Environmental Protection
-
వాడీవేడిగా ‘కాప్’ సదస్సు
బాకు/న్యూఢిల్లీ: భూతాపంలో పెరుగుదలను కట్టుదిట్టంచేసి పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ప్రపంచదేశాలు ఒక్కతాటిమీదకొచ్చే ఐక్యరాజ్యసమితి చర్చావేదిక ‘కాప్’సదస్సు సోమవారం అజర్బైజాన్ దేశంలో ఆరంభమైంది. పర్యావరణ పరిరక్షణ కోసం భారీగా నిధులు సమీకరించడం, వెచ్చించడంసహా గత ఉమ్మడి కార్యాచరణ పటిష్ట అమలుపై సభ్యదేశాల మధ్య నెలకొన్న స్పర్థ సమసిపోవాలని ఆతిథ్య అజర్బైజాన్ దేశం ఈ సందర్భంగా కోరింది. నవంబర్ 22వ తేదీదాకా జరిగే కాన్ఫెరెన్స్ ఆఫ్ పార్టీస్(కాప్) 29వ సమావేశాలు అజర్బైజాన్లోని బాకు నగరంలో సోమవారం ప్రారంభంకాగా సభ్యదేశాల అగ్రనేతలు, ప్రతినిధి బృందాలు, పెద్దసంఖ్యలో పర్యావరణవేత్తలు పాల్గొన్నారు. శిలాజఇంధనాల అతివినియోగం దుష్ప్రభావాలను ఎదుర్కొంటున్న బాధిత గ్లోబల్ సౌత్ వర్ధమాన దేశాలకు కాలుష్యకారక సంపన్న దేశాలు రుణాలకు బదులు అధిక గ్రాంట్లు(నిధులు) ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్ మళ్లీ తెరమీదకు తెచ్చారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి వాతావరణమార్పుల విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి సీమన్ స్టియెల్ ప్రారంభోపన్యాసం చేశారు.‘‘అత్యధిక కర్భన ఉద్గారాలను వెదజల్లుతున్న దేశాల్లో మూడింట రెండొంతుల దేశాలు కాలుష్యాన్ని తగ్గించుకోలేకపోతే భారీమూల్యం చెల్లించుకోకతప్పదు. సరకు రవాణా గొలుసులు తెగిపోకుండానే కాలుష్యాన్ని తగ్గిస్తూ వస్తూత్పత్తిని కొనసాగించే సమర్థ చర్యల అమలుకు దేశాలు కంకణబద్దంకావాలి. లేదంటే ప్రపంచ ఆర్థికవ్యవస్థ కునారిల్లుతుంది. వాతావరణ పరిరక్షణకు నిధుల సమీకరణకు నవ్య మార్గాలను చూపించండి. ఇది ప్రతి ఒక్కదేశం బాధ్యత’’అని చెప్పారు. ఏమిటీ కాప్?వాతావరణాన్ని కాపాడేందుకు ప్రపంచదేశాలు ఒకచోట చేరి చర్చించే అంతర్జాతీయ కూటమి వేదికే కాప్. ఐరాస వాతావరణ మార్పు కూటమి(యూఎన్ఎఫ్సీసీసీ) కార్యనిర్వాహక విభాగాన్నే కాన్ఫెరెన్స్ ఆఫ్ పార్టీ(కాప్)గా పిలుస్తారు. వాతావరణ మార్పు ఒప్పందం అమలు, భవిష్యత్ కార్యాచరణ, కాలుష్యాల కట్టడి, శిలాస ఇంథనాల వాడకాన్ని కనిష్టానికి దించడం, వాతావరణమార్పుల దు్రష్పభావాల బారినపడిన పేదదేశాలకు నిధులు ఇచ్చేందుకు సంపన్న, కాలుష్యకారక దేశాలను ఒప్పించడం వంటి కీలక బాధ్యతలను కాప్ చూస్తుంది. అయితే భారీ నిధులిస్తామంటూ సమావేశాలప్పుడు భీష్మ ప్రతిజ్ఞలు చేస్తున్న సంపన్న దేశాలు తర్వాత నిధులివ్వకుండా ముఖంచాటేస్తున్నాయి. దీంతో సంపన్న దేశాల సంయుక్త ప్రకటనలు కార్యాచరణకు నోచుకోక కాగితాలకే పరిమితమవుతున్నాయి. పారిశ్రామికయుగం మొదలుకాకముందునాటితో పోలిస్తే ఉష్ణోగ్రతలో పెరుగుదలను 1.5 డిగ్రీ సెల్సియస్కు పరిమితం చేయాలని కాప్ కోరుకుంటోంది. కానీ అది ఈఏడాది ఏకంగా 3 డిగ్రీ సెల్సియస్ దాటి రాబోయే అతివృష్టి, అనావృష్టి, తుపాన్లు, వరదలు, కరువులు వంటి అనూహ్య వాతావరణ పరిస్థితులను సర్వసాధారణం చేసేస్తూ భావి తరాలకు భవిష్యత్తేలేకుండా చేస్తోంది. దారుణ దిశలో పయనిస్తున్నాం: కాప్ అధ్యక్షుడు కాప్29 అధ్యక్షుడు ముఖ్తార్ బాబాయేవ్ మాట్లాడారు. ‘‘మానవ కార్యకలాపాలు, అధికంగా శిలాజ ఇంధనాల వినియోగంతో భూతాపోన్నతి ఏటా 3 డిగ్రీసెల్సియస్ అధికమవుతోంది. ఈ పెడపోకడ ఇలాగే కొనసాగితే వందల కోట్ల ప్రజానీకం దారుణకష్టాల కడలిలో కొట్టుకుపోకతప్పదు. నూతన సమ్మిళిత లక్ష్యం(న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్–ఎన్సీక్యూజీ)ని సాధించాలంటే 2009లో ఏటా 100 బిలియన్ డాలర్ల నిధులివ్వాలన్న కాలంచెల్లిన నిధుల లక్ష్యాన్ని సవరించుకోవాల్సిందే. సమస్య తీవ్రత, విస్తృతిని దృష్టిలో ఉంచుకుని సభ్యదేశాలు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని, భూతాపం కట్టడిలో మెరుగైన భాగస్వామ్య పాత్ర పోషించాలి’’అని ముఖ్తార్ పిలుపునిచ్చారు. అయితే వర్ధమానదేశాలు తమ పరిధిలో కాలుష్యాన్ని తగ్గించుకునేందుకు గరిష్టంగా 6.85 ట్రిలియన్ డాలర్ల నిధులు అవసరమవుతాయని ఐరాస వాతావరణవిభాగం చెప్పడం గమనార్హం. -
‘మిషన్ లైఫ్’తో భవిష్యత్తు!
సాక్షి, అమరావతి: వాతావరణంలో జరుగుతున్న అనూహ్య మార్పులు మానవ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే పర్యావరణం పూర్తిగా దెబ్బతిని భావితరాలు భూమిపై మనుగడ సాగించడమే కష్టమయ్యే అవకాశముంది. అందుకే పర్యావరణాన్ని కాపాడుకుంటూ.. నీరు, ఇంధనం తదితరాలన్నీ పొదుపుగా వినియోగించాలి. ప్లాస్టిక్ను విడనాడాలి.. కాలుష్యాన్ని తగ్గించాలి. ఈ లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ(బీఈఈ) ‘మిషన్ లైఫ్’కు శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వంలో ఏపీ నుంచి పలు నగరాలు ఎంపికవ్వగా.. అందులో రాజమహేంద్రవరం కూడా చేరింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ కృషితో.. భావితరాలకు ఇంధన వనరులను అందించడం కోసం.. పర్యావరణంలోని కర్బన ఉద్గారాలను తగ్గించి ప్రకృతిని కాపాడటమే లక్ష్యంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసింది. బీఈఈ నేతృత్వంలో జరిగే ‘మిషన్ లైఫ్’ కార్యక్రమాలకు చేయూతనందించింది. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ఇంధన సంరక్షణ, నీటి సంరక్షణ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను విడనాడడం, మంచి ఆహారపు అలవాట్లు, ఆరోగ్యకరమైన జీవితం, చెత్త, ఈ–వేస్ట్ తగ్గింపు అనే ఏడు విభాగాల్లో 75 కార్యక్రమాలను మన రాష్ట్రంలో అమలు చేసేందుకు బీఈఈ శ్రీకారం చుట్టింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, కర్నూలు నగరాలను బీఈఈ ఎంపిక చేసుకుంది. ఆ క్రమంలో రాజమహేంద్రవరంపైనా బీఈఈ దృష్టి సారించింది. విస్తృత ప్రచారం.. మిషన్ లైఫ్లో భాగంగా విస్తృత ప్రచారం కోసం స్థానికంగా లైఫ్ గ్రూపులను ఏర్పాటు చేయడం, సైకిల్ ర్యాలీలు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్లపై ప్రత్యేక డ్రైవ్లు, సోషల్ మీడియాలో ప్రచారం, కమ్యూనిటీ వర్క్షాప్లు, సెమినార్లు, క్విజ్ ప్రోగ్రామ్లను బీఈఈ నిర్వహిస్తోంది. ట్రాఫిక్ పోలీసులు, వలంటీర్ల ద్వారా.. సిగ్నల్ వద్ద రెడ్ లైట్ పడినప్పుడు వాహనాల ఇంజిన్లను ఆపివేసేలా ప్రత్యేక ప్రచారం, కాలుష్య కారక వాహనాలను అరికట్టడం కోసం ప్రత్యేక డ్రైవ్లను చేపడుతోంది.స్కూళ్లల్లో ఎనర్జీ క్లబ్ల ఏర్పాటు ద్వారా విద్యార్థులు తమ ఇళ్ల వద్ద ఇంధన పరిరక్షణ ఆవశ్యకత గురించి వివరించేలా కృషి చేస్తోంది. దీని కోసం గత ప్రభుత్వం ప్రత్యేకంగా క్లైమేట్ చేంజ్ సెల్(సీసీసీ)ను రూపొందించింది. ఇందులో నిపుణులు, విద్యుత్ పంపిణీ సంస్థలు, మునిసిపల్, పట్టణాభివృద్ధి, రవాణా తదితర విభాగాలను భాగస్వాములను చేసింది. ఈ సెల్ వాతావరణ మార్పుల వల్ల ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారాలను సూచిస్తుంటుంది.వంద కోట్ల మందికి భాగస్వామ్యమే లక్ష్యం మిషన్ లైఫ్కు ఏపీలోని ఆరు నగరాలను ఎంపిక చేసుకున్నాం. ప్రజలు, వివిధ సంఘాలు, ప్రభుత్వ విభాగాలతో కలిసి కార్యక్రమాలు చేపడుతున్నాం. తద్వారా రాష్ట్రంలో పర్యావరణ క్షీణతను అధిగమించడంతో పాటు ఆర్థిక వృద్ధిని సాధించడం, ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడం, స్థిరమైన మౌలిక సదుపాయాలు, మెరుగైన జీవన ప్రమాణాల కోసం గ్రీన్ జాబ్స్ సృష్టించవచ్చని అంచనా వేస్తున్నాం. 2027–28 నాటికి వంద కోట్ల మంది భారతీయుల్ని మిషన్లైఫ్లో భాగస్వాములను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. – మిలింద్ దేవ్రా, బీఈఈ కార్యదర్శి మనం మారితేనే..» ట్రాఫిక్ లైట్లు, రైల్వే క్రాసింగ్ల వద్ద వాహనాల ఇంజన్లను ఆపితే ఏటా దాదాపు 22.5 బిలియన్ కిలోవాట్స్ ఇంధనం ఆదా చేయొచ్చు. » షాపింగ్లకు క్లాత్ బ్యాగులను వినియోగిస్తే 375 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలోకి వెళ్లకుండా నివారించవచ్చు. » వ్యర్థ పదార్థాలను కంపోస్ట్ చేయడం వల్ల 15 బిలియన్ టన్నుల ఆహారం వృథా కాదు. » నీటి కుళాయిలను సకాలంలో ఆపివేయడం వల్ల 9 ట్రిలియన్ లీటర్ల నీటిని ఆదా చేయొచ్చు. » పని చేయని ఎలా్రక్టానిక్ గాడ్జెట్లను రీసైకిల్ చేయడం ద్వారా 0.75 మిలియన్ టన్నుల ఈ–వ్యర్థాలను రీసైకిల్ చేయొచ్చు. » ఏసీలను 24 డిగ్రీల వద్ద వినియోగించడం, ఎల్రక్టానిక్ పరికరాలను ఇంధన పొదుపు మోడ్లో వాడడం, తక్కువ నీటిని వినియోగించే పంటలు వేయడం, గ్రామీణ నీటి వనరుల రీచార్జ్ను ప్రోత్సహించడం, ఎల్ఈడీ లైట్లను వినియోగించడం, ప్రజా రవాణా తదితర మంచి విధానాలను ఉపయోగిస్తే.. మిషన్ లైఫ్ లక్ష్యాలను చేరుకోవచ్చు. » బీఈఈ ఇంధన సామర్థ్య పథకాలు, కార్యక్రమాల ద్వారా.. 2022–23లో 307 బిలియన్ యూనిట్ల విద్యుత్, 24.68 మిలియన్ టన్నుల చమురు సమానమైన థర్మల్ శక్తితో సహా సుమారు 306.40 మిలియన్ టన్నుల ఉద్గారాల్ని తగ్గించింది. -
Mann Ki Baat: జన స్పందనకు వందనం
