్థ (ఎన్ఎస్ఓ) నివేదిక సూచిస్తోంది. 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా దేశంలో రైతులు పంట సాగు ద్వారా కంటే రోజు కూలీ ద్వారానే ఎక్కువగా ఆర్జిస్తున్నారంటే, వ్యవసాయ రాబడులను ఉద్దేశపూర్వకంగా తగ్గించివేసిన ఆర్థిక నమూనాలకు ఇది ప్రతిఫలంగానే చెప్పాల్సి ఉంటుంది. రైతులకు న్యాయమైన ఆదాయాన్ని తిరస్కరించడం అనేది గత కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వాలు వరుసగా అమలు చేస్తూ వచ్చిన వ్యవసాయ వ్యతిరేక విధానాల ఫలితమే. గ్రామీణ ప్రజలను వ్యవసాయం నుంచి పక్కకు నెట్టడమే వీటి లక్ష్యం. అందుకే కొన్ని దశాబ్దాలుగా రైతులకు దక్కుతున్నది శూన్యం. కష్టాలు, కడగండ్లు మాత్రం అనంతం. ప్రపంచ వాణిజ్య సంస్థ 1995లో ఉనికిలోకి వచ్చిన కొన్నేళ్ల తర్వాత లండన్కి చెందిన ‘ది ఎకాలజిస్టు’ పత్రిక నన్ను ఆహ్వానించి, భారతీయ రైతును యూరోపియన్ రైతుతో పోలుస్తూ ఒక వ్యాసం రాయమని కోరింది. భారత్లో సాపేక్షికంగా తక్కువ ఖర్చుతో సాగే వ్యవసాయాన్ని దృష్టిలో పెట్టుకుని, ప్రపంచ వాణిజ్యానికి తలుపులు తెరిచాక భారతీయ రైతులు ఆర్థికంగా ఎలా ప్రయోజనం పొందారు అనేది ఆ వ్యాసం లక్ష్యంగా ఉండాలని నాకు సూచించారు. పెరుగుతున్న పట్టణీకరణ వేగంగా ఆర్థిక వృద్ధికి దారితీస్తుందని, వ్యవసాయాన్ని క్షీణింపజేస్తుందని, రైతులు సాగును వదిలిపెట్టి వలసపోతారన్నది ఆ పత్రిక అభిప్రాయం. రైతుల వ్యతిరేకత పెరుగుతున్నప్పటికీ ప్రపంచ వాణిజ్య ఒప్పందంలో చేరవలసిన అవసరాన్ని సమర్థించుకోవడానికి ఆనాడు ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తలు సాధారణంగా పేర్కొంటూ వచ్చిన అభిప్రాయమిది. వ్యవసాయంపై డబ్ల్యూటీఓ ఒప్పందం అనేక అవకాశాలను కల్పించి రైతులకు స్వర్గ ద్వారాలను తెరుస్తుందనేంత విపరీత అభిప్రాయాన్ని కూడా వీరిలో ఒకరు వ్యక్తపరిచారు. వ్యవసాయ ఎగుమతులు పుంజుకోనుండటంతో వ్యవసాయ రాబడులు కూడా పెరుగుతాయని, దీంతో భారతీయ వ్యవసాయ రంగ దశ పూర్తిగా మారిపోతుందని ఇలాంటి వారు ఊదరగొడుతూ వచ్చారు. దీనికి ఎలాంటి ఆధారమూ లేనందున, వాస్తవానికి నేను ఆనాడు రాసిన వ్యాసంలో భారతీయ రైతును యూరోపియన్ ఆవుతో పోల్చి ముగించాను. ప్రపంచ వాణిజ్య సంస్థను ప్రారంభించి దాదాపు 26 ఏళ్లు గడచిన తర్వాత, గ్రామీణ భారతంలోని వ్యవసాయ కుటుంబాల ఆదాయాలపై జాతీయ గణాంకాల సంస్థ (ఎన్ఎస్ఓ) అత్యంత నిరాశా చిత్రణతో కూడిన తాజా నివేదికను గత వారం విడుదల చేసింది. వ్యవసాయ పరిస్థితుల సర్వేపై (ఎస్ఓఎస్) రూపొందించిన ఈ నివేదికను 2018–19 సంవత్సరంలో నిర్వహించారు. భారతీయ రైతు సాధారణ కూలీ కంటే ఘోరమైన పరిస్థితుల్లో చిక్కుకున్నాడనే భయంకర వాస్తవాన్ని ఈ నివేదిక బయటపెట్టింది. 75 ఏళ్ల స్వాతంత్య్రానంతరం కూడా రైతులు పంట సాగు ద్వారా కంటే రోజు కూలీల ద్వారానే ఎక్కువగా ఆర్జిస్తున్నారంటే, వ్యవసాయ రాబడులను ఉద్దేశపూర్వకంగా తగ్గించివేసిన ఆర్థిక నమూనాలకు ఇది పరాకాష్ట. నగరాల్లో జరిగే నిర్మాణ పనులకు కారు చౌక శ్రమ అవసరం కాబట్టి గ్రామీణ ప్రాంతాలనుంచి పట్టణాలకు వలసలను భారీగా ప్రోత్సహించడాన్ని మన విధాన నిర్ణేతలు కొనసాగిస్తూ వచ్చిన ఫలితమే ఇది. చివరిసారిగా వ్యవసాయ పరిస్థితుల సర్వేని 2012–13 సంవత్సరంలో నిర్వహించినప్పుడు, దేశంలోని సగటు వ్యవసాయ కుటుంబం 48 శాతం ఆదాయాన్ని పంట సాగు ద్వారా ఆర్జించేది. 2018–19 సర్వే నాటికి ఇది 38 శాతానికి పడిపోయింది. ఇదే కాలంలో రోజుకూలీ ద్వారా రైతు కుటుంబ ఆదాయం 32 శాతం నుంచి 40 శాతానికి పెరిగింది. సగటు వ్యవసాయ కుటుంబం రోజుకూలీ ద్వారానే ఎక్కువగా సంపాదించడం మొదలైంది. కొన్ని వ్యవసాయ ఖర్చులను ముందుగానే చెల్లించివేయడం ప్రాతిపదికన, సగటు వ్యవసాయ కుటుంబానికి నెలకు రూ. 10,218 రూపాయల ఆదాయం వస్తుందని లెక్కగట్టారు. 2012–13 సంవత్సరంలో రైతుకుటుంబ ఆదాయం నెలకు రూ. 6,426లతో పోలిస్తే, ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేశాక గత పదేళ్లలో పెరిగిన వ్యవసాయ కుటుంబ ఆదాయం 16 శాతం మాత్రమేనని తెలుస్తుంది. 2018–19 సంవత్సరంలో సగటు వ్యవసాయ కుటుంబ ఆదాయం నెలకు రూ. 8,337లకు చేరుకుంది. రైతు పెట్టే సొంత పెట్టుబడి, వేతనాలు చెల్లించని శ్రమ, సొంత పనిముట్లు, సొంత విత్తనాలు వంటివాటిని ముందుగానే చెల్లించే వ్యవసాయ ఖర్చుల కింద లెక్కగడుతున్నారని గమనించాలి. ఇక పంట సాగు విషయానికి వస్తే సగటు వ్యవసాయ కుటుంబం 2018–19 సంవత్సరంలో రూ. 3,798లను సంపాదించేది. వాస్తవానికి ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేశాక, వ్యవసాయ ఆదాయం 2012– 13 నుంచి 2018–19 మధ్య కాలంలో 8.9 శాతం క్షీణించిపోవడం గమనార్హం. ఒక పత్రిక చేసిన ఆసక్తికరమైన విశ్లేషణ బట్టి పంట సాగు ద్వారా రోజుకు రూ. 27ల రాబడి మాత్రమే రైతుకుటుంబానికి దక్కుతోందని తెలుస్తుంది. జాతీయ ఉపాధి పథకంలో భాగంగా పనిచేసే కూలీ సైతం ఇంతకంటే ఎక్కువగా సంపాదిస్తుంటాడు. నేను చాలా కాలం నుంచి పదే పదే చెబుతున్నట్లుగా, పంట పండిస్తున్నందుకు రైతుపై జరిమానా విధిస్తున్నారని ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. సాగు ద్వారా రైతుకు వస్తున్న ఆదాయం రోజువారీగా ఆవుపాల ద్వారా వచ్చే ఆదాయం కంటే చాలా తక్కువ అని స్పష్టమవుతోంది. వ్యవసాయ రాబడి ఎంత తక్కువగా వస్తే, అంత ఎక్కువగా వివిధ మార్గాల్లో రైతు తీసుకునే అప్పులు పెరిగిపోతుంటాయి. 2012– 13 సంవత్సరంలో రూ. 47 వేలుగా ఉన్న సగటు రైతు కుటుంబం అప్పు 2018–19 నాటికి రూ. 74,100లకు పెరిగిపోయింది. దేశంలోని వ్యవసాయ కుటుంబాల్లో 50.2 శాతం అలివిమాలిన రుణభారంలో చిక్కుకుపోయి ఉన్నారు. 2021 మార్చి చివరినాటికి దేశంలో పేరుకుపోయిన రైతు రుణాల మొత్తం రూ. 16.8 లక్షల కోట్లకు పెరిగిందని పార్లమెంటుకు ప్రభుత్వం వివరించింది. దేశంలో దాదాపు 77 శాతం వ్యవసాయ కుటుంబాలు స్వయం ఉపాధిని ఆధారం చేసుకుంటున్న విషయాన్ని పరిశీలిస్తే, 70.8 శాతం వ్యవసాయ కమతాలు హెక్టారు కంటే తక్కువగా ఉన్నాయన్న వాస్తవం కలవరపెడుతుంది. 9.9 శాతం వ్యవసాయ కమతాలు మాత్రమే ఒకటి నుంచి రెండు హెక్టార్ల పరిమాణంలో ఉంటున్నాయి. వ్యవసాయ ఉత్పత్తి ద్వారా, అనుబంధ పనుల ద్వారా రూ. 4,000 కంటే ఎక్కువ ఆదాయాన్ని సంపాదిస్తూ, సంవత్సరంలో కనీసం ఒక కుటుంబ సభ్యుడు ప్రధానంగా వ్యవసాయ కార్యకలాపాల్లో ఉంటాడన్న అంచనాపైనే వ్యవసాయ కుటుంబాన్ని నిర్వచిస్తున్నాము. గ్రామీణ కుటుంబాల్లో 0.2 శాతం మాత్రమే 10 ఎకరాల కంటే ఎక్కువ భూమిని కలిగి ఉన్నారన్న వాస్తవాన్ని గమనిస్తే రైతు ఆందోళనలు బడా రైతుల ప్రయోజనం కోసమే జరుగుతున్నాయని ఆరోపించడం పచ్చి అబద్ధమేనని తేటతెల్లమవుతుంది. రైతులకు న్యాయమైన ఆదాయాన్ని తిరస్కరించడం అనేది గత కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వాలు వరుసగా అమలు చేస్తూ వచ్చిన రైతు వ్యతిరేక విధానాల ఫలితమే. గ్రామీణ ప్రజలను వ్యవసాయం నుంచి పక్కకు నెట్టడమే వీటి లక్ష్యం. గ్రామీణ ప్రాంతాల నుంచి జనాభాను పెద్ద ఎత్తున పట్టణాలకు తరలించడంపై ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఊదరగొడుతూ చేసిన ప్రచారం సమకాలీన ఆర్థిక చింతనపై తీవ్ర ప్రభావం చూపింది. పట్టణీకరణ దశను పెంచడం అనేది ఆర్థిక వృద్ధిని వేగవంతం చేస్తుందని, వ్యవసాయాన్ని ఉద్దేశపూర్వకంగా క్షీణింపజేస్తూ వస్తే రైతులు తమ భూములు వదులుకుని వలస పోయే పరిస్థితులు ఏర్పడతాయన్నది ఈ ఆర్థిక చింతన సారాంశం. వ్యవసాయ పరిస్థితుల సర్వే 2018–19 పేర్కొన్న వాస్తవాలను కూడా మన ఆర్థికవేత్తలు తమకు అనుకూలంగా మల్చుకుని, పట్టణాలకు వలస ప్రక్రియను మరింత వేగవంతం చేస్తూ విధానాలను మార్పుచేయాలని ప్రతిపాదిస్తే నేనేమాత్రం ఆశ్చర్యపోను. ఈ రైతు వ్యతిరేక విధానాలను పూర్తిగా తిరగతోడాల్సి ఉంది. ప్రతి ఏటా ఆహారధాన్యాల ఉత్పత్తి పెరుగుతూనే ఉంది. కానీ వ్యవసాయ రంగ ఆదాయాలు మాత్రం తగ్గుముఖం పడుతూనే ఉన్నాయి. కేంద్రప్రభుత్వం గత ఏడాది తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణ చట్టాలు వ్యవసాయ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తాయని రైతులు స్పష్టంగానే గ్రహించి జాగరూకతతో ఉన్నారు. రైతులు కోరుతున్నదల్లా ఒకటే... వ్యవసాయ ఆదాయ విధానాల పట్ల పునరాలోచన చేయాలనే. దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయరంగ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com (ది ట్రిబ్యూన్ సౌజన్యంతో...) -
పామాయిల్ సాగుకన్నా ముఖ్యం ఇదీ...
ప్రపంచ వాణిజ్య సంస్థ విధివిధానాలను నెరవేర్చడం కోసం దిగుమతి పన్నులను క్రమానుగతంగా తగ్గించడాన్ని భారత్ మొదలెట్టినప్పుడు ‘ఎల్లో రివల్యూషన్’ (నూనెగింజల ఉత్పత్తి) ద్వారా దేశం సాధించిన ఫలితాలు హరించుకుపోయాయి. వంటనూనెల దిగుమతిపై దేశం 300 శాతం వరకు పన్ను విధించే అవకాశం ఉన్నప్పటికీ ఒకవైపు దిగుమతి లాబీలు, మరోవైపు దేశంలోని ప్రముఖ ఆర్థికవేత్తల ఒత్తిడితో దిగుమతి పన్ను రేట్లను ఒక దశలో జీరోకి తగ్గించేశారు. దీంతో స్వల్ప కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద వంటనూనెల దిగుమతిదారుగా భారత్ మారిపోయింది. పామాయిల్ సాగుకోసం భూమిని అధికంగా కేటాయించడానికి బదులుగా, మనం మర్చిపోయిన ‘నూనెగింజల విప్లవా’న్ని పునరుద్ధరించడం తక్షణావసరంగా ఉంది. కొన్ని రోజుల క్రితం పామాయిల్ని దేశీ యంగా ఉత్పత్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం వంటనూనెలు– ఆయిల్ పామ్పై జాతీయ మిషన్ (ఎన్ఎమ్ఈఓ–ఓపీ) కోసం రూ. 11,040 కోట్లకు ఆమోదముద్ర వేసింది. వంట నూనెల దిగుమతిపై అతిగా ఆధారపడటాన్ని తగ్గించుకోవడమే దీని లక్ష్యం. కాయధాన్యాలు, నూనెగింజలకు సంబంధించిన ఉత్పత్తి పరి స్థితులపై చర్చించడానికి ఒక టీవీ ప్యానెల్లో కూర్చున్నాను. ఆ ప్యానెల్లో నీతి ఆయోగ్ సభ్యుడొకరు ముఖ్యమైన సమాచారం తెలిపారు. రాబోయే కొన్నేళ్లలో దేశీయ వంటనూనెల అవసరాల్లో 40 శాతం పైగా పామాయిల్ సాగు ద్వారా పూరించాలన్నదే ఈ పథకం లక్ష్యమట. పర్యావరణ, వాతావరణ కారణాల వల్ల పామాయిల్ ఇప్పటికే ఆరోగ్యపరమైన వివాదంలో చిక్కుకుని ఉన్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వ తాజా పథకం దిగ్భ్రాంతిని కలిగించింది. ఇతర వంటనూనెలతో పోలిస్తే పామాయిల్ ధర తక్కువ కాబట్టి నీతినియమాలు లేని వర్తకులు తరచుగా పామాయిల్ని ఇతర వంటనూనెలతో కల్తీ చేసి ప్రయోజనం పొందుతున్నారు. పైగా స్థానిక ఉత్పత్తి, స్థానిక అవసరాలపై ఆధారపడి దేశంలో అనేకరకాల ఆరోగ్యకరమైన వంటనూనెలు అంటే– ఆవ, పొద్దుతిరుగుడు, వేరుశనగ, నువ్వులు, కుసుమలు, వెర్రి నువ్వులు (ఒడిసలు) వంటి నూనె గింజలపై భారతీయులు సాంప్రదాయకంగా ఆధారపడి ఉన్నారు. అందుకే భారతీయులు పామాయిల్ పట్ల ఏ ఆసక్తీ చూపలేదు. పైగా పామాయిల్ని జంక్ ఫుడ్, ప్రాసెసింగ్ పరిశ్రమ, సౌందర్య ఉత్పత్తులు, షాంపూ, డిటర్జెంట్స్, క్యాండిల్స్, టూత్ పేస్టులు వంటి వేగంగా అమ్ముడయ్యే వినియోగదారీ ఉత్పత్తులలో ఉపయోగించడానికే పరిమితం చేస్తున్నారు. పామాయిల్ దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ప్రతిపాదిం చిన కేంద్ర పథకం గురించి మనం మొదటగా తెలుసుకుందాం. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సమాచారం ప్రకారం 2025–26 నాటికి దేశంలో పది లక్షల హెక్టార్లలో పామాయిల్ తోటల సాగును పెంచాలనీ, 2029–30 నాటికి దీన్ని 16.7 లక్షల హెక్టార్లకు విస్తరించాలని కేంద్ర పథకం లక్ష్యం. ఈ కొత్త పంటలో చాలా భాగాన్ని పర్యావరణపరంగా దుర్బలంగా ఉండే ఈశాన్య భారత్లో, అండమాన్, నికోబార్ దీవుల్లో సాగు చేయనున్నారు. పామాయిల్ సాగుకోసం అవసరమైన ఉత్పాదకాలకు రాయితీ కల్పించడతోపాటు, ప్రారంభ సంవత్సరాల్లో ఎరువులపై ఖర్చును నూరుశాతం రీయింబర్స్మెంట్ కూడా ఇవ్వనున్నారు కాబట్టి రైతులు పామాయిల్ సాగుపట్ల తప్పక ఆకర్షితులవుతారు. పైగా ధరల హెచ్చుతగ్గులను అధిగమించడానికి పామాయిల్ సాగుకు గ్యారంటీ ధర చెల్లిస్తామనే హామీని కూడా కేంద్ర పథకం ప్రతిపాదిం చింది. టోకు ధరల సూచీకి అనుగుణంగా గత అయిదేళ్లలో సగటు ముడి పామాయిల్ ధరపై ఆధారపడి పామాయిల్ ధరను నిర్ణయించనున్నారని సమాచారం. ఒకవేళ ప్రాసెసింగ్ పరిశ్రమ పామాయిల్ సాగు రైతులకు ఇచ్చిన హామీమేరకు ధర చెల్లించకపోతే, రెండు శాతం ప్రోత్సాహకాన్ని ప్రభుత్వమే చెల్లించనుంది. భారతదేశం తన వంట నూనెల అవసరాల్లో దాదాపు 55 నుంచి 60 శాతం దిగుమతుల ద్వారా తీర్చుకుంటోంది కానీ, దిగుమతుల చెల్లింపుల అంతరం మొత్తంమీద రూ. 75 వేల కోట్లకు చేరుకుంది. పర్యావరణ వైపరీత్యాలకు ప్రధాన కారణం పెరుగుతున్న అడవుల నిర్మూలన, జీవవైవిధ్య విధ్వంసమేనని వాతావరణ మార్పుపై అంతర్ ప్రభుత్వ ప్యానెల్ (ఐపీసీసీ) పదేపదే హెచ్చరిస్తూ వచ్చింది. సహజ వర్షాటవుల స్థానంలో వైవిధ్య రహితమైన తోటలను సాగుచేసే ప్రయత్నాలు అత్యంత విలువైన జీవజాతులు నశించిపోయేలా చేస్తున్నాయని, కర్బన ఉద్గారాలు పెరిగిపోవడానికి కారణమవుతున్నాయని పలు అధ్యయనాలు చూపించాయి. 2020 జనవరిలో సమర్పించిన ఒక నివేదిక ప్రకారం భారతీయ అటవీ పరిశోధనా, విద్యా మండలి కూడా జీవవైవిధ్య పరంగా మెరుగ్గా ఉన్న ప్రాంతాలను పామాయిల్ తోటల సాగుకు అప్పగించడంపై తీవ్రంగా హెచ్చరించింది. భారీస్థాయిలో పెరిగిపోతున్న దిగుమతుల బిల్లును తగ్గించడానికి దేశీయంగా వంటనూనెల ఉత్పత్తిని పెంచాలనుకోవడంలో ఆర్థికపరంగా ఔచిత్యం ఉన్నప్పటికీ, 1993–94 నాటికే దేశీయ వంటనూనెల అవసరాల్లో 97 శాతాన్ని ఉత్పత్తి చేసి దాదాపుగా స్వయంసమృద్ధిని సాధించిన భారతదేశం... ఇంత తక్కువ కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద వంటనూనెల దిగుమతిదారుగా ఎలా మారిపోయిందన్నది పెద్ద ప్రశ్న. 1985–86లో భారత్ ప్రారంభించిన చమురుగింజల టెక్నాలజీ మిషన్ లక్ష్యం ఏమిటంటే, దేశీయ ప్రాసెసింగ్ ఉత్పత్తిని బలోపేతం చేస్తూనే నూనెగింజల ఉత్పత్తి పెంపుదలపై దృష్టిపెట్టడమే. దీన్నే తదనంతరం ‘ఎల్లో రివల్యూషన్’ అని ప్రశంసించారు. వ్యవసాయంపై డబ్ల్యూటీఓ ఒడంబడిక ప్రకారం భారతదేశం సోయాబీన్ మినహా ఇతర వంటనూనెలపై 300 శాతం వరకు దిగుమతి పన్నులు విధించవచ్చు. వంటనూనెల దిగుమతిపై దేశం ఇంత అత్యధిక శాతం పన్ను విధించే అవకాశం ఉన్నప్పటికీ ఒకవైపు దిగుమతి లాబీలు, మరోవైపు దేశంలోని ప్రముఖ ఆర్థికవేత్తల ఒత్తిడి కారణంగా ఎగుమతి పన్ను రేట్లను తగ్గించేశారు. ఇది ఏ స్థాయికి చేరుకుం దంటే ఒక దశలో దిగుమతి పన్నులు దాదాపుగా జీరోకి చేరుకున్నాయి. దీంతో చౌక నూనె దిగుమతుల వెల్లువ మొదలై దేశీయ నూనెగింజల సాగుదారులు రంగం నుంచే తప్పుకోవలసివచ్చింది. దేశీయ వంటనూనె ఉత్పత్తిని ప్రోత్సహించే ఉత్తమ మార్గం ఏదంటే, ఎల్లో రివల్యూషన్ ఎక్కడ తన ప్రభను కోల్పోయిందో గ్రహించి, నూనె గింజల ఉత్పత్తిని తిరిగి పెంచడంపై దృష్టి పెట్టడమే. ప్రభుత్వం దేశంలోని పామాయిల్ సాగుదారులకు గ్యారంటీ ధర కల్పించాలని భావిస్తున్నట్లయితే, నూనె గింజల సాగుదారుల్లో చాలామంది చిన్న రైతులే కాబట్టి, వీరికి గ్యారంటీ ధరకు హామీని కల్పించకపోవడంలో ఎలాంటి హేతువును నేను చూడటం లేదు. ఆర్థిక నిచ్చెనలో రైతులు అత్యంత దిగువన ఉంటున్నారన్న వాస్తవాన్ని గుర్తించి గ్యారంటీ ధర, మార్కెటింగ్ వ్యవస్థ కల్పనతో నూనె గింజల సాగుకు తిరిగి ప్రాణం పోయాలి. ఇది ఆర్థికంగా చెల్లుబాటు కాగల ప్రత్యామ్నాయంగా మారితే అధిక నీటిని ఉపయోగించి వరి సాగు చేసే పంజాబ్ రైతులు కూడా తమ ప్రాధాన్యతను మార్పు చేసుకుంటారు. పైగా ఆబ్సెంటీ భూస్వాములకు, కొద్దిమంది పారిశ్రామిక దిగ్గజాలకు మాత్రమే ప్రయోజనం కలిగించే పామాయిల్ సాగుకి కాకుండా, నూనెగింజల సాగును ప్రోత్సహిస్తే అది దేశంలోని కోట్లాది సన్నకారు రైతులకు వ్యవసాయాన్ని లాభదాయకంగా మారుస్తుంది. ఎల్లో రివల్యూషన్ కుప్పగూలిపోయాక దేశంలో నూనె గింజల సాగుదారుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. పైగా నూనెగింజల సాగుకు భూముల విస్తరణ కోసం పెద్ద ఎత్తున సహజ అడవులపై వేటు వేయాల్సిన అవసరం లేదు. దేశంలో భూగర్భజలాలు అడుగంటిపోవడానికి విస్తృతంగా గోధుమ, వరి పంటలను పండించడమే కారణమని నిపుణులు మొత్తుకుంటున్న సమయంలో, నీటిని అధికంగా ఉపయోగించుకునే పామాయిల్ సాగువైపు దేశాన్ని నెట్టడంలో అర్థం లేదు. సగటున ఒక పామ్ చెట్టు రోజుకు 300 లీటర్ల నీటిని పీల్చుకుంటుంది. ఒక హెక్టార్లోని పామ్ చెట్ల సంఖ్యను లెక్కించి చూస్తే పామాయిల్ తోటలు నీటిని తోడేస్తాయని చెప్పాలి. కాబట్టే మరో పర్యావరణ సంక్షోభంలో మనం కూరుకుపోవడానికి ముందుగా ఖర్చులు తగ్గించుకునే నిష్పత్తిని సమగ్రంగా అధ్యయనం చేయాల్సి ఉంది. పామాయిల్ సాగుకోసం సాగుభూమి విస్తరణను ప్రతిపాదించడానికి బదులుగా, మనం మర్చిపోయిన నూనెగింజల విప్లవాన్ని పునరుద్ధరించడం తక్షణావసరంగా ఉంది. నూనె గింజల్లో స్వయం సమృద్ధిని సాధించే మార్గం ఇదే. వ్యాసకర్త: దేవీందర్ శర్మ ఆహారం, వ్యవసాయరంగ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
అంతరాల తొలగింపే... అసలు లక్ష్యం
సంపన్న దేశాల్లో రైతాంగ వ్యవసాయాన్ని పారిశ్రామిక వ్యవసాయం విధ్వంసం చేసింది. ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛా మార్కెట్లు వ్యవసాయాన్ని తీవ్ర దుఃస్థితిలోకి నెట్టాయి. ఆ చేదు అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని దేశీయ సంస్కరణలను తిరగ రాసుకోవలసిన అవసరం ఉంది. ప్రజారోగ్యం, విద్య, వ్యవసాయ అభివృద్ధి విషయంలో పెరుగుతున్న అవసరాలను పెంపొందించడమే సంస్కరణల విధి. ‘సంస్కరణల పట్ల ఆనందం వ్యక్తం చేయడానికిది సమయం కాదు. వాటిని మరింత లోతుగా పరిశీలించి ఆలోచించాల్సి ఉంది. 1991లో ఏర్పడిన సంక్షోభం కన్నా మించిన ప్రమాదకర పరిస్థితి దేశాన్ని ఆవరిస్తోంది’ అంటూ నాటి సంస్కరణల్లో ప్రధానభూమిక పోషించిన మన్మోహన్ సింగ్ చేసిన తాజా ప్రకటన సంస్కరణల సమర్థకులకు కనువిప్పు. మూడు దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఆర్థిక సంస్కరణల 30వ వార్షికోత్సవ సంబ రాలను జరుపుకుంటూ ఆహా ఓహో అంటూ సంస్కరణల సమర్థకులు చంకలు గుద్దుకుంటున్న వేళ, నాటి సంస్కరణల ప్రధాన కర్త తదనం తరం దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మన్మోహన్ సింగ్ తాజా ప్రకటనలో నాటి సంస్కరణల పట్ల ఆనందంతో గంతులేయాల్సిన సమయం కాదనేశారు. ’సంస్కరణల పట్ల ఆనందం వ్యక్తం చేయడా నికిది సమయం కాదు. వాటిని మరింత లోతుగా పరిశీలించి ఆలోచిం చాల్సి ఉంది. 1991లో ఏర్పడిన సంక్షోభం కంటే మించిన ప్రమాదకర పరిస్థితి దేశాన్ని ఆవరిస్తోంది’ వాతావరణ మార్పుపై అంతర్ ప్రభుత్వాల ప్యానెల్ రూపొం దించిన ఆరవ అంచనా నివేదిక తొలి ఇన్స్టాల్మెంట్కి సంబంధించిన అంతర్జాతీయ అధ్యయనం చేసిన ఒక ప్రకటన మానవజాతి మొత్తా నికి ప్రమాద సంకేతాలను పంపించింది. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అంటోనియో గ్యుటెరెస్ స్పష్టంగా ఈ అంశంపై మాట్లా డుతూ, ’మనముందున్న సాక్ష్యాధారాలను తోసిపుచ్చలేం. గ్రీన్ హౌస్ ఉద్గారాలు మన భూ ఖండాన్ని ఆక్రమించేస్తున్నాయి. దీంతో వందల కోట్ల మంది ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి’ అని ప్రకటిం చారు. అయితే జీడీపీని మాత్రమే అభివృద్ధికి కొలమానంగా భావి స్తున్న నయా ఉదారవాద ఆర్థశాస్త్రం నేపథ్యంలో మన భూ ఖండం వాస్తవంగానే మండిపోతోందని గుర్తించడంలో ఈ నివేదిక విఫల మైంది. లేదా, ప్రపంచ జనాభాలో 1 శాతం సగం ప్రపంచం వెలువ రించే ఉద్గారాలకు రెండు రెట్లకు పైగా ఎలా వెలువరిస్తోందన్న వాస్త వాన్ని ఎవరైనా ఎలా వివరించగలరు? మరొక 20 సంవత్సరాల్లో ప్రపంచ ఉష్ణోగ్రత 1.5 సెంటీగ్రేడ్ డిగ్రీల మేరకు పెరగనుండటాన్ని ఎవరూ కాదనలేరని ఈ నివేదిక హెచ్చరిస్తోంది. ఇప్పటికే 1.1 సెంటీగ్రేడ్ డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగింది. మరొక 0.4 సెంటీగ్రేడ్ డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగేందుకు ఇంకెన్ని సంవత్స రాల సమయం పడుతుందో నాకు తెలీదు. కాకుంటే, పారిశ్రామిక అభివృద్ధి ప్రారంభ సంవత్సరాల్లో మాదిరే ప్రపంచ వాతావరణం వేడెక్కుతోంది. దీన్ని బట్టి చూస్తే ఆర్థిక వృద్ధి నమూనాను రూపొందిం చిన మార్గం మౌలికంగానే లోపభూయిష్టంగా ఉందని తెలుపుతుంది. ప్రపంచ ఆర్థిక వేదికపై ఇంటర్నేషనల్ చారిటీ ఆక్స్ఫామ్ వరుసగా నివేదించిన అసమానతలపై నివేదిక మరొక అంతర్జాతీయ అధ్యయనంగా మనముందుకొచ్చింది. సంపన్నులు మరింత సంప న్నులెలా అవుతున్నారో, పేదలు మరింత నిరుపేదలుగా ఎలా మారి పోతున్నారో ఈ నివేదికలు స్పష్టంగా వివరించాయి. మన సంస్కర ణలపై పునరాలోచన తక్షణం అవసరమనేందుకు ఇదొక బలమైన సూచికగా కనబడుతుంది. భారత్లో ఒక శాతం మంది చేతుల్లో ఉన్న సంపద, 73 శాతం జనాభా సంపద కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉందన్న వాస్తవం ఒక్కటే... అసమానతలను తీవ్రంగా పెంచివేయ డంలో ఆర్థిక సరళీకరణ పాత్రను అర్థం చేసుకోవచ్చు. ఇటీవలే అంత రిక్ష యాత్ర చేసిన జెఫ్ బెజోస్ రోజుకు 8 బిలియన్ డాలర్లను సంపాదిస్తూ కూడా అమెరికాలో స్టెనోగ్రాఫర్ చెల్లించే పన్ను కంటే తక్కువ పన్నును చెల్లిస్తున్నాడు. సంపన్నులు అపారమైన సంపదను పెంచుకోవడంలో ప్రపంచ ఆర్థిక సరళీకరణల నమూనా ఎలా తోడ్ప డుతుందో ఇది స్పష్టంగా తెలుపుతుంది. భారత్లో కూడా ఈజీ మనీ, ఆర్థిక ఉద్దీపనలు స్టాక్ మార్కెట్లోకి వెళ్లిపోయాయి. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కొట్టుమిట్టాడుతున్న సమయంలోనూ స్టాక్ మార్కెట్లు పుంజుకుంటున్నాయంటే ఆశ్చర్యపో వలసింది లేదు. అసమానత్వమే చెడు ఆర్థికవ్యవస్థకు సంకేతం. పబ్లిక్ సిటిజన్ సలహా బృందం మనకు చెప్పినట్లుగా అమెరికాలోని బడా టెక్ కంపెనీల సీఈఓల సామూహిక సంపద 2021లో 651 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ మొత్తాన్ని ఉపయోగించి ఉంటే ప్రపంచ క్షుద్బాధను నిర్మూలించవచ్చు. మలేరియాని మటుమాయం చేయ వచ్చు. ప్రపంచం మొత్తానికి కోవిడ్ వ్యాక్సిన్ షాట్లను వేసి ఉండవచ్చు. అమెరికాలోనే ఇళ్లు లేని నిరాశ్రయుల సమస్యకు ముగింపు పలక వచ్చు. అప్పటికీ ఈ బిలియనర్ల వద్ద ఎంతో డబ్బు మిగిలే ఉంటుంది. భారత్లో ఒక శాతం సంపన్నుల వద్ద పోగుపడిన భారీ సంప దలో అతి చిన్న భాగాన్ని ఖర్చు చేయచేయగలిగితే మన దేశ దారి ద్య్రాన్ని నిర్మూలించడానికి, దేశీయ ఆకలి చరిత్రను తుడిచిపెట్టడానికి సరిపోతుంది. ఆర్థికవేత్త సుర్జిత్ భల్లా చెప్పినట్లుగా భారత్లో ఒక సంవ త్సరం దారిద్య్రాన్ని పూర్తిగా తొలగించాలంటే 48 వేల కోట్ల రూపా యలు కేటాయిస్తే చాలు. 2020 ప్రపంచ క్షుద్బాధా సూచిలో 107 దేశాల జాబితాలో భారత్ 94వ ర్యాంకులో ఉండటానికి మరో కారణం అవసరం లేదని నాకు అనిపిస్తుంది. అది కూడా మన ఆహార ధాన్యాల నిల్వలు పలు సంవత్సరాల పాటు దేశ అవసరాలకు సరిపోయేంత స్థాయిలో పోగు పడివుండటాన్ని ప్రత్యేకించి పరిశీలించాల్సి ఉంది. వ్యవసాయ దుస్థితి కొనసాగింపు కారణంగానే ఢిల్లీ చుట్టుపట్ల రైతుల తీవ్ర నిరసన చోటుచేసుకుంది. అందుకే మరింత కఠిన సంస్కరణలు చేపట్టడం కాదు. మానవీయ రూపంలో సంస్కరణలను తీసుకు రావటం ఇప్పుడెంతో అవసరం. ముఖ్యంగా ప్రజారోగ్యం, విద్య, వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక వ్యత్యాసాల తగ్గింపు అవసరాలను తీర్చగల సంస్కరణలు కావాలిప్పుడు. ఆరోగ్యకరమైన, గౌరవప్రదమైన జీవితం అనేది ఆరోగ్యకరమైన పర్యావరణంతోపాటు పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది. 2020 పర్యావరణ పనితీరు సూచీ ప్రకారం 180 దేశాల జాబితాలో భారత్ 168వ స్థానంలోకి పడిపోయింది. దీర్ఘకాలిక లక్ష్యాలతో ప్రజారోగ్య పరిరక్షణ, సహజవనరుల పరిరక్షణ, కర్బన ఉద్గారాల తగ్గింపుపై విశేషంగా కృషి చేసిన దేశాలు అత్యధిక ర్యాంకులను సాధించాయని ఈ సూచి తేల్చి చెప్పింది. అయితే సంపన్న దేశాలు ఈ సామాజిక, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలను సాధించాయని చెప్పలేము. ఎందు కంటే పారిశ్రామిక యుగం ప్రారంభమైనప్పటినుంచి 63 శాతం కాలుష్య ఉద్గారాలను 90 కంపెనీలు మాత్రమే సామూహికంగా విడు దల చేశాయి. అంటే భారత ఆర్థికవేత్తలు, విధాన నిర్ణేతలు మరింత నిలకడైన, సమీకృత మార్గంపై కృషి చేయాల్సి ఉందని ఈ వాస్తవం స్పష్టం చేస్తోంది. ఆర్థిక సంస్కరణల అవసరం గురించి గుండెలు బాదుకుంటూ శోకన్నాలు పెడుతున్న వారికి సంస్కరణలు అంటే ప్రైవేటీకరణ అని మాత్రమే అర్థం కావడంతో దేశం మొత్తంగా ఐఎమ్ ఎఫ్ నేతృత్వంలోని అంతర్జాతీయ ఉచ్చులో చిక్కుకుపోయింది. దీనికి బదులుగా, మధ్య, దిగువ తరగతుల్లోని మెజారిటీ జనాభా మరిం తగా సంపాదించేలా మన విధానాలను మార్చాలి. అప్పుడు మాత్రమే భారీ ఎత్తున గ్రామీణ డిమాండును సృష్టించవచ్చు. ’వాషింగ్టన్ సమ్మతి’ అనే స్పష్టమైన డిజైన్ను దాటి ముందుకెళ్లేం దుకు ఒక చారిత్రక అవకాశాన్ని భారతీయ విధాన నిర్ణేతలు కోల్పో యారు. అలాగే వ్యవసాయాన్ని రెండో అభివృద్ధి చోదకశక్తిగా పరిగ ణించే తరహా దేశీయ ఆర్థిక సంస్కరణల నమూనాను చేపట్టే అవకాశం కూడా వీరు చేజార్చుకున్నారు. వ్యవసాయం నుంచి రైతాంగాన్ని పక్కకు నెట్టేయడానికి బదులుగా, వ్యవసాయాన్ని ఆర్థికవృద్ధి శక్తికేంద్రంగా మార్చడంపై మనం ఇకనైనా దృష్టి పెట్టాలి. ఈ కీలక మార్పు ఇప్పటికీ సాధ్యమే. సంపన్న దేశాల్లో వ్యవ సాయ రంగాన్ని విధ్వంసం చేసిన పారిశ్రామిక వ్యవసాయం గుణ పాఠాలను, ప్రపంచ వ్యాప్తంగా స్వేచ్ఛా మార్కెట్లు భారీ ఎత్తున సృష్టించిన వ్యవసాయ దుస్థితి నేర్పుతున్న పాఠాలను దృష్టిలో ఉంచు కుని ఆహార వ్యవసాయ వ్యవస్థను సమర్థంగా నిర్వహించగలిగిన స్థితిలోకి రైతులను తీసుకురావాలి. వీరందరికీ నిర్దిష్టధరపై హామీ ఇస్తూ స్థిర ఆదాయాన్ని అందుకునేలా సంస్కరణలను మార్చాల్సి ఉంది. ప్రజారోగ్యం, విద్య, వ్యవసాయ అభివృద్ధి విషయంలో పెరు గుతున్న అవసరాలను పెంపొందించడమే సంస్కరణల విధి. దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు -
జనధనానికి జవాబుదారీ లేదా?
కరోనా వల్ల మధ్యతరగతి మరింత నిరుపేదదైంది. నిరుద్యోగం పెరిగిపోయింది. కానీ, కోటీశ్వరుల సంపద మాత్రం 35 శాతం పెరిగింది. కార్పొరేట్ లాభాలు పెరిగినంత మాత్రాన ధనికుల నుంచి అధికంగా పన్ను వసూళ్ళు ఉంటాయని అనలేం. కోటీశ్వరులకు భారీగా పన్ను రాయితీలు లభిస్తుంటే, మిగతా వర్గాలు మరిన్ని పన్నులు చెల్లిస్తున్నాయి. ఇప్పుడు వీధిలోని సామాన్యుడు సైతం పెట్రోలు, డీజిల్పై పన్నుల రూపంలో రూ. 5.70 లక్షల కోట్లు అధికంగా చెల్లించాల్సి వచ్చింది. బ్యాంకులు వ్యవసాయ ఋణాలు మాఫీ చేస్తే గగ్గోలు పెడుతుంటాం. కానీ, కోటీశ్వరులకు లాభం కలిగేలా లక్షల కోట్ల మేర మొండి బకాయిలు మాఫీ చేస్తుంటే మాట్లాడం! ప్రజాధనాన్ని ఇలా చట్టబద్ధంగా కొట్టేస్తుంటే, అనుమతించాల్సిందేనా? కరోనా మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. సామాన్యులు కష్టపడి పొదుపు చేసుకున్న సొమ్ములు కరిగిపోయాయి. మరోపక్క నిరు ద్యోగం పెరిగిపోయింది. కరోనా విస్ఫోటనం మొదలైన తొలి ఏడాదిలోనే అదనంగా 23 కోట్ల మంది నిశ్శబ్దంగా దారిద్య్ర రేఖ దిగు వకు జారిపోయారు. అజీమ్ ప్రేమ్జీ విశ్వవిద్యాలయం (ఎ.పి.యు.) లోని సుస్థిర ఉపాధి కేంద్రం (సీఎస్ఈ) ఈ లెక్కలు చెప్పింది. ఇదే కరోనా తొలి ఏడాదిలోనే దేశంలో మధ్యతరగతి వర్గంలో 3.2 కోట్ల మంది తగ్గిపోయారని మరో అధ్యయనంలో ప్యూ రీసెర్చ్ సెంటర్ తేల్చింది. కనీవినీ ఎరుగని ఈ మహమ్మారి మన మధ్యతరగతిపైన, నిరుపేదలపైన ఎంత గట్టి దెబ్బకొట్టిందో ఈ రెండు అధ్యయనాలూ కలతపరిచేలా గుర్తుచేస్తున్నాయి. ఇక, ఈ ఏడాది విరుచుకు పడ్డ కరోనా రెండో వేవ్ ఎంత తీవ్రంగా దెబ్బ తీసిందో ఇంకా తెలియరాలేదు. ఎవరిని ఏ మేరకు దెబ్బ తీసిందన్నది పక్కన పెడితే, సమాజంలోని అన్ని వర్గాల ప్రజాలపైనా ప్రభావమైతే పడిందన్నది నిర్వివాదాంశం. గృహస్థులు దాచుకున్న డబ్బులు అనూహ్యంగా తరిగిపోయాయి. నిరుద్యోగం ఆకాశానికి అంటింది. దాంతో, ప్రభుత్వం చివరకు అవసరార్థులైన 80 కోట్ల మందికి నెలకు 5 కిలోల ఉచిత రేషన్ ఇచ్చే పథకాన్ని వచ్చే నవంబర్ దాకా పొడిగించాల్సి వచ్చింది. కానీ, గత ఆర్థిక సంవత్స రంలోనే లిస్టెడ్ కంపెనీల కార్పొరేట్ నికర లాభాలు మాత్రం 57.6 శాతం పైకి ఎగబాకాయి. ఒక వైపు కరోనా దెబ్బతో ఆర్థిక వ్యవస్థ అస్తుబిస్తు అవుతున్న సమయంలోనే, మిగులు ధనాన్ని అందిపుచ్చు కున్న స్టాక్ మార్కెట్లు కూడా పైకి దూసుకుపోయాయి. భారతదేశం లోని కోటీశ్వరుల సంపద ఏకంగా 35 శాతం పెరిగింది. అంబానీ సంపద 8,400 కోట్ల డాలర్లకూ, అదానీ ఐశ్వర్యం 7,800 కోట్ల డాలర్లకూ ఎగబాకాయని బ్లూమ్బర్గ్ తేల్చింది. ఒక్క మాటలో– కరోనా వల్ల ధనికుల వద్ద సంపద మరింత పోగుపడితే, పేదసాదలు మరింత నిరుపేదలయ్యారు. ఇంకా లోతు ల్లోకి వెళితే– కార్పొరేట్ లాభాలు పెరిగినంత మాత్రాన ధనికుల నుంచి అధికంగా పన్ను వసూళ్ళు ఉంటాయని అనలేం. వాస్తవంలో ధనవంతులకు భారీ పన్ను రాయితీలు, సులభంగా డబ్బు లభిస్తే, దేశంలోని మిగతా వర్గాలు మరిన్ని పన్నులు చెల్లించాల్సి వస్తోంది. కార్పొరేట్ పన్ను వసూళ్ళు గణనీయంగా పడిపోయాయి. గత పదేళ్ళలో ఎన్నడూ లేనంత కనిష్ఠానికి చేరాయి. ఇలా పన్ను వసూలు తగ్గిపోవడం ప్రపంచ వ్యాప్త ధోరణికి తగ్గట్లే ఉంది. 2019 సెప్టెం బర్లో దేశ ఆర్థికశాఖ మంత్రి కార్పొరేట్ పన్ను ప్రాతిపదికను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించారు. అలాగే, నూతన ఉత్పత్తి సంస్థలకేమో 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గించారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ. 1.45 లక్షల కోట్ల మేర ఆదాయం పోతుంది. ఇదే సమయంలో కార్పొరేట్లతో నుంచి సగటు కుటుంబాలకు పన్ను ప్రాతిపదిక ఎలా మారిందో చూద్దాం. 2020 –21లో కార్పొరేట్ పన్నులు, వ్యక్తిగత ఆదాయపు పన్నులతో కూడిన ప్రత్యక్ష పన్ను వసూళ్ళు రూ. 9.45 లక్షల కోట్లు. కానీ, అదే సమయంలో పరోక్ష పన్ను వసూళ్ళు దాన్ని దాటేశాయి. ఏకంగా రూ. 11.37 లక్షల కోట్లకు గరిష్ఠానికి చేరాయి. ఇది కాక, వీధిలోని సామాన్యుడు పెట్రోలు, డీజిలుపై పన్నుల (ఎక్సైజ్, వ్యాట్) రూపంలో రూ. 5.70 లక్షల కోట్లు అధికంగా చెల్లించాల్సి వచ్చింది. అందులో దాదాపు 60 శాతం మేర ఇంధనపు పన్ను కేవలం ద్విచక్ర వాహనదారుల నుంచే వస్తోంది. ఇది కాక, రియల్ ఎస్టేట్ రిజిస్ట్రీ, మద్యంపై ఎక్సైజ్ సుంకంతో పాటు వినియోగదారులు చెల్లించే ఎలక్ట్రిసిటీ డ్యూటీని కలుపుకొని చూడండి. అవన్నీ చూస్తే, చివరకు సామాన్యుడు చెల్లిస్తున్న పరోక్ష పన్నుల వాటా చాలా ఎక్కువ. అంటే, కనీసం ఇప్పుడిక అభివృద్ధికి కేవలం తమ వల్లనే వనరులు సమకూరుతున్నాయని వ్యక్తిగత పన్ను చెల్లింపు దారులు అనలేరు. పన్ను చెల్లింపుదారులు కానివారిది కూడా ఆదాయ సృష్టిలో గణనీయంగా అధిక వాటాయే. చివరకు ప్లాస్టిక్ చెప్పులు వేసుకొనే సాధారణ కూలీ కూడా జి.ఎస్.టి. చెల్లిస్తున్నాడని మర్చి పోకండి. దీన్నిబట్టి ఒక విషయం స్పష్టమవుతోంది. దేశంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకమైన పన్ను కడుతూనే ఉన్నారన్న మాట. గమనిస్తే – దేశం స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో కార్పొరేట్ లాభం వాటా గత పదేళ్ళలో ఎన్నడూ లేనంత గరిష్ఠమైన 2.63 శాతా నికి చేరింది. కానీ, అదే సమయంలో 2020–21లో ఏకంగా రూ. 1.53 లక్షల కోట్ల మేర కార్పొరేట్ మొండి బకాయిలను భారతీయ బ్యాంకులు మాఫీ చేశాయి. బ్యాంకులకున్న ఈ నిరర్థక ఆస్తులు (ఎన్.పి.ఎలు) ఇంకా పెరుగుతాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్ అంచనా. ఇది ఇలా ఉండగా, 2017–18 నుంచి గత నాలుగేళ్ళలో బ్యాంకులు మాఫీ చేసిన మొత్తాలు భారీగా రూ. 6.96 లక్షల కోట్ల మేర ఉన్నాయి. నిజానికి, వ్యవసాయ ఋణాలను మాఫీ చేసినప్పు డల్లా గగ్గోలు పెట్టేస్తుంటారు కానీ, బ్యాంకులు క్రమం తప్పకుండా చేసే ఈ మొండి బకాయిల మాఫీ మాత్రం ఎవరి కంటికీ కనపడదు. ఇది చాలదన్నట్టు, అనేక ఆర్థిక మోసాలలో రూ. 5 లక్షల కోట్ల బ్యాంకు సొమ్ము ఇరుక్కుపోయింది. సమాచార హక్కు చట్టం కింద వచ్చిన జవాబు ఆధారంగా ఇటీవలే ఓ వార్తాపత్రిక తన కథనంలో అదెలా జరిగిందో వెల్లడించింది. ఆ మొత్తంలో 76 శాతం వాటా అగ్రశ్రేణిలో నిలిచిన 50 ఋణ ఖాతాల లావాదేవీలదే! ఇలాంటి దీర్ఘకాలిక ఎగవేతదారులను శిక్షించడం కోసం దివాలా నియమావళి (ఐ.బి.సి)ని తీసుకొచ్చారు. కానీ, దాని వల్ల ఆశించినది జరగడం లేదు. ఇటీవల రెండు దివాలా వ్యవహారాల్లో బ్యాంకులు (లేదా ఋణదాతలు) తామిచ్చిన అప్పులో ఏకంగా 93 నుంచి 96 శాతం మేర మాఫీ చేయాల్సి వచ్చింది. దానిపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. ఒక కేసులో అప్పులలో కూరుకుపోయిన వీడియోకాన్ గ్రూపులోని 13 సంస్థలపై వేదాంత గ్రూపునకు చెందిన ట్విన్ స్టార్ టెక్నాలజీస్ దాదాపుగా ఏమీ చెల్లించకుండానే నియంత్రణ సాధించింది. ఆ కార్యాచరణకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్.సి.ఎల్.టి.) ఆమోదం తెలిపింది. 64 వేల కోట్లకు పైగా మొత్తానికి గాను ఏక మొత్తపు చెల్లింపు పరిష్కారం కింద కేవలం 2 వేల కోట్ల పైన మాత్రమే వేదాంత గ్రూపు చెల్లించింది. మొత్తం సొమ్ములో అది కేవలం 4.15 శాతం. మరోమాటలో చెప్పాలంటే, బ్యాంకులతో సహా ఋణదాతలు మిగతా 95.85 శాతం బకాయిని మాఫీ చేయడానికి ఒప్పుకున్నారన్న మాట. ఇదంతా చూసిన ౖఫైనాన్షియల్ జర్నలిస్టు – రచయిత్రి సుచేలా దలాల్ కడుపు మండి, ‘సామాన్యులు ఒక్కసారి సైకిల్ కోసం అప్పు తీసుకొన్నా, బ్యాంకులు ఎలా ప్రవర్తిస్తాయో తెలుసు’ అని వ్యాఖ్యా నించారు. ఇలా అనేక కేసుల్లో బిడ్డర్లు కారుచౌక ఒప్పందాలతో దర్జాగా ముందుకు సాగిపోతున్నారు. బ్యాంకులు, ఇతర ఋణదాత సంస్థలే తరచూ 80– 95 శాతం మేర బకాయిని మాఫీ చేసి, నష్టపోతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే, చట్టబద్ధంగా వాళ్ళు ప్రజాధనాన్ని దోచే స్తున్నారన్న మాట! ఎందుకంటే, బ్యాంకుల్లో ఉండేది ప్రజాధనం. బ్యాంకులు ఇలా ఆర్థిక మోసాలలో ఋణమాఫీ చేశాయంటే ప్రజా ధనం నష్టపోయినట్టే్ట! బహుశా, దీనివల్లే వ్యాపారవేత్త హర్ష్ గోయెం కాకు చీకాకు వచ్చినట్టుంది. ప్రధానమంత్రి కార్యాలయాన్ని ట్యాగ్ చేస్తూ, ‘జనం కష్టపడి సంపాదించిన డబ్బును ఇలా కొందరు చట్ట బద్ధంగా దొంగిలించడం అనుమతించకూడదు’ అంటూ ఆయన ఏకంగా ఓ ట్వీట్ చేశారు. అవును... జరుగుతున్న కథ చూసి, విషయం గ్రహిస్తే– ఎవరైనా ఆ మాటే అంటారు! వ్యాసకర్త ఆహార, వ్యవసాయరంగ నిపుణులు దేవిందర్ శర్మ ఈ–మెయిల్ : hunger55@gmail.com -
ధనికులు, పేదల మధ్య ఇంత అగాధమా?
మహమ్మారి కాలంలో భారతీయ బిలియనీర్ల సంపద 35 శాతం మేరకు పెరిగింది. భారత్లోని కేవలం 11 మంది అగ్రశ్రేణి బిలియనీర్ల పెరిగిన సంపదతో జాతీయ ఉపాధి పథకాన్ని పదేళ్ల పాటు కొనసాగించవచ్చు అని ఆక్స్ఫామ్ నివేదిక సూచించింది. దేశంలోని ఒక్క శాతం అగ్రశ్రేణి సంపన్నుల సంపద పది కోట్లమంది నిరుపేదల సంపదకు నాలుగురెట్లు ఎక్కువగా ఉందని అంచనా. ఆర్థిక వృద్ధి నమూనాలు బలిసిన వారిని మరింత బలిసేలా అమలవుతున్నాయి. అదే సమయంలో నిరుపేదలు నిత్యం తమను తాము కాచుకునే దుస్థితిలోకి దిగజారిపోతున్నారు. అంతిమంగా చెప్పాలంటే, అభివృద్ధి అనే భావన ప్రధానంగా పేదలను పరిగణనలోకి తీసుకోవాలి. ఆదాయపరమైన అసమానతల తొలగింపునకు అదే అసలైన పరిష్కారం. కరోనా మహమ్మారి తొలి వేవ్ దేశదేశాలను లాక్డౌన్ బారిన పడవేసినప్పటి నుంచి ప్రధానంగా సంపన్నదేశాలకు చెందిన కేంద్ర బ్యాంకులు 9 లక్షల కోట్ల డాలర్ల మేరకు అదనపు డబ్బును ముద్రించాయి. దీంతో ఆయా ఆర్థిక వ్యవస్థలు కాస్తా ఊపిరి పీల్చుకున్నాయనే చెప్పాలి. ఆర్థికవేత్త, మోర్గాన్ స్టాన్లీ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ చీఫ్ గ్లోబల్ స్ట్రాటజిస్ట్ రుచిర్ శర్మ ప్రకారం, ఈ మహమ్మారి సంపన్నుల సంపదను మరింత పెంచే ఉద్దీపన శక్తిగా మారిపోయింది. ఆయా ప్రభుత్వాలు ప్రకటిం చిన ఉద్దీపన ప్యాకేజీల్లో అధిక భాగం ఆర్థిక మార్కెట్లలోకి ప్రవేశించాయి. అక్కడి నుంచి నయా సంపన్నుల నికర సంపదగా మారిపోయాయని రుచిర్ మే 16న ఫైనాన్షియల్ టైమ్స్లో రాశారు. మహమ్మారి తొలి వేవ్ కాలంలోనే అతి సంపన్నుల మొత్తం సంపద 5 లక్షల కోట్ల డాలర్ల నుంచి 13 లక్షల కోట్ల డాలర్లకు అమాంతంగా పెరిగిపోయింది. అంటే దేశాలు ఆర్థికవ్యవస్థను సంక్షోభం నుంచి బయటపడేయడానికి మల్లగుల్లాలు పడుతున్న సమయంలోనే మార్కెట్లు ధనరాసులను తరిలించుకుపోయాయంటే ఆశ్చర్యపడాల్సింది లేదు. విచారకరమైన విషయం ఏమిటంటే ప్రజల చేతుల్లోని సంపద పరోక్షంగా నయా సంపన్నుల జేబుల్లోకి సునాయాసంగా తరలిపోవడమే. బ్రూక్సింగ్స్ సంస్థ చేసిన మదింపు ప్రకారం 2020 సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా 14 కోట్ల 40 లక్షల మంది దారిద్య్ర రేఖ దిగువకు నెట్టబడ్డారని తెలిసినప్పుడే ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ గణాంకాల ప్రకారం చూస్తే అత్యంత దారిద్య్రంలో కూరుకుపోయిన అత్యధిక జనాభా విషయంలో భారత్ ఇప్పుడు నైజీరియానే అధిగమించింది. భారత్లో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న భారీ జనసంఖ్యకు ఇప్పుడు మరో 8 కోట్ల 50 లక్షల మంది జతకావడం విశేషం. కోవిడ్–19 సెకండ్ వేవ్ సృష్టిస్తున్న విధ్వంసం ఫలితంగా మరింత జనాభా దారిద్య్ర రేఖ కిందికి దిగజారిపోవడం ఖాయమనిపిస్తుంది. అయితే మనం గుర్తించకపోయిన విషయం ఏమిటంటే.. ప్రపంచం నుంచి కటిక దారిద్య్రాన్ని నిర్మూలించడానికి కేవలం 100 బిలియన్ల అమెరికన్ డాలర్లు వెచ్చిస్తే సరిపోతుంది. మహమ్మారి కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలో ఇది అత్యంత చిన్న భాగం మాత్రమే. సంపన్నుల చేతిలో మరింత సంపద పోగుపడేలా చేయడానికి ఆర్థిక వ్యవస్థలు చేసిన ప్రయత్నంలో దారిద్య్ర నిర్మూలన అనే అంశం గాలికెగిరిపోయింది. దారిద్య్రం నిర్మూలనకు తగినంత డబ్బు కేటాయించడంలో ప్రపంచం వెనుకబడి ఉంటున్న సమయంలోనే ప్రపంచ బిలియనీర్ల వద్ద సంపద మరింతగా ఎలా పోగుపడుతోందన్నది అర్థం కావడం లేదు. ఉద్దీపన ప్యాకేజీల్లో అతి చిన్న భాగాన్ని దారిద్య్ర నిర్మూలన కోసం వెచ్చించి ఉంటే, ఈ ప్రపంచం మరింత నివాస యోగ్యంగా ఉండేది. ఈలోగా, కరోనా మహమ్మారి ఆదాయ అసమానత్వాన్ని కనీవినీ ఎరుగని పరాకాష్ట స్థితికి తీసుకుపోయింది. అమెరికాలోని బిలియనీర్ల సంపద కరోనా కాలంలో 44.6 శాతానికి పెరిగిపోయిందని ఇన్స్టిట్యూట్ ఫర్ పాలసీ స్టడీ పేర్కొంది. ఇదే కాలంలో అమెరికాలో 8 కోట్లమంది ప్రజలు తమ ఉద్యోగాలు కోల్పోయారు. అమెరికాలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 16 కోట్ల మంది సంపదతో పోలిస్తే 50 మంది అగ్రశ్రేణి సంపన్నుల సంపద అధికంగా ఉందని ఈ అధ్యయనం తేల్చి చెప్పింది. ఇక భారత్ విషయానికి వస్తే ఆదాయాల మధ్య అసమానత ఏమంత తక్కువగా లేదు. 2013 నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీసు (ఎన్ఎస్ఎస్ఓ) నివేదిక ప్రకారం సగటు వ్యవసాయ కుటుంబం ఆదాయాన్ని పరిశీలిస్తే, సగటున నెలకు రూ. 6,426లు మాత్రమే ఉంటోందని తెలుస్తుంది. అందుకనే సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులు తమ పంటలకు గ్యారంటీ ఆదాయాన్ని కల్పించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. ఆక్స్ఫామ్ ఇనీక్వాలిటీ వైరస్ రిపోర్ట్తో దీన్ని పోల్చి చూడండి. మహమ్మారి కాలంలో భారతీయ బిలియనీర్ల సంపద 35 శాతం మేరకు పెరిగింది. భారత్లోని కేవలం 11 మంది అగ్రశ్రేణి బిలియనీర్ల పెరిగిన సంపదతో జాతీయ ఉపాధి పథకాన్ని పదేళ్ల పాటు కొనసాగించవచ్చు అని ఆక్స్ఫామ్ నివేదిక సూచించింది. దేశంలోని ఒక్క శాతం అగ్రశ్రేణి సంపన్నుల సంపద దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పది కోట్లమంది సంపదకు నాలుగురెట్లు ఎక్కువగా ఉందని అంచనా.పెరిగిన ఈ సంపద పేదల జీవితాల్లో ఎలాంటి అద్భుతాలు సృష్టించగలదో అర్థం చేసుకోవడానికి, సార్వత్రిక ప్రాథమిక ఆదాయంపై ప్రయోగ ఫలితం కేసి చూడాల్సి ఉంటుంది. కరోనా మహమ్మారి విరుచుకుపడటానికి రెండేళ్లకుముందు అంటే 2018 ప్రారంభంలో కెనడాలో ఫౌండేషన్ ఫర్ సోషల్ చేంజ్ చారిటబుల్ సంస్థ, యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియాతో కలిసి వాంకోవర్ ప్రాంతంలోని నివాసాలు లేని 50 కుటుంబాలకు 7,500 కెనడియన్ డాలర్లను (6,206 అమెరిన్ డాలర్లు) ఇచ్చాయి. ఏడాది తర్వాత ఈ డబ్బు ఎలా ఉపయోగపడింది అనే అంశంపై చారిటీ సంస్థ జరిపిన పరిశీలనలో అద్భుత ఫలితాలు కనిపించాయి. పైగా ఇలా నగదు సరఫరా అనేది ఎంతో ప్రోత్సాహకరమైన ఫలితాలను ఇచ్చింది. నిరుపేదలకు డబ్బుతో ఎలా వ్యవహరించాలో తెలీదంటూ సమాజంలో ఉండే సాధారణ అభిప్రాయానికి భిన్నంగా, తమకు అందిన పరిమితమైన ఆర్థిక సహాయాన్ని కూడా వారు ఎంతో తెలివిగా ఉపయోగించుకున్నారని ఈ అధ్యయన ఫలితాలు స్పష్టంగా వెల్లడిం చాయి. ప్రధానంగా ఆ కాస్త మొత్తాన్ని వారు ఆహారం, దుస్తులు, ఇంటి నిర్వహణ వంటి అవసరాలకు మాత్రమే తెలివిగా ఖర్చుపెట్టారు. వార్తా నివేదికల ప్రకారం ప్రాథమిక ఆహారంపై వినియోగం 37 శాతం పెరిగిందని తెలుస్తోంది. అదే సమయంలో నిరుపేదలు డ్రగ్స్, ఆల్కహాల్పై పెట్టే ఖర్చును గణనీయంగా తగ్గించుకున్నారు. అంతవరకు నివాస స్థలం లేకుండా గడిపిన వీరు తాము ఉండటానికి ఒక గూడుకోసం ప్రయత్నించి పక్కా ఇళ్లను సంపాదించుకోవడంపై పని చేశారు. ఈ అధ్యయనం ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా నిరుపేదలకు రోటీ, కపడా, మకాన్ ఎంతో ప్రాధాన్యత కల అంశాలుగా ఉంటున్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. మరో మాటలో చెప్పాలంటే ఇలాంటి చిన్న మొత్తాలతో నగదును బదలాయించడం అనేది దారిద్య్రం కోరలనుంచి పేదలను గణనీయంగా బయట పడేస్తుంది. నిరుపేదల జీవితాల్లో వెలుగును తీసుకొచ్చే ఈ విశిష్ట ప్రక్రియను అమలు చేయడానికి బదులుగా... ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలు, పన్ను రాయితీలు, బ్యాంక్ బకాయిల రద్దు, బెయిలవుట్లు, కార్పొరేట్ ప్రోత్సాహకాల పేరిట భారీ స్థాయిలో సంస్థలకు సబ్సిడీలను అందించడం రూపంలో మరింత డబ్బును సంపన్నుల జేబుల్లోకి చేరే తరహా విధానాల కొనసాగింపును మనం చూస్తూ వస్తున్నాం. పేదలకు వారి వాటా వారికిచ్చే విషయం చర్చకు వచ్చినప్పుడల్లా, ఒక విచిత్రమైన వాదనను మన ఆర్థిక పండితులు తీసుకొస్తుంటారు. అదనపు డబ్బును నేరుగా పేదలకు బదలాయిస్తే సమాజంలోని ప్రతిఒక్కరూ ఖర్చుపెట్టడం అలవాటు చేసుకుని మరింత ద్రవ్యోల్బణం పెరగడానికి కారకులవుతారని మేధావుల ఉవాచ. ఈ వాదనకు అనుగుణంగానే ఆర్థిక వృద్ధి నమూనాలు చాలా తెలివిగా సమాజంలో ఆదాయాల మధ్య అసమానతకు మరింత తోడ్పడేలా పథకాలను రూపొందిస్తూ వస్తున్నాయి. అంటే బలిసిన వారిని మరింత బలిసేలా ఈ విధానాలు అమలవుతున్నాయి. అదే సమయంలో నిరుపేదలు నిత్యం తమను తాము కాచుకునే దుస్థితి లోకి దిగజారిపోతున్నారు. అంతిమంగా చెప్పాలంటే, అభివృద్ధి అనే భావన ప్రధానంగా పేదలను పరిగణనలోకి తీసుకోవాలి. ఆదాయపరమైన అసమానతల తొలగింపునకు అదే అసలైన పరిష్కారం. వ్యాసకర్త: దేవీందర్ శర్మ ఆహారం, వ్యవసాయరంగ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
ప్రజారోగ్య విధ్వంసం... కారకులెవరు?