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలైన భారత సార్వత్రిక ఎన్నికల్లో 65 కోట్ల మందికిపైగా ప్రజలు ఓటు వేశారని, దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్య ప్రక్రియల పట్ల తిరుగులేని విశ్వాసం వ్యక్తం చేశారని ప్రధాని మోదీ కొనియాడారు. ఎన్నికల్లో పాల్గొన్న ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. విజయవంతంగా ఎన్నికలు నిర్వహించిన కేంద్ర ఎన్నికల సంఘానికి అభినందనలు తెలిపారు. వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ ఆదివారం తొలి ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి దాదాపు 30 నిమిషాలపాటు మాట్లాడారు. విభిన్నమైన అంశాలను ప్రస్తావించారు. తన అభిప్రాయాలు పంచుకున్నారు. వచ్చే నెలలో పారిస్ ఒలింపిక్స్లో పోటీ పడబోతున్న భారత క్రీడాకారులకు ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు. మన ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ సోషల్ మీడియాలో ‘ఛీర్4భారత్’ హ్యాష్ట్యాగ్తో పోస్టులు పెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. టోక్యోలో జరిగిన గత ఒలింపిక్స్లో భారత ఆటగాళ్ల ప్రదర్శన ప్రతి ఒక్కరి హృదయాలను దోచుకుందని ప్రశంసించారు. పారిస్ ఒలింపిక్స్కు రెట్టించిన ఉత్సాహంతో సిద్ధమవుతున్న మనవాళ్లకు మద్దతు తెలపాలని సూచించారు. ఎన్నో రకాల క్రీడల్లో భారత ఆటగాళ్లు విశేషమైన ప్రతిభ చూపుతున్నారని హర్షం వ్యక్తంచేశారు. ఒలింపిక్స్కు వెళ్తున్న మన వాళ్లను త్వరలో కలుస్తానని, భారతీయులందరి తరపున వారికి ప్రోత్సాహం అందిస్తానని పేర్కొన్నారు. మన్ కీ బాత్లో మోదీ ఇంకా ఏమన్నారంటే..నా తల్లి పేరిట మొక్క నాటాను ‘‘పర్యావరణ పరిరక్షణ కోసం అడవుల పెంపకంపై మనమంతా దృష్టి పెట్టాలి. ఇందులో భాగంగా ప్రపంచ పర్యావరణ దినం సందర్భంగా ‘తల్లి పేరిట ఒక మొక్క’ కార్యక్రమం ప్రారంభించుకున్నాం. నా మాతృమూర్తికి గుర్తుగా మొక్క నాటాను. తల్లి పేరిట, తల్లి గౌరవార్థం మొక్కలు నాటే కార్యక్రమం వేగంగా ప్రజల్లోకి వెళ్తుండడం ఆనందంగా ఉంది. అమ్మతో కలిసి మొక్కలు నాటిన చిత్రాలను జనం సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. కన్నతల్లిలాంటి భూగోళాన్ని కాపాడుకోవడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుంది. సంస్కృత భాషను గౌరవించుకుందాం ఆలిండియా రేడియోలో సంస్కృత వార్తల బులెటిన్కు 50 ఏళ్లు నిండాయి. ప్రాచీన భాషకు ప్రాధాన్యం ఇస్తున్న ఆలిండియా రేడియోకు నా అభినందనలు తెలియజేస్తున్నా. భారతీయ విజ్ఞానం, శా్రస్తాల పురోగతి వెనుక సంస్కృత భాష కీలక పాత్ర పోషించింది. సంస్కృత భాషను మనమంతా గౌరవించుకోవాలి. నిత్య జీవితంలో ఈ భాషతో అనుసంధానం కావాలి. బెంగళూరులోని ఓ పార్కులో స్థానికులు ప్రతి ఆదివారం కలుసుకుంటారు. సంస్కృత భాషలోనే మాట్లాడుకుంటారు. మరోవైపు దేశవ్యాప్తంగా గిరిజనులు ఈరోజు(జూన్ 30) ‘హూల్ దివస్’ జరుపుకుంటున్నారు. 1855లో సంథాల్ గిరిజన యోధులు వీర్ సింధూ, కాన్హూ అప్పటి బ్రిటిష్ పాలకులపై తిరగబడ్డారు. పరాయి పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించారు. వీర్ సింధూ, కాన్హూకు నివాళులు అరి్పస్తున్నా. మన సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ భారతీయ సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగాఎనలేని ఆదరణ లభిస్తోంది. ఇండియన్ కల్చర్పై కువైట్ ప్రభుత్వం కువైట్ నేషనల్ రేడియోలో ప్రతి ఆదివారం అరగంటపాటు హిందీ భాషలో ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేస్తోంది. మన సినిమాలు, కళలపై అక్కడ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తుర్కమెనిస్తాన్లో ఈ ఏడాది మే నెలలో ఆ దేశ అధ్యక్షుడు 24 మంది ప్రపంచ ప్రఖ్యాత కవుల విగ్రహాలను ఆవిష్కరించారు. అందులో గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహం కూడా ఉంది. ఇది గురుదేవ్తోపాటు భారత్కు కూడా ఒక గొప్ప గౌరవమే. కరీబియన్ దేశాలైన సురినామ్, సెయింట్ విన్సెంట్, గ్రెనాడైన్స్లో ఇటీవల భారతీయ వారసత్వ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అంతేకాదు 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21న ప్రపంచమంతటా అమితోత్సాహంతో నిర్వహించుకున్నారు. సౌదీ అరేబియా, ఈజిప్టులో మహిళలు యోగా కార్యక్రమాలను ముందుండి నడిపించారు’’ అన్నారు.వోకల్ ఫర్ లోకల్ మన స్వదేశీ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. మన వద్ద తయారైన ఉత్పత్తులు అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నాయంటే అది మనందరికి గర్వకారణమే. కేరళలోని అట్టప్పాడీ గ్రామంలో గిరిజన మహిళలు తయారు చేస్తున్న కార్తుంబీ గొడుగులకు అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. ఈ గొడుగుల ప్రస్థానం ఒక చిన్న కుగ్రామం నుంచి బహుళ జాతి సంస్థల దాకా చేరుకుంది. ‘వోకల్ ఫర్ లోకల్’కు ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏముంటుంది? లోకల్ ఉత్పత్తులను గ్లోబల్కు చేర్చడంలో జమ్మూకశ్మీర్ కూడా తక్కువేం కాదు. చలి వాతావరణంలో పండించే బఠాణీలు పుల్వామా నుంచి గత నెలలో లండన్కు ఎగుమతి అయ్యాయి. జమ్మూకశ్మీర్ సాధించిన ఈ ఘనత అందరికీ స్ఫూర్తిదాయకం. ఈ విజయం జమ్మూకశీ్మర్ అభివృద్ధికి కొత్త ద్వారాలు తెరుస్తుంది. ప్రజా సమస్యలపై ప్రస్తావనేది: విపక్షాలు‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ ప్రజా సమస్యలను ప్రస్తావించలేదని కాంగ్రెస్ పార్టీ మీడియా, ప్రచార విభాగం చైర్మన్ పవన్ ఖేరా ఆదివారం విమర్శించారు. నీట్– యూజీ పరీక్షలో అక్ర మాలు, రైల్వే ప్రమాదాలు, మౌలిక సదుపాయాల ధ్వంసంపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఢిల్లీ ఎయిర్పోర్టులో పైకప్పు కూలిపోయి ఒకరు మరణించారని, దీనిపై మోదీ నోరెత్తలేదని మండిపడ్డారు. నీట్–యూజీ పేపర్ లీకేజీ, అక్రమాలపై జనం దృష్టిని మళ్లించడానికి కేరళలో తయారయ్యే గొడుగుల గురించి మోదీ ప్రస్తావించారని విమర్శించారు. ప్రజల మనసులో మాటను మోదీ తెలుసుకోవాలని పవన్ ఖేరా హితవుపలికారు. -
పిచ్చుక మీదనా బ్రహ్మాస్త్రం?
‘‘పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం’’ అనే జాతీయం ఉంది. అతి తక్కువ బలం ఉన్నప్రాణి మీద అనవసరంగా అతి పెద్ద బలప్రయోగం చేయటం అనే అర్థంలో ఉపయోగిస్తారు. ఎంత చిన్నప్రాణి అయినా దాని అస్తిత్వం నిరుపయోగం కాదు. విశ్వంలో, ముఖ్యంగా భూగోళంలో, ప్రధానంగా అది ఉండే ప్రాంతంలో అది పోషించవలసిన పాత్ర ఒకటి ఉండనే ఉంటుంది. పర్యావరణ పరిరక్షణ, తద్వారా పర్యావరణ సమతౌల్యత ఉంటాయి. దానికి భంగం కలిగిస్తే పర్యవసానం అనుభవించ వలసి ఉంటుంది. ఒక పిచ్చుక సంవత్సరంలో 6.5 కిలోల బియ్యం తింటుంది అని చైనాలో ఒకప్పుడు చేపట్టిన సర్వే తెలిపింది. మొత్తం పిచ్చుకలు లేకుండా చేయగలిగితే 60 వేల మందికి ఆహారం లభిస్తుంది అని కూడా తెలిపింది. ఇంకేముంది? అసలే అధిక జనాభా సమస్య ఉన్న చైనా, వీలైనంత మందికి ఆహారం అందించటానికి ఇదొక మార్గం అనుకుని పిచ్చుకల నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టింది. 30 లక్షల పిచ్చుకలని చంపారు. 1958 – 61 సంవత్సరాల మధ్య చైనాలో తీవ్రమైన కరవు వచ్చింది. సుమారుగా నాలుగు కోట్ల యాభై వేల మంది చనిపోయారు. కారణం ఏమై ఉంటుంది అని విచారణ చేస్తే పిచ్చుకలు లేక పోవటం వల్ల అని తేలింది. అదెట్లా? పిచ్చుకలు ధాన్యం తినటంతోపాటు పంటలని నాశనం చేసే పురుగులని కూడా తింటాయి. చీడ పురుగులని తినే పిచ్చుకలు లేక పోవటంతో పంటలకి చీడ పట్టి, తెగులు సోకి ధాన్యం దిగుబడి గణనీయంగా తగ్గింది. అది రాను రాను పెరిగింది. ప్రజలు తిండి లేక చనిపోయారు. దీనికి పరిష్కారం పంటలని నాశనం చేసే తెగుళ్లు కలిగించే పురుగులని రసాయన పదార్థాలు వాడ నవసరం లేకుండా తినేసే పిచ్చుకలు ఉండేట్టు చేయటమే అని నిర్ధారించారు. చేసేది ఏమీ లేక పిచ్చుకలని దిగుమతి చేసుకోవాలనుకున్నారు. రష్యా నుండి పిచ్చుకలని దిగుమతి చేసుకున్నారు. పరిస్థితి అదుపు లోకి వచ్చింది. ఇటువంటి శాస్త్రీయమైన విషయాలని మన దేశంలో ఒక ఆనవాయితీగా, ఆచారంగా చేయటం అలవాటు. భారతదేశంలో, ముఖ్యంగా తెలుగువారు వరికంకులని కుచ్చుగా అల్లి ఇంటి ముందు వేలాడ దీసే వారు. పిచ్చుకలు వచ్చి ఒక్కొక్క వడ్లగింజని తీసుకు వెళ్లేవి. అది రైతు పురుగులని తిని చీడ పీడల నుండి పంటని రక్షించిన పిచ్చుక పట్ల చూపించే కతజ్ఞత. ఇంటి ముందు కొన్ని గింజలు చల్లటం అలవాటు. ఆ అవకాశం ఉన్నా, లేక పోయినా ప్రతి రోజు పక్షులకి, ప్రత్యేకంగా కాకికి తినబోయే ముందు ఒక ముద్ద పెట్టటం అలవాటు. కాకి పరిసరాల్లో ఉన్న చెత్తని, చిన్న చిన్న పురుగులని తిని శుభ్రం చేస్తుంది. దేవాలయాలలో కూడా బలిహరణం అన్న పేరుతో నాలుగు దిక్కుల అన్నం ఉంచటం సంప్రదాయం. ఇంటి చూరులో పిచ్చుక గూడు పెడితే పరమానందం. ఆ గూట్లో పెట్టిన గుడ్లను పిల్లి తినకుండా కాపలా కాయటం ఒక సరదా. అవి ఉండే ప్రదేశాలని మనం ఆక్రమించి, చెట్లని నరికి వాటికి ఆహారం లేకుండా చేసినందుకు ఈ మాత్రం చేయక పోతే కృతఘ్నులం అవుతాం. అలాగని పిల్లులని పూర్తిగా తరమం. పిల్లి తిరుగుతుంటే ఆ వాసనకి ఎలుకలు విజృంభించవు. సృష్టిలో ప్రయోజనం లేని జీవి ఒక్కటి కూడా లేదు. గుర్తించక పోవటం మన లోపం. జాగ్రత్తగా గమనిస్తే ఇతర జీవులని, ప్రకృతిని స్వార్థానికి వాడుకుని ఎవరికీ ఉపయోగ పడని ప్రాణి మానవుడొక్కడే నేమో అనిపిస్తుంది. కనీసం పిచ్చుక పాటి అయినా చేయవద్దా? – డా. ఎన్. అనంత లక్ష్మి -
ప్రపంచ పర్యావరణానికి కొత్త గీతం
ఆడవాళ్లకు ఇంటి పని, వంటపని, మహా అయితే చిన్నదో పెద్దదో ఉద్యోగం చేయడం తప్ప పెద్ద పెద్ద ఆర్థిక వ్యవహారాలేం తెలుస్తాయి... అని చప్పరించేసే వారికి చెంపపెట్టు గీతాబాత్రా. భారతదేశానికి చెందిన ఆర్థికవేత్తల పేర్లు కొన్ని చెప్పమంటే మొదటి పది అంకెల్లోనే ఉండే పేరు ఆమెది. ఆర్థికవేత్తగా ఎంతో క్రమశిక్షణతో... అంతకుమించిన నిబద్ధతతో ఆమె తీసుకునే విధానపరమైన కీలక నిర్ణయాలే ప్రపంచ బ్యాంకు తాజా సమావేశంలో ఆమెను గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీ డైరెక్టర్గా ఏకగ్రీవంగా ఎన్నుకునేలా చేశాయి. అంతేకాదు, ఆ పదవిలో నియామకం అయిన తొలి మహిళా డైరెక్టర్గా కూడా యాభై ఏడు సంవత్సరాల గీతాబాత్రా పేరు ఒక్కసారిగా జాతీయ, అంతర్జాతీయ పత్రికలలో పతాక శీర్షికలకు ఎక్కింది. నిజానికి ఈ నియామకం ఇప్పటికి ప్పుడు తీసుకున్న నిర్ణయం ఏమీ కాదు. సుమారు మూడు వారాల క్రితం వాషింగ్టన్లో జరిగిన జీఈఎఫ్ 66వ కౌన్సిల్ మీటింగ్లోనే ఆమె పేరు పరిశీలనకు వచ్చింది. ఆ తర్వాత గీతాబాత్రా అయితేనే ఈ పదవికి తగిన న్యాయం చేయగలదని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే ఆమెను ఈ స్థానంలో నియమించారు. అయితే జీఈఎఫ్ డైరెక్టర్గా నియమితురాలు కావడం ఆమెకు ఏదో గొప్ప పదవిని కట్టబెట్టినట్టు కాదు... ఎన్నో సవాళ్లతో కూడిన ఎంతో బాధ్యతాయుతమైన స్థానం అది. 1998లో వరల్డ్ బ్యాంక్లో చేరడానికన్నా ముందు ఆమె అమెరికాలోని కొన్ని ప్రైవేట్ బ్యాంక్లలో పై స్థాయిలో పని చేసింది. అసలు ఆమె నేపథ్యం ఏమిటో చూద్దాం. గీతాబాత్రాది కొత్తదిల్లీ. ముంబాయిలోని విల్లా థెరిసా స్కూల్లో చదువు పూర్తయ్యాక చెన్నైలోని స్టెల్లా మేరిస్ కాలేజీలో అర్థశాస్త్రంలో డిగ్రీ చేసింది. ఆ తర్వాత ఎంబీఏ ఫైనాన్స్ చేసింది. ఇక ఉద్యోగం చూసుకుందాం అనుకుంటుండగా ఆమె ప్రోఫెసర్లలో ఒకరి ప్రోద్బలంతో అమెరికా వెళ్లి ఎకనామిక్స్లో పీహెచ్డీ చేసింది. అక్కడే అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంక్లో సీనియర్ మేనేజర్గా కొన్ని సంవత్సరాల పాటు పని చేసింది. వరల్డ్ బ్యాంక్కు అనుబంధ సంస్థలలో ఆమె 2005 వరకు పని చేసింది. అప్పుడే ఆమె ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్కు అడ్వైజరీ సర్వీసెస్లో పని చేసింది. ఆ తర్వాత ఆమె భారతదేశం నుంచి వరల్డ్ బ్యాంక్ ఐఈజీలో చీఫ్ ఎవల్యూటర్ అండ్ మేనేజర్గా కార్పొరేట్ థీమాటిక్ ఎవల్యూషన్ బాధ్యతలు చేపట్టింది. ఆ తర్వాత 2015 లో జీఈఎఫ్ ఐఈవోగా చేరి, నాటినుంచి టీమ్తో పని చేయిస్తోంది. నాటినుంచి ఆమె ఎన్నో విపత్కర పరిస్థితులను అధిగమించడంలో ఎంతో సమర్థనీయమైన పాత్రను పోషించింది. ఎన్నో పుస్తకాలు రాసింది. మరెన్నింటికో సంపాదకత్వ బాధ్యతలు వహించింది. ప్రస్తుతం నార్ద్రన్ వర్జీనియాలో భర్త ప్రకాష్, కుమార్తె రోషిణితో కలిసి జీవిస్తోంది. జీఈఎఫ్ ‘గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫెసిలిటీ) పర్యావరణ పరిరక్షణకు ప్రపంచ బ్యాంకు చేపట్టే అన్ని బాధ్యతలను ఆమె పర్యవేక్షించడమే కాదు.. అందుకు కావలసిన. కీలక నిర్ణయాలు కూడా తీసుకోనున్నారు. -
Rennie Joyy: జీవితాన్ని దిద్దుకుంది... పేదల పక్షాన నిలిచింది
రెనీ జాయ్ ఢిల్లోలో కార్పోరేట్ అడ్వకేట్. రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్కు వైస్ప్రెసిడెంట్. జీవితం నేర్పిన పాఠాలతో అలేఖ్ ఫౌండేషన్ పేరుతో పేద మహిళలు, పిల్లలకు ఉచితంగా వృత్తి విద్యాకోర్సులు నేర్పించి, వారి కాళ్లపై వారు నిలబడేలా సహాయం చేస్తోంది. అవసరమైనప్పుడు వారి కోసం న్యాయపోరాటాలు చేస్తుంది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రచారం చేస్తోంది. ఈ ప్రయాణంలో ఏదీ సవ్యంగా లేదని, ఒడిదొడుకులతో నడిచిన తన జీవితాన్ని, తిరిగి దిద్దుకున్న విధానాన్ని పరిచయం చేస్తోంది. ‘‘మా తాతగారు ఆర్మీ ఉద్యోగి. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసి, చివరకు ఢిల్లీలో స్థిరపడ్డారు. మా అమ్మనాన్నలకు నేను ఒక్కదాన్నే సంతానం. నా చిన్నతనంలో మా అమ్మనాన్నలు విడివిడిగా ఉండేవారు. దీంతో నాన్న నుంచి ఎలాంటి సపోర్ట్, సాయం లభించలేదు. మా అమ్మనాన్నలు అంటే అమ్మమ్మ తాతయ్యలే. దీంతో కుటుంబం అసంపూర్తిగా ఉందని ఎప్పుడూ భావించలేదు. మా అమ్మనాన్నలు విడి విడిగా ఉన్న విషయం ఎవరికీ తెలియలేదు. ఆ రోజుల్లో విడాకులు తీసుకోవడం అనేది సమాజం దృష్ట్యా మంచిది కాదు అనే అభిప్రాయం ఉండేది. అందుకే వాళ్లు చాలా ఏళ్లు విడాకులు తీసుకోలేదు. నేను కాలేజీకి వెళ్లిన తర్వాత వారు చట్టబద్ధంగా విడిపోయారు. సమాజం ఇలా ఆలోచించడం వల్ల ఆ సమయంలో నా తల్లిదండ్రులు విడిపోయారని ఎవరికీ చెప్పుకోలేకపోయాను. ఎందుకంటే ఈ విషయం తెలిస్తే వెంటనే నా పట్ల వారి దృక్పథం మారిపోతుందనే భయం ఉండేది. చిన్న వయసులోనే.. నా తల్లిదండ్రులు విడిపోవడానికి గల కారణాలన్నీ చూసిన తర్వాత, ఆడపిల్లలు తమ కాళ్లపై తాము నిలబడాలని నాకు చాలా చిన్న వయసులోనే అర్ధమైంది. మా అమ్మమ్మ ఎప్పుడూ ‘ఎంత సంపాదించినా, ఏ పని చేసినా ఫర్వాలేదు. కానీ, నీ కాళ్ల మీద నువ్వు నిలబడటమే ముఖ్యం’ అనేది. కుటుంబంలో ఏ సమస్య వచ్చినా దానిని నివారించే ఉపాయాలను కనుక్కోమనేది. అలాంటి వాతావరణంలో పెరగడం వల్ల పెద్దయ్యాక మహిళల హక్కుల కోసం పోరాడాలని అనుకునేదాన్ని. చదువు తర్వాత బ్యాంకింగ్ రంగంలో సేల్స్ అండ్ మార్కెటింగ్ టీమ్లో చేరి, నా కెరీర్ను ప్రారంభించాను. నష్టం తెచ్చిన కష్టాలు.. మా అమ్మ జాతీయ బ్యాంకులో పనిచేసేది. ఆ ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువ కాబట్టి బ్యాంకులో చేరవద్దని ఎప్పుడూ చెబుతుండేది. కానీ, మార్కెటింగ్ రంగంలో ఏదైనా చేయాలనుకున్నాను కాబట్టి బ్యాంకులో అవకాశం రాగానే వదలలేదు. ప్రతి పనినీ నేర్చుకున్నాను. పదకొండేళ్లపాటు బ్యాంకులో పనిచేశాను. అక్కడ పనితీరుతో అతి పిన్నవయసులో బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్గా పదోన్నతి పొందాను. ఒకానొక సమయంలో ఉద్యోగంపై విసుగు అనిపించి స్టాక్ మార్కెట్లో కన్సల్టింగ్ పనిని ప్రారంభించాను. స్టాక్ మార్కెట్ క్రాష్ అయ్యి, తీవ్ర నష్టం చవిచూశాను. వ్యాపార భాగస్వాములు మోసం చేశారు. ఉద్యోగం మానేసిన ఏడాదిన్నర కాలం చాలా దారుణంగా గడిచింది. తిరిగి తక్కువ జీతం, ఎక్కువ పనిగంటలు చేసేలా బ్యాంక్ ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. అయితే, బ్యాంకింగ్ అనుభవాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సీనియర్ల సలహాతో ‘లా’ చదివాను. అప్పటికి నా కూతురికి నాలుగేళ్లు. ఓ వైపు ఉద్యోగం, మరో వైపు చదువు, ఇంటి పని.. అంత తేలికయ్యేది కాదు. స్త్రీల పనికి సమాజంలో అంత త్వరగా అంగీకారం లభించదు. ఎందుకంటే స్త్రీ సామర్థ్యాల పట్ల ప్రజల వైపు ఎప్పుడూ చిన్నచూపే ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో క్లయింట్స్ను ఒప్పించడానికి, వారిలో విశ్వాసం కలిగించడానికి నేను రెండు రెట్లు ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. నా దృక్పథాన్ని, పని విధానాన్ని మార్చుకున్నాను. నన్ను నేను ఉత్సాహపరచుకుంటూనే ఉన్నాను. మెల్లగా నా గమ్యం వైపు కదిలి ఈ రోజు ఈ స్థితికి చేరుకున్నాను. అభిప్రాయ భేదాలు తలెత్తినా.. నా భర్తకు నాకు మధ్య అనేక విషయాల్లో అభిప్రాయ భేదాలు తలెత్తడంతో మేమిద్దరం విడిపోవాలనుకున్నాం. భార్యాభర్తలుగా కాకుండా స్నేహితులుగా మారడం ద్వారా మా సంబంధాన్ని మరింత మెరుగ్గా కొనసాగించవచ్చని భావించాను. నా కూతురికి మంచి పెంపకాన్ని అందించడానికి అన్ని ముఖ్యమైన నిర్ణయాలు కలిసి తీసుకుంటాం. కానీ, మేం విడిగానే ఉంటాం. మా కుటుంబంలో ‘లా’ చదివినవారు ఎవరూ లేరు. నేను చాలా కేసుల్లో మహిళల తరపున నిలబడి న్యాయం చేశాను. ఈ రంగంలో లీగల్ అడ్వైజర్గా నాదైన ముద్ర వేయగలిగాను. 2015లో అలేఖ్ ఫౌండేషన్ను ప్రారంభించి మహిళల జీవితాలను మెరుగుపరిచే పనిని చేపట్టాను. లైంగిక వేధింపులకు గురైన పిల్లలు, మహిళలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తాను. ఫౌండేషన్ ద్వారా బాలికా విద్య, వృత్తి విద్యలలో నైపుణ్యాలకు సంబంధించిన కోర్సులు ఇవ్వడంలో కృషి చేస్తున్నారు. రొమ్ము క్యాన్సర్, పీరియడ్స్, శానిటేషన్ వంటి ఆరోగ్య సమస్యలపై మహిళలకు అవగాహన కల్పిస్తున్నాను. పర్యావరణ పరిరక్షణ.. నిరుపేద బాలికల చదువుకు బాధ్యత తీసుకున్నాను. ఇటీవల నాగాలాండ్లో సౌండ్ ఇంజనీరింగ్ లో శిక్షణ ఇవ్వడానికి ఒక కాలేజీతో టై అప్ అయ్యాం. దీనికి అయ్యే ఖర్చులను ఫౌండేషన్ భరిస్తుంది. పర్యావరణానికి మేలు కలిగేలా అవగాహన, ప్రచారం నిర్వహిస్తున్నాను. వాతావరణ మార్పుల నుండి చెట్లను ర క్షించడం, ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించడం, పేపర్లెస్ జీవనశైలిని ప్రోత్సహించడం చేస్తుంటాను’’ అని తన ప్రస్థానాన్ని వివరించింది రెనీ. -