మన ప్రధాన ఆర్థిక వేత్తలు పాశ్చాత్య దేశాల్లోని ఉత్తమ విధానాలను కాపీ కొట్టి సత్వరం సొంతం చేసుకునేందుకే అలవాటు పడిపోయారు తప్పితే దేశానికి ఏది నిజంగా అవసరమైంది అనే ప్రాథమిక సమాచారాన్ని కనుగొనడానికి ప్రయత్నించలేదు. దేనికైనా సరే విదేశాలకేసి చూడటమే సులభమని భావిస్తూ వచ్చారు. ఆరోగ్యం, విద్య, ఆహారం, వ్యవసాయం వంటి సామాజిక రంగాలపై పెడుతున్న వ్యయాన్ని కుదించాలని పిలుపునిచ్చే వారిదే పైచేయి కావడంతో దేశంలో ప్రైవేటీకరణ తృష్ణ పెరుగుతూ పోయింది. ప్రజారోగ్య మౌలిక వ్యవస్థలో మన వైఫల్యాలను కరోనా సెకండ్ వేవ్ స్పష్టంగా ఎత్తి చూపింది. భారత్ వంటి దేశాలకు ఎలాంటి ఆర్థిక విధానాలు అవసరం అనే అంశంపై ఇప్పుడే పెద్ద ఎత్తున చర్చ జరగాలి. ఉత్తరప్రదేశ్లోని మీరట్ ప్రభుత్వ ఆసుపత్రిలో పలువురు రోగులు తమ మడతమంచాలను తామే తెచ్చుకున్నారని, అనేకమంది నేలపై బెడ్ షీట్లు వేసుకుని పడుకున్నారని ఒక జాతీయ పత్రిక నివేదించింది. ఇక పాట్నాలోని రెండు ప్రభుత్వ ఆసుపత్రులలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఈ ఆసుపత్రుల్లో చేరాలంటేనే ప్రజలు తిరస్కరిస్తున్నారని, ఇంట్లోనే ఉండి చికిత్స చేయించుకోవడానికే వీరు ప్రాధాన్యమిస్తున్నారని, దేవుడు కరుణించకపోతే ఇంటిలోనే చావాలని కోరుకుంటున్నారని ఒక ప్రముఖ ఆంగ్ల వెబ్ సైట్ పేర్కొంది. ఈ రెండు వార్తా నివేదికలు మన గ్రామీణ ఆరోగ్య సంరక్షణ మౌలిక వసతుల కల్పన ఎంత దిగజారిపోయిందో తేల్చి చెబుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వైరస్ ఎంత తీవ్రంగా చొచ్చుకుపోయింది అనే వాస్తవాన్ని ఈ రెండు వార్తా కథనాలు స్పష్టం చేశాయి. గ్రామీణ ఆరోగ్య సంరక్షణ మౌలిక వసతుల కల్పన ఎంతగా మట్టిగొట్టుకుపోయింది అనే విషయం అర్థమవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణను మెరుగుపర్చి ఉంటే ప్రస్తుతం కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం సాపేక్షంగా సులభతరమై ఉండేది. దేశంలో ఎంత దుర్భర పరిస్థితులు నెలకొని ఉన్నాయో చెప్పడానికి పంజాబ్లోని అబోహర్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గంలో 68 గ్రామాలకు కలిపి ఒకే ఒక ఆసుపత్రి ఉన్న వైనాన్ని గుర్తించాలి. ఈ ఆసుపత్రిలోనూ ఒక్కటంటే ఒక్క ఆక్సిజన్ పడక లేదు. దేశంలోని ఇతర గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి, పట్టణ ప్రాంతాల్లో సెకండ్ వేవ్ విరుచుకుపడటానికి ముందుగా, ప్రభుత్వ గ్రామీణ ఆరోగ్య వ్యవస్థ దాదాపుగా కుప్పగూలిపోయిన స్థితిలో ఉంది. కానీ ఈ పరిస్థితి మనపై పెద్దగా ప్రభావితం చూపదు కాబట్టి దాన్ని నిర్లక్ష్యం చేశాం. గ్రామీణ కుటుంబంలో ఒక వ్యక్తి తీవ్ర అనారోగ్యం పాలైతే ఆ కుటుంబం మొత్తంగా దారిద్య్ర రేఖ దిగువకు పడిపోతుందని అనేక అధ్యయనాలు మనకు చూపించాయి. వైద్య బిల్లులు చెల్లించాలంటే వీరు తరచుగా రుణాలు తీసుకోవలసి ఉంటుంది. దీంతో వారు మరింత అప్పుల ఊబిలోకి కూరుకుపోతారు. వైద్య చికిత్స కోసం గ్రామీణ ప్రాంతాల్లోని జనాభాలో 74 శాతం మంది ప్రైవేట్ రంగంపైనే ఆధారపడుతున్నారు. దీంతో ప్రజారోగ్య సంరక్షణ పేదలకు అందుబాటులో లేకుండా పోయింది. కోవిడ్–19 మహమ్మారి విరుచుకుపడటంతో నగరాల్లోని ఆసుపత్రులలో ఆక్సిజన్, ఔషధాలు, పడకలు నిండుకున్నాయి. దీంతో రోగుల బంధువులు, స్నేహితులు సహాయం కోసం సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు. మన నగరాల్లోనూ ప్రజారోగ్య సంరక్షణ కుప్పగూలిపోవడానికి సిద్ధంగా ఉందని కాస్త ఆలస్యంగానైనా సరే ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. ఇప్పటికే చాలా ఆసుపత్రుల్లో పడకలు అందుబాటులో లేవు. రోగులను వారి బంధువులు ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి ప్రవేశం కోసం తీసుకెళుతున్న దృశ్యాలు కలవరపెడుతున్నాయి. ఇది నగర మధ్యతరగతిని తీవ్రంగా కంపింపజేస్తోంది. విషాదమేమిటంటే నగరాల్లోని చాలా కుటుంబాలు తమ ప్రియతములను ఇప్పటికో కోల్పోయాయి. మీ ఫేస్బుక్ టైమ్లైన్ని కాస్త తెరిచి చూడండి, ప్రాణాంతక మహమ్మారి బారిన పడి కన్నుమూసిన వారి బంధువులు, స్నేహితులు నివాళి పలుకుతున్న దృశ్యాలు విస్తృతంగా మీకు కనిపిస్తాయి. సకాలంలో ఆసుపత్రిలో ప్రవేశం దొరికి వైద్య సహాయం అంది ఉంటే అనేకమంది ప్రాణాలు నిలిచేవని ఇప్పుడు ప్రజలు గుర్తిస్తున్నారు. కాబట్టే కరోనా సెకండ్ వేవ్లో మరణాల సంఖ్య ఇంతగా పెరగడానికి ఆరోగ్య మౌలిక వసతులు తగినంత లేకపోవడమే కారణమని అర్థమవుతోంది. కానీ మనం ఒక విషయంలో స్పష్టతతో ఉండాలి. మనం వ్యవస్థను తప్పుపట్టే ముందు.. ప్రజారోగ్య వ్యవస్థను ప్రైవేటీకరిస్తున్నప్పుడు మనందరం మూగ ప్రేక్షకుల్లా నిలబడి చూస్తుండిపోవడం వాస్తవం కాదా? బడ్జెట్లో ఆరోగ్యం, విద్య, వ్యవసాయంపై ప్రభుత్వ పెట్టుబడులపై తీవ్రంగా కోత విధించేవైపుగా ప్రభుత్వ విధానం కొట్టుకుపోతున్నప్పుడు జాతీయ స్రవంతి ఆర్థికవేత్తలను, మీడియాను ప్రశ్నించడంలో మనం విఫలం కాలేదా? మారిన ప్రభుత్వ విధానం మనల్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనే ఆలోచన మన మనస్సుల్లో ఉంది కాబట్టే నిమ్మళంగా ఉండిపోయాం. మన చుట్టూ మృత్యుదేవత తాండవిస్తున్న దృశ్యాలైనా మనలను మేల్కొల్పుతాయా అంటే హామీ ఇవ్వలేను. కానీ ట్విట్టర్లో ఎవరో ప్రభుత్వ ఆసుపత్రులు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయని నివేదించారు కూడా. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ప్రజారోగ్య వ్యవస్థతో ప్రభుత్వం ఎలా చెలగాటమాడుతూ వచ్చిందో ఇది తేల్చి చెప్పింది. ఆ తర్వాత నీతి ఆయోగ్ సైతం జిల్లా ఆసుపత్రులను ప్రైవేటీకరించాలని, పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం నమూనాలోకి వీటిని తీసుకురావాలని సూచించింది. దేశంలోని అగ్రశ్రేణి ఆసుపత్రులు వైద్య పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్నప్పుడు ఎంతమంది విధాన నిర్ణేతలు, మీడియా వ్యక్తులు, కార్పొరేట్ బడా సంస్థలు అభినందనలు తెలియజేశాయో మర్చిపోవద్దు. పైగా ద్రవ్యలోటును పరిమితుల్లో పెట్టడానికి సామాజిక రంగంపై పెడుతున్న పెట్టుబడులపై కోత విధించాలని కొందరు సుప్రసిద్ధ ఆర్థిక వేత్తలు కూడా సెలవిచ్చారని మనం మర్చిపోరాదు. నిజానికి, పార్లమెంటులో జరిగిన ప్రతి బడ్జెట్ సమావేశమూ ద్రవ్యలోటుపైనే కన్నేసి ఉంచిందని మర్చిపోకూడదు. గత సంవత్సరం అంటే 2020లో నీతి ఆయోగ్ మళ్లీ 250 పేజీల విధాన పత్రంతో ముందుకొచ్చింది. కొత్తగా నెలకొల్పనున్న లేదా ఇప్పటికే కొనసాగుతున్న ప్రైవేట్ వైద్య కళాశాలలను పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా జిల్లా ఆసుపత్రులతో అనుసంధానం చేసే పథకాలను తీసుకురావాలని ఈ పత్రం పేర్కొంది. విదేశాల్లోని ఉత్తమ విధానాలకు అనుగుణంగా ప్రభుత్వ ఆరోగ్య మౌలికవసతుల రంగాన్ని ఎలా ప్రైవేటీకరించాలో తెలిపే మార్గదర్శినిని కూడా నీతి ఆయోగ్ పేర్కొంది. పైగా, కొద్దిమంది ఆరోగ్య కార్యకర్తలు మినహా దేశంలోని ప్రతి ఒక్కరూ వీటిపట్ల కూడా మౌనం వహించారు. ఇదే నిజమైన సమస్య. మన ప్రధాన ఆర్థిక వేత్తలు పాశ్చాత్య దేశాల్లోని ఉత్తమ విధానాలను కాపీ కొట్టి సత్వరం సొంతం చేసుకునేందుకో అలవాటు పడిపోయారు తప్పితే దేశానికి ఏది నిజంగా అవసరమైంది అనే ప్రాథమిక సమాచారాన్ని కనుగొనడానికి వీరు ఏమాత్రం ప్రయత్నించలేదు. దేనికైనా సరే విదేశాలకేసి చూడమే సులభమని వీరు భావిస్తూ వచ్చారు. కానీ ప్రపంచంలోని అత్యంత సమర్థవంతమైనదిగా రేటింగ్ ఉంటున్న బ్రిటన్ లోని పబ్లిక్ సెక్టర్ నేషనల్ హెల్త్ సర్వీస్పై వీరు ఎందుకు చూపు సారించరు అని నాకు ఆశ్చర్యమేస్తుంది. ఏదేమైనప్పటికీ ఆరోగ్యం, విద్య, ఆహారం, వ్యవసాయం వంటి సామాజిక రంగాలపై పెడుతున్న వ్యయాన్ని కోసిపడేయాలని పిలుపునిచ్చే ఆర్థిక వేత్తలదే పైచేయి కావడంతో దేశంలో ప్రైవేటీకరణ తృష్ణ పెరుగుతూనే పోయింది. ప్రజారోగ్యానికి డబ్బు తక్కువగా ఉన్నట్లయితే, ఆరోగ్య మౌలిక వ్యవస్థను ఎలా ముందుకు తీసుకుపోగలం? అంతర్జాతీయ సంస్థలు చెప్పిందానికల్లా గుడ్డిగా తలూపుకుంటూ పోదామా? క్రెడిట్ రేటింగ్ సంస్థల ఆదేశాలను మనమెందుకు పాటించాలి? విషాదకరమేమంటే ద్రవ్యలోటును తగ్గించడం అనే మందునే మన కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తూ పోతున్నాయి. మన వైఫల్యాలను కరోనా సెకండ్ వేవ్ స్పష్టంగా ఎత్తి చూపింది. భారత్ వంటి దేశాలకు ఎలాంటి ఆర్థిక విధానాలు అవసరం అనే అంశంపై ఇప్పుడే పెద్ద ఎత్తున చర్చ జరగాలి. ప్రాణాంతక సెకండ్ వేవ్ మనల్ని పునరాలోచనలో పడవేస్తుందని, మన ఆర్థిక విధానాలపై విధాన నిర్ణేతలు పునరాలోచించి ఆత్మనిర్భర్ భారత్ సవాళ్లను ఎదుర్కోగలరని ఆశిద్దాం. దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహారం, వ్యవసాయరంగ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
ఈ అసమానత్వం.. దురాశకు పరాకాష్ట
ప్రజారోగ్యం విషయంలో అధిక లాభాల సాధన కోసం దురాశ అవధులు మీరిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి బదులుగా ప్రపంచ వాణిజ్య సంస్థకి చెందిన వాణిజ్యసంబంధిత మేధో సంపత్తి హక్కుల కింద పేటెంట్ రక్షణ పొందిన అతికొద్ది వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలు యావత్ ప్రపంచాన్ని నిలువుదోపిడీ చేస్తున్నాయి. పేదలంతా కరోనా వైరస్ నుంచి రక్షణ పొందనిదే తాము ఏకాంత దంత శిఖరాలపై సురక్షితంగా ఉండలేమన్న వాస్తవాన్ని సంపన్నులు అర్థం చేసుకోవాలి. కోవిడ్ మహమ్మారి వల్ల ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల 22 వేలమంది చనిపోయారు. మానవ జీవితాలను పణంగా పెట్టి అతికొద్ది కంపెనీలు భారీ లాభాలు ఆర్జించడాన్ని ప్రపంచం ఎలా అనుమతిస్తుందన్నదే ప్రశ్న. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి బదులుగా, ప్రపంచ వాణిజ్య సంస్థ ట్రిప్స్ (టీఆర్ఐపీ) ఒప్పందం కింద రోగ భద్రతపై గుత్తాధిపత్యాన్ని ఉపయోగించుకుంటున్న కొద్దిమంది వ్యాక్సిన్ ఉత్పత్తిదారులు యావత్ ప్రపంచాన్ని నిలువుదోపిడీ చేస్తున్నారు. బడా మందుల కంపెనీలు మాత్రమే కాదు.. అభివృద్ధి చెందిన కొన్ని దేశాలు సైతం వ్యాక్సిన్లను దొంగ నిల్వలు పెట్టుకుంటున్నారు. అధికాదాయం కల దేశాల్లో ప్రతి నలుగురిలో ఒకరికి వ్యాక్సిన్ అందిస్తుండగా, స్వల్పాదాయం కల దేశాల్లో ప్రతి 500 మంది ప్రజల్లో ఒకరికి మాత్రమే వ్యాక్సిన్ అందటం అనేది నిజంగానే కలవరపెడుతోంది. దీన్ని బట్టే వ్యాక్సిన్ అసమానత్వం హద్దులు మీరిపోయిందని తెలుస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, పేదదేశాలు ఇప్పటివరకు 0.2 శాతం వ్యాక్సిన్ డోసులను మాత్రమే పొందగా, ధనిక దేశాలు 87 శాతం వ్యాక్సిన్ డోసులను పొందగలిగాయి. ఇక డోసుల విషయానికి వస్తే అమెరికాలో 32 శాతం మంది, బ్రిటన్లో 27 శాతం మంది, భారత్లో 2 శాతం మంది, ఫిలిప్పైన్స్లో 0.3 శాతం మంది మాత్రమే వ్యాక్సిన్ రెండు డోసులూ పొందగలిగారు. ఈ నిష్పత్తిలో ప్రపంచం పూర్తిగా కరోనా మహమ్మారి నుంచి బయటపడాలంటే సంవత్సరాల సమయం పట్టేటట్టుంది. పైగా పేదవారికి వైరస్ నుంచి భద్రత కల్పించకుండా ప్రాణాంతక వైరస్ నుంచి తాము సురక్షితంగా ఉండలేమని సంపన్నులు గ్రహించాల్సి ఉంది. పైగా ప్రజారోగ్యం విషయంలో అధిక లాభాల సాధన కోసం దురాశ అవధులు మీరిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి బదులుగా ప్రపంచ వాణిజ్య సంస్థకి చెందిన వాణిజ్య సంబంధిత మేధో సంపత్తి హక్కుల కింద పేటెంట్ రక్షణ పొందిన అతికొద్ది మంది వ్యాక్సిన్ ఉత్పత్తిదారులు యావత్ ప్రపంచాన్ని నిలువుదోపిడీ చేస్తున్నాయి. బడా మందుల కంపెనీలు మాత్రమే కాదు.. అభివృద్ధి చెందిన కొన్ని దేశాలు సైతం వ్యాక్సిన్స్లను దొంగ నిల్వ చేస్తూ పేటెంట్ రక్షణను తాత్కాలికంగా అయినా సరే.. తొలగించేటటువంటి ఎలాంటి చర్యనైనా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఒక్క అమెరికానే 6 కోట్ల ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ డోసులను నిల్వ చేసిపెట్టుకుంది. పైగా, అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్డీఏ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లను (భారత్లో కోవిషీల్డ్ అంటున్నారు) దేశీయంగా వినియోగించడం పట్ల ఆమోదం తెలపలేదు. అలాంటప్పుడు ఈ వ్యాక్సిన్ని అమెరికా నిల్వ చేసిపెట్టుకోవడ అర్థంపర్థం లేని విషయమని అర్థమవుతుంది. కోవిడ్–19 వ్యాక్సిన్పై పేటెంట్ రక్షణను రద్దు చేయడానికి డబ్లు్యటీఓ అనుమతించాలని కోరుతూ భారత్, దక్షిణాఫ్రికా, తదితర అభివృద్ధి చెందుతున్న దేశాలు దరఖాస్తు చేశాయి కానీ, అమెరికా, ఇంగ్లండ్, ఈయూ, జపాన్, కెనడా, స్విటర్లాండ్, నార్వే, బ్రెజిల్, ఆస్ట్రేలియాతో కూడిన సంపన్న వాణిజ్య మండలి ఇలాంటి ప్రయత్నాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. మేధోసంపత్తి హక్కుల రద్దుపై భారత్, దక్షిణాఫ్రికా సంయుక్తంగా చేసిన ప్రతిపాదనను తిరస్కరించాలని కోరుతూ అమెరికా అధ్యక్షుడికి ప్రపంచ ఔషధ దిగ్గజాలు ఉత్తరం రాశాయి. అవి అమెరికా ప్రభుత్వ యంత్రాంగంపై కూడా ఒత్తిడి తీసుకొచ్చాయి. ఏ కంపెనీకైనా ఒక పేటెంటుపై 20 ఏళ్లపాటు గుత్తాధిపత్యాన్ని ట్రిప్స్ ఒడంబడిక కల్పిస్తోంది. ట్రిప్స్ ఒడంబడికలో అభివృద్ధి చెందుతున్న దేశాలు పేటెంటుపై తప్పనిసరి లైసెన్సు తీసుకునే అవకాశాన్ని కూడా ఒక నిబంధన ద్వారా కల్పించినందువల్ల అత్యవసర పరిస్థితుల్లో స్థానిక ఉత్పత్తి దారులు పేటెంట్ పొందిన ఉత్పత్తిని చేయడానికి ఆయా ప్రభుత్వాలకు అనుమతించినట్లయింది కానీ, పేటెంట్ గుత్తాధిపత్యం గురించి ఆందోళన చెందకుండానే వర్థమాన దేశాలు దీన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉపయోగించుకోవచ్చు కానీ వ్యాపారపరమైన ప్రతీకార దాడికి గురవ్వాల్సి వస్తుందనే భయంతో ఈ అవకాశాన్ని ఎంచుకోవడానికి ఆ దేశాలు సిద్ధపడటం లేదు. చివరకు ఇండియన్ పెటెంట్స్ యాక్ట్లోని సెక్షన్ 92ని ఉపయోగించి, పెటెంట్ హక్కు ఉన్న ఔషధాన్ని తయారు చేసేందుకు తప్పనిసరి లైసెన్స్ను జారీ చేయవచ్చని సుప్రీంకోర్టు సైతం సూచించినప్పటికీ, ఈ అంశంపై ప్రభుత్వం ముందుకెళ్లలేదు. లాభాన్ని ఆశించని ధర వద్ద భారత్కి తన వ్యాక్సిన్ అందిస్తానని ఫైజర్ కంపెనీ తాజాగా ప్రతిపాదించినప్పటికీ పేటెంట్ సమస్యపై అది వెనక్కు తగ్గడం లేదు. వ్యాక్సిన్ సరఫరా చేయాలంటే తనకు సైనిక స్థావరాలను, సార్వభౌమాధికార ఆస్తులను తనఖా పెట్టాలంటూ ఈ ఔషధ కంపెనీ దిగ్గజం కొన్ని లాటిన్ అమెరికన్ దేశాలను కోరిన విషయం ఈ ఫిబ్రవరిలో ఒక టీవీచానెల్లో ప్రసారమైంది. ఇప్పటికే ఫైజర్ ఏడు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. అర్జెం టీనా, బ్రెజిల్ దేశాలతో సంప్రదిస్తోంది కూడా. అర్జెంటీనా విషయంలో నైతే, దాని బ్యాంకు రిజర్వులను, సైనిక స్థావరాలను, రాయబార కార్యాలయాలను తనకు అప్పగించాలని ఫైజర్ సంస్థ కోరింది. బ్రెజిల్ను కూడా సైనిక స్థావరాలను, సార్వభౌమాధికార ఆస్తులను అప్పగించాలని కోరుతూనే, న్యాయవివాదాల కోసం అయ్యే ఖర్చులను చెల్లించడానికి అంతర్జాతీయ ఫండ్ని కూడా ఏర్పర్చాలని ఫైజర్ బ్రెజిల్ ప్రభుత్వాన్ని కోరింది. అయితే ఈ ఒప్పందాలు వెనక్కి పోయాయనుకోండి. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు సరసమైన ధరలకే వ్యాక్సిన్ అందించడానికి తాను నిబద్ధతతో ఉన్నానని ఫైజర్ చైర్మన్ ఆల్బర్ట్ బౌర్లా తెలిపారు. ఇది ఆ కంపెనీ ద్వంద్వ ప్రమాణాన్ని సూచిస్తుంది. పైగా కోవిడ్–19 వ్యాక్సిన్ ఉత్పత్తికి ఫైజర్ తన సొంత నిధులను వెచ్చించలేదు. ప్రజాధనంతో ఈ వ్యాక్సిన్లను రూపొందించారు. ఉదాహరణకు, ఆపరేషన్ రాప్ స్పీడ్ పథకం ద్వారా అమెరికా వివిధ కంపెనీలకు వ్యాక్సిన్ పరిశోధన, తయారీ, సరఫరాల కోసం 12 బిలియన్ డాలర్ల మేరకు ఆర్థిక సహాయం అందించింది. అలాగే లండన్ లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఇంపీరియల్ కాలేజీలకు బ్రిటన్ ప్రభుత్వం 84 మిలియన్ పౌండ్లను అందించింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆ తర్వాత అస్ట్రాజెనెకాతో ప్రపంచ లైసెన్సింగ్ ఒప్పందం కుదుర్చుకుంది. జర్మన్ ప్రభుత్వం ఫైజర్ భాగస్వామి బయోన్టెక్కి 445 మిలి యన్ యూరోలను సహాయంగా అందించింది. ఈ మొత్తం వ్యవహారంపై ప్రముఖ ఆర్థికవేత్త జెఫ్రీ డి సాచ్ కీలక వ్యాఖ్య చేశారు. మోడెర్నా, బయెన్టెక్–ఫైజర్, తదితర కంపెనీల మేధో సంపత్తి ఈ కంపెనీల సృజనాత్మక కృషి ఫలితం కాదని, అమెరికా ప్రభుత్వం, ప్రత్యేకించి జాతీయ ఆరోగ్య సంస్థ నిధులతో కొనసాగుతున్న విద్యా పరిశోధన ఫలితం కాదు. ప్రజాధనంతో, అకడమిక్ సైన్స్ సహా యంతో భారీగా ఉత్పత్తవుతున్న వ్యాక్సిన్లపై ప్రైవేట్ కంపెనీలు విస్తృత హక్కును ప్రకటించుకోవడం గర్హనీయమని వ్యాఖ్యానించారు. అభివృద్ధి చెందిన దేశాలకు వ్యాక్సిన్ టెక్నాలజీని సరఫరా చేసే ఎలాంటి ప్రయత్నాన్నైనా తాను వ్యతిరేకిస్తానంటూ బిల్గేట్స్ చేసిన తాజా ప్రకటనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఉత్పత్తిని శరవేగంగా చేయగలిగే శక్తిసామర్థ్యాలు భారత్, కెనడా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ తదితర దేశాలకు చెందిన పలు కంపెనీలకు ఉన్నాయి. మేధోసంపత్తి హక్కు రద్దు ద్వారా జెనెరిక్ మందులను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసి కారుచౌకగా వాటిని అందించవచ్చు. ఈ సంక్లిష్ట సమయంలో ప్రపంచానికి అవసరమైంది ఇదే. కోవిడ్–19 మహమ్మారి వల్ల ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల 22 వేలమంది చనిపోయారన్న విషయం మర్చిపోవద్దు. పేటెంట్ హక్కుపై చర్చ జరుగుతున్నప్పటికీ, మానవ జీవితాలను పణంగా పెట్టి వేళ్లమీద లెక్కించే కంపెనీలు భారీ లాభాలు ఆర్జించడాన్ని ప్రపంచం ఎలా అనుమతిస్తుందన్నదే ప్రశ్న. వ్యాసకర్త: దేవీందర్ శర్మ ఆహారం, వ్యవసాయరంగ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
స్పెయిన్ చెబుతున్న ‘రైతు’ పాఠం
స్పానిష్ రైతులు ఇటీవలికాలంలో నెలలతరబడి కొనసాగించిన నిరసనల ఫలితంగా, రైతులకు అనుకూలంగా స్పెయిన్ ఒక గొప్ప చట్టాన్ని తీసుకువచ్చి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అదేమిటంటే ఉత్పత్తికి అయిన ఖర్చు కంటే ఆహారాన్ని తక్కువ ధరకు అమ్మడాన్ని నిషేధిస్తూ చట్టం తీసుకురావడమే. రైతులకు నష్టం తెప్పించేలా ఆహార ధాన్యాలను తక్కువ ధరకు అమ్మే చిల్లర వ్యాపారులకు, హోల్సేల్ విక్రేతలకు జరిమానా విధించడం అనే ఒక చారిత్రక కార్యక్రమానికి స్పెయిన్ నాంది పలికింది. కేంద్రప్రభుత్వ సాగు చట్టాలను రద్దు చేసి కనీస మద్దతు ధరకు చట్టరూపం కల్పించాలని భారత రైతులు పోరాడుతున్న తరుణంలో కనీస మధ్దతు ధరకంటే తక్కువకు అమ్మకుండా స్పెయిన్ తరహా చట్టం నిరోధిస్తుంది. వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర కొనసాగింపు కోసం, సాగు చట్టాల రద్దుకోసం భారతీయ రైతులు గత కొన్ని నెలలుగా చేస్తున్న నిరసనల నేపథ్యంలో రెండు పాత ఘటనలు నాకు గుర్తుకు వస్తున్నాయి. 2018 డిసెంబర్లో మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలో ఒక రైతు తాను పండించిన 2,657 కేజీల ఉల్లిపాయలను కిలోకి ఒక్క రూపాయి ధరతో మాత్రమే అమ్మగలిగాడు. ఇలా అమ్మిన మొత్తంలో రవాణా ఖర్చు, కూలీ ఖర్చులు, మార్కెట్ ఫీజులను చెల్లించగా శ్రేయస్ అభాలే అనే ఆ రైతు ఇంటికి ఎంత తీసుకుపోయాడో తెలుసా. రూ. 6లు. కేవలం ఆరు రూపాయలు. రైతులు ఎదుర్కొంటున్న మార్కెట్ల క్రూరత్వానికి అతడు నిరసన తెలుపుతూ, ముఖ్యమంత్రికి ఆరు రూపాయల మనీ ఆర్డర్ పంపాడు. కానీ ఈరోజు వరకు పరిస్థితిలో మార్పు రాలేదు. మరొక ఉదంతం ఐర్లండ్ రైతుకు సంబంధించింది. షాన్ డైవర్ అనే అతను, ఐర్లండ్లో ఒక గొర్రెల పెంపకం కేంద్రం మేనేజర్. అతడి వ్యవసాయ క్షేత్రంలో 240 గొర్రెలు ఉంటున్నాయి. గత నెలలో అతడు 455 కేజీల గొర్రెల ఊలును 67 యూరోల ధరతో అమ్మేశాడు. అమ్మిన ధర చీటీని ట్యాగ్ చేస్తూ షాన్ ఆగ్రహంతో ట్వీట్ చేశాడు.. ‘240 గొర్రెలనుంచి తీసిన ఊలు ధర 560 యూరోలు మాత్రమేనా.. ఇది తప్పు. చాలా తీవ్రమైన తప్పిదం’ అని దాని సారాంశం. ప్రపంచవ్యాప్తంగా రైతులు వాస్తవానికి తమ రోజువారీ జీవితాలకు హామీ ఇవ్వలేని నామమాత్రపు రాబడులతో తీవ్రంగా ఘర్షణ పడుతున్నారు. అన్యాయపు ధరలు, మార్కెట్లో తారుమారు చేయడం వంటి పరిణామాలకు బాధితులైన రైతులు ఆహార సరఫరా సంస్థల చేతుల్లో దోపిడీకి గురవుతూ తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. చివరకు అమెరికా జాతీయ రైతుల యూనియన్ సైతం ఈ వాస్తవాన్ని గుర్తిం చింది ‘గత కొన్ని దశాబ్దాలుగా విధాన నిర్ణేతలు అమెరికన్ రైతులకు ధరల మద్దతు వ్యవస్థను బలహీనపరుస్తూ వచ్చారు. అధికోత్పత్తి, తక్కువ ధరలు అనే విషవలయంలో కూరుకుపోయిన లక్షలాది చిన్న, మధ్య తరహా సంస్థలు వ్యాపారం నుంచి వైదొలగాల్సి వచ్చింది’. అందుకే ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) ప్రకారం 20 బడా వ్యవసాయ వాణిజ్య సంస్థలు 2015 నుంచి 2017 మధ్యకాలంలో ప్రతి సంవత్సరం 475 బిలియన్ డాలర్ల మేరకు ప్రత్యక్ష ఆదాయ మద్దతును రైతులకు అందించాయని మీడియా పేర్కొంది. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోయి రైతులు ఎదుర్కొంటున్న నష్టాలను కాస్త తగ్గించడానికి ఇలా ప్రత్యక్ష నగదు మద్దతును అందించారు. అంటే రైతులు పండించిన పంటలకు సరైన ధరను నిర్ణయించడంలో సప్లై డిమాండ్ వర్గీకరణ క్రమం నిజానికి రైతుల మూలాలను పీల్చేసిందని, వారు వట్టిపోయేలా చేసిందని చెప్పడానికి ఇది సూచిక. దశాబ్దాలుగా అనేక దేశాల్లో కొనసాగుతూ వస్తున్న రైతు నిరసనలు వారు పండించిన పంటలకు హామీపూర్వకమైన ధరను అందించాల్సిన అవసరంపైనే దృష్టిపెడుతూ వచ్చాయి. అయితే ఇటీవలే స్పానిష్ రైతులు నెలలతరబడి కొనసాగించిన నిరసనల ఫలితంగా, స్పెయిన్ రైతులకు అనుకూలంగా ఒక గొప్ప చట్టాన్ని తీసుకువచ్చి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. అదేమిటంటే ఉత్పత్తికి అయిన ఖర్చు కంటే ఆహారాన్ని తక్కువ ధరకు అమ్మడాన్ని నిషేధిస్తూ స్పెయిన్ ఒక చట్టం తీసుకొచ్చింది. రైతులు ఎక్కడ ఉన్నా సరిగ్గా దీన్నే కోరుకుంటున్నారు. రైతులకు నష్టం తెప్పించేలా ఆహార ధాన్యాలను తక్కువ ధరకు అమ్మే చిల్లర వ్యాపారులకు, హోల్సేల్ విక్రేతలకు జరిమానా విధించడం అనేది ఒక చారిత్రక కార్యక్రమానికి స్పెయిన్ నాంది పలికింది. ఇది ఫుడ్ సప్లయ్ చెయిన్ పద్ధతిని పూర్తిగా మార్చివేయడమే కాదు.. చిన్న తరహా వ్యవసాయాన్ని బలపరుస్తుంది కూడా. స్పెయిన్ తీసుకొచ్చిన రైతు అనుకూల చట్టం తీసుకొచ్చే ప్రతిస్పందనలు ఖండాంతరాల్లో ప్రతిధ్వనిస్తాయి. ఇప్పటికే ఫ్రాన్స్, జర్మనీ దేశాలు ఫుడ్ సప్లయ్ చెయిన్ పని తీరులో జరుగుతున్న లోపాలను అరికట్టేలా చట్టాలను ప్రవేశపెట్టాయి కానీ ఇవి ఏమంత శక్తిమంతమైనవి కాదు. ఉదాహరణకు ఫ్రాన్స్లో వాస్తవ ధరకంటే తక్కువ ధరకే వ్యవసాయ ఉత్పత్తులను అమ్మడాన్ని నిషేధిస్తూ 2018లోనే ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. దీని ప్రకారం రిటైల్ ఆహారధాన్యాల ధరను పది శాతానికి పెంచారు కానీ రైతుల ఆదాయం మాత్రం పెరగలేదు. ఫుడ్ సప్లయ్ చెయిన్ విలువను విధ్వంసం చేయడాన్ని నిరోధించడానికి స్పెయిన్ మరికాస్త ముందుకెళ్లింది. తమ ఉత్పత్తి ఖర్చును తమకు అందించేటటువంటి గ్యారంటీ ధరకోసం రైతులు ఎల్లప్పుడూ పోరాడుతూ వచ్చిన డిమాండుకు చట్ట రూపం కల్పించడం ద్వారా స్పెయిన్ ఒక మెట్టు ముందే నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నాయకత్వం సిగ్గుపడి తలదించుకునే గొప్ప నిర్ణయాన్ని స్పెయిన్ తీసుకుంది. ఇంతవరకు రైతులను పణంగా పెట్టి వినియోగదారులను, పరిశ్రమను రక్షించే విధంగా ప్రభుత్వాల చర్యలు ఉండేవి. వినియోగదారులకు, కార్పొరేట్ సంస్థలకు ఇన్నేళ్లుగా రైతులే తమ పంటలను సబ్సిడీ ధరకింద ఇస్తూవచ్చారని అర్థం. అంతవరకు అమలులో ఉన్న 2013 ఆహార సప్లయ్ చెయిన్ చట్టం పనితీరును మెరుగుపర్చేందుకు స్పెయిన్ సవరణలు చేసింది. 2020 ఫిబ్రవరి 27నుంచి ఈ సవరణ చట్టం అమలులోకి వచ్చింది. వ్యవసాయదారుడికి, ప్రాథమిక కొనుగోలుదారుకు మధ్య కుదిరిన ధర.. ఉత్పత్తి వ్యయాలకు అనుగుణంగా ఉండేలా చూడటమే ఈ సవరణ చట్టం లక్ష్యం. ఉత్పత్తి ధరను నిర్ణయించేటప్పుడు, స్పానిష్ చట్టసభ సభ్యులు బహుశా భారతీయ అనుభవం నుంచి నేర్చుకోవచ్చు. కాకపోతే ఉత్పత్తి ధర కంటే తక్కువ ధరకు అమ్ముతూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించేవారికి 3 వేల యూరోల నుంచి లక్ష యూరోల వరకు జరిమానా విధిస్తారు. కొన్ని కేసుల్లో అయితే ఇది పదిలక్షల యూరోలకు పెరగవచ్చు. ఫ్రాన్స్ గతంలోనే దీనికి సంబంధించి 75 వేల యూరోల జరిమానా విధిస్తామని ప్రకటించింది. రైతులకు ఉత్పత్తి ధరను తప్పనిసరిగా అందించాలంటే ఆహార సప్లయ్ చెయిన్ సంస్థలు తమపై పడే అదనపు ఖర్చును వినియోగదారులపై మోపవలసి వస్తుందని జర్మనీ ఆక్స్ఫామ్ సంస్థ సీనియర్ పాలసీ సలహాదారు మారిటా విగ్గెర్తేల్ చెప్పారు. ఈ కొత్త చట్టం అమలు ఇప్పుడే మొదలైనందున వినియోగదారు ధరలపై దీని ప్రభావం గురించిన విశ్లేషణలు అందుబాటులో లేవు. సూపర్ మార్కెట్లు ఆహార ఉత్పత్తులపై 30 నుంచి 40 శాతం లాభాన్ని తీసుకోవడం ఆపాలని ఫ్రాన్స్, జర్మనీ దేశాలు గతంలోనే కోరినప్పటికీ అది ఆచరణలోకి రాలేదు. ఈ పరిస్థితుల్లో స్పెయిన్ తీసుకొచ్చిన కొత్త చట్టం భారత్కు బ్రహ్మాండంగా వర్తిస్తుంది. కేంద్రప్రభుత్వ సాగు చట్టాలను రద్దు చేసి కనీస మద్దతు ధరకు చట్టరూపం కల్పించాలని భారత రైతులు పోరాడుతున్న తరుణంలో కనీస మద్దతు ధరకంటే తక్కువకు అమ్మకుండా స్పెయిన్ తరహా చట్టం నిరోధిస్తుంది. అంటే ప్రభుత్వమే ఆహార ధాన్యాలను కొనుగోలు చేయాలని అర్థం కాదు. ఇది రైతులకు చెల్లిం చాల్సిన ధరను కాస్త పెంచుతుంది. రైతులనుంచి కొనేటప్పుడు ప్రైవేట్ వర్తకులు న్యాయమైన ధరను వారికి చెల్లించేలా చూడటమే ఈ తరహా చట్టం లక్ష్యం. వాస్తవ ఆహార ధాన్యాల ధరతో రైతుల ఆదాయాలను ముడిపెట్టనంతవరకు వ్యవసాయం లాభదాయక వృత్తిగా మారాలని భావించడం నిష్ఫలమే అవుతుంది. వ్యవసాయంలో ప్రైవేట్ పెట్టుబడులు తీసుకొస్తే రైతుల ఆదాయాలు పెరుగుతాయని ఎవరు గ్యారంటీ ఇస్తారు? అలాగే నియంత్రణ లేని మార్కెట్లు రైతుల ఉత్పత్తులకు మంచి ధరను కల్పిస్తాయనడానికి కూడా వీల్లేదు. ఈ పరిస్థితుల్లో స్పెయిన్ తరహాలోనే కనీస మద్దతుధర కంటే తక్కువ ధర ప్రతిపాదించే వర్తకులపై జరిమానా విధించటం పటిష్టంగా అమలైతే, వ్యవసాయ సంక్షోభాన్ని అధిగమించి ఆర్థికంగా లాభదాయికత వైపు వ్యవసాయాన్ని దీర్ఘకాలంలోనైనా మళ్లించవచ్చు. ఈ దిశగా స్పెయిన్ తీసుకొచ్చిన కొత్త చట్టం కొత్త హామీని ఇస్తోంది. వ్యాసకర్త దేవీందర్ శర్మ , వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ :hunger55@gmail.com -
వ్యవసాయాన్ని వెనక్కినెట్టిన బడ్జెట్
నూతన చట్టాల రద్దును డిమాండ్ చేస్తూ ఢిల్లీ శివార్లలో నిరసన తెలుపుతున్న వేలాదిమంది రైతులకు, దేశ రైతాంగానికి ఈ ఏడు బడ్జెట్ మిశ్రమ సంకేతాలను పంపించింది. ఒకవైపు వ్యవసాయం, సహకారం, రైతుల సంక్షేమానికి పెట్టే వ్యయంపై 2021–22 బడ్జెట్ 8.5 శాతం కోత విధించింది. మరోవైపు ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకంపై ఈ బడ్జెట్లో 13 శాతం కోత విధించారు. రైతులకు నగదు బదిలీ చేసే ఈ పథకానికి గత ఏడాదితో పోలిస్తే 10 వేల కోట్ల రూపాయలను తగ్గించివేశారు. కౌలురైతులు, మహిళారైతులు, ఆదివాసీ రైతులు వంటి భూమి పట్టాలేని వారిని కూడా ఈ పథకంలో చేర్చాలని డిమాండ్ చేస్తుండగా ఉన్న పథకంపైనే కోత వేశారని మహిళా కిసాన్ అధికార్ మంచ్ నాయకురాలు కవితా కురుగంటి వాపోయారు. ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతులు కనీస మద్దతు ధర ద్వారా కనీస రాబడి కోసం ప్రశ్నిస్తున్న తరుణంలో వారి మనోభావాలను గౌరవిస్తూ వ్యవసాయ రాబడులను పెంచడానికి కొన్ని ఏర్పాట్లను 2021–22 బడ్జెట్లో చేరుస్తారని అందరూ భావించారు. పైగా గ్రామీణ కొనుగోలు డిమాండ్ను పెంపొందించడానికి తగుచర్యలు తీసుకోవాలని పలువురు ఆర్థికవేత్తలు కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో.. ప్రత్యక్ష నగదు మద్దతు ద్వారా, ఆందోళన చేస్తున్న రైతులు చేతిలో మరింత నగదును అందించడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాస్త ఉదారంగా వ్యవహరిస్తారని భావించారు. దీనికి బదులుగా ఈ సంవత్సరం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద కేటాయింపులను రూ. 75 వేల కోట్లనుంచి 65 వేల కోట్లకు తగ్గించేశారు. ఈ పథకం కింద భూ యజమానులకు సంవత్సరానికి మూడు వాయిదాల్లో రూ.6 వేల నగదును రైతుల ఖాతాలకు బదిలీ చేస్తున్నారు. ఈ పథకంలో ఈ సారి భూమిలేని కౌలు రైతులను కూడా చేరుస్తారని నేను ఆశించాను. గత ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల్లో వ్యవసాయం మాత్రమే దేశానికి వెలుగు చూపినందున ఒక్కొక్క రైతుకు నగదు బదిలీ కింద చెల్లించే మొత్తాన్ని ఈ యేడు రూ.18 వేలకు పెంచుతారని అందరూ భావించారు. దీనికోసం అదనంగా రూ. 1.5 లక్షల కోట్లను బడ్జెట్లో కేటాయించవలసి ఉంటుంది. అయితే వ్యవసాయ రంగానికి ప్రస్తుతం కేటాయించిన బడ్జెట్ దాదాపు గత యేడు బడ్జెట్కు సరిసమానంగానే ఉండటం గమనార్హం. గత సంవత్సరం వ్యవసాయరంగానికి సవరించిన అంచనా ప్రకారం రూ. 1.45 లక్షల కోట్లను కేటాయించగా ఈ ఏడు రూ. 1.48 లక్షల కోట్లను కేటాయించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ పరపతి పరిమితిని రూ. 15 లక్షల కోట్లనుంచి రూ. 16.5 లక్షల కోట్లకు పెంచి నప్పటికీ రైతులను రుణ ఊబి నుంచి బయటపడేసేందుకు మరికొన్ని చర్యలు చేపట్టాలని దేశంలో కొనసాగుతున్న వ్యవసాయ దుస్థితి సూచించింది. దీనికి గాను వ్యవసాయంలో ప్రభుత్వ రంగ మదుపులను పెంచాల్సి ఉంది. ఆర్బీఐ లెక్కల ప్రకారం 2011–12 నుంచి 2017–18 మధ్య కాలంలో వ్యవసాయంలో ప్రభుత్వ రంగ మదుపులు మొత్తం బడ్జెట్లో కేవలం 0.4 శాతం మాత్రమే కావడం గమనార్హం. కాబట్టి పెట్రోల్, డీజిల్పై సెస్ విధింపు ద్వారా వ్యవసాయ మదుపు నిధిని సృష్టించాలనే ఆర్థిక మంత్రి ప్రతిపాదనను స్వాగతించాల్సిందే కానీ రైలు, రోడ్డు, మూలధన మదుపు వంటివాటిపై చేసే ప్రకటనలకు మల్లే వ్యవసాయ మదుపుపై కూడా నిర్దిష్టమైన ఏర్పాట్లు చేయడం ఉత్తమమార్గంగా ఉంటుంది. వ్యవసాయరంగానికి ఇప్పుడు అత్యంత ప్రాధాన్యమైన విషయం ఏమిటంటే తగిన మార్కెటింగ్ మౌలిక వసతులను ఏర్పర్చడమే. భారత్లో వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్ కమిటీలు (ఏపీఎంసీ) క్రమబద్ధీకరించే 7 వేల మండీలు ఉంటున్నాయి. దేశంలో ప్రతి 5 కిలోమీటర్లకు ఒక మండీ చొప్పున ఏర్పర్చాలంటే ఇప్పటికిప్పుడు 42 వేల మండీలు అవసరం అవుతాయి. అయితే 22 వేల గ్రామ సంతలను మెరుగుపర్చి వాటిని ఎలక్ట్రానిక్ జాతీయ వ్యవసాయ మార్కెట్ (ఈ–నామ్)తో అనుసంధానం చేయాలనే ప్రభుత్వ వాగ్దానానికి ఇప్పటివరకు ప్రోత్సాహం లభించలేదని తెలుసుకున్నప్పుడు, గ్రామీణ మార్కెటింగ్ మౌలిక వసతులను ఏర్పాటు ఇక ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయకూడని అంశంగా మనముందుకొస్తోంది. సాగుచట్టాలకు వ్యతిరేకంగా వేలాది మంది రైతులు నిరసన ప్రదర్శనలను నెలల తరబడి కొనసాగిస్తున్న సమయంలో 2021–22 బడ్జెట్ రంగంలోకి వచ్చింది కాబట్టి ఇటీవలి సంవత్సరాల్లో గోధుమ, వరి, కాయధాన్యాలు, పత్తి వంటి పంటలకు కనీస మద్దతు ధర ఎలా అందించాము అనే విషయాన్ని ఆర్థిక మంత్రి బడ్జెట్లో ప్రస్తావిస్తూ లబ్ధిదారుల సంఖ్యను కూడా వెల్లడించారు. అయితే సంపూర్ణంగా సాగు చట్టాలను రద్దు చేయాలని పోరాడుతున్న రైతులు ప్రభుత్వం చెబుతున్న కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేసి తమ హక్కులను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే ప్రతి సంవత్సరం 23 పంట లకు గాను ప్రకటిస్తున్న కనీస మద్దతు ధరకంటే తక్కువ ధరను పెట్టి వ్యాపారం చేయడానికి వీలు ఉండదని దీనర్థం. వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులపై కనీసం 50 శాతం లాభాన్ని కనీస మద్దతు ధర అందిస్తోందని ప్రభుత్వం చెబుతున్న వివరాలను ఢిల్లీ శివార్లలో నిరసన తెలుపుతున్న రైతులు సవాలు చేశారు. స్వామినాథన్ కమిషన్ ప్రతిపాదనల ప్రకారం రైతులు పెట్టే విస్తృత ఖర్చులపై 50 శాతం లాభాన్ని కనీసమద్దతు ధర ఇవ్వాల్సి ఉంటుంది. స్వామినాథన్ కమిషన్ ప్రతిపాదించినట్లుగా రైతులకు కనీస మద్దతు ధర అంది ఉంటే 2020–21 బడ్జెట్లో అదనంగా రూ. 14,296 కోట్ల మేరకు పంజాబ్ రైతులు లబ్ధి పొందేవారు. మొత్తంమీద చూస్తే రైతుల చేతికి మరింత నగదు అందేలా చేస్తేనే ప్రధాని నరేంద్ర మోదీ చెప్పే సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అనేది సాధ్యపడుతుంది. ఇది దానికదేగా మరింత గ్రామీణ డిమాండును సృష్టిస్తుంది. ప్రాణాంతక కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థను ప్రశ్నార్థకం చేస్తున్న సమయంలో, గ్రామీణ డిమాండును సృష్టించి ఉంటే అది మొత్తం ఆర్థిక వ్యవస్థకు వరంలాగా పనిచేయడమే కాకుండా, ఆర్థికాభివృద్ధిని రాకెట్లాగా ముందుకు తీసుకెళ్లేది. ఉజ్వలంగా ప్రకాశించే వ్యవసాయ రంగం భారీ స్థాయిలో వ్యవసాయ అవకాశాలను సృష్టించడమే కాకుండా అనేక మంది జీవితాలను నిలబెట్టి ఉండేది. కాబట్టి ఒక్క వ్యవసాయ రంగమే ఆర్థిక వృద్ధికి సజీవ కేంద్రంగా మారగలిగి ఉండేది. నూతన వ్యవసాయ చట్టాల రద్దును డిమాండ్ చేస్తూ రెండున్నర నెలలకుపైగా ఢిల్లీ శివార్లలో నిరసన తెలుపుతున్న వేలాదిమంది రైతులకు, దేశ రైతాంగానికి ఈ యేడు బడ్జెట్ మిశ్రమ సంకేతాలను పంపించింది. ఒకవైపు వ్యవసాయం, సహకారం, రైతుల సంక్షేమానికి పెట్టే వ్యయంపై 2021–22 బడ్జెట్ 8.5 శాతం కోత విధించింది. మరోవైపు కేంద్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకంపై ఈ బడ్జెట్లో 13 శాతం కోత విధించారు. రైతులకు నగదు బదిలీ చేసే ఈ పథకానికి గత సంవత్సరంతో పోలిస్తే 10 వేల కోట్ల రూపాయలను తగ్గించివేశారు. మరోవైపున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన బడ్జెట్ ప్రసంగంలో రైతులకు కనీస మద్దతు ధరను చెల్లించడంలో తమ ప్రభుత్వం ఘనమైన రికార్డును కలిగి ఉందని నొక్కి చెప్పారు. అలాగే లక్ష కోట్ల మేరకు వ్యవసాయ మౌలిక వసతుల నిధిని ప్రభుత్వ నిర్వహణలోని వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలకు అందిస్తామని మంత్రి తెలిపారు. అయితే ప్రభుత్వ నూతన సాగు చట్టాలు ఇంతవరకు కొనసాగుతున్న మండీల వ్యవస్థను, కనీస మద్దతు రేట్లను కుప్పగూల్చి సన్నకారు రైతులను కార్పొరేట్ సంస్థల దయాదాక్షిణ్యాలకు వదిలేస్తాయని రైతులు భయాందోళనలకు గురైనందువల్లనే సాగు చట్టాల రద్దుకోసం పోరాడుతున్నారనే విషయం మర్చిపోరాదు. అయితే ఇటీవలి సంవత్సరాల్లో బడ్జెట్ ప్రసంగాల మాదిరి కాకుండా తాజా బడ్జెట్ ప్రసంగంలో వ్యవసాయానికి సంబంధించిన ప్రకటనలకు పెద్దగా ప్రాధాన్యత లభించకపోవడం గమనార్హం. సోమవారం బడ్జెట్ ప్రసంగం ప్రారంభించిన గంట తర్వాతే వ్యవసాయరంగానికి కేటాయింపుల గురించి ఆర్థిక మంత్రి తడిమారు. పైగా వ్యవసాయ రంగ విశ్లేషకులను తాజా బడ్జెట్ పెద్దగా ప్రభావితం చేయలేదు. పీఎమ్ ఆషా, ధరల మద్దతు పథకం వంటి పథకాలకు ఈ ఏడు బడ్జెట్లో 20 నుంచి 25 శాతం దాకా కోత విధించారు. రైతులకు ఏటా తలసరి 6 వేల రూపాయలను అందిస్తున్న పీఎమ్ కిసాన్ పథకాన్ని ఈసారి 9 కోట్లమంది రైతులకే పరిమితం చేస్తూ సవరించారు. ప్రభుత్వం వాస్తవానికి 14.5 కోట్ల రైతు కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించుకుంది ఇది కూడా కోత పడటం రైతులు జీర్ణింప చేసుకోలేకున్నారు. కౌలురైతులు, మహిళారైతులు, ఆదివాసీ రైతులు వంటి భూమి పట్టాలేని వారిని కూడా ఈ పథకంలో చేర్చాలని మేం డిమాండ్ చేస్తుండగా ఉన్న పథకంపైనే కోత వేశారని మహిళా కిసాన్ అధికార్ మంచ్ నాయకురాలు కవితా కురుగంటి వాపోయారు. మౌలిక వసతుల నిధి పేరుతో ప్రకటించిన భారీ మొత్తాలు వాస్తవానికి బడ్జెట్ కేటాయింపుల్లో భాగం కాదని వీటిని రుణాల రూపంలో తీసుకోవలసిన ఫైనాన్స్ ప్రాజెక్టులని రైతులకు వీటితో ఒరిగేదేమీ లేదని రైతునేతలు చెబుతున్నారు. ఈ కోణంలో చూస్తే ఈ ఏటి బడ్జెట్ కూడా రైతాంగాన్ని సంతృప్తిపర్చే బడ్జెట్గా కనిపించడం లేదనే చెప్పాలి. దేవీందర్ శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
అన్నదాతలకు ‘అమూల్’ ఫార్ములా భేష్
దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న రైతు ఉద్యమాలకు మూలం ఎక్కడుందో పాలకులు గ్రహించాలి. రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర కాదు కదా.. నామమాత్రపు ధర కూడా రావడం లేదు. ఇందుకు టమాటా, బెండ, ఉల్లి రైతులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలే ఉదాహరణ. మన కళ్లముందే అత్యద్భుతమైన అమూల్ డైరీ సహకార వ్యవస్థ ఉండగా, సాగు దిగుబడులకు సైతం అలాంటి సహకార వ్యవస్థను ఎందుకు వర్తింప చేయకూడదు? అమూల్ డైరీ సహకార వ్యవస్థలో వినియోగదారులు పాలపై వెచ్చించే ప్రతి రూపాయిలో 70 నుంచి 80 పైసల వరకు రైతుల చేతికి వస్తుంది. భారతదేశం విజయవంతమైన తన సహకార డైరీల బ్రాండ్ నుంచి పాఠం నేర్చుకోకూడదా? వినియోగదారు చెల్లించే ధరల్లో 40 నుంచి 50 శాతం రైతుకి దక్కేలా విధానాలు రూపొందించకూడదా? ఈ వార్త ఇప్పుడు ఎవరికీ షాక్ కలిగించకపోవచ్చు. బెండకాయలను మార్కెట్లో వినియోగదారులు కిలోకు రూ. 40లు వెచ్చిస్తున్న సమయంలో మధ్యప్రదేశ్లోని బద్వానీలో బెండకాయల హోల్సేల్ ధర కిలోకి ఒక్కరూపాయికు పడిపోయింది. దీంతో కడుపు మండిన రైతు నాలుగు ఎకరాల్లో పండించిన పంటను ట్రాక్టర్ను ఉపయోగించి దున్నించేశాడు. బెండకాయ ధరలు ఇంత తక్కువకు పడిపోవడం చూసిన ఈ జిల్లాలోని మరికొందరు రైతులు తమ భూమిలో పండిం చిన పంటను పశువులకు వదిలేశారు. మధ్యప్రదేశ్ మాత్రమే కాదు, కూరగాయల అమ్మకాలు ఇలా పతనం కావడం అనేది దేశవ్యాప్తంగా కొనసాగుతుండటం విషాదకరం. ఇప్పుడు పంజాబ్లో చెరకు రైతుల దుస్థితిని పరిశీలిద్దాం. చెరకు కోత సీజన్ ప్రారంభమవుతున్న సమయానికి కూడా రాష్ట్రంలోని 16 చెరకు మిల్లులలో 14 (సహకార, ప్రైవేట్ రంగాలకు చెందిన వాటిలో) మిల్లులు గత సంవత్సరం చెరకు కోతకుగాను చెల్లించాల్సిన 250 కోట్ల రూపాయల బకాయిని ఇప్పటికీ చెల్లించలేదన్న విషయం బయట పడింది. ఒక్క పంజాబ్ మాత్రమే మినహాయింపు కాదు. సెప్టెంబర్ 11 నాటికి దేశవ్యాప్తంగా చెల్లించని చెరకు కోత బకాయిలు రూ. 15,683 కోట్లకు చేరుకున్నాయని, దీంట్లో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని పార్లమెంటులో ఇటీవల ఒక సభ్యుడు వేసిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానమిచ్చింది. తమ బకాయిలను చెరకు మిల్లులు ఒకటి రెండు సంవత్సరాలు సకాలంలో చెల్లించకపోయినప్పటికీ చెరకు రైతులు ఎలాగోలా జీవించగలిగారు. ఉద్యోగుల వేతనం ఒక్క నెల ఆలస్యం అయిందంటే చాలు ఎంత గగ్గోలు మొదలవుతుందో ఎవరైనా ఊహించుకోవలసిందే. ఈ వార్తల్లో అసాధారణమైన విషయం ఏముందని మీరు ప్రశ్నిం చవచ్చు. ఇది సర్వసాధారణంగా జరిగే వ్యవహారమే కదా. పంటలకు గిట్టుబాటుధరలు రాకపోవడంతో ఆగ్రహించిన రైతన్నలు వీధుల్లోనే టమాటాలను, బంగాళదుంపలను, ఉల్లిపాయలను పారబోస్తున్న దృశ్యాలు మీడియాలో నిత్యం కనిపిస్తూనే ఉంటాయి. 2018–19 బడ్జెట్ ప్రసంగంలో కేంద్రప్రభుత్వం రూ. 500 కోట్లతో ఆపరేషన్ గ్రీన్స్ పథకాన్ని ప్రారంభించిన తర్వాత కూడా ఇలాంటి పరిణామాలను దేశం చూసింది. సగటు కుటుంబం తీసుకునే కూరగాయల్లో ఈ మూడింటికి అగ్రభాగం ఉంటుంది. టమాటా, ఉల్లిపాయ, బంగాళదుంపల ధరను స్థిరీకరించడమే ఆపరేషన్ గ్రీన్స్ పథకం లక్ష్యం. అనేక కారణాల వల్ల ఈ పథకం ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదు. అయితే మూడింటికి మాత్రమే పరిమితమైన ఈ పథకాన్ని ఈ జూన్ నుంచి ఆరునెలల కాలానికి అన్ని కూరగాయలు, పండ్ల ఉత్పత్తులకు వర్తిస్తూ పొడిగించారు. ఈ ప్రకటనలతో పనిలేకుండానే, ఆయా సీజన్లలో పండే కూరగాయల ధరలు ఎప్పుడూ పతనదిశలోనే ఉంటాయి. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా స్థానిక వాల్యూ చైన్కు అంతరాయం కలగక ముందే, కూరగాయలు పండించే రైతులు ధరల విషయంలో పదేపదే దెబ్బతింటూ వచ్చారు. తృణధాన్యాలకు, ఇతర ప్రధాన పంటలకు కనీస మద్దతు ధర ఉన్నట్లుగా కూరగాయలకు మద్దతు ధర అనేది లేకపోవడంతో తమ కూరగాయలకు మార్కెట్లో లభిస్తున్న రేటు నిజమైనదా కాదా అని తెలుసుకోలేని పరిస్థితుల్లో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. కూరగాయలు పండించడానికి, కోయడానికి, రవాణా చార్జీలకు అయిన ఖర్చులను తీసివేయగా రైతులు ఉత్తిచేతులతో మార్కెట్ నుంచి వెనుదిరగాల్సిన సందర్భాలు అనేకసార్లు వారికి అనుభవంలోకి వచ్చాయి. నిజానికి, రైతులు కూరగాయలను పండిస్తున్నప్పుడు, తాము పంటపై లాభాన్ని కాకుండా నష్టాలను పండిస్తున్నామన్న విషయం వారికి అవగాహనలో ఉండటం లేదు. 2000–2016 కాలానికి ఓఈసీడీ–ఐసీఆర్ఐఈఆర్ సంయుక్త అధ్యయనం ప్రకారం, పండించిన పంటలకు తగిన గిట్టుబాటు ధరను తమకు కల్పించనందుకు గానూ భారతీయ రైతులు ప్రతి ఏటా రూ.2.64 లక్షల కోట్లను నష్టపోతున్నారని తేలింది. అయితే ఈ అధ్యయనం పేర్కొన్న నష్టాలు చాలా తక్కువ అనే చెప్పాలి. ఎందుకంటే తమ అధ్యయనంలో భాగంగా వీరు చాలా తక్కువ పంటలను మాత్రమే పరిశీలించారు. ఈ స్వల్ప స్థాయి అధ్యయనం సైతం.. ప్రతి ఏటా మన రైతులకు చివరికి ఏం మిగులుతోంది అనే అంశంపై దారుణ సత్యాలను వెల్లడించింది. రైతులు పండించే పంటలకు నిర్ణీత ధర చెల్లిస్తామన్న హామీ లేకుండా, పంటల తీరును వైవిధ్యభరితంగా మార్చాలన్న ఆలోచన అర్థరహితం మాత్రమే. అందుకనే పంజాబ్ రైతులను గోధుమ, వరి పంట నుంచి మళ్లించి పంటల వైవిధ్యత వైపు మళ్లించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటన్నింటినీ ఆ రైతులు వమ్ము చేస్తూనే వచ్చారు. తృణధాన్యాలు, కాయ ధాన్యాలు, నూనె గింజలు, మొక్క జొన్న వంటి పంటలను పండించడం చాలా అవసరం అనే విషయాన్ని తోసిపుచ్చాల్సిన పని లేదు కానీ, తాము పండించే పంటలకు కచ్చితమైన ధర, సమర్థవంతమైన సేకరణ వ్యవస్థను ఏర్పర్చకుండా, మార్కెట్ శక్తుల ప్రభావానికి తమను బలిచేసే వైవిధ్యపూరితమైన పంటల వైపు రైతులు మారిపోతారని ఎలా భావించాలి? దశాబ్దాలుగా రైతులు న్యాయమైన ధరలకోసం పోరాడాల్సి వస్తున్న పరిస్థితుల్లో తమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా రూపొందించిన ఆర్థిక నమూనా భారాన్ని నిశ్శబ్దంగా మోయాల్సి వస్తోంది. మరోవైపు పారిశ్రామిక అనుకూల దృక్పథాన్ని దాటి రైతుల వైపు చూడటంలో మన ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తలు విఫలమవుతున్నారు. దశాబ్దాలుగా వ్యవసాయంలో మార్కెట్ సంస్కరణలు అమల్లో ఉన్న అమెరికాలో సైతం చిన్న సన్నకారు రైతులు కుప్పగూలిపోయారు. అమెరికా వ్యవసాయం శ్రేష్టమైనదని భావిస్తుంటారు. వారి వ్యవసాయం జాతీయ, అంతర్జాతీయ వాల్యూ చైన్లలో భాగంగా ఉంటుంది కాబట్టి రైతులకు అది సంపదలను కొనితెస్తుందని భావి స్తుంటారు. కానీ వాస్తవికత మాత్రం పూర్తి భిన్నంగా ఉంటోంది. అమెరికా వ్యవసాయ విభాగం చెబుతున్న దానిప్రకారం వినియోగదారులు ఆహార పదార్థాలకోసం పెట్టే ప్రతి డాలర్ వ్యయంలో 8 శాతం మాత్రమే రైతులకు దక్కుతోందని తెలుస్తోంది. పైగా బడా రిటైల్ వ్యాపార సంస్థలు ఉనికిలోకి రావడంతో రైతుల వాటా మరింత క్షీణించిపోయింది. దీన్ని అమూల్ డైరీ సహకార వ్యవస్థతో పోల్చి చూడండి. అమూల్ పాల వినియోగదారులు పాలకోసం వెచ్చించే ప్రతి రూపాయిలో 70 నుంచి 80 శాతం వరకు రైతులకు అందుతోంది. మరి వ్యవసాయ సరకులకు కూడా ఈ దేశీయ డైరీ సహకార సంస్థ నమూనాను విస్తరింపచేస్తే ఉత్తమంగా ఉండదా? అమెరికా వ్యవసాయంలో బడా వ్యాపారులు అడుగు పెట్టడం అనేది అక్కడ చిన్న రైతులకు ఎలాంటి మేలూ కలిగించకపోగా వారిని వ్యవసాయంనుంచే పక్కకు నెట్టేశారు. మరి భారత దేశం తన సొంత విజయవంతమైన సహకార డైరీ వ్యవస్థల నుంచి పాఠం నేర్చుకోకూడదా? ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపై వినియోగదారులు వెచ్చించే ప్రతి రూపాయలో (పాల విషయంలో 80 శాతం వాటా రైతులకే దక్కుతోంది) కనీసం 40 నుంచి 50 శాతం వరకైనా రైతు పరమయ్యే విధంగా సరికొత్త ఆర్థిక నమూనాలను తీసుకురావడంపై మన విధాన నిర్ణేతలు ఆలోచించకూడదా? వ్యవసాయ ధరలను క్షీణింప చేయడం ద్వారా వ్యవసాయంపై నిరంతరం భారం మోపుతూ ఆర్థిక సంస్కరణలు చేస్తున్న అన్యాయానికి వ్యతిరేకంగానే రైతులు న్యూఢిల్లీ వరకు మార్చ్ చేస్తున్నారు. శీతల వాతావరణంలో పోలీసులు తమపై ప్రయోగిస్తున్న వాటర్ కానన్లను సైతం లెక్క చేయని రైతులు తమ జీవితాలపై పేరుకున్న సుదీర్ఘ శీతాకాలానికి ముగింపు పలకాలని చూస్తున్నారు. ఆర్థిక సంస్కరణలను చెల్లుబాటయ్యేలా చూడటానికి ఎంతకాలమిలా వ్యవసాయరంగాన్ని దారిద్య్రంలో ముంచెత్తుతూ ఉంటారు? వ్యవసాయదారులకు కూడా కుటుంబాలు ఉంటాయి. కుటుంబాలను, పిల్లలను పోషించాల్సిన బాధ్యత ఉంటుంది. వేరు మార్గం లేక పండిం చిన పంటలను వీధుల్లోనే పారబోసే గతి పట్టకుండా తమను కాపాడే ఒక సమర్థ యంత్రాం గాన్ని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటిది అమలైనప్పుడు దశాబ్దాలుగా వ్యవసాయ వ్యాపారం ద్వారా కలుగుతున్న దుస్థితి నుంచి బయటపడగలమని వీరి నమ్మకం. అందుకనే రైతు అనుకూల విధానాలను రూపొందించడంలో కొనసాగుతున్న కరువుకు ముగింపు పలకాల్సిన అవసరం ఉంది. చారిత్రకంగా రైతులకు జరుగుతూ వస్తున్న అన్యాయాన్ని సరిదిద్దేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఢిల్లీలో రైతు మార్చ్ చెబుతోంది. అప్పుడు మాత్రమే వ్యవసాయం గర్వకారణంగా ఉండే పరిస్థితి మళ్లీ నెలకొంటుంది. వ్యాసకర్త: దేవీందర్ శర్మ, వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
మార్కెట్ మాయలో రైతే పరాజితుడు
ప్రపంచంలో వ్యవసాయాన్ని మార్కెట్ల పాలు చేసిన ప్రతి చోటా ఆహారధాన్యాలపై నియంత్రణ నుంచి మెజారిటీ రైతాంగాన్ని బడా పెట్టుబడి విజయవంతంగా పక్కకు నెట్టేసింది. అమెరికా, యూరప్ అనుభవాలు చూపుతున్నట్లుగా, అనియంత్రిత మార్కెట్లకు మనదేశంలోనూ ప్రాధాన్యత లభిస్తున్న తరుణంలో వ్యవసాయం నుంచి మొట్టమొదటగా సన్నకారు రైతులనే పక్కకు తోసేస్తారు. దేశంలోని 86 శాతం మంది రైతుల చేతుల్లో అయిదు ఎకరాల కంటే తక్కువ కమతాలు ఉంటున్నందున, ఇంకా పెద్దగా ఎదగండి లేదా బయటకు వెళ్లండి అనే సందేశం అమలయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంకా ఎదగండి లేకపోతే పక్కకు తప్పకోండి అనే మార్కెట్ సూత్రం చిన్న రైతులను కనుమరుగు చేయనుందని అనిపిస్తోంది. అందుకే మార్కెట్లో తొలి పరాజితుడు రైతే అని చెప్పాలి. రొనాల్డ్ రీగన్ హయాంలో అమెరికా వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎర్ల్ బట్జ్ ఒక సందర్భంలో ‘పెద్దగా ఎదగండి లేదా నిష్క్రమించండి’ అనే పిలుపునిచ్చారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవసాయ కార్యదర్శి కూడా ఇటీవల ఇలాంటి అభిప్రాయమే వ్యక్తపరుస్తూ, ‘అమెరికాలో సంపన్నులు మరింత సంపన్నులవుతారు, సామాన్యులు పక్కకు తప్పుకుంటారు. అమెరికాలో ఏ చిన్న పరిశ్రమకైనా గ్యారంటీ కల్పించిన ఆదాయం కానీ లాభం కానీ ఉంటుందని నేను అనుకోవడం లేదు’ అని చెప్పారు. ప్రపంచంలో వ్యవసాయాన్ని మార్కెట్ల పాలు చేసిన ప్రతి చోటా ఆహారధాన్యాలపై నియంత్రణ విషయంలో రైతాంగ జనాభాలోని మెజారిటీని బడా పెట్టుబడి విజయవంతంగా పక్కకు నెట్టేసింది. తమదైన తర్కం, విలువలతో మార్కెట్లు అలాగే స్పందిస్తుంటాయి. ఈ క్రమంలోనే బడా వ్యవసాయ క్షేత్రాలు మరిం తగా విస్తరిస్తుండగా, చిన్న వ్యవసాయ క్షేత్రాలు మనుగడ కోసం కొట్టుమిట్టాడుతున్నాయి. అమెరికాలో వ్యవసాయరంగంలో దశాబ్దాల పాటు మార్కెట్ సంస్కరణలు అమలుచేసిన తర్వాత, జనాభాలోని 1.5 శాతం మాత్రమే వ్యవసాయంలో మనగలుగుతున్నాయి. వచ్చే పదేళ్లకుగాను వ్యవసాయానికీ, పోషకాహారానికీ, జలపరిరక్షణ పథకాలకు 867 బిలియన్ డాలర్ల మద్దతును వ్యవసాయ బిల్లు 2018 ప్రతిపాదించింది. అయితే పెరుగుతున్న ఆత్మహత్యల రేటు, గ్రామీణ ప్రాంతాల్లో ఆందోళన కలిగిస్తున్న కుంగుబాటు ధోరణులు, పాలు, వ్యవసాయ సరుకుల ధరల పతనం, వ్యవసాయరంగంలో పెరుగుతున్న దివాలా (425 బిలియన్ డాలర్లు అని అంచనా) వంటివి ఈ పరివర్తనా దిశలో కుటుంబ క్షేత్రాల మనుగడను కష్టసాధ్యం చేస్తున్నాయి. అమెరికా నగరాలతో పోల్చి చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఆత్మహత్యల రేటు 45 శాతం అధికంగా ఉంటున్నాయి. తక్కువ ధరలు, పెరుగుతున్న ఆత్మహత్యల రేటు వంటి వాటి కారణంగా గ్రామీణ జనాభాలో అధికభాగం తీవ్ర ఒత్తిడికి, కుంగుబాటుకు గురవుతున్నారు. అమెరికాలో జరిగింది అసాధారణమైనది కాదు. నిజానికి ఇది ఒక అంతర్జాతీయ వ్యవసాయ చట్రంగా పరిణమించింది. ప్రపంచవ్యాప్తంగా ఆహారధాన్యాల సరఫరా సంస్థలపై వ్యవసాయ వాణిజ్య సంస్థలు పైచేయి సాధిస్తున్నాయి కానీ నిజానికి వాటి బలం అవి అందుకుంటున్న భారీ సబ్సిడీలపై అధారపడుతున్నాయి. యూరప్లో, వార్షిక సబ్సిడీ మద్దతు 100 బిలియన డాలర్ల వరకు ఉంటున్నప్పటికీ వ్యవసాయం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. పైగా ఈ మొత్తంలో 50 శాతం మేరకు ప్రత్యక్ష నగదు మద్దతు కింద ఇస్తున్నారు. తగ్గుతున్న ధరలు, పెరుగుతున్న అప్పులు క్రమేణా చిన్న రైతులను వ్యాపారం నుంచి తొలగిస్తూ వస్తున్నాయి. ఒక్క బ్రిటన్లోనే గత నాలుగేళ్లలో మూడు వేల డెయిరీ ఫాంలు మూసివేతకు గురయ్యాయి. ఫ్రాన్స్లో సంవత్సరానికి సగటున 500 మంది రైతులు అత్మహత్యలు చేసుకుంటున్నారని ఒక నివేదిక తెల్పింది. ఈ గణాంకాలను భారతదేశంతో పోల్చి చూడండి. జాతీయ నేర నమోదు బ్యూరో గణాంకాల (ఎన్ఎస్ఎస్ఓ) ప్రకారమే గత 25 ఏళ్లలో దేశంలో 3.64 లక్షలమంది రైతులు అధికారికంగానే ప్రాణాలు కోల్పోయారు. ఇక శాంత కుమార్ కమిటీ నివేదిక ప్రకారం ఈ అన్ని సంవత్సరాల్లో 94 శాతం మంది రైతులు మార్కెట్లపైనే ఆధారపడి ఉంటున్నప్పటికీ భారతీయ వ్యవసాయం ఇప్పటికీ భయంకరమైన వ్యవసాయ దుస్థితి కోరల్లోనే చిక్కుకుపోయిందని తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఖరీఫ్ మార్కెట్ సీజన్లో 54 నుంచి 84 శాతం మంది రైతులు తమ పంటలను మండీలకు అవతల ఉన్న ప్రైవేట్ వ్యాపారులకే అమ్మారని 2014–15 నాటి ఎన్ఎస్ఎస్ఓ నివేదిక తెలిపింది. మరో మాటలో చెప్పాలంటే రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్చ కలిగి ఉన్నారన్నమాట. వారు మండీల కోరల్లో చిక్కుకోలేదన్నమాట. మరి మార్కెట్లు అంత సమర్ధవంతంగా పనిచేస్తున్నట్లయితే రైతులు వ్యవసాయాన్ని వదిలిపెట్టి ఎందుకు వలస పోతున్నారన్న ప్రశ్న తప్పకుండా వేయాల్సి ఉంది. మార్కెట్లు అంత ప్రోత్సాహకరంగా ఉంటే, వ్యవసాయం దేశ ఆర్థిక చోదక శక్తిగా ఎందుకు ఉండటంలేదో ఏ తర్కానికీ అందదు. మార్కెట్లు ఇప్పుడు గుండెకు ఆపరేషన్ చేసుకుని కొత్త రూపం ఎత్తిన చందాన రైతులకు అధిక ధరలను వాగ్దానం చేస్తున్నాయంటే నాకయితే నమ్మశక్యం కావడం లేదు. కానీ మార్కెట్లు ఎక్కడైనా ఇలాగే పనిచేస్తాయి. పరిశ్రమలకు చౌక శ్రమను అందించడానికి మార్కెట్లు నిత్యం రైతులను వ్యవసాయ రంగం నుంచి బయటకు నెట్టేస్తుంటాయి. ఈ క్రమంలో పెద్ద రైతులు మరింతగా బలుస్తుంటారు, సన్నకారు రైతులు వ్యవసాయానికి దూరమవుతుంటారు. వాషింగ్టన్ ఆధారిత అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ కనుగొన్న దాని ప్రకారం భారతదేశలోనూ పైకి ఎగబాకు లేదా వెళ్లిపో అనే సూత్రమే పనిచేస్తోందని తెలిసింది. అనేక దశాబ్దాలుగా భారత్లోని ప్రధానస్రవంతి ఆర్థికవేత్తలు ఇదే ప్రాతిపదికపై వాదనలు చేస్తూ వస్తున్నారని మర్చిపోకూడదు. మార్కెట్ అనుకూల వ్యవసాయం వైపుగా తరలిపోవలసిన అవసరం గురించి అనేక కమిటీలూ, నివేదికలు చెబుతూ వస్తున్నాయి. వ్యవసాయానికి వాస్తవ ధర రాకపోవడానికి కారణం కనీస మద్దతు ధరేనంటూ ఆందరూ ఆడిపోసుకోవడం అలవాటుగా మారిపోయింది. పంజాబ్, హర్యానాలలో మండీలను క్రమబద్ధీకరిస్తున్న వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీల యంత్రాంగాన్ని రద్దు చేయాలన్నదే వీరందరి ఏకాభిప్రాయం. ఈ వాదనను బలపర్చడానికి, వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ (సీఏసీపీ) సైతం మార్కెట్–అనుకూల విధానాలను కలిగిన రాష్ట్రాలకు ర్యాంకులిస్తూ ముందుకొచ్చింది. ఈ జాబితాలో బిహార్ మొదటి ర్యాంకులో ఉండగా పంజాబ్ చిట్టచివరి స్థానంలో నిల బడటం గమనార్హం. పంజాబ్ ఎందుకు అట్టడుగు స్థానంలో ఉందంటే ఆ రాష్ట్రంలో పండిస్తున్న గోధుమలు, వరిలో 87 శాతం వరకు భారత ఆహార సంస్థ లేక ప్రభుత్వ రంగ సంస్థలు కనీస మద్దతు ధర ప్రకటించి మరీ సేకరిస్తుండటమే. అదే బిహార్లో అయితే మొత్తం పంటలో ఒక్కటంటే ఒక్క శాతం గోధుమ పంటను మాత్రమే భారత ఆహార సంస్థ సేకరిస్తోంది. ఇదే మార్కెట్ అనుకూల వ్యవసాయం అయితే, దీంట్లో ఏం మంచి ఉందో ఆర్థిక వేత్తలే వివరించి చెప్పాలి. భారతదేశ ధాన్యాగారంగా పేరొందిన పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లోని రైతులు ప్రతి ఏటా మద్దతుధర పేరిట రూ. 80 వేల కోట్లను అందుకుంటున్నారు. నాకు గుర్తున్నంతవరకు, కొన్ని సందర్భాల్లో మినహాయిస్తే బహిరంగ మార్కెట్లలో కనీస మద్దతు ధరకు మించి రైతులు అధిక ధరను పొందిన పాపాన పోలేదు. సేకరించిన ధాన్యంలో గోధుమ, వరికి ప్రకటించే కనీస మద్ధతు ధరకంటే మార్కెట్ ధరలు ఎప్పుడూ తక్కువగానే ఉంటాయి. ప్రతి సంవత్సరం ప్రభుత్వం మద్దతుధరను ప్రకటించే 23 రకాల పంటలకు సంబంధించి బహిరంగ మార్కెట్ ధరలు సాధారణంగా తక్కువగానే ఉంటాయి. ఈ కారణం వల్లే వ్యవసాయం తీవ్ర సంక్షోభాన్ని కొనసాగిస్తోంది. రైతుకు కనీస మద్దతు ధర ద్వారానే చాలావరకు వాస్తవ ధర లభిస్తుంది. కాబట్టే రైతులకు కనీస మద్దతు ధరను అందించడం వారి న్యాయబద్ధమైన హక్కుగా ఉండాలి. కనీస మద్దతు ధరకంటే తక్కువగా మార్కెట్ ధరలు కొనసాగే పరిస్థితి చోటు చేసుకోకూడదు. గోధుమ, వరి మాత్రమే కాదు.. కనీస మద్దతు ధర ప్రకటించిన 23 పంటలకూ ఇది వర్తించాలి. కనీస మద్దతు ధర, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీలకు చెందిన మార్కెట్ల జోలికి కొత్త మార్కెటింగ్ సస్కరణలు వెళ్లవని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఏపీఎమ్సీ మండీలు క్రమంగా ప్రాధాన్యత కోల్పోతాయని రైతులు భయపడుతున్నారు. ఏపీఎమ్సీ మార్కెట్లు పతన బాట పడుతుండటంతో, కొత్తగా తీసుకువస్తున్న వ్యవసాయ సంస్కరణలు వ్యవసాయంలో కార్పొరేటీకరణను ప్రోత్సహించేలా రూపొందాయి. దీంతో బడా వాణిజ్య సంస్థలు వ్యవసాయంలోకి అడుగుపెట్టి స్టోరేజ్, మార్కెట్లను కైవసం చేసుకుంటాయి. అమెరికా, యూరప్ దేశాల అనుభవవాలు చూపుతున్నట్లుగా, అనియంత్రిత మార్కెట్లకు ప్రాధాన్యత లభిస్తున్న తరుణంలో వ్యవసాయం నుంచి మొట్టమొదటగా సన్నకారు రైతులనే పక్కకు తోసేస్తారు. దేశంలోని 86 శాతం మంది రైతుల చేతుల్లో 5 ఎకరాల కంటే తక్కువ కమతాలు ఉంటున్నందున, ఇంకా పెద్దగా ఎదగండి లేదా బయటకు వెళ్లండి అనే సందేశం అమలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దేవీందర్ శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
రైతు కేంద్రక విధానం ఎక్కడ?
కార్పొరేట్ మొండి బకాయిలను మాఫీ చేస్తే ఆర్థిక ప్రగతికి అది ఎలా దోహదపడుతుందో, రైతుల రుణమాఫీలను రద్దు చేస్తే అది జాతీయ చెల్లింపుల సమతూకానికి ఎలా తూట్లు పొడుస్తుందో వివరించి చెప్పేవారే లేరు. కంపెనీలు అధిక వేతనాలు చెల్లించకుండా తప్పించుకోవడానికి వీలు కలిగిస్తూ గ్రామాలనుంచి పట్టణాలకు శ్రామిక శక్తిని భారీస్థాయిలో తరలించడం అనే కాలం చెల్లిన ఆర్థిక థియరీని దేశదేశాలు గుడ్డిగా ఎందుకు ఇంకా పాటిస్తున్నాయి? మన దేశంలో సంపన్నులకు సోషలిజం అమలుచేస్తూ పేదలను మాత్రం మార్కెట్ భూతాల కోరల్లో పడవేస్తున్న విధానాలను మన పాలకులు ఎందుకు కొనసాగిస్తున్నారు? మన ఆర్థిక చింతనలో కనిపిస్తున్న ఈ పాక్షికత ఇకనైనా మారవలసి ఉంది. అమెరికా కార్మికశాఖ మాజీ మంత్రి రాబర్ట్ రీచ్ రెండు రోజుల క్రితం ట్వీట్ చేస్తూ, అమెరికాలో ఒక్క శాతం సంపన్నులు దేశం స్టాక్ మార్కెట్ విలువలో సగం వాటాను సొంతం చేసుకున్నారని, అలాగే దేశంలోని 10 శాతం మంది సంపన్నులు 90 శాతం స్టాక్ విలువలను చేజిక్కించుకున్నారని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ అంటే స్టాక్ మార్కెట్టేనని ట్రంప్ పేర్కొన్నప్పుడు వాస్తవానికి ఆయన ఎవరి గురించి మాట్లాడారో అందరికీ తెలిసిపోయింది. అయితే స్టాక్ మార్కెట్ విజృంభించడం అనేది ఆర్థిక వ్యవస్థ స్థితిగతులకు ప్రతిబింబం అని నమ్మే దేశాధినేతల్లో ట్రంప్ మొదటివాడూ కాదు.. చివరివాడూ కాదు. అలా విశ్వసించే వారి జాబితా చాలానే ఉంటుంది. అందుకే ఈ భావాన్ని మన మనస్సుల్లోకి ఇంకించడంలో క్రెడిట్ రేటింగ్ సంస్థలు ఎంతగా విజయవంతమయ్యాయో ఇది సమర్థవంతంగా చూపిస్తోంది. భారత ఆర్థిక మంత్రి వార్షిక బడ్జెట్ను సమర్ఫించిన రోజు అందరికళ్లూ స్టాక్ మార్కెట్లవైపు పడ్డాయి. కనీవినీ ఎరుగని రీతిలో దేశీయ డిమాండ్ పతమైపోయినప్పుడు దాన్ని పునరుద్ధరించడానికి నిర్మలా సీతారామన్ గత సెప్టెంబర్లో వరుసగా ఉద్దీపన చర్యలు ప్రకటించినప్పుడు ఆమె పరిశ్రమకు రూ. 1.45 లక్షల కోట్ల మొత్తాన్ని పన్ను రాయితీ రూపంలో ప్రకటించారు. అలాగే కార్పొరేట్ వర్గాలపై కీలకమైన పన్ను రేటును 22 శాతానికి కుదించారు. ఆ మరుసటి దినం దీనికి స్పందనగా స్టాక్ మార్కెట్లు పండుగ చేసుకున్నాయి. గత పదే ళ్లలో ఎన్నడూ ఎరుగని విధంగా షేర్లు 5 శాతానికి పెరిగాయి. అయితే ఈ మొత్తంలో కొంత భాగాన్ని పేదల చేతుల్లో పెడుతూ కేటాయిం పులు చేసి ఉంటే స్టాక్ మార్కెట్ స్తబ్దంగా ఉండిపోయేది కానీ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింప జేయడం ద్వారా దేశంలో మరింత డిమాం డును సృష్టించి ఉండేది. ఇప్పుడు సైతం, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలను కరోనా వైరస్ కుళ్లబొడుస్తున్న సమయంలోనూ స్టాక్ మార్కెట్లు ఉరుకులు పెడుతున్నాయి. ఈ పరిణామంపై ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత పాల్ క్రూగ్మన్ స్పందిస్తూ ఘోరమైనది ఏదో జరుగబోతోందని వ్యాఖ్యానించారు. కరోనా విజృంభించిన మార్చి 18 నుంచి జూన్ 17 మధ్య కాలంలో 614 మంది అమెరికన్ బిలియనీర్ల సంపద 584 బిలియన్ డాలర్లకు పెరగడమే దీనికి సాక్ష్యం. ఇదే కాలంలో 4 కోట్ల 55 లక్షలమంది అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయి నిరుద్యోగుల క్యూలో నిలుచున్నారు. అమెరికాలో పోగుపడిన సంపదలో చాలా భాగం వాల్స్ట్రీట్కి సంబంధించినది కాగా, ఆర్థికపరమైన బెయిలవుట్లు, ఉద్దీపన ప్యాకేజీలు వంటివి సంపన్నుల జేబుల్లోకి మరింత డబ్బును నింపడానికే పరిమితమయ్యాయి. పైగా, పరిణామాత్మకమైన సరళీకరణ పేరిట అదనపు డబ్బును మరింతగా ముద్రించడం కీలకస్థానం సాధించింది. ఫిచ్ రేటింగ్స్ సంస్థ ప్రకారం ప్రపంచ పరిణామాత్మక సరళీకరణలోభాగంగా ఆస్తుల కొనుగోళ్లు 2020 చివరినాటికి 6 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంటాయని అంచనా. ఆర్థిక, ప్రాపర్టీ మార్కెట్లను పెంచి పోషించడం ద్వారా సంపన్నులు మరింత సంపన్నులుగా మారడానికే తోడ్పడవచ్చు. కానీ మన దేశంలోని విశ్వవిద్యాలయాలు ఈ పరిణామాత్మకమైన సరళీకరణను ప్రజలకోసం రూపొందించడాన్ని నేను అస్సలు చూడలేదు. మన ఆర్థిక ప్రణాళికలో ప్రజాకేంద్రక సరళీకరణను చేర్చడంలో వైఫల్యం ఎందుకు సంభవించిందో, మీడియా డిబేట్లలో ఇది ఎందుకు చర్చనీయాంశంగా కాలేకపోయిందో నాకయితే ఆర్థం కావడం లేదు. భారతదేశంలో కార్పొరేట్ పన్ను శ్లాబ్ రేటును అత్యల్పంగా 15 శాతానికి కుదించుకోవడం ద్వారా రూ.2.50 లక్షల కోట్లను పన్ను రూపంలో మినహాయింపు పొందాలని పరిశ్రమ వర్గాలు లాబీ చేస్తున్నాయి. వచ్చే 10 సంవత్సరాల్లో ప్రపంచంలోని ఒక శాతం సంపన్నులు సంవత్సరానికి కేవలం 0.5 శాతం అదనపు పన్నును చెల్లించడానికి సిద్ధపడితే అది 11 కోట్ల 70 లక్షల సంఖ్యలో కొత్త ఉద్యోగాలను సృష్టించగలదని ఆక్స్ఫామ్ అధ్యయనం తెలిపింది. ఆర్థిక కోణంలో దీన్ని మనం చూడగలిగినట్లయితే ఇది అద్భుతాలు సృష్టించగలదని మనకు బోధపడుతుంది. ఉపాధి కల్పన, తగు సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేవి అంతిమంగా ప్రగతిని ముందుకు నడిపిస్తాయని యూఎన్సీఎస్డీ పేర్కొంది. కానీ, కార్పొరేట్ ట్యాక్స్ కాస్త పెంచితే ఇంతభారీగా ఉపాధి అవకాశాలు వస్తున్నప్పుడు మన ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తలు కార్పొరేట్ పన్ను పెంపుదలపై ఎందుకు కిమ్మనకుండా ఉన్నారో అర్థం కావడం లేదు. గత 30 ఏళ్లలో ఒక శాతం సంపన్నుల సంపద 22.65 బిలియన్ డాలర్లకు పెరగగా, సమాజంలో దిగువస్థాయిలో ఉన్న 50 శాతం జనాభా సంపద అదే సమయంలో 776 బిలియన్ల మేరకు దిగజారిపోయిందని అమెరికా రాజకీయనేత బెర్నీ శాండర్స్ చెప్పారు. సంపద విషయంలో పెరుగుతున్న ఈ స్థాయి అసమానత్వం నిజంగానే నైతిక బాహ్యమైన విషయమని తాను పేర్కొన్నారు. అసమానత్వం అనేది సంపద పోగుపడటంతో ముడిపడి ఉంది, అదే సమయంలో అది భావజాలపరమైన పాక్షికతను కూడా పెంపొందిస్తోంది. భారత్లో ఒక మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు గతంలో ఒక సందర్భంలో మాట్లాడుతూ మొండిబకాయిలు లేక నిరర్ధక ఆస్తులు అనేవి ఆర్థిక ప్రగతికి దారితీస్తాయని చెప్పారు. అయితే మన దేశంలో కార్పొరేట్లు, రైతులు అదే బ్యాంకులనుంచి రుణాలను ఎలా పొందుతున్నారన్నది ఆలోచించాల్సిన ప్రశ్నే. కార్పొరేట్ మొండి బకాయిలను మాఫీ చేస్తే ఆర్థిక ప్రగతికి అది ఎలా దోహదపడుతుందో, రైతుల రుణమాఫీలను రద్దు చేస్తే అది జాతీయ చెల్లిం పుల సమతూకానికి ఎలా తూట్లు పొడుస్తుందో వివరించి చెప్పేవారే లేరు. కంపెనీలు అధిక వేతనాలు చెల్లించకుండా ఎగవేయడానికి తప్పించుకోవడానికి వీలు కలిగిస్తూ గ్రామాలనుంచి పట్టణాలకు శ్రామిక శక్తిని భారీస్థాయిలో తరలించడం అనే కాలం చెల్లిన ఆర్థిక థియరీని దేశదేశాలు గుడ్డిగా ఎందుకు ఇంకా పాటిస్తున్నాయి? అదే సమయంలో, వ్యవసాయంలో అదనపు పెట్టుబడి పెట్టడం, ప్రజారోగ్యం, విద్యకు అధికంగా ఖర్చు చేయడం అనేది ఆర్థిక వ్యవస్థను ఎలా వెనక్కు లాగుతుందో ఆర్థికవేత్తలు చెప్పాల్సి ఉంది. ఒక్క కరోనా వైరస్ వ్యాప్తి వల్ల మన ప్రభుత్వాలకు ప్రజారోగ్యం ప్రాధాన్యత ఏమిటో తెలిసివచ్చింది. ప్రజారోగ్యంపై ప్రభుత్వ రంగానికి ఎనలేని బాధ్యత ఉంది. ప్రైవేట్ రంగం ఒక్కటి మాత్రమే దీన్ని పూర్తి చేయలేదు. దేశంలో ఇప్పటికే కొంతవరకు పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యాలు నడుస్తున్నాయనుకోండి. వచ్చే ఐదేళ్లలో కేంద్రప్రభుత్వం మాత్రమే ఆరోగ్య రంగంపై జీడీపీలో కనీసం 2.1 శాతం మేరకు కేటాయించవలసి ఉందని 15వ ఆర్థిక కమిషన్ చైర్మన్ ఎన్.కె. సింగ్ చెప్పారు. కారణం ఏదైనా కావచ్చు సాధారణ సమయాల్లో సైతం ప్రజారోగ్యం ప్రాధాన్యతను తగ్గించకూడదు. కానీ ఆర్థిక కమిషన్ నివేదికలను క్లాస్ రూముల్లో చర్చించడం ద్వారా మాత్రమే సామాజిక రంగాల్లోని ప్రభుత్వ పెట్టుబడులు తగ్గిపోవడంపై తగిన ఆర్థిక విధానాలను మన ఆర్థికవేత్తలు రూపొందించలేరు పైగా ఇది తీవ్రమైన సామాజిక, ఆర్థిక అసమానతలకు దారితీస్తోంది. బ్రిటన్ తన జీడీపీలో ప్రజారోగ్యంపై 9.6 శాతాన్ని వెచ్చించడం యావత్ ప్రపంచానికి గుణపాఠం కావాలి. భారతదేశం తనవంతుగా జీడీపీలో కనీసం 6 శాతం మేరకు ప్రజారోగ్యంపై ఖర్చుపెట్టకూడదు. దేశజనాభాలో 50 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తుండగా, 2010–2012 నుంచి 2017–18 మధ్యకాలంలో వ్యవసాయంలో పెట్టుబడులు కేవలం 0.4 శాతంతో స్తబ్దుగా ఎందుకు ఉండిపోయాయి? దేశంలోని సంపన్నులు బ్యాంకులనుంచి భారీ స్థాయిలో రుణ మాఫీలు పొందుతూ ప్రభుత్వాలనుంచి పన్ను రాయితీలు గుంజుతూ, అభివృద్ధి కోసం ప్రోత్సాహకాల పేరిట సబ్సిడీలను కొల్లగొడుతూ బలుస్తున్నప్పుడు దేశంలోని కోట్లాది మంది పేదలు కనీస అదాయాలు కూడా లేకుండా ఎందుకు కునారిల్లిపోతున్నారు? అంతకుమించి మన దేశంలో సంపన్నులకు సోషలిజం అమలు చేస్తూ పేదలను మాత్రం మార్కెట్ భూతాల కోరల్లో పడవేస్తున్న విధానాలను మన పాలకులు ఎందుకు కొనసాగిస్తున్నారు. ఆర్థిక ప్రగతి సిద్ధాంతవేత్తలు సమస్త ప్రకృతితో ఎందుకు ఘర్షణ పడుతున్నారు. ఇవి సమాధానం చెప్పలేని సంక్లిష్ట ప్రశ్నలు కావు. కానీ ఆర్థిక వ్యవస్థను పునరాలోచింపచేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తున్నాయి. వ్యాసకర్త దేవీందర్ శర్మ వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
పట్టణం నుంచి పల్లెకు మహా పయనం
గత నాలుగు దశాబ్దాలుగా సాగుతున్న నయా ఉదారవాద ఆర్థిక వ్యవస్థ డొల్లతనాన్ని ఒక్క దెబ్బతో కోవిడ్–19 కూల్చి వేసింది. సంపద సృష్టి ముసుగులో వ్యవసాయ రంగాన్ని ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసి కోట్లాదిమంది వ్యవసాయదారులను మహానగరాల్లో, పట్టణాల్లో కూలీలుగా మార్చిన అన్యాయపు ఆర్థిక వ్యవస్థను కరోనా వైరస్ పెకిలించివేసింది. ఈ నేపథ్యంలో మనం మళ్లీ వెనక్కు వెళ్లాలి. వ్యవసాయం ఊతంగా సమస్త ఆర్థిక వ్యవస్థ మనగలిగే నూతన విధానం రూపొందాలి. పట్టణాలకు వలస వెళ్లిన వ్యవసాయదారులు లాక్డౌన్ కారణంగా తిరిగి భారీ సంఖ్యలో గ్రామాలకు చేరుతున్న నేపథ్యంలో వారు వ్యవసాయానికే కట్టుబడేలా సత్వర నిర్ణయాలు తీసుకోవాలి. వ్యవసాయానికి మళ్లీ ప్రాణం పోయడం మాత్రమే మన ఆర్థిక వ్యవస్థకు ప్రాణప్రతిష్ట చేసి, ప్రకృతిని కాపాడుతుంది. అది మాత్రమే పక్షులను, సీతాకోక చిలుకలను తిరిగి మన బాల్కనీలోకి రప్పిస్తుంది. గత నాలుగు దశాబ్దాలుగా సాగిన అస్తవ్యస్త విధానాల దిశను వెనక్కు మళ్లించడం ఇప్పుడు తప్పనిసరి అవసరం. ఇది ఏమాత్రం ఊహించనిది. అంతర్జాతీయ ప్రసిద్ధి పొందిన వాణిజ్య పత్రిక ది ఫైనాన్షియల్ టైమ్స్ ‘‘మౌలిక సంస్కరణలు– గత నాలుగు దశాబ్దాల విధాన దిశను వెనక్కు తిప్పడం– చర్చకు పెట్టాలి’’ అనే పేరిట ఒక సంపాదకీయం రాసింది. నాలుగు దశాబ్దాలపాటు స్వేచ్ఛా మార్కెట్లపై విస్తృ తంగా ఆధారపడిన విధాన దిశను అనుసరించిన తర్వాత, కరోనా వైరస్ సాంక్రమిక వ్యాధి కొట్టిన దారుణమైన దెబ్బకు ఆ విధాన మార్గం పనికిరాదని ప్రపంచం గుర్తించింది. దాని తప్పుడు సంకేతాలు స్పష్టంగా ఇప్పుడు కనిపిస్తున్నాయి. చారిత్రకంగా, సాంక్రమిక వ్యాధుల నిష్క్రమణ తర్వాత ప్రపంచ పర్యావరణ వ్యవస్థ మార్పునకు గురైంది. కరోనా వైరస్ సాంక్రమిక వ్యాధి ప్రభావం కూడా గణనీయంగా తగ్గిన తర్వాత, ప్రపంచం తన మామూలు స్థితికి చేరుకున్న తర్వాత, అన్ని ప్రభుత్వాలూ మానవ సంక్షేమంపై ప్రాధాన్యతా బాట పట్టాల్సి ఉంటుందని భావిస్తున్నారు. కరోనా వైరస్ దెబ్బకు మార్కెట్లు కుప్పకూలిపోగా, ప్రజారోగ్యానికి, విద్యకు దశాబ్దాలుగా నిధులను తగ్గిస్తూ వచ్చిన క్రమం వెనక్కుపోయి ఈ రెండు రంగాలకు ప్రాధాన్యత లభిస్తుంది. అలాగే ఇంటినుంచే పనిచేయడం అనే పద్ధతిని కొనసాగించడం ద్వారా పట్టణాల ముఖ చిత్రం మౌలికంగా మారిపోనుంది. ఎందుకంటే కంపెనీల తలకుమించిన భారాన్ని ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ భావన గణనీయంగా తగ్గించనుంది. లాక్డౌన్ అనంతర సమాజం అయితే, అసమానతలను పెంచి పోషించి, సహజ వనరులు భారీ స్థాయిలో ధ్వంసం కావడానికి దారితీస్తూ నాలుగు దశాబ్దాల పాటు ప్రపంచంలో కొనసాగిన నయా ఉదారవాద విధానాలు కోవిడ్–19 అనంతరం మార్పు చెందుతాయా అంటే మనం వేచి చూడాల్సిందే. అంతకు మించి వాయు కాలుష్యం పలుచబడి నీలి ఆకాశం స్పష్టంగా కనిపించడం, అసాధ్యమనిపించిన గంగా, యమునా నదుల శుద్ధి, మనం దాదాపుగా మర్చిపోయిన పక్షులు మన బాల్కనీలలోకి తిరిగి రావడం వంటి లాక్డౌన్ కాలంలో ప్రజలు ఆనందంతో తిలకించిన దృశ్యాలు, కళ్లారా గమనించిన మార్పులు లాక్డౌన్ తీసేసిన తర్వాత మళ్లీ వెనక్కు పోతాయా అనే ప్రశ్నకు కూడా కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది. కరోనా వైరస్ ఇప్పటికే ఆర్థిక వ్యవస్థలను వాస్తవంగానే స్తంభింపచేసింది. వ్యవసాయం మాత్రమే మనందరికీ జీవగర్రగా ఇప్పటికీ కొనసాగుతోంది. గత కొన్ని దశాబ్దాలుగా యావత్ ప్రపంచాన్ని ఆవరించిన దూకుడు వినియోగదారీ సంస్కృతి ఒక్క దెబ్బకు కూలిపోయిన సమయంలో ప్రపంచ ఆహార నిల్వలు ప్రత్యేకించి భారతదేశంలోని ఆహార నిల్వలు మాత్రమే సాంక్రమిక వ్యాధికి వ్యతిరేకంగా యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయి. దేశంలోని ప్రజాపంపిణీ వ్యవస్థ అవసరాలకంటే మూడు రెట్లకు మించి దాదాపుగా ఏడు కోట్ల 70 లక్షల టన్నుల కొద్దీ పేరుకుపోయిన ఆహార నిల్వలతో భారతదేశం ప్రపంచంలోనే అత్యంత అనుకూల స్థితిలో ఉంది. మార్కెట్ ఆధారిత ఆర్థిక సంస్కరణల్లో భాగంగా జనాభాలోని 20 శాతం అవసరాలకు మాత్రమే ఆహార ధాన్యాలను పరిమితం చేసేలాగ ప్రభుత్వ ధాన్య సేకరణ వ్యవస్థను బలహీనపరుస్తున్నప్పటికీ (ప్రస్తుతం జాతీయ ఆహార భద్రత చట్టం కింద 67 శాతం జనాభాకు ఆహార ధాన్యాలు అందుతున్నాయి), భారత ఆహార సరఫరా మరో సంవత్సరానికి సరిపడేలా ఉండటం విశేషం. ఊరు రమ్మంటోంది.. మన ఆహార నిల్వలు పెరుగుతున్న సమయంలో, తమ పిల్లలను చంకనేసుకుని నెత్తిపై సామాను పెట్టుకుని, తమగ్రామాలకు వెళుతున్న లక్షలాదిమంది వలస కూలీల చిత్రాలు మీడియా నిండా కనిపిస్తున్నాయి. ఆహారం దొరుకుతుందో లేదో తెలీని స్థితిలో వలస కూలీలు వందలాది కిలోమీటర్ల పొడవునా తమ గ్రామాలకు నడిచిపోతున్న వలసకూలీలు వాస్తవానికి వ్యవసాయాన్ని వదిలిపెట్టిన శరణార్థులు. వ్యవసాయం తమ మనుగడను దుర్భరం చేసిన స్థితిలో వీరు తమ గ్రామాలనుంచి వలస వెళ్లిపోయారు. మంచి జీవితం గడపాలనే ఆశతో నగరాలకు వెళ్లిపోయిన ఈ కూలీలు వాస్తవానికి తమ రోజువారీ కూలీలపైనే బతుకుతున్నారు. అంటే రోజులో సంపాదించే మొత్తం ఆరోజు వీరి కుటుంబ అవసరాలకే సరిపోతుంది. లాక్డౌన్ విధించిన నేపథ్యంలో నగరాలు వీరిని తోసిపారేసినప్పుడు తామెక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్లడానికి వీరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కరోనా నేపథ్యంలో తప్పుడు ఆర్థిక విధానాల వైఫల్యం అతిస్పష్టంగా బట్టబయలైపోయింది. వ్యవసాయాన్ని ఉద్దేశపూర్వకంగా ఎండబెట్టిన ఈ విధానాల కారణంగానే లక్షలాదిమంది రైతులు సేద్యాన్ని వదలి నగరాలకు వలస వెళ్లిపోవలసి వచ్చింది. ఆర్థిక సంస్కరణలు చెల్లుబాటయ్యేందుకు సంవత్సరాలుగా వ్యవసాయాన్ని బలిపెడుతూ వచ్చారు. ప్రపంచబ్యాంకు సూచించింది ఇదేమరి. 1996లో ఎమ్ఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్లో ఒక కాన్ఫరెన్స్కు నేను హాజరయ్యాను. ఆ సదస్సులో నాటి ప్రపంచ బ్యాంకు ఉపాధ్యక్షుడు డాక్టర్ ఇస్మాయిల్ సెరగెల్డిన్ ప్రసంగిస్తూ వచ్చే 20 ఏళ్లలో అంటే 2015 నాటికి భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలస పోయే ప్రజల సంఖ్య బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాల జనాభాకు రెండు రెండురెట్లకు మించి ఉంటుందని తెలిపారు. పై మూడు దేశాల మొత్తం జనాభా 20 కోట్లు ఉంటుంది. అంటే పై అంచనా ప్రకారం 2015 నాటికే 40 కోట్ల మంది ప్రజలు భారతీయ గ్రామాల నుంచి పట్టణాలకు తరలి వెళ్లి ఉంటారు. అంటే ఆర్థిక సంస్కరణలు చెల్లుబాటు కావడానికి ఈ దేశంలోని పేదలు చెల్లించాల్సిన మూల్యం ఇదే అన్నమాట. అయితే పేదలకు ఇది కూడా బతుకు ఇవ్వలేనప్పుడు వారు మళ్లీ సొంత గూటికి అంటే గ్రామాలకు వెళ్లిపోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. మరలా సేద్యానికి మార్గం ఇప్పుడు వలసకూలీలు తమ తమ గ్రామాలకు తిరిగివెళుతున్న దృశ్యాలు మనందరి మనస్సులలో బలంగా ముద్రపడిపోయాయి. ఈ నేపథ్యంలో మన వ్యవసాయం తిరిగి ఆర్థికంగా చెల్లుబాటయ్యేలా వ్యవస్థను పూర్తిగా మార్చాల్సిన అవకాశాన్ని కోవిడ్–19 కల్పించింది. పరిశ్రమకు రిజర్వు కార్మిక శక్తిని సిద్ధం చేసేలా వ్యవసాయాన్ని కుదించిన పరిస్థితులను తొలగించాల్సి ఉంది. అదే సమయంలో న్యాయమైన ఆదాయం రైతుల చేతికి అందేలా వ్యవసాయాన్ని ఆర్థిక వ్యవస్థకు జీవగర్రగా మార్చాలి. ప్రజారోగ్యం, విద్యతోపాటు వ్యవసాయాన్ని పునరుద్ధరించడం ద్వారానే విధాన ప్రణాళికలో వీటికి ప్రాధాన్యం లభిస్తుంది. వ్యవసాయానికి మళ్లీ ప్రాణం పోయడం మాత్రమే మన ఆర్థిక వ్యవస్థకు ప్రాణప్రతిష్ట చేసి, ప్రకృతిని కాపాడుతుంది. అది మాత్రమే పక్షులను, సీతాకోక చిలుకలను తిరిగి మన బాల్కనీలోకి రప్పిస్తుంది. అలాగే వాతావరణ మార్పు దుష్ప్రభావాల నుంచి మన భూగ్రహాన్ని పరిరక్షించవచ్చు. దిశ, దశ రెండూ మారాలి ఫైనాన్షియల్ టైమ్స్ చెప్పినట్లుగా గత నాలుగు దశాబ్దాలుగా సాగిన విధాన దిశను వెనక్కు మళ్లించడం తక్షణం సాగించాల్సి ఉంది. దీనికోసం ఒక నూతన అభివృద్ధి నమూనాను నిర్మించేందుకు సాహసంతో కూడిన విధాన నిర్ణయాలు జరగాల్సి ఉంది. అలాగే మార్కెట్ శక్తుల నుంచి లాబీలు జరిపే ఒత్తిడిని తట్టుకుని నిలిచే రాజకీయనాయకత్వం మద్దతు కూడా కావాలి. అంటే బలమైన ఆర్థిక చింతనను సవాలు చేసే అసాధారణ సామర్థ్యం మన నాయకత్వానికి ఉండాలి. సంపద సృష్టిమీదే పూర్తిగా ఆధారపడినటువంటి ఆర్థిక పురోగతి నమూనాను అప్పుడే తొలగించగలం. ఈ నమూనా ఇన్నాళ్లూ కింది నుంచి పైదాకా ఆదాయాలను నొక్కేసి సంపన్నులు బలిసేందుకే ఉపయోగపడింది. సమాజంలో స్థిరచిత్తం, వివేకం కలిగిన వారి వాణికి కొదవలేదు. అలాంటి వారిని కనుగొని, వారి పాత్రను గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం మళ్లీ వెనక్కు వెళ్లకూడని కొత్త మార్పు జరగబోతోంది. ఆ మార్పు కొనసాగుతుందని ఆశిద్దాం. దేవీందర్ శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
ప్రాణాలకన్నా లాభార్జనే మిన్న!
కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రానురానూ పెరిగిపోతూ అమెరికాలోనే కరోనా రోగుల సంఖ్య లక్షకుపైగా చేరుకున్నప్పుడు, వైరస్ బారినపడి మరణిస్తున్న వారి జాబితా పెరిగిపోతున్నప్పుడు ఆ దేశంలో బిలియనీర్లు మాత్రం ప్రజలకు కలుగుతున్న నష్టాలను ఏమాత్రం పట్టించుకోకపోవడం దారుణం.. పైగా తరిగిపోతున్న తమ లాభాల గురించే తెగ ఫీలయిపోతూ వాణిజ్య కార్యకలాపాలను మళ్లీ ప్రారంభించాలని ఒత్తిడి చేస్తున్నారు. రెండు లక్షలమంది మరణించినా సరే.. కరోనా రోగుల ఆ బలిదానం వ్యవస్థ మనుగడకు అవసరం అంటున్నారంటే కార్పొరేట్లకు మానవ ప్రాణం కంటే లాభార్జన ముఖ్యమన్నమాట ఒక విషయంలో మనం చాలా స్పష్టంగా ఉండాలి. బర్క్లీలోని కాలిఫోర్నియా యూని వర్సిటీలో ఆర్థికశాస్త్రంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న రాబర్ట్ రీచ్ ప్రస్తుత ప్రపంచ సమస్య గురించి ఒక్కమాటలో చెప్పేశారు. ‘అసలు సమస్య వైరస్సే... ఆర్థికం కాదు..’. మానవ ప్రాణాలను ముందుపీఠిన ఉంచి ఆర్థిక లక్ష్యాలకేసి తర్వాత దృష్టి సారించాలంటూ జీ–20 దేశాధినేతలకు హితవు చెప్పనప్పుడు ప్రధాని నరేంద్రమోదీ సరిగ్గా రాబర్ట్ రీచ్ మాటలనే ప్రతిధ్వనించారు. కానీ ప్రాణాంతక కరోనా వైరస్ సాంక్రమిక వ్యాధిని నిరోధించే విషయమై ప్రపంచం అతలాకుతలమవుతున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ పరిరక్షణ కోసం మనుషులను ప్రత్యేకించి వృద్ధులను బలిదానం చేయాల్సిందేననే స్వరాలు పెరుగుతున్నాయి. టెక్సాస్ లెఫ్టినెంట్ గవర్నర్ డేన్ పాట్రిక్ దీన్ని మరింత మొరటుగా వ్యక్తీకరించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ క్షేమం కోసం, యువత క్షేమంకోసం దేశంలోని వృద్ధులు తమ ప్రాణాలు వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేశారు. ప్రజలు కరోనా బారినుంచి తప్పించుకోవడానికి తెలివిగా ఉండాలని, అదే సమయంలో వారు తమ తన పనులకు తిరిగి వెళ్లాలని కోరారు. కానీ స్వయంగా ఆరుమంది పిల్ల లకు తాత అయిన పాట్రిక్ వారికోసం తన ప్రాణాలు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు మాటవరుసకైనా ఆయన చెప్పకపోవడం వింతగొల్పుతుంది. తాను కూడా స్మార్ట్గానే ఉన్నట్లు తాను భావిస్తున్నట్లుంది. పైగా తక్కిన సమాజం నుంచి భౌతిక దూరం పాటించడం పట్ల సంపన్నవర్గం ఎప్పటినుంచో స్మార్ట్గా ఉంటోందని మనందరికీ తెలుసు కదా. ప్రత్యేక ఎయిర్ ఫిల్టరేషన్ వ్యవస్థలను కలిగిన బంకర్లను కొనుగోలు చేస్తున్నదీ, సంవత్సరం పాటు ఆహార సరఫరాకు హామీనిచ్చే ఎస్కేప్ టన్నెల్స్ను ఏర్పాటు చేసుకుంటున్నది కూడా ఈ స్మార్ట్ సంపన్నవర్గమే మరి. కానీ, డేన్ పాట్రిక్ ఒక్కరే ఇలాంటి క్రూరమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారని అనుకుంటే మనం పప్పులో కాలేసినట్లే. కొద్దిమంది వ్యక్తులను పోగొట్టుకోవడం కంటే ఇప్పుడు ఆర్థిక వ్యవస్థను మూసివేస్తే ఎదుర్కొనాల్సిన నష్టాలు చాలా ఘోరంగా ఉంటాయని అమెరికా బిలియనీర్ టామ్ గొలిసెనో మీడియా ముందే చెప్పేశారు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రానురానూ పెరిగిపోతూ అమెరికాలోనే కరోనా రోగుల సంఖ్య లక్షకుపైగా చేరుకుంటున్నప్పుడు, కరోనాబారిన పడి మరణిస్తున్న వారి జాబితా పెరిగిపోతున్నప్పుడు ఆ దేశంలో బిలియనీర్లు మాత్రం జాతికి కలుగుతున్న నష్టాలను ఏమాత్రం పట్టించుకోకుండా.. తరిగిపోతున్న తమ లాభాల గురించి తెగ ఫీలయిపోతూ అర్జెంటుగా వాణిజ్య కార్యకలాపాలను మళ్లీ ప్రారం భించాలని ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచ జనాభాలో సగం వాస్తవంగానే గృహనిర్బం ధంలో ఉంటూ, పరిశ్రమలు షట్టర్లు మూసివేస్తున్నప్పుడు, జాతీయ, అంతర్జాతీయ పర్యటనలు పూర్తిగా స్తంభించిపోయి ఉన్నప్పుడు పేరుమోసిన పెట్టుబడిదారీ పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ తన సంపాదకీయంలో ఏమి రాసిందో చూస్తే పెట్టుబడిదారుల ఆలోచనలు ఎలా ఉంటున్నాయో ఆర్థమవుతుంది. కరోనా వైరస్ షట్డౌన్ పట్ల తిరిగి ఆలోచించడం ఎలా అనే పేరుతో వచ్చిన ఆ సంపాదకీయం.. ‘ఆర్థిక ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఏ సమాజం కూడా ప్రజారోగ్యాన్ని దీర్ఘకాలంపాటు కాపాడలేదు’ అని కార్పొరేట్ రంగానికే సాధ్యమైన హితవు చెప్పింది. అయినా మీకు ఇంకా షాక్ తగలకుంటే, న్యూయార్క్ టైమ్స్లో కాలమిస్టు థామస్ ప్రీడ్మన్ రాసింది ఒకసారి చూడండి. ‘కరోనా వ్యాధి బారినపడి అత్యంత విషమ పరిస్థితుల్లో ఉన్నవారు కరోనా వైరస్కు బలవడాన్ని కొనసాగిస్తూనే మనలో ఆ వైరస్ బారిన పడినవారు కోలుకుని తిరిగి పనికి వెళ్లేలా చూద్దాం’. మానవ ప్రాణాలకు ఏమాత్రం ప్రాధాన్యం లేనప్పుడు కరోనా వైరస్ సోకి సంభవి స్తున్న మరణాల రేటు అనేది గణాంకాల కూర్పుగానే మారిపోతుంది. భారత్లో రైతుల ఆత్మహత్యలపై విధాన నిర్ణేతలు వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా ఇలాగే ఉంటోంది కదా. అమెరికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం ట్వీట్ చేశారు. ‘సమస్యకంటే నివారణను ఘోరమైనదిగా చూడలేం. ఈ సంక్షోభ పరిస్థితుల్లో మనం ఏవైపు పయనించాలన్న విషయమై 15 రోజుల తర్వాత ఒక నిర్ణయానికి వద్దాం’. అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తి రేటు పెరిగిపోతున్న సమయంలో ట్రంప్ ఇలా పేర్కొన్నారు. మరోవైపు అమెరికాకు ఎంతో దూరంలో ఉన్న బ్రెజిల్ దేశాధ్యక్షుడు జెయిర్ బొల్సొనరో అయితే కరోనా వైరస్ని పెద్దగా పట్టించుకోనవసరం లేని చిన్న ఫ్లూ అని చెప్పేశారు. తన ప్రభుత్వాన్ని కూలదోసే ఉద్దేశంతోనే సంక్షోభాన్ని మరింత పెద్దది చేసి చూపుతూ ప్రజలను ఏమార్చడానికి మీడియా కంకణం కట్టుకుందని ఆయన ఆరోపించారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించడానికి తాను అనుకూలం కాదని కూడా తేల్చేశారు. సంపన్నులు, శక్తిమంతుల నుంచి ఇలాంటి మొరటు స్పందనలు గమనించాక మనం ఎలాంటి సమాజంలో ఉంటున్నామని ఆశ్చర్యపోక తప్పదు. మానవ చరిత్రలో విషాదాల్లో కెల్లా అత్యంత విషాదకర ఘటనగా ఆర్థికవేత్తలు కరోనా వైరస్ను చూస్తున్నప్పుడు ఇలాంటి మొరటి స్పందనలు ఎలాంటి ఫలితాలను చూపిస్తాయో అర్థం కావ డం లేదు. పైగా చరిత్ర నిర్ణాయక దశల్లో సంపన్నుల, ప్రభువుల అభిప్రాయాలు ఇంతకు మించి భిన్నంగా ఉండేవి కాదు. 1943లో బెంగాల్ దుర్బిక్షం సందర్భంగా లక్షలాది మంది (40 లక్షల మంది) మరణిం చినందుకు కారణాలు ఏమిటని బ్రిటిష్ ప్రభుత్వం ప్రశ్నించినప్పుడు నాటి భారత వైస్రాయ్ లార్డ్ వేవెల్ సమాధానమిస్తూ దారిద్య్రంతో మగ్గుతున్న వీళ్లు ఎలాగైనా చనిపోక తప్పదు అనేశారు. అయితే నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్ చేసిన పరిశోధన ప్రకారం 1943లో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఏమాత్రం తగ్గలేదని తెలిసింది. కానీ ఆహార ధాన్యాలను బ్రిటిష్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దారి మళ్లించినందు వల్లే బెంగాల్లో దుర్భిక్షం చెలరేగిందని సేన్ చెప్పారు. అయితే పేదప్రజలకు ఆహారం అందకుండా చేసినవారిని తప్పు పట్టడానికి బదులుగా విన్స్టన్ చర్చిల్ మరీ ఘోరమైన వ్యాఖ్య చేసినట్లు తెలుస్తోంది. భారతీయ నిరుపేదలు ఎలుకల్లాగా ఆహారాన్ని మేసేస్తున్నారని అందుకే దుర్భిక్షం సంభవించిందని చెబుతూ చర్చిల్ భారత పేదలపైనే ఆరోపణ చేశారు. అంతకంటే ముందు 1845–49 మధ్య కాలంలో ఐరిష్ దుర్భిక్షం సమయంలో పది లక్షలమంది ఆకలిదప్పులతో మరణిం చగా, మరొక పది లక్షల మంది వలసపోయారు. ఆకలిదప్పులతో జరిగిన మరణాలకు దుర్భిక్షం మాత్రమే కారణం కాకపోవచ్చు. ఐర్లండ్లోని కోర్క్ ప్రాంతంలో ఐరిష్ దుర్భిక్షం 150 వార్షికోత్సవం నిర్వహించిన సందర్భంగా ఆ నగర మేయర్ తన ప్రారంభ ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఆనాడు బంగాళాదుంపలకు తెగులు సోకి పంట మొత్తంగా దెబ్బతినిపోయి ఆకలితో ప్రజలు చస్తున్నప్పుడు ఆనాటి బ్రిటిష్ వలసాధిపతులు బ్రిటన్కు ఓడలకొద్దీ మొక్కజొన్నలను పంపించే పనిలో మునిగిపోయారు, నాటి ఐర్లండులో ఎలాంటి సమాజం ఉనికిలో ఉండేదో దీన్ని బట్టే తెలుస్తుందని కోర్క్ మేయర్ చెప్పారు. దాదాపు 2 కోట్ల 50 లక్షలమందిని బలితీసుకున్న 1918లో చెలరేగిన స్పానిష్ ఫ్లూతో సహా ఆకలి చావులనుంచి సాంక్రమిక వ్యాధుల దాగా సమాజంలోని కొందరు కులీనవర్గాలు కోట్లాదిమంది సామాన్యులను పీడించిన దాని ఫలితమేనని పలువురు రాజకీయ ఆర్ధశాస్త్రజ్ఞులు చెబుతున్నారు. సమాజం అతలాకుతలమవుతున్న సమయాల్లో కార్పొరేట్లు సంక్షోభాన్ని ఎలా తమకు అనువుగా మల్చుకుంటాయో రాబర్ట్ రీచ్ స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు మన ప్రజలకు ఆరోగ్య సంరక్షణను అందించాలని మేం చెప్పినప్పుడు మనకంత శక్తిలేదని సమాధానం వచ్చినట్లు అమెరికన్ సెనేటర్ బెర్నీ శాండర్స్ చెప్పారు. కానీ, స్టాక్ మార్కెట్లు కూలిపోతున్నప్పుడు కూడా దేశంలో డబ్బుకు మాత్రం కొదవలేకుండా చేశారు. పైగా మదుపుదారుల భయాందోళనలను ఉపశమింపచేసేందుకు అమెరికా ప్రభుత్వం 1.5 ట్రిలియన్ డాలర్లను మార్కెట్లో కుమ్మరించింది. ప్రపంచమంతటా ఇదే జరుగుతోంది. ప్రతి ఒక్కరూ స్తంభించిపోయి ఉన్నప్పుడు ఆర్థిక చింతనలో నాటకీయ మార్పును ఎదుర్కోవలసి వస్తున్న ప్రపంచంలో తప్పకుండా ప్రవర్తనా పూర్వకమైన మార్పును మనం చూడగలమని ఆశిద్దాం. కరోనా వైరస్ సాంక్రమిక వ్యాధి పట్ల ప్రపంచ స్పందన ఇప్పుడు సరైన దారిలోనే సాగుతోంది. వైరస్ వ్యాప్తిని అరికట్టడంపైనే ప్రపంచం మొత్తంగా దృష్టి పెట్టింది. అంతర్జాతీయ సమాజం స్పందించకముందే మూడు వారాలపాటు లాక్ డౌన్ ప్రకటించిన భారత ప్రభుత్వం సకాలంలో సరైన చర్యను తీసుకున్నట్లే చెప్పాలి. ఈ సంక్షోభం నుంచి మీరు బతికి బయటపడితే అప్పుడు ఆర్థికవ్యవస్థను పునర్మించవచ్చు మరి. దేవీందర్ శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
మరో వ్యవసాయ విప్లవానికి బీజాలు
భారత్లో మొదలుకానున్న తదుపరి వ్యవసాయ విప్లవం దేశీయ ప్రాధాన్యతల మీదే ఆధారపడి ఉండాలి. దాదాపు 60 కోట్లమంది ప్రజలు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ నేటికీ వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్న దేశంలో, ఇప్పటికే పట్టణప్రాంతాలో ఉపాధి అవకాశాలు ఆవిరైపోయి, నిరుద్యోగం 45 ఏళ్లలో కనీవినీ ఎరుగని స్థాయికి పెరిగి ఉన్న నేపథ్యంలో ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే వ్యవసాయాన్ని అమలు చేసినప్పుడే ఈ రంగంలో ప్రతిఏటా 12 లక్షల కొత్త ఉపాధి అవకాశాలను కల్పించవచ్చు. అధిక సంఖ్యలో రైతులను పట్టణాలకు తరిమి వారిని రోజుకూలీ కార్మికులుగా మారుస్తున్న విధానాలకు బదులుగా స్థానిక ఉత్పత్తిపై, స్థానికంగా ధాన్యసేకరణ, స్థానిక పంపిణీపై ఆధారపడిన ఆకర్షణీయమైన వ్యవసాయ నమూనాను అమలు చేయడం గురించి మన విధాన నిర్ణేతలు అర్థం చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. యువతీయువకులు పూర్తిగా తమ ఆశలు, ఆకాంక్షలను వ్యక్తపరిచే వయస్సులో పంజాబ్లోని బర్నాలా జిల్లాకు చెందిన 22 ఏళ్ళ రైతు కూడా తనకున్న కొద్దిపాటి భూమిని విజయవంతమైన వెంచర్గా మార్చడానికి ప్రయత్నించారు. ఇప్పటికే రూ. 8 లక్షల రుణ భారంతో, తమ కుటుంబంలో వ్యవసాయం ప్రమాదఘంటికలను మోగిస్తోందని తెలిసినప్పటికీ, ఆ యువరైతు ఈ సవాలును చేపట్టాలని నిర్ణయించుకున్నారు. వ్యవసాయ వాణిజ్యం అనేది అనేక ప్రమాదాలతో కూడి ఉందని తెలుస్తున్నప్పటికీ సంవత్సరానికి రూ.50 వేల అద్దె చొప్పున మరో 8 ఎకరాల భూమిని లీజుకు తీసుకున్నారు. కానీ 2017లో ఏపుగా పెరిగిన తన గోధుమ పంట ఆకస్మికంగా వచ్చిపడిన తుపానుకు దెబ్బతినిపోయింది. తన కలలు చెల్లాచెదురయ్యాయి. తనకు తగిలిన ఎదురుదెబ్బల నుంచి ఇక కోలుకోలేకపోయాడు. తీసుకున్న రుణం చెల్లించలేకపోయాడు. అప్పుఇచ్చినవారు వచ్చి గొంతుమీద కూర్చున్నారు. చివరకు ప్రాణాలు తీసుకోవడం తప్ప మరే దారీ లేదనుకున్నాడు. అతడి పేరు లవ్ప్రీత్ సింగ్ తన వ్యవసాయ కుటుంబంలో మూడుతరాల్లో ప్రాణాలు తీసుకున్న అయిదో వ్యక్తి కావడం గమనార్హం. ఒకటిన్నర సంవత్సరం క్రితం తన తండ్రి కుల్వంత్ సింగ్ తనకు తాను ఉరివేసుకున్నాడు. అంతకుముందే తన తాత కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక పంజాబీ వ్యవసాయ కుటుంబంలో మూడు తరాలకు చెందిన వారు వ్యవసాయరంగ దుస్థితి కొనసాగింపు కారణంగా బలైపోయారు. అంటే మన దేశంలో వ్యవసాయరంగ సంక్షోభం ఎంత పాతుకుపోయిందో తెలుస్తోంది. చాలామంది ఇప్పటికీ నమ్మలేకపోవచ్చు కానీ హరిత విప్లవానికి కేంద్రంగా నిలిచిన పంజాబ్ మెల్లగా రైతుల ఆత్మహత్యల మృత్యుశయ్యగా మారిపోయింది. పంజాబ్లోని మూడు ప్రభుత్వరంగ విశ్వవిద్యాలయాలు జరిపిన అధ్యయనం ప్రకారం 2000 నుంచి 2015 వరకు పంజాబ్లో ఆత్మహత్యలు చేసుకున్న రైతులు, కూలీల సంఖ్య 16,606 అని తేలింది. రాçష్ట్రంలో ప్రతి ముగ్గురు రైతుల్లో ఒకరు దారిద్య్ర రేఖకు దిగువన ఉంటున్నారు. మహారాష్ట్రలో 2013–18 మధ్య ఆరేళ్లలో 15,356 మంది వ్యవసాయ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. జాతీయ స్థాయిలో 2016లో మొత్తం 11,379 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో గణాంకాలు చెబుతున్నాయి ప్రతి ఏడాది జరుగుతున్న ఈ వరుస ఆత్మహత్యలు పంటపొలాల్లో మృత్యుదేవత విలయతాండవాన్ని నిత్యం ప్రదర్శిస్తూనే ఉన్నాయి. రైతుల ఆత్మహత్యలు వ్యవసాయ రంగంలోని దుస్థితికి ప్రతి బింబం కాగా, దానికి దేశవ్యవసాయాన్ని ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తున్న ఆర్థిక రంగ విధానాల ఫలితమే కారణమని చెప్పాలి. ఆర్థిక సంస్కరణలు చెల్లుబాటు కావడానికి దేశంలో ఆహార ధరలను మొదటినుంచి తగ్గించివేశారు. వ్యవసాయ పంటల ధరలను క్షేత్రస్థాయిలో తగ్గిస్తే వినియోగదారులకు సరసమైన ధరల్లో అందించవచ్చు. పైగా రాజకీయ ప్రాథమ్యంలో భాగంగా పరిశ్రమకు ముడిపదార్థాల సరఫరా నిరంతరం తక్కువ ధరల్లో లభించేలా చూడవచ్చు. ఈ క్రమంలో ఆర్థిక భారం మొత్తంగా రైతులకు బదలాయించవచ్చు. వ్యవసాయరంగ నిజ ఆదాయాలు దశాబ్దాలుగా స్తబ్దంగా ఉండటం లేక మరిం తగా పతనమవుతున్న నేపథ్యంలో వాస్తవానికి పోటీని మొత్తంగా రైతులకు వ్యతిరేకంగా ఫిక్స్ చేస్తున్నారు. హరిత విప్లవం ప్రారంభమైన 50 ఏళ్ల తర్వాత 2016 ఆర్థిక సర్వే చేదు వాస్తవాన్ని ముందుకు తీసుకొచ్చింది. దేశంలోని 17 రాష్ట్రాల్లో సగటు వ్యవసాయ కుటుంబం సగటు ఆదాయం సంవత్సరానికి రూ. 20 వేలుగా మాత్రమే ఉంటోంది. అంటే నెలకు రైతు సగటు ఆదాయం రూ.1,700లు మాత్రమే. ఏడాదికేడాది మన దేశ రైతు కుటుంబాలు ఇంత తక్కువ ఆదాయంతో ఎలా మనుగడ సాధిస్తున్నాయన్నది నివ్వెరపరుస్తుంది. అయితే ఆర్థిక సర్వే తెలిపింది సైతం రైతు అమ్ముతున్న పంటమీద వచ్చిన ఆదాయం మాత్రమే కాదు. గృహవినియోగం కోసం వారు ఆదా చేస్తున్న పంటను కూడా కలుపగా వచ్చే ఆదాయం అన్నమాట. వ్యవసాయ సంక్షోభం ఎంత లోతుగా ఉందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. వ్యవసాయ ఆదాయాలు రానురాను పడిపోతున్నాయని అనేక ఇతర అధ్యయనాలు కూడా తెలుపుతున్నాయి. భారతదేశంలో చిన్న కమతాలు అధికంగా ఉన్నాయన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే సన్నకారు రైతుల సమిష్టీకరణ జరిగితే రైతులకు బేరమాడే శక్తి పెరుగుతుంది. దీంతోపాటు వ్యవసాయ ఖర్చులను సామూహికంగా పంచుకోవడం, మెరుగైన వనరులు అందుబాటులోకి రావడం జరిగి రైతుపరిస్థితి బాగుపడుతుంది. రైతు ఉత్పత్తిదారుల సంస్థల ద్వారా కానీ, సహకార వ్యవసాయం ద్వారా కానీ చిన్నకమతాలు అభివృద్ధిపథంలో ముందుకెళతాయి. దృక్పథం ఏదైనప్పటికీ రైతులకు లాభదాయకంగా ఉండే ధరలను కల్పించడటమే ఆదాయ భద్రతను కల్పిస్తుంది. రైతుల ఆదాయం, సంక్షేమం కోసం జాతీయ కమిషన్ని ఏర్పర్చడం ద్వారా దీన్ని సాధించవచ్చు. రైతు అందుకునే కనీస ఆదాయం ప్రభుత్వంలోని అత్యంత దిగువ తరగతిలో ఉన్న ఉద్యోగి పొందే కనీస ఆదాయం కంటే తక్కువగా ఉండకూడదన్నది దృష్టిపెట్టుకోవాలి. సమాజంలోని ఇతర సెక్షన్లతో ఆదాయాల్లో సమానత్వాన్ని తీసుకురావడం జరగాలంటే ప్రత్యక్ష నగదు మద్దతు, కొరత చెల్లింపులు అనేవి మంచి ప్రయత్నాలుగానే చెప్పాలి. ఏ దశలోనూ మార్కెట్లలోని అస్థిరత్వానికి రైతులు బలికాకూడదు. పాశ్చాత్య దేశాల్లోని వ్యవసాయ విధానాల భారతదేశ వ్యవసాయ రంగానికి అవసరం లేదు. భారత్లో మొదలుకానున్న తదుపరి వ్యవసాయ విప్లవం దేశీయ ప్రాధాన్యతల మీదే ఆధారపడి ఉంటుంది. దాదాపు 60 కోట్లమంది ప్రజలు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ నేటికీ వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్న దేశంలో, ఇప్పటికే పట్టణప్రాంతాలో ఉపాధి అవకాశాలు ఆవిరైపోయి, నిరుద్యోగం 45 ఏళ్లలో కనీవినీ ఎరుగని స్థాయికి పెరిగి ఉన్న నేపథ్యంలో ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే వ్యవసాయాన్ని అమలు చేసినప్పుడే ఈ రంగంలో ప్రతిఏటా 12 లక్షల కొత్త ఉపాధి అవకాశాలను కల్పించవచ్చు. అప్పుడు వ్యవసాయంపై అత్యధిక జనాభా ఆధారపడటం పెద్దగా భారమేమీ కాదు. అధిక సంఖ్యలో రైతులను పట్టణాలకు తరిమి వారిని రోజుకూలీ కార్మికులుగా మారుస్తున్న విధానాలకు బదులుగా స్థానిక ఉత్పత్తిపై, స్థానికంగా ధాన్యసేకరణ, స్థానిక పంపిణీపై ఆధారపడిన ఆకర్షణీయమైన వ్యవసాయ నమూనాను అమలు చేయడం గురించి మన విధాన నిర్ణేతలు అర్థం చేసుకోవలసి ఉంది. మహాత్మాగాందీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా స్వావలంబనతో కూడిన వ్యవసాయ విప్లవానికి పథక రచన చేయడం చాలా ప్రాథాన్యత కలిగివుంటుంది. ప్రజారాశుల కోసం ఉత్పత్తి వ్యవస్థను ఏర్పర్చడం కాకుండా ప్రజారాశుల ద్వారా ఉత్పత్తి వ్యవస్థను ఏర్పర్చే పద్ధతి భారత్కు అవసరమని గాంధీ అప్పట్లోనే చెప్పారు. దేశంలోని సన్నకారు రైతులు ఆరోగ్యకరమైన ఆహార వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్నారన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే కోట్లాది వ్యవసాయదారుల జీవితాన్ని నిలబెట్టడానికి ప్రధమ ప్రాధాన్యతను ఇవ్వవలసి ఉంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వికసించాలంటే, అన్నిటికంటే ముందుగా చేయవలసింది వ్యవసాయాన్ని లాభదాయకంగా, చెల్లుబాటయ్యే విధంగా మల్చాల్సి ఉంటుంది. ఇది జరగాలంటే ఆర్థిక పురోగతి పేరిట వ్యవసాయాన్ని బలిపెడుతున్న విధానాలను దాటి పాలకులు ఆలోచించగలగాలి. ప్రభుత్వ రంగ మదుపులపై కోత విధించి వ్యవసాయ ధరలను కుదించి, బలవంతంగా వ్యవసాయ రంగనుంచి రైతులను తప్పించి నగరాలకు వలస వెళ్లేలా చేస్తున్న ప్రస్తుత విధానాలు స్వావలంబనతో కూడిన వ్యవసాయ అభివృద్ధికి ఏమాత్రం సరిపోవు. ఆంధ్రప్రదేశ్ ఈ వైపుగా ఒక మార్గాన్ని ఇప్పటికే చూపించింది. కమ్యూనిటీ పరంగా నిర్వహిచే స్వావలంబనతో కూడిన వ్యవసాయం, దానికనుగుణంగా జీరో బడ్జెట్ సహజ వ్యవసాయ విధానాల ద్వారా ఏపీలో ఇప్పటికే 5 లక్షలమంది రైతులు పునరుత్పాదక వ్యవసాయ విధానాలవైపు మొగ్గు చూపారు. అలాగే ఈశాన్య భారతాన్ని ఆర్గానిక్ వ్యవసాయ హబ్గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉంది. వ్యవసాయ, పర్యావరణ అనుకూల సేద్య విధానాలను క్రమంగా దేశంలోని మిగతా ప్రాంతాలకు కూడా అనువర్తింపజేయాలి. అలాంటి పరివర్తన జరగాలంటే కచ్చితంగా సవాలుతో కూడుకుని ఉంటుంది. కానీ స్వావలంబన, ఆర్థికపరంగా లాభదాయకతతో కూడిన సరికొత్త వ్యవసాయ విప్లవం మాత్రమే దేశీయ ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజం చేయగలుగుతంది. నెల్సన్ మండేలా అన్నట్లు ఏ పనైనా సరే పూర్తి చేసేంతవరకు అది అసాధ్యమైనది గానే కనిపిస్తుంది. దేవీందర్ శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
రైతు భవితకు హామీ ఎక్కడ?
వ్యవసాయరంగంలో నిజ ఆదాయాలు పడిపోవడమే ఆర్థిక వ్యవస్థ ప్రతిష్టంభనకు, మాంద్యానికి అసలు కారణం. ఆహారధాన్యాల ఉత్పత్తిలో పెరిగిన లాభం రైతులకు అధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టడంలో విఫలమైంది. గత రెండేళ్లలో వ్యవసాయరంగంలో నిజ ఆదాయం దాదాపు సున్నా శాతానికి పడిపోయింది. అందుకే దేశం ముందున్న అతిపెద్ద సమస్య ఏదంటే గ్రామీణ గృహ వినియోగాన్ని పెంచడమే. ఇది గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ, వ్యవసాయేతర రంగాల్లో ఆదాయాలను పెంచడంపైనే ప్రధానంగా ఆధారపడి ఉంది. ప్రతి రైతు కుటుంబానికీ ఏడాదికి రూ. 18,000లు లేక నెలకు రూ. 1,500లు అందేలా పీఎమ్ కిసాన్ పథకాన్ని విస్తరించాలి. జాతీయ ఉపాధి హామీ పథకానికి కూడా అదనపు కేటాయింపులు జరపాలి. వ్యవసాయ రంగంలో ధరల పాలసీ నుంచి ఆదాయ పాలసీకి అడుగులు పడటం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. మరో సంవత్సరం గడిచిపోయింది. రైతులకు మంచి భవిష్యత్తు ఉంటుందని అంచనాలు ఎక్కువగా ఉంటున్న సమయంలో 2019 కూడా చరిత్రలో కలిసిపోయింది. కానీ పంటలకోసం పెడుతున్న వ్యయాన్ని రాబట్టుకోవడంలోనే వ్యవసాయదారులు సతమతమవుతున్నారు. హామీ ఇచ్చిన మేరకు ధాన్యసేకరణ జరుగుతున్న కొన్ని పంటలను మినహాయిస్తే దేశవ్యాప్తంగా వ్యవసాయ పంటల ధరలు పడిపోతుండటంతో, రైతులు భారీ నష్టాల బారిన పడుతున్నారు. వ్యవసాయమే ఒక సంక్షోభంగా మారిపోపడంతో వ్యవసాయ కూలీలు కూడా ఆ భారాన్ని మోయాల్సి వచ్చింది. పైగా వ్యవసాయరంగంలో వేతనాలు అయిదేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయాయి. దాదాపు రెండు దశాబ్దాలుగా భారతీయ వ్యవసాయ రంగంలో నిజ ఆదాయాలు పడిపోతూ వస్తున్నాయి. 2019లో కూడా ఈ ధోరణి కొనసాగింది. గత సంవత్సరం ఏప్రిల్లో దేశంలో 42 శాతం భూభాగంలో తీవ్ర కరువు తాండవించింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, జార్ఖండ్, బిహార్, ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలు, రాజస్తాన్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో కరువు తీప్రరూపం దాల్చింది. లోక్సభ ఎన్నికల సమయంలోనే కరువు ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో రైతుల దుస్థితి అంశం ఎన్నికల ప్రచారంలో పతాక స్థాయిని అందుకుంటుందని నేను భావిం చాను. కానీ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణలో కొంత మేరకు తప్పితే వ్యవసాయ సంక్షోభం దేశవ్యాప్తంగా రాజకీయనేతల స్పందనను ఆకర్షించడంలో విఫలమైంది. తీవ్రమైన కరువుకు తోడుగా, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు గతి తప్పడంతో పంట లకు భారీ నష్టం వాటిల్లింది. దీనికి తోడుగా, మహారాష్ట్రలో మూడేళ్ల నిరంతర కరువుబారిన పడి అల్లాడిపోయిన మరట్వాడ ప్రాంతంలో గత ఆగస్టు నెలలో ఉన్నట్లుండి కుండపోత వర్షాలు కురవడంతో అక్కడ అధిక వర్షంతో కరువు అనే కొత్త సమస్య వచ్చిపడింది. కానీ ఇంత విపత్కర స్థితిలోనూ దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 2018–19లో 281.37 మిలియన్ టన్నులకు పెరిగింది. 2013–14 నుంచి 2017–18 మధ్య అయిదేళ్లలో సాధించిన సగటు ఉత్పత్తికంటే 15.63 మిలియన్ టన్నులు ఎక్కువగా ఉత్పత్తయింది. అయితే కరువులు, భారీ వర్షాల నడుమనే రికార్డు స్థాయిలో పంటలు పండినప్పటికీ ఆహారధాన్యాల ఉత్పత్తిలో పెరిగిన లాభం రైతులకు అధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టడంలో విఫలమైంది. నీతి ఆయోగ్ ప్రకారం గత రెండేళ్లలో వ్యవసాయరంగంలో నిజ ఆదాయం దాదాపు సున్నాగా ఉండిపోయిందని తెలిసింది. అంతకు ముందు అయిదేళ్ల కాలంలో అంటే 2011–12 నుంచి 2015–16 మధ్య కాలంలో రైతుల నిజ ఆదాయం ప్రతి సంవత్సరమూ అర్ధ శాతం మాత్రమే పెరుగుదలను నమోదు చేసింది. దురదృష్టవశాత్తూ, నిరుద్యోగం 45 ఏళ్లలో అత్యంత అధిక స్థాయికి పెరిగిపోవడం, ఆర్థిక వ్యవస్థ నిత్య మాంద్యంలో కూరుకుపోవడానికి 2019 సాక్షీభూతమై నిలిచింది. గ్రామీణ ప్రాంతంలో వినియోగాన్ని పెంచాలంటే వ్యవసాయాన్ని బలోపేతం చేయాలి. ఆ విధంగానే మరింత డిమాండును అక్కడ సృష్టించవచ్చు. రైతులు పండించిన ప్రతి పంటకూ లాభం సాధించినప్పుడు మాత్రమే వ్యవసాయం ఉత్తమంగా మార్పు చెందగలదు. వ్యవసాయరంగం లాభదాయకంగా మారినప్పుడు పల్లెల నుంచి నగరాలకు వలస వెళ్లడం మారి నగరాల నుంచి పల్లెలకు వలస వెళ్లే ప్రక్రియ మొదలవుతుంది. దీంతో భారీ స్థాయిలో నిరుద్యోగ యువతకు వ్యవసాయ రంగం ఉపాధి కలిగిస్తుంది. అందుకే వెనకడుగేస్తున్న భారతీయ ఆర్థిక వ్యవస్థను తిరిగి ముందుకు తీసుకెళ్లగల శక్తి వ్యవసాయరంగానికి మాత్రమే ఉందని నేను తరచుగా చెబుతూ వస్తున్నాను. గత రెండు దశాబ్దాలుగా వ్యవసాయ రంగ ఆదాయాలు పతన బాట పట్టుతూ వస్తున్న చరిత్రకు వినియోగ వ్యయంపై ఖర్చుకు సంబంధించిన సర్వే రిపోర్టు సాక్షీభూతమై నిలిచింది. ముందుగానే లీకైన 2017–18 సర్వే రిపోర్టు ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో రైతు కుటుంబాలు ఆహార పదార్థాలపై సగటున నెలకు కేవలం రూ. 580లు మాత్రమే ఖర్చు పెడుతున్నట్లు తెలిసింది. అంటే ఈ దేశంలో ఒక రైతుకుటుంబం ఒక రోజుకు ఆహారంపై పెడుతున్న ఖర్చు రూ. 19లు మాత్రమే అన్నమాట. ప్రపంచ క్షుద్బాధా సూచీ (గ్లోబల్ హంగర్ ఇండెక్స్) ప్రకారం 117 దేశాల్లో భారత్ 102వ స్థానంలో నిలిచింది. వ్యవసాయంపై నేటికీ 60 కోట్లమంది ఆధారపడి ఉన్న దేశంలో పడిపోతున్న వ్యవసాయరంగ ఆదాయాలకు, పడిపోతున్న గృహ ఆహార వినియోగానికి, ఆందోళన కలిగిస్తున్న ఆకలి బాధలకు మధ్య లింకును కనుగొనడం సులభమే అవుతుంది. అందుకే దేశం ముందున్న అతిపెద్ద సమస్య ఏదంటే గ్రామీణ గృహ వినియోగాన్ని పెంచడమే. ఇది గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ, వ్యవసాయేతర రంగాల్లో ఆదాయాలను పెంచడంపైనే ప్రధానంగా ఆధారపడి ఉంది. 2019 మధ్యంతర బడ్జెట్లో, వ్యవసాయ రంగానికి ప్రత్యక్ష నగదు మద్దతును కల్పించడానికి ఒక ప్రయత్నం జరిగింది. నిత్యం బాధలకు గురవుతున్న రైతుల నష్టాలను పాక్షికంగా తగ్గించడానికి ఈ ప్రయత్నం చేపట్టారు. గత కొన్ని సంవత్సరాలుగా రైతులకు ఇలాంటి పథకం అందించాలని నేను పదేపదే చెబుతూ వస్తున్నాను. ప్రధానమంత్రి కిసాన్ సమ్మేళన్ నిధి పథకం కింద దేశంలో భూమి ఉన్న ప్రతి రైతుకూ సంవత్సరానికి 6 వేల రూపాయలను అందించేలా ఒక ప్రొవిజన్ని చేర్చారు. దీనికోసం రూ. 75 వేల కోట్లను అదనంగా బడ్జెట్లో కేటాయించారు. 2018–19 బడ్జెట్లో వ్యవసాయానికి కేటాయించిన రూ.57,000లతో పోల్చితే 2019 మధ్యంతర బడ్జెట్లో 114 శాతం పెరుగుదల కనబడుతుంది. అంటే ప్రత్యక్ష నగదు పథకం ద్వారా దేశంలోని ప్రతి రైతు కుటుంబానికి నెలకు రూ. 500ల కనీస సహాయం అందుతుందన్నమాట. వాస్తవానికి ఇది తక్కువ మొత్తంగా కనిపిస్తున్నప్పటికీ వాస్తవానికి కేంద్రప్రభుత్వ విధాన నిర్ణయంలో ఇది సమూల మార్పుగానే భావించాలి. వ్యవసాయరంగంలో ధరల పాలసీ నుంచి ఆదాయ పాలసీకి అడుగులు పడటం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. దిగజారిపోతున్న దేశీయ ఆర్థిక వ్యవస్థకు ఊతం కలిగించడానికి పరిశ్రమల రంగానికి ప్రోత్సాహకాన్ని ఇవ్వడానికని చెప్పి గత సంవత్సరం కేంద్రప్రభుత్వం మన కార్పొరేట్ రంగానికి రూ. 1.45 లక్షల కోట్ల కార్పొరేట్ పన్ను రాయితీలను ప్రకటించింది. అంతే కాకుండా బ్యాంక్ మూలధనం కింద రూ. 75,000 కోట్లను, రియల్ ఎస్టేట్ ఉద్ధరణ కోసం మరో రూ. 25,000 కోట్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు. కానీ దేశంలో నిజంగా వినియోగంపై డిమాండును పెంచాలంటే అసలైన మార్గం గ్రామీణ పేదల చేతుల్లోకి మరింత ధనం చేరేలా ప్రయత్నాలు చేయాల్సి ఉంది. ఇది జరగాలంటే, ప్రధానమంత్రి–కిసాన్ పథకం, జాతీయ ఉపాధి హామీ పథకం సమర్థ అమలుపై మరింతగా దృష్టిని సారించాల్సి ఉంటుంది. ఈ రెండు పథకాలూ మిగిలిన అన్ని ప్రభుత్వ పథకాల కంటే ఎంతో భిన్నమైనవి. వ్యవసాయ రంగంలో సమూల మార్పులు తీసుకువచ్చేవి. ఈ సందర్భంగా నా సూచన ఏమిటంటే పీఎమ్ కిసాన్ పథకం కింద దేశీయ రైతులకు రూ. 1.50 లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీని అందించాలి. దీనివల్ల ప్రతి రైతు కుటుంబానికీ సంవత్సరానికి రూ. 18,000లు లేక నెలకు రూ. 1,500లు అందుతాయి. దీనికి అదనంగా పీఎమ్–కిసాన్ పథకాన్ని వ్యవసాయరంగంలో 40 శాతంగా ఉన్న భూమిలేని కౌలుదార్లకు కూడా అమలు చేసేలా విస్తరించాలి. అదే సమయంలో జాతీయ ఉపాధి హామీ పథకానికి కూడా అదనపు కేటాయింపులు జరపాలి. పైగా దాని అమలుకు పటిష్ట చర్యలు తీసుకోవాలి. మొత్తంమీద నిజంగా అవసరమైనవారికి ఈ విశిష్ట పథకాల వల్ల కలిగే ప్రయోజనాన్ని అందించడం ప్రధానం కావాలి. వీటితోపాటు వ్యవసాయరంగంలో, గ్రామీణాభివృద్ధి రంగంలో అనేక సంస్కరణలను తీసుకురావాలి. అప్పుడు మాత్రమే గ్రామీణ ప్రాంతాల వినియోగంలో పెరుగుదల సాధ్యమై ఆర్థిక వ్యవస్థ కొత్తపుంతలు తొక్కుతుంది. కార్పొరేట్ రంగంకోసం పన్నుల రాయితీని లేక పన్ను కోతను కొంతకాలం నిలిపి ఉంచవచ్చు. కానీ పేదప్రజలకు రాయితీలను అందించడంలో ఏ పరిస్థితుల్లోనూ జాప్యం చేయవద్దు. వ్యాసకర్త : దేవీందర్ శర్మ, వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
వ్యవసాయానికి ఉద్దీపన వద్దా?
గ్రామీణ కుటుంబాల ఆర్థిక పరిస్థితి క్షీణిస్తోందని అన్ని జాతీయ స్థాయి నివేదికలూ సూచిస్తున్నాయి. కానీ ఆర్థికవేత్తలు మాత్రం నిరుపేదలను ఆదుకోకుండా ఉండటం ఎలా అనే అంశంపై రెండుగా చీలిపోయి ఉన్నారు. ఆర్థిక మందగమనం అనే వ్యాధికి చికిత్స మాత్రం నిచ్చెనమెట్ల మీద ఉన్నవారికే అందించాలని వీరు సూచిస్తున్నారు. దేశ జనాభాలో 50 శాతానికి పైగా ప్రజలకు ఆలంబనగా ఉంటున్న వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోతున్నప్పుడు ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం కూడా తీవ్రంగానే ఉంటుంది. అందుచేత వ్యవసాయాన్ని పునరుద్ధరించడమే కీలక విషయం. ప్రస్తుతం భారతీయ ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక ఉద్దీపన అవసరం ఏ రంగానికైనా ఉంది అంటే అది వ్యవసాయ రంగం మాత్రమే. పేదల చేతికి ఎంత ఎక్కువగా డబ్బు అందిస్తే అంత ఎక్కువగా దేశంలో డిమాండ్ సృష్టించవచ్చు. ఇదే ఇప్పుడు అత్యంత అవసరమైన చర్య. దశాబ్దాలుగా భారతీయ వ్యవసాయం దుస్థితి బాటలో సాగుతోందని సంకేతాలు స్పష్టంగా కనబడుతున్నాయి. దేశ ప్రజలు వినియోగంపై వెచ్చిస్తున్న వ్యయంపై, లీక్ అయిన ‘నేషనల్ సాంపిల్ సర్వే ఆఫీసు (ఎన్ఎస్ఎస్ఓ) 2017–18’ నివేదిక ప్రకారం గ్రామీణ కుటుంబాలు ఆహా రంపై అతితక్కువగా ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వం బుట్ట దాఖలు చేయాలని నిర్ణయించిందనుకోండి. పోతే ‘2016 ఎకనమిక్ సర్వే’ మరింత చేదు వార్తను తెలిపింది. దేశంలోని 17 రాష్ట్రాల సగటు వ్యవసాయ కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ. 20,000కు మించి లేదట. అంటే వ్యవసాయ కుటుం బాలు రోజువారీ వినియోగంపై ఎంత తక్కువగా ఖర్చుపెడుతున్నాయో దీన్నిబట్టే తెలుస్తుంది. ‘వినియోగ వ్యయంపై సర్వే’ ప్రకారం, గ్రామీణ ప్రాంతాల్లో ఆహారంపై నెలకు సగటున ఒక కుటుంబం రూ. 580 లు (రోజుకు 19 రూపాయలు) మాత్రమే ఖర్చుపెడుతోందని వెల్లడించగా, ఎకనమిక్ సర్వే మరింత ఆసక్తికరమైన డేటాను బయటపెట్టింది. వ్యవసాయ కుటుంబాలు అమ్మగలుగుతున్న ఉత్పత్తులపైనే కాకుండా గృహ వినియోగం కోసం వారు భద్రపర్చుకున్న ఆదాయాన్ని కూడా కలుపుకుని రైతు కుటుంబాల ఆదాయాన్ని అది వెల్లడించింది. దేశం లోని వ్యవసాయ కుటుంబాలు నెలకు రూ. 1,700 కంటే తక్కువ ఆదాయ స్థాయిలతో ఎలా జీవిస్తున్నాయా అని ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. వ్యవసాయ ధరలు కనిష్టస్థాయిలో ఉంటూండగా, వ్యవసాయ ఆదాయాలు 14 ఏళ్ల కనిష్టస్థాయికి పడిపోయాయి. ఇక వ్యవసాయ వేతనాలు కూడా గత కొన్నేళ్లుగా పతనమవుతూ వస్తున్నాయి. లీకైన మరొక డాక్యుమెంట్ ‘పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2017–18’ నివేదిక ఇంకా దారుణమైన విషయం బయటపెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో 3.4 కోట్ల మంది దినసరి కూలీలు 2011–18 మధ్య కాలంలో తమ ఉపాధిని కోల్పోయారు. వీరిలో 3 కోట్లమంది వ్యవసాయ కూలీలే. గత 45 ఏళ్లలో నిరుద్యోగం పరాకాష్టకు చేరుకోవడంతో సంక్షోభం వ్యవసాయ పరిధిని దాటిపోయింది. ఈ అన్ని నివేదికలూ గ్రామీణ కుటుంబాల ఆర్థిక పరిస్థితి క్షీణిస్తోందని సూచిస్తున్నాయి. రైతు కుటుంబాల ఆర్థిక సంపన్నతా లేమి అనేది భవిష్యత్తులో గ్రామీణ వ్యయంపై కూడా తన ప్రభావం చూపనుంది. అయితే ఆర్థికవేత్తలు మాత్రం అధోజగత్ సహోదరులను ఆదుకోకుండా ఉండటం ఎలా అనే అంశంపై రెండుగా చీలిపోయి ఉన్నారు. బలహీనమైన వినియోగదారీ డిమాండ్, ప్రైవేట్ పెట్టుబడులు మందగించిపోవడం అనే రెండు ప్రధాన అంశాలే ఆర్థిక వ్యవస్థను మందగింప జేస్తున్నాయని ప్రధాన స్రవంతి ఆర్థిక వేత్తలు ఒప్పుకుంటున్నారు. వీటివల్లే ఈ జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో దేశీయ ఆర్థిక వృద్ధి రేటు 4.5 శాతానికి పడిపోయింది. అంటే ఆరేళ్లలో ఇది అత్యంత తక్కువ వృద్ధి రేటు అన్నమాట. కానీ ఆర్థిక మందగమనం అనే వ్యాధికి చికిత్స మాత్రం నిచ్చెనమెట్ల మీద ఉన్నవారికే అందించాలని వీరు సూచిస్తున్నారు. అయితే పారిశ్రామిక సంస్థలు మాత్రం ఆర్థిక మందగమనాన్ని అవకాశంగా మల్చుకోవాలని చూస్తున్నాయి. చౌక శ్రమ, సరళతరమైన భూ సేకరణ, కార్పొరేట్ పన్ను తగ్గింపు, పన్నుల ఉగ్రవాదాన్ని తొలగించడం, దివాలా సమస్యలను సత్వరం తీర్చడం వంటి వాటి రూపంలో మరిన్ని సంస్కరణలను అమలు చేసేలా వ్యవస్థను ప్రభావితం చేయాలని ఇవి చూస్తున్నాయి. దీనికోసం సెక్టర్ ఆధారిత ఉద్దీపన కోసం పట్టుబడుతున్నాయి.పిరమిడ్ పునాదిపైనే మరింత దృష్టి పెట్టాలనే అంశాన్ని ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తలు అంగీకరిస్తుండగా, మరింత సంస్కరించడం ద్వారానే ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలని కొంతమంది ఆర్థిక వేత్తలు సూచిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థను ముందుకు నెట్టాలంటే కార్పొరేట్ పన్ను ఉద్దీపన, రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ సెక్టార్, బ్యాంక్ కన్సాలిడేషన్, మూలధన సేకరణ, ఎగుమతి ప్రోత్సాహకాలు, మైక్రో, చిన్నతరహా, మధ్య తరహా పరిశ్రమలకు కొన్నిరాయితీలు కల్పించడం అవసరమని వీరు చెబుతున్నారు. కొందరు ఆర్థికవేత్తలయితే ఇప్పటికే సంపదల మేట మీద సౌకర్యవంతంగా కూర్చున్న కొన్ని పరిశ్రమలకు పన్ను విధింపును ఎందుకు ఎత్తివేయాలని ప్రశ్నించారు. కుంగిపోతున్న ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకుపోవడానికి ఇది మార్గం కానే కాదని వీరు చెబుతున్నారు. ఇప్పటికే జీడీపీ 5 శాతం లోపు పడిపోయిన నేపథ్యంలో కార్పొరేట్ పన్ను రేటును భారీగా తగ్గించడం, ప్రతి సంవత్సరం 1.45 లక్షల కోట్ల ఉద్దీపనను అందించడం అనేది పన్ను రూపేణా వచ్చే ప్రభుత్వ రాబడిని మరింత బలహీన పరుస్తుంది. పన్ను రాయితీలు గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టులలో మరిన్ని పెట్టుబడులను కల్పించి వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తాయని, ఇది మరిన్ని ఉద్యోగాల కల్పనకు దారితీస్తుందని చేస్తున్న వాదనను అంతర్జాతీయ అనుభవం తోసిపుచ్చుతోంది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక తగ్గించిన కార్పొరేట్ పన్నులు అటు పెట్టుబడులనూ తీసుకురాలేదని, ఇటు ఉద్యోగాలనూ కల్పించలేదని పైగా పన్నుల తగ్గింపు ద్వారా మిగిలిన మొత్తాన్ని కార్పొరేట్ రంగం స్టాక్ మార్కెట్లో మదుపు చేసిందని నోబెల్ గ్రహీత పాల్ క్రూగ్మన్ స్పష్టం చేశారు. కార్పొరేట్ పన్నులు భారీగా తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించగానే ఆ మరుసటి దినం భారతీయ స్టాక్ మార్కెట్లు పండుగ చేసుకున్నాయంటే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ఆ సంబరాలు ఇంకా కొనసాగుతుండగా, పన్ను రేటు తగ్గింపు తర్వాత విదేశీ నిధుల ప్రవాహం పెరుగుతూ వచ్చింది. కానీ, కేవలం 5 రూపాయల బిస్కెట్ కూడా కొనలేకపోతున్న చాలామంది పేదవారి గురించీ, అష్టకష్టాలు పడి పండిం చిన పంటను మార్కెట్లో తగిన ధరకు అమ్ముకోలేకపోతున్న రైతుగురించీ, దినసరి వేతనాలను కూడా పొందడం కష్టమైపోతున్న వ్యవసాయ, వ్యవసాయేతర కూలీల గురించే నేను ఆందోళన చెందుతున్నాను. ఇక వ్యవసాయరంగంలో నిరుపేదలకు ఎలాంటి ప్రోత్సాహకాలనూ కేంద్రం ప్రకటించడం లేదు. గిట్టుబాటు ధర లేమితో 2000–2017 మధ్య 16 ఏళ్ల కాలంలో రూ. 45 లక్షల కోట్లను రైతులు నష్టపోయారు. కాగా గత రెండేళ్లలో వ్యవసాయ రంగ నిజ ఆదాయాల పెరుగుదల దాదాపుగా జీరోగా ఉంటోందని నీతి ఆయోగ్ సొంత అంచనాలే చూపుతున్నాయి. మరోమాటలో చెప్పాలంటే, గత రెండు దశాబ్దాలుగా రైతుల ఆదాయాలు పతనబాటలోనే నడుస్తున్నాయి. వ్యవసాయ వేతనాల్లో వృద్ధి రేటు కూడా పడిపోతోంది. దేశ జనాభాలో 50 శాతానికి పైగా ప్రజలకు ఆలంబనగా ఉంటున్న వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోతున్నప్పుడు ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం కూడా తీవ్రంగానే ఉంటుంది. అందుచేత వ్యవసాయాన్ని పునరుద్ధరించడమే కీలక విషయం. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక ఉద్దీపన అవసరం ఏ రంగానికైనా ఉంది అంటే అది వ్యవసాయ రంగం మాత్రమే. రైతులకు పరిహారం చెల్లించాల్సిన సమయం కూడా నేడు ఆసన్నమైంది. పారిశ్రామిక రంగానికి రూ.1.45 లక్షల కోట్ల రూపాయల పన్ను రాయితీని కేటాయించినప్పుడు, అదే మొత్తాన్ని వ్యవసాయ రంగానికి కూడా అందిస్తే ప్రధానమంత్రి కిసాన్ స్కీమ్ కింద ఇప్పుడు ఇస్తున్న మొత్తాన్ని ప్రతి రైతు కుటుంబానికి మూడు రెట్లు పెంచి ఇవ్వవచ్చు. అంటే సంవత్సరానికి ఒక్కో రైతుకు రూ. 18,000లు, లేక నెలకు రూ. 1,500లు ఇవ్వవచ్చు. ఈ పథకాన్ని భూమి లేని రైతుకూలీలకు కూడా పొడిగించవచ్చు. ఇప్పటికే పీఎం–కిసాన్ పథకం కింద రూ. 75,000ల కోట్లు కేటాయించారు. దీనికి మరొక రూ. 1.45 లక్షల కోట్లను అదనంగా చేర్చి ఇవ్వాల్సి ఉంది. పేదల చేతికి ఎంత ఎక్కువగా డబ్బు అందిస్తే అంత ఎక్కువగా డిమాండ్ సృష్టించవచ్చు. ఈ చర్యలతోపాటు ప్రభుత్వ ధాన్యసేకరణను మరింత సమర్థవంతంగా చేయడానికి వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ అజమాయిషీలో నడిచే మండీల నెట్వర్క్ని విస్తరించాలి. అన్ని రకాల పంటలకు కనీస మద్దతు ధరకు ప్రకటించిన మేరకు హామీ ఇవ్వాలి. లోటును చెల్లించడం ద్వారా కనీస మద్దతు ధర, మార్కెట్ ధరలకు మధ్య వ్యత్యాసాన్ని తగ్గించాలి. వీటికి అదనంగా కేరళ అనుభవం నుంచి పాఠాలు తీసుకుని ప్రతి రాష్ట్రంలోనూ రుణ ఉపశమన కమిషన్ను ఏర్పర్చాలి. గ్రామీణ రహదారులు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు వంటి ప్రజా రంగ సేవలపై అధిక మదుపును చేయాలి. దేవీందర్ శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
స్వల్ప ఆదాయాలతో రైతుకు చేటు
భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న, వెనుకబడిన దేశాల్లో తక్కువ ధరతో దొరికే వ్యవసాయ ఉత్పత్తులను రూపొందించాలనేది ప్రపంచ మార్కెట్ డిజైన్గా అమలవుతోంది. ఈ నేపథ్యంలోనే వ్యవసాయ అవసరాల కోసం కాకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం హైటెక్ టెక్నాలజీని వాడుతున్న విధానాలపై ప్రపంచ వ్యాప్తంగా రైతులు తీవ్రంగా ఆగ్రహిస్తున్నారు. రైతుకు సబ్సిడీలు కాదు.. తమ ఉత్పత్తులను తక్కువ ధరలకు అందించడం ద్వారా రైతులే దేశానికి సబ్సిడీలు అందిస్తున్నారు. వ్యవసాయంలోకి కార్పొరేషన్లు ప్రవేశించే కొద్ది చిన్న కమతాలు తప్పుకుంటున్నాయి. వాటిలో వచ్చే స్వల్ప ఆదాయాలు రైతుకు ప్రాణాంతకంగా మారుతున్నాయి. న్యాయవాదిగా కూడా పనిచేస్తున్న ఒక న్యూయార్క్ రైతు కొన్ని రోజుల క్రితం ట్వీట్ చేశారు : నేను ఈరోజు న్యాయవాద కార్యాలయంలో పనిచేయడానికి ప్రయత్నించాను. కానీ నా మనసు మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో నేను చూస్తున్న పాడిపరిశ్రమ రైతుల జీవితాల్లో విధ్వంసం చుట్టూ తిరిగింది. చాలా కాలం నుండి మా ప్రాంతంలో రైతులు తమ వద్ద ఉన్న కొన్ని భూములను అమ్మివేసి మిగిలిన భూములను కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇది ఎక్కడికి దారితీస్తుంది? నాకు తెలీదు. ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన వ్యవసాయ ఉత్పాదక వ్యవస్థ ఉన్న అమెరికాలోనే వ్యవసాయ సంక్షోభం ఈ స్థితిలో అలుముకుంటున్నప్పుడు మనం కూడా ఒకసారి ఆగి మళ్లీ ఆలోచించాల్సి ఉంది. ఇప్పుడు మనం వేయవలసిన ప్రశ్న ఒక్కటే. అమెరికా వ్యవసాయ విధానం ఉద్దేశపూర్వకంగా వ్యవసాయరంగాన్ని క్షీణింపచేయాలనే ఉద్దేశాన్ని కలిగి ఉందా? ఈ అర్థంలో భారతీయ వ్యవసాయం కూడా ఆ దశలోనే ప్రయాణిస్తోందా? భారతదేశంలో భూకమతాలు చిన్నవి కాబట్టి ఆర్థికంగా లాభసాటి కావు అంటే అర్థం చేసుకోవచ్చు కానీ సగటు వ్యవసాయ పొలం పరిమాణం 444 ఎకరాలుగా ఉంటున్న అమెరికాలో కూడా చిన్న కుటుంబ పొలాలు వైదొలగాల్సిందేనా? సగటు వ్యవసాయ భూమి పరిమాణం కనీసం 4,331 హెక్టార్లుగా ఉంటున్న ఆస్ట్రేలియాలోనూ వ్యవసాయం నష్టదాయకంగానే ఉండాల్సిందేనా? ఈ దేశాల్లో సాగుతున్న వ్యవసాయ పరిమాణాన్ని చూస్తే అమెరికా, ఆస్ట్రేలియా దేశాలు వ్యవసాయం నుంచి వైదొలగడానికి సమర్థమైన కారణం లేదు. చిన్న కమతాలు లాభదాయకం కాదు అనుకున్నట్లయితే, భారీ కమతాలు కూడా ఆర్థికంగా లాభదాయకం ఎలా కాకుండా పోతాయి? భారతదేశంలోనే కాదు ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లోనూ రైతులకు నిజ ఆదాయాలను తోసిపుచ్చి వ్యవసాయ ఆదాయానికి వారిని దూరం చేస్తున్నారన్న వాస్తవాన్ని అంగీకరించడానికి మన విధాన నిర్ణేతలు తిరస్కరించకపోతే పరిస్థితులు ఇలా ఉండేవి కావు. మొట్టమొదటగా, మనం ఒక విషయం పట్ల స్పష్టంగా ఉందాం. అమెరికాలో ఎప్పట్నుంచో సన్నకారు రైతులను వ్యవసాయం నుంచి దూరం చేస్తూ వస్తోంది. ముఖ్యంగా అమెరికా వ్యవసాయం సంక్షోభ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా అమెరికన్ వ్యవసాయ మంత్రి సోన్నీ పెరూడ్య ఏమాత్రం జంకూ గొంకూ లేకుండా ఒక ప్రకటన చేశారు. ‘అమెరికాలో, పెద్దది మరింత పెద్దది అవుతుంది అలాగే చిన్నది అడ్రస్ లేకుండా పోతుంది’. అమెరికాలో నాటి అధ్యక్షులు రిచర్డ్ నిక్సన్, గెరాల్డ్ ఫోర్డ్ హయాంలో పనిచేసిన మాజీ అమెరికా వ్యవసాయ మంత్రి ఎర్ల్ బట్జ్ సుప్రసిద్ధ వ్యాఖ్య చేశారు. ‘మరింత ఎదగండి లేదా వెళ్లిపోండి.’ దీనితర్వాత అత్యంత జాగ్రత్తతో ‘ప్రపంచానికి తిండి పెట్టడం’ అనే పేరిట సిద్ధం చేసిన ముసాయిదాలో ‘భారీ స్థాయిలో మిగులు ఉత్పత్తి చేయండి’ అని రైతులకు పిలుపునిచ్చారు. అదనపు ఉత్పత్తి అంటే వాస్తవానికి ధరలు పడిపోవడమనే అర్థం. ఇలాంటి దూకుడు చర్య అమెరికా సన్నకారు రైతులను ఇక్కట్లలోకి నెట్టింది. ప్రభుత్వ విధానాల కారణంగానే చాలామంది వ్యవసాయ వాణిజ్యం నుంచి పక్కకు తప్పుకోవడమే కాకుండా వ్యవసాయరంగం నుంచి తీవ్ర నిరాశతో వైదొలిగారు. మరింత భారీగా పెరగండి అనే విధానం వ్యవసాయంపై కార్పొరేట్ నియంత్రణ పెరిగేందుకు ఆహ్వానం మాత్రమే. ఇది అభివృద్ధి చెందుతున్న ప్రపంచాన్ని కూడా అనుసరించాలంటూ రాసిన అలిఖిత విధానంగా కూడా మారింది. అది ప్రపంచ వాణిజ్య వ్యవస్థ కావచ్చు లేక ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్సీఈపీ) కావచ్చు ప్రపంచ వాణిజ్య విధానాలన్నీ బడా వ్యవసాయ దిగ్గజ సంస్థలు వ్యవసాయరంగంలోకి ప్రవేశించే వాతావరణాన్ని కలిగిస్తున్నాయి. పోటీ అనేది మార్కెట్ మంత్రంగా మారినందున, అభివృద్ధి చెందుతున్న, వెనుకబడి ఉన్న దేశాల్లో తక్కువ ధరతో దొరికే వ్యవసాయ ఉత్పత్తులను రూపొందించాలని నిర్బంధిస్తున్నారు. దీనివల్ల లక్షలాది సన్నకారు రైతులు వ్యవసాయం నుంచి నిష్క్రమిస్తున్నారు. దీన్ని ఇంకాస్త విపులంగా చూద్దాం. చైనాలో అతి పెద్ద పాడిపరిశ్రమ విస్తీర్ణం 2 కోట్ల 25 లక్షల ఎకరాలు. ఇది పోర్చుగల్ విస్తీర్ణంతో సమానం. వరల్డ్అట్లాస్.కామ్ ప్రకారం ఈ వ్యవసాయ క్షేత్రంలో లక్ష ఆవులు ఉన్నాయి. ఇక రెండో అతిపెద్ద పాడి పరిశ్రమ కోటీ 10 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇది కూడా చైనాలోనే ఉంది. ప్రపంచంలోని పది అతిపెద్ద పాడి పరిశ్రమ సంస్థల్లో ఎనిమిది సంస్థలు ఆస్ట్రేలియాలో ఉంటున్నాయి. రీజనల్ దిగ్గజ సంస్థ అయిన ఆర్సీఈపీ ద్వారా చైనా తదితర దేశాలు భారత్లోకి దూరాలని తీవ్రంగా ప్రయత్నించాయంటే ఆశ్చర్యపడాల్సింది ఏదీ లేదు. సరైన సమయంలో భారతదేశం ఆర్సీఈపీలో చేరకూడదని నిర్ణయించుకోవడం ముదావహం. మన దేశంలో పాడిపరిశ్రమలో కోటి మంది ప్రజలు భాగం పంచుకుంటున్నారన్నది తెలిస్తే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, చైనాల నుంచి తక్కువ ధరకు లభించే పాల ఉత్పత్తులు భారత్లోని కోటిమంది జీవితాలను ధ్వంసం చేసిపడేసేదని అర్థమవుతుంది. వ్యవసాయం కేసి చూస్తే గ్రామీణ భారత్లాగే గ్రామీణ అమెరికా కూడా తీవ్రమైన వ్యవసాయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. భారత్కు లాగే అమెరికాలోని 17 రాష్ట్రాల్లో అంటే దాదాపు సగం దేశంలోని రైతు కుటుంబాల సగటు ఆదాయం సంవత్సరానికి 20 వేల రూపాయంగా మాత్రమే ఉంటోంది. అంటే అమెరికా వ్యవసాయం కూడా ఏమంత మంచిగా సాగటం లేదు. అమెరికాలో సగం పైగా రాష్ట్రాల రైతుల ఆదాయం ప్రతికూల గమనంతో ఉంది. అమెరికన్ ఫామ్ బ్యూరో ఫెడరేషన్ ప్రకారం 91 శాతం రైతులు, వ్యవసాయ కూలీలు సంక్షోభంలో ఉన్నారు. ఇది వారి మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడంతోపాటు అక్కడి వ్యవసాయ సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందంటే అమెరికా రైతులు వ్యవసాయాన్నే వదిలేయాల్సి వస్తుందని భయపడుతున్నారు. 2019లో అమెరికా వ్యవసాయ రుణం 416 బిలి యన్ డాలర్లకు పెరగనుందని అంచనా. ఇది 1980ల నుంచి చూస్తే అత్యధిక మొత్తంగా చెప్పాలి. అనేక దశాబ్దాలుగా మన దేశంలోనూ వ్యవసాయ ఉత్పత్తుల ధరలు స్తంభించిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఉల్లిపాయ ధరలు కిలో వంద రూపాయలకు పెరిగితేనే అల్లాడిపోతున్నాం. కానీ గత 30 సంవత్సరాలుగా అమెరికాలో రైతులు పండిం చిన పంటల ధరలు ఏమాత్రం పెరగలేదు. ఇక 5 దశాబ్దాలుగా మొక్క జొన్న ధరలు అలాగే ఉంటున్నాయి. వ్యవసాయరంగంలో అత్యున్నత సాంకేతిక జ్ఞానాన్ని వినియోగిస్తూ, తక్కిన ప్రపంచానికి ఒక ఉదాహరణగా నిలబడుతున్న దేశంలోనే వ్యవసాయ సంక్షోభం ఇంత తీవ్రస్థాయిలో ఉందంటే, భారతీయ వ్యవసాయరంగంలో అత్యధునాతన (తరచుగా అవాంఛిత) టెక్నాలజీని మరింతగా వాడాలని చేస్తున్న సూచనలు, సలహాలు అసందర్భపూరితమనే చెప్పాలి. టెక్నాలజీకి ఎవరూ వ్యతిరేకం కాదు. కానీ దాన్ని మరొకరి వాణిజ్య ప్రయోజనాల కోసం కాకుండా అవసరాలపై ఆధారపడి టెక్నాలజీని వినియోగించాలి. వ్యవసాయంలో పూర్తిగా హైటెక్ పద్ధతులను అవలంబిస్తున్న దేశంలోనే గ్రామీణ ప్రాంతాల్లో ఆత్మహత్యలు పట్టణ ప్రాంతాల్లో ఆత్మహత్యల కంటే 45 శాతం ఎక్కువగా ఉంటున్నాయంటే, భారతీయ వ్యవసాయాన్ని మనం పూర్తిగా పునర్నిర్మించాల్సిన సమయం ఆసన్నమైంది. చిన్న కమతాలను వృద్ధి చేయడం ద్వారానే గ్రామీణులు పట్టణాలకు వలస వెళ్లడాన్ని తగ్గించగలమా? దేశీయ అవసరాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తూ సరికొత్త వ్యూహాన్ని వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ అవలంబించడం ద్వారానే మన వ్యవసాయాన్ని పర్యావరణ స్వావలంబన, ఆర్థిక లాభదాయకత వైపు తీసుకుపోవచ్చు. భారతీయ రైతులు గత రెండు దశాబ్దాలుగా అంటే 2000–01 నుంచి 2016–17 మధ్య కాలంలో ప్రతి సంవత్సరం 14 శాతం నష్టాలను చవిచూస్తున్నారు. ఇది వినియోగదారులకు తాము చెల్లించాల్సిన దానికంటే 25 శాతం తక్కువ ధరలతో మేలు కలిగిస్తోంది. మరోమాటలో చెప్పాలంటే ఇన్నేళ్లుగా వ్యవసాయదారులు దేశానికే సబ్సిడీని అందిస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలను ఉద్దేశపూర్వకంగా తగ్గిస్తున్న ప్రపంచ ఆర్థిక డిజైన్ ప్రపంచ వ్యాప్తంగా రైతుల్లో ఆగ్రహావేశాలను పెంచుతోంది. జర్మనీ, హాలండ్, కెనడా, అమెరికా, భారతదేశంలోని వీధుల్లో రైతుల నిరసనలకు దిగుతున్నారు. ఆస్ట్రేలియా జాతీయ రైతుల సమాఖ్య అధ్యక్షుడు మెక్లాక్లాన్ కొన్నాళ్ల క్రితం ఒక రైతుల ర్యాలీలో చెప్పిన మాట ప్రపంచ వ్యాప్తంగా రైతు ఆగ్రహానికి కారణాన్ని స్పష్టం చేస్తోంది. అదేమిటంటే...‘‘తక్కిన ఆస్ట్రేలియా మొత్తానికి సబ్సిడీని అందించే పనిలో మేం అలసిపోయాం, రోగగ్రస్తులమైపోయాం’’. వ్యాసకర్త దేవీందర్ శర్మ, వ్యవసాయ నిపుణులు, ఈ–మెయిల్ : hunger55@gmail.com. -
ఆర్సీఈపీ నుంచి నిష్క్రమణ సరైందే!