Change Is Us: ఒడ్డును.. ఒడ్డున పడేస్తారు
పర్యావరణ పరిరక్షణ బాధ్యత మొన్న జనవరి 1 వేడుకలు. లక్షలాది మంది ముంబై బీచుల్లో చేరి ఎంజాయ్ చేశారు. మంచిదే. లెక్కలేనంత చెత్త పారబోశారు. అందమైన సాగర తీరాలను శుభ్రంగా ఉంచాలన్న స్పృహ మనకు ఎప్పుడూ లేదు. అందుకే ముంబైలోని ‘చేంజ్ ఈజ్ అజ్’ సంస్థలోని టీనేజ్ పిల్లలే ఈ క్లీనింగ్కి పూనుకున్నారు. బుద్ధులు వినాల్సిన పిల్లలే పెద్దలకు బుద్ధులు చెబుతున్నారు. విందామా వారి మాట? మనిషి బావిని, చెరువును తవ్వించగలడు. సముద్రాన్ని కాదు. ఒక ప్రాంతంలో సముద్రం ఉందంటే అది ప్రకృతి ఆ ప్రాంతానికి ఇచ్చిన వరం. ఎన్ని చికాకులున్నా, ఎన్ని బాధలున్నా, ఎంత బిజీగా ఉన్నా, ఎంతో సంతోషంగా అనిపించినా అలా బీచ్కు వెళితే, సముద్రం ఒడ్డున కూచుంటే, అలల ఘోషను వింటూ, ఆ సమతల అగాధపు గాంభీర్యాన్ని కంటూ, ఎగిరే పక్షుల వల్ల, తిరిగే పడవల వల్ల, వీచే గాలుల వల్ల ఓదార్పు పొందడం ఎంత బాగుంటుంది! కాని ఆ భావాలన్నీ పేరుకున్న చెత్త వల్ల నాశనమైతే? మన దేశంలో పేద, మధ్యతరగతి వారికి ఖర్చులేని కాలక్షేపం బీచ్. దానికి కూడా వెళ్లలేనంతగా వాటిని గలీజ్ చేస్తే? అలా చేసేంత దుర్గుణం మనుషులకే ఉంది. దానికి జవాబు యువత దగ్గర ఉంది. ఛేంజ్ ఈజ్ అజ్ ముంబైలో ఎంతలేదన్నా డజన్ అందమైన బీచ్లు ఉన్నాయి. అతి చిన్న ఇరుకు ఇళ్లలో జీవించే ముంబై జీవులు బీచ్లకు వచ్చే ఊపిరి పీల్చుకుంటారు. 75 ఏళ్ల కుంతీ ఓజా అనే మహిళ మూడు నాలుగేళ్ల క్రితం సోషల్ మీడియాలో ‘చిన్నప్పటి నుంచి చౌపాటి బీచ్కు వచ్చి ఆహ్లాదం పొందేదాన్ని. పసుపు రంగు ఇసుక చూడటం, చిరుతిళ్లు తినడం భలే ఉండేది. కాని ఇప్పుడు బీచ్ మొత్తం చెత్త. మా చిన్నప్పుడు మిగిలిన తిండి పారేసేవారు. ఇప్పుడు మొత్తం ప్లాస్టిక్ చెత్తను పారేస్తున్నారు’ అని రాసింది. ఆమె గోడు విన్నట్టుగా ఆ సమయంలోనే సీనియర్ ఇంటర్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు అక్షత్ షా, శుభ్ మెహతా పర్యావరణ విధ్వంసం గురించి స్కూల్లో, బయట వింటున్న వార్తలతో ప్రభావితం అయ్యారు. అప్పుడే అమెజాన్ అడవులు తగలబడటం వారిని కలిచి వేసింది. ‘మన వంతుగా ఏదో ఒకటి చేద్దాం’ అని సోషల్ మీడియా వేదికగా ‘ఛేంజ్ ఈజ్ అజ్’ గ్రూప్ను ప్రారంభించి ముంబైలోని బీచ్ల క్లీనింగ్కి నడుం కట్టారు. జూలై 2019న మొదటిసారి అక్షత్ షా, శుభ్ మెహతా జూలై, 2019లో మొదటిసారి చౌపాటి బీచ్ను క్లీన్ చేయడానికి సోషల్ మీడియాలో పిలుపునిచ్చినప్పుడు కేవలం 18 మంది టీనేజ్ విద్యార్థులు హాజరయ్యారు. వారంతా కలిసి బీచ్ను క్లీన్ చేయడం జనం వింతగా చూశారు. కాని మంచి పనికి కొత్త తరం అండ తప్పక లభిస్తుంది. క్రమం తప్పకుండా బీచ్లను క్లీన్ చేయడం, ఫొటోలను ప్రచారంలో పెట్టడంతో హైస్కూల్, కాలేజీ స్థాయి పిల్లలు స్పందించడం మొదలెట్టారు. తల్లిదండ్రులు కూడా ఈ మంచి పనికి అడ్డు చెప్పలేదు. ‘ఇప్పటి వరకూ మేము ముంబై బీచ్ల నుంచి 480 టన్నుల చెత్త పారబోశాం’ అంటారు అక్షత్ షా, శుభ్. ప్రస్తుతం అక్షత్ ముంబైలోనే ఉంటూ చదువుకుంటుంటే శుభ్ యూకేలో చదువుకుంటూ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నాడు. పాతిక వేలమంది వాలంటీర్లు ‘ఛేంజ్ ఈజ్ అజ్’ గ్రూప్ ఎంత సక్సెస్ అయ్యిందంటే ముంబై మొత్తం నుంచి 25,200 మంది విద్యార్థినీ విద్యార్థులు ఇందులో వాలంటీర్లుగా చేరారు. బీచ్ల శుభ్రత గురించి ఛేంజ్ ఈజ్ అజ్ సభ్యులు స్కూళ్లు, కాలేజీలకు తిరిగి ప్రచారం చేయడం వల్ల కూడా ఈ చేరిక సాధ్యమైంది. వీరంతా తమకు వీలున్నప్పుడల్లా ముంబైలోని బీచ్లను శుభ్రం చేస్తుంటారు. ముఖ్యంగా పండగలప్పుడు, డిసెంబర్ 31 వంటి సందర్భాల్లో వీరి పని ఎక్కువగా ఉంటుంది. మన దేశంలో బీచ్లు టూరిస్ట్ అట్రాక్షన్ కూడా. పట్టణ, నగర సంస్థలు బీచ్ల శుభ్రత కోసం ఎంతోకొంత నిధులు వెచ్చిస్తున్నా నిరంతర అలల్లాగే నిరంతరం చెత్త పడుతూనే ఉంటుంది. అందుకే ఇటు బంగాళాఖాతం, అటు అరేబియా సముద్రం... తీరాల పొడవునా బీచ్లను శుభ్రం చేయడానికి విద్యార్థినీ విద్యార్థులు నడుం బిగించాలి. వారు కదిలితే పెద్దలూ కదులుతారు. -
‘ఈవీ’ విప్లవానికి ఏపీ తోడ్పాటు భేష్
సాక్షి, అమరావతి: పర్యావరణ పరిరక్షణలో భాగంగా విద్యుత్ వాహనాల విప్లవాన్ని సాధించే జాతీయ లక్ష్యానికి ఆంధ్రప్రదేశ్ అందిస్తున్న తోడ్పాటు బాగుందని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్(సీఈఎస్ఎల్) సీఈవో విశాల్ కపూర్ ప్రశంసలు కురిపించారు. విద్యుత్ వాహనాల(ఈవీ)పై ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎస్ఎల్), సీఈఎస్ఎల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్లతో ఆయన వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఆ వివరాలను ఈఈఎస్ఎల్ దక్షిణాది రాష్ట్రాల సలహాదారు ఎ.చంద్రశేఖరరెడ్డి శనివారం ‘సాక్షి’కి వెల్లడించారు. ఈ ఏడాది ద్విచక్ర, త్రిచక్ర విద్యుత్ వాహæనాల అమ్మకాల్లో 80 శాతం వృద్ధి కనిపిస్తోందని, 2030 నాటికి మొత్తం వాహనాల్లో 30 శాతం ఈవీలే ఉండాలనేది కేంద్రం లక్ష్యమని విశాల్ కపూర్ అన్నారు. తద్వారా రానున్న ఏడేళ్లలో 846 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను, 474 మిలియన్ టన్నుల చమురు దిగుమతులను తగ్గించవచ్చని వివరించారు. ఇందులో భాగంగా ఈఈఎస్ఎల్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా ఈ–బస్సుల కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారని చెప్పారు. సాధారణ బస్సులతో పోల్చితే ఈ–బస్సులు తక్కువ ఖర్చుతో మెరుగైన సేవలందిస్తాయన్నారు. విద్యుత్ వాహనాల విప్లవానికి ఏపీ నాంది పలికిందని విశాల్ కపూర్ ప్రశంసించారు. విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రహదారి పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు వంటి ప్రయోజనాలు కల్పిస్తూ ఉద్యోగులకు లక్ష ఈవీలను వాయిదా పద్ధతిలో ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఏపీలో ప్రస్తుతం 65 వేల విద్యుత్ వాహనాలుండగా, 2030 నాటికి మొత్తం పెట్రోల్, డీజిల్, గ్యాస్ వాహనాల్లో సగం ఈవీలే ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్న ఏపీని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఇంధన శాఖ అధికారులు మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో 400 ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోందని చెప్పారు. ప్రస్తుతం 266 స్టేషన్లు పనిచేస్తున్నాయని, మరో 115 ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. -
జీవ ఇంధనాల కూటమి
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ దిశగా భారత్ కీలకమైన ముందడుగు వేసింది. ‘ప్రపంచ జీవ ఇంధనాల కూటమి’ని ప్రకటించింది. భూతాపానికి, తద్వారా పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న శిలాజ ఇంధనాల వాడకం తగ్గించుకోవాలని, ఇందుకోసం పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ కలిపి వాడుకోవాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేసింది. జీ20 శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం జీవ ఇంధనాల కూటమిపై ప్రకటన చేశారు. ఈ కూటమిలో చేరాలని, పుడమిని కాపాడుకొనేందుకు చేతులు కలపాలని జీ20 సభ్యదేశాలకు పిలుపునిచ్చారు. ‘వన్ ఎర్త్’ అంశంపై జరిగిన చర్చలో మోదీ మాట్లాడారు. ‘జీ20 శాటిలైట్ మిషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ అబ్జర్వేషన్’ను కూడా ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ‘గ్రీన్ క్రెడిట్ అంకురార్పణ’పై కార్యాచరణ ప్రారంభించాలని జీ20 దేశాలను కోరారు. ఇంధన బ్లెండింగ్ రంగంలో ప్రపంచదేశాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలని, పరస్పరం సహకరించుకోవాలని, ఈ విషయంలో ఎంతమాత్రం జాప్యం తగదనిమోదీ స్పష్టం చేశారు. పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ కలిపి వాడుకోవడం చాలా ఉత్తమమని అభిప్రాయపడ్డారు. లేకపోతే ప్రత్యామ్నాయంగా మరో రకమైన బ్లెండింగ్ మిక్స్ను అభివృద్ధి చేసుకోవడంపై దృష్టి పెట్టాలన్నారు. స్థిరమైన ఇంధన సరఫరా కావాలని, అదే సమయంలో పర్యావరణ పరిరక్షణ సైతం ముఖ్యమేనని తేలి్చచెప్పారు. ప్రపంచ జీవ ఇంధనాల కూటమిలో భారత్, అర్జెంటీనా, బంగ్లాదేశ్, బ్రెజిల్, ఇటలీ, మారిషస్, సౌతాఫ్రికా, యూఏఈ, అమెరికా సభ్యదేశాలుగా ఉన్నాయి. కెనడా, సింగపూర్ పరిశీలక దేశాలుగా ఉన్నాయి. క్లీన్ ఎనర్జీ దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని, అత్యధిక ప్రాధా న్యం ఇస్తున్నామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ఈ మేరకు వైట్హౌస్ ఒక ప్రకటన చేసింది. సమీకృత ఇంధన పరివర్తన వాతావరణ మార్పులు అనే పెనుసవాళ్లు ఎదురవుతున్న నేటి తరుణంలో ‘ఇంధన పరివర్తన’ చాలా అవసరమని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. సమీకృత ఇంధన పరివర్తన కోసం కోట్లాది డాలర్లు వ్యయం చేయాల్సి ఉంటుందని, అభివృద్ది చెందిన దేశాలు దీనిపై మరింత చొరవ తీసుకోవాలని సూచించారు. క్లైమేట్ ఫైనాన్స్ కోసం ఏటా 100 బిలియన్ డాలర్లు ఇచ్చేందుకు అభివృద్ధి చెందిన దేశాలు 2009లో అంగీకరించడం హర్షణీయమని పేర్కొన్నారు. అయితే, ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడంలో అభివృద్ధి చెందిన దేశాలు విఫలమవుతున్నాయని మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏమిటీ కూటమి? ప్రపంచంలో ప్రజలందరికీ శుద్ధమైన సౌర శక్తి చౌకగా అందాలని భారత్ ఆకాంక్షించింది. ఇందుకోసం 2015లో పారిస్లో జరిగిన సదస్సులో ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్స్(ఐఎస్ఏ)ను తెరపైకి తీసుకొచి్చంది. అదే తరహాలో ఇప్పుడు ప్రపంచ జీవ ఇంధన కూటమిని ప్రకటించింది. -
సునాక్ ఇంటిపై నల్లవస్త్రం
లండన్: బ్రిటన్ ప్రధాని ఇంటిపై నల్లటి వ్రస్తాన్ని కప్పిన నలుగురు పర్యావరణ కార్యకర్తలను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఉత్తర ఇంగ్లాండ్లో నార్త్ యార్క్షైర్ ప్రాంతంలోని రిచ్మండ్లో ఉన్న రిషి సునాక్ ఇంటిపై వారు నల్లటి వస్త్రం కప్పి తమ నిరసనను తెలియజేశారు. వీరు ‘గ్రీన్పీస్’ అనే పర్యావరణ పరిరక్షణ సంస్థలో సభ్యులుగా ఉన్నారు. సముద్రంలో చమురు, గ్యాస్ వెలికితీతను మరింత విస్తరిస్తూ సునాక్ ఇటీవల తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఇలా నిరసన వ్యక్తం చేశారు. సునాక్ ఇంటిపైకి ఎక్కి 200 చదరపు మీటర్ల నల్ల వస్త్రాన్ని కప్పారు. అలాగే సునాక్ ఇంటి ముందు మరో ఇద్దరు కార్యకర్తలు ‘చమురు లాభాలు ముఖ్యమా? లేక మా భవిష్యత్తు ముఖ్యమా?’ అని ప్రశ్నిస్తూ బ్యానర్ను ప్రదర్శించారు. ఈ సమయంలో సునాక్ కుటుంబసభ్యులెవరూ ఆ ఇంట్లో లేరు. -
తెలంగాణలో అంతా ‘గ్రీన్’!
మాదాపూర్ (హైదరాబాద్): పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా గ్రీన్ బిల్డింగ్ మూవ్మెంట్ 2001 నుంచి ప్రారంభమైందని, దాని ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉండడం గర్వకారణమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. మాదాపూర్లోని హైటెక్స్లో శుక్రవారం నుంచి మూడురోజుల పాటు నిర్వహిస్తున్న ఐజీబీసీ (ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్) గ్రీన్ ప్రాపర్టీ షో–2023ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ దేశంలోనే మొదటి గ్రీన్ బిల్డింగ్, గ్రీన్హోమ్స్, గ్రీన్ ఎయిర్పోర్టు, రైల్వేస్టేషన్, ఫ్యాక్టరీ బిల్డింగ్లు తెలంగాణలో ఉన్నాయని కేటీఆర్ చెప్పారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణలో గ్రీన్ ఫుట్ప్రింట్స్ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రభుత్వ భవనాలు, ఆస్పత్రులు, ఇండస్ట్రియల్ పార్కులు, ఐటీ పార్కులు ఐజీబీసీ ప్రమాణాలతో ఉండేలా చూస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన సెక్రటేరియేట్, టీహబ్, టీవర్క్స్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, 33 జిల్లాల్లోని నూతన కలెక్టరేట్ భవనాలు, ప్రతి జిల్లాలో ఆస్పత్రులు, హెల్త్కేర్ క్యాంపస్లు గ్రీన్ సర్టిఫికేషన్కు లోబడి ఉన్నాయని చెప్పారు. భవనాలే కాకుండా హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ వంటి పట్టణాలు ఐజీబీసీ ప్రమాణాలను పాటిస్తున్నాయని తెలిపారు. తెలంగాణలో హరితహారం 24 శాతం నుంచి 33 శాతానికి పెరిగిందన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఏఐపీహెచ్ గ్రీన్సిటీ అవార్డు హైదరాబాద్కి దక్కిందని చెప్పారు. ఎనిమిదేళ్లలో 2.60 కోట్ల మొక్కలు పట్టణాలు, గ్రామాలకు కేటాయించిన బడ్జెట్లో 10 శాతం పచ్చదన పరిరక్షణకు కేటాయించామని కేటీఆర్ తెలిపారు. గత 8 సంవత్సరాలలో 2.60 కోట్ల మొక్కలు నాటామని, వాటిలో కనీసం 85 శాతం మొక్కలను రక్షించే విధంగా కార్యక్రమాలను చేపట్టినట్టు చెప్పారు. గ్రామాలలో కూడా ఎల్ఈడీ లైట్లను అమర్చినట్టు తెలిపారు. వరంగల్లోని గంగాదేవి పల్లి గ్రామానికి గ్రీన్ విలేజ్ రేటింగ్లో ప్లాటినం అవార్డు వచ్చిందని చెప్పారు. అన్ని పట్టణాల్లో స్వచ్ఛబడి తెలంగాణలోని అన్ని పట్టణాల్లో స్వచ్ఛబడి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఆసియాలోనే అతిపెద్ది వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ జవహర్నగర్లో ఉంది. బిల్డర్లు రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రీచార్జి వంటి నాలుగు సూత్రాలను పాటించి గృహ నిర్మాణాలను చేపట్టాలని సూచించారు. సీఐఐ (కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్) తెలంగాణ చైర్మన్, ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ సి.శేఖర్రెడ్డి తదితరులు మాట్లాడారు. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ తదితరులు పాల్గొన్నారు. -
చదువు.. సంస్కారం.. పర్యావరణం
పదో తరగతి చదివే పిల్లలు... స్కూలు, ట్యూషన్లు అంటూ బిజీబిజీగా ఉంటారు. ఆఖరి పరీక్షలు పూర్తయ్యేవరకు చదువు తప్ప మరో ధ్యాస ఉండదు వీరికి. అలాంటిది లితిషా బగాడియా చదువుతోపాటు చుట్టుపక్కల పేరుకుపోయిన చెత్తను నిర్మూలిస్తూ పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించింది. గత రెండేళ్లుగా వివిధ రకాల కార్యక్రమాలతో ప్రకృతి సంరక్షణకు కృషిచేస్తోన్న లితిషాను ‘ద ప్రిన్సెస్ డయానా క్లైమెట్ యాక్షన్’ అవార్డు వరించింది. ఈ అవార్డుతో పిల్లలకు చదువు, సంస్కారంతోపాటు పర్యావరణ స్పృహ కూడా ఉండాలి అనడానికి ఉదాహరణగా నిలుస్తోంది లితిషా. ముంబైకు చెందిన లితిషాకు... చెత్తపేరుకుపోయిన నగరాల జాబితాలో ముంబై కూడా ఉండడం నచ్చలేదు. దీంతో నగరాన్ని శుభ్రం చేయాలనుకుంది. అదే విషయాన్ని తన స్నేహితురాలు సియా జోషికి చెప్పింది. ఇద్దరూ కలిసి ఎన్జీవోని ఏర్పాటు చేసి ముంబైని క్లీన్ చేద్దామనుకున్నారు. కానీ ఆ సమయంలో కరోనా ఆంక్షలు ఉండడంతో బయటకు రావడం కుదరలేదు. దీంతో 2021 ఆగస్టు 31న ‘ఐకా’ ఫౌండేషన్ను ఇన్స్టాగ్రామ్లో ప్రారంభించారు. ఐకా ద్వారా... పర్యావరణ సమస్యలు, వ్యర్థాల నిర్వహణ, టపాసులు కాల్చడం, నీటì వృథా... వంటి అంశాలపై ప్రచారం చేస్తూ అవగాహన కల్పించేవారు. ఇది నచ్చిన కొంతమంది ఔత్సాహికులు ముందుకు రావడంతో వారితో కలిసి చెత్తను శుభ్రం చేయడం మొదలు పెట్టారు. వీరికి మరికొంతమంది తోడవడంతో అంతా సమూహంగా ఏర్పడి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను విస్తరించారు. ► పూల నుంచి పెర్ఫ్యూమ్స్ ప్రాజెక్ట్ ‘అవిఘ్న’ పేరుతో... వినాయక చవితి వేడుకల్లో మండపాల దగ్గర చల్లే పూలు, ఇతర పండుగల్లో వాడేసిన పూలను, నిమజ్జనం తరువాత మిగిలిపోయే ఇనుము వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్కు తరలిస్తున్నారు. ఈ పూలను పెర్ఫ్యూమ్స్గా, ఎరువులుగా మార్చడం వల్ల నిరుపేదలకు ఆదాయం కూడా వస్తోంది. గణేష ఉత్సవాల్లో మూడువందల కేజీలకుపైగా పూల వ్యర్థాలను సేకరించి ‘మోబి ట్రాష్’ అనే స్టార్టప్కు అందించారు. ఈ స్టార్టప్ పూలను గిరిజన, మురికివాడల్లోని నిరుపేదలకు ఇచ్చి అగరు బత్తీలు, రంగులు తయారు చేయించి వారికి ఉపాధి కల్పిస్తోంది. దీనిద్వారా నగరంలో చెత్త శుభ్రం అవడమేగాక, పరిసరాలు పరిశుభ్రంగా మారుతున్నాయి. ► ఈ వేస్ట్తోపాటు బీచ్క్లీనింగ్ వాడిపడేసిన ల్యాప్టాప్స్, ఫోన్ ఛార్జర్లు, ఇయర్ఫోన్స్ వంటి ఎలక్ట్రానిక్ వేస్ట్ను కూడా సేకరించి ఈ వేస్ట్ రీ సైక్లింగ్ సెంటర్లకు చేరవేస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రత్యేకంగా ‘ఈ వేస్ట్ కలెక్షన్ డ్రైవ్’ నిర్వహించి వేస్ట్ సేకరిస్తున్నారు. ‘బీచ్క్లీన్ – అప్’ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. బీచ్లో దొరికిన ప్లాస్టిక్ వ్యర్థాలను ‘శక్తి ప్లాస్టిక్స్’ కంపెనీకి ఇస్తున్నారు. ఈ కంపెనీ ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసి ఫర్నీచర్, ఇతర వస్తువులను తయారు చేసి విక్రయిస్తోంది. ఇవేగాక ఏడోతరగతి లోపు పిల్లలకు వర్క్షాప్స్ ద్వారా పర్యావరణ ప్రాముఖ్యత, కాలుష్యం నుంచి పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పిస్తున్నారు. హోలీ, దీపావళి సమయాల్లో ఇకోఫ్రెండ్లీ సంబరాలు జరుపుతూ.. పర్యావరణంపై అవగాహన కల్పిస్తున్నారు. ► చదువుతూనే... ఇంకా జీవితంలో స్థిరపడేంతగా చదువుకోలేదు. అయినా ఇన్ని కార్యక్రమాలతో బిజీగా ఉన్న ఈ ఇద్దరూ ప్రస్తుతం తమ కాలేజీ చదువుని నిర్లక్ష్యం చేయకుండా ముంబైని క్లీన్ చేయడం విశేషం. తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఉండడంతో.. భవిష్యత్లో పర్యావరణ అవగాహన కార్యక్రమాలను దేశంలోని మరిన్ని నగరాలకు విస్తరిస్తామని ఈ చిచ్చరపిడుగులు చెబుతున్నారు. నేటి బాలలే రేపటి పౌరులు, ఇలాంటి బాలలు మరింతమంది తయారైతే మన దేశ భవిష్యత్ ఉజ్వలంగా వెలిగిపోతుంది. ‘‘ఈ అవార్డు వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. నా స్నేహితురాలు, ఐకా ఫౌండేషన్ సహవ్యవస్థాపకురాలు సియా జోషి నా వెన్నంటే ఉండి ప్రోత్సహించడం వల్లే ఈ గౌరవం దక్కింది. అందుకే మరిన్ని ప్రాజెక్టుల ద్వారా అందరిలో అవగాహన కల్పిస్తూ.. పర్యావరణాన్ని కాపాడతాము’’ అని లితిషా బగాడియా చెబుతోంది. లితిషా బగాడియా -
111 రద్దుపై సుప్రీంకోర్టుకు..!