ప్రపంచీకరణ పెనుతుఫానుకు ఎదురొడ్డటానికి ఒక దృఢమైన నాయకుడు ధైర్య సాహసాలను ప్రదర్శించడం నిజంగానే ప్రశంసనీయం. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో చేరకపోతే దేశం ఎంత గొప్ప అవకాశాన్ని కోల్పోతుందో అంటూ ఆర్థిక వేత్తలు భయాలను ప్రేరేపిస్తున్న సమయంలో ఆ ఒప్పందంలో సమతుల్యతా లేమి గురించి ప్రధాని నొక్కి చెప్పడం పూర్తిగా సహేతుకమైనదే. గతంలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ద్వారా దేశీయ వాణిజ్య లోటు 107.28 బిలియన్ డాలర్లకు పెరిగిపోయింది. అందుకే ఆర్సీఈపీలో చేరడాన్ని తిరస్కరిస్తూ ప్రధాని ముందుచూపుతో తీసుకున్న సాహసోపేత నిర్ణయం సరైందేనని చెప్పాలి. ఈ దశలో ఆర్సీఈపీ ఒప్పందంలోకి ప్రవేశించడమంటే ఇప్పటికే ఉన్న మన వాణిజ్య లోటు మరింత పెరుగుతుందని, వ్యవసాయరంగాన్ని దారుణంగా దెబ్బతీస్తుందనే ఎరుకను కూడా ప్రధాని ప్రకటన స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే.. ప్రపంచ జీడీపీలో 40 శాతం కలిగి ఉన్న 12 దేశాల మధ్య కుదిరిన ట్రాన్స్ పసిఫిక్ భాగస్వామ్య (టీపీపీ) ఒప్పందాన్నుంచి వైదొలగాలని డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించుకోవడం విమర్శలకు దారితీసింది. దాన్ని భయానకమైన ఒప్పందంగా వర్ణించిన ట్రంప్.. వ్యవసాయ, వస్తూత్పత్తి రంగాలలో 18,000 రకాల సుంకాలను తొలగించాల్సి వస్తుందని, కచ్చితంగా అమెరికా ఉద్యోగాలను ఇది కొల్లగొడుతుందని వ్యాఖ్యానించారు. అలాగే ప్రపంచ జనాభాలో 45 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తూ, ప్రపంచ స్థూలదేశీయోత్పత్తిలో 25 శాతం వాటాను కలిగి ఉన్న ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్సీఈపీ) అనే మరొక భారీ వాణిజ్య ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. ‘‘భారతీయులందరి ప్రయోజనాలకు అనుగుణంగా ఆర్సీఈపీ ఒప్పందాన్ని అంచనా వేసినప్పుడు నాకు సానుకూల సమాధానం దొరకలేదు. అందుచేతనే గాంధీ సిద్ధాంతాలు కానీ, నా అంతశ్చేతన కానీ ఆర్సీఈపీలో చేరడానికి నన్ను అనుమతించలేదు’’. ఈ వ్యాఖ్యలు నిజంగానే చాలా గొప్పవి. ట్రంప్కు మల్లే.. మోదీ మనస్సులో కూడా ఈ ఒప్పందంలో భాగంగా వస్తూత్పత్తి, వ్యవసాయరంగంతోపాటు 92 శాతం వాణిజ్య సరుకులపై సుంకాలను తొలిగిస్తే దేశంలో భారీ ఎత్తున ఉద్యోగాలు కోల్పోతారని, ప్రజాజీవితం ధ్వంసమవుతుందనే ఆలోచన ప్రబలి ఉంటుంది. ఆర్థికవేత్తల్లో చాలామంది ప్రపంచీకరణ వైపు పరుగులెత్తుతున్న సమయంలో ఆ తుపానుకు ఎదురొడ్డటానికి ఒక శక్తిమంతుడైన నాయకుడు రాజకీయపరంగా ధైర్యసాహసాలను ప్రదర్శించడం నిజంగానే ప్రశంసనీయం. పైగా, ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో చేరకపోతే దేశం ఎంత గొప్ప అవకాశాన్ని కోల్పోతుందోనంటూ ఆర్థికవేత్తలు భయాన్ని ప్రేరేపిస్తున్న సమయంలో ఆ ఒప్పందంలోని ధర్మబద్ధత, సమతుల్యత గురించి ప్రధాని ప్రశ్నిం చడం సహేతుకమేనని చెప్పాలి. గతంలోనూ ఈ ఆర్సీఈపీలోని 12 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకున్న భారత్ వాటి మార్కెట్లలో సులభంగా ప్రవేశించవచ్చనే భ్రమలకు గురైంది కానీ వాస్తవానికి ఆ ఒప్పందాల ద్వారా దేశీయ వాణిజ్య లోటు 107.28 బిలియన్ డాలర్లకు అమాంతంగా పెరిగిపోయింది. ఈ దశలో ఆర్సీఈపీ ఒప్పందంలోకి ప్రవేశించడమంటే మన వాణిజ్య లోటు మరింత పెరుగుతుందని, వ్యవసాయరంగాన్ని దారుణంగా దెబ్బతీస్తుందనే ఎరుకను కూడా ప్రధాని ప్రకటన స్పష్టం చేసింది. అదే సమయంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తుందన్న అంచనాతో ఇతరదేశాలతో ద్వైపాక్షిక మదుపు ఒప్పందాలపై సంతకాలు చేయడంపై భారత్ ప్రదర్శించిన అత్యుత్సాహం అస్పష్టంగా, అనిశ్చితంగా ఉండటమే కాకుండా సరైన ముందస్తు ప్రణాళిక లేమిని సూచి స్తుంది. తర్వాత ఈ ఒప్పందాల అమలు క్రమంలో అంతర్జాతీయ మధ్యవర్తిత్వాలు పెరుగుతూ పోవడంతో 58 ద్వైపాక్షిక మదుపు ఒప్పందాలను భారత్ రద్దు చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలియని భయాలను మరీ ఎక్కువగా చూపిం చడం అర్థం చేసుకోదగినదే. తూర్పు ఆసియా ఆర్థిక వ్యవస్థలకు చెందిన ముఖ్యమైన మార్కెట్లలోకి చొచ్చుకుపోవడమనే అన్వేషణలో భాగంగా ఆసియా దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకున్నప్పటికీ అవేమంతగా పని చేయలేదు. స్పష్టంగా చెప్పాలంటే 2010లో 10 ఆసియన్ దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాల కారణంగా భారతీయ వాణిజ్య లోటు 250 శాతానికి భారీగా పెరిగిపోయింది. భారత్–ఆసియన్ దేశాల మధ్య ఒప్పందంపై తగినంత అంచనా, సరైన తనిఖీ లేకుండా అవకాశాలు కోల్పోతామని భయం ప్రాతిపదికన సంతకాలు చేశామన్నది స్పష్టంగా బోధపడింది. అందుచేత ఇప్పుడు భారత ప్రధాని ఇండో–ఆసియన్ వాణిజ్య ఒప్పందాన్ని తిరిగి సమీక్షించాలని పిలుపునివ్వడం అర్థం చేసుకోదగినదే. నిజానికి ఇండో–ఆసియన్ వాణిజ్య ఒప్పందాలను మాత్రమే కాకుండా, ఇంతవరకు భారత్ కుదుర్చుకున్న అన్ని రకాల ద్వైపాక్షిక, బహుళ వాణిజ్య ఒప్పందాలను పూర్తిగా సమీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందం ఉనికిలోకి వచ్చినప్పుడు, చాలా ఉల్లాసపూరితమైన వ్యాఖ్యలు పుట్టుకొచ్చాయి. ఒకదేశం, ఒకే ఓటు ప్రాతిపదికన బహళ వాణిజ్య వ్యవస్థకు అవకాశం కల్పిస్తే ద్వైపాక్షిక ఒప్పందాలకు ప్రతిబంధకం ఏర్పడుతుందని అప్పట్లో మనకు చెప్పేవారు. కానీ కాలం గడిచే కొద్దీ ఇది తప్పు అని రుజువైంది. సూత్రబద్ధంగా ప్రపంచవాణిజ్య సంస్థ ఒప్పందాల్లో భాగంగా 300 పైచిలుకు ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను భారత్ కుదుర్చుకోగలిగింది. ఈ ఒప్పందాలన్నీ బలమైన మేధో సంపద హక్కులు, మార్కెట్లకు పూర్తిగా తలుపులు తెరవడాన్ని సుసాధ్యం చేశాయి. అనేక దేశాలు ఇప్పటికే (దిగుమతులపై జీరో టారిఫ్, పన్నేతర ప్రతిబంధకాలను తొలగించడం ప్రాతిపదికన) ద్వైపాక్షిక ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. అయితే మెజారిటీ సభ్య దేశాలు ఇప్పటికే విడివిడి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కలిగివున్నందున ప్రాంతీయ ఒప్పందాల నుంచి ప్రోత్సాహక వృద్ధిని ఎలా ఆశిస్తామన్నదాన్ని అంచనా వేయటంలో నేను విపలమయ్యానని అంగీకరించాలి. అయితే ఇప్పుడు ఏర్పడుతున్న కొత్త వాణిజ్య కూటమిలో చైనా వంటి దిగ్గజ ఆర్థిక వ్యవస్థలు (ఇప్పటికే భారత్కు చైనాతో 53 బిలియన్ డాలర్ల మేరకు వాణిజ్య లోటు ఉంది), ఆస్ట్లేలియా, న్యూజిలాండ్ వంటి సంపన్న దేశాలు చేరి ఉన్నాయి. పైగా ఇవన్నీ భారత పాల పరి శ్రమ, వ్యవసాయరంగంపై కన్నేశాయి. తమ సొంత పాల పరిశ్రమ ఉత్పత్తులను భారత్లో గుమ్మరించడానికి ఇవి కాచుకుని ఉన్నాయి. ఇది ఏమేరకు మనకు ప్రయోజనకరమో ఊహించుకోవలసిందే మరి. ఆర్సీఈపీ వాణజ్య భాగస్వాములతో వ్యహరించేటప్పుడు భారత్ తీసుకున్న ఈ అదనపు జాగ్రత్తలు సమర్థనీయమేనని చెప్పాలి. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఆర్సీఈపీ చర్చల్లోకి తిరిగి ప్రవేశించాలంటే మూడు షరతులు తప్పకుండా పాటించాలని చెప్పారు. అవేమింటే, ప్రాంతీయ చట్టాలను తప్పకుండా పాటిం చడం, 2014 నుంచి 2019కి వర్తించేలా ప్రాథమిక సుంకాల వ్యవధిని మెరుగుపర్చడం, ఆటో–ట్రిగ్గర్ మెకానిజం అంటే దిగుమతుల వెల్లువనుంచి దేశీయ పరిశ్రమను కాపాడటానికి తక్షణ స్పందనా యంత్రాగాన్ని నెలకొల్పడం. ఈ అంశంపై వాణిజ్య మంత్రిత్వ శాఖ మాత్రమే పనిచేయడం కాకుండా ఇతర మంత్రిత్వ శాఖలను కూడా ముగ్గులోకి దింపాలి. దిగుమతులు వెల్లువెత్తిన ప్రతిసారీ తక్షణ చర్యలు చేపట్టడం, ప్రాథమిక పన్నును మార్చడం వంటి చర్యలను భారత్ చేపట్టడంపై కొన్ని నెలల క్రితం చైనా తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు వార్తలు. ఆర్సీఈపీతో చర్చలు ముగిసి ఒప్పందాన్ని ఖరారు చేయడానికి ముందు భారత్ సమర్థతపై చైనా సందేహాలను లేవనెత్తింది కూడా. ఆర్సీఈపీ చర్చలు మొదలెట్టి ఏడేళ్లు అయినప్పటికీ ఈ కీలక సమస్యలను పరిష్కరించడంలో విఫలయ్యారు. ప్రపంచ వాణిజ్య సంస్థ చర్చల ప్రారంభ దినాల్లో కూడా, సంపన్న వాణిజ్య మండలి అయిన ఓఈసీడీ (ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ) ప్రతిపాదించిన వ్యవసాయ సబ్సిడీల భారీ కుదింపు వల్ల భారతీయ వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కడికో వెళతాయని ప్రచారం చేశారు. కానీ అది చాలా పెద్ద తప్పిదమైంది. ఈ వ్యవసాయ సబ్సిడీలను ప్రపంచ వాణిజ్య సంస్థ విధానాల ప్రకారం ఆకుపచ్చ, కాషాయం, నీలం అనే మూడు రంగుల బాక్సులలో వ్యవసాయ సబ్సిడీలను ఉంచడం వంటి చమత్కార ప్రదర్సనలకు పాల్ప డటం తప్పితే వ్యవసాయ సబ్సిడీలు భారత్ వంటి దేశాలపై పెద్దగా ప్రభావం చూపలేదు. అమెరికా ఇస్తున్న సబ్సిడీల కంటే 28 సభ్యదేశాల యూరోపియన్ యూనియన్ మూడు రెట్లు ఎక్కువగా 65 బిలియన్ డాలర్ల మేరకు వ్యవసాయ సబ్సిడీలను అందిస్తోంది. ఈ రెండు దిగ్గజ కూటములతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై త్వరి తంగా సంతకాలు పెట్టేముందు భారతీయ వ్యవసాయంపై వాటి సబ్సిడీలు కలిగించే నష్టం గురించి జాగ్రత్తగా అంచనా వేయాల్సి ఉంది. దేశంలో 60 కోట్లమంది ప్రజలు ప్రత్యక్షంగా లేక పరోక్షంగా వ్యవసాయం చేస్తున్నప్పుడు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కలిగించే మార్కెట్ అవకాశాలను చూసి ఉప్పొంగిపోయే ముందు వ్యవసాయదారుల జీవితంపై విదేశీ సబ్సిడీలు కలిగించే పెనుభారం గురించి అంచనా వేసి తీరాలి. లేక సేవారంగంలోని కొన్ని దిగ్గజ సంస్థలకు ప్రయోజనం కలిగించడానికి మన వ్యవసాయాన్ని బలిపెట్టకూడదు. అందుకే భవిష్యత్తులో జరిగే వాణిజ్య ఒప్పందాల కోసం కూడా మహ్మాత్ముడి సిద్ధాంతాలనే భూమికగా తీసుకోవడం అవశ్యం. వ్యాసకర్త: దేవీందర్ శర్మ, వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
పరాకాష్టకు చేరిన సంక్షోభం
ప్రభుత్వం రైతులకు రుణమాఫీ పథకాన్ని ప్రారంభించి, సహకార బ్యాంకులలో రైతులు చేసిన అప్పుల్లో 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ పంజాబ్లో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. ఈ సంవత్సరం జనవరి నుంచి జూలై మధ్యలోనే 645 మంది రైతులు అప్పుల వల్ల కలుగుతున్న అవమానాలను భరించలేక దారుణంగా జీవితాలను ముగించుకున్నారు. ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు, బ్యాంకులు, సూక్ష్మరుణ కల్పన సంస్థల ఏజెంట్లు, బ్యాంకింగేతర ద్రవ్య సంస్థలు కలిసి రైతుల ఊపిరిని తీసివేస్తున్నాయి. రుణభారం మోయలేక పంజాబ్లో మూడు తరాలకు చెందిన కుటుంబ సభ్యులు ప్రాణాలు తీసుకోవడం అరుదైన ఘటన. ఇది పంజాబ్లో వ్యవసాయ సంక్షోభం పరాకాష్టకు చేరిందనడానికి సూచిక. వ్యవసాయ మెషినరీని అమ్మడానికి మాత్రమే కార్యాచరణలోకి దిగుతున్న ప్రభుత్వం.. మరోవైపున రైతుల ఆత్మహత్యలకు ఏవి కారణాలో తెలుసుకునేందుకు ఎందుకు ప్రయత్నించడం లేదన్నది నాకు అర్థం కాని ప్రశ్నే. లవ్ప్రీత్ సింగ్ ఎన్నో కలలతో బతుకుతున్న యువ రైతు. కుటుంబ వారసత్వంగా రూ. 8 లక్షల అప్పు తన నెత్తిమీద ఉందని తెలిసి కూడా వ్యవసాయంలో తన అదృష్టం పరీక్షించుకోవాలని భావించాడు. కానీ అప్పు తీర్చలేకపోవడంతో చివరికి జీవితాన్ని ముగించుకున్నాడు. అతడి వయస్సు 22 సంవత్సరాలు మాత్రమే. బర్నాలా జిల్లాకు చెందిన లవ్ప్రీత్ సింగ్ ఆత్మహత్య పంజాబ్ మొత్తంగా ప్రకంపనలు సృష్టించింది. మూడు తరాలుగా వీరి కుటుంబంలో అయిదుగురి వ్యవసాయ సంక్షోభం బలిగొంది. ఒకటిన్నర సంవత్సరం క్రితం తన తండ్రి కుల్వంత్ సింగ్ ఉరివేసుకుని జీవితం చాలించాడు. పంజాబ్ ప్రభుత్వం రుణమాఫీ తొలి విడత పంపిణీని ప్రారంభించడానికి సరిగ్గా ఒక రోజు ముందు ఈ విషాదం చోటు చేసుకుంది. అంతకుముందు లవ్ ప్రీత్ సింగ్ తాత కూడా ఇలాగే ఆత్మహత్య పాలయ్యాడు. ఎకరాకు సంవత్సరానికి రూ. 50 వేలు చెల్లించి 8 ఎకరాల భూమిని లీజుకు తీసుకున్నాం. కానీ 2017లో పెనుతుపాను వల్ల గోధుమపంట పూర్తిగా దెబ్పతింది. దాన్నుంచి మేం కోలుకోలేకపోయాం అంటూ లవ్ప్రీత్ సింగ్ తల్లి మీడియాకు చెప్పింది. రుణభారం మోయలేక పంజాబ్లో మూడు తరాలకు చెందిన కుటుంబ సభ్యులు ప్రాణాలు తీసుకోవడం ఇదే మొదటి ఘటన కాబోలు. గతంలో ఇక్కడ తల్లిదండ్రులు, వారి కుమారులు సామూహికంగా ఆత్మహత్య చేసుకున్న ఘటనలు జరిగాయి కానీ ఆర్థిక సంక్షోభం ఒక రైతు నుంచి అతడి తదుపరి రెండు తరాల వరకు ప్రభావం చూపిందంటే ఇది ఎంత ఉపద్రవకరమైన ఘటనో స్పష్టంగా బోధపడుతుంది. జస్వంత్ సింగ్ అనే మరొక రైతు తన అయిదేళ్ళ కుమారుడిని తన వీపుకు కట్టుకుని నీటి కాలువలోకి దూకిన ఘటన నాకు గుర్తుకొచ్చింది. నీటి రూపంలోని సమాధిలోకి తన చిన్నారి కుమారుడిని కూడా తన వెంట తీసుకుపోవడం అన్యాయం అని తనకు తెలుసు కానీ తన నెత్తిమీద ఉన్న రూ. 10 లక్షల రుణాన్ని తన కుమారుడు ఎన్నటికీ తీర్చలేడని తెలుసు కాబట్టే ఈ చర్యకు పాల్పడుతున్నానని నోట్ రాసి మరీ కాలువలో దూకాడాయన. కెప్టెన్ అమరీందర్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వం రైతులకు రుణమాఫీ పథకాన్ని ప్రారంభించి, సహకార బ్యాంకులలో రైతులు చేసిన అప్పుల్లో 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ పంజాబ్లో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. ఈ సంవత్సరంలో జనవరి నుంచి జూలై మధ్యలోనే 645 మంది రైతులు అప్పుల వల్ల కలుగుతున్న అవమానాలను భరించలేక దారుణంగా జీవితాలను ముగించుకున్నారు. ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు, బ్యాంకులు, సూక్ష్మరుణ కల్పన సంస్థల ఏజెంట్లు, బ్యాంకింగేతర ద్రవ్య సంస్థలు కలిసి రైతుల ఊపిరిని తీసేస్తున్నాయి. దీంతో వారు వేరే మార్గం లేకుండా ఆత్మహత్యల దారి పడుతున్నారు. భారతీయ కిసాన్ యూనియన్ రూపొందించిన డేటా ప్రకారం 2017 ఏప్రిల్ 1 నుంచి 2019 ఆగస్టు 31 లోగా 1280 మంది రైతులు, వ్యవసాయ కూలీలు పంజాబ్లో ఆత్మహత్యలు చేసుకున్నారని తెలుస్తోంది. దేశ గోధుమ ధాన్యాగారంగా పేరొందిన పంజాబ్ వాస్తవానికి కొన్నేళ్లుగా రైతు ఆత్మహత్యల మృత్యు శయ్యగా ప్రాచుర్యం పొందుతోంది. ఈ ఆత్మహత్యలకు తెలియని కారణాలేవీ లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణాల మాఫీ పథకం ప్రారంభించినప్పటి నుంచి రూ.4,609 కోట్ల వ్యవసాయ మొండిబకాయలను రద్దు చేసింది. ఈ పథకం ద్వారా ఇంతవరకు అప్పుల ఊబిలో కూరుకుపోయిన 5,61,886 మంది రైతులు లబ్ధి పొందడం వాస్తవమే. అయితే భవిష్యత్తులో తాము ఇంకా బకాయిపడి ఉన్న మొండి రుణాలను రద్దు చేస్తారనే ఆశ లేశమాత్రంగా కూడా లేకపోవడంతో రైతులు మరో మార్గం చూసుకుంటున్నారు. గత ఎన్నికల్లో పంజాబ్లో అధికార పార్టీ రైతులు సహకార బ్యాంకులు, జాతీయ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద తీసుకున్న వ్యవసాయ రుణాలను మొత్తంగా తీర్చి వేస్తానని వాగ్దానం చేసింది. ప్రభుత్వం కూడా దీన్ని ఇప్పుడు తృణీకరించలేదు కానీ ఈ రుణాలను మొత్తంగా తీర్చాలంటే రూ. 90,000 కోట్లు అవసరం అవుతుంది. ఇంతమొత్తం తన వద్ద లేదంటూ పంజాబ్ ప్రభుత్వం చేతులెత్తేసింది. 2019 వరకు పంజాబ్లో జరిగిన రైతు ఆత్మహత్యలను పరిశీలిస్తే, ప్రతి రోజూ సగటున ముగ్గురు రైతులు బలవుతున్నారని స్పష్టమవుతుంది. 2017–18లో వరి ఉత్పత్తిలో అత్యుత్తమ ఫలితాలను సాధించినందుకు గానూ ప్రతిష్టాత్మకమైన క్రిషి కర్మాన్ అవార్డును అందుకున్న పంజాబ్లో మరోవైపున ఇంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూండటమే పరమ విషాదకరమైన అంశం. 2009–10 నుంచి సెంట్రల్ పూల్కి వరిని అత్యధికంగా అందిస్తున్న రాష్ట్రం పంజాబ్. 2010–11లో మాత్రమే పంజాబ్, ఆంద్రప్రదేశ్ కంటే వెనుకబడింది. ఇక గోధుమ విషయానికి వస్తే 2008–09 నుంచి పంజాబ్ జాతీయ ధాన్య నిధికి గోధుమను అందిస్తున్న అగ్రగామి రాష్ట్రంగా రికార్డును నెలకొల్పుతోంది. అంటే మన దేశ ఆహార నిల్వల్లో 37.83 శాతం వాటా పంజాబ్ నుంచే వస్తోందన్నమాట. తన భూభాగంలోని 98 శాతం వ్యవసాయ యోగ్యంగా ఉంటూ, గోధుమ, వరి ఉత్పత్తిలో అధిక వాటాను కేంద్ర పూల్కి సమర్పిస్తూన్న పంజాబ్లో పెరుగుతున్న పంటల ఉత్పాదకతకు, తీవ్రమవుతున్న వ్యవసాయ దుస్థితికి మధ్య అంత అగాధానికి కారణమేమిటనేది బహుశా ఎవరూ వివరించలేరేమో.. ఇప్పుడు క్రిషి కర్మాన్ అవార్డు కోసం నిర్దేశించిన మూడు వర్గీకరణలకేసి చూద్దాం. అత్యధిక ఉత్పత్తిని సాధిస్తున్నందుకు 55 మార్కులను కేటాయించారు. రెండోది, రికార్డు స్థాయిలో ఉత్పత్తిని సాధించడం కోసం ప్త్రత్యేక చొరవను తీసుకుంటున్నందుకు 30 మార్కులు విధించారు. చివరగా ఆహార ధాన్యాల అభివృద్ధి పథకాలకు అయ్యే వ్యయం కోసం 15 మార్కులను రిజర్వ్ చేశారు.. పంజాబ్లో వ్యవసాయ సంక్షోభం నిరంతరం ఎందుకు కొనసాగుతోందో ఇప్పుడు స్పష్టంగా బోధపడుతోంది. రైతులు పండిస్తున్న పంటల నుంచి 50 శాతాన్ని వారి సంక్షేమానికే కేటాయించేలా ప్యాకేజీని రీడిజైన్ చేసి ఉంటే ఈ ఉత్పాతం కొనసాగేది కాదు. తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రైతు సమాజానికి స్వావలంబనతో కూడిన జీవితానికి హామీ కల్పించేలా ప్రభుత్వ విధానాలు ఇకనైనా దృష్టి పెట్టాలి. ప్రభుత్వాలు వరుసగా లక్ష్యంగా విధిస్తున్న రికార్డు పంటను ఉత్పత్తి చేయడంకోసం నిరంతరం కృషి చేస్తున్న రైతుల సంరక్షణకు పాటు పడకుండా ఎలాగైనా సరే ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడంమీదే ప్రభుత్వ విధానాలు దృష్టి పెడుతున్నంత కాలం పంజాబ్ రైతుల దుస్థితి మారదు గాక మారదు. కొన్ని అధ్యయనాల ప్రకారం తృణధాన్యాలైన గోధుమ, వరి, జొన్న పంటల్లో పంజాబ్ ప్రపంచస్థాయి ఉత్పత్తి ప్రమాణాల్లో అగ్రగామిగా ఉంటోంది. కానీ అదే పంజాబ్ తన రైతుల పాలిట సమాధిగా మారుతోంది. మరొక ఉదాహరణ తీసుకుందాం. పొలాల్లోని చెత్తను తగులబెట్టడాన్ని నిరోధించడానికి పంజాబ్ 6,400 రైతు బృందాలను ఏర్పర్చి వారికి మెషీన్లను ఇవ్వడానికి పూనుకొంది. పంట కోతలు పూర్తయ్యాక పొలంలో మిగిలే వరి దంట్లను ఎందుకు తగులబెట్టకూడదో రైతులను ఎడ్యుకేట్ చేయడానికి కూడా ప్రభుత్వం పూనుకుంటోంది. పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రజ్ఞులు, రాష్ట్ర వ్యవసాయ శాఖకు చెందిన శాస్త్రవేత్తలు ఈ రైతుల బృందాలతో నిత్యం సంబంధాల్లో ఉంటారు. అత్యధిక సబ్సిడీతో అందించే మెషీన్లను అమ్మడానికి 6,400 రైతు బృందాలను ఏర్పర్చారు. అదే సమయంలో తీవ్రమవుతున్న వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు, వ్యవసాయదారుల ఆత్మహత్యలకు ఏవి కారణాలో తెలుసుకునేందుకు ఇలాంటి బృందాలను ఎందుకు ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. ఈ సమాచారాన్ని పూర్తిగా సేకరించి కార్యాచరణకు ప్రభుత్వం ఎందుకు పూనుకోదు? వ్యవసాయ మెషినరీని అమ్మడానికి మాత్రమే కార్యాచరణలోకి దిగుతున్న ప్రభుత్వం.. మరోవైపున ఇంత పెధ్ద మానవీయ కర్తవ్యాన్ని పరిపూర్తి చేయడం కోసం ఎందుకు పూనుకోదు? దేవీందర్ శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
రైతు రాబడికి చట్టబద్ధతే రక్షణ
ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ హామీ ఇచ్చినట్లుగా రెండు లేదా మూడేళ్ల వ్యవధిలో భారతీయ రైతుల ఆదాయాన్ని రెండురెట్లకు పెంచడం అసాధ్యమని కేంద్రమంత్రే పార్లమెంటులో ప్రకటించి సమస్యనుంచి పక్కకు తప్పుకున్నారు. వచ్చే అయిదేళ్లకాలానికి వ్యవసాయరంగంలో వాస్తవ ఆదాయాలు సంవత్సరానికి అర్థశాతం కంటే తక్కువ మాత్రమే పెరుగుతాయని నీతిఅయోగ్ అంచనా వేసింది. మన పాలకులు, విధాన నిర్ణేతలు ఉద్దేశపూర్వకంగానే వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యపర్చడమే దీనికి కారణం. ఈ నేపథ్యంలో రైతుల ఆదాయ వృద్ధిపై వ్యర్థ చర్చలు మాని, కనీస మద్దతు ధరకు చట్టప్రతిపత్తిని కల్పించడమే పాలకుల తక్షణకర్తవ్యం కావాలి. వ్యవసాయరంగంలో పెట్టుబడుల పెంపుదల ఆర్థికవ్యవస్థనే సంక్షోభం నుంచి బయటబడేస్తుంది. సబ్కా సాత్, సబ్కా వికాస్ సాగవలసిన మార్గం ఇదేమరి. ఎట్టకేలకు కేంద్రప్రభుత్వానికి తత్వం బోధపడినట్లుంది. తాజా పార్లమెంటు సమావేశాల సందర్భంగా, 2022 నాటికి వ్యవసాయరంగ ఆదాయాన్ని రెట్టింపు చేయడం సాధ్యం కాదని కేంద్రం పార్లమెంటులో అంగీకరించింది. సమాజ్వాదీ పార్టీ నాయకుడు రామ్ గోపాల్ యాదవ్ రాజ్యసభలో సంధించిన ప్రశ్నకు వ్యవసాయశాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాలా స్పష్టంగా సమాధానమిచ్చారు. ‘రామ్ గోపాల్జీ ప్రశ్నతో మేము ఏకీభవిస్తున్నాం. వ్యవసాయ రంగంలో ప్రస్తుత వృద్థి రేటు ప్రకారం రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడం సాధ్యం కాదు.’’ ఏటా వ్యవసాయరంగం 4 కంటే తక్కువ శాతం వృద్ధిరేటు కనబరుస్తుండటంతో, వచ్చే మూడేళ్లలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం సాధ్యం కాదని మంత్రి స్పష్టంచేశారు. 2016 ఏప్రిల్లో ఏర్పడిన దళవాయి కమిటీ (డిఎఫ్ఐ) రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలంటే సంవత్సరానికి రైతుల ఆదాయ వృద్ధి రేటు 10.4 శాతానికి పెరగాల్సి ఉందని అంచనా వేశారు. ఇది సాధ్యపడాలంటే దేశం అత్యధిక ఆర్థిక వృద్ధి రేటును సాధించాల్సి ఉందని పలువురు ఆర్థిక వేత్తలు అభిప్రాయపడ్డారు. ఇది ప్రస్తుత పరిస్థితుల్లో పేరాశే అవుతుందన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటూనే, రైతురాబడి వృద్ధిపై ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు కావడం అంత సులభం కాదని కేంద్రమంత్రి స్వయంగా అంగీకరించినందుకు ధన్యవాదాలు. సాక్షాత్తూ కేంద్రమంత్రి పార్లమెంటులో చేసిన ప్రకటన తర్వాత అయినా, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం ఎలా అనే అంశంపై దేశంలోని యూనివర్సిటీలు, విద్యాసంస్థలు, కాలేజీలు, పౌరసమాజ సంస్థలు రెండేళ్లుగా సాగించిన అంతులేని సెమినార్లు, కాన్ఫరెన్సులు, వర్క్షాపుల తతంగానికి ముగింపు పలకాల్సిన అవసరముంది. వ్యవసాయరంగ ఆదాయంలో నిజమైన వృద్ధి గత రెండేళ్లలో సున్నకు సమీపంలో కొనసాగుతున్న సమయంలో వచ్చే అయిదేళ్లకాలానికి వ్యవసాయరంగంలో నిజ ఆదాయం సంవత్సరానికి అర్థశాతం కంటే తక్కువ మాత్రమే పెరుగు తుందని నీతిఅయోగ్ అంచనా వేసింది. ఈ పరిస్థితుల్లో కూడా వ్యవసాయ రంగానికి తప్పనిసరైన మౌలిక వ్యవస్థాపనా పరివర్తన గురించి ఎవరూ మాట్లాడటం లేదు. నేల సంరక్షణ కార్డులు, వేపకలిపిన యూరియా, ఫసల్ బీమా యోజన, జాతీయ వ్యవసాయ మార్కెట్లు, మరిన్ని పంట నిల్వ వసతులు వంటి పథకాలేవీ రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తాయని హామీ ఇవ్వలేరు. ఇప్పుడు తక్షణం కావలసింది ప్రత్యక్ష ఆదాయ మద్దతు. రైతు ఆదాయాన్ని క్రమబద్ధం చేయటానికి ఇదే ఉత్తమమార్గం. కేంద్ర ప్రభుత్వం 2018 సెప్టెంబర్లో రైతు ఆదాయ పెంపు కమిటీ (డీఎఫ్ఐ) సమర్పించిన నివేదిక చేసిన సిఫార్సుల అమలు, పర్యవేక్షణకోసం ఒక సాధికారక కమిటీని ఏర్పర్చినప్పటికీ వచ్చే రెండేళ్లలోపు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం సాధ్యపడకపోవచ్చు అని అర్థమవుతూనే ఉంది. అందుకే వ్యవసాయ రంగంలో దీర్ఘకాలిక సంస్కరణలను ప్రారంభించడంలో ఇది తప్పక తోడ్పడుతుంది. దీనికి అనుగుణంగా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాల్సి ఉంది. ఈ దీర్ఘకాలిక సంస్కరణల్లో మొట్టమొదటిది ఏమిటంటే వ్యవసాయరంగంలో ప్రభుత్వ రంగ మదుపును బాగా ప్రోత్సహించడమే. 2011–12, 2016–17 మధ్యకాలంలో వ్యవసాయంలో ప్రభుత్వరంగ మదుపు మొత్తం జీడీపీలో 0.4 శాతం వద్దే సాగిలపడిపోయిందని అర్బీఐ గణాంకాలు సూచిస్తున్నాయి. దేశ జనాభాలో దాదాపు సగంమంది నేటికీ వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారని గ్రహించినట్లయితే, మన పాలకులు, విధాన నిర్ణేతలు ఉద్దేశపూర్వకంగానే వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యపరుస్తూ వస్తున్నారని బోధపడుతుంది. తగినంత పెట్టుబడి తరలిరాకుండా దేశీయ వ్యవసాయరంగంలో అద్భుతాలు సృష్టించవచ్చని ఏ ఆర్థిక వేత్త అయినా ప్రకటిస్తారని నేనయితే భావించడం లేదు. జీడీపీలో అరశాతం కూడా వ్యవసాయరంగంలో మదుపు చేయలేదన్నది స్పష్టమే. దీనిక్కారణం.. వ్యవసాయాన్ని ఒక ఆర్థిక కార్యాచరణగా మనదేశంలోని ఆర్థిక చింతనాపరులు గుర్తించకపోవడమే. దీనితో వ్యవసాయాన్ని లాభదాయకమైన, నిలకడకలిగిన పరిశ్రమగా చేయడంపై దృష్టి పెట్టడానికి బదులుగా విధాన నిర్ణేతలు రైతులను, అనుబంధ వృత్తి జీవులను మరింతగా వ్యవసాయ రంగం నుండి బయటకు నెట్టివేయడంపైనే కేంద్రీకరించారు. ఇలాంటి ధోరణి ఇకనైనా మారాలి. ఈ మార్పునకు సంబంధించిన సంకేతాన్ని మనం బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో చూడవచ్చు. దేశీయ వ్యవసాయ రంగంలో 25 లక్షల కోట్లను పెట్టుబడిగా పెడతామని ఆ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అయితే 2019–20 సంవత్సరానికిగానూ కేంద్ర బడ్జెట్లో వ్యవసాయరంగానికి రూ. 1,30,485 కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రతిపాదించారు. పీఎమ్ కిసాన్ పథకంలో మిగిలిన మూడు ఇన్స్టాల్మెంట్ల చెల్లింపుకోసం కేటాయించిన రూ. 75,000 కోట్లను కూడా దీంట్లో భాగంగా చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, వ్యవసాయరంగంలో నిజ ఆదాయాలను పెంచడం, రైతులు కోల్పోయిన గౌరవాన్ని పునరుద్ధరించడం వంటివాటికోసం వ్యవసాయంలో మౌలిక సంస్కరణలు కావాలని ప్రతిపాదించడానికి కూడా మన వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు ఇచ్చగించని తరుణంలో పంజాబ్, హరియాణా హైకోర్టు ఇటీవలే సంచలనాత్మక తీర్పును వెలువరించింది. భారతీయ రైతులను ఆర్థిక దుస్థితి నుంచి కాపాడాలంటే వ్యవసాయ ఉత్పత్తి ధరకు మూడురెట్లు అధికంగా కనీస మద్దతు ధరను ప్రకటించాలని కోర్టు వ్యాఖ్యానించింది. ‘కనీస మద్దతు ధరను 1965లో ప్రకటించినప్పటికీ, చేదువాస్తవం ఏమిటంటే, తీవ్ర దారిద్య్రం నుంచి రైతులను బయటపడేలా వారి ఆదాయాలను ఈ పథకం కల్పించలేకపోయింది. కనీసం రైతులను ప్రోత్సహించలేకపోయింది. రైతులు పండించిన పంటలకు న్యాయమైన ధర పొందేలా న్యాయపరమైన హక్కులను కల్పిస్తూ కనీస మద్దతు ధరకు చట్టబద్ధతను ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది’. తగిన చట్టం రూపకల్పన ద్వారా కనీస మద్దతు ధరకు న్యాయ ప్రతిపత్తిని అందచేయాలని ఆదేశిస్తూ జస్టిస్ రాజీవ్ శర్మ, జస్టిస్ హెచ్ఎస్ సిద్ధుతోకూడిన డివిజన్ బెంచ్ తీర్పుచెప్పింది. తమ తీర్పులోభాగంగా న్యాయమూర్తులు.. వ్యవసాయరంగంలో దళారులను తొలగించడం, గిడ్డంగులను నెలకొల్పడం, వాతావరణ ప్రాతిపదికన పంటల బీమా పథకాలు, ఇంటర్నెట్ టెక్నాలజీని ఉపయోగించడం, రుణ కల్పన, రైతుల ఆత్మహత్యల నివారణ వంటి పలు సంస్కరణ చర్యలను సాగించాలని ఈ తీర్పులో పేర్కొన్నారు. గతంలో వ్యవసాయ ఖర్చులు, ధరల కమిటీ కూడా కనీస మద్దతు ధరకు చట్టప్రతిపత్తి కల్పించాలని పిలుపునిచ్చింది. సుదూరప్రాంతాలకు చెందిన రైతులు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీలను చేరలేకపోతున్నారని, దీంతో తమ ఉత్పత్తులను కనీస మద్దతు ధరకంటే ఎంతో తక్కువ ధరకే స్థానిక మార్కెట్లకు అమ్మేయాల్సి వస్తోందని ఈ కమిటీ ప్రత్యేకించి పేర్కొంది. కనీస మద్దతు ధరకు చట్టప్రతిపత్తిని కల్పించడం వల్ల రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరగడమే కాకుండా రైతులకు కనీస ధరకు హామీ పడుతుంది. తద్వారా వారి ఆదాయాలు మెరుగుపడతాయి, రుణభారం తగ్గుతుంది, వ్యవసాయ దుస్థితి తగ్గుముఖం పడుతుందికూడా. వీటికి అదనంగా వ్యవసాయ ఉత్పత్తి ఖర్చుకు మూడు రెట్లు అధికంగా కనీస మద్దతు ధరను పెంచడం వల్ల ఇదొక్కటే వ్యవసాయరంగం పనితీరు గణనీయంగా పెరగడానికి వీలవుతుంది. నా ఉద్దేశంలో రెండు రకాల ధరల విధానం ఉండాలి. అవేమిటంటే కనీస మద్దతు ధరతో ధాన్యసేకరణ జరపటం, రైతుకు చెల్లించవలసిన వాస్తవ ధరను ఆచరణలో అమలు చేయడం. ఇప్పుడు రైతులందరికీ జన్ధన్ బ్యాంకు ఖాతాలు ఉన్నాయి కాబట్టి ఈ రెండు ధరల విధానాల మధ్యలో తలెత్తే వ్యత్యాసాన్ని రైతు బ్యాంకు ఖాతాకే నేరుగా బదలాయించవచ్చు. వ్యవసాయరంగంలో వృద్ధి గణాంకాలు తమ్ముతాము నిరోధిం చుకునే పరిస్థితులనుంచి బయటపడాల్సిన సమయం వచ్చింది. మానవ వనరులపై మదుపు చేయడానికి ఇది చక్కటి తరుణం. వ్యవసాయ రాబడులను పెంచేందుకు మరిన్ని పెట్టుబడులు పెట్టడం వల్ల వ్యవసాయ టెక్నాలజీని మెరుగుపర్చుకునేందుకు రైతులుపెట్టే డబ్బు కూడా పెరుగుతుంది. ఇలా గ్రామీణ డిమాండును అధిక మదుపుల ద్వారా కేటాయించిన రోజు, పారిశ్రామికాభివృద్ధి కూడా వేగం పుంజు కుంటుంది. ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్న తరుణంలో సరకులకు మరింత డిమాండును సృష్టించడం వ్యవసాయరంగం వల్లే సాధ్యపడుతుంది. కాబట్టి వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టడం అనేది మొత్తం ఆర్థిక వ్యవస్థనే సంక్షోభం నుంచి బయటపడేస్తు్తంది. సబ్కా సాత్, సబ్కా వికాస్ సాగవలసిన మార్గం ఇదేమరి. వ్యాసకర్త : దేవీందర్ శర్మ, వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
కరుగుతున్న హిమనదాలు
అంతరించిపోయిన హిమానీనదానికి ఒక విషాద భావగీతం. అవును. ప్రస్తుతం ఐస్లాండ్ శాస్త్రజ్ఞులు సరిగ్గా దీనికే పథకం రచిస్తున్నారు. పశ్చిమ ఐస్లాండ్ ప్రాంతంలో కనుమరుగైపోయిన మొట్టమొదటి హిమానీనదానికి గుర్తుగా ఆగస్టు 18న ఒక స్మారక స్తూపం ఏర్పర్చడానికి రైస్ యూనివర్సిటీ, ఐస్లాండ్ దేశం కలిసి ప్లాన్ చేస్తున్నాయి. ఆ మంచుదిబ్బ పేరు ‘ఓకే’. ఆ స్మారకచిహ్నం ఫలకంపై పొందుపరుస్తున్న సందేశం మనందరినీ తీవ్రంగా హెచ్చరిస్తోంది. ‘హిమానీనదంగా తన ప్రతిపత్తిని కోల్పోతున్న మొదటి ఐస్లాండ్ మంచుదిబ్బ ఓకే. రాబోయే 200 ఏళ్లలో మన హిమానీనదాలన్నీ ఇదే మార్గం అనుసరించనున్నాయి. మనకు ఏం జరగబోతోందో, మనం ఏం చేయాల్సి ఉందో మనకు స్పష్టంగా తెలుసని ఈ స్మారకస్తూపం గుర్తు చేస్తోంది. మనం దాన్ని చేస్తామా అన్నది లేదా అనేది కూడా మనకే తెలుసు’’ మంచుదిబ్బలు కాదు కరుగుతున్నది భవిష్యత్తు! ఐస్లాండ్ దేశంలోని ఓకే హిమానీనదం ఆ దేశం నుంచి అంతరించిపోతున్న తొలి మంచుదిబ్బ. కానీ ఇది చివరిదేమీ కాదు. వచ్చే 200 సంవత్సరాల్లో ఐస్లాండ్ దేశంలోని మంచుదిబ్బలన్నీ అంతర్థానం కానున్నాయని ఆ స్మారక స్తూప ఫలకం ప్రకటిస్తోంది. అయితే 30 ఏళ్ల తర్వాత అంటే 2050లో ఈ స్మారక స్తూప సందేశాన్ని చూడబోయే ప్రజలందరూ ఓకే హిమానీనదానికి ఆ గతి పట్టించినందుకు ప్రస్తుత తరాన్ని శపించడం ఖాయం. మంచుదిబ్బను కరగదీయడం ద్వారా అత్యంత వేడి, పొడి వాతావరణం కలిగిన భూగ్రహాన్ని మనం భవిష్యత్ తరాలవారికి అందించనున్నాం. ఈ ప్రపంచంలో సంతోషభరితంగా జీవించే అవకాశాన్ని, వారికి దక్కాల్సిన వాటాను మనం దూరం చేసేస్తున్నాం. అంతరించిపోతున్న హిమానీనదాలకు స్మారకస్తూపాలను నెలకొల్పడం నిజంగానే అద్భుతమైన ఆలోచన. అలా మంచుదిబ్బలకు స్మారక స్తూపాలను నిర్మించడం సరైనదే అయినట్లయితే, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, భారతదేశం, నేపాల్, భూటాన్, చైనా దేశాల్లో విస్తరించిన హిమాలయ పర్వత శ్రేణుల పొడవునా మనం అనేక స్మారకస్తూపాలను నిర్మించవలసి ఉంటుంది. ప్రపంచంలోనే అతి పెద్ద జలగోపురంగా పేరొందిన హిమాలయాలు భూమ్మీద లభిస్తున్న స్వచ్ఛమైన జలంలో 40 శాతాన్ని కలిగి ఉంటున్నాయి. కానీ ఇక్కడ 50,000 కంటే ఎక్కువ సంఖ్యలో మంచుదిబ్బలు శరవేగంతో కరిగిపోతున్నాయని యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (యూఎన్డీపీ) వారి అంచనా. ఇవి అంతరిస్తున్న వేగాన్ని చూస్తుంటే, ఈ అత్యున్నత పర్వత శ్రేణికి ఇరువైపులా నివసిస్తున్న 130 కోట్లమంది ప్రజల జీవితాల్లో విధ్వంసం సృష్టించడం ఖాయమనే తెలుస్తోంది. మూడో ధ్రువం కరిగితే పెనుముప్పే అంటార్కిటికా, ఆర్కిటిక్ ఖండాల తర్వాత అతిపెద్ద స్థాయిలో మంచును కలిగి ఉన్న మూడో భూభాగంగా హిమాలయాలు గుర్తింపు పొందాయి కాబట్టి దీనిని మూడవ ధ్రువ ప్రాంతం అని పిలుస్తున్నారు. అందుచేత భూగ్రహంలోని అంటార్కిటికా, ఆర్టిటిక్ ధ్రువప్రాంతాలే కాకుండా హిమాలయాలు కూడా వాటికి సమాన స్థాయిలో కరిగిపోయే ప్రమాదం స్పష్టంగానే కనిపిస్తోంది. అయితే హిమాలయాలు యూరోపియన్ ఆల్ఫ్స్ పర్వతాలతో సమాన వేగంలో కరిగిపోవడం లేదు. గత దశాబ్దకాలంలో ఆల్ఫ్స్ పర్వత శ్రేణిలోని అనేక హిమానీనదాలు పూర్తిగా అంతరించిపోయాయి. దక్షిణాసియాలో కంటే యూరప్లో చాలా త్వరగా ఉష్ణోగ్రతలు పెరగడం ప్రారంభించడమే దీనికి కారణం కావచ్చు. కాకపోతే, 2000 సంవత్సరం నుండి హిమాలయాలు ప్రతి సంవత్సరం ఒకటిన్నర అడుగు కంటే ఎక్కువ స్థాయిలో మంచును కోల్పోతున్నాయని ఇటీవలే కొలంబియా యూనివర్సిటీకి చెందిన లేమోంట్–డొహెర్తీ ఎర్త్ అబ్జర్వేటరీ నిర్వహించిన సమగ్ర అధ్యయనం భారత్లో ఆగ్రహావేశాలను ప్రేరేపిస్తుందని నేను ఊహించాను. దీనికి ముందుగా 1975 నుంచి 2000 సంవత్సరం వరకు హిమాలయాల్లో ప్రతి ఏటా 10 అంగుళాల మేరకు మంచు కరుగుతూ వచ్చింది. అయితే తాజా అధ్యయనం ఆసియాలోని పామిర్, హిందూ కుష్, టియాన్ షాన్ అత్యున్నత పర్వత శ్రేణులను తన పరిశీలనాంశంగా చేర్చలేదు. ఈ స్థాయిలో హిమాలయాలు కరుగుతూ రావడం మొత్తం ఆసియా ప్రాంతానికి విధ్వంసకరంగా పరిణమించనుంది. హిమాలయాల్లో హిమానీనదాలు ప్రమాదకరంగా కరిగిపోవడం జాతికి వాస్తవంగా షాక్ కలిగించాలి. ప్రత్యేకించి హిందీ ప్రాబల్య ప్రాంతంలోని ప్రజలకు ఇది భారీ నష్టాన్ని కలిగించనుంది. కానీ అరుదుగా కొన్ని పతాక శీర్షికల్లో ప్రస్తావించడం తప్పితే దేశప్రజల్లో ఈ పరిణామం ఎలాంటి ఆగ్రహాన్ని కలిగించలేదు. ఈ సమస్యను తమ సంపాదకీయాల్లో ప్రస్తావించడానికి తగినదేనని వార్తా పత్రికలు కనీసం ఆలోచించలేదు. ఇక టీవీ చానెల్స్ అయితే అసందర్భమైన రాజకీయ ప్రకటనలతో చొంగకార్చుకోవడంలో బిజీగా ఉండిపోయాయి. చెన్నై జల సంక్షోభం నుంచి నేర్చుకోమా? హిమాలయ ప్రాంతంలో విస్తరించిన 650 హిమానీనదాలపై సాధారణంగా ఉపగ్రహాలు తీసే ఫొటోలతోపాటు, అమెరికన్ గూఢచర్య ఉపగ్రహాలు తీసిన ఫొటోలను కూడా వర్గీకరించి చేసిన పై అధ్యయనం ప్రకారం ప్రతి సంవత్సరం హిమాలయాలు 800 కోట్ల లీటర్ల నీటిని కోల్పోతున్నాయని తెలిసింది. అంటే ప్రతి సంవత్సరం ఒలింపిక్ పరిమాణంలోని 32 లక్షల స్విమ్మింగ్ పూల్స్లలోని నీటికి సమానమైన నీటిని హిమాలయాలు కోల్పోతున్నాయి. దక్షిణ భారతదేశంలోని చెన్నయ్లో ఇటీవల సంభవించిన జల సంక్షోభం కలిగించిన షాక్ని చూస్తే హిమాలయాల్ని కప్పి ఉంచిన మంచు కరిగిపోతుండటం పట్ల మనందరం కూర్చుని ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇది మనందరి భవిష్యత్తుతో ముడిపడిన సమస్య కాబట్టి, మన పిల్లలకు మనం విడిచివెళుతున్న జల రహిత ఆర్థిక వ్యవస్థ స్థితిగతుల గురించి ప్రజలు తప్పకుండా ఆందోళన చెందాల్సి ఉంటుంది. బలమైన ప్రజాభిప్రాయం జాతి మొత్తాన్ని ప్రకంపింపచేయాలి. ఈ విషయమై భారత పార్లమెంటు కూడా అత్యవసర అర్ధరాత్రి సెషన్కు కూర్చోవాలి. కానీ ఏమీ జరగలేదు. లభ్యమవుతున్న సాగునీటిలో 78 శాతం నీటిని వ్యవసాయ రంగం దుర్వినియోగపరుస్తోందని దెప్పడం మినహా, జీవితం సజావుగానే సాగిపోతోంది. ఈలోగా హిమాలయాల్లో భాగంగా ఏర్పడిన అతి ముఖ్యమైన సింధు, గంగ, బ్రహ్మపుత్ర నదీపరివాహక ప్రాంతాల్లో నీరు క్షీణించిపోతోందని కేంద్ర జల కమిషన్ అధ్యయనం హెచ్చరిస్తోంది. ఇవి ఈశాన్య భారత్, కొంతవరకు మధ్యభారత్ ప్రాంత ప్రజాజీవనానికి అత్యవసర వనరులు. కానీ ఇక్కడ కూడా నీటి లభ్యత తగ్గిపోతుండటం ఎవరూ గుర్తించడం లేదు. ఈ మూడు నదీ పరివాహక ప్రాంతాల్లో సగటున నీటి లభ్యత ఇప్పటికే 40 శాతం క్షీణించిపోయింది. ఇక నదీ పరివాహకప్రాంతం క్షీణించిపోవడంతో తూర్పు, ఉత్తర భారత ప్రాంతంలో 628 చదరపు కిలోమీటర్ల పొడవునా అడవులు హరించుకుపోయినట్లు 2015 అటవీ నివేదిక తెలిపింది ఈ తరం తప్పులతో భవిష్యత్ తరాల బలి ఇలాంటి పరిస్థితుల్లో ఎండిపోతున్న నదుల దిగువ ప్రాంతంలో వ్యవసాయాన్ని, పరిశ్రమలను, తాగునీటి వసతులను దెబ్బతీస్తున్న జల సంక్షోభం నేపథ్యంలో జీవనం సాగిస్తున్న వందల కోట్లమంది ప్రజల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో హిమాలయన్ రాష్ట్రాలుగా పేరొందిన జమ్మూ– కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమబెంగాల్, మేఘాలయ, అసోం, త్రిపుర, మిజోరం, మణిపూర్, నాగాలాండ్లు తమ తమ ప్రాంతాల్లో నెలకొన్న కొండ ప్రాంతాల పరిరక్షణకు కలిసికట్టుగా ఒక విధానాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయిదేళ్ల క్రితం కేదార్నాథ్లో సంభవించిన విధ్వంసం పునరావృతం కాకుండా అనువైన పథకాలు రూపొందించడం, నదీపరివాహక ప్రాంతాల పరిరక్షణకోసం సామూహికంగా మదుపులు పెట్టడంపై ఈ రాష్ట్రాలన్నీ దృష్టి సారించాల్సి ఉంది. పర్వతాలు అందించే పర్యావరణ వ్యవస్థ సేవలకు చెందిన ఆర్థిక విలువను మదింపు చేస్తున్న క్రమంలో నీరు, వృక్షాల పరిరక్షణ, నేల కోత నివారణ, వన్యమృగాల పరిరక్షణ వంటి సేవలను తప్పకుండా మిళితం చేయాలి. వీటిని అంతిమంగా రాష్ట్రాల బడ్జెట్ అంచనాల్లో భాగం చేయాలి. పర్వతాలు అందించగలిగే ఆర్థిక సంపదను కొలిచే కొలమానం ఇదే. అభివృద్ధి పేరుతో ఇంతకాలంగా సాగిస్తూ వచ్చిన కొండల్ని కొల్లగొట్టే ప్రక్రియలకు వెంటనే చెల్లుచీటీ చెప్పాలి. పర్వత ప్రాంత రాష్ట్రాల అభివృద్ధికి ఇది నిజంగానే ఒక వినూత్న మార్గంగా ఉపయోగపడుతుంది. ప్రకృతి, పర్యావరణ వ్యవస్థలను పరిరక్షించడంపైనే పర్వత ప్రాంత రాష్ట్రాలు మనగలుగుతాయి. దీనికి తోడుగా మన పరిశోధనా విధానాలు కూడా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. మైదాన ప్రాంతాల్లో సాగించే పరిశోధనా పద్ధతులను నకలు చేస్తూ పర్వతప్రాంతంలో మన యూనివర్సిటీలు యథాతథంగా అమలు చేయడంలో ఎలాంటి సంబద్ధతా లేదు. దేవీందర్ శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
పల్లెలు ఎడారులవుతున్న వేళ...!
కొద్దిమంది వృద్ధుల్ని మినహాయిస్తే, అనంతపురం జిల్లాలోని ఒక గ్రామంలో జనం మొత్తంగా వలస వెళ్లిపోయారు. ఇది ఒక గ్రామం కథ మాత్రమే కాదు.. భారతదేశంలో కరువు పీడిత ప్రాంతాలన్నింటి వ్యథా ఇలాగే ఉంటోంది. ఉన్న ఊరులో బతికే పరిస్థితులు లేక మొత్తం జనం పనుల కోసం వలస వెళ్లిపోతున్నారంటే.. మన గ్రామీణ ప్రాంతాలు చాలావరకు నిర్మానుష్యంగా మారుతున్నాయని అర్థం. రుతుపవనాల రాకలో జాప్యం, వర్షపాతం తగ్గుముఖం పట్టడం, వీటి ప్రభావంతో ఉష్ణోగ్రత తారస్థాయికి చేరడం ఫలితంగా భారతదేశంలోని నగరాలు, పట్టణాలు, పల్లెల్లో భూగర్భ జలాలు వట్టిపోతున్నాయి. సంప్రదాయక నీటి వనరుల పరిరక్షణ, అడుగంటిన భూగర్భ జలాలను రీచార్జ్ చేయడం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. అభివృద్ధి పేరిట అడవుల్ని, జల వ్యవస్థలను విధ్వంసం చేసే ప్రక్రియను నిలిపివేయాలి. ‘‘అందరికీ అభినందనలు... మనం ఈ సంవత్సరం 50 డిగ్రీల ఉష్ణోగ్రతను సాధిం చాము. వచ్చే సంవత్సరం 60 డిగ్రీల ఉష్ణోగ్రతను సాధించడానికి మనం మరిన్ని చెట్లను నరికేద్దాం పదండి’’ పూర్తిగా వ్యంగ్యాన్ని చొప్పిస్తూ పోస్ట్ చేసిన ట్వీట్ నిజంగానే షాక్ కలిగించింది. అయితే ఈ వ్యంగ్యం ట్విట్టర్ను అనుసరిస్తున్న మెజారిటీ పాఠకుల తలకెక్కిందా లేక ఎక్కువమంది జనాలను స్థిమితంగా ఆలోచింపజేసిందా అనేది తేల్చి చెప్పడం కష్టమే. ఈ ట్విట్టర్ వ్యాఖ్య ప్రభావం ఎంత అనే చర్చ పక్కన బెట్టి చూస్తే, గత 140 ఏళ్లలో అంటే ఉష్ణోగ్రతల స్థాయిలను ప్రపంచం నమోదు చేయడం మొదలు పెట్టిన తర్వాత నాలుగో అత్యంత ఉష్ణోగ్రతా సంవత్సరంగా 2018 సంవత్సరం చరిత్రకెక్కింది. 2019 సంవత్సరంలో మరింత ఉష్ణోగ్రత ఉంటుందని నాసా అంచనా. ఇప్పటికే వేడి మనుషులను అమాంతంగా చంపేస్తోంది. ఈ సంవత్సరం మార్చి నుంచి మే వరకు రుతుపవనాలకు ముందస్తుగా కురిసే వర్షపాతం భారత్లో 22 శాతం లోటును నమోదు చేసింది. ఇది గత 65 ఏళ్లలో రెండో అత్యంత తక్కువ వర్షపాతం. ఈ ఏడు రుతుపవనాలు రావడం 15 రోజులు ఆలస్యం కావడంతో పగటి ఉష్ణోగ్రతలు మండిస్తున్నాయి. రాజస్తాన్లోని ఛురు ప్రాంతంలో ఈ సీజన్లో ఇప్పటికే ఉష్ణోగ్రత 50 డిగ్రీల స్థాయిని మూడుసార్లు దాటేసింది. దేశ రాజధాని ఢిల్లీలో సైతం ప్రస్తుతం 48 డిగ్రీల సెల్సియస్తో మునుపెన్నడూ లేనంత అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. నీటి వనరుల క్షీణతే కరువుకు కారణం ఇప్పటికే దేశ భూభాగంలో దాదాపు 43 శాతం కరువుకోరల్లో చిక్కుకుంది. దాదాపు 60 కోట్లమంది కరువు బారిన పడ్డారని అంచనా. ఉష్ణోగ్రత పెరిగిపోవడంతో నీటి వనరులు శుష్కించిపోతున్నాయి. ఎండవేడికి బీళ్లుగా మారిన నేల ఎంత ప్రభావం చూపిస్తుందో మాటల్లో వర్ణిం చలేం. గార్డియన్ పత్రిక రిపోర్టు ప్రకారం భారతదేశంలో వందలాది గ్రామాల్లోని కుటుంబాలకు కుటుంబాలే కాసిన్ని నీటిచుక్కల కోసం తమ ఇళ్లను ఖాళీచేసి వలస పోతున్నాయి. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో కరువు ప్రభావం కారణంగా 50 వేలమంది పైగా రైతులు తమ పశువులను కాపాడుకోవడం కోసం 500 క్యాంపులకు తరలించారు. మహారాష్ట్రలో 1,501 పశు నిర్వహణా శిబిరాలు ఉంటున్నాయి. ఇక్కడ 72 శాతం భూభాగం కరువు బారినపడింది. ఇక ముంబై నగరం చుట్టూ ఉన్న గ్రామాలకు గ్రామాలే ఖాళీ అవుతున్నాయని వార్తలు. ఇక కర్ణాటకలో 88 శాతం పైగా భూభాగం తీవ్రకరువుతో కునారిల్లిపోతోంది. ఈ రాష్ట్రం లోని 176 తాలూకాలలో 156 తాలూకాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారు. గత 18 ఏళ్లలో 12 సంవత్సరాలు కర్ణాటక కరువు బారిన పడటం గమనార్హం. 2018–19 సంవత్సరానికి సంబంధించి కర్ణాటక ఆర్థిక సర్వే ప్రకారం వ్యవసాయంలో మైనస్ 4.8 శాతం ప్రతికూల వృద్ధి రేటును నమోదు చేసింది. కరువు వ్యవసాయ పంటలకు భారీ నష్టం కలిగించడంతోపాటు, వ్యవసాయాధారిత ఆర్థిక కార్యాచరణ కుప్పగూలిపోయింది. ఒక కర్ణాటక మాత్రమే కాకుండా, దాదాపు సగం దేశంలో క్షీణిస్తున్న భూగర్భజల మట్టాలు చివరకు దేశం దృష్టిని తమవైపు తిప్పుకున్నాయి. రాష్ట్రాల మధ్య, రాష్ట్రంలోని సామాజిక వర్గాల మధ్య, వ్యక్తుల మధ్య నీటికి సంబంధించిన ఘర్షణలకు తోడుగా నీటికోసం క్యూలలో నిలుచున్న వ్యక్తుల మధ్య ఘర్షణలు కూడా గడచిన కొన్ని సంవత్సరాల్లో బాగా పెరుగుతూ వస్తున్నాయి. దీంతో మన విధాన నిర్ణేతలు నీటి పరిరక్షణ, నీటి పొదుపు ప్రాముఖ్యతను ఇప్పుడు గుర్తించక తప్పని పరిస్థితి ఏర్పడింది. దేశంలోని నాలుగు ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలు (బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ)తోసహా 21 నగరాలు 2020 నాటికల్లా భూగర్భజలాలు పూర్తిగా అడుగంటిపోవడాన్ని చవిచూడనున్నాయని నీతి ఆయోగ్ ఇటీవల వెలువరించిన నివేదిక నిజంగానే ప్రమాద ఘటిం కలను మోగిస్తోంది. భూగర్భజలాలు దేశప్రజలకు అవసరమైన 40 శాతం నీటి అవసరాలను తీరుస్తున్నందువల్ల, దేశవ్యాప్తంగా 60 కోట్లమంది ప్రజలు రానున్న జల సంక్షోభం బారిన పడనున్నారు. జల సంక్షోభం తీసుకువస్తున్న ఘర్షణలు అయితే భూగర్భ జల మట్టాలు క్షీణించిపోవడం నగరాలకే పరిమితం కాలేదు. నిజానికి భూగర్భజలాలను విచ్చలవిడిగా తోడిపారేయడం వల్లే వర్షపాతం కాసింతమేరకు తగ్గినా సరే అది విధ్వంసకరమైన కరువుకు దారితీస్తోంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో సంవత్సరానికి భూగర్భజలాల క్షీణత రేటు 0.5 మీటర్లకు మించి నమోదవుతోంది. ఇది ఒక మీటర్ వరకు పడిపోతోంది. ఇక ఎండిపోతున్న నదుల నుంచి లభ్యమయ్యే నీరు కూడా తగ్గిపోతోంది. ఇలా నీటి సంక్షోభం ప్రభావాలు ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. ఉదాహరణకు అత్యంత సమృద్దమైన జలరాశికి నిలయమైన నర్మదా నదిలో నీటి లభ్యత గత దశాబ్దకాలంగా తగ్గుముఖం పడుతూ వస్తోంది. కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ అంచనా ప్రకారం దేశంలోని 91 రిజర్వాయర్లలో నీటి మట్టం వాటి సామర్ద్యం కంటే 18 శాతం దిగువకు క్షీణించిపోయింది. పైగా, అనేక డ్యామ్ల లోని నీటిని వ్యవసాయ అవసరాలనుంచి తాగునీటితో సహా నగరప్రాంతాల అవసరాలకు మళ్లిస్తున్నారు. దీంతో రైతుల నిరసనలు తీవ్రతరమై గ్రామీణ–పట్టణ ఘర్షణలకు దారితీస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా నీటి పరిరక్షణ, నీటి నిల్వ, భూగర్భజలాల రీచార్జ్ నుంచి ప్రభుత్వాల ప్రాధమ్యాలు మారిపోయాయి. కరువు ముంచుకొచ్చిన సమయాల్లో కీలకపాత్ర పోషించే సంప్రదాయక నీటి బావుల పునరుద్ధరణ పనులను పెడచెవిన పెడుతూ వచ్చారు. నీటి చెరువుల పునరుద్ధరణ, భూగర్భజలాల రీచార్జికి చేపట్టవలసిన చర్యలు అసంపూర్ణంగా ఉంటున్నాయి. లేదా వాటిని పూర్తిగా వదిలేశాయి. లేక చాలా నత్తనడకన సాగుతున్నాయి. దేశవ్యాప్త్గంగా ఇప్పటికీ 2 లక్షల మేరకు సంప్రదాయక చెరువులు, దిగుడుబావులు ఉంటున్నాయి. వీటన్నింటినీ యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. పంజాబ్లో 138 బ్లాక్లలో 110 బ్లాకులు డార్క్ జోన్లో ఉంటున్నాయి. అంటే వీటీలో నీటిని విపరీతంగా తోడేశారన్నమాట. 15 వేల చెరువులు, గుంతలను పునరుద్ధరించినట్లయితే భూగర్భజలాలు గణనీయంగా మెరుగుపడే అవకాశం ఉంది. ఇంతవరకు పంజాబ్లో 54 గ్రామీణ చెరువులను పునరుద్ధరించారు. ఆశ్చర్యమేమిటంటే, రాజస్థాన్లోనూ, తరాలుగా కొనసాగుతున్న అద్భుతమైన నీటి పరిరక్షణ నిర్మాణాలను పునరుద్ధరించడానికి బదులుగా బిందు సేద్యంపైనే ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. కర్ణాటకలో 39వేల సంప్రదాయక చెరువులు, ట్యాంకులు ఉనికిలో ఉంటున్నాయి. వీటిలో దాదాపు మూడొంతులకు పైగా చుక్కనీరు లేకుండా ఎండిపోయాయి. వీటిలో చాలావాటిని ఇప్పటికీ పునరుద్ధరించవచ్చు. ఈలోగా కర్ణాటక రాష్ట్రం జలామృత పథకాన్ని ప్రారంభించి సంప్రదాయక నీటి వనరులను పునరుజ్జీవింప చేయడానికి ప్రయత్నం మొదలెట్టింది. ఇది చాలా మంచి ప్రయత్నమే కానీ సంప్రదాయక నీటి వనరులను పునరుత్థానం చెందించడాన్ని వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సంప్రదాయక జల వనరులను పునరుద్ధరించాలి సంప్రదాయక నీటి నిల్వ వ్యవస్థలు అదృశ్యమైపోయాయి. కర్ణాటక రాష్ట్రం ‘కల్యాణీస్’ అనే తనదైన సంప్రదాయక నీటి నిల్వ వ్యవస్థను పరిరక్షించాలని ప్రయత్నిస్తోంది. ఒడిశా అయితే ‘కుట్టా, ముండా’ అనే సంప్రదాయక నీటి నిల్వ వ్యవస్థను కలిగి ఉంటోంది. వీటిలో కొన్ని ఇప్పటికీ ఉనికిలో ఉంటున్నాయి. అయితే సంప్రదాయక నీటి నిల్వ వ్యవస్థల చుట్టూ ఉండే సంప్రదాయక జ్ఞానాన్ని మనం ఇప్పటికే చాలావరకు కోల్పోయాం. చాలా సంవత్సరాల క్రితం అమెరికాలోని టెక్సాస్ ఏ– ఎమ్ యూనివర్శిటీకి నేను వెళ్లినప్పుడు వారు తాము అనుసరిస్తున్న తమిళనాడులోని సంప్రదాయక నీటి పరిరక్షణ వ్యవస్థలను నాకు చూపించారు. ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వానికి తనదైన సంప్రదాయక నీటి పరిరక్షణ వ్యవస్థ గురించి ఏమైనా తెలుసా అనేది నాకు తెలీదు. కానీ కొంతకాలం క్రితం సెంటర్ ఫర్ సైన్స్ – ఎన్విరాన్మెంట్ సంస్థ దేశంలోని సంప్రదాయక నీటి పరిరక్షణ వ్యవస్థల జాబితాను పొందుపరుస్తూ ‘డైయింగ్ విజ్డమ్’ (అంతరిస్తున్న జ్ఞానం) అనే పుస్తకం ప్రచురించింది. జల వనరుల పరిరక్షణకు సంబంధించి అంతరిస్తున్న మన సంప్రదాయక విజ్ఞానాన్ని తిరిగి ఆవిష్కరించవలసిన అవసరం ప్రస్తుతం ఎంతైనా ఉంది. బోర్వెల్స్ ప్రపంచమంతటా రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో సంప్రదాయక నీటి పరిరక్షణ వ్యవస్థల వైపునకు మళ్లీ వెళ్లడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. పైగా బోర్వెల్స్ కూడా త్వరలోనో లేక ఆ తర్వాతో వట్టిపోక తప్పదు. అడుగంటిన భూగర్భ జలాలను రీచార్జ్ చేయడాన్ని అత్యవసర ప్రాతిపదికన చేపట్టాలి. అయితే యధాతథ స్థితి అనేది ఎప్పటిలాగే కొనసాగుతున్న తరుణంలో దీన్ని ఒక విడి చర్యగా చేపట్టకూడదు. అభివృద్ధి పేరిట అడవులను, జల వ్యవస్థలను, నదీపరివాహక ప్రాంతాలను విధ్వంసం చేసే ప్రక్రియను వెంటనే నిలిపివేయాలి. లేకపోతే ఉష్ణోగ్రతలు కనీవినీ ఎరుగని స్థాయికి పెరుగుతుం డటం అనేది మనం ఊహించని ఉపద్రవాలకు దారితీయక మానదు. వ్యాసకర్త : దేవిందర్శర్మ, వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
కనీస ఆదాయంతో రైతుకు భరోసా
దేశంలోని సగటు రైతు ఆదాయం ఏడాదికి రూ. 20,000 కంటే తక్కువగానే ఉందని ఎకనమిక్ సర్వే–2016 తేల్చిచెప్పింది. అదే సమయంలో సుప్రీంకోర్టు అధికారులకు రూ.21 వేలు వాషింగ్ అలవెన్స్ ఇస్తూ మాకు రూ. 20 వేలు మాత్రమే ఇస్తున్నారెందుకని రక్షణ బలగాలు కోర్టులో జగడమాడటం వార్తలకెక్కింది. సగం దేశంలో సగటు వ్యవసాయ కుటుంబం ఆదాయం.. ప్రభుత్వోద్యోగులకు ఇస్తున్న మొత్తం 108 రకాల అలవెన్సులలో ఒకే ఒక్క అలవెన్సుకు సమానంగా ఉంటూండటం చూస్తే, మన దేశంలో ఆదాయాల మధ్య వ్యత్యాసం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. రైతుల జీవితంలో మృత్యుతాండవానికి వారి పంటలకు సరైన ధరలు లేకపోవడమే కారణం. భారతదేశంలోని 17 రాష్ట్రాల్లో అంటే దాదాపు సగం దేశంలో సగటు రైతు ఆదాయం సంవత్సరానికి రూ.20,000 కంటే తక్కువగానే ఉందని ఎకనమిక్ సర్వే–2016 దిగ్భ్రాంతికరమైన వాస్తవాన్ని వెల్ల డిం చిన తర్వాత సుప్రీంకోర్టు అధికారులకు, రక్షణ బలగాలకు మధ్య వాషింగ్ అలవెన్స్పై కొనసాగుతున్న జగడం గురించి ఒక వార్తాపత్రిక మరింత ఆశ్చర్యకరమైన వార్తను నివేదించింది. సుప్రీంకోర్టు అధికారులకు బట్టలు ఉతుక్కోవడానికి రూ.21,000 అలవెన్స్ని ఇన్కమ్ ప్యాకేజీలో భాగంగా అందిస్తూండగా తమకెందుకు రూ. 20,000 మాత్రమే ఇస్తున్నారని రక్షణ రంగ ఉద్యోగులు ప్రశ్నించారని ఆ వార్త సారాంశం. రైతులు బట్టలు ఉతుక్కోరా? దాదాపు సగం దేశంలో సగటు వ్యవసాయ కుటుంబం ఆదాయం 7వ పే కమిషన్లో భాగంగా ప్రభుత్వోద్యోగులకు ఇస్తున్న మొత్తం 108 రకాల అలవెన్సులలో ఒకే ఒక్క అలవెన్సుకు సమానంగా ఉంటోందని గమనిం చినట్లయితే, మన దేశంలో ఆదాయాల మధ్య వ్యత్యాసం ఎంత తీవ్రస్థాయిలో ఉందో అర్థమవుతుంది. వ్యవసాయ ఆదాయం సగటున ఏడాదికి రూ. 20,000 మాత్రమే అంటే నెలకు రూ.1,700 అన్నమాట. గత 70 ఏళ్లుగా దేశ రైతులను ఎంత దారిద్య్రంలో ముంచెత్తుతున్నారో చూస్తే రగిలిపోతుంది. 2018 అక్టోబర్–డిసెంబర్ మాసాల్లో వ్యవసాయంలో స్థూల విలువ గత 14 ఏళ్లల్లో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయికి దిగజారిపోయిందని కేంద్ర గణాంకాల కార్యాలయం తన తాజా వ్యవసాయ అభివృద్ధి అంచనాల్లో తేల్చి చెప్పింది. కానీ ఈ వాస్తవం సైతం జాతి చైతన్యాన్ని కుదపలేకపోయింది. జాతీయవాదంపై చర్చనుంచి దేశం కాస్త దృష్టిని మరలించినప్పటికీ వ్యవసాయరంగ రాబడులలో ఇంత భారీ పతనం విధానపరంగా కాస్తయినా స్పందనను రేపుతుందంటే నాకు సందేహమే మరి. వాస్తవానికి వ్యవసాయరంగ దుస్థితి, సంవత్సరాలుగా ఉద్దేశపూర్వకంగా దాన్ని క్షీణింపజేస్తున్న విధానాలను సరైనవే అని అందరినీ నమ్మించే పరిస్థితులు ఉన్నాయేమో అనిపిస్తోంది. సరైన గిట్టుబాటు ధరలు అందించని కారణంగా 2000 నుంచి 2017 వరకు దేశ రైతులు రూ. 45 లక్షల కోట్ల వరకు నష్టపోయారని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ పేర్కొంది. 2011 నుంచి 2015 వరకు అయిదేళ్ల కాలంలో రైతుల నిజ ఆదాయాలు ఏటా అర్ధ శాతం కంటే తక్కువగా మాత్రమే పెరుగుతూ వచ్చాయని నీతి ఆయోగ్ అంచనా. గత రెండేళ్లుగా రైతుల ఆదాయం సున్నాకు సమానంగా ఉంటున్న దారుణ వాస్తవాన్ని గమనించిన తర్వాతే దేశంలోని చిన్న రైతులకు ప్రతి ఏటా రూ. 6,000 నగదును నేరుగా వారి ఖాతాలకు బదిలీ చేసే విధంగా ప్రత్యక్ష నగదు సహాయ పథకాన్ని అందించడానికి కేంద్రం తప్పనిసరి పరిస్థితుల్లో పూనుకుందని గమనిం చాలి. గత 12 నెలల్లోనే దేశంలో 56.6 లక్షల మంది ఉపాధి కోల్పోయారని సీఎమ్ఐఈ అధ్యయనం పేర్కొంది. వీరిలో 82 శాతం మంది లేక 46 లక్షల మంది గ్రామీణ ప్రాంతాలకు చెందినవారే. ఇంత బీభత్సం నెలకొన్నా గ్రామీణ భారతం కనీవినీ ఎరుగని దుస్థితి నుంచి ఎలాగోలా బతికి బట్టకడుతోందంటే ఒకరకంగా అద్భుతమే అని చెప్పాలి. ఇంత భారీ నష్టాలకు దేశంలో ఏ ఇతర రంగమైనా గురై ఉంటే కుప్పకూలిపోవడమే కాదు ఆర్థిక దిజ్ఞ్మండలం నుంచి అదృశ్యమైపోయేదంటే అతిశయోక్తి కాదు. గత 20 ఏళ్ల నుంచే కాదు.. అంతకుముందు కూడా వ్యవసాయ రంగం కునారిల్లిపోతూ వస్తోంది. గత నాలుగు దశాబ్దాలుగా వ్యవసాయ రాబడులు స్తంభించిపోయాయి. నలభై ఏళ్లుగా వ్యవసాయ కుటుంబాలు ఎలా మనగలుగుతూ వచ్చాయన్నది ఆలోచించడానికే నాకు భయమేస్తుంది. అమెరికన్ రైతు మైక్ కల్లిక్రేట్ ప్రకారం, 44 ఏళ్ల క్రితం 1974లో తన తండ్రి ఒక బుషెల్ (25.40 కేజీలకు సమానం) మొక్కజొన్నను 3.58 డాలర్లకు అమ్మారట. 2018లో మైక్ అదే మొక్కజొన్న బుషెల్ని 3.56 డాలర్లకు అమ్మారు. అంటే 44 ఏళ్ల క్రితం తన తండ్రి అమ్మినదానికంటే రెండు సెంట్లు తక్కువ అన్నమాట. అధికోత్పత్తి అనేది వ్యవసాయ మార్కెట్లలో ధరలను అమాంతంగా క్షీణింప జేస్తోంది. దీంతో రైతులు రుణ ఊబిలో చిక్కుకుపోతున్నారు. ’’అప్పులతోటే పుట్టడం, అప్పులతోటే జీవించడం.. వాస్తవానికి నరకంలో గడుపుతున్నట్లే ఉంటుంద’’ని బ్రస్సెల్ సమీపంలోని లెషోన్నెల్స్ గ్రామానికి చెందిన 93 ఏళ్ల రైతు డెక్లెర్క్ గిల్బర్ట్ గత సంవత్సరం నాతో స్వయంగా అన్నమాటలు ఇప్పటికీ గుర్తున్నాయి. గత యాభై ఏళ్లుగా వ్యవసాయరంగ రాబడులు ఎలా స్తబ్దుగా ఉండిపోయాయో అర్థం చేసుకోవడానికి కనీస మద్దతు ధర వృద్ధిని, వివిధ రంగాల్లోని ఉద్యోగుల మూలవేతనంతో సరిపోల్చి చూశాను. ఇన్నేళ్లుగా రైతులు తమకు రావలసిన న్యాయమైన ధరల విషయంలో ఎంత తిరస్కరణకు గురవుతున్నారో దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. 1970లో, క్వింటాల్ గోధుమ ధరకు కనీస మద్దతు ధర రూ. 76లు ఉండేది. 45 ఏళ్ల తర్వాత అంటే 2015లో క్వింటాల్ గోధుమ కనీస మద్దతు ధర రూ. 1,450లకు చేరింది. అంటే 19 రెట్లు పెరిగింది. ఇదే కాలంలో దేశంలోని వివిధ రంగాల ఉద్యోగుల మూలవేతనం ప్లస్ డీఏ (ఇతర అలవెన్సులు కలపకుండానే) ఎంత పెరిగిందో అంచనా వేశాను. ఇది ప్రభుత్వోద్యోగులకు 120 నుంచి 150 రెట్లు పెరిగింది. కాలేజీ, యూనివర్సిటీ లెక్చరర్, ప్రొఫెసర్లకు 150 నుంచి 170 రెట్లు పెరిగింది. పాఠశాల ఉపాధ్యాయులకు 280 నుంచి 320 రెట్లు పెరిగింది. గత 45 ఏళ్లలో గోధుమ కనీస మద్దతు ధర వంద రెట్లు పెరిగి ఉంటుందని భావించినట్లయితే రైతులు క్వింటాల్ గోధుమకు కనీసం రూ. 7,600 పొందగలిగేవారు. కానీ 2015 లో గోధుమ రైతులు క్వింటాల్ గోధుమలకు పొందిన కనీస మద్దతు ధర రూ.1,450లు మాత్రమే. అంటే ఆహార ధరలను తక్కువగా ఉంచుతూరావడం వల్ల కలిగే భారాన్ని మొత్తంగా రైతులపైనే మోపుతున్నారు. గోధుమలు మాత్రమే కాదు. టమాటా, బంగాళదుంపలు, ఉల్లిపాయలను మన రైతులు గిట్టుబాటు ధరలు లేక వీధుల్లో విసిరిపోస్తుండటం తరచుగా జరుగుతోంది. పంట చేతికొచ్చాక గత మూడేళ్లుగా మండీల్లో వీటి ధరలు 25 నుంచి 40 శాతం వరకు పడిపోతూండటమే దీనికి కారణం. అదే సమయంలో గోధుమలు, వరి, మొక్కజొన్న వంటి ప్రధాన పంటల ఉత్పత్తి ఖర్చులకు, వాటి రాబడులకు మధ్య వ్యత్యాసం భారీగా పెరిగిపోతోంది. రైతుల మెడలు ఉరితాళ్లకు వేలాడుతున్నాయంటే ఇదే కారణం. పైగా దేశవ్యాప్తంగా ఇంతవరకూ 6 శాతం మంది రైతులు మాత్రమే కనీస మద్దతు ధర ప్రయోజనాలను పొందగలిగారని శాంతకుమార్ కమిటీ తేల్చిచెప్పింది. ఇక సూక్ష్మ ఆర్థిక విధానంలో భాగంగా వ్యవసాయ ధరలను అత్యంత తక్కువ స్థాయిలో కొనసాగిస్తారు. చాలా సందర్భాల్లో ఇది రైతుల ఉత్పత్తి ఖర్చుకుంటే తక్కువగానే ఉంటుంది. అంటే రైతులు పంటలను పండిస్తున్నారంటే వాస్తవానికి వారు తమకు కలగబోయే నష్టాలను పండిస్తున్నట్లు లెక్క. ఎలాంటి పంటలు పండించినా, ఏ టెక్నాలజీని వాడినా సరే వ్యవసాయరంగాన్ని రైతులకు వ్యతిరేకంగా మలుస్తుండటం పరిపాటి అయింది. రైతులకు వారి న్యాయమైన ఆదాయాన్ని తిరస్కరించడం అనేది వ్యవసాయ సమాజంపై తీవ్ర ప్రభావం కలిగిస్తోంది. మహారాష్ట్రలోని యావత్మాల్ గ్రామంలోని సన్నకారు రైతు కుమారుడు గోపాల్ బాబూరావ్ రాథోడ్ అనే 22 ఏళ్ల పట్టభద్ర విద్యార్థి రెండేళ్లక్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. నగరాల్లోని తోటి సహచర యువతలాగే గ్రామీణ యువతకు కూడా భవిష్యత్తుపై ఆశలూ, ఆకాంక్షలూ ఉంటాయని చెబుతూ ఆత్మహత్యకు ముందు నోట్ రాశాడు. ‘మనదేశంలో ఒక టీచర్ కుమారుడు సులువుగా లక్ష రూపాయల ఫీజు చెల్లించి ఇంజనీరు అవుతున్నాడు. కానీ రైతు బిడ్డ అంత మొత్తం ఫీజు ఎలా కట్టగలడో ఎవరైనా చెప్పగలరా?’ అంటూ మరో కీలకమైన ప్రశ్నను సంధించాడు. ‘రైతులు తమ ఉత్పత్తికి తగిన పరిహారాన్ని అడిగితే ప్రభుత్వాలు తిరస్కరిస్తున్నప్పుడు వేతనాలు పొందుతున్న ఉద్యోగులు ఆ అన్యాయాన్ని కనీసం ప్రశ్నించకుండానే డీఏలు (డియర్నెస్ అలవెన్స్) ఎలా తీసుకుంటారు?’ ఈ ప్రశ్నను దాటి చూస్తే 1995 నుంచి 2015 వరకు 20 ఏళ్లలో దేశవ్యాప్తంగా 3,18,528 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మన రైతు జీవితాల్లో చోటు చేసుకుంటున్న ఈ సీరియల్ మృత్యు తాండవానికి ప్రధాన కారణం రుణభారమే. దేశంలో 6 శాతం రైతులు మాత్రమే కనీస మద్దతు ధర పొందుతూ మిగిలిన 94 శాతం రైతులు దోపిడీ మార్కెట్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ధాన్య సేకరణ వ్యవస్థను బలోపేతం చేయడం చాలా అవసరం. రైతులు మార్కెట్లకు ఎంత అదనపు పంటను తీసుకొచ్చినా సరే.. ప్రభుత్వం ప్రకటించిన ధరకు మొత్తం పంటను కొనుగోలు చేసే వ్యవస్థ రావాలి. ప్రధానమంత్రి ఆశా పథకం దీనికి హామీ ఇచ్చినా అమలు విషయంలో విఫలమైంది. మార్కెట్ మౌలికవసతులు తగినంతగా ఏర్పర్చలేకపోతే ఎలాంటి అర్థవంతమైన సంస్కరణలు కూడా వ్యవసాయాన్ని గట్టెక్కించలేవు. అదే సమయంలో పబ్లిక్ సెక్టార్ను పక్కకు తోసివేసి ప్రైవేట్ కంపెనీలను వాటి స్థానంలో భర్తీ చేస్తే ప్రతి ప్రభుత్వ సంస్కరణ పరాజయం పాలుకాక తప్పదు. తెలంగాణలో రైతుబంధు, ఒడిశాలో కాలియా స్కీమ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, కర్ణాటక, ఏపీ వంటి రాష్ట్రాల్లో రైతులకు ప్రత్యక్ష నగదు పథకాలు ప్రవేశపెట్టడం గణనీయమైన మార్పు. రాబోయే సంవత్సరాల్లో ఇది రైతుకు స్వావలంబనను చేకూరుస్తుంది. ఇది జాతీయ పథకంగా మారి సార్వత్రికంగా అమలైనప్పుడు రైతుల ఆదాయానికి కనీస హామీ ఉంటుంది. ఏడాదికి కనీసం రూ. 18,000లను రైతు కుటుంబానికి అందించగలిగితే రైతుల జీవితంలో కొత్త మార్పుకు నాంది పలికినట్లే అవుతుంది. వ్యాసకర్త : దేవిందర్శర్మ, వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
రైతు స్వేదంతో రాజకీయ సేద్యం