సాక్షి, హైదరాబాద్: జంట జలాశయాల పరిరక్షణ కోసం తెచ్చి న జీవో 111ను పూర్తిగా తొలగించడంపై స్వచ్ఛంద సంస్థలు న్యాయపోరాటానికి సన్నద్ధమవుతున్నాయి. భావితరాల కోసం జంట జలాశయాలను కాపాడుకోవలసిన అవసరముందంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చి న సూపర్ ఆర్డర్ను ధిక్కరించి ప్రభుత్వం జీవోను ఎత్తివేయడం పట్ల పర్యావరణ పరిరక్షణ సంస్థలు, సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ప్రభుత్వం జీవోను ఎత్తివేయడంపై ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ పురుషోత్తమ్రెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. సర్వోన్నత న్యాయస్థానం దూరదృష్టితో జీవో 111ను సమర్థించిందని చెప్పారు. ప్రభుత్వం ఎలాంటి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయకుండానే ఏ విధమైన అధ్యయనం లేకుండానే జీవోను తొలగించిందన్నారు. జీవో 111పై తాము ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదికను త్వరలో ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. పర్యావరణానికి ముప్పు ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ రిజర్వాయర్లు రాజధాని ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడమే కాకుండా భారీ వరదల నుంచి నగరాన్ని కాపాడుతున్నాయి. 1908లో నగరాన్ని వరదలు ముంచెత్తినప్పుడు మరోసారి అలాంటి వరదల వల్ల నష్టపోకుండా ఉండేందుకు అప్పటి చీఫ్ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సూచన మేరకు ఈ రెండు జలాశయాలను నిర్మించారు. 1912లో మొదట గండిపేట్ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టి 1917లో పూర్తి చేశారు. ఆ తరువాత 1921లో హిమాయత్సాగర్ నిర్మాణం ప్రారంభించి 1927 నాటికి వినియోగంలోకి తెచ్చారు. గ్రావిటీ ద్వారా నగరంలోని అన్ని ప్రాంతాలకు నీటిని అందిస్తున్న ఈ రిజర్వాయర్ల నుంచి ఇప్పటికీ 65 మిలియన్ గ్యాలన్ల నీరు లభిస్తోంది. ప్రస్తుతం ఇవి స్వచ్ఛమైన వర్షపునీటితో నిండి ప్రజలకు అంతే స్వచ్ఛమైన జలాలను అందిస్తున్నాయి. ‘గోదావరి జలాల వల్ల భూగర్భ నీటిమట్టం పెరగదు. గతంలో నిర్మించిన ఏ ఎస్టీపీలు, రింగ్మెయిన్లు చెరువులను కాపాడలేకపోయాయి. ఇప్పటి కే నగరంలో వందలాది చెరువులు మాయమయ్యాయి. భవిష్యత్లో ఈ జలాశయాలు దెబ్బతింటే భూగర్భ జలాలు అడుగంటుతాయి. భూతాపం విపరీతంగా పెరుగుతుంది’అని నిపుణులు చెబుతున్నారు. జీవవైవిధ్యానికి హాని ఈ జలాశయాల వల్ల కొన్ని వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో జీవవైవిధ్యానికి రక్షణ లభిస్తుంది. అనేక రకాల పక్షులు, వన్యప్రాణులు మనుగడ సాగిస్తున్నాయి. జీవో 111 ఎత్తివేయడంతో జీవవైవిధ్యం ప్రమాదంలో పడుతుంది. మృగవనం పార్కుకు నష్టం వాటిల్లుతుంది. ఇప్పటికే పెరిగిన భారీ నిర్మాణాల వల్ల ఎన్నో విలువైన పక్షి జాతులు అంతరించాయి. భవిష్యత్తులో ఈ ముప్పు ఇంకా ఎక్కువవుతుంది. ప్రజల సంక్షేమాన్ని విస్మరించింది హైదరాబాద్ను వరదల బారి నుంచి కాపాడేందుకు అప్పటి నిజాం నవాబు కట్టించిన జంట జలాశయాలు నగరాన్ని భూతా పం నుంచి రక్షిస్తున్నాయి. జీవ వైవిధ్యా న్ని రక్షించుకొనేందుకూ దోహదం చేస్తున్నాయి. జీవో 111ను ఎత్తివేసి ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని విస్మరించింది. సహజవనదరులను, జీవవైవిధ్యాన్ని ధ్వంసం చేయడం ఏ విధంగా కూడా ప్రజా సంక్షేమం కాదు. – లూబ్నా సార్వత్, సామాజిక కార్యకర్త సూపర్ ఆర్డర్ను ఎలా ధిక్కరిస్తారు ఏ నగరంలో అయినా 20 శాతం నీటి వనరులు ఉండాలి. కానీ హైదరాబాద్లో వందలాది చెరువులు మాయమయ్యాయి. భవిష్యత్లో ఈ జలాశయాలు కూ డా అలాగే మాయమయ్యే ప్రమాదం పొంచి ఉంది. పారిశ్రామికవేత్తలు, రియల్టర్లు, సంపన్నులకు కొమ్ముకాసే పాలకులు పర్యావరణాన్ని కాపాడుతారనుకోవడం భ్రమే అవుతుంది. గతంలోనూ జీవోకు వ్యతిరేకంగా ప్రభుత్వం వెళ్లినప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాం. జీవో 111ను సమర్థిస్తూ 2000 సంవత్సరంలో సుప్రీంకో ర్టు సూపర్ ఆర్డర్ ఇచ్చింది. దాన్ని ఎలా ధిక్కరిస్తారు. న్యాయనిపుణుల తో చర్చిస్తున్నాం. మరోసారి కోర్టుకెళ్తాం. – ప్రొఫెసర్ పురుషోత్తమ్రెడ్డి -
‘పుడమి సాక్షిగా’ క్యాంపెయిన్కు ప్రతిష్టాత్మక ఏఎఫ్ఏఏ అవార్డు
సాక్షి, హైదరాబాద్: పుడమి సంరక్షణ కోసం సాక్షి మీడియా గ్రూప్ చేస్తోన్న ‘పుడమి సాక్షిగా’క్యాంపెయిన్కు అంతర్జాతీయ గౌరవం దక్కింది. అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీ ఆఫ్ ఏషియా (ఏఐఏ) ఆధ్వర్యంలోని ఏషియన్ ఫెడరేషన్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ (ఏఎఫ్ఏఏ).. పుడమి సాక్షిగా కార్యక్రమాన్ని ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ‘కార్పొరేట్ సోషల్ క్రూసేడర్ ఆఫ్ ది ఇయర్’సిల్వర్ అవార్డుతో సత్కరించింది. ముంబై వేదికగా జరిగిన ఈ అవార్డుల కార్యక్రమంలో సాక్షి కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ రాణి రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. ఏఎఫ్ఏఏ చైర్మన్ శ్రీనివాసన్ స్వామి, ఏఐఏ ప్రెసిడెంట్ అవినాష్ పాండే, ఆలివ్ క్రౌన్ చైర్మన్ జనక్ సర్థా ఈ అవార్డును అందజేశారు. పుడమి‘సాక్షి’గా లక్ష్యాలివే.. ప్రతీ ఏటా జనవరి 26న మెగా టాకథాన్గా వస్తోన్న పుడమి సాక్షిగా కార్యక్రమం 2020–21లో ప్రారంభమైంది. ఇప్పటివరకు మూడు ఎడిషన్లు పూర్తి చేసుకుంది. పర్యావరణాన్ని కాపాడడం, కాలుష్యం తగ్గించడం, స్వచ్ఛమైన పుడమిని భవిష్యత్ తరాలకు అందించడం.. పుడమి సాక్షిగా లక్ష్యాలు. ప్రాణకోటికి జీవనాధారమైన ధరిత్రి ప్రమాదంలో పడడానికి మనుషులే ప్రధాన కారణం. ఈ భూమి మళ్లీ పునర్వవైభవం దక్కించుకోవాలంటే.. ప్రతి ఒక్కరూ చేయాల్సిన కృషిని పుడమి సాక్షిగా గుర్తు చేస్తోంది. ప్రతి నెలా ఏదో ఒక రూపంలో పుడమి కార్యక్రమాలు చేపడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో పర్యావరణంపై అవగాహన కల్పించడంతో పాటు ఇందులో ప్రజలను భాగస్వామ్యులను చేస్తోంది. దీంతోపాటు గణతంత్ర దినోత్సవం రోజున సాక్షి టీవీలో దాదాపు 10 గంటలపాటు మెగా టాకథాన్ రూపంలో ప్రసారం చేస్తోంది. పర్యావరణ పరిరక్షణ కోసం పాటు పడుతున్న పెద్దలు, సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు ఇందులో పాల్గొంటున్నారు. తమ అనుభవాలను పంచుకుంటూ సమాజానికి స్పూర్తి కలిగిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన సమస్త సమాచారం, స్టోరీలు, వీడియోలు https://www.pudamisakshiga.com/ వెబ్ సైట్లో చూడవచ్చు. -
పర్యావరణ పరిరక్షణకు వీమార్ట్ శ్రీకారం
ముంబై: ప్రముఖ ఫ్యాషన్ రిటైలర్ వీమార్ట్ దేశవ్యాప్తంగా 20 లక్షల మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తమ ఉత్పత్తులు, ప్రక్రియలు, సాంకేతికత రూపంలో పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. సీఎస్ఆర్ కార్యక్రమం కింద పర్యావరణ పరిరక్షణ, సామాజికాభివృద్ధిపై ప్రధాన దృష్టి సారించామని పేర్కొంది. వాతావరణ మార్పుల సమస్యలకు దీర్ఘకాలం పాటు పెద్ద మొత్తంలో మొక్కలు నాటడం పరిష్కారమని కంపెనీ ఎండీ లలిత్ అగర్వాల్ తెలిపారు. -
గ్రీన్ ఫైనాన్స్ నిర్వచనం... వర్గీకరణ అవశ్యం
ముంబై: పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ప్రాజెక్టులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించడానికి, సంబంధిత (పర్యావరణ) కార్యకలాపాలకు ఆర్థిక వ్యవస్థలో ప్రాధాన్యతన ఇవ్వడానికి ఉద్దేశించిన– గ్రీన్ ఫైనాన్స్పై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వర్ రావు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా గ్రీన్ ఫైనాన్స్కు అంటే ఏమిటో స్పష్టమైన నిర్వచనం, వర్గీకరణ చేయాల్సిన తరుణం ఆసన్నమైందని అన్నారు. దీనివల్ల ఆయా పర్యావరణ పరిరక్షణా కార్యకలాపాలకు, ప్రాజెక్టులకు మరిన్ని నిధులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. బిజినెస్ స్టాండెర్డ్ ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గ్రీన్ ఫైనాన్స్కు తగిన నిర్వచనం, వర్గీకరణ వల్ల పర్యావరణ పరిరక్షణకు అంటే ఏమిటి? తమ రుణ పోర్ట్ఫోలియోలో గ్రీన్ ఫైనాన్స్కు ఎంతమేర ప్రాముఖ్యతను ఇవ్వాలి? వంటి అంశాలను బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మదింపు చేసుకోగలుగుతాయని అన్నారు. అలాగే గ్రీన్ ఫైనాన్స్ను నిర్లక్ష్యం చేసే అవకాశాలు కూడా గణనీయంగా తగ్గిపోతాయని అన్నారు. గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లకు ప్రాధాన్యత దేశంలో పర్యావరణ పరిరక్షణ కార్యకలాపాలకు ఫైనాన్స్ను వేగవంతం చేయాల్సిన అవసరాన్ని రాజేశ్వర్రావు ఉద్ఘాటించారు. ఈ దిశలో గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లు దేశంలో గ్రీన్ ఫైనాన్స్ను పెంచడంలో సహాయపడతాయని చెప్పారు. వాతావరణ మార్పు.. భౌతిక, పరివర్తన ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందన్నారు. వెరసి ఆయా అంశాలు ఆర్థిక పటిష్టతకు, ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి చిక్కులను తెచ్చిపెట్టే అవకాశమూ లేకపోలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో భౌగోళిక వాతావారణ మార్పుల వల్ల చోటుచేసుకునే ఆర్థిక నష్టాలను అర్థం చేసుకోవడానికి, అంచనా వేయడానికి, వీటిని నివారించే దిశలో సమగ్ర ఫ్రేమ్వర్క్లను అభివృద్ధి చేయడానికి, అమలు చేయడానికి నియంత్రణా సంస్థల ఏర్పాటు అవసరం ఉందని పేర్కొన్నారు. సావరిన్ గ్రీన్ బాండ్ (ఎస్జీబీ)ఇష్యూ నుండి రూ. 16,000 కోట్ల వరకు సమీకరించాలన్న బడ్జెట్ ప్రతిపాదనను డిప్యూటీ గవర్నర్ స్వాగతించారు. గ్రీన్ ప్రాజెక్టుల్లోకి నిధుల ప్రవాహానికి ఈ చర్య దోహదపడుతుందని అన్నారు. -
పర్యావరణ పరిరక్షణ.. భావితరాలకు భరోసా
సాక్షి, హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణ కోసం, భావితరాలకు సురక్షితమైన జీవితాన్ని అందించడం కోసం మన దైనందిన జీవితంలో అలవరుచుకోవలసిన, మార్చుకోవాల్సిన కొన్ని పద్ధతులను పై నాలుగు అంశాలూ సుస్పష్టం చేస్తున్నాయి. మన దైనందిన జీవితంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తే ఎంత మేలు జరుగుతుందో వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నీతి ఆయోగ్ మూడు దశల కార్యాచరణను సిఫారసు చేసింది. 2022–23 నుంచి 2027–28 మధ్య కాలంలో దేశంలోని 80 శాతం మంది ప్రజలను పర్యావరణ హితులుగా మార్చడమే లక్ష్యంగా ‘మిషన్ లైఫ్’ అనే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. లైఫ్స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ (పర్యావరణ హిత జీవన విధానం (లైఫ్) పేరుతో రూపొందించిన ఈ ప్రాజెక్టును ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే అమలు చేస్తున్నట్టు ప్రకటించిన కేంద్రం.. గత వారంలోనే వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారాన్ని ప్రారంభించింది. మొదటిదశలో భాగంగా 2022–23లో ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ హిత వ్యక్తిగత జీవనాన్ని అలవర్చుకునేలా పలు సూచనలు చేసింది. ఇంధనం, నీరు పొదుపు చేయడం, ప్లాసిక్ నియంత్రణ, మంచి ఆహారపు అలవాట్లు చేసుకోవడం, వ్యర్ధాలను తగ్గించడం, ఆరోగ్యకర జీవనాన్ని అలవరుచుకోవడం, ఈ–వ్యర్థాలను తగ్గించడం అనే ఏడు కేటగిరీల్లో 75వ స్వాతంత్య్ర దినోత్సవ స్ఫూర్తితో 75 జీవన సూత్రాలను పేర్కొంది. తద్వారా పర్యావరణానికి హాని కలిగించే వస్తువుల డిమాండ్లో మార్పు వస్తుందని వెల్లడించింది. దైనందిన జీవితంలో అలవరుచుకోవాల్సిన కొన్ని ప్రధాన సూచనలు, చేసుకోవాల్సిన కీలక మార్పులు ఇవే.. ►ఎల్ఈడీ బల్బులు, ట్యూబ్లైట్లు వాడాలి ►వీలున్న ప్రతి చోటా ప్రజారవాణాను మాత్రమే ఉపయోగించాలి ►స్నేహితులు, సహచరులతో కార్ పూలింగ్ (ఒక కారులో కలిసి వెళ్లడం) అలవరుచుకోవాలి ►ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద, రైల్వే గేట్ల వద్ద ఆగినప్పుడు వాహనాల ఇంజన్ ఆపేయాలి ►స్థానికంగా తిరిగేటప్పుడు, సమీప ప్రాంతాలకు వెళ్లేటప్పుడు సైకిల్ మీద వెళ్లాలి ►అవసరం లేనప్పుడు సాగునీటి పంపులను నిలిపివేయాలి ►పెట్రోల్, డీజిల్ వాహనాలకు బదులు సీఎన్జీ, ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలి ►వంటలో ప్రెషర్ కుక్కర్లకు ప్రాధాన్యమివ్వాలి ►పంటల మార్పిడి విధానాన్ని ప్రోత్సహించాలి. తక్కువ నీటిని తీసుకునే చిరుధాన్యాల పంటలను సాగుచేయాలి ►ఇళ్లు, పాఠశాలలు, కార్యాలయాల్లో వర్షపు నీటిని పొదుపు చేసే ఏర్పాట్లు చేసుకోవాలి ►కూరగాయలు కడిగిన నీటిని మొక్కలకు పోయాలి లేదంటే ఇతర అవసరాలకు వాడుకోవాలి ►చెట్లకు నీరు పోసేటప్పు డు, వాహనాలు, ఇళ్లు కడిగేటప్పుడు పైపులకు బదులుగా బకెట్లలో నీటిని ఉపయోగించాలి ►రోజువారీ నీటి వినియోగాన్ని నియంత్రించడంలో భాగంగా ప్రతి ఇంటికీ నీటి మీటర్లు ఏర్పాటు చేసుకోవాలి ►ప్లాస్టిక్ సంచులకు బదులు నేత సంచులు వాడాలి ►వెదురు దువ్వెనలు, వేప బ్రష్లు ఉపయోగించాలి ►ఆహారం తీసుకునే సమయంలో చిన్న ప్లేట్లను ఉపయోగించాలి ►పాత దుస్తులు, పుస్తకాలను దానం చేయాలి ►రెండువైపులా ప్రింట్ వచ్చేలా ప్రింటర్ను సెట్ చేసుకోవాలి ►ఎలక్ట్రానిక్ పరికరాలను మరమ్మతు చేసి ఉపయోగించుకోవాలే తప్ప పడేయకూడదు. -
శాస్త్రశోధనల గొంతు నొక్కితే ఎలా?
పర్యావరణ పరిరక్షణ విషయంలో ఇండియా పనితీరు అట్టడుగున ఉందని యేల్ యూనివర్సిటీ విడుదల చేసిన ‘ది ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్’ బయటపెట్టింది. దీన్ని కేంద్రం విమర్శించినప్పటికీ, ఇది దేశంలోని శాస్త్ర పరిశోధనా సంస్థల స్వయం ప్రతిపత్తిపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. డెహ్రాడూన్లోని వైల్డ్లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తన పరిశోధనా వ్యాసాలను ప్రచురించే ముందుగా వాటిని అధికారుల పరిశీలన కోసం పంపాలని కేంద్ర మంత్రిత్వ శాఖ జారీ చేసిన హుకుం ఒకటి బయటపడింది. సామాజిక స్థాయిలో కోవిడ్ వ్యాప్తిని నిర్ధారించే సమాచారాన్ని తొక్కిపెట్టేసినట్లు కూడా వార్తలున్నాయి. దేశ రక్షణ ప్రాజెక్టులను మినహాయిస్తే, మిగిలిన పరిశోధనలపై చర్చించేందుకూ, సమర్థించుకునేందుకూ శాస్త్రవేత్తలకు స్వాతంత్య్రముండాలి. పర్యావరణ పరిరక్షణ విషయంలో ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇండియా అట్టడుగున ఉందని ఇటీవలే విడుదలైన ‘ది ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్’ (ఈపీఐ) తెలపడం దేశంలో శాస్త్ర పరిశోధన సంస్థల స్వయం ప్రతిపత్తిపై పలు ప్రశ్నలు లేవనెత్తుతోంది. అమెరికాలోని సుప్రసిద్ధ యేల్ విశ్వవిద్యాలయం సిద్ధం చేసిన ఈ జాబితాపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. వాతావరణ మార్పులు, పర్యావరణ పరిస్థితి వంటి పదకొండు వర్గాల్లో సుమారు 40 అంశాలను పరిశీలించి యేల్ యూనివర్సిటీ ‘ఈపీఐ’ని సిద్ధం చేయగా కేంద్రం మాత్రం ఈ అంశాల ఎంపికే తప్పని విమర్శించింది. అత్యధిక సమాచారం అవసరమయ్యే అంశాల ఆధారంగా ఒక దేశం పర్యావరణం, వన్యప్రాణి ఆవాస పరిరక్షణలకు చేస్తున్న ప్రయత్నా లను మదింపు చేయడం సరికాదని వ్యాఖ్యానించింది. అయితే కొన్ని ఆసక్తికరమైన పరిణామాలను ఇక్కడ మనం పరిగణనలోకి తీసు కోవాల్సి ఉంటుంది. ఈపీఐ విడుదలైన నేపథ్యంలోనే కేంద్రం పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ వ్యవహారం ఒకటి వెలుగు లోకి వచ్చింది. డెహ్రాడూన్లోని వైల్డ్లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ) తన పరిశోధనా వ్యాసాలను ప్రచురించే ముందుగా వాటిని అధికారుల పరిశీలన కోసం పంపాలని కేంద్ర మంత్రిత్వ శాఖ జారీ చేసిన హుకుం ఒకటి బయటపడింది. అంటే యేల్ లాంటి సంస్థలు తప్పుడు అవగాహనతో, సమాచారాన్ని ఊహించుకుని ఈపీఐ వంటి జాబితాలను రూపొందిస్తున్నాయని ఆరోపిస్తూనే... ఇంకోవైపు పర్యావరణ సంబంధిత శాస్త్రీయ సమాచారాన్నిచ్చే సంస్థల గొంతు నొక్కే ప్రయత్నం కేంద్ర మంత్రిత్వ శాఖ చేస్తోందన్నమాట! నిజానికి ఇలా మంత్రిత్వ శాఖలు పరిశోధన సంస్థల గొంతు నొక్కే ప్రయత్నం చేయడం కొత్తేమీ కాదు. డబ్ల్యూఐఐ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థే అయినప్పటికీ కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నేతృత్వంలోనే పనిచేస్తూం టుంది. ఇతర మంత్రిత్వ శాఖల్లోనూ ఇలాంటి సంస్థలు చాలానే ఉన్నాయి. నిధుల వితరణ మొదలుకొని అనేక అంశాల్లో మంత్రిత్వ శాఖలు సంస్థల గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తూంటాయి. కరోనా మహమ్మారి ప్రబలిన సందర్భంలోనూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), వైద్య పరిశోధన విభాగాలు 2020 మే నెలలోనే దేశంలో సామాజిక స్థాయిలో కోవిడ్ వ్యాప్తిని నిర్ధారించే సమాచారాన్ని తొక్కిపెట్టేసినట్లు వార్తలున్నాయి. ఈ వివరాలు ప్రచురి తమై ఉంటే వైరస్ నియంత్రణలో కేంద్రం భేషుగ్గా పనిచేస్తోందన్న ప్రచారంలోని డొల్లతనం ఇట్టే బయటపడేది. ఆ తరువాతి కాలంలో ఇదే విషయం రుజువైన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు తమ పరిధిలోకి రాని పరిశోధనా సంస్థలపై కూడా పెత్తనం చలాయించే ప్రయత్నాలు చేసిన సందర్భాలు బోలెడు. భారత్లో ఎన్డీఎం–1 సూపర్ బగ్ ఉనికిని బ్రిటిష్ శాస్త్రవేత్తలు బట్టబయలు చేసినప్పుడు కేంద్ర ఆరోగ్య శాఖ, ఐసీఎంఆర్ రెండూ ఈ అంశంపై వ్యాఖ్యానించకుండా ప్రైవేట్ సంస్థ లనూ హెచ్చరించినట్లు సమాచారం ఉంది. వైద్యం కోసం పలువురు విదేశీయులు భారత్కు విచ్చేస్తున్నారన్న ‘మెడికల్ టూరిజం’ దెబ్బ తినకుండా ఈ ప్రయత్నం అన్నమాట. అయితే కొన్ని నెలల తరువాత ఆరోగ్య శాఖ స్వయంగా ఎన్డీఎం–1 కారణంగా కొన్ని మందులకు నిరోధకత ఏర్పడుతున్నట్లు అంగీకరించాల్సి వచ్చింది. ఈ అంశంపై ఒక టాస్క్ఫోర్స్నూ ఏర్పాటు చేయాల్సి వచ్చింది. నావీ1సీ పేరుతో ప్రయోగించిన ఓ ఉపగ్రహంలో తీవ్రస్థాయి లోపాలున్నాయనీ,వైఫై సిగ్నళ్లకు స్పందిస్తోందనీ 2018లో ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల శాస్త్రవేత్తలు గుర్తించగా... ఇస్రో వారి గొంతును నొక్కేసిందని సమాచారం. డబ్ల్యూఐఐ, నాగ్పూర్ కేంద్రంగా పనిచేస్తున్న నేషనల్ ఎన్విరాన్ మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (నీరి) వంటివి ఈ దేశానికి చాలా కీలకమైనవి. ప్రభుత్వ విధానాల రూపకల్పనకూ, పర్యావరణ పర్యవేక్షణకూ అవసరమైన పలు అంశాలపై ఈ సంస్థలు పరిశోధనలు చేస్తూంటాయి. భారీ ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చే ముందు వాటి కారణంగా వన్యప్రాణులకు, పర్యావరణానికి జరుగుతున్న నష్టంపై కూడా ఈ సంస్థలే నివేదికలివ్వాలి. 