గత సంవత్సరం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సౌరాష్ట్ర ప్రాంత రైతులు బీజేపీ ప్రభుత్వాన్ని ఓటమి అంచుల్లోకి తీసుకుపోవడం, ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలను రైతులు సాగనంపడం, రైతుబంధు పథకంతో తమను ఆదుకున్న తెలంగాణ ప్రభుత్వానికి రైతులు ఘనవిజయం కట్టబెట్టడం చూస్తుంటే.. ఓటింగ్ సమయంలో రైతులు నిర్ణయాధికారాన్ని శక్తిమంతంగా ప్రకటించే స్థితికి చేరుకున్నారని భావించక తప్పదు. రాజకీయ విధానాలు, ఆర్థికవ్యవస్థ చలనం రైతులను అధోగతికి చేరుస్తున్న నేపథ్యంలో, ఎన్నికల సమయంలో రైతుల సంఘటిత నిర్ణయం ఒక్కటే వారిని ముందుకు తీసుకుపోయే మార్గంలా కనిపిస్తోంది. ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన డిసెంబర్ 11 తర్వాత భారత రాజకీయాల్లో వ్యవసాయం కేంద్ర బిందువై కూర్చుంది. కానీ ఇది వ్యవసాయ పునరుజ్జీవనానికి తోడ్పడుతుందా అన్నదే ప్రశ్న. ప్రజాభిప్రాయం చాలా స్పష్టంగా వెల్లడైంది. గత సంవత్సరం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ఓటర్లు మత ఆగ్రహాన్ని చక్కగా ప్రదర్శించారు. గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతంలో పాలక బీజేపీని ఓటమి అంచులదాకా తీసుకురావడం అనేది ఆ ప్రాంతంలో తీవ్రమైన వ్యవసాయ దుస్థితిని స్పష్టంగా చాటి చెప్పంది. గ్రామీణ నాడిని పట్టుకోవడంలో వైఫల్యం, వీధుల్లోకి వచ్చిన రైతుల్లో పెరుగుతున్న ఆగ్రహావేశాలు వ్యవసాయం ప్రధానంగా ఉండే హిందీ ప్రాబల్య రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్తాన్లలో పాలక ప్రభుత్వాలు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పొందిన పరాజయం ప్రజాభిప్రాయాన్ని స్పష్టంగానే చిత్రిం చింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కాంగ్రెస్ పార్టీ తనకు అధికారమిస్తే వ్యవసాయ రుణాల మాఫీని, వరిపంటకు అధిక గిట్టుబాటు ధరలను కల్పిస్తామని వాగ్దానం చేసినప్పటికీ, పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు పథకం ద్వారా రైతులకు ప్రత్యక్ష నగదు ప్రోత్సాహం కలిగించిన అపార ప్రజాదరణతో కల్వకుంట్ల చంద్రశేఖరరావు అద్వితీయ విజయం సాధించారు. దేశంలోనే ప్రప్రథమంగా అమలైన ఈ వినూత్న పథకం ద్వారా తెలంగాణలోని భూ యజమానులు సంవత్సరానికి ఎకరా భూమికిగాను రూ. 8,000ను వ్యవసాయ దిగుబడి ఖర్చులను ప్రభుత్వం నుంచి సహాయకంగా పొందారు. ఈ మొత్తాన్ని ఖరీఫ్, రబీ సీజన్లలో రెండు దఫాలుగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం లోని 58 లక్షలమంది రైతులకు అందించి రికార్డు సృష్టించింది. ఈ పథకం కోసం తెలంగాణ ప్రభుత్వం 2018–19 బడ్జెట్లో రూ. 12,000 కోట్లమేరకు కేటాయించింది. ఈ పథకం కింద రైతుకు అందించే నగదును రూ. 10,000కు పెంచుతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. వెంటనే జార్ఖండ్ రాష్ట్రం ప్రభుత్వం కూడా ఎకరా భూమికి రైతుకు రూ. 5,000లను అందించే పథకాన్ని ప్రకటించి తెలంగాణ బాటలో నడిచింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వ్యవసాయ రుణాల మాఫీపై ఎన్నికల ప్రచార సమయంలో చేసిన హామీని అమలు చేస్తూ సంతకాలు పెట్టడంలో ప్రదర్శించిన వేగాన్ని పరిశీలించినట్లయితే, వ్యవసాయానికి సంబంధించినంతవరకు ఈ రాజకీయ అత్యావశ్యకతను కాంగ్రెస్ పార్టీ గుర్తించిందని స్పష్టంగా తెలుస్తోంది. మధ్యప్రదేశ్లో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని ఒక్కోరైతుకు గరి ష్టంగా 2 లక్షల రూపాయల మేరకు వ్యవసాయ రుణాలను మాఫీ చేసింది. దీనికయ్యే ఖర్చు దాదాపు రూ.35,000 కోట్లు ఉంటుందని అంచనా. అలాగే రాజస్తాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో వ్యవసాయ రుణాల మాఫీకోసం వరుసగా రూ. 18,000 కోట్లు, రూ. 6,100 కోట్లను ఖజానా నుంచి వెచ్చించనున్నాయి. ఈ రుణమాఫీలు పూర్తిగా అమలయితే 83 లక్షల మంది చిన్న, సన్నకారు రైతులకు లబ్ధి చేకూరుతుంది. రైతుల రుణమాఫీ వల్ల జమాఖర్చుల పట్టీలు (బ్యాలెన్స్ షీట్స్) అస్తవ్యస్థమవుతాయని, పైగా ఇది చెడు సంప్రదాయాన్ని నెలకొల్పుతుందని ఆర్థికవేత్తలు, బ్యాంకర్లు, ప్రణాళికా కర్తలు మొత్తుకుంటున్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రుణమాఫీలపై తిరుగులేని విధంగా ప్రకటన చేశారు. ‘రైతులకు నేనిచ్చే సందేశం ఒక్కటే. ఈ దేశం మీది. మీ రుణాలను మొత్తంగా మాఫీ చేయవలసిందిగా ప్రధాని నరేంద్రమోదీని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు కలిసి పనిచేస్తాయి. వ్యవసాయ రుణ మాఫీలను చేసేంతవరకు ప్రధానిని మేం నిద్రపోనీయం. ఒకవేళ మోదీ ఈ పనిచేయనట్లయితే, నూటికి నూరు శాతం కాంగ్రెస్ అందుకు పూనుకుంటుందని మాట ఇస్తున్నా. ‘రాహుల్ గాంధీ వాదనలో కాస్త హేతువు ఉంది మరి. 2014 ఏప్రిల్ నుంచి 2018 ఏప్రిల్ మధ్యకాలంలో మన దేశ కార్పొరేట్ రంగం నుంచి రాబట్టలేని రూ. 3.16 లక్షల కోట్ల మొండి బకాయిలను కేంద్రప్రభుత్వం రద్దు చేసింది. ఇంత భారీ మొత్తాన్ని కేంద్రం రద్దు చేస్తున్నా ఘనత వహించిన మన ఆర్థికవేత్తలూ లేక బ్యాంకర్లు కిమ్మనడం లేదు. గావుకేకలు పెట్టడం లేదు. ఆర్తనాదాలు చేయడం లేదు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలకు ముందు గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించగా చాలాచోట్ల గ్రామీణ ప్రజలు నాతో ఇదే విషయమై వాదులాటకు దిగారు. కార్పొరేట్ కంపెనీల భారీ రుణాలను ఉన్నపళాన రద్దు చేస్తున్నప్పుడు రైతుల రుణాలను ఎందుకు రద్దు చేయరు అనేది వారి ప్రశ్న. నిజానికి వారి ఆగ్రహం కేంద్ర ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యన్ పైకి మళ్లింది. ఎందుకంటే కార్పొరేట్ రుణాలను రద్దు చేయడం ఆర్థిక ప్రగతికి దారితీస్తుందని ఆయన రికార్డుపూర్వకంగా ప్రకటించారు. మరోవైపున ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేశాక రైతు రుణ మాఫీని ప్రకటించినప్పుడు, అది జాతీయ బ్యాలెన్స్ షీట్లను దెబ్బతీస్తుందని, నైతికపరంగా అది అపాయకారి అని నాటి ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ పేర్కొన్నారు. అయినప్పటికీ, హిందీ ప్రాబల్య ప్రాంతంలో ఓటర్లు ఇచ్చిన స్పష్టమైన తీర్పు వ్యవసాయాన్ని భారత రాజకీయరంగం కేంద్రపీఠంలోకి తీసుకొచ్చింది. రాజకీయ ఎజెండాలో వ్యవసాయానికి అగ్ర ప్రాధాన్యం లభించింది. దీని సందేశం చాలా స్పష్టంగానూ, బిగ్గరగానూ వినిపించింది. బహుశా దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఎన్నికల తీర్పు వ్యవసాయ సమాజంలో కొట్టొచ్చినట్లుగా ఆత్మవిశ్వాసాన్ని పునరుద్ధరించినట్లు సంకేతాలు వెలువరించింది. మతం, కులం, సిద్ధాంతాలు ప్రాతిపదికన రాజకీయ పార్టీల విభజన విధానాలకు దాటి ఆలోచిస్తున్న రైతాంగం, ఇప్పుడు తమ సామూహిక ఓటింగ్ శక్తిని వాస్తవంగా గ్రహిస్తున్నారు. ప్రభుత్వాలను అమాంతంగా పడదోయగల శక్తి తమకుందని ఇటీవలి ఎన్నికలు వారికి స్పష్టంగా బోధపర్చాయి. 2019 సార్వత్రిక ఎన్నికలను కూడా ఈ ప్రధానాంశం తప్పనిసరిగా ప్రభావం చూవవచ్చు. జనాభాలో దాదాపు 50 శాతం మంది అటు ప్రత్యక్షంగానో, ఇటు పరోక్షంగానో వ్యవసాయరంగంలో మునిగివున్న దేశంలో, ఎట్టకేలకు రైతులు తమను తాము మరింత ఆత్మవిశ్వాసంతో ప్రకటించుకునే స్థితికి చేరుకున్నారు. గత నాలుగు దశాబ్దాలుగా వ్యవసాయరంగంలో వాస్తవ ఆదాయాలు ఘనీభవించిపోయాయి. ఇటీవలే ఓఈసీడీ జరిపిన అధ్యయనం ప్రకారం, భారత్లో గత రెండు దశాబ్దాలుగా వ్యవసాయ రాబడులు యధాతథంగా ఉండిపోయాయని తెలుస్తోంది. అంతకుముందు యూఎన్సీడీఏడీ (అంక్టాడ్) నిర్వహించిన అధ్యయనం ప్రకారం, అంతర్జాతీయంగానే వ్యవసాయ ఉత్పత్తుల ధరలు ద్రవ్యోల్బణం కారణంగా 1995 నుంచి 2005 వరకు స్తబ్దతలో ఉండిపోయాయని తేలింది. ఇక ఇటీవల నీతి అయోగ్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం 2011–12 నుంచి 2015–16 మధ్య అయిదేళ్ల కాలంలో వ్యవసాయోత్పత్తి వేగంగా పెరిగినప్పటికీ వ్యవసాయంలో వాస్తవాదాయం అర్థ శాతం కంటే అంటే 0.44 శాతం కంటే తక్కువగా ఉందని తెలిసింది. మన దేశంలో రైతులు నిజంగానే పంటలు పండించడం అనే శిక్షకు గురైనట్లుంది. కొన్ని మినహాయింపులను దాటి చూస్తే, ప్రతి సంవత్సరం వారు పండిస్తున్న పంటల దిగుబడి ఖర్చుకు తక్కువ రాబడినే నిత్యం పొందుతూ వస్తున్నారు. ఆహార ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో ఉంచడానికి దేశ ఆర్థిక భారం మొత్తాన్ని అనాయాసంగా రైతులపై మోపుతున్నారు. రైతు తన జీవిత పర్యంతం అప్పులతోటే పుట్టడం, అప్పులతోటే బతుకీడ్చటం నిజంగా నరకప్రాయమైనది. బతకాలంటే అప్పు చేయక తప్పని పరిస్థితి. మరోవైపున ఆ తీసుకున్న అప్పు పర్వతభారంలాగా పెరిగిపోతూ ఉంటుంది. రైతు జీవితం పొడవునా అలుముకున్న ఆర్థిక దుస్థితి ఇదేమరి. దేశంలోని 17 రాష్ట్రాల్లో లేక దాదాపుగా సగం దేశంలో వ్యవసాయ కుటుంబం సగటు ఆదాయం సంవత్సరానికి కేవలం రూ.20,000 మాత్రమే అని ఎకనమిక్ సర్వే 2016 ప్రకటించడం దేశాన్ని నివ్వెరపర్చింది. రాజకీయ విధానాలు, ఆర్థికవ్యవస్థ చలనం రైతులను అధోగతికి చేరుస్తున్న నేపథ్యంలో దేశ రాజకీయ ఆవరణంలో ఎన్నికల సమయంలో రైతుల సంఘటిత నిర్ణయం ఒక్కటే వారిని ముందుకు తీసుకుపోయే మార్గంలా కనిపిస్తోంది. ఈ రాజకీయ మూలమలుపు వ్యవసాయదారులను నూతన పునరుజ్జీవన దిశగా నడిపిస్తుందా అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుంది. వ్యాసకర్త: దేవిందర్శర్మ, వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
రైతును లక్ష్యపెట్టని రాజకీయం
స్వాతంత్య్రం సాధించి ఏడు దశాబ్దాలు దాటిన తర్వాత కూడా మన దేశంలోని రైతుల్లో 58 శాతం మంది నేటికీ ప్రతిదినం రాత్రిపూట పస్తులతో పడుకుంటున్నారని తెలిసినప్పుడు యావద్దేశం షాక్కు గురికావాలి. పరిశ్రమల అభివృద్ధి లక్ష్యంగా ఆర్థిక సంస్కరణలు కొనసాగుతూ రైతును చిన్నచూపు చూడటమే ఈ జాతీయ విషాదానికి కారణం అని రైతాంగం గ్రహించనంతవరకు వారు సార్వత్రిక ఎన్నికల్లోనూ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ మోసపోతూనే ఉంటారు. కుల, మత, రాజకీయ సిద్ధాంతాలకు అతీతంగా మేల్కొని రైతులుగా మాత్రమే తమ ఓటు వేసినప్పుడే మన దేశ రాజకీయ వాతావరణంలో మార్పు సంభవిస్తుంది. సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ తన చెవులను తాను నమ్మలేకపోయారు. బహుళ ప్రజాదరణ పొందిన కౌన్ బనేగా కరోడ్పతి కార్యక్రమంలో తన ముందు హాట్ సీట్లో మహారాష్ట్రకు చెందిన, నాలుగు ఎకరాల పొలాన్ని సాగు చేస్తున్న ఒక సన్నకారు రైతు కూర్చుని ఉన్నాడు. సంవత్సరంలో ఎంత సంపాదిస్తారు అని అడిగిన ప్రశ్నకు అనంత్కుమార్ అనే ఆ రైతు చెప్పిన సమాధానం ఇది. ‘సంవత్సరానికి రూ. 60,000కు మించి సంపాదన ఉండదు. దాంట్లో సగం డబ్బులు పెట్టి విత్తనాలు కొంటాను, మిగిలిన మొత్తం నా కుటుంబానికి రోజుకు ఒక పూట భోజనానికి మాత్రమే సరిపోతుంది’. అమితాబ్ బచ్చన్ నమ్మలేనట్లుగా మళ్లీ ప్రశ్నించారు. అన్నదాత బాధామయగాథను మరోసారి విన్న తర్వాత, రైతులను ఆదుకోవడానికి ముందుకు రావలసిందని, తోచిన సాయం చేయవలసిందని అమితాబ్ కోరుతూ జాతిని అభ్యర్థించారు. భారతీయ చిత్రపరిశ్రమ కన్న ఈ ధీరోదాత్త దిగ్గజ నటుడు ప్రదర్శించిన ఈ సానుభూతిని, కనికరాన్ని ప్రశంసించకుండా ఉండలేను. కానీ, ఈ దేశంలో అనంత్ కుమార్ వంటివారు అరుదైన రైతులు కారన్న వాస్తవాన్ని తెలుసుకున్నప్పుడు అమితాబ్ స్పందన ఎలా ఉంటుంది అని నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఆ రైతు చెప్పింది భారతీయ వ్యవసాయం విషయంలో చాలావరకు వాస్తవమే. ఈ దేశంలోని రైతుల్లో 58 శాతం మంది నేటికీ ప్రతిదినం రాత్రిపూట పస్తులతో పడుకుంటున్నారని పలు తాజా అధ్యయనాలు తెలుపుతున్నాయి. స్తంభించిపోయిన రైతు రాబడి ఎకనమిక్ సర్వే 2016 ప్రకారం, భారతదేశంలోని 17 రాష్ట్రాలలో (అంటే దేశంలోని దాదాపు సగం రాష్ట్రాల్లో) ఒక రైతు సగటు ఆదాయం సంవత్సరానికి రూ. 20,000 మాత్రమేనని తెలిసింది. మరో వైపున దేశంలో గత అయిదేళ్లలో (2010–2015 మధ్య) దేశవ్యాప్తంగా రైతుల నిజ ఆదాయంలో వార్షిక పెరుగుదల అర్ధశాతం కంటే తక్కువేనని సాక్షాత్తూ నీతి ఆయోగ్ చెబుతోంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 0.44 శాతం పెరుగుదల మాత్రమే ఉంది. గత నలభై ఏళ్లలో ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేసి చూస్తే రైతుల ఆదాయం కాస్త ఎక్కువగా లేక కాస్త తక్కువగా ఉంటూ స్తంభించిపోయి ఉంది. వ్యవసాయ రంగ వ్యధ ఇప్పుడు పరాకాష్టకు చేరుకుంది. ప్రధానంగా ఈ కారణం వల్లే దేశ రైతులు ఆగ్రహంతో వీధులకెక్కుతున్నారు. ప్రస్తుతం దేశంలో ఏదో ఒక ప్రాంతంలో రైతుల ఆందోళన, నిరసన ప్రదర్శనలు జరగకుండా ప్రశాంతంగా గడుస్తున్న వారాన్ని దాదాపుగా మనం చూడడం లేదు. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం, 2014లో 687 రైతు ప్రదర్శనలు జరగగా 2015లో ఒక్క ఏడాదిలోపే 2,683 నిరసన ప్రదర్శనలు చోటుచేసుకున్నాయి. ఒక సంవత్సరం తర్వాత అంటే 2016లో రైతు నిరసనల సంఖ్య రెట్టింపై 4,837కు చేరుకుంది. మరోమాటలో చెప్పాలంటే కేవలం మూడేళ్ల వ్యవధిలోపే రైతుల నిరసన ప్రదర్శనలు ఏడు రెట్లు పెరిగాయి. రైతుల్లో పెరుగుతున్న ఆగ్రహావేశాలకు ఇది స్పష్టమైన సంకేతంగా చెప్పవచ్చు. నాసిక్ నుంచి ముంబై వరకు రైతుల లాంగ్ మార్చ్ తర్వాత ఇటీవల హరిద్వార్ నుంచి న్యూఢిల్లీ వరకు కిసాన్ యాత్ర జరిగిన తదనంతరం మరిన్ని భారీ రైతు నిరసన ప్రదర్శనలకు పథకం రచించారు. వీటిలో ఆదివాసీలు, భూమిలేని రైతులతో కూడిన అతి పెద్ద ప్రదర్శన కూడా ఒకటి. నిశితంగా పరిశీలించి చూస్తే రైతుల ఆగ్రహ ప్రదర్శనలు రెట్టింపు అవుతున్నాయని బోధపడుతుంది. వరుసగా మూడేళ్లుగా వ్యవసాయ పంటల ధరలు పతనమవడమే ఇంత భారీస్థాయిలో రైతుల ప్రదర్శనలకు, వారి ఆగ్రహజ్వాలలకు ప్రధాన కారణం. 2019లో పార్లమెంట్ ఎన్నికలు జరగడానికి ముందుగా 5 రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల్లో గ్రామీణ ఓటర్ల వాటా చాలా ఎక్కువగా ఉంది. సరిగ్గా ఈ రాష్ట్రాల్లోనే రైతుల నిరసనలు క్రమంతప్పకుండా జరుగుతున్నాయి. రైతుల ఆందోళనలే ఈ రాష్ట్రాల్లో అధికంగా నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో నగర కేంద్రాలకు కూరగాయలు, పాల ఉత్పత్తులను నిలిపివేసి మరీ నిరసనలకు రైతులు పూనుకున్నారు. ఇక మధ్యప్రదేశ్లో అయితే రైతులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో అయిదుగురు రైతులు చనిపోయారు. రైతుల ఆగ్రహం ఇలా స్పష్టంగా గోచరిస్తుండగా, ఇప్పుడు దేశం ముందున్న పెద్ద ప్రశ్న ఏదంటే, ఈ రైతాంగ నిరసనలు రాజకీయ పార్టీలను వాటి ఎన్నికల అజెండాను పునర్నిర్వచించుకునేలా చేసి, ఆర్థికాభివృద్ధిలో వ్యవసాయానికి అగ్రస్థానం ఇచ్చేలా ఒత్తిడి పెట్టగలవా అన్నదే. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే అన్ని రాజకీయ పార్టీలూ తమ సిద్ధాంతాలతో పనిలేకుండా రైతులు కోరినవల్లా ఇస్తామని వాగ్దానం చేస్తున్నాయి. కానీ ఎన్నికలు ముగియగానే ఆర్థిక రాడార్ స్క్రీన్పై రైతులు కనుమరుగైపోతున్నారు. మరోలా చెప్పాలంటే రైతుల సమస్యలను పూర్తిగా వదిలివేస్తున్నారు. రైతును దగా చేస్తున్న రాజకీయ పార్టీలు గత 30 ఏళ్లుగా నేను ఈ పరిణామాలను చూస్తూ వస్తున్నాను. ప్రతి ఎన్నికల సమయంలోనూ రాజకీయ పార్టీలు రైతులను వంచిస్తూ తాము అధికారంలోకి వస్తే అవి కల్పిస్తాం, ఇవి కల్పిస్తాం అంటూ ఆర్థిక ప్రలోభాలకు గురిచేస్తూవస్తున్నాయి. ఎన్నికలు ముగిశాక తదుపరి నాలుగేళ్ల పాలనలో అధికార పార్టీ రైతులను బాదిపడేస్తోంది. చివరి సంవత్సరంలో మాత్రం రైతులకు తాయిలాలు ప్రకటిస్తూ ఆకర్షిస్తున్నారు. కనీసం ఇలాంటి వాగ్దానాలను కూడా నెరవేర్చడంలో పాలకులు విఫలమవుతున్నారు. ఉత్తరప్రదేశ్లో రైతులకు సంబంధించిన అన్ని రకాల రుణాలనూ మాఫీ చేస్తామని యోగి ఆదిత్యనాథ్ దంబాలు పలికారు కానీ వాస్తవానికి సన్నకారు రైతులకు గరిష్టంగా 1 లక్ష రూపాయల వరకు మాత్రమే రుణ మాఫీ చేశారు. ఇక పంజాబ్లో కేప్టెన్ అమరిందర్ సింగ్ అయితే రైతుల అప్పులను తీర్చేస్తానని, ప్రైవేట్ బ్యాంకులు, జాతీయ బ్యాంకుల్లో తీసుకున్న అన్ని రుణాలను కూడా మాఫీ చేస్తామని ఆర్భా టంగా ప్రకటించారు. కానీ ఎన్నికలు ముగిశాక ఇంతవరకు రూ. 900 కోట్ల మొండి రుణాలను మాత్రమే రద్దు చేశారు. పంజాబ్లో రైతుల మొత్తం రుణాలు రూ. 86,000 కోట్లు. మహారాష్ట్రలో ఇంతవరకు రూ.16,000 కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేశారు. రూ. 34,000 కోట్ల మొత్తం రుణాలలో ఇది సగంకంటే తక్కువే. రైతాంగ ఉద్యమాలు పాలకుల వ్యవసాయ దృక్పథంలోనూ, ఆర్థిక విధానాల్లోనూ మార్పు తీసుకురావడంలో విఫలమయ్యాయనడం వాస్తవం. దేశీయ రైతాంగం తీవ్రంగా పోరాడింది కానీ నేటికీ వారి ఉద్యమాలు రెండు ప్రధాన డిమాండ్లకే కట్టుబడి ఉంటున్నాయి. అన్నిరకాల రుణాలను మాఫీ చేయడం, స్వామినాథన్ కమిషన్ ప్రతిపాదనల మేరకు వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను పెంచడం. ఇవి రెండూ చాలా అత్యవసరమైనవే. కానీ, సమాజంలోని ఇతర విభాగాలకు, రంగాలకు ప్రభుత్వాలు కేటాయిస్తున్న పెట్టుబడులను, అంది స్తున్న ఆర్థిక మద్దతును రైతు సంఘాలు అధ్యయనం చేసి, విశ్లేషించి బోధపర్చుకోకుంటే, ప్రభుత్వ విధానం ఫలితంగానే దేశీయ వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోతోందన్న వాస్తవాన్ని గ్రహించడం అంత సులభం కాదని నా అభిప్రాయం. పరిశ్రమల కోసం వ్యవసాయం బలి మన దేశ ఆర్థిక విధానాలు తొలి నుంచి వ్యవసాయాన్ని ఆర్థికంగా లాభదాయకం కాని విధంగా ఉద్దేశపూర్వకంగా మలుస్తున్నాయి. రైతుల పట్ల ప్రభుత్వాల బాదుడు మొదట్నుంచి ఇదేరకంగా కొనసాగుతోంది. మధ్యప్రదేశ్లో భవంతర్ భూగ్టన్ పథకం ప్రవేశపెట్టడం లేక వ్యవసాయ పంటల సేకరణపై తగు నిబంధనలు చేర్చకుండానే పంటలకు కనీస మద్దతు ధరను కాస్త అధికంగా ప్రకటించడం వంటి కొన్ని చెదురుమదురు పథకాలు తప్పితే వ్యవసాయ సంస్కరణలకు సంబంధించి మౌలిక మార్పులు ఏవీ చోటుచేసుకోవడం లేదు. దీనిఫలితంగా వ్యవసాయదారుల్లో అశాంతి అధికమవుతోంది. వ్యవసాయ రంగంలో ప్రశాంతతను నెలకొల్పాలంటే, రైతుల ముఖాల్లో చిరునవ్వులు చిందించాలంటే ప్రభుత్వ విధానాలను పూర్తిగా మార్చాల్సిందే. పైగా వ్యవసాయ భూమిని పరిశ్రమ రంగం సులభంగా, తాము కోరుకున్నవిధంగా చేజి క్కించుకోవడానికి తగినట్లుగా భూ చట్టాలను ఇష్ట్రపకారం మార్చివేయడం ప్రధాన సమస్యగా మారింది. వాస్తవానికి ఆర్థిక సంస్కరణల కొనసాగింపు కోసం వ్యవసాయ రంగాన్ని బలిపెడుతున్నారు. రానున్న 2019 ఎన్నికలు మార్పు తీసుకురానున్నాయా? నాకయితే అలా అనిపించడం లేదు. ఇప్పటివరకు జరిగిందేదో జరిగిపోయింది లెమ్మని రైతులు గుర్తించి తగు కార్యాచరణకు దిగనట్లయితే, వారు మరింత దుర్భర పరిస్థితుల్లో కూరుకుపోవడం ఖాయం. అప్పుడు రైతులు తమను తాము తప్పుపట్టుకోవలసిందే. అన్ని రకాల పార్టీల రాజకీయ నాయకులు తమపై సులభంగా స్వారీ చేస్తుంటే గత 70 సంవత్సరాలుగా వ్యవసాయదారులు చూస్తూ ఉండిపోయారు. కుల, మత, రాజకీయ భావజాలాలకు అతీతంగా రైతులు మేల్కొని కేవలం రైతులుగా మాత్రమే తమ ఓటు వేసినప్పుడు మాత్రమే మన దేశ రాజకీయ వాతావరణం మారిపోతుంది. రైతులు తమ ఓటును రైతులుగా మాత్రమే వేసిన రోజున దేశ ఆర్థిక విధానాలు కూడా మారిపోతాయి. ఆరోజు ఎప్పుడొస్తుంది అనేది మన రైతుల చేతుల్లోనే ఉంది. దేవిందర్శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు -
అనవసర యంత్రాలతో అధిక హాని
అత్యధిక వ్యయంతో కూడిన వ్యవసాయ యంత్రాల అనవసర భారం వల్లే దేశీయ వ్యవసాయం దురవస్థల పాలవుతోందని గుర్తించకపోవడం వలన వ్యవసాయిక ప్రధాన రాష్ట్రాలైన పంజాబ్, హరియాణాలు తమ రైతులకు మరిన్ని యంత్రాలను అమ్మడానికి శతథా ప్రయత్నిస్తున్నాయి. వరి పంట కోతల కాలం సమీపిస్తుండటం, ఢిల్లీలో వాయు కాలుష్యం భీతి కలిగిస్తుండటం వల్ల, ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలూ పంట కోతలు పూర్తయ్యాక మిగిలే దుబ్బు తగులబెట్టడం లేదా తొలగించడం పేరిట మరిన్ని యంత్రాలను రైతులకు అంటగట్టేందుకు రాత్రింబవళ్లు పనిచేస్తున్నాయి. పంటకోతలు పరాకాష్టకు చేరుతున్నందున, పంజాబ్ 27,972 వ్యవసాయ యంత్రాల సరఫరాను లక్ష్యంగా పెట్టుకుంది. వరి నాటు యంత్రాలు, పంట కోత యంత్రాలు, దుబ్బును తొలగించే యంత్రాలు, పొలం దున్నే యంత్రాలు వంటి పలు రకాల పనిముట్లు వీటిలో భాగం. ఇక హరియాణాలో అలాంటి 40 వేల యంత్రాలను ఇప్పటికే 900 కిరాయి కేంద్రాలకు, వేలాది విడివిడి రైతులకు ప్రత్యక్ష కొనుగోలు పద్ధతిలో సరఫరా చేశారు. రైతులకు కలుపుతీత, వరిపంట కోత యంత్రాన్ని –హ్యాపీ సీడర్ మెషీన్– 50 శాతం సబ్సిడీతో అందిస్తున్నారు. ఇకపోతే కో–ఆపరేటివ్ లేదా రైతుల బృందాలకు దీన్ని 80 శాతం సబ్సిడీతో అందిస్తున్నారు. వ్యవసాయ పనిముట్ల ఉత్పత్తిదారులకు ఇది వరం లాంటిది. చాలా కాలంగా ఈ యంత్రాలను అమ్మడానికి వీరు పెద్ద ఎత్తున లాబీ చేస్తున్నారు. పంజాబ్లో లక్ష ట్రాక్టర్లు అవసరమైన చోట ఇప్పటికే నాలుగున్నర లక్షల ట్రాక్టర్లను ఉనికిలోకి తెచ్చారు. ఒక యంత్రం అవసరమైన చోట పంజాబ్ రైతులు ఆరు నుంచి ఎనిమిది వరకు అదనపు యంత్రాల భారాన్ని ఎందుకు మోస్తున్నారనేది నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. ట్రాక్టర్లను మోతాదుకు, అవసరానికి మించి మోస్తుండటమే పంజాబ్ రైతులు అప్పుల ఊబిలో చిక్కుకుపోవడానికి ప్రధాన కారణమవుతోంది. వ్యవసాయ కార్యకలాపాల్లో అధిక యంత్రాల వినియోగం రైతుల రుణభారాన్ని మరింతగా పెంచుతోంది. వ్యవసాయ యంత్రాల కొనుగోళ్ల కోసం సబ్సిడీ కేటాయింపును పరిశీలిస్తే ప్రభుత్వ వ్యవసాయ విధానాలు ఎంత హ్రస్వ దృష్టితో ఉంటున్నాయో అర్థమవుతుంది. ఈ కేటాయింపుల అసలు లక్ష్యం వ్యవసాయదారుల పేరుతో వ్యవసాయ పనిముట్ల ఉత్పత్తిదారులకు సహాయం చేయడమేనా అని నాకు ఆశ్చర్యం కలుగుతుంటుంది. గతంలో కూడా పాలీ హౌస్ల (పాలిథిన్ షీట్ల నీడలో చేసే వ్యవసాయం)ను ఏర్పాటు చేయడానికి వాటి పరిమాణాన్ని బట్టి రూ. 25 లక్షల భారీ సబ్సిడీని అందుబాటులోకి తెచ్చారు. కానీ ఈ పాలీ హౌస్లలో 80 శాతం కంటే ఎక్కువగా పని చేయడం లేదని అనేక అధ్యయనాలు కోడై కూస్తున్నాయి. ఇది భారీ కుంభకోణానికి ఏమాత్రం తక్కువ కాదు. అయితే పంజాబ్, హరియాణా, పశ్చిమ ఉత్తరప్రదేశ్లకు ఏది అవసరమో పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ గతంలోనే సూచిం చారు. దుబ్బును తగులబెట్టకుండా, తొలగించడానికి కేంద్రప్రభుత్వం 2 వేల కోట్ల రూపాయలను మదుపు పెట్టాల్సి ఉంది. ‘క్వింటాల్ దుబ్బు తొలగింపునకు కనీసం రూ. 100లు ఇవ్వాలని మేం కేంద్రాన్ని డిమాండ్ చేశాం. ఈ మొత్తం రూ. 2 వేల కోట్లకు సమానం’ అని చెప్పారాయన. అమరీందర్ సింగ్ చెప్పింది యథార్థం. కానీ అంత డబ్బు తమ వద్ద లేదని కేంద్రం తేల్చి చెప్పేసింది. అయితే జాతీయ రహదారుల నిర్మాణం కోసం ప్రతిపాదించిన 6.9 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో ఒక చిన్న మొత్తాన్ని ఈ దుబ్బు తొలగింపు సమస్య పరిష్కారం కోసం ఎందుకు వెచ్చించలేరో అర్థం కాదు. కానీ వ్యవసాయం విషయానికి వచ్చేసరికి మాత్రం ప్రభుత్వం ప్రతిసారీ మొండిచేయి చూపిస్తుంటుంది. పంట అవశేషాలను తగులబెట్టడాన్ని నిరోధించే చర్యలు తీసుకుంటున్నందుకు తమపై పడుతున్న అదనపు ఖర్చులకోసం గాను ఎకరాకు రూ.6 వేలను పరిహారంగా అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పైగా పంజాబ్లో పనికి ఆహార పథకంలో 12.5 లక్షల మంది కార్డుదారులు ఉన్నారు. ఈ పథకం కింద అందుబాటులో ఉన్న రూ. 4 వేల కోట్లను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించలేకపోతోంది. పంట కోతల అనంతరం పొలంలో మిగిలే దుబ్బు నిర్వహణను పనికి ఆహార పథకంలో భాగం చేసినట్లయితే ఖాళీగా ఉన్న రైతుకూలీలకు పని కల్పించడమే కాకుండా, దుబ్బును తగులబెట్టడం ద్వారా కలుగుతున్న పర్యావరణ విధ్వంసాన్ని పరిష్కరించవచ్చు కూడా. వ్యాసకర్త: దేవిందర్శర్మ, వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
సేంద్రియ సాగే విషాలకు విరుగుడు
సుస్థిర లేదా సేంద్రియ వ్యవసాయంపైకి దృష్టిని మరల్చాల్సిన సమయం ఆసన్నమైంది. ఇలా ఉత్పత్తయ్యే ఆహారంలో 80% స్థానికంగానే వినియోగించుకుంటారు. కాబట్టి వ్యవ సాయం మనగలిగినదిగా, ఆర్థికంగా లాభదాయకమైనదిగా మారుతుంది. పైగా ఇది పంట భూములు, భూగర్భ జలాలు, నదులను విష రసాయన రహితమైనవిగా మార్చ డానికి, ఆరోగ్యకరమైన జీవనానికి దోహదపడుతుంది. సుస్థిర వ్యవసాయాన్ని లేదా వ్యవ సాయ–జీవావరణాన్ని ప్రధాన స్రవంతి ఆర్థిక వృద్ధికి కొలబద్దగా స్వీకరించేట్టు చేయాలి. ‘‘ప్రకృతికి కలుగజేసే హాని ఏదైనాగానీ చివరకు మనల్ని వెంటాడి వేధిం చక మానదు.. మనం ఎదుర్కొనక తప్పని వాస్తవమిది.’’ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అన్న ఈ మాటలకు ఆధారాలు ప్రతిచోటా కనిపిస్తాయి. భూసారం క్షీణించిపోతోంది. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. క్రిమి సంహారి ణులు సహా రసాయనిక ఉత్పత్తులు విపరీతంగా వ్యాపించిపోతూ పర్యావర ణాన్ని, మొత్తం ఆహార వలయాన్ని విషపూరితం చేస్తున్నాయి. పంటచేలకు చీడపీడలు పెరిగిపోతున్నాయి. అడవులను నరికేసి పారిశ్రామిక పద్ధతుల్లో చేసే వ్యవసాయాన్ని విస్తరింపజేస్తుండటంతో భూమి పెద్ద ఎత్తున సారాన్ని కోల్పోతోంది. పంట ఉత్పాదకత పెరగకపోవడంతో మరిన్ని రసాయనాలను గుమ్మరిస్తున్నారు. దీంతో పంట పొలాలు మరింతగా విషపూరితం అయి పోతున్నాయి. తేనెటీగలు అంతరించిపోతుండటం జీవావరణానికి సంబం ధించి ప్రమాద ఘంటికలను మోగించింది. అడవులతోసహా మొత్తంగా ఎగిరే కీటకాలు 75% మేరకు నశించిపోయాయని తాజాగా వెల్లడైంది. సమస్యే పరిష్కారమా? హరిత విప్లవ సానుకూల ఫలితాలు అంతరించిపోగా దాని దుష్ఫలితాల పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. భారత రైతు ల్లాగే యూరోపియన్ రైతులు సైతం ఆత్మహత్యల అంచున నిలిచే పరిస్థితులు దాపురిస్తునాయి. ఇప్పటికే ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, బ్రిటన్లలో రైతు ఆత్మహత్యలు వేగంగా పెరు గుతున్నాయి. ఇవన్నీ వ్యవసాయ పద్ధతులకు సంబం ధించి ఏదో ఘోరమైన తప్పిదం చేస్తున్నామని స్పష్టం చేస్తున్నాయి. దురదృష్టవశాత్తూ ఈ పరిస్థితు లకు దారితీసిన తప్పుడు వ్యవసాయ పద్ధతులను మరింత ఎక్కువగా ఉప యోగించడాన్నే పరిష్కారంగా చూపుతున్నారు. ప్రతి అంతర్జాతీయ సమావే శమూ పేదరికం, ఆకలి నిర్మూలన గురించి తీర్మానాలు చేస్తుంది, సుస్థిర వ్యవసాయాన్ని ప్రబోధిస్తుంది. 27 దేశాల్లో ఆహారం కోసం అల్లర్లు చెలరేగిన 2008 నాటి ప్రపంచ ఆహార సంక్షోభాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి తలెత్త నిచ్చేది లేదని శపథాలు చేస్తారు. ప్రతి సంక్షోభమూ ఒక అవకాశమని, ముందుకు సాగాల్సిన సమయమని చెబుతారు. ఈ దుస్థితి నుంచి గట్టెక్కించ డానికంటూ బోలెడన్ని పరిష్కారాలను, పథకాలనూ పరుస్తారు. అనివా ర్యంగా అవన్నీ ఈ దుస్థితికి కారణమైన వ్యవసాయ పద్ధతులను భారీ ఎత్తున పారిశ్రామికంగా చేపట్టమని చెప్పేవి, ఈ సంక్షోభాన్ని మరింత విషమించే సేవి కావడం విశేషం. 2009 ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల్లో 17 ప్రైవేటు కంపెనీలు ‘‘నూతన వ్యవసాయ దృక్పథాన్ని’’ ఆవిష్కరించాయి. ప్రతి దశా బ్దానికి ఆహార ఉత్పత్తిని 20% పెంచుతామని, హరితవాయువుల విడుదలను 20% మేరకు తగ్గిస్తామని, పేదరికాన్ని 20% తగ్గిస్తామని ప్రకటించాయి. వాస్త వంలో 2008 ఆహార సంక్షోభం ఆ కంపెనీల పాలిటి ప్రపంచస్థాయి లాభ సాటి వ్యాపార అవకాశంగా మారింది. కాబట్టి, ప్రపంచం దేన్ని మారుస్తా నందో దాన్నే తిరిగి చేస్తూ మరింత పెద్ద సంక్షోభం దిశగా పయనిస్తోంది. అయితే ఆశావహ పరిణామమూ ఉంది. ఈ వ్యవసాయ పద్ధతులకు ప్రత్యామ్నాయంగా నిలిచే వ్యవసాయ–జీవావరణానికి సంబంధించి గత కొన్నేళ్ల కాలంలో ఏకాభిప్రాయం ఏర్పడింది. ఉదాహరణకు, యాక్షన్ ఎయిడ్ సంస్థ నివేదిక.. 2050 నాటికి పారిశ్రామిక ఆహార ఉత్పత్తులను పెంచాలని పరుగులు తీయాల్సిన పని లేదు, అందుకు బదులుగా చిన్నతరహా రైతుల, ప్రత్యేకించి వర్ధమాన దేశాలలోని మహిళా రైతుల సుస్థిర వ్యవసాయ పద్ధ తులపైకి దృష్టి కేంద్రీకరణను మరల్చాలని స్పష్టం చేసింది. ఇలా ఉత్పత్తయ్యే ఆహారంలో 80% స్థానికంగానే వినియోగించుకుంటారు. కాబట్టి వ్యవ సాయం మనగలిగినదిగా, ఆర్థికంగా లాభదాయకమైనదిగా మారుతుంది. ఇదే క్రమంలో ఈ సాగుపద్ధతులు, పంట భూములను విష రసాయన రహి తమైనవిగా మార్చడానికి దోహదపడి, ఆరోగ్యకరమైన జీవన పరిస్థితులను కల్పిస్తాయి. అందుకు తగినన్ని ఆధారాలున్నాయి. కాకపోతే, సుస్థిర వ్యవసా యంగా ఇప్పటికే ప్రాచుర్యంలోకి వచ్చిన రసాయనాలు వాడని లేదా సేంద్రియ వ్యవసాయాన్ని లేదా వ్యవసాయ–జీవావరణాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రధాన స్రవంతి విధానకర్తలు ఆర్థిక వృద్ధికి కొలబద్దగా స్వీక రించేట్టు చేయాలి. ఈ ఆరు పాయింట్ల పథకాన్ని సూచిస్తున్నాను. రసాయనిక పురుగు మందులకు స్వస్తి పలకాలి హరిత విప్లవంలోని తీవ్రమైన తప్పిదాలను గుర్తించడానికి అంతర్జా తీయ వరి పరిశోధనా సంస్థ(ఐఆర్ఆర్ఐ)కు మూడు దశాబ్దాలు పట్టింది. వరికి క్రిమిసంహారిణులను వాడటం అనవసరమని, కాలము, డబ్బు వృథా చేయడమేనని ఐఆర్ఆర్ఐ 2003లో గుర్తించి, ప్రపంచానికి చాటింది. కానీ భారత్సహా ఎక్కడా ఏ జాతీయ వ్యవసాయ సంస్థా దీన్ని పట్టించుకున్నది లేదు, రైతులకు తెలిపింది లేదు. ఫలితంగా, మన దేశంలో నేటికీ వరికి 42 రకాల రసాయనిక క్రిమిసంహారిణులను వాడుతున్నారు. తాజాగా ప్రపంచ మానవహక్కుల సంస్థ.. క్రిమిసంహారిణుల వాడకం పర్యావరణంపైన, ప్రజల ఆరోగ్యంపైన, మొత్తంగా సమాజంపైన అత్యంత విపత్కర ప్రభావా లను కలుగజేస్తుందని హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్లో సీఎంఎస్ఏ కార్య క్రమం కింద క్రిమిసంహారకాలు లేని పంటల నిర్వహణ పద్ధతిలో 36 లక్షల ఎకరాలు సాగవుతున్నాయి. ఇలాంటి స్థానిక అనుభవాలను అంతర్జాతీయ స్థాయి విధానాలలో ఇముడ్చుకుని వ్యవసాయ అవసరాల జాబితాలో క్రిమి సంహారిణులకు తావు లేకుండా చేయాలి. సేంద్రియ వంగడాలను ఉత్పత్తి చేయాలి హరిత విప్లవ కాలంలో తొలుత నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్(ఎన్పీకే) ఎరు వులను అధిక మోతాదుల్లో వాడుతుండటంవల్ల సూర్యకాంతి ప్రభావం చూపని వరి, గోధుమ పొట్టి వంగడాలను తయారు చేశారు. ఫలితంగా ఆ పంటలు అధికంగా క్రిమి కీటకాలను ఆకర్షించేవి. దీంతో రసాయనిక క్రిమి సంహారిణులను చల్లాల్సి వచ్చేది. ఇలా దిగుబడులు పెరగడంతోపాటూ, అదే మోతాదులో పంటలోని పోషకాల విలువలు పెద్ద ఎత్తున క్షీణించిపోతాయి. ఉత్పాదకత పెరగడం అంటే పోషక విలువలు పడిపోవడంగా మారింది. అయితే, రసాయనిక ఎరువుల వాడకం వల్ల పంట ఉత్పాదకతలో పెరుగు దల వేగంగా క్షీణించిపోతూ వస్తోంది. కాబట్టి సేంద్రియ ఎరువులకు స్పందించే మెరుగైన వంగడాలను అభివృద్ధి పరచాల్సిన అవసరం ఏర్పడింది. అలాంటి వంగడాల అభివృద్ధి కార్యక్రమంలో పోషక విలువల భద్రతపై దృష్టిని కేంద్రీకరించడం కూడా కీలకమైనదిగా ముందుకు వస్తుంది. ఈ వంగ డాల సాగు సమగ్ర వ్యవసాయ–జీవావరణ సాగుపద్ధతులను అమల్లోకి తెస్తుంది. చీడపీడల నియంత్రణకు, భూసార పరిరక్షణకు జీవసంబంధమైన పరిష్కారాలకు, నీటిని తక్కువగా వినియోగించే పంటలకు మారగలిగితే వ్యవసాయ–జీవావరణానికి పరివర్తన చెందించడం సాధ్యం అవుతుంది. సాంప్రదాయక జ్ఞానాన్ని వెలికి తీయాలి నేర్చుకోవడం, విద్య, జ్ఞానం సుస్థిర వ్యవసాయానికి పరివర్తనలో కీలకమై నవి. ఈ జ్ఞానంలో అత్యధికభాగం విద్యాలయాలకు వెలుపల ఉత్పన్నమ య్యేదే. వ్యవసాయ పరిశోధన లేబరేటరీలకు తరలడంతో స్థానిక రైతుల నైపుణ్యాలు, జ్ఞానం క్షీణించిపోయాయి. ఐసీఏఆర్ సాంప్రదాయక వ్యవసా యక జ్ఞానాన్ని పోగుచేసి నాలుగు సంకలనాలుగా రూపొందించిందిగానీ, అవి బూజు పట్టిపోతున్నాయి. కాబట్టి పరిశోధనాశాలల నుంచి పంట పొలా ల్లోకి ఈ క్రమం వెనక్కు మరలాలి. సాంప్రదాయక జ్ఞాన సంపదను తిరిగి కనుగొని, దాన్ని ప్రజలందరిదిగా చేసి, అందుబాటులో ఉంచడం తప్పనిసరి. తిరిగి కనుగొన్న సాంప్రదాయక జ్ఞానాన్ని క్రమపద్ధతిలో ఉంచడం ద్వారా విభిన్న జ్ఞాన వ్యవస్థల మధ్య అనుసంధానాలు ఏర్పడి, వ్యవసాయ– జీవా వరణ ఆవిష్కరణలు అంతటికీ వ్యాప్తి చెందుతాయి. ప్రజా సేకరణ వ్యవస్థ పునర్నిర్మాణం డబ్ల్యూటీఓ కోరుతున్నదానికి విరుద్ధంగా మన ఆహార ధాన్యాల ప్రభుత్వ సేకరణ వ్యవస్థను పరిరక్షించుకోవాలి. దేశ ఆహారభద్రతకు అది అత్యంత కీలకమైనది. ఆహార స్వయం సమృద్ధి సాధన కోసం ఎన్నో ఏళ్లుగా జాగ్రత్తగా నిర్మించుకుంటూ వచ్చిన వ్యవస్థ ఇది. సేంద్రియ ఉత్పత్తులకు కూడా దీన్ని అదే విధంగా వర్తింపచేయాలి. దేశంలోని వ్యవసాయ– జీవావరణ వ్యవస్థ లలో వేటికవి ఆ ప్రాంత ఆహార అవసరాలను తీర్చడం అనే ప్రాతిపాదికపై సేకరణ విధానాలను తిరిగి రూపొందించాలి. ఉదాహరణకు, గోధుమ ధాన్యాగారమైన పంజాబ్, సేంద్రియ గోధుమ పిండిని అతి ఎక్కువగా దిగు మతి చేసుకునే రాష్ట్రంగా ఉంది. పంజాబ్లోనే సేంద్రియ గోధుమకు ఎక్కువ ధరకు హామీని కల్పిస్తే దిగుమతులపై ఆధారపడనవసరం లేదు. సేంద్రియ రైతు లను ప్రోత్సహించడానికి యూరప్ దేశాలు తమ బడ్జెట్ల నుంచి వ్యవ సాయానికి ప్రత్యక్షంగా ఇచ్చే నిధులలో 30 శాతాన్ని ప్రత్యక్ష హరిత చెల్లింపు లకు కేటాయిస్తున్నాయి. అదే పద్ధతిని అనుసరించి మన దేశంలో కూడా సేంద్రియ రైతులకు ఎక్కువ ఆదాయానికి హామీని కల్పించాలి. జీవావరణ సేవలను లెక్కించాలి సేంద్రియ వ్యవసాయం నేలలకే కాదు, జీవావరణ వ్యవస్థకు కూడా మేలు చేస్తుంది. కాబట్టి జీవావరణపరంగా అది అందిస్తున్న సేవలను పరి గణన లోకి తీసుకుని, వాటిని డబ్బు రూపంలో లెక్కగట్టి రైతులకు డబ్బు రూపంలో లేదా పరిహార పథకాలుగా అందించాలి. చైనా ‘పచ్చదనానికి ధాన్యం’, ‘నీటికి ధాన్యం’ పేరిట ఇలాంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. అమెరికా లోని కొన్ని రాష్ట్రాలు ఇలాంటి చెల్లింపుల ద్వారా సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాయి. సుస్థిర వ్యవసాయం మాత్రమే జీవనోపాధులను సృష్టించగలదు, నిల కడగా కొనసాగించగలదు. వ్యవసాయ–జీవావరణ సాగుకు తిరిగి మర లడం ద్వారా మాత్రమే పంట భూములకు, భూగర్భజలాలకు, నదులకు పట్టిన విషాన్ని వదల్చగలుగుతాం. ఇది మాత్రమే మనకు ఆరోగ్యకరమైన, పోషక విలువలుగల ఆహారాన్ని అందించి, ప్రపంచాన్ని వ్యాధులు, అంటు రోగాల బారి నుంచి కాపాడగలుగుతుంది. వ్యవసాయం మాత్రమే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తిరిగి ఊపును ఇవ్వగలుగుతుంది. జీ–20 దేశాల నాయ కత్వం ఇప్పటికైనా కళ్లు తెరచి, చిమ్మచీకట్లలోని ఈ ఆశా కిరణాన్ని చూసేనా? (ఢిల్లీలో ఈ నెల 9–11 తేదీలలో జరిగిన ఆర్గానిక్ వరల్డ్ కాంగ్రెస్లో చేసిన ప్రసంగ సంక్షిప్త పాఠం) - దేవిందర్శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు, hunger55@gmail.com -
వృద్ధి కొలబద్దలు మారాల్సిందే!
విశ్లేషణ బహుశా మన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి తెలిసి ఉండకపోవచ్చుగానీ, ప్రపంచంలో ఇప్పుడు మార్కెట్ ఆర్థిక వ్యవస్థ మంత్ర జపాన్ని విడనాడే ధోరణి పెరుగుతోంది. మన విధానకర్తల ఆర్థిక వృద్ధి కొలబద్ధలు మారక తప్పదు. ఎంత మంది ప్రజలను పేదరికం నుంచి బయట పడేస్తున్నాం, ఎంత మంది ఆకలిగొన్న ప్రజల కడుపులు నింపుతున్నాం, రైతు ఆత్మహత్యల సంఖ్య క్షీణత ఎంత, ఎన్ని ఎక్కువ ఉద్యోగాలను సృష్టించాం, తదితర కొలబద్ధలతో మన ఆర్థిక మంత్రి సైతం ఆర్థిక వృద్ధిని కొలిచే రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. ముందుగా ఒక సంగతి చూద్దాం. ఖరీఫ్ పంట మార్కెట్లకు వచ్చినప్పటి నుంచి ధరలు దారుణంగా పడిపోయాయి. దేశవ్యాప్తంగా రైతులు ఉత్పత్తి వ్యయాలనైనా రాబట్టుకోలేక పోతున్నారు. దేశంలోని ఏదో ఒక ప్రాంతంలో రైతు ఆందోళనలు సాగుతున్న వార్తలు రాకుండా వారం గడవడం కష్టమౌతోంది. రైతు ఆత్మహత్యలు అంతమయ్యే జాడే లేదు. వ్యవసాయరంగ దైన్యస్థితి మరింత అధ్వానం కావడం కొనసాగుతూనే ఉంది. సెప్టెంబర్–అక్టోబర్ మధ్య వ్యవసాయ ధరలు తక్కువగానే ఉన్నాయి. సెప్టెంబర్ 27న దేశవ్యాప్తంగా వివిధ మార్కెట్లలో ఉన్న వ్యవసాయ ఉత్పత్తుల ధరలను ముందుగా పోల్చి చూద్దాం. ఈ ఉదాహరణ, ధరల వల్ల రైతులకు ఎలాంటి దెబ్బ తగులుతోందనే విషయాన్ని స్థూలంగా తెలుపుతుంది. మధ్యప్రదేశ్లోని హర్దా, మందసౌర్ మార్కెట్లలో సోయాబీన్ మోడల్ (నమూనా) ధరలు క్వింటాలు రూ. 2,600 నుంచి రూ. 2,880 వరకు ఉండేంతగా పతనమయ్యాయి. కాగా, కనీస మద్దతు ధర (బోనస్తో కలసి) క్వింటాలుకు రూ.3,050. అంటే రైతులు ప్రతి క్వింటాలు అమ్మకంలో రూ. 400 నుంచి రూ. 500 వరకు నష్టపోయారు. ఇక మినుములకు వస్తే కనీస మద్దతు ధర (బోనస్తో కలసి) క్వింటాలుకు రూ. 5,400 కాగా, మధ్యప్రదేశ్లోని మందసౌర్ మార్కెట్ ధర రూ. 3,725గా ఉంది. అది, రాజ స్తాన్లోని కోట మార్కెట్లో రూ. 3,850గా, కర్ణాటకలోని బీదర్ మార్కెట్లో రూ. 4,180గా, మహారాష్ట్రలోని అకోలా మార్కెట్లో రూ. 4,410గా ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న మినప రైతులకు సగటున క్వింటాలుకు రూ.1,000 నుంచి రూ.1,800 వరకు నష్టం వాటిల్లింది. ఈ ధోరణి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏటికేడాది ఎక్కువ పంట తీయడం కోసం రైతులు చెమటోడుస్తూనే ఉన్నారు. పంటలు పండించడానికి తాము చేస్తున్నది నష్టాల సాగు మాత్రమేనని వారు గుర్తించడం లేదు. వృద్ధి పథంలో ఆకలి కేకల దేశం కొన్ని రోజుల క్రితమే అంతర్జాతీయ ఆహార విధాన పరి శోధనా సంస్థ (ఐఎఫ్పీఆర్ఐ) వార్షిక గ్లోబర్ హంగర్ (జీహెచ్ఐ) ఇండెక్స్ను విడుదల చేసింది. జీహెచ్ఐ (ప్రపంచ ఆకలి సూచిక)లో మన దేశం మూడు మెట్లు కిందకు దిగజారింది. 119 దేశాలకు ఇచ్చిన ర్యాంకింగ్లలో పరిస్థితి ‘విషమం’గా ఉన్న వర్గంలో 100వ స్థానంలో ఉత్తర కొరియా, బంగ్లాదేశ్లు ఉన్నాయి. వాటి కంటే మనం ఆకలిని నిర్మూలించడంలో తీసికట్టుగా ఉన్నామని తేలింది. ఈ జీహెచ్ఐని విడుదలచేసే సమయానికే జాతీయ పోషకాహార పర్యవేక్షణా సంస్థ (ఎన్ఎన్ఎమ్బీ), దేశం తెలుసుకోవాలని కోరుకోని కఠోర వాస్తవికతను సైతం మన ముందుంచింది. గ్రామీణ భారతం నేడు, 40 ఏళ్ల క్రితం కంటే తక్కువగా తింటూ, అర్ధాకలితోనే మిగిలిపోయింది. ఆ నివేదిక ప్రకారం, ‘‘సగటున, 1975–79తో పోలిస్తే, గ్రామీణ భారతీయుడు నేడు 550 కేలరీలను తక్కువగా తీసుకుంటున్నాడు. మాంసకృత్తులు 13 మిల్లీ గ్రాములు, 5 మిల్లీ గ్రాములు ఇనుమును, కాల్షియం 260 మిల్లీ గ్రాములు, విటమిన్–అను 500 మిల్లీ గ్రాములు తక్కువగా తీసుకుంటున్నాడు.’’ 70 శాతం జనాభా నివసించే గ్రామీణ భారత్ తక్కువగా తినడం ఆందోళనకరం. సాగుకు తావులేని ఆర్థిక చింతన మూడేళ్ల లోపు పిల్లలకు రోజుకు 300 మిల్లీ లీటర్ల పాలు అవసరం. కానీ ఆ వయసు పిల్లలు తాగుతున్నది రోజుకు 80 మిల్లీ లీటర్ల పాలనే. గ్రామీణ స్త్రీ, పురుషులలో 35 శాతం పోషకాహార లోపంతో బాధపడుతుండటానికి, 42 శాతం పిల్లలు బరువు తక్కువగా ఉండటానికి కారణం ఏమిటో ఈ గణాంక సమాచారం వివరి స్తుంది. సగటున రోజుకు 2,400 కేలరీల శక్తి ప్రతి ఒక్కరికీ మౌలికంగా అవసరం. కానీ, గ్రామీణ జనాభాలో 80 శాతం, పట్టణ జనాభాలో 70 శాతం అంత ఆహారాన్ని తినే స్తోమత లేనివారని ఒక జాతీయ వ్యయ సర్వే చెబుతోంది. ఇటీవల ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఆర్థిక వృద్ధికి ప్రేరణను ఇవ్వడం కోసం ఆర్థిక ఉద్దీపనా పథకాన్ని ప్రారంభిస్తూ ఢిల్లీలో ఓ పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ఆ సందర్భంగా జైట్లీ ఏం మాట్లాడారో మీరు విని వుంటే, ఆ గంటన్నర సమావేశంలో ఆయన నోట ‘వ్యవసాయం’ అనే మాటైనా రాకపోవడాన్ని మీరు గమనించే ఉంటారు. 83,677 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి రూ. 6.92 లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపనా పథకాన్ని, బ్యాంకులకు రూ. 2.11 లక్షల కోట్ల భారీ బెయిలవుట్ను (ఆదుకునే నిధి) ప్రకటించారు. బ్యాంకుల వద్ద పెండిం గ్లో ఉన్న కార్పొరేట్ మొండి బకాయిలను రద్దు చేయడమే దీని ప్రాథమిక లక్ష్యం. మరోవిధంగా చెప్పాలంటే, జనాభాలో దాదాపు 60 శాతానికి ఉపాధిని కల్పిస్తున్న వ్యవసాయరంగం అతి తీవ్ర సంక్షోభంలో ఉన్నా, అది ప్రభుత్వ ఆర్థిక చింతనలో ఎక్కడా కనిపించలేదు. చింతలేని విధానకర్తలు వృద్ధి పథంలో ఉన్నానని చెప్పుకుంటున్న దేశంలో ప్రమాదకర స్థాయిలలో అలముకొని ఉన్న ఆకలి... ఆర్థిక మంత్రిత్వశాఖలోని అధికారులకు ఎలాంటి బెంగనూ కలిగించడం లేదు. గ్రామీణ ప్రాంతంలోని రైతులు రోజు విడిచి రోజు చనిపోతున్నా ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తల అంతరాత్మలకు చీమ కుట్టినట్టు అనిపించడం లేదు. వారి దృష్టిలో ఆర్థిక వృద్ధి అంటే మరిన్ని మౌలిక వసతులను నిర్మించడం మాత్రమే. పేదరికం, ఆకలి నిర్మూలనకు ఎక్కువ సమర్థవంతమైన పని వ్యవసాయరంగంపై ఎక్కువ పెట్టుబడిని పెట్టడమేనని హార్వర్డ్ విశ్వవిద్యాలయం అధ్యయనం చేసి తేల్చింది. దాన్ని వారు చదివి ఉండరు. ప్రధాన రహదార్ల నిర్మాణం కోసం ఇస్తున్న రూ. 6.92 లక్షల కోట్ల ఉద్దీపనా పథకాన్ని వ్యవసాయ రంగానికి ఇచ్చి ఉంటే ఏమౌతుందో ఊహించండి. అది ఆర్థిక వ్యవస్థ పుంజుకునేలా చేసే ఊపును ఇవ్వడమే కాదు, రాకెట్ వేగంతో ఎగిసేలా చేయడానికి ఉపయోగపడేది. అది కోట్లాది మంది జీవనోపాధిని బలోపేతం చేసేది, ఆకలి కోరల నుంచి బయటపడేసి ఉండేది. బహుశా ఆత్మహత్యల ఉధృతిని తగ్గించగలిగేది. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రభుత్వ బ్యాంకులకు రూ. 2.11 లక్షల కోట్ల భారీ రీకాపిటలైజేషన్ నిధిని ప్రకటించారు. అది, మరింత డబ్బును సమకూర్చడం ద్వారా కంపెనీల భారీ మొండి బకాయిలను రద్దు చేయడానికే. అందుకు బదులుగా బ్యాంకులకు ఆ భారీ బెయిలవుట్ను దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ రుణాల మాఫీ లక్ష్యంతో ఇచ్చినట్టయితే... క్షీణించిపోతున్న ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలు ఎక్కించగలిగి ఉండేవారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్లోని వ్యవసాయ రుణాల బకాయిలను మాఫీ చేయడం వల్లనే దాదాపు 1.8 కోట్ల రైతు కుటుంబాలకు మేలు చేయగలిగేవారు. ఈ 1.8 కోట్ల కుటుంబాలు వస్తువులకు డిమాండ్ను సృష్టించి, ఆర్థిక వ్యవస్థ చక్రాలను పరుగులు తీయించగలిగేవి. మార్కెట్ మంత్రానికి కాలం చెల్లింది వాస్తవానికి మౌలిక సమస్య, గత కొన్ని దశాబ్దాలుగా సృష్టించిన లోపభూయిష్టమైన ఆర్థిక చింతనే. ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యన్ కార్పొరేట్ రుణ మాఫీయే ఆర్థిక వృద్ధి అని పలుమార్లు నిస్సిగ్గుగా ప్రకటించారు. విధానకర్తలు ఆర్థికవృద్ధిని అర్థం చేసుకునేది ఈ దృష్టితోనే. అయితే, అదే వ్యవసాయ రుణాలను మాఫీ చేయడానికి వచ్చేసరికి మన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్... అది ప్రమాదకరమని, జాతీయ బడ్జెట్ సమతూకాన్ని దెబ్బతీస్తుందని అన్నారు. రైతులకు ఇచ్చే రుణ మాఫీ ఫిస్కల్ (కోశ) లోటుకు దారితీస్తుంది. బ్యాంకులకు ఇచ్చే రూ. 2.11 లక్షల కోట్లు మాత్రం ఫిస్కల్ లోటు లెక్కల్లోకి రావు! బహుశా ఆర్థిక మంత్రికి తెలిసి ఉండకపోవచ్చుగానీ, ప్రపంచం ఇప్పుడు మార్కెట్ ఆర్థిక వ్యవస్థ మంత్ర జపాన్ని రోజురోజుకూ మరింత ఎక్కువగా విడనాడుతోంది. 37 ఏళ్ల జసిందా ఆర్డెర్న్ నూతనంగా ఎన్నికైన న్యూజిలాండ్ ప్రధాన మంత్రి. ఆమె తన తొలి ఇంట ర్వ్యూలో ‘‘మార్కెట్ ఆర్థిక వ్యవస్థ మన ప్రజలను విఫలం చేసింది... తగినంత తిండిలేని పిల్లలు మన ఇళ్లలో ఉన్నారంటే అది సుస్పష్టమైన వైఫల్యమే’’ అన్నారు. ఆర్థిక వృద్ధి కొలబద్దలు మారాల్సి ఉంది. తమ ప్రభుత్వం కనీస వేతనాలను పెంచుతుందని, బాల పేదరికం తగ్గుదల లక్ష్యాలను చట్టంగా చేస్తుందని, అందుబాటులో ఉండే గృహాలను వేలాదిగా నిర్మిస్తుందని ఆర్డెర్న్ వాగ్దానం చేశారు. ఎంత మంది ఎక్కువగా ప్రజలను పేదరికం నుంచి బయట పడేస్తున్నాం, ఎంతమంది ఆకలిగొన్న ప్రజల కడుపులు నింపుతున్నాం, రైతు ఆత్మహత్యల సంఖ్య క్షీణత ఎంత, ఎన్ని ఎక్కువ ఉద్యోగాలను సృష్టించామనే కొలబద్దలతో మన ఆర్థిక మంత్రి సైతం ఆర్థిక వృద్ధిని కొలిచే రోజు కోసం ఎదురు చూస్తున్నాను. - దేవిందర్శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com -
రైతు దుఃఖం చేనుకు చేవ కాదు
విశ్లేషణ పౌష్టికాహార లోపం, పేదరికం, ఆకలి బాధల నుంచి విముక్తం చేయడంలో ప్రజానీకానికి రక్షణ కవచంగా నిలబడటంలో వ్యవసాయానిదే అగ్రస్థానం. రైతుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తూ, వ్యవసాయ దిగుబడుల మీద దృష్టి పెట్టడం ఆ రంగానికి ఒక శాపం వంటిది. ప్రధాని మోదీ కల నిజం కావాలంటే, ఆ లక్ష్యాలను చేరుకోవాలంటే పాత తప్పిదాల నుంచి గుణపాఠం నేర్చుకుని కొత్త విధానానికి మళ్లడం అవసరం. దీనికి ఇదే సరైన సమయం. అందువల్ల కచ్చితంగా ఫలితాలను సాధించవచ్చు. వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే అంతర్జాతీయ ఆహార విధానం, పరిశోధనా సంస్థ ప్రపంచంలోని ఆకలిరాజ్యాల జాబితాను నిరుడు అక్టోబర్ నెలలో విడుదల చేసింది. జనాభా ప్రాతిపదికన ఏ దేశాలు ఆకలితో, పోషకాహార లోపంతో బాధపడుతున్నాయో ఆ జాబితా క్రమపద్ధతిలో చెప్పింది. ఆకలి, పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్న 118 అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితా అది. అందులో భారతదేశం 97వ స్థానంలో ఉంది. పాకిస్తాన్ను మినహాయిస్తే మిగిలిన తన ఇరుగు పొరుగు దేశాలు అన్నింటితోను పోల్చి చూస్తే భారత్ అధ్వానమైన స్థానంలోనే ఉన్నట్టు తెలుస్తుంది. యథా ప్రకారం ఈ జాబితా గురించి కూడా పత్రికలలోని సంపాదకీయ శీర్షికల్లో ఒకసారి ప్రస్తావన కనపడింది. ఆపై అంతా మరచిపోయారు. ప్రపంచంలో ఆకలితో అలమటిస్తున్న దేశాల సూచీని మొదటిసారి 2006లో తయారుచేసిన సంగతి చాలామందికి తెలియదు కూడా. ఆ జాబితాలో 119 దేశాలు ఉండగా, భారత్ 96వ స్థానంలో ఉంది. అంటే 11 సంవత్సరాల తరువాత కూడా ఆకలి, పౌష్టికాహార లోపాలకు సంబంధించిన పరిస్థితిలో ఏ మాత్రం మార్పు చోటు చేసుకోలేదన్నమాట. నిజం చెప్పాలంటే ఆకలి బాధను తీర్చడానికి భారత్ తీసుకున్న చర్యలు గమనిస్తే నానాటికి దిగజారినట్టు తెలుస్తుంది. పౌష్టికాహార పర్యవేక్షణ ఏది? జాతీయ పౌష్టికాహార పర్యవేక్షక సంస్థ నిర్వహించిన సర్వే నివేదిక మరింత నివ్వెరపోయేటట్టు చేసేదే. ఈ సర్వే భయంకరమైన ఒక వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చింది. అయితే దీన్ని కూడా దేశం పట్టించుకోలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఆహార వినియోగం నాలుగు దశాబ్దాల క్రితం వినియోగం కంటే బాగా తగ్గిపోయింది. ‘స్క్రాల్’ అనే వెబ్ న్యూస్ పోర్టల్ ఇచ్చిన నివేదిక ఈ విషయం వెల్లడిస్తున్నది. 1975–79 మధ్యకాలంతో పోల్చి చూస్తే, ప్రస్తుతం గ్రామీణ భారత ప్రజలు 550 కేలరీలు తక్కువగా తీసుకుంటున్నారు. ప్రొటీన్లు 13 గ్రాములు, ఐరన్ 5 మిల్లీగ్రాములు, క్యాల్షియం 250 మిల్లీగ్రాములు, ‘ఏ’ విటమిన్ను 500 మిల్లీగ్రాముల కంటే తక్కువగాను గ్రామీణులు వినియోగిస్తున్నారు. పిల్లలు రోజుకు 300 మిల్లీలీటర్ల పాలు తీసుకోవాలి. కానీ సగటున కేవలం 80 మిల్లీలీటర్లే వారు తీసుకోగలుగుతున్నారు. పూర్తి వివరాలు ఇవ్వకపోయినా, ఈ నివేదిక గ్రామీణ ప్రాంతాలకు చెందిన స్త్రీ పురుషులలో 35 శాతం ఎందుకు పౌష్టికాహార లోపంతో ఉన్నారో, ఎందుకు 42 శాతం చిన్నారులు ఉండవలసిన బరువు కంటే తక్కువ బరువుతో ఉన్నారో కూడా వివరించింది. నిజానికి సబ్ సహారా ఆఫ్రికాతో పోల్చి చూస్తే, దక్షిణాసియా జనాభా ఎదుర్కొంటున్న ఆహార లోపం రెండు రెట్లు ఎక్కువే. అసలు భారతదేశ జనాభాలో 70 శాతం గ్రామీణ ప్రాంతాలలోనే నివసిస్తున్నారు. అంటే 85 కోట్ల మంది అక్కడే జీవనం సాగిస్తున్నారు. కాబట్టి అర్ధరాత్రి కూడా పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేసి చర్చించడానికి ఇంతకు మించిన అంశం ఉండదని నా అభిప్రాయం. ఆకలి రహిత దేశం– ఒక వాస్తవం వచ్చే ఐదేళ్లలో సాధించడానికి ప్రధాని నరేంద్ర మోదీ నిర్దేశించుకున్న ఆరు లక్ష్యాలలో ఆకలి నిర్మూలన, పౌష్టికాహార లోప నివారణ కూడా ఉన్నాయి. 2022 కల్లా ఈ లక్ష్యాలను సాధించాలని ఆయన ప్రకటించారు. ఇది చాలా స్ఫూర్తిదాయకమైన పరిణామమే. అయితే ఒక విషయం ఇక్కడ స్పష్టం చేయాలి. పెరుగుతున్న ఆహార లోపం సమస్యను గత ప్రధానుల వలే పరిష్కరించకుండా విడిచిపెట్టడం ఇక సరికాదు. గతంలో చూస్తే ఇందిరాగాంధీ గరీబీ హటావో నినాదం ఇచ్చారు. ఒడిశాలో ఆకలికేకలకు ప్రసిద్ధమైన కలహండి ప్రాంతాన్ని ధాన్యాగారంగా మారుస్తానని అటల్ బిహారీ వాజ్పేయి హామీ ఇచ్చారు. పౌష్టికాహార లోపమంటే జాతి సిగ్గు పడవలసిన అంశమనే దాకా మన్మోహన్ సింగ్ వెళ్లారు. కానీ దేశంలో ఆకలి, పౌష్టికాహార లోపం ఇప్పటికీ యథాతథంగానే ఉన్నాయి. తాను ఎన్నికైన తరువాత సెంట్రల్ హాల్లో తొలిసారిగా జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నరేంద్ర మోదీ ఇచ్చిన ఉద్వేగభరితమైన ఉపన్యాసం నాకు గుర్తుంది. తన ప్రభుత్వం పేదల కోసం అంకితమవుతుందని అన్నారాయన. జన్ధన్ యోజన వంటి కార్యక్రమాలు కొన్ని పేదల కోసం రూపొందించినవే. బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉండిపోయిన 58 శాతం ప్రజల కోసం ఆ పేరుతో ఖాతాలు తెరిచారు. అయితే నైపుణ్య భారతి వంటి పథకాలు ఇంకా ఫలితాలను చూపించవలసి ఉంది. ఇవన్నీ ఎలా ఉన్నా, గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు పట్టణ కేంద్రాలకు చేరుకునే ధోరణి ఆందోళన కలిస్తున్నది. కాగా ప్రస్తుతం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న 52 శాతం జనాభాను వచ్చే ఐదేళ్లలో 38 శాతానికి తగ్గించాలని జాతీయ నైపుణ్యాభివృద్ధి విధాన పత్రం లక్ష్యంగా నిర్దేశించింది. ఇలా ఉండగా 1972లో రూపు దిద్దుకున్న జాతీయ పౌష్టికాహార పర్యవేక్షక సంస్థ 2015లో కాలగర్భంలో కలి సింది. ఇందుకు కారణాలు ఏమైనా కావచ్చు. కానీ, పౌష్టికాహార లోపం హెచ్చుతగ్గులను పర్యవేక్షించేందుకు ఒక విశ్వసనీయ వ్యవస్థ లేకపోతే, ఆ లోపాన్ని నిరోధించడానికి నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకున్నామో లేదో తెలుసుకోవడం ఎప్పటికీ సాధ్యం కాదు. ఆర్థికవృద్ధి రేటును ప్రతి ఆరుమాసాలకు గణించినట్టే, పదేళ్లకు ఒక్కసారి పౌష్టికాహార లోపం మీద సర్వే చేయిం చాలి. నిజానికి ఇది కూడా అంత ఆమోద యోగ్యం కాదు. సేద్యమే దిక్కు ఒకటి వాస్తవం– వ్యవసాయ రంగం మీద దృష్టి పెట్టకుండా పేదరికం, ఆకలికేకలను నిర్మూలించడం సాధ్యంకాదు. పట్టణ ప్రాంత మౌలిక సదుపాయాల కల్పన మీద కంటే, వ్యవసాయ రంగం మీద పెట్టుబడులు పెడితే పేదరిక నిర్మూలనలో ఐదు రెట్లు ఎక్కువ ఉపయోగం ఉంటుందని ఇటీవల అమెరికాలో జరిగిన ఒక అధ్యయనం వెల్లడించింది. నా అవగాహన మేరకు ఈ అంశం చాలా ప్రాముఖ్యం కలిగినది. భారత ఆర్థికవేత్తలు, విధాన రూపకర్తలు, ఉద్యోగులు సిద్ధాంత పరంగా మార్కెట్ సంస్కరణలకు నిబద్ధులైపోయారు. ఆ పనిలో పడి వారు వ్యవసాయం మీద పెట్టవలసిన పెట్టుబడులను ఒక పద్ధతి ప్రకారం తగ్గిస్తున్నారు. అయినప్పటికీ అమెరికా అధ్యయనం విస్మరించదగినది కాదనే చెప్పాలి. నా అభిప్రాయం ఎప్పుడూ ఒక్కటే. సమస్యకు ఎవరు కారకులో, వారే పరిష్కారాన్ని చూపిస్తారని ఎదురు చూడడం సరి కాదు. ఇందుకు మంచి ఉదాహరణ భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐసీఏఆర్). ఇది దేశంలోని 71 వ్యవసాయ విశ్వవిద్యాలయాలను, దాదాపు రెండువందల పరిశోధక సంస్థలను నిర్లక్ష్యం చేస్తున్నది. దీనికి నీతి ఆయోగ్ విధానాలు కూడా తోడవుతున్నాయి. అది వ్యవసాయ సంక్షోభాన్ని పరాకాష్టకు తీసుకువెళ్లిన విఫల ఆర్థిక విధానాలనే మళ్లీ మళ్లీ తీసుకువస్తున్నది. సమస్యలను సృష్టించినప్పుడు మనం ఎలాంటి ఆలోచనతో ఉన్నామో, తరువాత కూడా అదే ఆలోచనతో కొనసాగితే సమస్యను పరిష్కరించడం సాధ్యం కాదని అల్బర్ట్ ఐన్స్టీన్ అంటాడు. ఆర్థిక సర్వే కావచ్చు, వచ్చే మూడేళ్ల కోసం తయారు చేసిన నీతి ఆయోగ్ విధాన, వ్యూహపత్రం కావచ్చు, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న తలంపుతో ఏర్పాటైన నిపుణుల కమిటీ నివేదిక కావచ్చు– ఇవన్నీ ముందుకు తెచ్చే వ్యూహాలు ఒక్కటే. అవి సంక్షోభాన్ని మరింత ముదరబెట్టేవే. ఇవన్నీ చేసే సూత్రీకరణలు కూడా పాతవే– దిగుబడిలో పెంపుదల, నీటిపారుదల సౌకర్యాల విస్తరణ, పంటల బీమా, ఎలక్ట్రానిక్ జాతీయ వ్యవసాయ మార్కెట్ వేదికను పటిష్టం చేయడం. పంజాబ్ నుంచి గుణపాఠం నేర్వాలా? ఇవే నిజమైతే భారతదేశానికి అన్నం గిన్నె వంటి పంజాబ్ రాష్ట్రం రైతుల బలవన్మరణాలకు ఎందుకు కేంద్రమైందో నాకు అర్థం కాదు. అక్కడి రైతులు రోజుకు ఇద్దరు లేదా ముగ్గురు బలవన్మరణానికి పాల్పడని రోజంటూ లేదంటే అతిశయోక్తి కాదు. పంజాబ్లో 98 శాతం భూభాగానికి నిశ్చయంగా నీటిపారుదల సౌకర్యం ఉంది. గోధుమ, వరి, మొక్కజొన్నలతో పాటు తృణధాన్యాల ఉత్పత్తిలో కూడా ప్రపంచంలోనే అగ్రభాగాన ఉన్న రాష్ట్రం పంజాబ్. ట్రాక్టర్లు, వ్యవసాయంలో ఉపయోగించే ఆధునిక యంత్రాలు, ఆఖరికి ఎరువులు పురుగు మందుల వాడకం కూడా అక్కడ చాలా ఎక్కువ. ఇన్ని ఉన్నా కూడా అక్కడ రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. సంపద విషయంలో ఇంత ఘనత ఉన్న పంజాబ్లో ఈ మధ్య పౌష్టికాహార లోపాన్ని నిరోధించడానికి, ఆకలిబాధను తీర్చడానికి యువత కోసం కొన్ని కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ప్రవేశపెడుతున్నారు. కాబట్టి వ్యవసాయ సంక్షోభాన్ని అధిగమించడానికి పంజాబ్ను మిగతా రాష్ట్రాలు అనుసరించాలని అనుకోవడం సరి కాదు. పౌష్టికాహార లోపం, పేదరికం, ఆకలి బాధల నుంచి విముక్తం చేయడంలో ప్రజానీకానికి రక్షణ కవచంగా నిలబడడంలో వ్యవసాయానిదే అగ్రస్థానం. రైతుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తూ, వ్యవసాయ దిగుబడుల మీద దృష్టి పెట్టడం ఆ రంగానికి ఒక శాపం వంటిది. ప్రధాని మోదీ కల నిజం కావాలంటే, ఆ లక్ష్యాలను చేరుకోవాలంటే పాత తప్పిదాల నుంచి గుణపాఠం నేర్చుకుని కొత్త విధానానికి మళ్లడం అవసరం. దీనికి ఇదే సరైన సమయం. అందువల్ల కచ్చితంగా ఫలితాలను సాధించవచ్చు. కానీ మళ్లీ సంక్షోభానికి కారణమైన ఆ పాత తప్పుడు విధానాలనే అనుసరిస్తామంటే మాత్రం అది ఎంతమాత్రం సాధ్యం కాదు. వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు దేవిందర్శర్మ ఈ–మెయిల్ : hunger55@gmail.com -
బలిపీఠంపై భారత రైతాంగం
మనం ఆర్సీఈపీ ఒప్పందంపై సంతకాలు చేస్తే, ఏ సుంకాలూ లేని దిగుమతులు మన దేశంలో శాశ్వతంగా తిష్టవేస్తాయి. ఇది, 60 కోట్ల మంది రైతుల జీవనోపాధికి భద్రతను కల్పించే హక్కు మనకు లేకుండా చేస్తుంది. వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టం రైతులకు సంబంధించి భవిష్యత్తులో ఎదుర్కొనవలసిన అతి పెద్ద ఆందోళనకరమైన సమస్య. కాగా, పుష్కలంగా పంటలు పండి, చేతికి వచ్చాక ధరలు ఘోరంగా పతనం కావడం వల్ల రైతులు ఎదుర్కొనవలసి వస్తున్న విపత్కర పరిస్థితి అంతకంటే పెద్ద సమస్య. ‘ఉత్పత్తి చెయ్యి, నాశనమై పో’ అని నేను అనేది దీన్నే. రెండేళ్లు వరుసగా దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొన్న రైతులపైన ఎట్టకేలకు ఆ వాన దేవుడు అనుగ్రహం చూపాడు. గత రెండేళ్ల నష్టాలను కొంత వరకైనా భర్తీ చేసుకోవాలనే ఆశతో రైతులు కష్టించి పని చేశారు. పుష్కలంగా పంటలు పండించారు. కానీ హఠాత్తుగా మార్కెట్లో ధరలు పాతాళానికి పడి పోయాయి. పప్పు, టమాటా, బంగాళదుంప, ఉల్లి, ఆవ, కూరగాయలన్నిటి ధరలు ఘోరంగా పడిపోయాయి. రైతుకు, పంటను రోడ్లపై కుమ్మరించిపోక తప్పని దుస్థితి ఏర్పడింది. రైతుల ఆగ్రహం భారీ నిరసనగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లలో మొదలైంది. పోలీసు కాల్పుల్లో ఐదుగురు రైతులు మరణించారు. రైతు సంఘాలు ఆగస్టు 9–15 మధ్య జైల్భరో ఆందోళనను మరింత భారీ ఎత్తున చేపట్టాయి. వ్యవసాయ రుణాల మాఫీని, ఉత్పత్తి వ్యయంపై 50 శాతం లాభాన్ని ఇవ్వాలన్న స్వామినాథన్ కమిటీ సిఫారసును అమలు చేయాలని వారి డిమాండు. కానీ, ప్రస్తుతం సాగుతున్న అంతర్జాతీయ వాణిజ్య చర్చలు భారత వ్యవసాయానికి మరింత పెద్ద ముప్పును తేనున్నాయని వారికి తెలియదు. నిజానికి ఆ ఒప్పందం అమల్లోకి వస్తే, భారీ సబ్సిడీలతో కూడిన వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులను ఎలాంటి పన్నులూ లేకుండా, అడ్డూ అదుపూ లేకుండా దేశంలోకి అనుమతిస్తారు. ఈ దిగుమతులు, చిన్న రైతులను వ్యవసాయాన్ని వదిలి పెట్టేసేలా చేస్తాయి. 1995లో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి వాణిజ్యపరమైన అడ్డంకులను, దిగుమతి సుంకాలను ఎత్తివేయాలని వర్ధమాన దేశాలను నిర్బంధించే యత్నాలు జరుగుతున్నాయి. దేశీయ మార్కెట్ను ఇతరుల కోసం బార్లా తెరవడం వల్ల భారత్కు పెద్దగా ఎలాంటి లాభమూ చేకూరలేదుగానీ, మన వ్యవసాయరంగానికి అపార నష్టం వాటిల్లిందని పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. తిరువనంతపురానికి చెందిన తనల్ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన ఆర్. శ్రీధర్ డబ్ల్యూటీఓ ప్రోత్సాహంతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్టీఏ), ఆగ్నేయ ఆసియా దేశాల వాణిజ్య కూటమి (ఆసియాన్) ప్లాంటేషన్ పెంపకందార్ల జీవనోపాధిని ఎలా దెబ్బతీశాయో వివరించారు. ‘‘ఏడేళ్ల క్రితం, కేరళ ప్రభుత్వం, మేమూ కలసి దిగుమతి సుంకాల తగ్గింపు... కేరళపై, ప్రత్యేకించి రబ్బరు, మసాలా దినుసుల విషయంలో తీవ్ర దుష్ప్రభావాన్ని చూపుతుంది’’ అని హెచ్చరించాం. అలాగే దిగుమతులు పెరిగి, ధరలు పడిపోయాయి. తమ హెచ్చరికను పెడచెవిన పెట్టి∙ఒప్పందంపై సంతకాలు చేశారు. కానీ నష్టపోయిన రైతులకు లేదా ఉపా«ధులను కోల్పోయిన వారికి నష్టపరిహారాన్ని లేదా సహాయాన్ని అందించలేదు రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందుతున్న 30% రైతులు తప్ప మిగతా వారు వ్యవసాయం వదలాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (ఆర్సీఈపీ) కుదుర్చుకుంటున్నారు. వాణిజ్యం జరిపే వస్తువులలో 92 శాతంపై దిగుమతి సుంకాలను పూర్తిగా ఎత్తివేయడాన్ని పరిశీలిస్తున్నారు. ఈ ఒప్పందం కింద ఒకసారి దిగుమతి సుంకాలను సున్నాకు తగ్గించాక, తర్వాత సుంకాలను పెంచడానికి వీల్లేదు. ఇది, డబ్ల్యూటీఓ సైతం విధించని నిబంధన. ఈ ఒప్పందంపై సంతకాలు చేయడానికి అంగీకరిస్తే, దిగుమతి సుంకాలే లేని దిగుమతులు మన మార్కెట్లో శాశ్వతంగా తిష్టవేస్తాయి. ఇది, 60 కోట్ల మంది రైతుల జీవనోపాధికి భద్రతను కల్పించే, పరిరక్షించుకునే హక్కు మనకు లేకుండా చేస్తుంది. మన దేశం ప్రపంచంలోనే అతి పెద్ద పాల ఉత్పత్తిదారు. ప్రస్తుతం పాలు, పాల ఉత్పత్తుల దిగుమతులపై 40 నుంచి 60 శాతం దిగుమతి సుంకాలున్నాయి. ఇది, స్థానిక డెయిరీలకు రక్షణను కల్పించి, స్థానిక పోటీతత్వాన్ని పెంపొందింపజేస్తోంది. పాల దిగుమతులకు తలుపులను బార్లా తెరవడంతో ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ల నుంచి చౌకగా లభించే పాలు దేశాన్ని ముంచెత్తుతాయి. ఆస్ట్రేలియాలో 6,300 మంది, న్యూజీలాండ్లో 12,000 మంది పాడి రైతులే ఉన్నారు. అవి ఆ కొద్దిమంది రైతుల ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణ కోసం తమ దిగుమతులను రుద్దడానికి యత్నిస్తుంటే... 15 కోట్ల పాడి రైతుల జీవనోపాధిని త్యాగం చేయడానికి భారత్ సిద్ధమౌతోంది. మన ఐటీ నిపుణులకు మరిన్ని అవకాశాలను కల్పించడానికి అవి సుముఖతను కనబరచినంత మాత్రాన, భారత పాడి రైతులను బలిపీఠంపైకి ఎక్కించేస్తామనడం అర్థరహితం. ఆర్సీఈపీ ఒప్పందం, పాలు, పాల ఉత్పత్తులకే పరి మితం కాదు. పళ్లు, కూరగాయలు, పప్పులు, బంగాళదుంపలు, మసాలా దినుసులు, ప్లాంటేషన్లు, విత్తనాలు, పట్టు, ప్రాసెస్డ్ ఆహారం తదితర మార్కెట్లన్నిటా ఇదే పరిస్థితి నెలకొంటుంది. ఈ ఆర్సీఈపీ చర్చలను పూర్తి రహస్యంగా సాగిస్తున్నారు. కొందరు వ్యక్తులు పకడ్బందీ ఏర్పాట్లతో రహస్యంగా జరిపే చర్చల ద్వారా జరిగే నిర్ణయాలు, చివరకు 99 శాతం జనాభా భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. ఇది పూర్తిగా అన్యాయం. దేవిందర్ శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ :hunger55@gmail.com -
వేకువ వచ్చేనా ఎన్నటికైనా?
విశ్లేషణ ఆర్థిక సంస్కరణల అమలు కోసం ప్రభుత్వాలు కావాలనే వ్యవసాయరంగాన్ని హతమారుస్తున్నాయి. ఆర్థిక వృద్ధి పేరిట వ్యవసాయ జనాభాలో చాలా భాగాన్ని నగరాలలో అల్ప వేతనాల శ్రామికులుగా దిగజార్చాలని యత్నిస్తున్నారు. ఆహారాన్ని కార్పొరేట్ వ్యవసాయం ద్వారా లేదా దిగుమతుల ద్వారా సమకూర్చుకోవచ్చు. సరిగ్గా ఇదే ప్రపంచ బ్యాంకు తదితర సంస్థలు మన దేశం కోసం సిద్ధం చేసిన మార్గం. ఈ లక్ష్యం సాధిస్తే రేటింగ్ సంస్థలు మనకు ఆధిక ర్యాంకింగ్ ఇస్తాయి అతి చాకచక్యంగా రూపొందించిన ఆర్థిక నమూనా ఇది. ఎప్పుడు నేను ఏ రైతు మొహంలోకి చూసినా ‘‘ఓ సుభా కభీ తో ఆయేగీ’’ (ఆ వేకువ వచ్చేనా ఎన్నటికైనా) అనే రాజ్కపూర్ పాట గుర్తుకు వస్తుంటుంది. దైన్యం నిండిన ఆ వదనంలో కొట్టవచ్చినట్టుగా నిరాశ కనిపిస్తుంటుంది. ఆ పాట పాడిన రాజ్కపూర్ కథ ఎలాగో సుఖాంతమైందిగానీ, భారత రైతు మాత్రం ఒక చక్రవ్యూహపు బంధనాల లోలోతుల్లోకి కూరుకుపోతూనే ఉన్నాడు. ఇదొక అంతేలేని నిరీక్షణ. పుష్కలంగా పంటలను పండించడానికి రైతులు గత 70 ఏళ్లుగా కష్టించి చమటోడుస్తూనే ఉన్నారు. అయినా ఏటికేడాది గడిచేకొద్దీ రైతు కుటుంబం పరిస్థితి అధ్వానమౌతూనే ఉంది. మరీ సుదూరమైనది కాని గతంలో ‘ఓడ నుంచి నోటికి’ (ఆహార దిగుమతులపై ఆధారపడిన స్థితి) అని పిలిచే దశలో మనుగడ సాగించిన దేశం మనది. ఆనాడు ఆహార సహాయం పెద్ద ఎత్తున జనాభాను ఆకలి కోరలనుంచి కాపాడింది. ఒకప్పడు దేశానికి గర్వకారణమైన రైతు నేడు ఆర్థిక భారంగా మారాడు. కృతజ్ఞతలేని దేశం ఆ భారాన్ని వదుల్చుకోడానికి ఎప్పుడు ఏ అవకాశం దొరుకుతుందా? అని ఎదురు చూస్తోంది. రైతు భిక్ష ఆహార స్వయంసమృద్ధి 1965లో నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి, వియత్నాం యుద్ధాన్ని ‘‘దురాక్రమణ చర్య’’గా పేర్కొనడం అమెరికా అధ్యక్షుడు లిండన్ జాన్సన్కు ఆగ్రహాన్ని కలిగించింది. ఒక ఆకలిగొట్టు దేశం అమెరికాను దురాక్రమణదారు అనడానికి ఎలా సాహసిస్తుంది? అని ఆహార సరఫరాలను నిలిపి వేయడంతో మన ప్రభుత్వం అయోమయంలో పడిపోయింది. ఒక సమయంలో ఆహార ధాన్యాల నిల్వలు వారానికి మాత్రమే సరిపోయే స్థితి ఏర్పడింది. దీంతో సర్వత్రా భయాందోళనలు వ్యాపించిపోయాయి. లోతుగా విస్తరిస్తున్న ఆహార సంక్షోభానికి జవాబుగా శాస్త్రి, ప్రతి సోమవారం ఉపవాసం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఆహార స్వయంసమృద్ధిని సాధించడంలో రైతు నిర్వహించగల గొప్ప పాత్రను గుర్తించిన ఆయన జై జవాన్, జై కిసాన్ నినాదాన్ని రూపొం దించారు. ఆ తర్వాత విజయవంతంగా పాల సహకార సంఘాలను ప్రారంభించారు. అవే ఆ తర్వాత క్షీర విప్లవాన్ని తెచ్చాయి. ప్రధాని ఇందిరాగాంధీ వాస్తవంగానే హరిత విప్లవానికి బీజాలు వేశారు. ప్రభుత్వం మెక్సికో నుంచి అధిక దిగుబడినిచ్చే గోధుమ పొట్టి వంగడాలను దిగుమతి చేసుకుని, నీటి పారుదల సదుపాయాలను, రసాయనిక ఎరువులు, క్రిమిసంహారకాలను అందుబాటులో ఉంచగా, ఆ మిగతా పనిని రైతులు చేశారు. 1967లో హరిత విప్లవ సాంకేతికతను ప్రవేశపెట్టిన తర్వాతి తొలి పంట నూర్పిడి కాలానికి ఆహారధాన్యాల ఉత్పత్తి 50 లక్షల టన్నుల రికార్డు స్థాయికి చేరింది. ఇక దేశం వెనక్కు చూసిందే లేదు. భారతదేశం ఆహార స్వయంసమృద్ధిని సాధించింది. అయితే, ప్రభుత్వం ఆనాడు రైతులకు అందించిన ఆర్థిక ప్రోత్సాహకాలు పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు. 1970లో పాఠశాల ఉపాధ్యాయుల వేతనం నెలకు రూ.90 ఉన్నప్పుడు, గోధుమ కనీస మద్దతు ధర (ఎమ్ఎస్పీ) క్వింటాలుకు రూ. 76. అధిక ధరకు, మార్కెట్కు హామీని (ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటుతో) రైతుకు కల్పించారు. రైతులకు ‘ఘననీయమైనది’ అయిన ఆ కాలం ఓ దశాబ్దిన్నర పాటూ కొనసాగింది. హరిత విప్లవం చిన్న రైతుల జీవితాల్లోకి తొంగి చూడకుండానే సాగినా, అది సౌభాగ్యం గురించి ఆశాజనకమైన చిత్రాన్ని ఆవిష్కరించింది. అభ్యుదయ రైతు ట్రాక్టర్ నడుపుతున్న బొమ్మ సౌభాగ్యానికి సంకేతమైంది. వాస్తవానికి, ఉత్పత్తిలోని పెరుగుదలకు అనుగుణంగా వ్యవసాయ ఆదాయాలు పెరగలేదు. వరుసగా వచ్చిన ప్రభుత్వాలు భారీ దిగుబడులతో సంతృప్తిచెంది, రైతాంగాన్ని నిర్లక్ష్యం చేశాయి. ప్రభుత్వరంగ పెట్టుబడుల రేటు క్షీణించడం దీనికి తోడు కాగా, 1980ల మధ్య నుంచి వ్యవసాయరంగ పతనం ప్రారంభమైంది. కొనితెచ్చుకుంటున్న ఆహార పరాధీనత 1991 నాటికి, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) అస్తిత్వంలోకి వచ్చాక, దేశం వ్యవసాయం మీద నుంచి దృష్టిని మరల్చడం మొదలెట్టింది. అదే సమయంలో యూరప్, అమెరికాలు కూడా భారీ ఎత్తున ఆహారం, పాలు, వెన్న భారీ నిల్వలను కూడబెట్టసాగాయి. దీంతో, ప్రధాన స్రవంతి ఆర్థిక చింతన ప్రపంచ పోటీపైకి మరలింది. చౌక దిగుమతులకు అనువుగా దిగుమతి సుంకాలను తగ్గించడం మొదలైంది. అదేసమయంలో, ఆహార ద్రవ్యోల్బణ నియంత్రణ భారాన్నంతటినీ రైతులపై మోపారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు 1990–2010 మధ్య ప్రపంచస్థాయిలోనే స్థిరంగా ఉండిపోయాయి. నిరాశాజనకమైన ఈ ధోరణి కొనసాగుతూనే ఉంది. రైతులకు న్యాయమైన ఆదాయాన్ని నిరాకరిçస్తున్నా, సమాజంలోని ఇతర సెక్షన్ల జీతాలు భారీగా పెరిగాయి. 1970–2015 మధ్య పాఠశాల ఉపాధ్యాయుల వేతనాలు 280 నుంచి 320 రెట్లు, ప్రభుత్వోద్యోగుల జీతాలు 120 నుంచి 150 రెట్లు పెరిగాయి. అదే కాలంలో రైతులకు ఇచ్చే గోధుమ ధర మాత్రం 19 రెట్లే పెరిగింది. వ్యవసాయం లాభసాటిగా కాకుండా పోయింది, ఇతరులతో సమానమైన పరిస్థితులను వ్యవసాయానికి కల్పించాలని ఏళ్ల తరబడి చేస్తున్న డిమాండు ప్రభుత్వాల చెవికి ఎక్కడం లేదు. 1996–2015 మధ్య 20 ఏళ్లలో భారత్ 40 కోట్ల మందిని వ్యవసాయం నుంచి బయటకు పంపాలని ప్రపంచ బ్యాంకు నిర్దేశించింది. అదిచ్చే ప్రతి రుణానికి దాదాపు 140 నుంచి 150 షరతులు ఉంటాయి. కాబట్టి దాని ప్రతి రుణమూ రైతులను వ్యవసాయం నుంచి తొలగించడాన్ని నొక్కి చెబుతూనే ఉంది. 70 శాతం రైతాంగాన్ని వ్యవసాయం నుంచి తరలించాల్సిన అవసరం ఉన్నదని మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ పదే పదే చెప్పేవారు. అదే మన దేశంలో అతి పెద్ద ఆర్థిక సంస్కరణ అవుతుందని రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. అది జరిగినప్పుడే మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవసరమైన చౌక శ్రమ అందుబాటులోకి వస్తుందని వారి భావన. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెడుతూ వ్యవసాయరంగం పట్ల ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యాన్ని, అలసత్వాన్ని చూపింది. ప్రభుత్వాలన్నీ వ్యవసాయాన్ని లాభదాయకం కానిదిగా చేసి, పెద్ద ఎత్తున రైతులు వ్యవసాయాన్ని వీడి పట్టణాలకు పోక తప్పని పరిస్థితులను కావాలనే కల్పించాయి. ఈలోగా ఆహార దిగుమతులు విపరీ తంగా పెరిగాయి. 2015–16లో అవి రూ.1,40,268 కోట్లకు చేరాయి. ఇది, వార్షిక వ్యవసాయ బడ్జెట్ కంటే ఎక్కువ. రైతును భూమి నుంచే గెటేస్తేనే వృద్ధి! రైతులను వ్యవసాయం నుంచి గెంటేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నప్పటి నుంచి దిగుమతులకు మళ్లడం కూడా జరిగింది. ఆహార ద్రవ్యోల్బణ నియంత్రణ భారాన్ని రైతులపై మోపడంతో, వారికి ఉత్పత్తి ఖర్చులకు సైతం సరిపోని ధరలను చెల్లించడం అలవాటుగా జరిగిపోతోంది. పప్పులు, నూనె గింజల దిగుమతుల కోసం ఆఫ్రికా, బ్రిక్స్ దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. భవిష్యత్తులో గోధుమ దిగుమతులూ మొదలౌతాయి. ఆహార స్వయంసమృద్ధి నుంచి ఆహారం కోసం దిగుమతులపై ఆధారపడటం వైపునకు మళ్లే కృషి జరుగుతోంది. ఆహారాన్ని దిగుమతి చేసుకోవడం అంటే నిరుద్యోగాన్ని దిగుమతి చేసుకోవడమేనని గుర్తించడం లేదు. ఆహార దిగుమతులు మొదట చిన్న రైతులను దెబ్బతీసి, సాగు మానేసి వారు పట్టణాలకు వలసపోయేలా చేస్తాయి. ఇలాంటి వివరాలు ప్రధాన స్రవంతి ఆర్థిక వేత్తలకు అర్థరహితమైవిగా తోస్తాయి. వారి దృష్టంతా రైతులను వ్యవసాయం నుంచి తరిమేయడం మీదనే ఉంది. దాన్నే మన విధానకర్తలు ఆర్థికవృద్ధి వ్యూహంగా అనుసరిస్తున్నారు. ప్రపంచంలోని దేశాలన్నీ ఉద్యోగాలు లేని వృద్ధిని చవి చూస్తున్నాయి. మనం అందుకు మినహాయింపు కాదు. ఈ పరిస్థితిలో ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించగలిగేది వ్యవసాయమేనని గుర్తించడం లేదు. ఏదిఏమైనా, ప్రతి కోతల కాలం తర్వాత వ్యవసాయ మార్కెట్లలో ధరలు ఘోరంగా పడిపోతున్నాయి. రైతులకు కనీస మద్దతు ధరల హామీనైనా కల్పించకుండా ప్రభుత్వం ఆదుకోవడానికి నిరాకరిస్తున్నది. రైతులు అంతేలేని రుణ విషవలయం అనే చక్రవ్యూహం లోలోతులకు కూరుకుపోతున్నారు. ఎమ్ఎస్పీ ఇచ్చిన సందర్భాల్లో కూడా అది ఉత్పతి వ్యయం కంటే తరచూ తక్కువగా ఉంటోంది. ఉదాహరణకు మహారాష్ట్రలో కందిపప్పు ఉత్పతి వ్యయం క్వింటాలుకు రూ.6,240, ఎమ్ఎస్పీ రూ.5,050, రైతులు వాస్తవంగా మార్కెట్లో అమ్ముకోగలుగుతున్న ధర రూ. 3,500 నుంచి రూ. 4,200 మాత్రమే. హరియాణా రైతు మూడు నెలలు కష్టించి బంగాళాదుంపలు పుష్కలంగా పండిస్తే, వాటిని కిలో 9 పైసలకు అమ్ముకోవాల్సి వస్తోంది. ఇవేవో చెదురు మదురు ఘటనలు కావు, ఇలా ఏటా పంట రైతు చేతికొచ్చాక ధరలు కుప్పకూలడం ఆనవాయితీగా మారింది. అందువల్లనే ఇటీవల మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లలో రైతులు ఆగ్రహంతో ఆందోళనలు సాగించారు. ఈ నిరసనలు, ముందు రానున్న సినిమాకు ట్రైలర్ మాత్రమేనని నా అభిప్రాయం. ఏటికేడాది రెట్టింపయ్యే అప్పుల ఊబిలో బతకమని ప్రభుత్వాలు రైతులను వదిలేశాయి. వ్యవసాయాన్ని ఉద్దేశపూర్వకంగానే పేదరికంలో మగ్గేలా చేస్తున్నాయి. రైతాంగంలో 58 శాతం ప్రతి రాత్రీ ఆకలి కడుపుతో పడుకోవాల్సి వస్తోందని ఒక అంచనా. దేశంలోని 17 రాష్ట్రాల అంటే దాదాపు సగభాగంలో రైతుకుటుంబాల సగటు వార్షిక ఆదాయం రూ. 20,000, అంటే నెలకు రూ. 1,700 అని 2016 ఆర్థిక సర్వే చెబుతోంది. ఇది ఒక ఆవును పెంచడానికే సరిపోదు, మరి రైతు కుటుంబాలు ఎలా నెట్టుకొస్తున్నాయా? అని ఆశ్చర్యం కలుగుతుంది. ఈ రైతాంగానికి వ్యవసాయాన్ని గర్వకారణంగామార్చే ఆ ఉదయం ఎన్నటికైనా వస్తుందా? ఆర్థిక సంస్కరణలను అమలు చేయడం కోసం ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వాలు వ్యవసాయరంగాన్ని హతమారుస్తున్నాయి. ఆర్థిక వృద్ధిని సాధించాలంటూ ప్రధాన స్రవంతి ఆర్థిక శాస్త్రవేత్తలు వ్యవసాయంలోని జనాభాలో చాలా భాగాన్ని నగరాలలో చౌకగా దొరికే శ్రామికులుగా మార్చాలని చూస్తున్నారు. ఆహారాన్ని కార్పొరేట్ వ్యవసాయం ద్వారా లేదా దిగుమతుల ద్వారా సమకూర్చుకోవచ్చు. సరిగ్గా ఇదే ప్రపంచ బ్యాంకు, ఇతర ఆర్థిక సంస్థలు మన దేశం కోసం రూపొందించిన మార్గం. ఈ లక్ష్యం సాధించినందుకు క్రెడిట్ రేటింగ్ ఏజన్సీలు మనకు అధిక ర్యాంకింగ్ ఇస్తాయి. అతి చాకచక్యంగా రూపొందించిన ఆర్థిక నమూనా ఇది. వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు దేవిందర్శర్మ hunger55@gmail.com -
రైతు పోరాటానికి కొత్త దిశ
రైతులు, ప్రత్యేకించి నేటి తరం రైతు నాయకులు కనీస మద్దతు ధరల పరిధికి మించి ఆలోచించాలి. ప్రపంచ వాణిజ్య సంస్థ కనీస మద్దతు ధరలలో మరింత పెంపుదలను వ్యతిరేకిస్తోంది. కాబట్టి మద్దతు ధరలను పెంచడానికి విధానపరమైన అవకాశాలు కుచించుకుపోయాయని అర్థం చేసుకోవాలి. పైగా, ప్రభుత్వాలు ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి రైతాంగాన్ని ప్రాథమికమైన పనిముట్టుగా వాడుకుంటున్నాయి. అందువలన రైతాంగం మద్దతు ధరల నుంచి కనీస ఆదాయ హామీ దిశకు మరలాలి. ఇటీవల దేశవ్యాప్తంగా ఆగ్రహంతో రైతుల ఆందోళనలు వెల్లువెత్తాయి. మధ్యప్రదేశ్లో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు రైతులు మరణించారు కూడా. ఇంత జరిగినా తీరా చూస్తే, దేశంలోని రైతు సంఘాలన్నిటి డిమాండు వ్యవసాయ రుణాల మాఫీకి, స్వామినాథన్ కమిషన్ సూచించినట్టు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)తోపాటూ 50 శాతం పెంపుదలను కోరడానికి కుచించుకుపోయింది. ఈ కీలక తరుణంలో వైవిధ్యభరితమైన వివిధ రైతు బృందాల సంఘాలు ఒక్కటిగా కలవడం ఆనందదాయకమైన విషయం. అయినా, ఈ ఆందోళనలు, నిరసనలన్నీ కేవలం 6 శాతం వ్యవసాయదార్ల కోసమేనా? అని కొన్నిసార్లు అనుమానం కలుగుతుంటుంది. రైతులలోని ఈ స్వల్ప శాతం గురించి పేర్కొనడానికి కారణం లేకపోలేదు. శాంతాకుమార్ కమిటీ అంచనాల ప్రకారం కనీస మద్దతు ధరల వల్ల లబ్ధి కలిగేది 6 శాతం రైతులకే. అదే నిజమైతే, స్వామినాథన్ కమిటీ సూచించిన ఎంఎస్పీతో పాటూ 50 శాతం లాభం, మిగతా 94 శాతం రైతాంగానికి సంబంధించినంత వరకు అర్థరహితమైనదే అవుతుంది. ఆర్థికవేత్తలకు మింగుడుపడని వాస్తవం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను(ఎఫ్సీఐ) పునర్వ్యవస్థీకరించడం కోసం శాంతాకుమార్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన అత్యున్నతస్థాయి కమిటీ పలువురు నిపుణులను, సంస్థలను అభిప్రాయాలను తెలపడం కోసం పిలిచింది. వారిలో నేనూ ఉన్నాను. ఆ సందర్భంగా నేను ఏటా పండే గో«ధుమ, వరిలో 30 శాతాన్ని ప్రభుత్వం సేకరిస్తున్నందున, కనీస మద్దతు ధరల ప్రయోజనాలు ఇంచుమించు 30 శాతం రైతులకే దక్కుతాయని చెప్పాను. కనీస మద్దతు ధరలు రైతులందరికీ లభిస్తాయనే అంతా భావిస్తుంటారు. అందువల్లనే నేను చెప్పింది విని, శాంతాకుమార్ స్పష్టంగానే ఆశ్యర్యాన్ని వెలిబుచ్చారు. నా అంచనాలకు ప్రాతిపదిక ఏమిటో తెలుపమని ఆయన కోరారు. నిజమైన అంచనాలంటూ ఏవీ లేనందున, అది నేను ఉజ్జాయింపుగా వేస్తున్న అంచనాయేనని చెప్పాను. కనీస మద్దతు ధరలకు తమ ఉత్పత్తులను అమ్ముకోగలిగే రైతులు కేవలం 6 శాతమేనని చివరికి శాంతా కుమార్ కమిటీ లెక్కగట్టింది. రైతులలోని అతి కొద్ది శాతానికే ఎంఎస్పీ లభిస్తుందనే విషయం ప్రధాన స్రవంతి ఆర్థికశాస్త్రవేత్తలకు, విద్యావేత్తలకు సైతం మింగుడుపడేది కాదు. సుధీర్ఘ కృషి ఫలితమైన ప్రభుత్వ సేకరణ వ్యవస్థను మొత్తంగా చాపలా చుట్టి పారేయాలని గత కొన్నేళ్లుగా మన విధానకర్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. కనీస మద్దతు ధరలు ప్రభుత్వ గుత్తాధిపత్యాన్ని సృష్టించాయని, అందువలన రైతులు మెరుగైన ధరలను రాబట్టుకోలేకపోతున్నారని వారి వాదన. నిజానికి, సేకరణ ధరలను లెక్కగట్టే వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషనే (కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్–సీఏసీపీ) స్వయంగా కనీస మద్దతు ధరలను రద్దు చేసి, వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణయాన్ని మార్కెట్లకే వదిలేయడాన్ని అనుమతించాలనే ప్రచారోద్యమానికి నాయత్వం వహిస్తోంది. మార్కెట్లే గనుక అంత సమర్థవంతమైనవైతే, రైతులు ఎంఎస్పీతో పాటూ 50 శాతం లాభాన్ని ఎందుకు డిమాండు చేస్తారో నాకు అంతుపట్టడం లేదు. ఏదిఏమైనా, కనీస మద్దతు ధరలకు వ్యవసాయ ఉత్పత్తిని సేకరించడమనేది పంటకు మెరుగైన ధర దక్కడానికి ప్రాథమికమైన ముందు షరతు. దీన్ని అర్థం చేసుకోవడానికి పంజాబ్, బిహార్లను సరిపోల్చి చూద్దాం. పంజాబ్లో చక్కగా ఏర్పాటు చేసిన మండీల (మార్కెట్ల) వ్యవస్థ, గ్రామాలను అనుసంధానించే లింకు రోడ్లు ఉన్నాయి. ఫలితంగా, ఈ ఏడాది రైతులు క్వింటాలు గోధుమకు రూ. 1,625 సేకరణ ధరను పొందగలిగారు. మరోవంక, బిహార్లో 2007 నుంచి ఏపీఎంసీ(అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ) నియంత్రణలోని మండీలు లేవు. బిహార్ రైతులు కూడా ఈ ఏడాది పుష్కలంగా గోధుమ పంటను తీయడం కోసం కష్టపడి పనిచేశారు. అయినా ఏపీఎంసీ మండీలు లేకపోవడంతో కనీస మద్దతు ధరలను పొందలేకపోయారు. చాలా మంది రైతులకు కారు చౌక ధరలకు అమ్ముకోవడం తప్ప గత్యంతరం లేకపోయింది. ఉత్తరప్రదేశ్లో సైతం కేవలం 3 శాతం రైతులకే మద్దతు ధరలు దక్కాయి. మిగతా వారంతా అత్యధిక భాగం గోధుమను క్వింటాలుకు రూ. 1,200 నుంచి రూ. 1,500 మధ్య ధరలకు అమ్ముకోవాల్సి వచ్చింది. మద్దతు ధరల పరిధిని దాటి ఆలోచించాలి అందువలన, రైతులు కనీస మద్దతు ధరలతో పాటూ 50 శాతం లాభాన్ని కోరినా అది ఏపీఎంసీ మండీలు అందుబాటులో ఉండే 6 శాతం రైతులకే లభిస్తాయి. మరి మిగతా 94 శాతం రైతుల మాటేమిటి? అనే సమస్య తలెత్తుతుంది. వారంతా పేదరికంలో మగ్గుతూ ఉండటం కొనసాగాల్సిందేనా? వారు ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉండరా? కాబట్టి రైతులు, ప్రత్యేకించి నేటి తరం రైతు నాయకులు ఈ కనీస మద్దతు ధరల పరిధికి మించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) భారత్ కనీస మద్దతు ధరలలో మరింత పెంపుదలను వ్యతిరేకిస్తోంది. దాని నిబంధనలను అనుసరించి అభివృద్ధి చెందుతున్న దేశాలేవీ అనుమతించదగిన కనీస మద్దతు ధరలకు మించి పెంచడానికి వీల్లేదు. ఇలాంటి సమయంలో పంటల మద్దతు ధరలను పెంచడానికి ఉన్న విధానపరమైన అవకాశాలు కుచించుకుపోయాయని రైతులు, రైతు నేతలు అర్థం చేసుకోవాలి. పైగా, ప్రభుత్వాలు ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి రైతాంగాన్ని ప్రాథమికమైన పనిముట్టుగా వాడుకుంటున్నాయి. కాబట్టి స్వామినాథన్ కమిటీ నివేదికకు అనుగుణంగా ఎంఎస్పీని పెంచడం సాధ్యం కాదనే చెప్పాలి. రైతులకు 50 శాతం లాభాన్ని చేకూర్చజాలమని, అది మార్కెట్ ధరలను వక్రీకరిస్తుందని ఈ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీం కోర్టుకు చెప్పింది. మరోవిధంగా చెప్పాలంటే ఆహారాన్ని పండిస్తున్నందుకుగానూ రైతులను శిక్షిస్తున్నారు. ఇది అర్థం చేసుకోవడానికి ఈ ఖరీఫ్లో తాజాగా ప్రకటించిన మద్దతు ధరలను చూద్దాం. దేశంలో రైతుల ఆందోళనలు సాగుతుండగా సేకరణ ధరలను ప్రకటించారు. కనీస మద్దతు ధరపై 50 శాతం లాభం కోసం వెల్లువెత్తుతున్న డిమాండుకు చలించకుండా ప్రకటించిన ఖరీఫ్ ధరలు ఉత్పత్తి వ్యయానికి బొటాబొటిగా సరిపోతాయి. వరికి కొత్త ధర క్వింటాలుకు రూ. 1,550. అంటే క్వింటాలుకు రూ. 80 పెరుగుదల. గత ఏడాది «ధరతో పోలిస్తే 5.4 శాతం పెరుగుదల. అలాగే పత్తి, మొక్కజొన్న, సన్ఫ్లవర్ విత్తనాల విషయంలో కూడా గత ఏడాదితో పోలిస్తే వాటి ధరలను 4.4 శాతం మేరకు పెంచారు. ఇక ఖరీఫ్ పప్పు ధాన్యాలు... కంది, మినుము, పెసర ధరలను 6.7 నుంచి 7.0 శాతం వరకు పెంచారు. ‘మింట్’ పత్రిక విశ్లేషణను బట్టి చూస్తే, ఈ ధరలలో పెరుగుదల ఉత్పత్తి వ్యయాలపై కేవలం నామ మాత్రపు శాతం మాత్రమే. ప్రభుత్వం ఇప్పుడు తమ బఫర్ స్టాక్ కోసం మాత్రమే పప్పుధాన్యాలను సేకరించి, మిగతా రైతులను మార్కెట్లోని ఒడిదుడుకులకు వదిలేస్తుండటమనే సమస్యను ఇప్పుడు ఎదుర్కొంటున్నాం. గత ఏడాదిలాగే మార్కెట్ ధరలు బహిరంగ మార్కెట్లో భారీ ఎత్తున పడిపోయినప్పుడు, ఇప్పుడు కూడా అదే దౌర్భాగ్య పరిస్థితిని రైతులు ఎదుర్కొనవలసి వస్తుందని నా భయం. విధానపరమైన మౌలిక మార్పు అవసరం ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం కోసం కనీస మద్దతు ధరలను ఉద్దేశపూర్వకంగానే ఇన్నేళ్లుగా తక్కువగా ఉంచుతున్న పరిస్థితుల్లో, పైగా ఆ కనీస ధరలు సైతం 94 శాతం రైతులకు దక్కకుండా ఉన్న స్థితిలో... రైతాంగం ‘ధరల విధానం’ కాలం నుంచి ‘ఆదాయ విధానం’ కాలానికి మరలాల్సిన సమయం ఆసన్నమైంది. రుణమాఫీ సైతం, రుణాలు పేరుకు పోకుండా ఉండటానికి హామీని కల్పించే విధానాలను వెన్నంటి జరగాల్సిందే. నేటి వ్యవసాయ సంక్షోభానికి పరిష్కారం... ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి మాసికలు వేయడం కాదు. ఒక సర్వసమగ్ర వైఖరి, ఆర్థిక చింతనలో సమూలమైన మార్పు అందుకు అవసరం. సాగుబడిని ఆర్థికంగా లాభదాయకమైనదిగా చేయడానికి సాగించే కృషే అందుకు ప్రారంభ స్థానం. 1. కనీస మద్దతు ధరలను లెక్కగట్టే వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్ గృహవసతి, విద్య, వైద్యం, రవాణా బత్తాలను (అలవెన్స్లను ) పరిగణనలోకి తీసుకుని రైతులకు చెల్లించే ఎంఎస్పీలను నిర్ణయించాలి. కనీస మద్దతు ధరలు ఇంతవరకు ఉత్పత్తి వ్యయాలకు సరిపడేవిగా మాత్రమే ఉంటున్నాయి. 108 బత్తాలను పొందే ప్రభుత్వ ఉద్యోగులతో ఒక్కసారి రైతుల స్థితిని పోల్చి చూడండి. 2. కనీస మద్దతు ధరలు కేవలం 6 శాతం రైతాంగానికే మేలు చేస్తాయి కాబట్టి, ఎంఎస్పీపై 50 శాతం లాభం కావాలంటూ చేసే డిమాండు 6 శాతం రైతులకే లబ్ధిని కలుగజేస్తుందని అర్థం చేసుకోవాలి. మిగతా 94 శాతం రైతులు దోపిడీమయమైన మార్కెట్లపై ఆధారపడాల్సి వస్తోంది. కాబట్టి, జాతీయ రైతు ఆదాయ కమిషన్ను (ఎన్ఎఫ్ఐసీ) ఏర్పాటు చేయడం అవసరం. ఆ కమిషన్కు ఒక్కో రైతు కుటుంబానికి కనీసం రూ. 18,000 నెలసరి ఆదాయ ప్యాకేజీని అందించే అధికారాన్ని ఇవ్వాలి. 3. తక్షణమే ఏపీఎంసీ మండీలను, సరుకు నిల్వ గోదాములను నిర్మించడానికి ప్రభుత్వరంగ పెట్టుబడులను పెట్టాల్సి ఉంది. ప్రస్తుతం దేశంలో కేవలం 7,700 ఏపీఎంసీ మండీలు మాత్రమే ఉన్నాయి. ప్రతి 5 కిలో మీటర్ల పరి ధికి ఒకటి చొప్పున దేశంలో 42,000 మండీలను నిర్మించడం అవసరం. బ్రెజి ల్లో రైతులు మార్కెట్కు తెచ్చిన వస్తువులను సేకరించడం తప్పనిసరి. ఏపీఎంసీ మండీలు కూడా అది చేయగలిగే విధంగా వాటిని సంసిద్ధం చేయాలి. వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు దేవిందర్శర్మ ఈ మెయిల్ :hunger55@gmail.com -
కష్టాల సుడి, నష్టాల దిగుబడి
మహారాష్ట్రలో రైతులు మూడంటే మూడు రోజుల పాటు నగరాలకు, పట్టణాలకు కూరగాయలు, పాలు సరఫరా కాకుండా దిగ్బంధనం చేశారు. దానితో వారి ఆగ్రహం ఎలాంటిదో జాతీయ స్థాయిలో పతాకశీర్షికలలో దర్శనమిచ్చింది. గతంలో మాదిరిగా రైతు సమస్యను గురించి వెల్లడించడానికి జాతీయ రహదారులు దిగ్బంధనం చేయడం, రైలు పట్టాల మీద బైఠాయించడం కాకుండా మహారాష్ట్రలో రైతు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న కిసాన్ క్రాంతి సంస్థ కొత్త వ్యూహం పన్నింది. అది పనిచేసింది కూడా. ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభ ఎన్నికలలో రైతులకు ఒక హామీ ఇచ్చారు. తనకు అధికారం అప్పగిస్తే, వ్యవసాయోత్పత్తి కోసం రైతులు చేసిన వ్యయం కంటే యాభై శాతం అధికంగా లాభాలు దక్కేటట్టు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. రైతులు కూడా మోదీకి కనీవినీ ఎరుగనంత ఆధిక్యం సమకూర్చి పెట్టారు. కానీ ఆ తరువాత మోదీ తను ఇచ్చిన హామీ గురించి ప్రస్తావించనే లేదు. అసలు వాస్తవం చెప్పుకోవాలంటే, కనీస మద్దతు ధర కల్పించే అవకాశాలు ఏమీ లేవని చెబుతూ ఎన్డీఏ ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఒక అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా అంతే. ఆయన ముఖ్యమంత్రి పదవిలోకి రాని క్రితం రైతులు నిర్వహించిన ఒక ఊరేగింపులో పాల్గొన్నారు. ఆ సందర్భంగా సోయాబీన్ పంటకు అప్పుడు చెల్లిస్తున్న (క్వింటాల్కు) మార్కెట్ ధరను రూ. 3,800 నుంచి రూ. 6,000 లకు పెంచాలని కోరారు. కానీ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత దేవేంద్ర ఫడ్నవిస్ కూడా ఏనాడూ వ్యవసాయోత్పత్తుల ధరల పెంపు గురించి మాట్లాడలేదు. కందిపప్పుకు ఉన్న రూ. 5,050 కనీస మద్దతు ధరను కూడా ఈ సంవత్సరం మహారాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా ఇప్పించలేకపోయింది. పైగా ఈ సంవత్సరం కంది ఇతోధికంగా పండింది. కనీస మద్దతు ధర అమలు గురించి మండీల దగ్గర నిరీక్షించి నిరీక్షించి, చివరికి రైతులు రూ. 3,500 (క్వింటాల్కు) కూడా లేకుండా పంటను తెగనమ్ముకున్నారు. విపక్షంలో ఉండగానే రైతు ప్రేమ ఏ రాజకీయ పక్షమైనా సరే, ప్రతిపక్షంలో ఉండగా రైతు సంక్షేమం గురించి గొంతు చించుకుంటుంది. అరచేతిలో స్వర్గం చూపిస్తుంది. అంతే, తరువాత అధికారంలోకి వచ్చాక, ఆర్థిక ప్రాధామ్యాలు కల్పించే వర్గాల జాబితాలో అసలు రైతాంగమే వారి కంటికి కనిపించదు. ఆ పార్టీ, ఈ పార్టీ అని లేదు, ఏడు దశాబ్దాలుగా ఇదే తంతు కొనసాగుతోంది. ఈ డెబ్బయ్ ఏళ్లలో రైతు పరిస్థితి మరీ దిగజారింది. 2016 నాటి ఆర్థిక సర్వే రైతుల గురించి ఏం చెప్పిందో చూద్దాం! దేశంలోని 17 రాష్ట్రాలలో రైతు కుటుంబాల సగటు ఆదాయం రూ. 20,000 కంటే తక్కువే. నిజం చెప్పాలంటే ఒక ఆవును పోషించాలన్నా కూడా సంవత్సరానికి రూ. 20,000 సరిపోవు. ఆ ఆదాయంతో రైతు కుటుంబాలు ఎలా బతుకుతాయో తలచుకోవాలంటేనే నాకు వణుకు పుడుతుంది. వ్యవసాయం పట్ల ప్రభుత్వాలు చూపుతున్న వివక్ష కూడా సుస్పష్టమే. వ్యవసాయ రంగాన్ని దెబ్బ తీసే విధంగా ఆర్థిక విధానాలు ఎలా తయారవుతున్నాయో భారతీయ స్టేట్ బ్యాంక్ అధ్యక్షురాలు అరుంధతీ భట్టాచార్య మాటలలోనే వ్యక్తమైంది. రూ. 36,359 కోట్ల మేరకు ఉత్తరప్రదేశ్ రైతాంగ వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీసుకున్న నిర్ణయం పట్ల అరుంధతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అలా వ్యవసాయ రుణాలను రద్దు చేస్తే రుణ వసూళ్లు అస్తవ్యస్తంగా తయారవుతాయని ఆమె వాపోయారు. కానీ నాలుగు లక్షల కోట్ల భారీ రుణాలతో కష్టాలలో ఉన్న టెలికం కంపెనీలను బయటపడేయాలంటూ ఆమె వాదించినప్పుడు మాత్రం ఈ రుణ వసూళ్ల అస్తవ్యస్త పరిస్థితి గురించి గుర్తుకు రాలేదు. ఇది ద్వంద్వ వైఖరికి ప్రబల నిదర్శనం కాదా? ఆహార ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికే వ్యవసాయోత్పత్తులకు సరైన ధరలు చెల్లించేందుకు నిరాకరిస్తున్నారు. నిజం చెప్పాలంటే, దేశానికి అవసరమైన ఆహార పదార్థాలను పండిస్తున్నందుకు రైతును శిక్షిస్తున్నారు. అది ఎలాగంటారా? 1970–2015 సంవత్సరాల మధ్య గోధుమ సేకరణ ధర కేవలం 19 రెట్లు పెరిగింది. అదేకాలంలో ప్రభుత్వోద్యోగుల మూలవేతనం పెంపు చూడండి! ఆ నలభై ఐదేళ్ల కాలంలో 120 నుంచి 150 రెట్లు పెరిగింది. కళాశాల అధ్యాపకులు, విశ్వవిద్యాలయాల ఆచార్యుల మూలవేతనం చూస్తే 150 నుంచి 170 రెట్లు పెరిగింది. పాఠశాల ఉపాధ్యాయుల మూలవేతనం 280 నుంచి 320 రెట్లు పెరిగింది. ఇవి కాక ఉద్యోగులకు లభిస్తున్న భత్యాలు 108 ఉన్నాయి. రైతుకు మాత్రం ఒక్క భత్యం కూడా అందదు. అంటే రైతుకు వ్యతిరేకంగానే మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది. అయినా రైతుకు అంతుపట్టని వాస్తవం ఒకటి ఉంది. అది– అతడు పంటను మాత్రమే పండించడం లేదు. వాస్తవంగా నష్టాలను కూడా పండించుకుంటున్నాడు. తక్కువ దిగుబడులే వ్యవసాయ సంక్షోభానికి కారణమని ఆర్థికవేత్తలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నప్పటికీ వాస్తవాలేమిటో రైతులకు తెలుసు. రుణభారం పెరగడంతో రైతుల బలవన్మరణాలు పెరిగాయి. గడచిన 21 ఏళ్లలో దాదాపు 3.18 లక్షల మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. అంటే ప్రతి 41 నిమిషాలకు ఒక రైతు ఆత్మహత్యకు పాల్ప డుతున్నాడు. ఈ మరణాలను ఒక బలహీనతగా చిత్రించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఒకటి నిజం. వ్యవసాయ రంగంలో జరుగుతున్న ప్రతి ఒక్క బలవన్మరణం కూడా రైతులలో, వారి కుటుంబాలలో ఆగ్రహావేశాలను ప్రోది చేస్తోంది. వారిని భగ్గుమనేటట్టు చేస్తోంది. ఒక్కసారి రైతు ఆగ్రహిస్తే భారత రాజకీయాల స్వరూప స్వభావాలే మారిపోతాయన్న విషయం రాజకీయ వేత్తలకు తెలియడం లేదు. కీలెరిగి వాత మహారాష్ట్రలో రైతులు మూడంటే మూడు రోజుల పాటు నగరాలకు, పట్టణాలకు కూరగాయలు, పాలు సరఫరా కాకుండా దిగ్బంధనం చేశారు. దానితో వారి ఆగ్రహం ఎలాంటిదో జాతీయ స్థాయిలో పతాకశీర్షికలలో దర్శనమిచ్చింది. గతంలో మాదిరిగా రైతు సమస్యను గురించి వెల్లడించడానికి జాతీయ రహదారులు దిగ్బంధనం చేయడం, రైలు పట్టాల మీద బైఠాయించడం కాకుండా మహారాష్ట్రలో రైతు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న కిసాన్ క్రాంతి సంస్థ కొత్త వ్యూహం పన్నింది. పట్టణాలకు, నగరాలకు వెల్లువెత్తే పాలు, కూరగాయలను నిలిపివేసింది. వారి సమస్యను గురించి లోకం దృష్టికి తేవడానికి ఇదే సరైన విధానం. అది పనిచేసింది కూడా. మధ్యప్రదేశ్లో కూడా విద్యావంతులైన కొందరు యువ కర్షకులు ఆమ్ కిసాన్ యూనియన్ నాయకత్వంలో తమ సమస్య గురించి అందరికీ తెలిసేటట్టు చేయడంలో విజయం సాధించారు. నేను మూడు దశాబ్దాల నుంచి రైతాంగ ఉద్యమాలను పరిశీలిస్తున్నాను. ఒక పెద్ద నిరసన ప్రదర్శన నిర్వహించిన తరువాత రైతు ఉద్యమం కాస్తా విచ్ఛిన్నమవడం కనిపిస్తుంది. వ్యక్తిగత భేషజాలు, సిద్ధాంతాలు, రాజకీయ అభిప్రాయాలు రైతు నేతల మధ్య తంపులు పెడుతున్నాయి. వారిలో వారు కలహించుకునేటట్టు చేస్తున్నాయి. దానితో రాజకీయాలు ప్రవేశిస్తాయి. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ సరిగ్గా ఇదే విషయాన్ని అర్థమయ్యేటట్టు చెప్పారనిపిస్తుంది. తనను కలుసుకోవడానికి వచ్చిన రైతు ప్రతినిధుల బృందంతో ఆయన ఈ విషయం చెప్పారు. ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా రైతాంగాన్ని ఓటు బ్యాంకుగా ఎందుకు పరిగణించదో తెలుసా అని బాదల్ వారిని ప్రశ్నించారు. దానికి ఆయనే సమాధానం కూడా చెప్పారు, ఎందుకంటే రైతాంగం చీలికలు పేలికలుగా విడవడి ఉంది అని. రైతులంతా ఒక జాట్ కులస్తునిగానో, ఒక సిక్కు మతస్తునిగానో లేదా మరాఠీగానో తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అంతేతప్ప, తాను ఒక రైతునన్న స్పృహతో వారు ఓటు వేయరు. దేశ జనాభాలో 52 లేదా 60 శాతం ఉన్న రైతాంగంలో ప్రతి ఒక్కరూ ఇంతే. తాను ఒక రైతునన్న ఎరుకతో ఓటు హక్కును వినియోగించుకోరు. అయితే ఈ మధ్య విద్యావంతులైన యువ రైతులు నాయకత్వ స్థానంలోకి రావడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగి స్తోంది. ఇదే విధంగా దేశవ్యాప్తంగా జరుగుతోంది. తమ పెద్దల వలెనే వారు కూడా పాత పద్ధతులలో పడిపోకుండా ముందుకు సాగుతామని హామీ పడాలి. ఒక కొత్త నాయకత్వం కోసం రైతాంగం కూడా ఆశగా ఎదురుచూస్తోంది. అలాంటి నాయకుడి పట్ల వారు విశ్వాసం పెంచుకోగలరు కూడా. రైతుకూ ఇవ్వాలి భత్యం మళ్లీ విషయానికి వద్దాం. రైతు రుణాల రద్దు నిశ్చయంగా న్యాయమైనదే. నాలుగు లక్షల కోట్లతో పీకల్లోతు కష్టాలలో ఉన్న టెలికం కంపెనీలను రక్షించడానికి ఆలోచిస్తున్న భారతీయ స్టేట్ బ్యాంక్, లక్షలాది మంది రైతుల రుణ భారాన్ని తగ్గించేందుకు ఎందుకు సందేహించాలో నాకు బోధపడదు. రుణాల రద్దు డిమాండ్తో పాటు వీటి గురించి కూడా ఆలోచించాలి. కనీస మద్దతు ధరతోనే రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు గృహ, వైద్య, విద్య, రవాణా భత్యాలను ఇవ్వాలి. ప్రస్తుతం కనీస మద్దతు ధర పరిధిలో ఉత్పత్తి వ్యయం మాత్రమే ఉంది. శాంతకుమార్ సంఘం ఇచ్చిన నివేదిక ప్రకారం కనీస మద్దతు ధర విధానంతో లబ్ధి పొందుతున్న రైతాంగం ఆరు శాతమే. కాబట్టి రాష్ట్ర రైతాంగ ఆదాయ కమిషన్ ఏర్పాటు చేసి, నెలకు కనీసం రైతు కుటుంబం ఒక్కంటికి రూ. 18,000 చెల్లించే ఏర్పాటు చేయాలి. అలాగే కనీస మద్దతు ధర విధానం పరిధిలో ఉన్న 24 పంటలను రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయాలి. నిజానికి ప్రస్తుతం గోధుమ, వరిలను మాత్రమే కనీస మద్దతు ధర విధానం మేరకు సేకరిస్తున్నారు. రుణభారం మిగలని రీతిలోనే రైతు రుణాల రద్దు విధానం అమలు జరగాలి. - దేవిందర్శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు hunger55@gmail.com -
మార్కెట్లే మరణ మృదంగాలు
విశ్లేషణ కార్పొరేట్ సంస్థలకు భారీ ఎత్తున పన్ను రాయితీలు ఇస్తారు. గడచిన మూడేళ్లలో అంటే 2013–2016 సంవత్సరాలలో ఇచ్చిన ఆ రాయితీ రూ. 17.15 లక్షల కోట్లు. అలాగే కార్పొరేట్ సంస్థను ఏర్పాటు చేస్తే భూమి ఉచితంగా ఇవ్వడం రివాజుగా జరుగుతూ ఉంటుంది. తక్కువ ధరకు విద్యుత్, నీరు సరఫరా చేస్తామని హామీ ఇవ్వడమే కాకుండా, ఆదాయ పన్ను హాలిడేను కూడా ప్రకటించడం చూస్తూ ఉంటాను. అయినా కావాలని పన్ను ఎగ్గొట్టే వారి జాబితా అలా కొల్లేరు చేంతాడంత ఎందుకు పెరిగిపోతుందో మాత్రం నాకు అర్థం కాదు. గిట్టుబాటు ధర లేక తీవ్ర నిరాశా నిస్పృహలలో కొట్టుమిట్టాడుతున్న రైతాంగానికి కాస్త ఉపశమనం కలిగించమని లోక్సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే ఇటీవల ప్రభుత్వాన్ని కోరారు. కందిపప్పుకు కనీస మద్దతు ధర మీద రూ. 1,000 బోనస్గా ప్రకటించాలని కోరిన సందర్భంలో ఖర్గే కేంద్రానికి ఆ మేరకు విజ్ఞప్తి చేశారు. రెండేళ్ల వరుస దుర్భిక్షాల అనంతరం, 2016లో అనుకూల వాతావరణం ఏర్పడడంతో రైతుల ముఖాలలో కొంచెం ఆనందం కనిపిస్తుందని భావించారు. సేకరణ ధర పెరుగుతుందన్న హామీతో రైతులు కూడా కష్టపడి అధిక దిగుబడిని సాధించారు. కానీ అధిక దిగుబడి సాధించిన ఆనందం కూడా ఎంతోసేపు నిలువలేదు. బహిరంగ విపణిలో కందిపప్పు ధర పతనం కావడమే ఇందుకు కారణం. కనీస మద్దతు ధర హామీ కూడా వారి ధైర్యాన్ని కలిగించలేకపోయింది. క్వింటాల్ ఒక్కంటికి ప్రకటించిన కనీస మద్దతు ధర రూ. 5,050. కానీ దేశవ్యాప్తంగా రైతులకు దక్కినది మాత్రం క్వింటాల్కు రూ. 4,200 మాత్రమే. అదికూడా మండీల ముందు పదిరోజులు పడిగాపులు పడిన తరువాత కోత కోసిన ఈ ధర లభిస్తున్నది. ప్రకటించిన మద్దతు ధర కూడా రాదు క్వింటాల్ కందిపప్పు ఉత్పత్తికి స్థానికంగా అయిన వ్యయం రూ. 6,403 అని కర్ణాటక వ్యవసాయోత్పత్తుల ధర కమిషన్ చెప్పింది. అంటే రైతులు పెట్టిన పెట్టుబడి కంటే దాదాపు రెండువేల రూపాయలు తక్కువగానే రైతులు పొందుతున్నారు. ఖర్గే మరో సంగతి కూడా చెప్పారు. గోరు చుట్టు మీద రోకటి పోటులా ఈ సంవత్సరం ప్రభుత్వం 27.86 లక్షల టన్నుల కందిపప్పును, క్వింటాల్ ధర రూ. 10,114 వంతున దిగుమతి చేసుకుంది (గడచిన ఏడాది 57 లక్షల టన్నులు దిగుమతి చేశారు). అందుకే, కందిపప్పు దిగుమతికి ఏ ధర చెల్లించారో, అదే ధరను ఇక్కడి రైతుల నుంచి సేకరించినప్పుడు కూడా చెల్లించాలని ఖర్గే ప్రభుత్వాన్ని కోరారు. ఒక్క కందిపప్పు విషయమే కాదు, అన్ని అపరాల పంటల పరిస్థితీ ఇలాగే ఉంది. పెసర, మినుము ఉత్పత్తుల విషయంలో కూడా రైతులు నిరాశాజనకమైన పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. అపరాల దుస్థితినే ఆవపంట కూడా ఎదుర్కొంటున్నది. అనుకూల వాతావరణంతో పాటు, సాగు విస్తీర్ణం కూడా పెరగడంతో ఈ సంవత్సరం ఆవపంట దిగుబడి బాగా పెరిగింది. దీనికి కనీస మద్దతు ధరను రూ. 3,700 (క్వింటాల్ ఒక్కంటికి) నిర్ణయించినా, రైతుకు రూ. 3,500 దక్కడం కూడా గగనమైపోయింది. ఆగ్రహించిన రైతన్న తాను పండించిన టొమేటో, బంగాళదుంప, ఉల్లి పంటలను రోడ్డు మీదకు విసిరివేస్తున్న సంగతిని నివేదిస్తూ దేశం నలుమూలల నుంచి వార్తా కథనాలు వెలువడుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఎండుమిర్చి రైతులు కూడా అదేబాటలో ప్రయాణిస్తున్నారు. మిర్చి యార్డుల దగ్గర ఉత్పత్తులను దగ్ధం చేస్తున్నారు. పంట చేతికొస్తుంది, ధర పడిపోతుంది... వ్యవసాయోత్పత్తుల ధరల పతనాన్ని పరిశీలిస్తే ప్రతి ఏటా జరిగే ఈ తంతు ఒక అంకెల గారడీని మరిపిస్తూ ఉంటుంది. గడచిన సంవత్సరపు వార్తాపత్రికలను లేదా గూగుల్లో అన్వేషించినా ఒక విషయం బోధపడుతుంది. అటు పంట రైతు చేతికి రావడం, ఇటు వాటి ధర పతనం కావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇలా ధరలు పతనం కావడం లక్షలాది రైతు కుటుంబాల జీవనోపాధి భద్రతకు దారుణంగా తూట్లు పొడుస్తుందన్న సంగతిని గమనించడం లేదు. రైతులనూ, వారి కుటుంబాలనూ ఆ పరిణామం ఎంత కుంగదీస్తుందో గ్రహించడం లేదు. అసలు ఈ విషయం గురించి ఎవరూ మాట్లాడరు కూడా. వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న ఈ దుస్థితికీ, అడ్డూ ఆపూ లేకుండా సాగుతున్న రైతుల ఆత్మహత్యలకు మూలం మార్కెట్ల వైఫల్యంలోనే ఉంది. కొద్దిరోజుల క్రితం మహారాష్ట్రలోని లాతూర్లో ఒక విషాదఘట్టం చోటు చేసుకుంది. షీతల్ యాంకత్ అనే 21 సంవత్సరాల యువతి తమ పొలాల మధ్యలోనే ఉన్న బావిలో దూకి బలవన్మరణం పాలైంది. తన తండ్రి మీద మరింత రుణభారం మోపడం ఇష్టలేకనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆమె రాసిపెట్టింది. రెండేళ్ల నుంచి కరువు. పంటలు చేతికి రాలేదు. ఇప్పుడు గిట్టుబాటు ధరలు లేవు. కాబట్టి తండ్రిని మరింత రుణగ్రస్థుడిని చేయడం ఇష్టంలేకనే తాను తనువు చాలించింది. అప్పులిచ్చేవారు ఆమె వివాహానికి మరింత రుణం ఇవ్వడానికి వెనుకాడారు. దానితో రెండేళ్లుగా ఆమె వివాహం వాయిదా పడుతోంది. అప్పు తెచ్చి తన పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు కాళ్లరిగేలా ఎలా తిరుగుతున్నారో ఆమె చూసింది. తన పెళ్లి ద్వారా తండ్రి ¯ð త్తిన మరింత రుణభారం పడకుండా ఆమె ఆత్మహత్యను ఎంచుకుంది. ఇక్కడ నా సందేహం ఒక్కటే. వ్యవసాయరంగం కేంద్రంగా సాగుతున్న ఇలాంటి దారుణ విషాదాలు, కలచివేసే దుర్ఘటనలు పెద్ద పెద్ద ఆర్థికవేత్తలు, విధాన రూపకర్తల దృష్టికి రావా? పంట చేతికి రాగానే ధరలు పడిపోవడం, తాము ప్రకటించిన కనీస మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వాలు హామీ ఇవ్వకపోవడం వంటి పరిణామాల కారణంగానే మరింత నిరాశా నిస్పృహలలో కూరుకుపోతున్నారు. ఎప్పటికీ బయటపడలేని సాలెగూడు వంటి రుణ బంధంలో చిక్కుకుపోతున్నారు. ఒక ఉదాహరణ చూద్దాం. సర్వశక్తులు ఒడ్డి రైతు మూడు మాసాలు శ్రమించి టొమేటో పంటను పండిస్తాడు. పంట చేతికి వచ్చే సమయానికి కిలోకు ముప్పయ్ నుంచి యాభయ్ పైసలకు ధర పడిపోతోంది. అయితే టొమేటో రైతును ఆదుకునేందుకు ప్రభుత్వాలు ఏనాడూ చొరవ చూపడం లేదు. ఇప్పుడు రూ. 500 కోట్లతో ఏర్పాటు చేసిన ధరల స్థిరీకరణ నిధి గురించి మనకు గుర్తుకు వస్తుంది. దాని గురించి మనం విన్నాం. కానీ ఆ నిధిని ఏర్పాటు చేసినది వినియోగదారులకు సాయపడేందుకే. రైతులను ఆదుకునే ఉద్దేశంతో కాదు. ప్రతి ఏటా పెరిగిపోతున్న ఆ అప్పుల్లోనే కూరుకుపొమ్మన్నట్టుగా పేద రైతును విస్మరించారు. ఉత్తరప్రదేశ్ ఆదర్శంగా... పంజాబ్లో 98 శాతం గ్రామీణ ప్రాంత కుటుంబాలు రుణ బాధను అనుభవిస్తున్నాయి. ఇందులో 94 శాతం కుటుంబాలలో తెచ్చిన రుణం ఎక్కువ. వారికి లభిస్తున్న ఆదాయం తక్కువ. వీరి ఖర్చులు కూడా ఎక్కువే. ఇంకోమాటలో చెప్పాలంటే వ్యవసాయ రంగాన్ని అలుముకున్న ఈ నిరాశానిస్పృహలు మార్కెట్ ప్రేరేపిత పరిణామమే. మార్కెట్ల వైఫల్యం రైతులను మరింతగా అప్పుల్లో ముంచుతున్నది. దీని ఫలితమే వ్యవసాయ రుణాల మాఫీ గురించి మరింత గట్టిగా అడుగుతున్నారు. అందుకే ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే రూ. 36,359 కోట్లు రుణ మాఫీ చేసింది. దీనితో 92 లక్షల చిన్నకారు రైతులు తెరిపిన పడ్డారు. ఇది మంచి రాజకీయం మాత్రమే కాదు. మంచి అర్థశాస్త్రం కూడా. ఒక్కసారి ఆలోచించండి! లక్ష రూపాయల వరకు రుణ మాఫీ చేస్తే ఎన్ని కుటుంబాలలో ఆడపిల్లలు తమ వివాహం పట్ల నమ్మకం ఏర్పరుచుకోగలుగుతారు? ఇదే పెద్ద మొత్తం కాదు. కానీ నిరంతరం రుణాల ఊబిలో కూరుకుపోయిన వారిని అడిగితే దాని విలువ తెలుస్తుంది. ఉత్తరప్రదేశ్ను ఆదర్శంగా తీసుకుని చాలా రాష్ట్రాలు రైతుల రుణాలను మాఫీ చేయవచ్చు. ఆర్థికవేత్తలు, బిజినెస్ పత్రికలు ఈ రుణమాఫీ చర్య పట్ల కన్నెర్ర చేస్తున్నారు. విదేశీ బ్రోకరేజీ సంస్థ మెరిల్ లించ్ మరో అడుగు ముందుకు వేసి 2019 ఎన్నికల నాటికి రైతుల రుణమాఫీ భారం మొత్తం దేశ స్థూల జాతీయోత్పత్తిలో రెండు శాతానికి చేరుకుంటుందని అంచనా కట్టవచ్చు. అయితే కార్పొరేట్ రుణాలను మాఫీ చేయడం ద్వారా స్థూల జాతీయోత్పత్తి మీద పడిన భారం గురించి మెరిల్ లించ్ ఎప్పుడూ ఎందుకు అంచనా కట్టదో నాకు అర్థం కాదు. నిజానికి భారత్లో కార్పొరేట్ రుణ మాఫీ భవిష్యత్తులో దాదాపు 4 లక్షల కోట్ల వరకు ఉంటుంది. అది దేశ స్థూల జాతీయోత్పత్తిలో ఎంత శాతం? రైతు రుణమాఫీపై గగ్గోలు కార్పొరేట్ సంస్థలకు భారీ ఎత్తున పన్ను రాయితీలు ఇస్తారు. గడచిన మూడేళ్లలో అంటే 2013–2016 సంవత్సరాలలో ఇచ్చిన ఆ రాయితీ రూ. 17.15 లక్షల కోట్లు. అలాగే కార్పొరేట్ సంస్థను ఏర్పాటు చేస్తే భూమిని ఉచితంగా ఇవ్వడం రివాజుగా జరుగుతూ ఉంటుంది. తక్కువ ధరకు విద్యుత్, నీరు సరఫరా చేస్తామని హామీ ఇవ్వడమే కాకుండా, ఆదాయ పన్ను హాలిడేను కూడా ప్రకటించడం చూస్తూ ఉంటాను. అయినా కావాలని పన్ను ఎగ్గొట్టే వారి జాబితా అలా కొల్లేరు చేంతాడంత ఎందుకు పెరిగిపోతుందో మాత్రం నాకు అర్థం కాదు. ‘ఇండియా స్పెండ్’ అనే సంస్థ లెక్కల ప్రకారం కావాలని పన్ను ఎగ్గొట్టిన 5,275 మంది బ్యాంకులకు బకాయి పడిన మొత్తం రూ. 56,521 కోట్లు. గడచిన పదమూడు సంవత్సరాలలో ఇలాంటి బకాయిలు 9 రెట్లు పెరిగాయి. కానీ ఈ వాస్తవం ఆర్థికవేత్తలు గాని, మెరిల్ లించ్ గాని మనకి వెల్లడించదు. దీనితో స్థూల జాతీయోత్పత్తిలో పడే భారం ఎంతో వెల్లడించదు. నాకు తెలిసి ఏ వ్యక్తి వ్యాపారం ప్రాణాంతక స్థితికి చేరే స్థాయిలో దివాళా తీయదు. వ్యాపార వర్గాల జీవన విధానం కూడా విలాసవంతంగా సాగుతూనే ఉంటుంది. కానీ రైతుల రుణ మాఫీ జరిగినప్పుడు మాత్రం ఎక్కడ లేని నిట్టూర్పులు వెలువడుతూ ఉంటాయి. వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు దేవిందర్శర్మ ఈ మెయిల్ : hunger55@gmail.com -
రైతు ఉద్ధరణ అంటే ఇదేనా?
విశ్లేషణ కార్పొరేట్ల భారీ రుణాల మాఫీ ఆర్థికంగా అర్థవంతమైన చర్య అని సమర్థిస్తారు. రైతుల రుణ మాఫీ మాత్రం తప్పుడు ఆర్థిక విధానమని, రుణ క్రమశిక్షణారాహిత్యమని అంటారు. కానీ బ్యాంకుల మొత్తం మొండి బకాయిలలో ఒక శాతమే రైతులు బకాయిపడ్డది. మన వ్యవ సాయ పరపతి విధానమే రైతు వ్యతిరేకమైనది. రైతులకు, గ్రామీణ పేదలకు నష్టాన్ని కలుగజేస్తూ సంపన్నులకు మేలును చేకూర్చేలా దాన్ని రూపొందించారు. రైతులను పేదరికంలో ఉంచేయాలని చేస్తున్న ఉద్దేశపూర్వక ప్రయత్నాలలో భాగమే ఇది. అలహాబాద్ సమీపంలోని సనంద్లో నానో కార్ల కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి గుజరాత్ ప్రభుత్వం టాటాలకు రూ. 558.58 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. ఇంత భారీ మొత్తాన్ని 0.1 శాతం వడ్డీకి 20 ఏళ్లలో తిరిగి చెల్లించే ప్రాతిపదికపై ఇచ్చామని ప్రభుత్వమే తెలిపింది. మరో విధంగా చెప్పాలంటే, తిరిగి చెల్లించాల్సింది 20 ఏళ్ల కాలంలో కాబట్టి దాదాపు వడ్డీ ఏమీ లేకుండానే ఇంత భారీ దీర్ఘకాలిక రుణాన్ని ఇచ్చినట్టు లెక్క. పంజాబ్ ప్రభుత్వం భటిండాలో ఎరువుల కర్మాగారాన్ని స్థాపించడానికి ఉక్కు పరిశ్రమ కుబేరుడు లక్ష్మీ నారాయణ్ మిట్టల్కు రూ. 1,200 కోట్ల రుణాన్ని ఇస్తున్నట్టు వార్తా నివేదికలను బట్టి తెలుస్తోంది. ఆయనకు సైతం ఈ రుణం 0.1 శాతం వడ్డీకే లభించింది. సంపన్నులసేవే బ్యాంకుల విధానమా? మరోవైపున ఈ పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. ఒక గ్రామంలోని పేదలలోకెల్లా కడు పేదరాలైన ఓ మహిళకు మేకను కొనుక్కోవాలనే కోరిక ఉంది. కాబట్టి ఆమె ఏదైనా ఓ మైక్రో–ఫైనాన్స్ సంస్థ(ఎమ్ఎఫ్ఐ)ను ఆశ్ర యిస్తుంది. అది, 24 నుంచి 36 శాతం లేదా అంతకంటే ఎక్కువ వడ్డీ రేటుకు ఆమెకు రూ. 5,000 రుణాన్ని ఇస్తుంది. ఈ స్వల్ప మొత్తాన్ని ఆమె వారం వారం వాయిదాలలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. మేకను పెంచుకోవడానికి ఆ పేదరాలికి ఇచ్చే రూ. 5000 రుణాన్ని... టాటాలకు ఇచ్చినట్టే 0.1 శాతం వడ్డీకి, 20 ఏళ్లలో కాకున్నా ఐదేళ్లలో తిరిగి చెల్లించే ప్రాతిపదికపై ఇస్తే.. ఏడాది చివరికి ఆమె ఓ నానో కారును నడుపుతుంటుందని మీరూ నిస్సందే హంగా అంగీకరిస్తారు. ఎంతైనా ఆ పేదరాలు కూడా ఓ చిన్న వ్యాపారవేత్తే కదా! ఆమె తన జీవితంలోని ఈ మలి దశలో మనుగడ సాగించడానికి ఓ మేకను పెంచుకుంటే, అదిచ్చే పాలు అమ్ముకుని బతుకుతుంది. బ్యాంకులు ఇలాంటి కనికరంతో దన్నుగా నిలిస్తే కోట్లాదిమందికి సుస్థిరమైన జీవనో పాధికి హామీని ఇస్తుంది. లేదంటే ఒక రైతు ఉదాహరణనే తీసుకోండి. అతను 12 శాతం వడ్డీ రేటుకు రుణం తీసుకొని ట్రాక్టర్ కొనుక్కోవాలి. అదే టాటా అయితే మెర్సి డెజ్ బెంజ్ లగ్జరీ కారును కేవలం 7 శాతం వడ్డీ రేటు రుణంతోనే కొనుక్కో గలడు. ట్రాక్టర్, రైతు పంటలు పండించే సామర్థ్యాన్ని ఇనుమడింపజేసి, తద్వారా రాబడిని పెంపొందింపజేసే సాంకేతిక పరిజ్ఞానం. రైతు ఉత్పాదక సామర్థ్యంతో పాటూ రాబడిని కూడా పెంపొందింపజేయడానికి తోడ్పడేదిగా ట్రాక్టర్ పోషించే పాత్ర నిర్వివాదమైనది. సాగుబడి అనే రైతు జీవనోపాధిని సుస్థిరం చేయడానికి తోడ్పడే పనిముట్టు ట్రాక్టర్. కానీ మెర్సిడెజ్ బెంజ్ కారు సంపన్నుల హోదాకు సంకేతంగానే ఎక్కువగా ఉపయోగపడేది. అలాంటి దాని కోసం వాళ్లు ఎక్కువ చెల్లించగలుగుతారు. పేదలపై ఎక్కువ భారాన్ని మోపుతూ సంపన్నులకు అంత కారు చౌకగా రుణాలను అందించేదిగా బ్యాంకింగ్ వ్యవస్థను ఎందుకు రూపొందించారా అని నాకు ఆశ్చర్యం కలుగు తుంటుంది. పేదల పట్ల చూపుతున్న ఈ ఘోర వివక్ష ఇక్కడితో ముగిసిపోదు. ప్రభుత్వరంగ బ్యాంకులన్నిటి మొండి బకాయిలు లేదా క్రియాశీలంగా లేని ఆస్తుల (ఎన్పీఏలు) విలువ రూ. 6.8 లక్షల కోట్లని పార్లమెంటు ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) అంచనా. ఇందులో 70 శాతం కార్పొరేట్ సంస్థలు చెల్లించని రుణాలుకాగా, కేవలం 1 శాతం మాత్రమే రైతులు చెల్లించనివి. కార్పొరేట్ రంగంలోని మొండి బకాయిలను రద్దు చేస్తామని ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యం ఇప్పటికే ప్రకటించారు. ఇలా కార్పొరేట్ రుణాలను మాఫీ చేయడాన్ని ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం లేదా పక్షపాతం అంటూ ఎంతటి గగ్గోలు రేగినా గానీ... కార్పొరేట్ సంస్థల మొండి బకాయిలను రద్దు చేయాల్సినవిగానే పెట్టుబడిదారీ విధానం రూపొందిందని ఆయన చెప్పారు. రూ. 4 లక్షల కోట్ల ఎన్పీఏలను రద్దు చేస్తారని ‘ఇండియా రేటింగ్స్’ సంస్థ అంచనా కట్టింది. మరో విధంగా చెప్పాలంటే, ప్రధాన ఆర్థిక సలహా దారు చెప్పే మాటలను విశ్వసించేట్టయితే అంత భారీ రుణాలను మాఫీ చేసేయడం ఆర్థికంగా అర్థ వంతమైన చర్యే అవుతుంది. కానీ, రైతులు బకాయిపడ్డ రుణాలను మాఫీ చేయడం తప్పుడు ఆర్థిక విధానమనీ, అది రుణపరమైన క్రమశిక్షణా రాహిత్యానికి దారితీస్తుందనీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ శ్రీమతి అరుంధతి భట్టాచార్య మరోవంక వాపోతు న్నారు. ఇంతాచేసి మొత్తం ఎన్పీఏలలో (మొండి బకాయిలలో) ఒక శాతం మాత్రమే రైతులు బకాయిపడ్డవి. బడ్జెట్లోనూ బడుగు రైతుకు రిక్తహస్తమే ఏటా వ్యవసాయ రంగానికి ఇచ్చే రుణంలో చాలా వరకు అగ్రిబిజినెస్ సంస్థలకు లబ్ధి చేకూర్చడానికే పోతుంది. 2017 బడ్జెట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యవసాయ రుణం రూ. 10 లక్షల కోట్లని ప్రకటించారు. వ్యవ సాయ రుణం కోసం ఇంత భారీ మొత్తాన్ని కేటాయించే ప్రభుత్వం ఎంతగా రైతుల కోసం ఆలోచిస్తున్నదోనని అనిపిస్తుంది. కానీ ఇందులోంచి అసలు చిన్న రైతులకు అందేది వాస్తవానికి 8 శాతం మాత్రమే. మొత్తం రైతులలో చిన్న రైతులు దాదాపు 83 శాతం. రూ. 10 లక్షల కోట్ల వ్యవసాయ రుణంలో దాదాపు 75 శాతం పరపతిని అగ్రిబిజినెస్ కంపెనీలు, బడా రైతులు ప్రభుత్వ సహాయంతో 3 శాతం వడ్డీ రేటుకే పొందుతారు. కాలక్రమేణా వ్యవసాయ రుణం అంటే ఏమిటనే నిర్వచనం విస్తరిస్తూపోయి గిడ్డంగుల కంపెనీలు, వ్యవసాయ ఉపకరణాల తయారీ సంస్థలు, ఇతర అగ్రిబిజినెస్ సంస్థలు అన్నీ అందులోకి చేరాయి. రైతుల పట్ల బ్యాంకులు చూపుతున్న ఈ ఉదాసీన వైఖరి కారణంగానే ఇటీవలి ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికల్లో రైతుల రుణ మాఫీ వాగ్దానం అంతటి వివాదాస్పద అంశంగా మారింది. ఉత్తరప్రదేశ్లో రైతుల రుణాలను మాఫీ చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వాగ్దానం చేశారు. కాబట్టి ఉత్తరప్రదేశ్ రైతు రుణ మాఫీ ఆర్థిక భారం బాధ్యతను కేంద్రమే తీసుకుం టుందని ఇప్పటికే కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రక టించింది. కాగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పంజాబ్లో ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి మన్ప్రీత్ బాదల్... రైతు రుణ మాఫీ ఆర్థిక భారాన్ని మోయడానికి ఒక వినూత్న మార్గాన్ని ఆవిష్కరించారు. రైతుల రుణ బకాయిలను ప్రభు త్వం ‘స్వాధీనం చేసుకుంటుంద’ని, రైతుల బకాయిలను ప్రభుత్వం తిరిగి చెల్లించడానికి బ్యాంకులతో దీర్ఘకాలిక ఒప్పందాన్ని కుదుర్చుకుంటుందనీ తెలిపారు. రైతు రుణ మాఫీలోనూ అసంబద్ధతే పంజాబ్లో రైతులు బకాయిపడ్డ మొండి రుణాలు దాదాపు రూ. 35,000 కోట్లని అంచనా. ఉత్తరప్రదేశ్లో రెండు హెక్టార్ల కంటే తక్కువ భూమికి యజ మానులైన రైతుల బకాయిల మాఫీ మొత్తం రూ. 36,000 కోట్ల వరకు ఉంటుంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి రైతు రుణ మాఫీకి అయ్యే ఖర్చును తిరిగి చెల్లించడానికి కేంద్రం అంగీకరించినప్పుడు అదే పనిని ఇతర రాష్ట్రాల విషయంలో అది ఎందుకు చేయకూడదు? అని ప్రశ్నిస్తున్నారు. ఉదాహర ణకు, మహారాష్ట్ర ప్రభుత్వం రైతు రుణ మాఫీ కోసం రూ. 30,500 కోట్లు అడుగుతోంది. 2009 నుంచి ఆ రాష్ట్రంలో 23,000 మంది రైతులు ఆత్మహత్య లకు పాల్పడ్డారని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మహారాష్ట్ర శాసనసభకు తెలిపారు. తమిళనాడు వరుసగా మూడో ఏడాది వర్షాభావ పరిస్థితులను ఎదు ర్కొంటున్నది. ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడే కరువు నెలకొన్నదని ప్రకటిం చింది. రైతులు ఎకరాకు రూ. 25,000 పరిహారాన్ని చెల్లించాలని కోరు తున్నారు. ఇదిలా వుండగా, ఒడిశాలో కూడా రైతు ఆత్మహత్యల పెరుగుదల పుంజుకుంది. ఈశాన్యంలో రైతు ఆత్మహత్యల సంఖ్య గత కొన్నేళ్లతో పోలిస్తే నాలుగు రెట్లు పెరిగింది. రైతు మెడకు పేదరికం ఉచ్చు రైతులను పేదరికంలో ఉంచేయడానికి ఉద్దేశపూర్వక ప్రయత్నాలు జరుగు తుండటమే దేశవ్యాప్తంగా నెలకొని ఉన్న భయానకమైన వ్యవసాయ సంక్షో భానికి ప్రాథమిక కారణం. దురదృష్టవశాత్తూ ఆ విషయాన్ని ఎవరూ పెద్దగా గ్రహించడం లేదు. రైతుల ఉత్పత్తులకు మంచి ధరలను చెల్లించకపోవడం మాత్రమే కాదు, రైతులకు గ్రామీణ పేదలకు నష్టాన్ని కలుగజేస్తూ సంపన్ను లకు మేలును చేకూర్చేలా పరపతి విధానాన్నే తప్పుడు పద్ధతిలో రూపొం దించారు. కానీ బ్యాంకులు తమ తప్పును అంగీకరించి, వాటి పరపతి విధానాలను తిరిగి రూపొందిస్తాయా? నాకైతే ఆ విషయంలో తీవ్ర అనుమా నాలే ఉన్నాయి. వృద్ధికి ప్రోత్సాహం పేరిట సంపన్నవంతులైన కార్పొరేట్ అధిపతులు ప్రభుత్వం నుంచి పన్ను రాయితీలను, భారీ సబ్సీడీలను పొందు తూనే ఉంటారు. వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు దేవిందర్శర్మ ఈమెయిల్ : hunger55@gmail.com -
కర్షకుడే కదా కారుచౌక!
విశ్లేషణ కారణాలు ఏమైనా కావచ్చు, చేతులు కాలేది మాత్రం రైతులకే. న్యూఢిల్లీలో అజాద్పూర్ లోని ఏపీఎంసీ మార్కెట్ పరిస్థితి కూడా సరిగ్గా ఇలాగే ఉంది. ఎంతమాత్రం గిట్టుబాటు కాని ధరలకే రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకుని బాధాతప్త హృదయంతో తిరిగి పోవలసి వస్తున్నది. ఇది ఒక్క కూరగాయల రైతులు మాత్రమే ఎదుర్కొంటున్న పరిస్థితి కాదు. ఇండోర్లో పూల ధరలు దారుణంగా పడిపోయాయి. ‘ఇండియా స్పెండ్’ పూల సాగు రైతు చెప్పిన మాటలను ఉటంకించింది కూడా. 2016 సంవత్సరం చరిత్రపుటలలోకి నిష్క్రమిస్తున్న క్షణాలివి. ఈ సమ యంలో నేను కచ్చితంగా చెప్పగలిగేదొకటే. ఈ సంవత్సరం రైతులకీ, రైతు కూలీలకీ; మొత్తంగా వ్యవసాయ రంగానికి ఓ పీడకలగా గుర్తుండిపోతుంది. ఏడాది మధ్యలో రుతుపవనాలు వచ్చినప్పుడు దుర్భిక్ష ప్రాంతాలలో కాసిన్ని జల్లులు పడి ఉపశమనం కలిగించాయి. ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. రబీ సాగుకు విత్తనాలు చల్లవలసిన సమయంలో రుతుపవనాలు వెనక్కి పోయాయి. అప్పుడే అత్యంత అసహజమైన నోట్ల రద్దు పిడుగుపాటులా పరిణమించింది. ఏ విధంగా చూసినా 2016 రైతులకీ, రైతు కూలీలకీ విపత్కర సంవత్సరమే. నోట్ల రద్దు ఒక ముష్టిఘాతం. మరీ ముఖ్యంగా దేశ నలుమూలలకూ చెందిన రైతాంగానికి పలు కోణాల నుంచి ఈ చర్య కోలుకోలేని దెబ్బ. రెండేళ్ల కరువుకాటకాలను అ«ధిగమించి నిలదొక్కుకుంటున్న సమయంలో ఇలాంటి దెబ్బ తగలడమే విచారకరం. దీని నుంచి కోలుకోవడానికి మళ్లీ రెండేళ్లకు తక్కువకాకుండా సమయం పడుతుంది. యాభై రోజులలో వ్యవసాయా దాయాలు 50 నుంచి 60 శాతం పతనమవుతూ ఉండడం గమనించవచ్చు. దీని ఫలితంగా లక్షలాది మంది చిన్న రైతులు, వ్యవసాయ కూలీలు, పేద వర్గాలు ఎంత తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చవి చూడవలసి ఉంటుందో, అది వారి జీవన భద్రతకు ఎంత ముప్పుగా పరిణమిస్తుందో చెప్పడానికి మాటలు చాలవు. రైతులను ముంచిన నోట్ల రద్దు వచ్చే బడ్జెట్లో అసంఘటిత రంగ కార్మికులకు, రైతులకు, రైతు కూలీలకు ఏమైనా ఉపశమన చర్యలు ప్రకటిస్తే నిజంగా అదో అద్భుతమే. ఎందుకంటే వరద నష్టం నుంచి ఉపశమనం ప్రకటించవచ్చు. కరువు నుంచి రక్షించడానికి అలాంటి చర్యలు ప్రకటించవచ్చు. ప్రకృతి వైపరీత్యాలు కలిగించే నష్టాలకు ఏమాత్రం తీసిపోని నోట్ల రద్దు ఉత్పాతం నుంచి ఉపశమనం ఎలా ప్రకటి స్తారు? ఈ విషయం గురించి కొంచెం ఆలోచించండి! ఈ సంవత్సరం ఇక ముగియనుండగా ఇప్పుడు కొత్త కందిపప్పు మార్కెట్లోకి వచ్చింది. కర్ణాటక లోని గుల్బర్గా, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, మధ్యప్రదేశ్లోని ఇండోర్ మార్కెట్లలో ఈ నిల్వలు దర్శనమిస్తున్నాయి. కానీ దీని ధర కనీస మద్దతు ధర కంటే ఎంతో దిగువన ఉంది. కనీస మద్దతు ధర క్వింటాల్ ఒక్కింటికి రూ. 5,050 ఉండగా హోల్సేల్ ధర రూ. 3,666 (ఆంధ్రప్రదేశ్), రూ. 4,625 (కర్ణాటక) మధ్య ఊగిసలాడుతున్నది. మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టు మహారాష్ట్ర, గుజరాత్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఆ పంట మార్కెట్కు తరలితే ఈ ధర మరింత పతనమవుతుంది. రెండేళ్ల క్రితం రిటైల్ మార్కెట్లో కిలో రెండు వందల రూపాయల వరకు పెరిగిన కందిపప్పు ధర, ఈ సంవత్సరారంభంలో కూడా అదే స్థాయిలో కొనసాగింది. దీనితో కనీస మద్దతు ధర క్వింటాల్కు రూ 4,625 నుంచి రూ. 5,050కు పెరిగింది. పెరిగిన ఈ ధరను చూసే రైతులు ఆ పంట వేశారు. పైగా గడచిన ఏడాది దిగుబడి 2.46 మిలియన్ టన్నులకు మించి, ఈ ఏడాది రికార్డు స్థాయిలో 4.3 మిలియన్ టన్నులకు చేరుతుందని అంచనా వేశారు. పెసర పంట కథ కూడా కంది పంట కథకు ఏమాత్రం తీసిపోదు. గడచిన ఏడాది కనీస మద్దతు ధర రూ. 4,850కి మించి ఈ సంవత్సరం రూ. 5,225 (క్వింటాల్ ఒక్కింటికి) ప్రకటించారు. కానీ మొన్న సెప్టెంబర్ నుంచి, అంటే సరిగ్గా పంటను మార్కెట్కు తరలించే సమయా నికల్లా ధరలు పడిపోయాయని నివేదికలు వచ్చాయి. ఫలితంగా దేశమం తటా పెసర రైతులు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కంటే ఎంతో తక్కువకే విధిలేని పరిస్థితిలో దిగుబడులను అమ్ముకున్నారు. నోట్ల రద్దు ముమ్మాటికీ రైతుల బాధలను తీవ్రం చేసింది. వ్యవసాయ మార్కెట్లు కూడా పుంజుకునే పరిస్థితిలో లేవు. చేతులు కాలుతున్నది కర్షకులకే ఉదాహరణకి కొత్త ముంబైలోని ఏపీఎంసీ మార్కెట్నే తీసుకోండి. అక్కడ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతున్నదని సీఎన్బీసీ టీవీ నివేదిక వెల్లడిం చింది. రూ. 1,000, రూ. 500 నోట్ల రద్దును నవంబర్ 8న ప్రకటిం చిన తరువాత, ఈ యాభై రోజులలో వ్యవసాయ దిగుబడుల ధరలు యాభై నుంచి అరవై శాతం పడిపోయాయి. ఎనిమిది నుంచి పది టన్నుల కూరగా యలు కొత్త ముంబై మార్కెట్లో వృథా అవుతున్నాయి. కాబట్టి ఎక్కువ మంది రైతులు ఒట్టి చేతులతో తిరిగిపోవడం అనివార్యం. నోట్ల సంక్షోభం వల్ల సాధారణ వినియోగదారులు తమ కనీస అవ సరాలకు సంబంధించిన వస్తువులు కూడా కొనుగోలు చేయలేకపోతున్నారని హోల్సేల్ వ్యాపారులు చెబుతున్నారు. కారణాలు ఏమైనా కావచ్చు, చేతులు కాలేది మాత్రం రైతు లకే. న్యూఢిల్లీలో అజాద్పూర్లోని ఏపీఎంసీ మార్కెట్ పరిస్థితి కూడా సరిగ్గా ఇలాగే ఉంది. ఎంతమాత్రం గిట్టుబాటు కాని ధరలకే రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకుని బాధాతప్త హృదయంతో తిరిగి పోవలసి వస్తున్నది. ఇది ఒక్క కూరగాయల రైతులు మాత్రమే ఎదుర్కొంటున్న పరిస్థితి కాదు. ఇండోర్లో పూల ధరలు దారుణంగా పడిపోయాయి. ఇండియా స్పెండ్ పూల సాగు రైతు చెప్పిన మాటలను ఉటం కించింది కూడా. ఆ రైతు ఇలా చెప్పాడు: ‘నాలుగు రోజుల క్రితం, ఆఖరికి నోట్ల రద్దు ప్రకటించిన తరువాత నాలుగు రోజుల వరకు కూడా కిలో బంతిపూలు రూ. 30 నుంచి రూ. 40 రూపాయలకు అమ్ముకున్నాను. ఇప్పుడు మాత్రం కిలో పూలు నాలుగు రూపాయలు లేదా మూడు రూపాయలకే అమ్ముకుంటున్నాను’. అంటే నోట్ల రద్దు చర్య తరు వాత పూల సాగు రైతులు వారి ఆదాయాలలో యాభై నుంచి ఎనభై శాతం కోల్పోయారు. ఇది ముష్టిఘాతమే పత్తి, సోయాబీన్, బాసుమతి బియ్యం రైతుల పరిస్థితి మాత్రమే కాదు; శీతాకాల కూరగాయలు టొమేటో, బంగాళదుంప, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, మటర్, పాలక్, గాజర్ పంటలు పండించే రైతుల కథ కూడా పైన చెప్పిన ఉదాహరణలకు ఏమీ భిన్నంగా లేదు. చిత్రం ఏమిటంటే నోట్ల రద్దు తరువాత రైతాంగానికి ముష్టిఘాతం తగిలిందని చెబితే ఆ వాస్తవాన్ని అధికార పార్టీ అధికార ప్రతినిధి కూడా అంగీకరించడం లేదు. రైతాంగాన్ని రెండేళ్ల వరస కరువు కొట్టిన దెబ్బను మించి, నోట్ల రద్దు ఇంకా పెద్ద దెబ్బ కొట్టిందని నేను ముందునుంచీ చెబుతున్నాను. దీని గురించి వివరాలు నన్ను అడగడానికి కూడా ఒక సందర్భంలో ఒక టీవీ యాంకర్ వెనుకాడాడు. అయితే రైతాంగాన్ని చుట్టు ముట్టిన ఈ విషాదాన్ని ఢిల్లీకి చెందిన రచయిత అషీమ్ చౌదురి ధైర్యంగా వెల్లడించారు. దీనిని విషాదమని నేను కూడా ఎందుకు అంటున్నానంటే, రైతులు వారి ప్రమేయం లేకుండా ఒక మానవ నిర్మిత సంక్షోభంలో వారు కూరుకుపోయారు. అయితే చాలామంది ఆర్థిక వేత్తలు, నిధుల నిర్వహణ వ్యవస్థలలోని వారు ఈ సంక్షోభం తాత్కాలికమని చెబుతున్నారు. వీరి వ్యాపార లావా దేవీలు త్వరలో సాధారణ స్థితికి వస్తా యని వారికి నమ్మకం ఉంది కాబట్టి వారి వరకు ఇది తాత్కాలిక సంక్షోభమే కావచ్చు. నోట్ల రద్దు తరువాత రోజుకు లభిస్తున్న చిన్నపాటి మొత్తాలతో చిన్న వ్యాపారులు, చిన్న రైతులు, భూమి లేని రైతు కూలీలు ఎలా నెట్టుకు రాగలు గుతారు? వారి జీవనోపాధి మార్గాలు కూడా మూసుకు పోయాయి. నోట్ల రద్దు చర్య తదుపరి అంకంలో రైతుల దుస్థితిని అషీమ్ చౌదురి ఉద్వేగ పూరితంగానే అయినా వాస్తవికంగా రాసిన ఈ చిన్న రచనలో పొందు పరిచారు. ఇది నోట్ల రద్దు చర్య జరిగిన ఒక మాసం తరువాత రాశారు. ‘హస్తినలో ఆ రహదారి పక్క కూరగాయల మార్కెట్కు వెళ్లాను. ఏం జరిగిందో ఊహించగలరా? ఒక కిలో బంగాళదుంపలనీ, ఒక కిలో బీన్స్నీ, లేదంటే ఒక కిలో క్యాబేజీ, కాకపోతే మూడు కట్టల పాలక్ కేవలం ఓ పది రూపాయల నోటు కొనుగోలు చేయగలిగింది. అంత చౌకగా కూరగాయలు దొరుకుతున్నందుకు నేను సంతోషించాలి. కానీ నేను రైతు దుస్థితిని తలచుకుని దుఃఖపడ్డాను. ఆరుగాలాలు పండించిన రైతుకు దక్కుతున్న ధర ఎంత? నెలల తరబడి నీరు పెట్టి, శ్రమించినందుకు కిలో బంగాళదుంపలకి, కేవలం రెండు రూపాయలు. అంటే ఒక బీడీ కట్ట కొనుక్కోవాలని అనుకున్నా, లేదా ఒక గోల్డ్ఫ్లేక్ సిగరెట్ తీసుకోవాలన్నా అతడు ఏడు కిలోల బంగాళదుంపలు పండించాలి. రైతుకి నిరంతరం మిగిలేది నిరాశే. మోదీ గారూ! నోట్ల రద్దు అంతకు మించి వారి వెన్ను విరిచింది. నాకు చౌకగా దొరికే కూరగాయలంటే ఇష్టమే. కానీ రైతు అంత చౌకగా అమ్ముడుపోవడం మాత్రం నాకు సమ్మతం కాదు. జై జవాన్! మర్ కిసాన్. ( వ్యాసకర్త : దేవిందర్శర్మ, వ్యవసాయ నిపుణులు Email : hunger55@gmail.com ) -
‘ఆవ’చేలో అవాస్తవాల పంట
విశ్లేషణ రాజీవ్గాంధీ ప్రధానిగా ఉండగా మూడు దశాబ్దాల క్రితం ఒక విప్లవానికి నాంది పలికారు. దానినే తరువాత వంటనూనెల విప్లవం (ఎల్లో రివల్యూషన్) అని వ్యవహరించారు. 1986 సంవత్సరంలో ఆయన చమురుగింజల టెక్నాలజీ మిషన్ను ప్రారంభించారు. అప్పటిదాకా వంటనూనెల దిగుమతులకు రాజ పోషకురాలిగా ఉన్న భారతదేశాన్ని 1993-94 ఆర్థిక సంవత్సరానికల్లా చమురు గింజల టెక్నాలజీ మిషన్ ఆ నూనెల ఉత్పత్తిలో ఇంచుమించు స్వయం సమృద్ధ దేశంగా మలిచింది. అంటే ఒక్క దశాబ్దంలోపుననే అంత మార్పు తెచ్చింది. వాస్తవానికి ఇది గొప్ప విజయం కిందే లెక్క. ఆ తరువాతే పతనం మొదలైంది. ఆ పసుపు విప్లవాన్ని చావగొట్టి చెవులు మూసేయాలంటూ ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) తెచ్చిన ఒత్తిడుల ముందు భారతదేశం సంతోషంగా సాష్టాంగ పడింది. నిజానికి ఆశాజనకంగా ఉన్న దేశీయ వంటనూనెల ఉత్పత్తి రంగం ఆర్థిక సరళీకరణ అనే బలివితర్ది మీద ఎలా బలైపోయిందో తెలుసుకోవడానికి ఇదొక తిరుగులేని ఉదాహరణ. వంట నూనెల దిగుమతుల సుంకాల మీద హద్దూపద్దూ లేని తీరులో కోతలు విధించారు. దీనితో చౌకబారు ఉత్పత్తులు దేశంలోకి వెల్లువెత్తాయి. ఫలితం- రైతులు చమురుగింజల ఉత్పత్తికి దూరంగా జరిగారు. దిగుమతి సుంకాలలో తగ్గుదల అంటే అదేమీ సాధారణ తగ్గింపు కాదు, దాదాపు 300 శాతం ఉన్న సుంకాలను దశలవారీగా సంపూర్ణంగా తొలగించారు. శరాఘాతం వంటి ఈ పరిణామంతో రైతులు చమురుగింజల సేద్యానికి నీళ్లొదిలారు. చమురుగింజల ప్రాసెసింగ్ పరిశ్రమ తలుపులు కూడా మూసుకు పోయాయి. ప్రస్తుతం భారతదేశం తన వినియోగానికి అవసరమైన వంటనూనెలలో 67 శాతం దిగుమతి ద్వారానే సమకూర్చుకుంటున్నది. అందుకు చెల్లిస్తున్న మూల్యం ఏకంగా రూ. 66,000 కోట్లు. ఆహ్వానించదగిన యోచన భారత్ తన వంటనూనెల దిగుమతి వ్యయాలను బాగా కుదించుకోవాలనే యోచనలో ఉందంటూ ఈ మధ్య పర్యావరణ శాఖ మంత్రి అనిల్ మాధవ్ దావె రాయిటర్ అంతర్జాతీయ వార్తా సంస్థతో మాట్లాడినప్పుడు చెప్పారు. ఆ ప్రకటన నిస్సందేహంగా ఆహ్వానించదగినది. వంటనూనెల దిగు మతుల మీద ఆధారపడే పరిస్థితిని బాగా తగ్గించుకోవాలని భావిస్తున్నట్టు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్సింగ్ కూడా ఒక సంద ర్భంలో ప్రకటించారు. కాస్త చదువుకున్న ఏ పౌరుడినైనా అడగండి! అతడేం చెబుతాడు? దిగుమతులను తగ్గించుకుని, దేశ రైతాంగానికి సాయపడాలనే చెబుతాడు. ఒకప్పుడు వంట నూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి కలిగిన ఈ దేశం, లోపభూయిష్టమైన వాణిజ్య విధానాల పుణ్యమా అని ఇప్పుడు ప్రపంచంలోనే ఆ నూనెలు దిగుమతి చేసుకునే దేశాలలో రెండో అతిపెద్ద దేశంగా మారవలసిన దుస్థితికి దిగజారిందన్న వాస్తవాన్ని కనీసం మంత్రులైనా గ్రహించాలి. భారత ఆహార సంస్థ విభజన కోసం ఏర్పాటు చేసిన శాంతకుమార్ ఉన్నత స్థాయి సంఘం ఎదుట నా వాదన వినిపించాను. చమురుగింజల విప్లవాన్ని వాణిజ్య సరళీకరణ ఏ విధంగా ధ్వంసం చేసిందో నేను వివరిస్తే ఆయన బాగా అర్థం చేసుకున్నారు. మన వాణిజ్య విధానాలను పునఃపరిశీలించాలంటూ శాంత కుమార్ సంఘం చేసిన సిఫార్సు ఉద్దేశం చౌక దిగుమతుల నుంచి దేశీయ ఉత్పత్తులను రక్షించడమే. కేంద్రమంత్రులు రాధామోహన్సింగ్, అనిల్దావె దేశంలో వంటనూనెల ఉత్పత్తులను ప్రోత్సహించడానికి వాటి దిగుమతుల మీద సుంకాలను పెంచే విషయాన్ని నిశితంగా పరిశీలించాలి. అందుకు కృషి చేయాలి. అంతేగానీ వంటనూనెల ఉత్పత్తుల పెంపు పేరుతో వివాదాస్పదమైన జన్యు మార్పిడి ఆవ వంగడాలను వాణిజ్య స్థాయిలో సాగు చేయడానికి అనుమతిం చడం పరిష్కారం కాదు. ఒక విషయం సుస్పష్టం. 2015లో భారత్ రూ.66,000 కోట్ల విలువైన వంట నూనెలను దిగుమతి చేసుకోవడానికి కారణం ఆ సంవత్సరం చమురు గింజల ఉత్పత్తి తగ్గడం వల్ల మాత్రం కాదు. మనం దిగుమతులను ప్రోత్సహిం చడానికే అంత మూల్యం చెల్లించాం. ఇదే భారత దిగుమతుల వ్యయం పాలిట గుదిబండగా మారిపోయింది. కేంద్రం నియమించిన జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ (జీఈఏసీ) సురక్షితం అన్న ముద్రతో మూడు రకాల జన్యుమార్పిడి ఆవ వంగడాలకు (డీఎంహెచ్-11 సహా మరో రెండు రకాలు) పచ్చజెండా ఊపింది. ఇలాంటి వంగడాలకు మంత్రిత్వ శాఖల మధ్య పనిచేసే ఈ సంస్థ అనుమతి తప్పనిసరి. వాస్తవం ఏమిటంటే సురక్షిత వంగడం అంటూ దానికి ఆపాదించిన ఆ అంశాలు ఏవో మాత్రం వారు బహిర్గతం చేయలేదు. అయితే ఈ అంశాలను వెబ్సైట్ ద్వారా ప్రజలకు వెల్లడించవలసిందనీ, వారి అభిప్రాయాలను ఆహ్వానించవల సిందనీ కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) జీఈఏసీని ఆదేశించింది. ఆ సమా చారంలో నన్ను దిగ్భ్రాంతికి గురిచేసిన అంశం ఒకటి ఉంది. అది- జన్యు మార్పిడి ద్వారా సృష్టించిన ఆవ వంగడం సాగుతో కలుపు మందు వాడకం బాగా పెరుగుతుందన్న సంగతి తెలిసినా జీఈఏసీ సభ్యులలో ఎలాంటి అలజడి కనిపించడంలేదు. నిజానికి జన్యుమార్పిడి ఆవ వంగడం సాగులో పెరిగిన కలుపు మందు వాడకం బహుళజాతి బేయర్ కంపెనీకి బాగా ఉపయోగ పడుతోంది. ఎందుకంటే ఆ మందును ఆ కంపెనీయే విక్రయిస్తున్నది. పురుగు మందులు వాడక తప్పదు జన్యుమార్పిడి కంపెనీలు మొదట ఏం చెప్పినా, బీటీ పత్తికి కూడా రసా యనిక ఎరువుల వాడకం బాగా పెరిగింది. ఆ విధంగా దేశంలో పురుగు మందుల వాడకం విపరీతమైంది. కేంద్ర పత్తి పరిశోధన సంస్థ (సీఐసీఆర్) వెల్లడించిన వివరాల ప్రకారం 2005 సంవత్సరంలో దేశంలో పత్తి పంటకోసం రూ. 649 కోట్ల రూపాయల విలువైన రసాయనిక పురుగు మందులను వినియోగించడం జరిగింది. 2010 సంవత్సరానికి దేశంలో జరుగుతున్న దేశీయ వంగడపు పత్తి సాగులో 92 శాతం బీటీ పత్తి రకాల వంగడాల వైపు మళ్లింది. ఆ ప్రకారం చూస్తే పురుగు మందుల వాడకం రూ. 880.40 కోట్లకు చేరింది. చైనాలో కూడా అన్ని సమస్యలకు సత్వర పరిష్కారమన్నట్టు ప్రవేశపెట్టిన బీటీ కాటన్ రకాలను సాగులో పెట్టారు. అయితే తెగుళ్ల నివారణకు గతంలో కంటే 20 రెట్లు ఎక్కువగా రసాయనిక మందులను అక్కడ ఉపయోగించవలసి వచ్చింది. బ్రెజిల్ మరొక ఉదాహరణ. అక్కడ పురుగు మందుల వాడకం ఒక దశాబ్ద కాలంలో 190 శాతం పెరిగిపోయింది. నిజానికి అర్జెంటీనాకు బ్రెజిల్ కొన్ని జన్యుమార్పిడి వంగడాలను ఇచ్చింది. తెల్ల పురుగు ఆశించడం, ఇతర తెగుళ్లతో 2015లో వచ్చిన సంక్షోభం తరు వాత దేశంలో రైతులు మూకుమ్మడిగా బీటీ కాటన్ పత్తిని బహిష్కరించారు. ఈ పరిణామం నుంచి పర్యావరణ మంత్రిత్వ శాఖ గుణపాఠం నేర్చుకోవాలి. తెల్లపురుగు ఆశించి పంట నాశనమైనందుకు జన్యుమార్పిడి వంగడాల సరఫరా సంస్థలను ఎందుకు బాధ్యులను చేయరాదో నాకు అవగతం కావడం లేదు. ఈ పురుగు ఆశించి పంట నాశనమైన కారణంగా ఒక్క పంజాబ్లోనే 300 మంది పత్తి రైతులు బలవన్మరణాల పాలైనారు. కాటన్ రైతులు ఇంత దారుణమైన సంఖ్యలో మరణిస్తుంటే వ్యవసాయ మంత్రిత్వశాఖ, రైతు సంక్షేమ సంస్థలు ఎందుకు మౌనంగా ఉండిపోతున్నాయి? భారతదేశంలో మనిషి ప్రాణం అంటే అంత చులకనా? నా ఉద్దేశం ప్రకారం ఇప్పుడు రైతు సంక్షేమం వ్యవసాయ శాఖకు చట్టబద్ధమైన బాధ్యత. ఇదొక వృథా చర్చ జన్యుమార్పిడి ఆవ వంగడాలతో 26 శాతం అధిక దిగుబడి వస్తుందంటూ చేసే ప్రచారం ఎంత అసంబద్ధమో ఇప్పటికే జన్యుమార్పిడి పంటల రహిత భారత ఉద్యమ సమాఖ్య చాటి చెప్పింది. ఆ సమాఖ్య వారు కొన్ని ఇతర ఆవ వంగడాల మాదిరిగానే జన్యుమార్పిడి వంగడం ఎంత వ్యర్ధమైనదో కూడా వెల్లడించారు. ప్రస్తుతం జన్యుమార్పిడితో సంబంధం లేని ఐదు ఆవ వంగడాలు ఉన్నాయి. వీటి దిగుబడి డీఎంహెచ్-11 జన్యుమార్పిడి ఆవ వంగడం కంటే చాలా ఎక్కువ. అందుకే, ఎంతో తక్కువ దిగుబడి ఉండే జన్యుమార్పిడి ఆవ వంగడంతో వంట నూనెల దిగుమతి వ్యయాన్ని ఎలా కుదించగలరో నేను అర్థం చేసుకోలేక పోతున్నాను. ఈ విధంగా చూస్తే జన్యుమార్పిడి ఆవ వంగడం గురించి చర్చ మొత్తం ఒక చెత్త వంగడం కేంద్రంగా జరుగుతున్న చర్చ అని అనిపించడం లేదా? దేశంలోని మొత్తం వంటనూనెల వినియోగంలో ఆవ నూనె వాటా పదిశాతం. ఇప్పుడు దృష్టి సారించవలసిన అంశం ఏమిటంటే, వంటనూనెల దిగుమతుల మీద సుంకం పెంపు. దీనితో పాటు దేశీయ ఉత్పత్తికి సేకరణ ధరను పెంచడం కూడా. జన్యుమార్పిడి ఆవ వంగడమే సమస్యలన్నింటికీ పరిష్కారమంటూ చేసే వాదనలను ఇక కట్టిపెట్టాలి. ఇది నిజం కాదు. మనం కొనుగోలు చేస్తున్న ఆవనూనెలో ఎక్కువ భాగం కల్తీయే అంటూ టీవీ చానళ్లు ప్రసారం చేసే వ్యాపార ప్రకటనలలో బాబా రాందేవ్ చెప్పడం మనం చూస్తున్నాం. ఇది తక్షణం దృష్టి సారించవలసిన రంగం. ఆవనూనె మార్కెట్ను శుద్ధం చేయడానికి కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆహార ప్రమాణాల భద్రత సంస్థతో చేతులు కలుపుతాయని నేను భావిస్తున్నాను. వినియోగదారునికి కావలసినది ఇలాంటి చర్యే. దేవిందర్శర్మ, వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈమెయిల్ : hunger55@gmail.com -
'నేల' విడిచిన సంస్కరణలు
విశ్లేషణ దేశంలోని 70 శాతం రైతులు వ్యవసాయరంగంలో అదనపు జనాభాగా ఉన్నారని. వీరిని పట్టణ ప్రాంతాలకు తరలించాల్సి ఉందని నాటి ప్రధాని మన్మోహన్సింగ్ పదేపదే చెబుతూ వచ్చారు. భారత్లో అతిపెద్ద సంస్కరణ .. గ్రామీణ జనాభాను పెద్ద ఎత్తున నగరాలకు తరలించడమేనని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్రాజన్ సైతం ప్రకటించారు. దేశజనాభాలోని అత్యధిక భాగానికి వ్యవసాయం జీవనోపాధిని కలిగించలేకపోతోందని, అసమానతలకు ఇదే కారణమని ప్రస్తుత ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ కూడా తేల్చేశారు. ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన పాతికేళ్ల తర్వాత, గ్రామీణ ప్రాంతాల కోసం 2015లో ప్రచురించిన మొట్టమొదటి సామాజిక–ఆర్థిక సర్వే ఒక నిరాశాపూరిత దృశ్యాన్ని చిత్రించింది. భారత్లో నివసిస్తున్న 125 కోట్ల మంది జనాభాలో గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న దాదాపు 70 శాతం మంది ప్రజలకు దారిద్య్రమే జీవన విధానంగా ఉన్నట్లు పేర్కొన్న ఈ సర్వే ఒక నగ్న వాస్తవాన్ని చిత్రించింది. అదేమిటంటే గడచిన కాలం మొత్తంగా చెప్పుకుంటూ వచ్చిన దానికంటే ఎక్కువగా గ్రామీణ భారత్ దారిద్య్రంలో గడుపుతోంది. గ్రామీణ ప్రాంతంలోని 75 శాతం ఇళ్లలో సంపాదిస్తున్న కుటుంబ సభ్యుడి అత్యధిక ఆదాయం నెలకు రూ. 5 వేలకంటే మించడం లేదు. పైగా, 51 శాతం గృహాలకు చేతి శ్రమే ప్రధాన ఆదాయ వనరు. ఈ చీకటి కోణాన్ని సామాజిక–ఆర్థిక సర్వే బట్టబయలు చేసింది. గ్రామీణ జనాభాలో అధిక శాతం రైతులేనని తెలుసుకుంటే ఆర్థిక సంస్కరణలు వ్యవసాయంపై ఎంతగా శీతకన్ను వేస్తున్నాయో ఈ సర్వే తేల్చి చెబుతోంది. దశాబ్దాల నిర్లక్ష్యంలో వ్యవసాయం నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ (ఎన్ఎస్ఎస్ఓ) 2011-12 కాలానికి ప్రకటించిన వినియోగ వెచ్చింపు డేటా కూడా సరిగ్గా ఇదే విషయాన్ని చెబుతోంది. మీరు గ్రామంలో ఉండి నెలకు రూ. 2,886ల కంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నారంటే, దేశంలోని 5 శాతం అగ్రశ్రేణి జనాభాలో మీరు ఉన్నట్లే లెక్క. పట్టణ ప్రాంతాల్లో ఈ పరిమితి రూ. 6,383 వరకు ఉంది. అంటే ఇంత ఆదాయం వస్తోందంటే మనం ముఖేశ్ అంబానీ, రతన్ టాటా, నారాయణ మూర్తి వర్గశ్రేణిలో చేరిపోయామని లెక్క. సమాజంలోని 5 శాతం ఎగువ తరగతి విభాగంలోకి మనం చేరి ఉండవచ్చు కానీ పట్టణ ప్రాంతా ల్లోలాగా ప్రతి నెలా రూ.6,383ల కంటే ఎక్కువ ఖర్చు పెట్టలేని 95 శాతం ప్రజల దయనీయ స్థితిని ఒకసారి ఊహించండి. దేశంలోని 17 రాష్ట్రాల్లో కుటుంబ వినియోగం కోసం వెచ్చిస్తున్న మొత్తంతో పాటు వ్యవసాయం ద్వారా ఒక రైతు పొందుతున్న సగటు ఆదాయం ఏడాదికి రూ. 20,000లు మాత్రమేనని, 2016 ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. మరోమాటలో చెప్పాలంటే ఈ 17 రాష్ట్రాల్లో ఒక్కొక్క రైతు నెలవారీ ఆదాయం కేవలం రూ. 1,666లు మాత్రమే. ఇక జాతీయ స్థాయిలో చూస్తే రైతు పొందుతున్న సగటు నెలసరి ఆదాయం కుటుంబం మొత్తానికి కలిపి రూ.3,000లు మాత్రమేనని ఎన్ఎస్ ఎస్ఓ నివేదిక పేర్కొంది. మన దేశంలో ఇప్పుడు ఒక చప్రాసీకి (నాలుగో తరగతి ఉద్యోగి)కి వస్తున్న ప్రాథమిక ఆదాయం రూ.18,000లను రైతు ఆదాయంతో పోల్చి చూడండి. గడచిన అన్ని సంవత్సరాల్లో వ్యవసాయాన్ని ఎలా నిర్లక్ష్యం చేస్తూ వచ్చారో దీన్ని బట్టే తెలిసిపోతుంది. మన దేశంలో రైతులు అనుభవిస్తున్న ఈ దీనస్థితి కచ్చితంగా ఆర్థిక సంస్కరణల ఫలితమే. ఆర్థిక సరళీకరణ, ఆర్థిక సంస్కరణలు, మార్కెట్ ఆర్థిక వ్యవస్థ.. మీరు ఏ పేరుతోనయినా పిలవండి.. దేశంలోని మెజారిటీ ప్రజలను ఇవి దూరంగా ఉంచడమే కాదు, ఆర్థిక సంస్కరణలు విజయవంతం కావడా నికి ఇదే ముందు షరతుగా ఉంటోందని చెప్పాలి. ఆర్థిక సంస్కరణలు కొనసాగాలంటే ఇతర అసంఘటిత రంగాల్లాగే వ్యవసాయాన్ని కూడా ఉద్దేశ పూర్వకంగా క్షీణింపజేస్తూ వచ్చారు. నాటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ 1991 జూలైలో చరిత్రాత్మక బడ్జెట్ ప్రసంగాన్ని చేశారు. ఆ ప్రసంగమే ఆర్థిక సరళీకరణ కోసం దేశం తలుపులు బార్లా తెరిచేసింది. లైసెన్స్ రాజ్ నియంత్రణల నుంచి పరిశ్రమలకు పూర్తి విముక్తి కలిగిస్తున్నట్లుగా ఆయన చేసిన ప్రసంగాన్ని ఇప్పుడు మళ్లీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నాను. ఆ తదుపరి పేజీలోనే ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయా నికి కీలకపాత్ర ఉంటుందని సింగ్ పేర్కొనడం గమనార్హం. అయితే వ్యవ సాయం రాష్ట్ర పరిధిలోనిది కాబట్టి వ్యవసాయానికి జవజీవాలు కల్పించే బాధ్యతను ఆర్థికమంత్రి రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేశారు. కానీ పరిశ్రమ కూడా రాష్ట్రాల పరిధిలోనిదే అనే విషయాన్ని మన్మోహన్ సింగ్ మర్చిపోయారు. రెండింటికి మధ్య ఆయన పాటించిన పక్షపాత దృష్టి స్పష్టమే. మన రైతులు సమర్థత లేనివారా? దీన్ని ఆర్థిక సరళీకరణ ప్రక్రియకు సంబంధించిన అనుద్దేశపూర్వకమైన పత నంగా మాత్రమే చెప్పకూడదు. ఎందుకంటే ఇది ముందే రూపొందించిన డిజైన్లో భాగం. దాదాపు 16 ఏళ్ల తర్వాత అంటే 1996లో ప్రపంచ బ్యాంకు, వచ్చే 20 ఏళ్లలో గ్రామీణ ప్రాంతాల్లోని 40 కోట్లమంది ప్రజలను పట్టణ ప్రాంతాలకు తరలించాలంటూ భారత్ను ఆదేశించింది. సమర్థత లేని ఉత్పత్తి దారుల చేతుల్లో అంటే రైతుల చేతుల్లో అత్యంత విలువైన భూమి చిక్కుబడి ఉందని బ్యాంక్ పేర్కొంది. వీరిని పారిశ్రామిక కార్మికులుగా మార్చేందుకు భారత్ ఒక శిక్షణా సంస్థల యంత్రాంగాన్ని నెలకొల్పాలని ప్రపంచ బ్యాంకు సూచించింది. 2008 ప్రపంచ అభివృద్ధి నివేదికలో ప్రపంచ బ్యాంకు ఈ సూచన చేసిన సంవత్సరానికి అంటే 2009లో దేశంలో వెయ్యి పారిశ్రామిక శిక్షణా సంస్థలను ఏర్పర్చాలని నాటి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచ బ్యాంకు సూచనను తదనంతర ప్రభుత్వాలు గుడ్డిగా పాటిస్తూ వచ్చాయి. దేశంలోని 70 శాతం రైతులు వ్యవసాయరంగంలో అదనపు జనా భాగా ఉన్నారని, వీరిని పట్టణ ప్రాంతాలకు తరలించాల్సిన అవసరముందని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ పదేపదే చెబుతూ వచ్చారు. భారత్లో అతి పెద్ద సంస్కరణ ఏదంటే వ్యవసాయరంగంలోని జనాభాను పెద్ద ఎత్తున నగరాలకు తరలించడమేనని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్రాజన్ సైతం బహిరంగంగా ప్రకటించారు. ఇక మన ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ కూడా ఇదే పాట పాడుతూ దేశజనాభాలోని అత్యధిక భాగానికి వ్యవసాయం జీవనో పాధిని కలిగించలేకపోతోందని, అసమానతలకు ఇదే కారణమని తేల్చేశారు. అయితే ప్రభుత్వాలు వరుసగా వ్యవసాయ ఆర్థిక వనరులను క్షీణింప జేస్తూ, వ్యవసాయ జనాభాను అథఃపతనంలోకి నెట్టేశాయన్న వాస్తవాన్ని జైట్లీ చెప్పకుండా దాటేశారు. బడ్జెట్ కేటాయింపుల్లో వ్యవసాయానికి తక్కువ ప్రాధాన్యమిస్తూ రావడమే దీనికి తిరుగులేని సాక్ష్యం. 11వ ప్రణాళికలో వ్యవ సాయానికి రూ.1 లక్ష కోట్లను బడ్జెట్లో కేటాయించగా, 12వ ప్రణాళికలో రూ.1.50 లక్షల కోట్లను కేటాయించారు. పైగా వరి, గోధుమకు కనీస మద్దతు ధర దాదాపుగా స్తంభించిపోయింది. అదే సమయంలో వ్యవసాయ పంటల ధరలు సగటున 4 శాతం కంటే తక్కువ గానే పెరిగాయి. వాస్తవానికి ఆర్థిక సంస్కరణలను కొనసాగించడానికే వ్యవసాయాన్ని ఉద్దేశ పూర్వకంగా క్షీణింప జేస్తూ వస్తున్నారు. గరిష్ట మద్ధతు ధర కింద వ్యవసాయ ఉత్పత్తులకు అధిక ధరలను ప్రకటిస్తే ఆహార ధరలు అధికంగా పెరుగుతాయి కాబట్టి పారిశ్రామిక, వాణిజ్య రంగంలో కార్మికులకు అధిక వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో వ్యవసాయ ఉత్పత్తులకు అధిక ధర కల్పిస్తే అనేక పరిశ్రమలకు ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోతాయి. పైగా, వ్యవసాయ రంగం అధిక ఆదాయాన్ని పొందితే వలస పోవటం తగ్గుముఖం పడుతుంది. దీంతో మౌలిక వసతుల కల్పన, రియల్ ఎస్టేట్ రంగాలకు తక్కువ వేతనంతో శ్రామిక శక్తి లభ్యత తగ్గిపోతుంది. ప్రభుత్వమే వ్యవసాయరంగ వ్యతిరేకి వ్యవసాయ ఉత్పత్తిపై 50 శాతం రాబడిని వ్యవసాయ రంగానికి అందిం చాలంటూ స్వామినాథన్ కమిటీ ప్రకటించిన నివేదికను ప్రభుత్వం ఈ కారణంతోనే అమలు చేయడం లేదు. అధిక ధరలను ప్రకటిస్తే మార్కెట్లను అది ధ్వంసం చేస్తుందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందు అఫిడవిట్ దాఖలు చేసింది కూడా. ఈ కారణం వల్లే కనీస మధ్దతు ధరకు మించి వరి, గోధుమ పంటకు బోనస్ను ప్రకటించవద్దని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టంగానే ఆదేశాలు జారీ చేసింది. అంటే ఆర్థిక సంస్కరణ వాస్తవ భారాన్ని గ్రామీణ భారతమే మోస్తోంది. వీరిలో రైతుల జనాభాయే అధికంగా ఉంటోంది. దేశ చరిత్రలో మొట్టమొదటి సామాజిక ఆర్థిక జనగణన సర్వే ఈ వాస్తవాన్నే స్పష్టం చేసింది. మానవాభివృద్ధి సూచిక ప్రకారం భారత్ పనితీరు కూడా ఈ అసమానతనే చూపిస్తోంది. ఈ సూచికలో 188 దేశాలలో భారత్ 130వ ర్యాంకు సాధించింది. అందుచేత మనం మాట్లాడుకుంటున్న ఆర్థిక సంస్క రణ చాలావరకు సంపన్నులకు అనుకూలంగానే ఉంటోంది. వ్యవసాయాన్ని క్షీణింపజేస్తూవచ్చిన క్రమంలోనే ఆర్థిక సంస్కరణలు బలపడుతూ వచ్చాయి. ప్రస్తుతం క్వింటాల్ వరి ధాన్యానికి రూ. 1,450లుగా ప్రకటించిన మద్దతుధరను ఆదాయ సమతుల్యత ప్రమాణాల ప్రకారం చూస్తే క్వింటాల్కు రూ. 5,100లకు పెంచాలి. క్వింటాల్ గోధుమ ధరను రూ. 7,600కు పెంచాలి. సమాజంలోని ఇతర సెక్షన్లతో సమానతను పాటించా లంటే ఇది రైతుల న్యాయబద్ధమైన హక్కు. సరిగ్గా ఈ హక్కునే వారికి కల్పిం చకుండా తిరస్కరిస్తున్నారు. ఒక వైపు ప్రభుత్వోద్యోగులకు, కాలేజీ ప్రొఫె సర్లకు, స్కూలు టీచర్లకు జీతాలను పెంచుతున్నప్పుడు అదే ప్రాతిపదికన వ్యవసాయరంగానికి ఆదాయ పెంపుదలను తృణీకరిస్తున్నారు. భారత దేశంలో అతి పెద్ద సంస్కరణ వ్యవసాయరంగంలోనే జరగాలి. న్యాయ బద్ధమైన రాబడిని రైతులకు అందిస్తే దేశీయ డిమాండ్ను అది ముందుకు తీసుకుపోవచ్చు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరింపచేయవచ్చు. 7వ పే కమిషన్ను ఆర్థిక వ్యవస్థను ఉద్దీపింపచేసే ఉత్ప్రేరకంగా చూస్తు్తన్నట్లయితే అది వినియోగదారీ సరుకులకు మరింత డిమాండ్ను సృష్టించాలి. అప్పుడు, వ్యవసాయంలో అధిక రాబడి భారత ఆర్థిక వ్యవస్థకు ఎంత శక్తినిస్తుందో ఎవ రైనా ఊహించవచ్చు. కనీస మద్దతు ధర కింద క్వింటాల్ గోధుమకు రూ. 7,600ల ధరను ప్రకటిస్తే గ్రామీణ ప్రాంతాల్లో అది తీసుకువచ్చే ఆర్థిక పురోగతిని ఎవరైనా ఊహించవచ్చు. దురదృష్టవశాత్తూ ఆర్థిక సంస్కరణల ప్రస్తుత దశను కొనసాగించడానికి వ్యవసాయాన్ని తెలిసితెలిసి బలిపెడుతున్నారు. మరొక మాటలో చెప్పాలంటే అన్యాయపు ఆర్థిక సంస్కరణల కోసం 60 కోట్ల మంది రైతులు మూల్యం చెల్లిస్తున్నారు. దేవిందర్శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు-hunger55@gmail.com -
రైతుల మరణయాతన, నేతల ప్రేలాపన
విశ్లేషణ సగటున ఏటా 17వేల మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఏటా 100 మంది సైనికులు చనిపోతే రక్షణమంత్రి స్పందించినట్టు, ఏటా 17వేల మంది రైతులు చనిపోతున్నా వ్యవసాయ మంత్రిత్వశాఖ స్పందించడంలేదు. గడచిన మూడేళ్లలో ఆత్మ హత్యలు చేసుకున్న 418 మంది రైతులు ‘దెయ్యం పట్టి నవాళ్లే’ అంటూ మధ్యప్రదేశ్ హోంమంత్రి భూపేంద్ర సింగ్ ఒక లిఖిత పూర్వక సమా ధానంలో చెప్పారు. ఇలాంటి ప్రకటనలు చేయడం ద్వారా ఆ మంత్రివర్యుడు సకల మర్యాదలను అతిక్రమించారు. ఈ ప్రకటనకు బీజేపీ సీనియర్ నాయకుడు బాబూలాల్ గౌర్ వంటి వారు కూడా నవ్వుకున్నారు. అంతేకాదు, వినోద శాఖ ఏర్పాటు చేయడానికి ఇది ప్రాథమిక ఆలోచనేమోనని కూడా ఎద్దేవా చేశారు. ఏమైనా గానీ, రైతులు ఆత్మహత్యలంటే రాజకీయ నాయకులు ఎంత చులకనగా చూస్తున్నారో బాధ్యతా రాహిత్యంతో కూడిన ఈ ప్రకటనే చెబుతోంది. ఇలాంటి ప్రకటనలు ప్రధా నంగా పలుచోట్ల అధికారంలో ఉన్న బీజేపీ నాయకుల నోటి నుంచి వెలువడుతూ ఉండటమే విషాదం. గడచిన రెండు దశాబ్దాలుగా వ్యవసాయ రంగంలో 3,15,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారంటే అది కరాళ నృత్యం కంటే తక్కువేమీ కాదు. నిజానికి ఈ ఆత్మహ త్యలు వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న దారుణ పరి స్థితి మీద రైతులు ఆగ్రహంతో చేస్తున్న వ్యక్తీకరణలు. అయితే వారు కోరుకున్నట్టు దేశాన్ని ఒక సమష్టి చైతన్యంతో కదలించడం దగ్గర విఫలమవుతున్నారు. మహారాష్ట్ర నుంచి పార్లమెంటుకు ఎన్నికైన బీజేపీ సభ్యుడు సంజయ్ ధోత్రే చేసిన ప్రకటన కూడా గుర్తు చేస్తాను. ‘రైతులని వాళ్ల మానాన వాళ్లని వదిలిపెట్టండి. పంటలు పాడైతే ఏం చేయాలో వాళ్లకి తెలుసు. వాళ్లు చనిపోతే, పోనివ్వండి. ఎవరికి శక్తి ఉందో వారే పండి స్తారు. మిగిలిన వాళ్లు పండించరు.’ అన్నారాయన. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడా జుగుప్సాకరమైన ప్రకటన చేశారు. నీటి పారుదల సౌకర్యాలు లేక రైతులు ఇక్కట్ల పాలవుతున్నారని చెబితే ఆయన అన్నమాట ఇదీ: ఢిల్లీలో ఉన్న భవంతి ఆవరణలో మొక్కలు ఉన్నాయని వాటికి మూత్రం పోస్తున్నానని అన్నారా యన. నాకు అర్థం కాక అడుగుతున్నాను, కేంద్ర మంత్రి వర్యుల ఉద్దేశం రైతులంతా పొద్దుగూకులు పొలంలోనే ఉండి, తాము వేసిన గోధుమ లేకుంటే చెరకు పంటలకు మూత్ర విసర్జన చేస్తూ ఉండాలనా? నిజానికి గడ్కరీ ప్రకటన చూస్తే, ఆయన మౌలిక వాస్తవాల నుంచి ఎంత దూరంగా జరిగారో అర్థమవుతుంది. సాక్షాత్తు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ కూడా ఇలాంటి అభ్యంతరకరమైన ప్రకటన ఇచ్చి ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. ప్రేమలో విఫలం చెందడం వల్లనే రైతులు ఆత్మహత్యలు చేసుకుం టున్నారని ఆయన భాష్యం చెప్పారు. సరే, అదేనని ఒప్పుకుందాం. రైతులు కూడా మానవమాత్రులే. వాళ్లను కూడా భగ్నప్రేమ బాధిస్తుంది. విఫల వివా హాలు వేధిస్తాయి. అతడూ మనిషే కాబట్టి తన జీవిత భాగస్వామి ఎవరితో అయినా లేచిపోతే క్షోభ పడతాడు. అయితే చాలా సందర్భాలలో సామాజిక, వ్యక్తిగత కార ణాలు రైతును ఆత్మహత్యకు పురిగొల్పుతున్నాయి. కానీ ఈ మహా విషాదాన్ని కేవలం వ్యవసాయ సంక్షోభాన్ని ప్రతిబింబించే విషాదంగా చిత్రించడమే దారుణం. ఈ విశాల దేశంలో ఏదో ఒక మూల ప్రతి రెండు గంటలకు ఒక రైతు బలవన్మరణం పొందుతున్నాడు. ఇంతకు మించిన విషాదం ఏముంటుంది? ఇంతటి పెను ఉత్పా తాన్ని ఏదో ఒకవైపు నుంచి నిరోధించే కనీస ప్రయత్నం కూడా జరగడం లేదు. మహారాష్ట్ర వ్యవసాయ మంత్రి అయితే, రైతుల బలవన్మరణాలకి తన వద్ద పరిష్కారం లేదని తేల్చేశారు. అయితే సైనికులు ఆత్మహత్యలు చేసు కుంటున్నారంటూ వచ్చిన వార్త వినగానే మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ స్పందించిన తీరును నేను హర్షి స్తాను. ప్రమాదకర స్థాయికి చేరుకున్న సైనికుల ఆత్మహ త్యల నివారణకు ఆయన ఆలస్యం చేయకుండా ఒక మేధోమథన సమావేశం నిర్వహించారు. దీనికిత్రివిధ దళాధిప తులు, రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి, రక్షణ సిబ్బంది మానసిక వ్యాధుల నిరోధక పరిశోధనా సంస్థ అధిపతి హాజరయ్యారు. 2012 ప్రాంతంలో జరిగిన ఈ సమా వేశం ఉద్దేశం సైనికుల ఆత్మహత్యల ధోరణిని నిలు వరించడానికి ఏం చేయాలో యోచించడమే. 2003-2012 మధ్య దాదాపు 1,000 మంది సైనికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అయితే 1995- 2011 మధ్య 2,90,470 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ వివరాలు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి హరీశ్ రావత్ పార్లమెంటుకు ఇచ్చినవే. అంటే సగటున ఏటా 17,000 మంది రైతులు బలవన్మ రణాల వైపు మొగ్గుతున్నారు. ఏటా 100 మంది సైని కులు చనిపోతే రక్షణమంత్రి స్పందించిన స్థాయిలో, ఏటా 17,000 మంది రైతులు చనిపోతున్నప్పటికి, దీనికి వ్యవసాయ మంత్రిత్వశాఖ స్పందించడంలో విఫలమ యింది. వాస్తవం ఏమిటంటే రైతుల ఆత్మహత్యలు దారుణంగా కొనసాగుతూనే ఉన్నాయి. అవి ఎవరికీ పట్టడం లేదు. (వ్యాసకర్త : దేవీందర్ శర్మ, వ్యవసాయరంగ నిపుణులు hunger55@gmail.com) -
భూతాపం కాదు.. కోరుకున్న శాపం
విశ్లేషణ నగరానికి పచ్చని ఊపిరితిత్తులుగా పిలిచే హరిత ప్రాంతం ఇప్పుడు జరుగుతున్న పట్టణీకరణ వేగం రేటుకు భారీగా తుడిచిపెట్టుకుపోతోంది. నగరాల ఉష్ణోగ్రతలు పెరగడం దాని సహజ పర్యవసానమే. పట్టణీకరణ ఉష్ణోగ్రతలు పెచ్చు పెరిగిపోవడానికి దారి తీస్తోంది. జీడీపీ వృద్ధిని పెంపొందింపజేయడానికి పట్టణీకరణ మాత్రమే సులువైన మార్గమని భావిస్తున్న పౌరులే ఉష్ణోగ్రతల పెరుగుదల గురించి ఫిర్యాదు చేయడంలోని సహేతుకత ఏమిటో నాకైతే బోధపడటం లేదు. దాన్ని కోరుకున్నది మీరే కదా! రాజస్థాన్లోని చిన్న పట్టణం పాలోడిలో ఎండలు 51 డిగ్రీల సెల్సియస్కు చేరి దేశంలో ఎన్నడూ ఎరుగని అత్యధిక ఉష్ణోగ్రతగా సరికొత్త రికార్డును సృష్టించింది. ఏది ఏమైనా ఈ ఏప్రిల్ నెల ఎన్నడూ ఎరుగనంతటి అత్యధిక ఉష్ణోగ్రతల మాసంగా నిలిచింది. వరుసగా ఏడు నెలలు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇంతకు ముందెన్నడూ జరగలేదు. ఇవి మనం గర్వించదగ్గ రికార్డులేమీ కావు. పైగా, ఆర్థిక వృద్ధి పచ్చటి చెట్లను కొట్టేస్తుంటే ఎవరూ ఏ మాత్రం పట్టింపు చూపని వాతావారణాన్ని ఎలా సృష్టించిందనే విషయాన్ని ఇవి సూచనప్రాయంగా వెల్లడి చేస్తున్నాయి. పచ్చదనం ఉన్న ప్రాంతం లేదా హరిత కవచం క్షీణతకు పరోక్షాను పాతంలో ఉష్ణోగ్రతలలో పెరుగుదల సంభవిస్తోంది. ఎంత ఎక్కువగా చెట్లను నరికేస్తే ఉష్ణోగ్రత అంత ఎక్కువగా ఉంటోంది. 51 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంటే ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ తరచూ ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలను దాటుతుండే వాయవ్య ప్రాంతాలలో నివసించాను. అంతటి తీవ్ర ఉష్ణోగ్రతలలో సైతం దట్టమైన చెట్ల నడుమ నుంచి పోతున్నప్పుడు సాపేక్షికంగా చల్లటి గాలి తగులుతూ ఎంతో హాయిని గొలిపేది. ఉష్ణోగ్రతలోని ఆ తేడా కొట్టవచ్చిన ట్టు కనిపించేది. దట్టమైన చెట్ల నీడన ఉండే వేడి, బయటి రహదారిపై ఉండే వేడితో పోలిస్తే కనీసం 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా ఉండేది. 47 డిగ్రీలకు మించిన ఉష్ణోగ్రతలతో తల్లడిల్లే ఢిల్లీ లాంటి కాంక్రీటు కీకారణ్యంలో సైతం పచ్చని ప్రాంతాన్ని పెంపొందింపజేయడం ద్వారా ఉష్ణోగ్రతలు సగటున 3 నుంచి 4 డిగ్రీలు తగ్గితే కలిగే ఉపశమన ప్రభావాన్ని ఒక్కసారి ఊహించుకోండి. పెరిగి పోతున్న ఈ అధిక ఉష్ణోగ్రతలకు కారణంగా తప్పుపట్టాల్సింది భూతా పాన్ని కాదు, మిమ్మల్ని మీరే తప్పుపట్టుకోండి. నిర్దాక్షిణ్యంగా చెట్లను కొట్టిపారేస్తుంటే మీరు నోరు మెదపకుండా ఊరుకున్నారు. చెట్టుపై గొడ్డలి పెట్టు పెడితే... ఎలాగైనా అధిక వృద్ధి రేటును సాధించాలనే పోటీలో చెట్లను కొట్టేస్తుంటే మీలో ఎలాంటి ప్రతిస్పందనా కలగదు. దాన్ని మీరు అభివృద్ధి కోసం అనివార్యంగా చెల్లించాల్సిన మూల్యంగా పరిగణిస్తారు. మెట్రో నగరా లలో, మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రధాన రహదారులను రెండు లైన్ల నుంచి నాలుగు లెన్లకు, నాలుగు లైన్ల నుంచి ఆరు లైన్లకు విస్తరింప జేయడం కోసం ఎక్కడబడితే అక్కడా నిర్దాక్షిణ్యంగా చెట్లను నరికేస్తు న్నారు. నివాస గృహ సముదాయాల కోసం నీటి వనరులను మటు మాయం చేసేస్తున్నారు, చెట్లను కొట్టేస్తున్నారు. ఇదంతా కలసి పట్టణ ‘ఉష్ణ ద్వీప’ ప్రభావంగా పిలిచే దానికి కారణమౌతోంది. నగరాలు, పట్టణాలు నానాటికీ మరింత ఎక్కువగా ‘ఉష్ణ ద్వీపాలు’గా మారిపోతు న్నాయి. కాంక్రీటు భవనాలు/నిర్మాణాల కేంద్రీకరణ అధికమయ్యే కొద్దీ సౌర ఉష్ణ వికిరణమూ అధికమౌతుంది. జకీర్పూర్, భటిండాల మధ్య 200 కిలో మీటర్ల రహదారిని విస్తరింప జేయడంకోసం 96,000 చెట్లను నరికేసినందుకుగానూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇటీవల పంజాబ్ ప్రభుత్వానికి తాఖీదును పంపింది. అంతేగానీ ఇంత భారీ ఎత్తున చెట్లను కొట్టేస్తుంటే ప్రజల నుంచి లేదా పౌరుల నుంచి ఎలాంటి ఆందోళన కానరాకపోవడాన్ని చూస్తే నాకు గుబులు కలుగుతోంది. అభివృద్ధి కోసం చెట్లను కొట్టివేయడాన్ని మనం మౌనంగా అంగీకరిస్తున్నాం. ఒక చెట్టు నిలిచి ఉండటం వల్ల స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) ఏమీ పెరగదు. కానీ, దాన్ని కొట్టేస్తే మాత్రం జీడీపీ పెరుగుతుంది. చెట్లను కొట్టేసి సాధించే అధిక జీడీపీ కావాలా? లేక చెట్లు సుస్థిర జీవనంలో భాగంగా ఉండే విధమైన అభివృద్ధి కావాలా? అనేది ఇప్పుడు మీరే ఎంచుకోవాల్సి ఉంది. కాంక్రీటు కీకారణ్యాలు మండే కొలుములు పూర్తిగా పెరిగిన ఒక వేప చెట్టు కింద ఉష్ణోగ్రత తరచూ 10 డిగ్రీలు తక్కువగా ఉంటుందని నేషనల్ నీమ్ ఫౌండేషన్ చెబుతోంది. ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్’ (ఏప్రిల్ 24, 2016)లో ప్రచురితమైన ఒక ఆసక్తిక రమైన వ్యాసాన్ని చదివాను. అందులో రచయిత వివిధ నగరాలలోని హరిత ప్రాంతాలకు, నగర కేంద్రానికి మధ్య ఉష్ణోగ్రతలలో తేడాలను గురించి తెలిపారు. ఉదాహరణకు, బెంగళూరులో జీకేవీకే వ్యవసాయ విశ్వవిద్యాలయం లోపలా, ఆ క్యాంపస్కు సరిగ్గా వెలుపల ఉష్ణోగ్రతల మధ్య తేడా నాలుగు డిగ్రీలని పేర్కొన్నారు. మెజిస్టిక్ బస్ స్టాండ్లో 35 నుంచి 36 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పుడు సైతం ఆ సమీపంలోని పార్కులో అది 32 డిగ్రీలే ఉన్నది. బెంగళూరు నగరంలో పట్టణాభివృద్ధి అత్యంత వేగంగా సాగిందని ఎనర్జీ అండ్ వెట్లాండ్ రిసెర్చ్ గ్రూప్ సెంటర్ ఫర్ ఎకలాజికల్ సైన్సెస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్(ఐఐఎస్సీ)లకు చెందిన ప్రొఫెసర్ టీవీ రామచంద్ర బృందం జరిపిన అధ్యయనం తెలిపింది. ఆ నగరంలోని నిర్మిత ప్రాంతం నాలుగు దశాబ్దాలలో 584 శాతం పెరిగిందని ఆ పరిశో ధకులు 2012లో అంచనా కట్టారు. భారీ మూల్యం చెల్లించడం ద్వారానే ఇది సాధ్యమైందనేది సుస్పష్టమే. పచ్చని ప్రాంతం 66 శాతం మేరకు, ఉపరితల నీటి వనరులు 74 శాతం మేరకు తగ్గిపోయాయి. బెంగళూరు ఒకప్పటి ఆకర్షణను ఇప్పుడు పోగొట్టు కుంది. అస్తవ్యస్తమైన ఈ వృద్ధి గురించి చాలా మంది పౌరులు ఫిర్యాదులు చేశారని తెలిసింది. కానీ వాటిని పట్టించు కునేదెవరు? ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తలు, ప్రణాళికావేత్తలంతా ఎప్పుడూ కోరుతున్న పట్టణీకరణ అదే. అభివృద్ధి చెందాలంటే కాంక్రీటు నగరాలే భవిష్యత్తని వారు ప్రజలను నమ్మించారు. కనుమరుగౌతున్న పచ్చదనం ఐఐఎస్సీ జరిపిన అధ్యయనాన్ని అత్యంత సులువుగా అర్థమయ్యే రీతిలో దత్తాంశాలపై ఆధారపడిన, ప్రజా ప్రయోజన పాత్రికేయ బృందం ‘ఇండియాస్పెండ్’ విశ్లేషించింది. భోపాల్లోని పచ్చటి చెట్ల ప్రాంతం గత 22 ఏళ్లలో 66 శాతం నుంచి 22 శాతానికి పడిపోయింది. ఇది తీవ్రంగా ఆందోళన చెందాల్సిన విషయం. అందుకు బదులుగా, 2018 నాటికి అంటే మరో మూడేళ్ల కల్లా భోపాల్లోని హరిత ప్రాంతం 11 శాతానికి పడిపోనుంది. దీన్ని మీరు అభివృద్ధి అంటారనడం ఖాయం. అయితే ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలకు పెరిగిపోతున్నాయని ఫిర్యాదు చేయడానికి లేదు. గత రెండు దశాబ్దాలలో అహ్మదాబాద్లోని పచ్చని ప్రాంతం 46 శాతం నుంచి 24 శాతానికి పడిపోయింది. ఊపిరి బిగబట్టుకుని వినండి. మీరు ఇప్పటికే ఆహ్మదాబాద్లో నివసిస్తున్నా లేక అక్కడికి వెళ్లి స్థిరపడాలని భావిస్తున్నా ఒక్కసారి పునరాలోచించండి. 2030 నాటికి అహ్మదాబాద్లో మిగిలేది కేవలం 3 శాతం హరిత ప్రాంతమే. 2030 నాటికి కోల్కతాలో సైతం మిగిలే హరిత ప్రాంతం 3.7 శాతమే. ఇక హైదరాబాద్లో 2024 నాటికి కేవలం 1.84 శాతం ప్రాంతంలోనే పచ్చదనం మిగిలి ఉంటుంది. అది ఎంతో దూరంలో లేదు. నగరపు పచ్చని ఊపిరితిత్తులుగా పిలిచే హరిత ప్రాంతం ఇప్పుడు జరుగుతున్న పట్టణీకరణ వేగం రేటును బట్టి చూస్తే స్పష్టంగానే భారీ ఎత్తున తుడిచి పెట్టుకుపోతుంది. నగర ఉష్ణోగ్రతలు పెరగడం దాని సహజ పర్య వసానమే. పట్టణీకరణ మొత్తం అంతటి ప్రభావం ఉష్ణోగ్రతలు పెచ్చు పెరిగిపోవడానికి దారితీస్తోంది. జీడీపీ వృద్ధిని పెంపొందింప జేయడానికి పట్టణీకరణ మాత్రమే సులువైన మార్గమని భావిస్తున్న పౌరులే ఉష్ణోగ్రతల పెరుగుదల గురించి ఫిర్యాదు చేయడంలోని సహేతుకత ఏమిటో నాకైతే బోధపడటం లేదు. దాన్ని కోరుకున్నది మీరే కదా! వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈమెయిల్ : hunger55@gmail.com దేవిందర్శర్మ -
సాగుకు చేటు రైతుకు చేదు
విశ్లేషణ ఈ ఏడాది సాగు వ్యవస్థను ధ్వంసం చేసినది ప్రకృతి ఒక్కటే కాదు. ఒక క్రమపద్ధతిలో వ్యవసాయరంగం పట్ల నిర్లక్ష్యాన్ని పెంచుకుంటూ వస్తున్న పాలకులు కూడా కారణం. రైతాంగం అతి ఘోరంగా దెబ్బతిన్న పరిస్థితుల్లో కేంద్రం గోధుమకు, వరికి అధిక కనీస మద్దతు ధరలతోపాటూ, రైతులకు కనీసం రూ.2,00,000 కోట్ల ఆర్థిక సహాయం ప్రకటిస్తుందనుకున్నాం. కానీ రైతాంగం ఆక్రందనలను అది పట్టించుకోలేదు. రైతులను వ్యవసాయం నుంచి తరిమేయాలనేదే దీని అంతరార్థం. సాగును బొత్తిగా గిట్టుబాటుకానిది చేసి, రైతులు తమంత తాముగా సాగును వదిలేసేలా చేయాలనేదే దీని సారాంశం. గడచిన ఏడాది వ్యవసాయానికి బహు చెడ్డ కాలం. అలా అని అంతకు ముందు పరిస్థితి మెరుగ్గా ఉండేదని కాదు. కాకపోతే 2015లో రైతాంగం మరీ గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏడాది మొదటి నుంచి చివరి వరకు వ్యవసాయరంగం దెబ్బ మీద దెబ్బ తింటూనే ఉంది. ప్రభుత్వ నిర్లక్ష్యం దీనికి తోడై పరిస్థితి మరింత అధ్వానమైంది. వ్యవసాయ సంక్షోభం మరింతగా విష మించింది. వరుసగా రెండో ఏడాది దుర్భిక్ష పరిస్థితులు కొనసాగాయి. వేసవి తదుపరి వానాకాలపు వర్షపా తంలో 14 శాతం లోటు ఏర్పడింది. గత ఆరేళ్లలో ఇదే అత్యధిక లోటు. దేశంలోని మొత్తం సాగుయోగ్యమైన భూమిలో 40 శాతం అల్ప వర్షపాతం సమస్యను ఎదుర్కొంది. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తూర్పు మధ్యప్రదేశ్, గుజరాత్, తెలంగాణ తీవ్ర దుర్భిక్షానికి గురయ్యాయి. పంజాబ్, హరియాణాల్లో సైతం తక్కువ వర్షపాతం నమోదైంది. అయితే విస్తృతమైన నీటిపారు దుల సదుపాయాల వ్యవస్థ ఉండటం వల్ల అవి ఆ దుష్ర్పభావం నుంచి తప్పించుకోగలిగాయి. పెరిగిన ఆత్మహత్యల పరంపర పశ్చిమ ఉత్తరప్రదేశ్, హరియాణా, పంజాబ్, రాజస్థాన్ లోనూ, మధ్యప్రదేశ్ , మహారాష్ట్రల్లోని కొన్ని ప్రాంతా ల్లోనూ వేసవి తదుపరి జూన్లో వానాకాలం మొదలు కావడానికి ముందే వర్షాలతోపాటూ, బలమైన గాలులు, వడగళ్ల వానలు విరుచుకుపడ్డాయి. దీంతో చేతికి అంది వచ్చిందనుకున్న గోధుమ పంట తీవ్రంగా దెబ్బతిని పోయింది. వడగళ్ల వానల తాకిడికి గురైన ఉత్తరప్రదేశ్, హరియాణా, రాజస్థాన్ పాంతాల్లో రైతు ఆత్మహత్యలు తీవ్రంగా పెరిగాయి. నేల వాలిన పంటను చూసి గుండె పగిలిన రైతులు పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వ్యవసాయ సంక్షోభం తీవ్ర స్థాయిలో కొనసాగుతు న్నదని భావించే కర్ణాటకలో జూన్ నుంచి సాగుతున్న ఆత్మహత్యల పరంపరలో 600 మంది రైతులు బలైపో యారు. కొందరు రైతులైతే మండుతున్న చెరుకు తోటల్లోకి దూకి మరీ ఆత్మాహుతికి పాల్పడ్డారు. ప్రభు త్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక, నిర్లక్ష్య వైఖరి పట్ల వారి తీవ్ర ఆగ్రహాన్ని ఇది వ్యక్తీకరించింది. కర్ణాటకలో ఈ ఆత్మహత్యల ఉరవడి, తీవ్రత పెచ్చు పెరిగిపోవడంతో ఆ రాష్ట్రం కూడా దేశంలోని ప్రధాన రైతు ఆత్మహత్యల ప్రాంతాల్లో ఒకటిగా మారిపోయింది. విస్తరిస్తున్న రైతు ఆత్మహత్యలు మహారాష్ట్రలో పరిస్థితి అత్యంత అధ్వానంగా ఉన్నది. గత ఏడాది మొదటి నుంచి అక్టోబర్ నాటికే 2,950 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అధికారిక లెక్కల ప్రకారం అంతకు ముందటి ఏడాది జరిగిన రైతు ఆత్మహత్యలు 1,611 మాత్రమే. ఆత్మహత్యలకు నెల వుగా ఉంటున్న విదర్భ ప్రాంతానికి తోడు, మరాఠ్వాడా ప్రాంతంలోనూ రైతుల పరిస్థితి అధ్వానంగా దిగ జారింది. దీంతో ఆ ప్రాంతం కూడా ప్రధాన ఆత్మ హత్యల ప్రాంతాల్లో ఒకటిగా మారింది. ఈ ఆత్మ హత్యలను ఆపడానికి ఏం చేయాలో తోచక మహారాష్ట్ర ముఖ్యమంత్రి సినీ నటి దీపికా పదుకొనేను రంగంలోకి దించి, మానసిక చికిత్స ద్వారా మరణాల సంఖ్యను కనీస స్థాయికి తగ్గించాలని ప్రయత్నించారు. ఆ తర్వాత ఆయన రూ. 10,512 కోట్ల సహాయ ప్యాకేజీని ప్రకటించారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్లలో సైతం ఆత్మహత్యలు తీవ్రంగా పెరిగాయి. మధ్య ప్రదేశ్లో పల్లాకు తెగులు సోకి సోయా బీన్ పంట పూర్తిగా దెబ్బ తినిపోవ డంతో ఇప్పటికే అక్కడ నెలకొని ఉన్న వ్యవసాయ సంక్షోభం మరీ తీవ్రమైంది. కాగా, ఒడిశాలో సైతం రైతు ఆత్మ హత్యల పరంపర అనూహ్యంగా పెరిగి పోవడం దిగ్భ్రాంతిని కలుగజేసింది. అక్కడ దాదాపు 100 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడటంతో, ఆ సమస్యను పరిష్కరించాలంటూ రాష్ట్ర బీజేపీ, బీజేడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనను చేపట్టాల్సి వచ్చింది. దేశానికి ధాన్యాగారాైలైన పంజాబ్, హరియా ణాల్లో సగటున రోజుకు ఇద్దరు నుంచి నలుగురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మార్చి-ఏప్రిల్లోని అకాల వర్షాలకు పలువురు రైతులు నష్టపోయారు. పైగా బంగాళదుంప ధర ఘోరంగా పడిపోవడంతో పలు ప్రాంతాల్లో ఉచితంగా వాటిని పంచిపెట్టేశారు. రెండేళ్ల క్రితం బాసుమతి వరికి క్వింటాలుకు రూ. 4,000 లేదా ఎక్కువ ధర లభించేది. అయినా అది ఆ సమయంలోని కనీస మద్దతు ధర కంటే తక్కువే. పైగా కనీస మద్దతు ధరకు సేకరించిన ధాన్యానికి చెల్లించాల్సిన రూ. 5,500 కోట్లను సేకరణ ముగిశాక నెల దాటాక కూడా చెల్లించలేదు. బీటీ పత్తికి తెల్ల దోమ కాటు ఇంతవరకు చిన్నపాటి చీడగానే భావిస్తున్న తెల్లదోమ అంది వచ్చిన పత్తి పంటలో 75 శాతాన్ని కబళించేసింది. ప్రధానంగా జన్యుపరంగా మార్పిడి చెందించిన బీటీ పత్తికే తెల్లదోమ చీడ సోకి నష్టం వాటిల్లడం విశేషం. 3.32 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలోని పత్తి పంట తెల్లదోమ తాకిడికి నాశనమైందని వ్యవసాయ మంత్రి రాధా మోహన్సింగ్ పార్లమెంటుకు తెలిపారు. ఫలితంగా రూ. 4,600 కోట్లు నష్టం వాటిల్లినట్లు కొన్ని అంచనాలు పేర్కొన్నాయి. ఆగ్రహం చెందిన రైతులు, తెల్లదోమ సోకిన పంట పొలాలకు ఎకరాకు రూ. 40,000 నష్టపరిహారాన్ని కోరుతూ పలుచోట్ల రైల్ రోకోలు నిర్వహిం చారు. ఆ కీటకం దాడికి పంట నాశ నం కావడం వల్ల పనులు కోల్పో యిన వ్యవ సాయ కూలీ లకు కూడా రూ. 20,000 నష్ట పరిహారం చెల్లిం చాలని రైతులు కోరారు. రైల్ రోకో ఆందోళనలు ఆగాయి కానీ, అధికార పార్టీ నేతలెవరినీ తమ గ్రామాల్లోకి రాకుండా రైతులు అడ్డగిస్తూనే ఉన్నారు. ఉద్దేశపూర్వకం ప్రభుత్వ నిర్లక్ష్యం దేశవ్యాప్తంగా సాగు వ్యవస్థను ధ్వంసం చేసినది ప్రకృతి విలయం మాత్రమే కాదు. వ్యవసాయరంగం పట్ల నిర్లక్ష్యాన్ని, ఉదాసీనతను ఒక క్రమపద్ధతిలో పెంచు కుంటూ వస్తున్న పాలకులు కూడా వ్యవసాయ సంక్షో భం మరింత ముదరడానికి దోహదం చేశారు. రైతాంగం ఇలా అతి ఘోరంగా దెబ్బతిని ఉన్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం గోధుమ, వరి పంటలకు ఎక్కువ కనీస మద్దతు ధరలతోపాటూ, రైతులకు కనీసం రూ. 2,00,000 కోట్ల ఆర్థిక సహాయ ప్యాకేజీని కూడా ప్రకటిస్తుందనుకుంటే... అదసలు రైతాంగం ఆక్రం దనలను పట్టించుకోనేలేదు. సరికదా, 7వ పే కమిషన్ సిఫారసుల ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల నెలసరి ఆదాయాలను మూడు రెట్లు పెంచింది. రైతులకిచ్చే కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ. 50 మాత్రమే పెంచింది. అంటే దాదాపు 3.5 శాతం పెరుగుదల. అత్యంత దిగువస్థాయి ఉద్యోగైన చప్రాసీ మూల వేతనం సైతం 260 శాతం పెరిగింది! రైతును సాగుకు దూరం చేస్తేనే వృద్ధి రైతులను వ్యవసాయరంగం నుంచి తరిమేయాలనేదే ప్రభుత్వ వైఖరిలోని అంతరార్థమూ, ఉద్దేశమూ అని నా గట్టి నమ్మకం. సాగును బొత్తిగా గిట్టుబాటు కానిదిగా మార్చడం ద్వారా, సాగును వదిలిపెట్టేయడం తప్ప రైతులకు వేరే గత్యంతరం లేకుండా చేయాలనేదే దీని సారాంశం. బలవంతంగా వారిని గెంటేయడం కంటే ఇదే ఉత్తమమైన పద్ధతి! వ్యవసాయం నుంచి పెద్ద ఎత్తున జనాభా పట్టణ ప్రాంతాలకు తరలిపోవడమే అతి పెద్ద సంస్కరణ అవుతుందని నీతి ఆయోగ్ ఉపా ద్యక్షులు అరవింద్ పనగారియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురామ్ రాజన్ తరచుగా అంటూనే ఉన్నారు. మరోవంక ‘ద కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ’(సీఐఐ) మౌలిక సదుపాయాల కోసం చౌకగా లభించే శ్రమశక్తిని కోరుకుంటోంది. రైతులను సాగు నుంచి పారదోలితేనే వారికి అలాంటి కారుచౌక శ్రామిక శక్తి అందుబాటులోకి వస్తుంది. అప్పుడే ఈ క్రమానికి సంబంధించిన సూచనలు వార్తా కథనాలలో కనిపి స్తున్నాయి. ఢిల్లీకి అనుకుని ఉన్న సోనేపట్ జిల్లాలో, ఒక విద్యా సంస్థను నెలకొల్పడం కోసం జరుపుతున్న భూసేకరణకు 500 మంది రైతులు తమ భూములను ఇవ్వజూపారని వచ్చిన కథనం అలాంటిదే. మరో కథనం ప్రకారం ఒక్క ఉత్తరాఖండ్లోనే గత 15 ఏళ్లలో 3,000 గ్రామాలు నిర్మానుష్యమైపోయాయి! రైతులను పేదరికంలోనే ఉంచేయాలని ఏళ్లతరబడి ఉద్దేశపూర్వకంగా సాగుతున్న కృషి ఫలితాన్ని ఇది కళ్లకు కడుతుంది. ప్రభుత్వానికి తెలవకుండానే రైతులు బాధలకు గురవుతున్నారనుకుంటే పొరబడుతున్నట్టే. ఆర్థికంగా ఒక దేశం వృద్ధి చెందాలంటే, వ్యవసాయంపై ఆధారపడి ఉండటం తగ్గించుకోవాలనేది మన పాల కులు సూచిస్తున్న పరిష్కారం. అందువల్లనే రైతాంగాన్ని ఇంతటి దయనీయ పరిస్థితుల్లోకి నెట్టేసి, తమంతట తామే వారు సాగును వదిలేసి, పట్టణాలకు వలసపో యేలా చేయాలనే కృషి జరుగుతున్నది. ప్రభుత్వానికి కావాల్సింది కారుచౌక శ్రామికశక్తి లేదా అతి తక్కువ వేతనాలకు పనిచేసే దినసరి కూలీలు. కానీ మన దేశం లో నేటికీ వ్యవసాయరంగమే అతిపెద్ద ఉపాధి వనరుగా ఉన్నదనే విషయాన్ని వారు విస్మరిస్తున్నారు. గ్రామా లను వల్లకాళ్లను చేసే శక్తి పాలకులకు ఉండొచ్చు గానీ, అలా పట్టణాలకు చేరిన వారందరికీ ఉపాధిని చూపిం చగల శక్తి మన పారిశ్రామిక, సేవారంగాలకు లేనే లేదు. కాబట్టి నేల విడిచి సాముచేయడం లాంటి ఈ విధా నాలను వదిలిపెట్టి... వ్యవసాయాన్ని ఆర్థికంగా లాభదాయకమ య్యేదిగా, పర్యావరణాన్ని సుస్థిరపరి చేదిగా చేయడానికి సకల ప్రయత్నాలూ చేయాల్సి ఉంది. (వ్యాసకర్త: దేవిందర్ శర్మ, వ్యవసాయరంగ నిపుణులు hunger55@gmail.com) -
పొరుగింట చిచ్చే సొంతింటికి రక్షా?
(విశ్లేషణ) అమెరికా ప్రజలు పాలు, మాంసం తదితర ఆహార పదార్థాల్లో జీఎమ్ సంబంధిత అంశాలు లేకుండా ఉండాలని కోరుకుంటున్నారు. ఆర్గానిక్ ఆహారం వైపు మొగ్గుతున్నారు. ఆర్గానిక్ ఆహారోత్పత్తికి అమెరికా ప్రథమ మహిళ మిషెల్ ఒబామా నేతృత్వం వహిస్తున్నారు. శ్వేత సౌధంలో ఆమె ఆర్గానిక్ ఆహారాన్ని పండిస్తున్నారు. అతిథులకు ఆర్గానిక్ ఆహారమే వడ్డిస్తున్నారు. పరిశోధనా క్షేత్రాల్లో జీఎమ్ పంటల పరిశోధన సులభమే. అయినా క్షేత్రస్థాయి పరీక్షలకు అనుమతిని కోరడం విత్తనాల ఉత్పత్తి ప్రయోజనాల కోసమనేది బహిరంగ రహస్యం. ఇక్కడ మన దేశంలో కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్ మరిన్ని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి జన్యు మార్పిడి (జీఎమ్) పంటల క్షేత్రస్థాయి పరీక్షలకు అనుమతులను సాధించాలని తీవ్రంగా ప్రయత్నిస్తుండగా... అమె రికా వినియోగదారుల నుంచి పెరుగుతున్న డిమాండ్ ఒత్తిడిని తట్టుకోవడం కోసం మరింత ఎక్కువగా ఆర్గానిక్ ఆహారాన్ని దిగుమతి చేసుకుంటుండటం విశేషం. అమెరికా మెచ్చేది ఆర్గానిక్ ఆహారమే అమెరికా ఆర్గానిక్ ట్రేడ్ అసోసియేషన్, పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సి టీలు కలసి ప్రోది చేసిన గణాంక సమాచారం ప్రకారం అమెరికన్ల ఆర్గానిక్ (సేంద్రియ) ఆహార దిగుమతుల బిల్లు పెరిగిపోవడానికి ప్రధాన కారణం మొక్కజొన్న, సోయాబీన్లే. ఆ రెండు పంటలే అమెరికాలోని ప్రధాన జన్యు మార్పిడి పంటలు! మొక్కజొన్న, సోయాబీన్లను అక్కడ ఎక్కువగా ఉప యోగించేది పశువుల దాణాగానే. అయినా అక్కడి ప్రజలు రోజురోజుకీ ఎక్కు వగా పాలు, మాంసం తదితర ఆహారపదార్థాల్లో జీఎమ్ సంబంధిత అంశా లు లేకుండా ఉండాలని కోరుకుంటున్నారు. 2014లో భారత్ నుంచి అమెరికా దిగుమతి చేసుకున్న సోయాబీన్ దిగుమతులు రెట్టింపునకు పెరిగి, 7.38 కోట్ల డాలర్లకు చేరాయి. కాగా, రుమే నియా నుంచి ఆర్గానిక్ మొక్కజొన్న దిగుమతులు 2013లో కేవలం 5,45,000 డాలర్లు కాగా, ఒక్క ఏడాది వ్యవధిలోనే, 2014 నాటికి 1.16 కోట్ల డాలర్లకు గంతు వేశాయి. రుమేనియా, టర్కీ, నెదర్లాండ్స్, కెనడా, అర్జెంటీనా, భార త్ల నుంచే అమెరికా ప్రధానంగా ఆర్గానిక్ మొక్కజొన్న, సోయాబీన్లను దిగుమతి చేసుకుంటోంది. ఇక్కడ జీఎమ్... అక్కడ ఆర్గానిక్ భారత్లో నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలు- ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్- జన్యుమార్పిడి పంటల క్షేత్ర స్థాయి పరీక్షలను అనుమతించాయి. మరిన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అదే బాట పట్టాలని ఓత్తిడి పెరుగుతోంది. జన్యు మార్పిడి పంటల క్షేత్రస్థాయి పరీక్షల అనుమతులకు ఆటంకాలు తొలగేలా వాటి నియంత్రణ క్రమాన్ని వేగంవంతం చేయాలని ‘అసోసియేషన్ ఆఫ్ బయోటెక్ లెడ్ ఎంటర్ప్రైజెస్’ నేతృత్వంలో బయోటెక్ పరిశ్రమ ప్రధాని నరేంద్రమోదీకి రాసినట్టుగా కూడా తెలుస్తోంది. అమెరికాలో కృత్రిమ రసాయనాలు, జన్యుమార్పిడి పదార్థాలు లే నే లేని ఆహార పదార్థాల అమ్మకాలు 2014లో 3,590 కోట్ల డాలర్లకు చేరినట్టు ‘బ్లూమ్బర్గ్’ సంస్థ అంచనా. అంటే ఏడాదికి 11 శాతం వృద్ధి. ఇది అమెరికా ప్రజలు ఆర్గానిక్ పద్ధతుల్లో ఉత్పత్తయిన ఆహారాన్ని రోజు రోజుకూ ఎక్కువగా ఎంచుకుంటున్నారని సూచిస్తోంది. ఆర్గానిక్ ఆహార ఉత్పత్తికి అమెరికా ప్రథమ మహిళ మిషెల్ ఒబామా నేతృత్వం వహిస్తుండటం విశేషం. ఆమె శ్వేతసౌధంలోని సువిశాలమైన కాయగూరల తోటలో ఆర్గానిక్ ఆహా రాన్ని మాత్రమే పండిస్తున్నారు. అధ్యక్ష భవనానికి వచ్చే అతిథులకు వడ్డిం చేది కూడా పూర్తిగా ఆర్గానిక్ ఆహారమే. అమెరికా వినియోగదార్లలో సురక్షిత మైన, ఆరోగక్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవడం వేగంగా పెరుగుతోంది. క్యాన్సర్ కారక సూపర్ కలుపు చాలా వరకు జీఎమ్ పంటలకు ‘గ్లైసోఫైట్’ వంటి రసాయనిక కలుపు నాశన కారులను రెట్టింపు మోతాదులో వాడాల్సి వస్తోంది. కాబట్టి వాటి వినియోగం 2012 నాటికే 28.35 కోట్ల పౌండ్లకు పెరిగిపోయింది. అంతేకాదు అది ఏ కలుపు నాశనులకు లొంగని సూపర్ కలుపు మొక్కల ఆవిర్భావానికి, అవి 6 కోట్ల ఎకరాల పంట భూమిలో వ్యాపించిపోవడానికి దారితీసింది. ఇలా పర్యావరణపరమైన దుష్ఫలితాలను విపరీతంగా పెంచే ఈ జీఎమ్ పంట లను ప్రోత్సహించాల్సిన అవసరమేమిటని పలువురు ప్రశ్నలు సంధిస్తు న్నారు. పైగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ గ్లైసోఫైట్ను ‘కార్నికోజెన్’ (క్యాన్సర్ వ్యాధికారిణి) కావడానికి అవకాశం ఉన్నదిగా వర్గీకరించింది కూడా. ఆ కార ణంగా సైతం అమెరికాలో కిరాణా అమ్మకాలు క్రమంగా రసాయనాలు, జన్యుమార్పిడి పదార్థాలు లేని సురక్షిత ఆహారం వైపునకు మొగ్గుతున్నాయి. ఇది మారుతున్న ప్రజాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. మన ‘సోయామీల్’కు తప్పిన గండం అమెరికాకు భారత్ నుంచి సోయామీల్ ఎగుమతులలో పెరుగుదల కనిపి స్తుండగా, ఇరాన్, జపాన్లకు పశువుల దాణాగా దాని ఎగుమతుల్లో తగ్గుదల కనిపిస్తోంది. చాలా ఏళ్లుగా ఆ రెండు దేశాలే మన సోయామీల్కు ప్రధాన మార్కెట్లుగా ఉండేవి. నేడు చైనా, బ్రెజిల్, అర్జెంటీనాల నుంచి చౌకగా లభించే సోయామీల్ను అవి దాణాగా దిగుమతి చేసుకుంటున్నాయి. ప్రధానంగా ‘సోయాబీన్ ప్రాసెసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ (ఎస్ఓ పీఏ) ప్రతిఘటన వల్లనే ఒకప్పటి వ్యవసాయ మంత్రి అజిత్ సింగ్ హయాంలో జీఎమ్ సోయాబీన్ క్షేత్రస్థాయి పరిశోధన, పరీక్షలను వ్యతిరేకిం చారు. జీఎమ్ పంటల ప్రవేశంతో భారత సోయామీల్ ఉత్పత్తుల పట్ల దిగుమతిదార్ల విముఖత పెరగుతుందని అప్పట్లో సోయా పరిశ్రమ వాదించి, ఒప్పంచగలిగింది. జీఎమ్ వరి.. బియ్యం ఎగుమతులకు ఉరి బాస్మతి బియ్యం లాంటి వస్తువుల విషయంలో కూడా అదే వాస్తవం. అయినా ఇప్పటికే బాస్మతి సహా పలు వరి రకాల జన్యుమార్పిడి పంటలకు రంగం సిద్ధమైంది. సుసంపన్నమైన జీవవైవిధ్యం ఉన్న ఒడిశా వంటి కీలక ప్రాంతాలను మినహాయించే అయినా... వరి జీఎమ్ రకాలను ఒక్కసారి అనుమతించారంటే, దాని వ్యాప్తిని అరికట్టజాలం. ఒక్క జన్యువు బయట పడిందీ అంటే ఇక అది బయటే. కొన్ని దేశాలు వరి, మొక్కజొన్న పదార్థాలు గల మన ఆహార ఎగుమతులను కొన్నింటిని వాటిలో జన్యుమార్పిడి పదార్థాలు ఉన్నాయనే కారణంతో తిప్పి పంపాయి. ఆ విషయాన్ని పరిగణన లోకి తీసుకుంటే జీఎమ్ రకాల ప్రవేశంతో మన బియ్యం ఎగుమతులు కూడా పెను సవాలు ఎదుర్కోవాల్సివస్తుంది. ప్రస్తుతం మన దేశం ప్రపంచంలోనే అతి పెద్ద బియ్యం ఎగుమతిదారు. ఏ ఒక్క జీఎమ్ పంట వల్లా ఉత్పాదకత పెరిగిన దాఖలాలు కనబడని ప్రస్తుత సమయంలో జన్యుమార్పిడి పంటల క్షేత్ర పరీక్షలకు తలుపులు తెరవడం విషయంలో అత్యంత జాగరూకత వహించడం అవసరం. మన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు దెబ్బతినిపోవడాన్ని మనం ఎంత మాత్రం అనుమతించలేం. పరిశోధనా క్షేత్రాలలో పూర్తి రక్షణ మధ్య పరి శోధన సులభ సాధ్యమే. అయినా క్షేత్ర స్థాయి పరీక్షలకు (విస్తార ప్రాంతాల్లో) అనుమతిని కోరడం విత్తనాల ఉత్పత్తి ప్రయోజనాల కోసమేననేది బహిరంగ రహస్యం. (వ్యాసకర్త రవీందర్ శర్మ... వ్యవసాయరంగ నిపుణులు) -
చాచా చారిత్రక తప్పిదం
రూర్కీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) 2011 సంవత్సరంలో ఒక సర్వే నిర్వహించింది. డ్యామ్లు, గనుల తవ్వకాలు, పరిశ్రమల ఏర్పాటు, వన్యప్రాణి సంరక్షణా కేంద్రాల నిర్మాణం, జాతీయ పార్కుల ఏర్పాటు వంటి పథకాల కారణంగా గడచిన యాభై సంవత్సరాలలో నిర్వాసితులైన వారి సంఖ్య ఐదు కోట్లని ఆ సర్వే లెక్కకట్టింది. ఈ నిర్వాసితులలో మూడో వంతు మందికి మాత్రమే సక్రమంగా పునరావాసం కల్పించినట్టు ఇంకొన్ని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ప్రథమ ప్రధాని పండిట్ నెహ్రూ చేసినది తప్పిదమే. దేశాభివృద్ధి కోసం త్యాగాలు చేయమని పేదలకే ఎం దుకు ఉద్బోధించాలి? అలాంటి త్యాగాలు చేయవలసిం దని ధనికులను ఎందుకు అడగకూడదు? అభివృద్ధి కోసం రైతులనూ, గిరిజనులనూ, పేదల నూ వారు నివశించే ప్రదేశం నుంచి వేరే చోటుకి తరలిం చే ప్రక్రియ సమర్థనీయమేనని చెప్పుకోవడానికి జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీలు చేసిన కొన్ని ఉపన్యాసా లను ఉపయోగించుకోవాలని ఎన్డీయే ప్రభుత్వం యోచి స్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. భూసేకరణ బిల్లు వివా దాస్పదమై, తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో కేంద్రం ఇలాంటి ఆలోచనకు వచ్చిందన్నదే ఆ వార్తల సారాంశం. త్యాగం బాధ్యత పేదలదేనా? దేశం స్వాతంత్య్రం సాధించుకున్న కొత్తలో, అంటే 1948 లో, మహానది మీద నిర్మించ తలపెట్టిన హిరాకుడ్ ప్రాజె క్టుకు ప్రథమ ప్రధాని శంకుస్థాపన చేశారు. ఆ సంద ర్భంగా ప్రసంగిస్తూనే జవహర్లాల్, ‘మీరు బాధపడ వలసి వస్తే కనుక, దేశ ప్రయోజనం కోసమే ఆ పని చేయండి!’ అన్నారు. దీనికి నేను అంగీకరించను. దేశాభివృద్ధి కోసం త్యాగం చేసే బాధ్యత ఎప్పుడూ పేదవర్గాల మీదే ఎందుకు ఉండాలి? దేశాభివృద్ధిలో మధ్య తరగతి చేసిన త్యాగం గురించిన మాటను ఆఖరిసారిగా మనం ఎప్పు డు విన్నాం? అలాగే దేశ ఆర్ధికాభివృద్ధికి ధనికవర్గం త్యాగం చేసిందన్న మాటను ఎప్పుడు విన్నాం? అంటే, పేద ప్రజలు నిరంతరం త్యాగాలు చేస్తూ ఉంటే, ఎలాం టి సంకోచాలు పెట్టుకోకుండా, ఆ లక్షలాది పేదల ఉపా ధికి ఉన్న భద్రతను భగ్నం చేస్తూ ధనికవర్గం దాని ఫలా లను అనుభవించాలని దాని అర్థం కాదా? తమకు న్యాయంగా రావలసిన ప్రయోజనాలు సిద్ధించకుండానే, వాటి కోసం పోరాడే క్రమంలోనే నిర్వాసితులలో కొన్ని తరాలు అంతరించిపోయాయి. 1948లో హిరాకుడ్ డ్యామ్ కోసం నిర్వాసితులైన వాళ్లు స్వతంత్ర భారతంలో 68 ఏళ్ల తరువాత కూడా పునరావాసం పొందలేక, నిరాశోపహతులై మిగిలిన దృశ్యాన్ని బహుశా నెహ్రూ ఊహించి ఉండరు. కొన్ని సర్వేల ప్రకారం ఏవేవో ప్రాజెక్టుల కోసం నిర్వాసితులై, వేరేచోట ఉంటున్నవారు, మరో పురోభివృద్ధి పథకం కోసం రెండోసారి కూడా నిర్వాసితులయ్యారు. ఆధునిక జలవనరుల మహా పథకాలను నెహ్రూ ‘ఆధునిక దేవా లయాలు’ అని పేర్కొనేవారు. కానీ భాక్రా డ్యామ్, తెహ్రీ డ్యామ్, పాంగ్ డ్యామ్ కోసం నిర్వాసితులైన వారిలో చాలా మంది ఇప్పటికీ పునరావాసానికి నోచుకోలేకపో యారు. పెద్ద పెద్ద నీటి ప్రాజెక్టులకీ, భారీ పరిశ్రమల నిర్మాణానికీ నేను వ్యతిరేకం కాదు. కానీ తమ తమ నెల వుల నుంచి బలవంతంగా నెట్టివేసిన వారి దుస్థితి పట్ల, వారు పడుతున్న కడగండ్ల పట్ల రాజ్యం, సమాజం మౌన ప్రేక్షకపాత్రకు ఎలా పరిమితం కాగలుగుతున్నాయి? ప్రాధాన్యం మేరకు వారికి పరిహారం, పునరావాస సౌక ర్యం ఎందుకు కల్పించరు? దేశంలో ఐదుకోట్ల నిర్వాసితులు రూర్కీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) 2011 సంవత్సరంలో ఒక సర్వే నిర్వహించింది. డ్యామ్లు, గనుల తవ్వకాలు, పరిశ్రమల ఏర్పాటు, వన్య ప్రాణి సంరక్షణా కేంద్రాల నిర్మాణం, జాతీయ పార్కుల ఏర్పాటు వంటి పథకాల కారణంగా గడచిన యాభై ఏళ్లలో నిర్వాసితులైన వారి సంఖ్య ఐదు కోట్లని ఆ సర్వే లెక్కకట్టింది. ఈ నిర్వాసితులలో మూడో వంతు మందికి మాత్రమే సక్రమంగా పునరావాసం కల్పించినట్టు ఇం కొన్ని సర్వేలు వెల్లడిస్తున్నాయి. డ్యామ్లూ, పారిశ్రామిక ప్రాంగణాలతోనే కాదు; రైల్వే మార్గాలు, రోడ్లు, జాతీయ రహదారుల నిర్మాణం, విద్యుదీకరణ వంటి పనుల వల్ల కూడా రైతులు తమ భూముల నుంచి వేరు పడవలసివస్తున్నది. నిర్వాసితుల పట్ల ఎంత నిర్లక్ష్య ధోరణి కనిపిస్తుందంటే, హిమాచల్ ప్రదేశ్లోని యూనా జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి భారతీయ రైల్వేలు రైతులకు ఇవ్వవలసిన బకాయిలను కక్కించడానికి జనశతాబ్ది ఎక్స్ప్రెస్ రైలును అటాచ్ మెంట్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు. ఎప్పుడో 1998లో సేకరించిన భూములకు సంబంధించిన నష్టపరిహారం కేసులో ఆ న్యాయమూర్తి ఇటీవలనే అలాంటి ఆదేశాలు ఇవ్వవలసివచ్చింది. ఇలాంటి ఉదాహరణలు దేశం నలు మూలలా ఎన్నో కనిపిస్తాయి. అవన్నీ పేదప్రజలకు చట్ట బద్ధంగా అందవలసిన పరిహారం చెల్లింపులో, నష్టాలను భర్తీచేయడంలో కనిపించే అలసత్వానికి నిదర్శనాలే. దేశ ఆర్థికవృద్ధి ప్రస్థానంలో రైతులే పెద్ద ఆటం కంగా మారిపోయారంటూ మీడియాలలో కథనాలు వెలువడుతుంటాయి. కానీ విశాలంగా విస్తరించి ఉండే పెద్ద పెద్ద గోల్ఫ్ క్రీడామైదానాల నుంచి సెంటు భూమిని స్వాధీనం చేసుకోవడానికి కూడా ప్రభుత్వానికి ధైర్యం లేదు. ఒకవేళ స్వాధీనం చేసుకోవడానికి సర్కారు తెగించి ముందుకు వెళితే, వెనక్కి తగ్గేదాకా ధనికులు ఎలాంటి ఒత్తిడి తీసుకువస్తారో చూడొచ్చు. ఆర్థిక కార్యకలాపా లలో ప్రభుత్వం సమతుల్యత సాధించడానికి దోహదం చేసే విధంగా, సంవత్సరంలో పొందే కరువు భత్యంలో ఒక కిస్తీని వదులుకోమని ఉద్యోగులను అడగండి! వాళ్లు వెంటనే మూకుమ్మడి నిరసనకు దిగడం చూస్తాం. దేశా నికి పెట్టుబడులు అవసరమైన ఈ సందర్భంలో, విదేశీ పెట్టుబడుల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఏడో వేతన సంఘం నివేదిక సిఫారసును వదులుకోమని ఉద్యోగులను కోరడం సాధ్యమవుతుందా? అలా కోర డం ఎందుకు సాధ్యం కాదు?! రాయితీలు అడగొద్దని చెప్పలేమా? దేశంలో కార్పొరేట్ రంగానికి పన్ను మినహాయింపుల పేరుతో కొండంత రాయితీ కల్పిస్తున్నాం. ఇలా 2004- 2005లో ధారపోసిన రాయితీ రూ. 42 లక్షల కోట్లు. గ్రామీణాభివృద్ధి పనులకూ, రైతులకు చేయూతనివ్వడా నికీ పన్నులు చెల్లించమని(మినహాయింపులు కోరవద్దని కూడా) భారతదేశం కార్పొరేట్ రంగాన్ని ఎందుకు అడగ లేకపోతోందోనని అప్పుడప్పుడూ నాకు ఆశ్చర్యం కలు గుతూ ఉంటుంది. దేశాభివృద్ధి కోసం త్యాగం చేయడం ధనికుల, బాగా స్థిరపడిన వారి బాధ్యత కాదా? ఆఖరికి ఈ ఆర్థిక సంవత్సరంలో మినహాయించిన రూ. 5.9 లక్షల కోట్లను చెల్లించమనైనా కార్పొరేట్ రంగాన్ని అడగ వచ్చు. దీనితో మనను కలతకు గురి చేస్తున్న రూ. 5.25 లక్షల కోట్ల ఆర్థిక లోటునైనా భర్తీ చేసుకోవచ్చు. ఈ మొత్తాన్నే తరువాత దేశాభివృద్ధికి ఉపయోగించవచ్చు. (దేవీందర్శర్మ, వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు ఈమెయిల్: hunger55@gmail.com) -
ఆ దిగుమతులు రైతుల ఉరితాళ్లు
ధరలు తగ్గినందుకు నిరసనగా రైతులు వీధుల్లో బంగాళదుం పలను బస్తాల కొద్దీ పారబోయకుండా ముగిసే కాలాన్ని ఇటీ వలి కాలంలో మనం చూసి ఉండం. కేంద్రప్రభుత్వం మాత్రం మొట్టమొదటిసారిగా బంగాళదుంపల దిగుమతికి అనుమతించింది. దేశీయ సరఫరాను పెంచడానికీ, ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికే దిగుమతులను అను మతిస్తున్నట్లు అధికారికంగా చెబుతున్నారు. నిజా నికి దేశంలో బంగాళదుంపల ఉత్పత్తి ఈ ఏడు సాధా రణ స్థాయిలోనే ఉంది. ఈ ఏడు వీటి ఉత్పత్తిలో త గ్గుదల 2.3 శాతం మాత్రమే ఉంటుందని అంచనా. కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ ఈ ఏడాది నవంబర్ చివరినాటికి బంగాళ దుంపల దిగుమతులు దేశంలోకి వచ్చేలా టెండర్లు జారీ చేయవలసిందిగా జాతీయ వ్యవసాయ, మార్కెటింగ్ సమాఖ్యను ఆదేశించింది. కానీ, పంజాబ్ నుండి బంగాళదుంపల దిగుబడి నవంబర్ మధ్యనాటికే మార్కెట్ను ముంచెత్తుతుందని అంచనా. ఈ నేప థ్యంలో రైతులు మరోసారి బళ్లకొద్దీ ఆలు దుంపలను ప్రధాన రహదారులపై వదిలివేయక తప్పదనిపిస్తోంది. ఉత్పత్తిలో కాసింత తగ్గుదల కూడా లేనప్పుడు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడంలోని ఆర్థిక హేతుబద్ధత ఏమిటి? ఖరీఫ్ పంట దిగుబడి బాగానే వచ్చిందని నిపుణులు చెబుతున్నారు. నవం బర్ మధ్య నాటికి వస్తుందనుకుంటున్న శీతాకాలపు పంట కూడా సాధారణంగానే ఉంటుందని అంచనా. చైనా, రష్యాల తర్వాత ప్రపంచంలోనే బంగాళ దుంపలను అధికంగా పండి స్తున్న మూడో అతిపెద్ద దేశం భారత్. కానీ శక్తిమంతమైన ఆర్థికవేత్తల లాబీ ఒత్తిడితో.. పళ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తుల దిగుమతి కోసం భారతీయ మార్కెట్ను బార్లా తెరవడానికి ఆహార ద్రవ్యోల్బణం చక్కటి సాకుగా మారింది. ఇండో-యూరోపియన్ యూని యన్ మధ్య ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం కొనసాగుతున్న చర్చల నేపథ్యంలో ఈయూ దీన్నే డిమాండ్ చేస్తోంది. దేశ ఎగుమతి దిగుమతి విధానానికి బంగాళ దుంపలు మాత్రమే బలి కావడం లేదు. హర్యా నాలోని సోనేపట్లో ఉన్న ఒక ఫుడ్ ప్రాసెసింగ్ విభాగాన్ని సందర్శించినప్పుడు దిగ్భ్రాంతికర విష యం తెలిసింది.. కొనుగోలుదారులు లేక రైతులు తాము పండించిన టమాటాలను వీధుల్లో విసిరి వేస్తున్న సమయంలో భారత్, టమాటా పేస్టును భారీ మొత్తం లో చైనా నుంచి దిగుమతి చేసుకుందని అక్కడి రైతులు చెప్పా రు. ఆహార ద్రవ్యోల్బణం పతాక స్థాయికి చేరుకున్నప్పుడు హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్తో సహా దేశంలోని పలు ప్రాంతాలలో రైతులు టమాటా పంటను వృథాగా పారవేసినట్లు వార్తలొచ్చాయి. టమాటా ధరలు కిలోకు రెండు రూపాయల కంటే తక్కువకు పడిపోయి నప్పుడు వాటిని పశువులకు ఆహారంగా వదిలేయడమో, లేదా వీధుల్లో విసిరివేయడమో తప్ప రైతు లకు మరో మార్గం లేకుండా పోయింది. 2014 ఆగస్టు 28 నుం చి సెప్టెంబర్ 28 వరకు ఒక్క నెలలోనే భారత్ 376,009 డాలర్ల విలువైన టమాటా ఉత్పత్తులను చైనా నుంచి దిగుమతి చేసు కుంది. మనం ఇళ్లలో వాడుతున్న టమాటా కెచప్, టమాటా పురీ చివరకు టమాటా జ్యూస్ వంటి పాపులర్ బ్రాండ్లన్నీ చైనా, నేపాల్, ఇటలీ, అమెరికా, నెదర్లాండ్స్ నుండే దిగుమతి అవుతున్నాయి. అంటే, మన దేశీయ టమాటా రైతులు గిట్టు బాటు ధరలు లేక చస్తున్న సమయంలోనే టమాటా ఉత్ప త్తులను మనకు ఎగుమతి చేస్తున్న దేశాల రైతులకు సహాయం చేస్తున్నామన్నమాట. ఉదాహరణకు పాస్తానే తీసుకోండి. దేశీయంగా గోడవు న్లలో భారీ మొత్తంలో గోధుమ పేరుకుపోయి ఉన్నప్పుడు సం వత్సరానికి 39 శాతం చొప్పున అసాధారణ వృద్ధితో ఇటలీ నుంచి పిండిని భారత్ దిగుమతి చేసుకుంటోంది. గోధుమ నుంచే అది తయారవుతున్నప్పుడు దేశంలోనే దాన్ని ఎందుకు తయారు చేయకూడదు? భారతీయ పాస్తా దిగుమతులు 2003-04లో 3.39 బిలియన్లు ఉండగా 2013-14లో అవి 17.22 బిలియన్లకు ఎగబాకాయి. దేశంలోని లక్షలాది నూనె గింజల ఉత్పత్తిదారుల పొట్ట గొడుతూ విదేశీ వంటనూనెలను నిస్గిగ్గుగా ప్రోత్సహిస్తున్నారు. ఆహార దిగుమతులు దేశీయ ఉత్పత్తిని ధ్వంసం చేస్తున్నాయి. ఇండోనేసియా, మలేసియా, బ్రెజిల్, యునెటైడ్ స్టేట్స్ దేశాల వంట నూనెల ఉత్పత్తిదారుల ఆర్థిక ప్రయోజనాల కోసం దేశం లోని మెట్ట ప్రాంతాలలో సన్నకారు రైతులు జీవన విధానాన్నే లాగేస్తున్నారు. వాస్తవానికి గత 3 దశాబ్దాలలో భారతీయ వంటనూనెల దిగుమతి బిల్లు అమాంతంగా పెరిగిపోయింది. 2012 చివరినాటికి వంటనూనెల దిగుమతులు 9.01 మిలి యన్ టన్నులకు చేరాయి. దీని విలువ రూ.56,295 కోట్లు. 2006-07, 2011-12 మధ్యకాలంలో మన వంటనూనెల దిగు మతులు 380 శాతం పెరిగాయి. వంటనూనెల దిగుమతిని తగ్గించడానికి దేశంలో నూనెగింజల ఉత్పత్తిని పెంచాల్సి ఉందని మాజీ వ్యవసాయ మంత్రి శరద్ పవార్ పదే పదే వల్లించేవారు. అయితే 1994-95 నాటికే నూనెగింజల ఉత్పత్తిలో భారత్ దాదాపు స్వయంపోషకత్వ స్థాయికి చేరుకున్న విషయం ఎవ రూ ప్రస్తావించడం లేదు. ఆ నాటికి మన వంటనూనెల దిగు మతులు కేవలం 3 శాతం మాత్రమే. 1994-95 తర్వాత నూనె గింజల దిగుమతి సుంకాలు క్రమానుగతంగా తగ్గిస్తూ వచ్చారు. దీంతో దిగుమతులు పెరిగాయి. దిగుమతి సుంకాన్ని 300 శాతానికి పెంచాలని నిబంధన ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో నూనె దిగుమతులపై జీరో టారిఫ్ను భారత్ అనుమతించింది. దేశీయ అవసరాలలో 50 శాతం పైగా దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. దేశీయ నూనెగింజల విప్లవాన్ని ధ్వంసం చేసిన తర్వాత ఆర్థిక వేత్తల లాబీ ఇప్పుడు పామాయిల్ తోటల సాగును ప్రోత్సహించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది.. దేవిందర్ శర్మ పామాయిల్ వ్యవసాయంతో భూమి ఎడారి కావడమే కాకుండా కార్బన్ డయాక్సైడ్ 10 రెట్లు అధికంగా విడుదలై భూతాపం పెరుగుతోందని వరల్డ్ వాచ్ సంస్థ పేర్కొంది. కానీ, భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మిజోరం, త్రిపుర, అస్సాం, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని హరితారణ్యా లను నిర్మూలించి 10 లక్షల పైగా హెక్టార్ల భూమిలో పామాయిల్ తోటల పెంపకానికి పథకాలు రచిస్తోంది. (దీని ద్వారా సంవత్సరానికి నాలుగు లేదా అయిదు టన్నుల పామాయిల్ మాత్రమే ఉత్పత్తవుతుంది. దీనిలోని ఆర్థిక హేతుబద్ధత ఏమి టో నా అవగాహనకు అందటం లేదు.) ముందుగా నూనె గిం జల ఉత్పత్తిదారులను నాశనం చేయడం, తర్వాత వంట నూనెల ఉత్పత్తికి అడవులను నిర్మూలించడం. ఇది నిజంగానే అద్భుతమైన అభివృద్ధి నమూనాయే మరి. (వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు) -
స్వయంకృతం కాశ్మీర్ విలయం
పర్యావరణవేత్తలు పదే పదే చేస్తున్న హెచ్చరికలను పెడచెవిన పెట్టినందుకు కాశ్మీర్ మూల్యాన్ని చెల్లించుకోవాల్సివచ్చింది. అతి పెద్ద ప్రశ్న మన ముందు ఇంకా నిలిచే ఉంది. గత తప్పుల నుండి ప్రభుత్వం నేర్చుకుంటుందా, తగు దిద్దుబాటు చర్యలను చేపడుతుందా? హెచ్చరికలను పట్టించుకునే నాధులెవరూ లేరిప్పుడు. అధిక ఆర్థిక వృద్ధిని సాధించాలనే వెర్రి వ్యామోహం సహజ ఫలితంగానే ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయి. కాశ్మీర్ వరద మృతుల అంచనాలు కట్టాక, వరద తీశాక, శ్రీనగర్ తిరిగి మెల్ల మెల్లగా సాధారణ స్థితికి చేరుతోంది. క నీవినీ ఎరుగని విషాదాన్ని ఎదుర్కొన్న ప్రజలు తిరిగి సున్నితమైన పర్యావరణాన్ని నిర్లక్ష్యంగా కొల్లగొడుతూ దైనందిన కార్యకాలాపాల్లో మునిగిపోతారు. 2005లో హఠాత్తుగా ముంబై నగరం వరద తాకిడికి గురయినప్పుడు కూడా ఇలాగే జరగడం చూశాను. మహారాష్ట్ర వ్యాప్తంగా 5,000 మంది మరణించగా, భారత ఆర్థిక రాజధాని ముంబై జల ప్రళయం మాత్రం పతాక శీర్షికలకెక్కింది. జన సమ్మర్ధం ఎక్కువగా ఉన్న ముంబై పారిశ్రామిక ప్రాంతాల గుండా ప్రవహించే 19 కిలో మీటర ్ల మితి నది పోవాయ్, విహార్ సరస్సులను నింపి, ఆ పై మాహిం కయ్య వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఆ నది పొంగి పొర్లడమే వరదలకు కారణమంటూ అప్పుడు దాన్ని తప్పు పట్టారు. మితి నది అభివృద్ధి సంస్థ మాత్రం ఇలా పేర్కొంది: ‘‘తుపాను నీటిని సముద్రంలోకి పారేలా చేయడానికి ఉపయోగపడే మితి నది ఏళ్లు గడిచే కొద్దీ ఒక మురుగు కాలువగా క్షీణించి పోయింది.’’ అంతకు ముందు 2000లో హైదరాబాద్ విధ్వంసకర వరద బీభత్సానికి గురైంది. తిరిగి 2009లో కుండపోతగా కురిసిన వర్షాలకు హైదరాబాద్లో చాలా భాగాలు, కర్నూలు నగరం పూర్తిగా ముంపునకు గురయ్యాయి. ‘‘ఆగస్టు 2000 హైదరాబాద్ వరదలను ప్రకృతి విలయం ఫలితంగా పరిగణించడానికి వీల్లేదు. వృద్ధి చెందుతున్న పట్టణ ఆవాసాల ప్రణాళికా రచనలోని లోపాలను ఈ వరదలు నగ్నంగా బట్టబయలు చేశాయి. వింతేమిటంటే 2000 వరదల సమయంలో హైదరాబాద్లో 24 గంటల్లో 24 సెంటీమీటర్ల వర్షం కురవగా, నగరాన్ని ఆనుకొని ఉన్న దుర్భిక్ష ప్రాంతాల్లాంటి మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల్లో చెదురుమదురుగా మాత్రమే వానలు పడ్డాయి’’ అని భారత భూగర్భ పరిశోధనా సంస్థ పేర్కొంది. ప్రణాళికాబద్ధంగాని పట్టణీకరణ ఎంత భారీ నష్టాలకు దారితీస్తుందో అవగాహన కలగడానికి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి నివేదిక నుండి ఈ ఉల్లేఖనను చూడండి. ‘‘బంజారాహిల్స్ దక్షిణ పర్వత పాదం వద్ద ఉండే మసాబ్ టాంక్గా పిలిచే చెరువు ఇప్పుడు కిక్కిరిసిన నివాస, వాణిజ్య ప్రాంతం. పైగా చెరువు పల్లపు భాగమంతటినీ విజయనగర్, శాంతినగర్ వంటి నివాస ప్రాంతాలుగా మార్చేశారు. దీంతో ఈ ప్రాంతంలో పల్లానికి పారుతుండే వర్షపు నీటి పాయలన్నీ అదృశ్యమైపోయాయి. సహజసిద్ధమైన డ్రైనేజీ వ్యవస్థ అంతర్ధానమైన స్థితిలో ఆ ప్రాంతమంతా ముంపునకు గురికావడం సహజం.’’ బెంగళూరు, న్యూఢిల్లీ, కోల్కతా, గువాహటి... ఎక్కడ చూసినా ఇదే కథ. మన తప్పును వాతావరణ మార్పులపైకి నెట్టేయడం అత్యంత అనువైనదిగా ఉంటుంది. మనం చేసిన తప్పులను మన తక్షణ నియంత్రణలో లేని కారణాలపైకి తోసేయడం పలాయనవాదం. అది స్వీయ పరాజయానికి హేతువు. వాతావరణం వేడెక్కితే, వానలు ఆలస్యమైతే, వేసవి సుదీర్ఘంగా కొనసాగితే వాతావరణ మార్పులను తప్పుపట్టాలి. వాతావరణ మార్పులు సైతం వాస్తవానికి మన నియంత్రణకు పూర్తిగా బాహ్యమైనవేమీ కాదు. కానీ వాటిని వాస్తవంగా అలా పరిగణించడమే జరుగుతోంది. సమాజంలోని చెడుగులన్నిటికి రాజకీయ నేతలనే తప్పు పట్టడం మనకు అలవాటు. అలాగే అభివృద్ధి ప్రేరితమైన విపత్తులకు కూడా మనం మనల్ని తప్పు పట్టుకోడానికి ఇచ్చగించం. సులువుగా వేరొకరి పైకి బాధ్యతను తోసిపారేయగలిగినప్పుడు మనల్ని మనం తప్పుపట్టుకోవడం ఎందుకు? వందేళ్ల క్రితం 1908లో హైదరాబాద్ మూసీ నది వరద బీభత్సానికి గురైంది. ఆ విపత్తులో 15,000 మంది మరణించారని అంచనా. అలాగే శ్రీనగర్ కూడా 1893లో అతి పెద్ద వరద ముప్పును ఎదుర్కొంది. కాబట్టి నేటి ఈ విప త్తులకు కారణంగా వాతావరణ మార్పులను తప్పు పట్టజాలమని అంగీకరి స్తారని భావిస్తాను. 2013 జూలై నాటి ఉత్తరాఖండ్ వరద బీభత్సానికి కూడా చాలా మంది వాతావరణ మార్పులనే తప్పు పట్టారు. ఆ విపత్తు తర్వాతైనా దేశం గుణ పాఠా లను నేర్చుకుంటుందని అనుకున్నాను. అలాంటిదేమీ జరగలేదు. సరికదా, ప్రణాళికా రహితమైన పట్టణీకరణ సమస్యను లేవనెత్తిన మరుక్షణమే.. మీరంతా అభివృద్ధి వ్యతిరేకులనే గగ్గోలు లేస్తోంది. ఉత్తరాఖండ్, కాశ్మీర్ లకు హిమాలయ పర్వత సునామీల్లా తాకిన ఈ మహా విలయాలకు చలిం చని వర్గానికి చెందినవారిదే ఈ గగ్గోలంతా. ఎంతకాలం డబ్బు చేసుకోగలి గితే అంతకాలం ప్రకృతి వనరులను పూర్తిగా కొల్లగొట్టాలనే ఆసక్తి మాత్ర మే గల వర్గమిది. వేలాది మంది ప్రాణాల మీదికి వచ్చినా, బతికిబట్టకట్టిన లక్షలాది మంది ఏ దుష్ఫలితాలను అనుభవించినా వారికి పట్టదు. ‘‘ప్రతి ఒక్కరికీ తెలిసినా విశ్వసించడానికి నిరాకరించే ముప్పు’’అనే అత్యంత సముచితమైన శీర్షికతో ‘ది ట్రిబ్యూన్’ పత్రిక సెప్టెంబర్ 14, 2014న ఒక వ్యాసాన్ని ప్రచురించింది. ‘‘ఒక గిన్నె ఆకారంలో ఉన్న శ్రీనగర్ లోకి జీలం నది కట్టలు తెంచుకుని ఒక్కసారిగా వచ్చి పడితే ఆ వరద వెల్లువ బయటకు పోయే మార్గం లేదనేది అందరికీ తెలిసిన వాస్తవమే. అంతా దాన్ని విస్మరించడాన్నే ఎంచుకున్నారు’’ అని ఆ వ్యాసకర్తలు తెలిపారు. దానితోపాటే ఆ పత్రిక ప్రచురించిన మరో నివేదికలో శ్రీనగర్ లోని 50 శాతం సరస్సులు, కుంటలు, చిత్తడి నేలలను నివాస, వాణిజ్య సముదాయాలుగా మార్చారని రాష్ట్ర ప్రభుత్వ అధికారులే చెప్పారు. బందీపుర జిల్లాలోని వులార్ సరస్సు ఆసియాలోనే అతి పెద్ద మంచినీటి సరస్సు. అది 87.58 చదరపు కిలోమీటర్ల మేరకు కుంచించుకుపోయింది. సుప్రసిద్ధమైన శ్రీనగర్ దాల్ లేక్ విస్తీర్ణం 24 చ.కి.మీ. నుండి 16 చ.కి.మీలకు క్షీణించిపోయింది. వేగంగా పెరుగుతున్న పూడిక కారణంగా సగటు లోతు 3 మీటర్లకు తగ్గిపోయింది. 165 కిలోమీటర్ల పొడవైన జీలం నది పొంగి పొరలినప్పుడు ఈ దురాక్రమణలకు ప్రతీకారం కాచుకుని వేచి చూస్తోంది. పర్యావరణపరమైన రెండు మహా బీభత్సాలు వెంట వెంటనే వచ్చి పడటంతో అధికారంలో ఉన్నవాళ్లు మేల్కొంటారని భావించాను. అది తప్పని తేలింది. మీడియా, వ్యాపార పారిశ్రామిక వర్గాలు, మేధావులు, ప్రణాళికా రచయితలు, అహోరాత్రాలు విస్తృతమైన బహిరంగ చర్చలను నిర్వహించి ముందు ముందు ఇలాంటి పర్యావరణపరమైన నష్టాలను ఎలా కనిష్టం చేసుకోవాలని చర్చిస్తారని భావించాను. కానీ అందుకు విరుద్ధంగా పారిశ్రామిక ప్రాజెక్టులకు అనుమతులను నిరాకరిస్తున్నందుకు పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖను మీడియా అదే పనిగా తప్పు పట్టడం మాత్రమే కనిపిస్తోంది. పర్యావరణంతో ముడిపడి ఉన్న సమస్యలపై హెచ్చరికలు చేసే వారు ఎవరైనా గానీ వారిపై దేశ ఆర్థిక వృద్ధికి ఆటంకం కలిగించే వారిగా చిత్రించి సాగుతున్న దాడి అలాంటిది. పదే పదే చేస్తున్న హెచ్చరికలను పెడ చెవిన పెట్టినందుకు కాశ్మీర్ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. అతి పెద్ద ప్రశ్న మన ముందు ఇంకా నిలిచే ఉంది. గత తప్పుల నుండి ప్రభుత్వం నేర్చుకుంటుం దా, తగు దిద్దుబాటు చర్యలను చేపడుతుందా? (వ్యాసకర్త వ్యవసాయ రంగ నిపుణులు) దేవేందర్ శర్మ -
మార్కెట్ల జాతరగా మోడీ ‘వంద’
ప్రజల తీర్పును మార్పు కోసం ఉపయోగించాలనే నిజమైన ఆకాంక్ష మోడీలో కనిపిస్తోంది. కానీ ఆహార, వ్యవసాయ శాఖ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే సాకుతో రైతును శిక్షిస్తోంది. ప్రభుత్వ సేకరణ ధరలను దాదాపు స్తంభింపజేయడమేగాక, ఆ విధానాన్నే రద్దు చేయాలని చూస్తోంది. సేకరణ ధరల రద్దు రైతు పాలిటి మరణ శాసనమే. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ వంద రోజుల పాలన భారీ మార్కెటింగ్ మేళాగా మారిన వైనాన్ని మీరు గుర్తించే ఉంటారు. ఒక ప్రభుత్వం వంద రోజుల పాలనపై బడా మీడియా సంస్థలు జాతీయ సర్వేలను నిర్వహించి, ఫలితాలను మొదటి పేజీల్లో, టీవీ తెరలపై మెరిపించడం, చర్చలను నిర్వహించడం ఇదే మొదటిసారి కావచ్చు. ఇంతవరకు పాత్రికేయ విన్యాసంగా ఉంటున్న ‘వంద రోజుల పాలన’ ఇప్పుడు మార్కెట్ల స్థాయికి చేరింది. వాలెంటైన్ డే, మదర్స్ డే, ఫాదర్స్ డేలలాగే ముందు ముందు ఈ వంద రోజుల పాలన కూడా ఐదేళ్ల కొకసారి జరిగే మార్కెటింగ్ తంతుగా మారిపోయినా ఆశ్చర్యపోను. ఒకసారి ఇలాంటి సందర్భం మార్కెట్ల పరం అయిందంటే ఇక మారుమోగేది బడా వ్యాపార వర్గాల గొంతే. ‘బిగ్ టికెట్ రిఫార్మ్స్’ను (మౌలిక ఆర్థిక సంస్కరణలు) ప్రవేశపెట్టేలా ప్రధానిని ఒప్పించడానికి, ప్రేరేపించడానికి ఈ సందర్భమే అత్యంత అనువైనదని ఆ వర్గాలు భావించాయి. ఎగుస్తున్న స్టాక్ మార్కెట్లు వాటికి దన్నుగా ఉన్నాయి మరి. ఈ సర్వేలన్నిటినీ చూస్తే పూసల్లో దారంలా అన్నిట్లోనూ.... మౌలిక సంస్కరణలను, సబ్సిడీల తగ్గిం పును, పారిశ్రామిక రంగానికి మరిన్ని రాయితీలను, ప్రోత్సాహకాలను చౌకగా, తేలికగా భూ సేకరణను కోరడం కొట్టవచ్చినట్టు కనిపించింది. మరింకేమీ వాటికి పట్ట లేదు. మార్కెట్లను ఉత్సాహపరచని చర్యలు మొత్తంగా ఈ 100 రోజుల మార్కెటింగ్ వ్యవహారమంతా ప్రధానంగా బిగ్ టికెట్ రిఫార్మ్స్ను ప్రవేశపెట్టేలా ప్రధానిపై ఒత్తిడి చేయడం కోసమే సాగిందని కొన్ని పత్రికల కాలమ్స్లో రుజువైంది. ఈ ప్రచార దుమారం మోడీ ఆలోచనను, వైఖరిని ఏ మేరకు ప్రభావితం చేస్తుందనేది నాకు అనుమానమే. ఇప్పటికైతే ఆయన ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మరుగు దొడ్ల నిర్మాణానికి ప్రాధాన్యాన్ని ఇచ్చి, ఎంపీ నియోజకవర్గ నిధులను పాఠశాలల్లో, బహిరంగ స్థలాల్లో, ఇంటింటా వాటిని నిర్మింపజేయడానికే వినియోగించాలని ఎంపీలు, ఎంఎల్ఏలను మోడీ కోరారు. మార్కెట్లలో అదేమీ ఉత్సాహాన్ని రేకెత్తింపజేసేది కాదు. భారతదేశ ఆహార భద్రత పరిరక్షణకు శాశ్వత పరిష్కారాన్ని చూపే వరకు వాణిజ్య సౌలభ్య ఒప్పందంపై సంతకాలు చేసేది లేదంటూ ప్రధాని ప్రపంచ వాణిజ్య సంస్థకు వ్యతిరేకంగా గట్టిగా నిలబడటం కూడా విపణి విధానాల వకాలతుదారులకు మింగుడు పడేది కాదు. ‘‘అంతర్జాతీయ, జాతీయ మీడి యాలో ఈ నిర్ణయం పట్ల విమర్శ ఎదురు కావచ్చు. కానీ రైతాంగం జీవనోపాధి విషయంలో దేశం రాజీపడజాలదు’’ అని మోడీ అన్న తీరు నచ్చింది. ఆయనకు ముంద టి ప్రధానులెవరూ అంతర్జాతీయ వాణిజ్య సమాజాన్ని ఉద్దేశించి అంత శక్తివంతమైన ప్రకటనను ఇవ్వలేదని నా అభిప్రాయం. క్రమశిక్షణ, పని సంస్కృతి వంద రోజుల పాలనను అంచనా కట్టడంపై పలు టీవీ చర్చల్లో ఒక విషయం నొక్కి చెప్పాను. అది ప్రధాని నిర్ణయాత్మక పాత్రను పోషించిన ఫలితంగా ఫలితాలు కనిపిస్తున్న అంశమది. మోడీ మంత్రివర్గ సహచరుల క్రమశిక్షణ, పని సంస్కృతి ప్రభుత్వ యంత్రాంగంలోకి కూడా వ్యాపిస్తోంది. ఇదేమీ చిన్న విజయం కాదు. ఉన్నతాధికారులు, ఉద్యోగులు సమయానికి విధులకు హాజరవుతున్నారు, ఏళ్ల తరబడి చేస్తున్నట్టు ఇప్పుడు ప్రభుత్వ ఖజానా నిధులను వృథా చేయడం లేదు. ఈ పని సంస్కృతి రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా విస్తరించేట్టయితే తప్పకుండా ఆ తేడా తెలుస్తుంది. ప్రభుత్వాధికారులు నవ్వు మొహంతో ఆహ్వానించి, తక్షణమే మన ప్రశ్నలకు జవాబు చెప్పే రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను. ప్రజలు తనకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును మార్పు కోసం ఉపయోగించాలనే నిజమైన ఆకాంక్ష మోడీలో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఆ మార్పును తీసుకురావాల్సింది మాత్రం సామాజిక, పర్యావరణపరమైన కల్లోలాల మూల్యాన్ని చెల్లించడం ద్వారా మాత్రం కాదు. రైతుకు శిక్షే ధరల నియంత్రణా? ఆహార ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టడం ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యాంశం. దానర్థం ఎక్కువ ఉత్పత్తి చేసినందుకు రైతాంగాన్ని శిక్షించడం కాదు. ద్రవ్యోల్బణాన్ని అల్ప స్థాయిలో ఉంచే సాకుతో ఆహార, వ్యవసాయ శాఖ ప్రభుత్వ సేకరణ ధరలపై విరుచుకుపడింది. ప్రభుత్వోద్యోగులు 107 శాతం కరువు భత్యాన్ని అందుకుంటున్న ఈ ఏడాది... సేకరణ ధరలను దాదాపు గత ఏడాది స్థాయిలోనే స్తంభింపజేసి రైతాంగాన్ని శిక్షించింది. అంతకు మించి, సేకరణ ధరలపై బోనస్ను ఇవ్వరాదని, ఇచ్చిన రాష్ట్రాల్లో కేంద్రం సేకరణ నుండి ఉపసంహరించుకుంటుందని ఆహార శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు తాఖీదును జారీ చేసింది. ఈ ఆదేశాలు ఒక విధంగా చెప్పాలంటే... రైతులకు అధిక సేకరణ ధరలను ఇస్తామంటూ ఎన్నికల్లో చేసిన వాగ్దానాన్ని ఉల్లంఘించడమే. కొత్త సీసాలో పాత సారా జన్యుమార్పిడి పంటలకు మౌన అంగీకారం, ప్రభుత్వ పంపిణీ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ నిర్ణయాలను కూడా పునఃసమీక్షించాల్సి ఉంది. ఒక వంక రైతులకు రక్షణ కల్పించడం పేరిట డబ్ల్యూటీఓ నిబంధనలను వ్యతిరేకించడ మూ, మరోవంక మార్కెట్లకు స్వయంప్రత్తినిచ్చే సరళీకరణ చర్యలను చేపట్టడమూ ప్రభుత్వం ఒకేసారి చేయజాలదు. ప్రభుత్వ సేకరణ ధరల రద్దు అంటే రైతాంగం పాలిటి మరణ శాసనమే. కానీ ప్రభుత్వం ఆ పనిచేయాలని అమితాసక్తిని కనబరుస్తున్నట్టు అనిపిస్తోంది. గత పదేళ్ల కాంగ్రెస్ దుష్పరి పాలనలో ఆర్థిక సలహాదారులుగా వెలిగిన వారే నేడు మళ్లీ రంగ ప్రవేశం చేసి మోడీ ప్రభుత్వానికి సలహాలిస్తుండటమే అందుకు ప్రధాన కారణం. నేటి ఈ సంక్షోభానికి కారణమైన వాళ్లే పరిష్కారాన్ని కూడా చూపగలరని ఆశించరాదని నేను ఎప్పుడూ చెబుతూనే ఉన్నాను. ‘‘దుష్ఫలితాలు శూన్యం’’ బుట్టదాఖలు ఎర్రకోట నుండి ప్రధాని ప్రశంసనీయమైన ఒక వాగ్దానం చేశారు. మన దేశాన్ని వస్తు తయారీ కేంద్రంగా మార్చాలని ఆకాంక్షిస్తూ ఆయన ‘‘లోపాలు శూన్యం, దుష్ఫలితాలు శూన్యం’’ అనే విధానం పట్ల అనుకూలతను వ్యక్తం చేశారు. పర్యావరణం, అడవుల విధ్వంసాన్ని అనుమతించేది లేదని ఆ విధానం సారం. కానీ పర్యావరణం, అడవుల శాఖ సరిగ్గా అందుకు విరుద్ధంగా పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులను మంజూరు చేస్తోంది. సున్నితమైన జీవావరణాన్ని దృష్టిలో ఉంచుకుని పశ్చిమ కనుమలను గనుల తవ్వకాలకు, ఇతర హానికరమైన పరిశ్రమలకు దూరంగా ఉంచాలన్న మాధవ్ గాడ్గిల్ నివేదికను తిరస్కరించింది. అదే సమయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్, అటవీ హక్కుల చట్టం, భూసేకరణ చట్టాలను నీరు గార్చడానికి అది ప్రయత్నిస్తోంది. ఇది ‘‘దుష్ఫలితాలు శూన్యం’’ విధానాన్ని బహిరంగంగా ఉల్లంఘించడమే. మార్కెట్లు ఈ సమస్యల గురించి ఎప్పుడూ నోరెత్తవు. కారణం స్వయం విదితమే. పర్యావరణ నిబంధనలు వేగవంతమైన పారిశ్రామికాభివృద్ధికి అడ్డంకిగా నిలుస్తున్నాయని వాటి భావన. దేశం సామాజిక, పర్యావరణ పరమైన దుష్ఫలితాల పట్ల జాగ్రత్త వహించాలని ప్రధాన స్రవంతి మీడియా ఎన్నడూ మాట్లడక పోవడం అందుకే. ఈ నేపథ్యంలోనే మోడీ ప్రభుత్వ పాలనపై చర్చనంతటినీ మార్కెటింగ్ ఏజెన్సీలు స్వాధీనం చేసుకోవడం నాకు చికాకు పుట్టిస్తోంది. అభివృద్ధి ప్రజానుకూలమైనదిగా లైంగిక న్యాయాన్ని కల్పించేదిగా, పర్యావరణానికి అనుకూలమైనదిగా ఉండేలా ప్రధాని హామీని కల్పిస్తారని భావిస్తున్నాను. ఈ విషయంలో రాజీకి తావే లేదు. (వ్యాసకర్త వ్యవసాయ రంగ నిపుణులు) - దేవేందర్ శర్మ -
రెక్క విప్పిన విత్తన విప్లవం
స్థానిక, సంప్రదాయక వరి రకాల విత్తనాలను ఏటేటా రైతులు ఇచ్చిపుచ్చుకునే ‘విత్తనాల పండుగ’ త్వరత్వరగా వ్యాప్తి చెందుతోంది. ‘మన వరిని కాపాడుకుందాం’ కార్యక్రమం ద్వారా వ్యాప్తిలోకి వచ్చిన ‘కరికాలన్’ దుర్భిక్షాన్ని, వరదలను తట్టుకుని నిలవడమే కాదు ఔషధ లక్షణాలను కలిగినది. దానికి సాటిరాగల అధిక దిగుబడి వరి ప్రపంచంలోనే లేదు. నడి వేసవి మిట్ట మధ్యాహ్నం. 37 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఎండ మంటెత్తు తోంది. అయినా అక్కడ చేరిన రైతుల్లోని ఉత్సాహం నీరుగారిపోలేదు. విత్తనాల పండుగ సంరంభంలో ఎవరికి వారే తమ ఉనికిని చాటాలన్నట్టుగా తోపులాట, పెనుగులాట. సంప్రదాయక వరి విత్తనాలను ఇచ్చి పుచ్చుకునే సంరంభంలో రైతుల కోలాహలం. తమిళనాడు తిరువాయూరు జిల్లా, రుత్తరైపొండి తాలుకా అతిరెంగం గ్రామంలో రెండు రోజులపాటు (మే 30-31) మకాం చేసిన వేలాది రైతులు తమ వాటా స్థానిక రకం వరి విత్తనాలను దక్కించుకుని గానీ అక్కడ నుంచి కదల దల్చుకోలేదు. అది ఎనిమిదేళ్లుగా ఏటా సాగుతున్న వరి విత్తనాలు ఇచ్చిపుచ్చుకునే పండుగ. 2007లో కొందరు రైతులు తాము సంరక్షించిన 15 రకాల విత్తనాలతో ఈ వరి విత్తనం పండుగను ప్రారంభించారు. ఆ తదుపరి కేరళలోని ‘తనాల్,’ తమిళనాడులోని ‘సహజ సమృద్ధ’ సంస్థలు చేపట్టిన ‘మన వరిని కాపాడుకుందాం’ కార్య క్రమం దీన్ని నిర్వహిస్తున్నాయి. ఏటేటా రైతులు అత్యంతాసక్తిగా ఎదురు చూసే పండుగగా మారింది. గత ఏడాది 4,600 మంది రైతులు ఈ పండుగలో పాల్గొన్నారు. ఈ విజయంతో పలు స్వచ్ఛంద సంస్థలు, పౌర సంఘ బృందాలు తమిళనాడులో పలు చోట్ల ఏటా విత్తనాల మారకం పండుగను నిర్వహిస్తున్నాయి. సజీవ వరి విత్తన భాండాగారం వృక్ష, జంతు జాతులను వాటి సహజ పరిస్థితులలో సంరక్షించే పద్ధతిని శా స్త్రవేత్తలు ‘ఇన్ సిట్యు సంరక్షణ’ అంటారు. దేశంలోని అతి పెద్ద ‘ఇన్ సిట్యు’ సజీవ వరి విత్తన భాండాగారం ఇదే. తమిళనాడుకు చెందిన 151, కేరళకు చెందిన 140 వరి రకాలను ఇప్పుడు రైతులు ఇచ్చిపుచ్చుకుంటున్నారని ‘మన వరిని కాపాడుకుందాం’ కార్యకర్త ఆర్. శ్రీధర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు సంకర వరి వంగడాలను ఉధృతంగా ప్రోత్స హిస్తుండగా... సంప్రదాయ వరి విత్తనాల పండుగను జరపడాన్ని చూస్తే ఇది పెడదోబట్టిన ఉత్పత్తి పెంచే ప్రయత్నమనిపించవచ్చు. అటు అరుణాచల్ ప్రదేశ్ నుంచి గుజరాత్ వరకూ. ఇటు హిమాచల్ప్రదేశ్ నుంచి కేరళ వరకూ సాగుతున్న నిశ్శబ్ద విప్లవాన్ని మనమిప్పుడు చూస్తున్నాం. సంప్రదాయక విత్త నాల సంరక్షణకే కాదు, అంతరించిన రకాలను సాగుచేయడానికి కూడా రోజు రోజుకూ రైతులు ఎక్కువగా ముందుకు వస్తున్నారు. ఆర్కిటిక్ ప్రాంతంలోని స్వాల్బార్డ్ ‘గ్లోబల్ సీడ్ వాల్ట్’లో మన దేశం 1,000 వృక్ష జాతులను ‘ఎక్స్ సిట్యు’ పద్ధతిలో (వాటి సహజ పరిస్థితులకు దూరంగా) డిపాజిట్ చేయాలని చూస్తుండగా ఈ పండుగ జరగడం విశేషం. స్థానికమైన విత్తన జాతులను సంరక్షించడానికి అత్యుత్తమ మార్గం వాటిని సాగుచేయడం, సాటి రైతులతో పంచుకోవడమేనని ఇప్పుడు రైతులు చాటుతున్నారు. వరి పండుగ పుట్టి, పెరిగిందిలా... 2004లో నేను కేరళలోని కుంబాంగిలో మన వరిని కాపాడుకుందాం కార్య క్రమం ప్రారంభోపన్యాసం చేస్తూ... 2004 అంతర్జాతీయ వరి సంవత్సరం వెనుక ఉన్న రాజకీయాలను వివరించాను. ఆ ఆర్భాటమంతా వరి విత్తనాల నియంత్రణనంతటినీ బహుళ జాతి విత్తన బృహత్ సంస్థ ‘సింజెంటా’ చేతు ల్లో పెట్టడానికేనని తెలిపాను. వరి విత్తనాలపై బహుళజాతి సంస్థల గుత్తాధిప త్యం నెలకొల్పడానికి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రయత్నాలకు విరు గుడు రైతుల విత్తనాలను తమలో తాము ఇచ్చుపుచ్చుకోవడమేనని సూచిం చాను. ఆ సూచనను ఆచరణలో పెట్టిన ఫలితమే నేటి విత్తనాల పండుగ. నేడు ‘‘కేరళ, తమిళనాడు, కర్ణాటకలేగాక ఛత్తీస్గఢ్, ఒడిశా, పశ్చిమ బెం గాల్, అరుణాచల్ప్రదేశ్లు కూడా మా కృషిలో పాలుపంచుకుంటున్నాయి’’ అని కేరళలోని విత్తనాల పండుగ ఆర్గనైజర్ ఆర్ పూనంబాలమ్ తెలిపారు. స్థానిక రకాలను సాగుచేయాలని రైతులు చూపుతున్న ఆసక్తి పెంపొం దుతున్న తీరు అద్భుతం. 2007లో తమిళనాడులోని తంజావూరు వద్ద నిర్వ హించిన తొలి విత్తనాల పండుగకు రసాయనిక వ్యవసాయ వ్యతిరేక పోరాట యోధుడు, జీవావరణ నిపుణులు దివంగత జి.నమ్మళ్వార్ హాజరు కావడం మరచిపోలేనిది. నాడు రెండు వేల మందికి పైగా రైతులు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి, రాకపోకలు సహా అన్ని ఖర్చులను భరించి మరీ హాజరయ్యారు. రెండు రోజుల విత్తనాలు ఇచ్చిపుచ్చుకునే పండుగలో నిర్వహించిన పలు వర్క్షాపులకు హాజరయ్యారు. వచ్చే ఏడాది కనీసం నాలుగు కేజీలు తిరిగి ఇస్తామనే హామీతో ప్రతి రైతుకు రెండేసి కిలోల సంప్రదాయక వరి విత్తనా లను ఇచ్చారు. మొదటి బ్యాచ్ రైతులు తిరిగి వచ్చేటప్పుడు గత ఏడాది తాము పండించిన 10 కిలోల విత్తనాలను పట్టుకువచ్చారు. ఈ అలవాటే కొన్నేళ్లలోనే విత్తనాల మార్పిడి వృద్ధి చెందడానికి తోడ్పడింది. ‘ఈ ఏడాది 5,000 విత్తన మార్పిడులు జరుగుతాయని భావిస్తున్నామ’ని తమిళనాడు మన వరిని కాపాడుకుందాం కార్యక్రమానికి చెందిన జయరామన్ తెలిపారు. ప్రకృతి వరాలు మాప్పిళై సాంబా... కుట్టాయం ‘‘రైతులు కొన్ని సాంప్రదాయక రకాలపై, ప్రత్యేకించి ఔషధ లక్షణాలున్న రకాలపై ఆసక్తిని కనబరచడంలో ఆశ్చర్యమేమీ లేదు. కొందరు బ్రౌన్ రైస్ రకాలపై, మరికొందరు సంప్రదాయక సుగంధ రకాలపై, ఇంకొందరు దుర్భిక్షాన్ని తట్టుకునే రకాలపై ఆసక్తిని చూపుతున్నారు. చాలా మందికి ‘మాప్పిళై సాంబా’ వరి రకంపై మక్కువ. ఔషధ లక్షణాలున్న అది కామోద్దీపనకు దోహదపడుతుంది’’ అని ఆయనచెప్పారు. మాప్పిళై అంటే తమిళంలో అల్లుడు. తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో పెళ్లి కుదిరితే పెళ్లి కొడుకు తరఫు వారికి ఈ బియ్యాన్ని ఇచ్చి పంపే రివాజుంది. 57 ఎకరాల్లో మాప్పిళై రకాన్ని పండిస్తున్న భాస్కరన్ ఆ బియ్యానికి ‘వయాగరా బియ్యం’ అని పేరు పెట్టారు. ఈసారి వండుగకు వచ్చిన మరో అసాధారణ రైతు తిరుతిరాయ్పొండి గ్రామానికి చెందిన కరికాలన్. కుట్టాయం రకం వరి దుర్భిక్షాన్ని, వరదలను తట్టుకునే రెండు లక్షణాలు గలదని కనిపెట్టాడు. ఆయన అనుకోకుండా పొరపాటున కుట్టాయం వరిని విత్తాడు. అనూహ్యంగా ఆ ప్రాంతం దుర్భిక్షానికి గురైంది. కరికాలన్ ఇరుగుపొరుగులందరి చేలల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లినా ఆయన కుట్టాయం పంట మాత్రం తట్టుకుని నిలిచింది. అప్పటి నుంచి ఆయన ఆ రకాన్ని ప్రచారంలోకి తెస్తున్నారు. వాతావరణంలోని పెనుమార్పులను తట్టుకుని నిలిచే కుట్టాయం రకానికి ఔషధ గుణాలుకూడా ఉన్నాయి. అది ఎంతగా ప్రాచుర్యం పొందిందంటే కిలో కుట్టాయం వరి విత్తనాలకు అత్యధికంగా రూ.100 ధర లభిస్తోందని కరికాలన్ తెలిపారు. కుట్టాయం ప్రకృతి అద్భుత సృష్టి. దానిలా దుర్భిక్షాన్ని, వరదలను తట్టుకునే అధిక దిగుబడి రకాన్ని ప్రపంచంలో ఎక్కడా చూడలేదు. ఈ రకానికి ఉన్న విశిష్ట లక్షణాలను గుర్తించగలిగిన కరికాలన్ శక్తి సామర్థ్యాలకు ఆయన సంప్రదాయక స్థానిక వరి విజ్ఞాన సంరక్షకుడయ్యాడు. ఆయన చేసిన పనే ఏ వ్యవసాయ శాస్త్రవేత్తో చేసి ఉంటే ప్రపంచ ఆహార బహుమతి లభించి ఉండేది. జయరామన్ను ఇప్పుడు అంతా నెల్లు జయరామన్ అని పిలుస్తుం టారు. తమిళంలో నెల్లు అంటే వరి. ఆయన చేసిన విశిష్టమైన ఆసాధారణ కృషికి ప్రజలు ఆయనుకు ఇచ్చిన పురస్కారమది.ఇకపై వరిపై విశేష కృషి చేసిన ఒక్కొక్క రైతుకు ఈ నెల్లు బిరుదు ప్రదానం చేయాలని నిర్వాహకులకు విజ్ఞప్తి. తద్వారా వరిని కాపాడుకుందాం కార్యక్రమం వేగం పుంజుకుం టుంది. ఈఏడాది కూడా నెల్లు గౌరవ పురస్కారాన్ని అందుకోనున్న రైతు పేరును వారు ప్రకటించారు. (వ్యాసకర్త వ్యవసాయ విజ్ఞాన నిపుణులు) దేవిందర్ శర్మ -
ఎంతకాలమీ గాలివాటు సాగు?
వాతావరణ పరిస్థితుల ఆధారంగా రైతులకు మేలు చేసే దేశవ్యాప్త పంటల బీమా పథకాన్ని రూపొందించాలి. దీన్ని కచ్చితంగా కరువుతో అనుసంధానం చేయాలి. అంటే వర్షాలు పడక రైతు పంటను పండించలేకపోతే ఈ బీమా పథకం కింద పరిహారం చెల్లించాలి. దీనిపై ఎంతో కాలంగా చర్చ జరుగుతున్నా దీనికి ఇవ్వాల్సిన ప్రాధాన్యం ఇవ్వడం లేదు. సార్వత్రిక ఎన్నికల ప్రచార హోరు వాడిగా వేడిగా సాగుతోంది. రాజకీయ పార్టీల నాయకులు పరస్పరం తీవ్ర పదజాలంతో వాగ్బాణాలు సంధించుకుంటున్నారు. మాటలు తూటాల్లా పేలుతున్నాయి. అన్ని లక్ష్మణరేఖలూ చెరిగిపోతున్నాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అతిక్రమించడం సర్వసాధారణమే అయ్యింది. ఇవి ఒక రకంగా చెడు వార్తలే. ఇంతకన్నా ప్రజలకు సంబంధించిన దుర్వార్త ఒకటుంది. అయితే అది వచ్చే ఎన్నికల ఫలితాల్లో త్రిశంకు సభ ఏర్పడే అవకాశం గురించి కాదు. భవిష్యత్తులో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొననున్నాయి. వ్యవసాయ రంగం కరు వు కోరల్లో చిక్కుకోనుండడం ఒక ముందస్తు హెచ్చరికగా భావించాలి. కరువు పరిస్థితులు ఏర్పడేందుకు 25 శాతం అవకాశం ఉందని, దేశంలోని వాయవ్య, సెంట్రల్ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నందున కరువు బారినపడక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వర్షాలు పడే సమయంలో పసిఫిక్ సముద్రంలోని కెరటాల గుండా ఎల్నినో ప్రభావం అవకాశాలు ఉండవని భారతీయ వాతావరణ శాఖ(ఐఎండీ) తోసిపుచ్చినప్పటికీ వచ్చే సీజన్లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుందని ఒక ప్రముఖ ప్రైవేటు వాతావరణ సంస్థ ‘స్కైమెట్’ అంచనా వేసింది. భారత్లోని కమోడిటీ మార్కెట్లను దెబ్బతీయడానికే అమెరికా, ఆస్ట్రేలియాలోని శాస్త్రవేత్తలు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని ఐఎండీ డెరైక్టర్ జనరల్ లక్ష్మణ్ సింగ్ రాథోడ్ ఇటీవలే హెచ్చరించారు. ‘‘అమెరికా, ఆస్ట్రేలియా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కొంతమంది ప్రచారం చేసే ఇలాంటి వదంతులకు వ్యవసాయ కమోడిటీ, స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతాయి. ఆహారధాన్యాలను అక్రమంగా దాచిపెట్టి వాటికి కృత్రిమ కొరత సృష్టిస్తారు. వారి సలహా వినొద్దు.’’ అని ఆయన అన్నారు. వర్షాభావ పరిస్థితుల గురించి వచ్చిన అంచనాలపై ప్రభుత్వం ఆందోళన చెందడం లేదని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి ధీమాగా చెబుతున్నారు. కానీ అసలు విషయం ఏమంటే..... గతంలో ‘స్కైమెట్’ విడుదల చేసిన అంచనాలు చాలా వరకు నిజమయ్యాయి. 2012లో ఈ సంస్థ 94 శాతం వర్షపాతం నమోదవుతుందని అంచనా వేస్తే 93 శాతం వర్షాలు కురిశాయి. గత ఏడాది కూడా కచ్చితమైన అంచనాలే ఇచ్చింది. ఈ ఏడాదిలో మొత్తానికి 94 శాతం వర్షపాతం నమోదవుతుందని చెప్పడమంటే వ్యవసాయోత్పత్తిలో గణనీయమైన తగ్గుదల ఉండకపోవచ్చు. అయితే గుజరాత్, సౌరాష్ట్ర, కచ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, సెంట్రల్ మహారాష్ట్ర, గోవా, కొంకణ్, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయి. 2009లో 96 శాతం వర్షపాతం దీర్ఘకాలిక సగటుగా నమోదు కావచ్చని భారతీయ వాతావరణ శాఖ అంచనా కట్టింది. కానీ ఇటీవల కాలంలో తీవ్ర క్షామపరిస్థితులను ఆ సంవత్సరంలో చవిచూడాల్సి వచ్చింది. వాస్తవానికి కురవాల్సిన దానికన్నా వర్షాలు 23 శాతం తక్కువ కురిశాయి. దీన్ని భారీ లోటుగా గుర్తించాలి. దీని ఫలితంగా వ్యవసాయ దిగుబడులు తగ్గాయి. ముఖ్యంగా వరి ఉత్పత్తి 12 శాతం పడిపోయింది. 2012లో 96 శాతం వర్షపాతం నమోదవుతుందని అంచనాలు వెలువడ్డాయి. సాగయ్యే ప్రాంతాల్లోని 70 శాతం విస్తీర్ణంలో వర్షాలు ఆలస్యంగా పడ్డాయి. కానీ 2009 నాటి పరిస్థితితో పోల్చితే అంతటి తీవ్ర దుర్భర పరిస్థితులు మాత్రం లేవు. ఈ ఏడాది 94 శాతం వర్షపాతం నమోదవుతుందని ‘స్కైమెట్’ అంచనాలు వేయడం మరింత ఆందోళన కలిగించేదిగా ఉంది. రైతులకు కడగండ్లు వాతావరణం కూడా కలిసిరాకపోతే సెంట్రల్ ఇండియాలో ఇది రైతులను రెండు రకాలుగా దెబ్బతీస్తుంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో మార్చిలో వచ్చిన అకాల వర్షాలు, వడగండ్ల వానకు చేతికొచ్చిన పంటలు నాశనమయ్యాయి. మధ్యప్రదేశ్లో 24 లక్షల ఎకరాలు, మహా రాష్ట్రలో 18 లక్షల ఎకరాల పంట ధ్వంసమయ్యింది. హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్లోని కొన్ని ప్రాంతాల్లో భారీగా పంటలు దెబ్బతిన్నాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలకు కేంద్ర ప్రభుత్వం రూ.1,351 కోట్లతో ఒక సహాయ ప్యాకేజీ ప్రకటించింది. వాతావరణ శాఖ నుంచి పెద్దగా వర్షాలు పడవని హెచ్చరిక వచ్చిదంటే అది కోట్లాది రైతుల నెత్తిన పిడుగు పడినట్టే. ఇప్పటికే వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రక్షామ పరిస్థితులతో గ్రామీణరంగంలో ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తమవుతాయి. రైతులు జీవనాధారం లేక కుంగిపోతారు. ప్రభుత్వం ఇచ్చే అరకొర సాయం రైతులకు ఉపశమనం కలిగించదు. వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా రైతులను ఆదుకునే పంటల బీమా పథకం లేకపోతే ప్రకృతి కన్నెర్ర చేసినప్పుడు.... కరువుకోరల్లో చిక్కుకున్నప్పుడు దారుణంగా బలయ్యేది దేశానికి తిండిపెట్టే అన్నదాతే. ద్విముఖ వ్యూహం కావాలి 2002, 2004లో కూడా వర్షాలకు కరువే. సాధారణ స్థాయి కన్నా 2002లో వర్షపాతం 22 శాతం తక్కువగానూ, 2004లో వర్షపాతం 17 శాతం తక్కువగానూ నమోదయ్యింది. అయితే 2012 ఆగస్టు వరకూ మహా రాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, రాజస్థాన్లో పడకపోయేసరికి ఈ నాలుగు రాష్ట్రాలను కరువు రాష్ట్రాలుగా ప్రకటిం చారు. అయితే ఆగస్టు చివర్లో ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడడంతో వరదలు కూడా వచ్చాయి. భూగోళ తాపం వాతావరణ పరిస్థితులపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నదో అన్నదానికి ఇదొక ఉదాహరణ. ఈ పరిస్థితులను నివారించడానికి ద్విముఖ వ్యూహాన్ని అనుసరించాలి. పర్యావరణానికి హాని కలిగించని విధంగా సహజవనరులను ఉపయోగించుకుంటూనే ఆర్థికాభివృద్ధిని సాధించే విధంగా పెట్టుబడులు పెట్టాలి. వాతావరణ పరిస్థితుల ఆధారంగా రైతులకు మేలు చేసే దేశవ్యాప్త పంటల బీమా పథకాన్ని రూపొందించాలి. దీన్ని కచ్చితంగా కరువుతో లింక్ చేయాలి. అంటే తగిన స్థాయిలో వర్షాలు పడక రైతు పంటను పండించలేకపోతే పంటల బీమా పథకం కింద అతనికి బీమా చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై ఎంతో కాలంగా చర్చ జరుగుతున్నా దీనికి రావాల్సిన ప్రాధాన్యత రావడం లేదు. ఈ దేశ ఆర్థికాభివృద్ధి వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉంటుంది. వర్షాలు ప డక వ్యవసాయోత్పత్తి తగ్గినా, ఇతర కారణాల ప్రభావా న్ని ప్రభుత్వం తగ్గించలేకపోయినా ఆర్థిక వ్యవస్థపై ప్రతి కూల ప్రభావం పడక తప్పదు. ఒకవేళ దేశ జీడీపీలో వ్యవసాయం వాటా 14 శాతానికి పడిపోయినా అది మ రీ తక్కువగా ఉందని భావించనక్కర్లేదు. సాగు రంగం ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తోందని చెప్పవచ్చు. (వ్యాసకర్త వ్యవసాయ రంగ నిపుణులు) విశ్లేషణ దేవీందర్ శర్మ -
రైతన్నకు రాహు(ల్) కాలం
విశ్లేషణ: దేవిందర్ శర్మ, వ్యవసాయరంగ నిపుణులు వ్యవసాయోత్పత్తుల మార్కెట్ కమిటీ చట్టం నుంచి పళ్లు, కూరగాయలను మినహాయించాలంటూ రాహుల్ గాంధీ కాంగ్రెస్ రాష్ట్రాలకు ఆదేశాలిచ్చి రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే ప్రయత్నాలకు తెరతీశారు. ప్రభుత్వం వ్యవసాయోత్పత్తులకు సేకరణ ధరల విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాతనే రైతులు ఖాయంగా గిట్టుబాటు రేటును పొందడం మొదలైంది. ప్రభుత్వం ప్రకటిస్తున్న ఈ కనీస మద్దతు ధరల వల్ల రైతులు ప్రయోజనం పొందుతున్నందున ఈ విధానాన్ని మరింత పటిష్టం చేయాలే తప్ప రద్దు చేయకూడదు. వ్యవసాయోత్పత్తుల మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ) చట్టం నుంచి పళ్లు, కూరగాయలను మినహాయించాల్సిందిగా కాంగ్రెస్పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరినట్లు ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ఏఐసీసీ సమావేశంలో చెప్పారు. రాహుల్ హుకుం వెలువడిందే తడవుగా అనేక కాంగ్రెస్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు జనవరి 15వ తేదీనాటికే ఆమేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఈ చర్యలు ఏమైనా తోడ్పడ్డాయా? అసలు వాస్తవం ఏమిటంటే... రాహుల్ గాంధీ నిర్ణయం అమల్లోకి వచ్చి ధరలపై ప్రభావం చూపడానికి చాలా ముందే డిసెంబర్లోనే నిత్యావసరాల ధరలు తగ్గిపోయాయన్నది ఇక్కడ గుర్తించాలి. ఈ మొత్తం వ్యవహారంలో ఏపీఎంసీ చట్టం రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తోందా లేక అసలు తప్పంతా వేరే చోట ఉందా అన్నది గుర్తించడం ఎంతో ముఖ్యం. ఈ అంశాన్ని మరింత లోతుగా పరిశీలిద్దాం. రైతుకు దక్కేది నాలుగు శాతమే! 2012 డిసెంబర్లో మల్టీబ్రాండ్ రిటైల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించిన బిల్లును పార్లమెంట్ ఆమోదించిన మరునాడే ఒక ప్రధాన దినపత్రికలో ఆసక్తికరమైన కథనం వెలువడింది. రైతులనూ, వినియోగదారులనూ బడా రిటైల్ కంపెనీలు ఎడాపెడా ఎలా దోచేస్తున్నాయో ఈ కథనం కళ్లకు కట్టినట్టు వివరించింది. ఉదాహరణకు హోల్సెల్ క్యాష్ అండ్ క్యారీ వ్యాపారం చేసే భారతీ వాల్మార్ట్ పంజాబ్లోని కాం ట్రాక్టు రైతుల నుంచి బేబీ కార్న్ కిలోకు రూ.8 చొప్పున కొనుగోలు చేసి హోల్సేల్లో కిలోకు రూ.100 ధరకు విక్రయిస్తోంది. చివరకు వినియోగదారులు కిలోకు రూ.200 చెల్లించాల్సివస్తోంది. మరోవిధంగా చెప్పాలంటే వినియోగదారుడు చెల్లించిన అంతిమ ధరలో నాలుగు శాతం మాత్రమే రైతుకు దక్కుతోందన్నమాట. ఇక ధాన్యం విషయాన్నే తీసుకుందాం. ఏపీఎంసీ చట్టాన్ని బీహార్ 2006లోనే రద్దు చేసింది. రైతులు తమ పంటను ఇష్టం వచ్చిన వారికి తమకు నచ్చిన రేటుకు అమ్ముకునే స్వేచ్ఛను కల్పించింది. ఈ ఏడాది పంజాబ్ రైతులు తమ ధాన్యాన్ని క్వింటాలుకు సేకరణ ధర రూ.1,310 పొందగా, బీహార్ రైతులు అతి కష్టంమీద క్వింటాలుకు రూ.800-900 స్థాయిలో మాత్రమే అమ్ముకోగలిగారు. నిజానికి ఇది ఘోరమైన రేటు. ప్రైవేటు వ్యాపారులు నిర్దాక్షిణ్యంగా సాగించిన దోపిడీకి ఇదొక ఉదాహరణగా పేర్కొనవచ్చు. రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా కృషి చేయాల్సిన వ్యవసాయ ఖర్చులు, ధరలకు సంబంధించిన కమిషన్ (సీఏసీపీ), వ్యవసాయానికి సంబంధించినంతవరకు బీహార్లో మార్కెటింగ్ సౌకర్యాలు బ్రహ్మాండంగా ఉన్నాయని పేర్కొనడం విచిత్రంగా కనిపిస్తుంది. అనేక మండీలు (దుకాణాలు) ఉన్నందున పంజాబ్లోని రైతులకు ప్రతి ఏటా ఖాయంగా గిట్టుబాటు రేటు లభిస్తుంది. మార్కెట్ సౌకర్యాలు విస్తరిస్తున్న సమయంలో ఏపీఎంసీ చట్టాన్ని రద్దు చేసి మార్కెట్లకు స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం కల్పించాల్సిందిగా సీఏసీపీ పంజాబ్ ప్రభుత్వాన్ని కోరుతోంది. మరో రకంగా చెప్పాలంటే పంజాబ్ రైతులను బీహార్ రైతుల బాట పట్టాల్సిందిగా కోరుతోందన్నమాట. లబ్ధి పొందేది 30 శాతం మంది రైతులే భారతదేశంలో దాదాపు 30 శాతం మంది రైతులు మాత్రమే ప్రభుత్వం ప్రకటించే సేకరణ ధరలను (కనీస మద్దతు ధరలు) పొందుతారు. మిగిలిన 70 శాతం మంది రైతులు గిట్టుబాటు ధరల కోసం మార్కెట్పై ఆధారపడాల్సిందే. ఈ విషయం బహుశా రాహుల్ గాంధీకి ఎవరూ చెప్పి ఉండరు. ఒకవేళ మార్కెట్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడిన ఈ 70 శాతం రైతులకు వ్యవసాయం ప్రోత్సాహకరంగా ఉంటే, జీవనప్రమాణాలు పెంచే విధంగా ఉంటే ఏపీఎంసీ చట్టాన్ని రద్దు చేయాల్సిందిగా ఈపాటికే పంజాబ్, హర్యానాలోని రైతులు డిమాండ్ చేసి ఉండేవారు. మరి అలా జరగలేదు. దానికి స్పష్టమైన కారణాలున్నాయి. ఏపీఎంసీ చట్టంలో అనేక లొసుగులు ఉన్నప్పటికీ ఇది రైతులకు కచ్చితంగా గిట్టుబాటు ధరను ఇస్తుంది. ఈ కారణం వల్లనే ఇతర పంటలకు ఖాయంగా తగిన రేటు వస్తుందన్న గ్యారంటీ లేనందున పంజాబ్ రైతులు ఇతర పంటలకు మళ్లకుండా అనేక ఏళ్లుగా గోధుమలు, వరినే సాగు చేస్తున్నారు. ఏపీఎంసీ వ్యవస్థ గుత్తాధిపత్య మార్కెట్కు బాటలు వేస్తుందనీ, స్వేచ్ఛా వాణిజ్యానికి ఆటంకాలు కల్పించి రైతులకు సరైన రేటు రానివ్వదంటూ కొందరు ఆర్థికవేత్తలు చేసే వాదనలు నవ్వు తెప్పిస్తాయి. ఇది పూర్తిగా తప్పుడు అభిప్రాయం. ఏపీఎంసీ చట్టం ప్రకారం ఎంపిక చేసిన మండీల వద్దకు రైతులు తమ ఉత్పత్తులను తెస్తారు. మొదట ప్రైవేట్ వ్యాపారులను కొనుగోలు చేసేందుకు అనుమతిస్తారు. వారు కొనుగోలు చేయగా ఏమైనా మిగిలితే ఆ సరుకును కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు ఆ తర్వాత మాత్రమే భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు రంగంలోకి దిగుతాయి. ఇదే వ్యాపారులకు చికాకు కలిగిస్తుంది. రైతులకు కనీస మద్దతు ధర చెల్లించడం వ్యాపారులకు ఎంతమాత్రం ఇష్టం ఉండదు. బీహార్లోని రైతుల నుంచి క్వింటాలుకు రూ.800-900కే ధాన్యాన్ని కొంటున్నప్పుడు పంజాబ్లోని రైతులకు ఏకం గా రూ.1,310 ధర ఎందుకు చెల్లించాలని వారికి అనిపిస్తుంది. ఏపీఎంసీని పూర్తిగా తొలగించాలని గుర్గావ్ వాణిజ్య, పారిశ్రామిక మండలి ఇప్పటికే హర్యానా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రైతుల నుంచి తక్కువ ధరకే ముడి సరుకులను కొనుగోలు చేయాలన్నది పారిశ్రామికవేత్తల ఆలోచన. మార్కెటింగ్ సౌకర్యాలు అంతంత మాత్రమే బీహార్లో ఏపీఎంసీ చట్టం రద్దయి ఏడేళ్లయిన తర్వాత కూడా వ్యవసాయంలో మార్కెటింగ్ సౌకర్యాలు విస్తృతం కాలేదు. రైతులను వారి ఖర్మానికి వదిలేశారు. ప్రభుత్వం మార్కెటింగ్ హంగులను పెంచలేదు సరి కదా, ప్రైవేటు రంగం ఈ దిశగా ఎలాంటి పెట్టుబడులూ పెట్టలేదు. నిజానికి వ్యవసాయ రంగంలో పచ్చగా ఉన్న పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాలలో ఇప్పటికే ఉన్న మౌలిక సౌకర్యాలను దోచుకుని ఇంకా లాభాలను గడించేందుకు పారిశ్రామికవర్గాలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ప్రభుత్వం వ్యవసాయోత్పత్తులకు సేకరణ ధరల విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాతనే రైతులు తమ పంటకు ఖాయంగా గిట్టుబాటు రేటును పొందడం మొదలైంది. ఇది ఇబ్బడిముబ్బడిగా ఉత్పత్తిని పెంచడానికి ప్రోత్సాహాన్ని ఇచ్చింది. రైతుకు గిట్టుబాటు ధర, కచ్చితమైన మార్కెట్తో హరిత విప్లవానికి పునాది ఏర్పడిందని చెప్పవచ్చు. ప్రభుత్వం ప్రకటిస్తున్న ఈ కనీస మద్దతు ధరల విధానంవల్ల రైతులు ప్రయోజనం పొందుతున్నందున ఈ విధానాన్ని మరింత పటిష్టం చేయాలే తప్ప రద్దు చేయకూడదు. దళారులను అరికట్టాలి ఇప్పుడు పనిచేస్తున్న మండీలలో కొన్ని లోపాలు ఉన్న మాటను ఎవరూ కాదనలేరు. వీటిని సరిదిద్దేందుకు ఏపీఎంసీ చట్టంలో తగిన నిబంధనలు కూడా ఉన్నాయి. రాజకీయ జోక్యం, శక్తిమంతమైన దళారుల వల్ల ప్రభుత్వం ఎన్నడూ దీనిలో జోక్యం చేసుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఫలితంగా ఈ గందరగోళం ఇంకా కొనసాగుతోంది. ఏపీఎంసీ కమిటీ చైర్మన్గా ఒక రాజకీయ నాయకుడిని రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు నియమిస్తున్నాయో నాకు అర్థం కావడం లేదు. మండీల పరిధి నుంచి కూరగాయలను తప్పించడం, అది కూడా ఏపీఎంసీ చట్టానికి 2005 నాటి సవరణ తర్వాత నిర్ణయం తీసుకోవడం చూస్తే... ప్రైవేటు కొనుగోలుదారులకు రాజమార్గం కల్పించిన ట్టే. అంటే ప్రైవేటు వ్యాపారులు మండీలను పక్కకు నెట్టి ఇకనుంచి నేరుగా రైతుల నుంచి గోధుమలు, ధాన్యం కొనుగోలు చేస్తారు. ప్రభుత్వం అమలుపరుస్తున్న సేకరణ విధానాన్ని రాహుల్ గాంధీ ఈ పద్ధతిలో గండికొడుతున్నారన్న మాట. ఇది మొదటి చర్య మాత్రమే. త్వరలో ఇలాంటివి మరిన్ని నిర్ణయాలు రానున్నాయి. గత నాలుగు దశాబ్దాలుగా ఆహారరంగంలో మనం ఎంతో శ్రమకోర్చి నిర్మించుకున్న స్వయంసమృద్ధి పునాదులను రాహుల్ చాలా తెలివిగా పెకలించి వేస్తున్నారు.