1990ల మధ్యలో డబ్ల్యూఐఐ శాస్త్రవేత్తలు దేశంలో ఆలివ్ రిడ్లే తాబేళ్ల దయనీయ పరిస్థితిపై ఓ శాస్త్రీయ జర్నల్లో ప్రచురించడం ఒక రకంగా సంచలనం సృష్టించిం దని చెప్పాలి. తూర్పు తీర ప్రాంతంలో ఈ తాబేళ్లకు భారీ ప్రాజెక్టులు, యాంత్రిక ట్రాలింగ్ల కారణంగా మరింత విపత్తు రానుందని డబ్ల్యూఐఐ హెచ్చరించింది కూడా! గహిర్మాత బీచ్లో వేల తాబేళ్లు సంతానోత్పత్తి చేస్తూంటాయి. అయితే ఈ ప్రాంతానికి దగ్గరలోని ఓ ద్వీపంలో క్షిపణి పరీక్షా కేంద్రం ఒకటి ఏర్పాటు కావడంతో తాబేళ్ల ఉనికి ప్రశ్నార్థకమైంది. ‘‘డీఆర్డీవో వాడే ప్రకాశవంతమైన లైట్లు ఆ తాబేళ్లకు ప్రాణాంతకంగా మారాయి’’ అని డబ్ల్యూఐఐ శాస్త్రవేత్త ఒకరు విస్పష్టంగా తన పరిశోధనా వ్యాసంలో రాశారు. ఆ తరువాత డీఆర్డీవో శాస్త్రవేత్తలు లైట్ల కాంతిని నియంత్రిస్తామని ప్రకటించాల్సి వచ్చింది. పర్యావరణ సంబంధిత వ్యాజ్యాల్లో చాలా సందర్భాల్లో న్యాయ స్థానాలు కూడా పరిశోధనా సంస్థల, ఆయా రంగాల్లో నిపుణుల ‘స్వతంత్ర’ నివేదిక కోసం అడుగుతూంటాయి. చార్ధామ్ హైవే డెవలప్మెంట్ ప్రాజెక్టుల విషయాన్నే ఉదాహరణగా తీసుకుంటే... జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు ఓకే చెప్పినా పర్యావరణ సంబంధిత ఆందోళనలను సమాధాన పరిచేందుకు ఓ పర్యవేక్షణ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సాంకేతిక సహాయం డెహ్రాడూన్లోని ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ‘నీరి’ అందించాయి. ఐఐటీ రూర్కీ వంటి సంస్థలు తయారు చేసిన నివేదికలు పలు జలవిద్యుత్ కేంద్రాలకు అనుమతు లివ్వడంలో ఉపయోగపడ్డాయి. అయితే గతంలో ‘నీరి’ నివేదికలపై కూడా చాలా విమర్శలు వచ్చిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. ప్రాజెక్టును ప్రతిపాదించిన వారికి అవి అనుకూలంగా ఉన్నాయని పలువురు వేలెత్తి చూపారు. మధుర రిఫైనరీ వల్ల జరుగుతున్న వాయు కాలుష్యాన్ని తక్కువగా చూపి, చిన్న పరిశ్రమలనే తాజ్మహల్ కాలుష్యానికి నిందించినట్టుగా ‘నీరి’పై ఆరోపణలున్నాయి. ‘నీరి’ డైరెక్టర్ సేవలను అవినీతి ఆరోప ణల నేపథ్యంలో అర్ధంతరంగా ముగించాల్సి రావడం, కొత్త డైరెక్టర్ నియామకంలో విపరీతమైన జాప్యం జరగడం ఇటీవలి పరిణామాలే. ఏతావాతా... దేశ పర్యావరణ పరిరక్షణకు కీలకమైన సేవ లందిస్తున్న జాతీయ స్థాయి పరిశోధనా సంస్థల వ్యవహారాల్లో వేలు పెట్టడం ఏ ఒక్కరికీ మంచి చేసే విషయం కాదు. దురదృష్టవశాత్తూ ఇటీవలి కాలంలో అన్ని స్థాయుల్లోనూ ఈ రకమైన ధోరణి పెరిగి పోతోంది. లక్ష్యిత ప్రయోజనాలు ఏమైనప్పటికీ శాస్త్రీయ పరిశోధన లను మాత్రం స్థిరంగా కొనసాగించాలి. దేశ రక్షణకు సంబంధించిన వ్యూహాత్మక ప్రాజెక్టులను మినహాయిస్తే మిగిలిన పరిశోధనల వివ రాలను ప్రజలందరికీ అందుబాటులో ఉంచాలి. తమ పరిశోధనలపై చర్చించేందుకూ, సమర్థించుకునేందుకూ శాస్త్రవేత్తలకు పూర్తి స్వాతంత్య్రం ఉండాలి. అయితే దేశంలో అత్యున్నత విధాన నిర్మాతలైన డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్తో పాటు ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ వంటి సంస్థలు ఈ స్వయం ప్రతిపత్తి విషయంలో మౌనంగా ఉంటున్నాయి. పరిస్థితి చేయి దాటక మునుపే మేలుకోవడం ఎంతైనా అవసరం! దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
ఆ దేశాలతోనే పర్యావరణానికి ముప్పు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా వస్తున్న వాతావరణ మార్పులకు, భారీగా కర్బన ఉద్గారాల విడుదలకు సంపన్న దేశాలే కారణమని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. భూమిపైనున్న సహజ వనరుల్ని విపరీతంగా దోపిడీ చేయడమే కాకుండా పెద్ద ఎత్తున కర్బన ఉద్గారాలు ఆ దేశాల నుంచే విడుదల అవుతున్నాయన్నారు. వాతావరణ మార్పుల్లో భారత్ ప్రమేయాన్ని పెద్దగా పట్టించుకోనక్కర్లేదని అన్నారు. స్వచ్ఛభారత్ మిషన్ , నమామి గంగ, ఒకే సూర్యుడు–ఒకే ఇంథన వ్యవస్థ వంటి పథకాలతో బహుహుఖంగా పర్యావరణ పరిరక్షణకు భారత్ చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రపంచపర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం సద్గురు జగ్గీ వాసుదేవ్ ఏర్పాటు చేసిన మట్టిని కాపాడుకుందాం ఉద్యమంపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. సారవంతమైన మట్టిపై భారత్ రైతుల్లో అవగాహన అంతగా లేదన్న ప్రధాని సాయిల్ హెల్త్ కార్డుల్ని ఇవ్వడానికి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడమే లక్ష్యమని మోదీ తెలిపారు. ముందుగానే లక్ష్యాలను చేరుకున్నాం పర్యావరణ పరిరక్షణ కోసం నిర్దేశించుకున్న లక్ష్యాలను మనం ముందే సాధించామని ప్రధాని చెప్పారు. పెట్రోల్లో 10శాతం ఇథనాల్ కలపాలన్న లక్ష్యాన్ని గడువు కంటే అయిదు నెలల ముందే సాధించినట్టు ప్రకటించారు. శిలాజేతర ఇంధనాల ద్వారా 40 శాతం విద్యుత్ ఉత్పత్తిని డెడ్లైన్ కంటే తొమ్మిదేళ్లు ముందే సాధించామని తెలిపారు. ‘సేవ్ సాయిల్ మూవ్మెంట్’ ద్వారా నేలలో సారం క్షీణించడంపై అవగాహన పెంచడానికి, సారాన్ని మెరుగుపరచడానికి ఈషా ఫౌండేషన్ అధినేత సద్గురు జగ్గీ వాసుదేవ్ చేపట్టిన ప్రపంచ వ్యాప్త ఉద్యమాన్ని ప్రధాని అభినందించారు. మట్టిని రక్షిస్తేనే జీవ మనుగడ: జగ్గీ వాసుదేవ్ మట్టిని రక్షిస్తేనే జీవ మనుగడ సాధ్యమని ఈషా ఫౌండేషన్ సద్గురు జగ్గీ వాసుదేవ్ తెలిపారు. భవిష్యత్తు తరాల కోసం మట్టిని రక్షించడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని చెప్పారు. లైఫ్స్టైల్ ఉద్యమం ప్రారంభం పర్యావరణహితంగా మన జీవన విధానాన్ని మార్చుకోవడానికి ఉద్దేశించిన లైఫ్స్తైల్ ఫర్ ది ఎన్విరాన్మెంట్ (లైఫ్) ఉద్యమాన్ని ప్రధాని ప్రారంభించారు. పర్యావరణాన్ని కాపాడడానికి తమ వంతుగా లైఫ్స్టైల్ మార్చుకుంటే వారిని ప్రోప్లానెట్ పీపుల్ అని పిలుస్తారని అన్నారు. మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ మాట్లాడుతూ.. కర్బన ఉద్గారాలను తగ్గించడంలో భారత్ చర్యలు స్ఫూర్తిదాయకమన్నారు. వాతావరణ మార్పుల నివారణతోపాటు వాతావరణ లక్ష్యాల సాధనలో భారత్ పాత్ర, నాయకత్వం చాలా కీలకమైందని బిల్గేట్స్ పేర్కొన్నారు. -
ప్రపంచ పర్యావరణ దినం: ఒక్కటే భూమి..ఒక్కటై కాపాడుకుందాం
భూగోళం వేడెక్కిపోతోంది. వాతావరణంలో కనీవినీ ఎరుగని విపరిణామాలు సంభవిస్తున్నాయి. ఉష్ణోగ్రతల పెరుగుదలకు కళ్లెం వేయాలన్న ఆదర్శం కాగితాలకే పరిమితమైంది. పారిస్ ఒప్పందాన్ని అమలు చెయ్యాలన్న పర్యావరణ శాస్త్రవేత్తల పిలుపులు కంఠశోషగానే మిగులుతున్నాయి. ఏడాదికోసారి పర్యావరణ పరిరక్షణ సదస్సులతో సరిపెడుతున్నాయి. ఇదిలాగే కొనసాగితే కనీవినీ ఎరుగని నష్టాలను చవిచూడటం ఖాయమని, ఆ రోజు ఎంతో దూరంలో కూడా లేదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు... జూన్ 5. ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఈ ఏడాదితో దీనికి 50 ఏళ్లు పూర్తయ్యాయి. 1972లో ఐక్యరాజ్యసమితి నిర్వహించిన పర్యావరణ పరిరక్షణ సదస్సుకు స్వీడన్ ఆతిథ్యం ఇచ్చింది. వాతావరణ మార్పులను గమనించి, అవసరమైన చర్యలు చేపట్టాల్సిన అవసరముందని అప్పుడు తొలిసారిగా గుర్తించారు. 1973 నుంచి జూన్ 5ను ప్రపంచ పర్యావరణ దినంగా జరుపుకుంటూ వస్తున్నాం. ఈ సందర్భంగా ఐరాస ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం (యూఎన్ఈపీ) ఏటా ఏదో ఒక అంశంతో పర్యావరణంపై ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నాలు చేస్తోంది. ఈసారి ‘ఓన్లీ వన్ ఎర్త్’ థీమ్తో ముందుకొచ్చింది. పర్యావరణ పరిరక్షణకు ప్రపంచ దేశాలన్నీ కలసికట్టుగా ప్రయత్నించాలని పిలుపునిచ్చింది. గ్రీన్ లైఫ్ స్టైల్ను అలవర్చుకోవడంతో పాటు పచ్చదనం, పరిశుభ్రతల కోసం చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రభుత్వాలేం చేయాలి? ► పర్యావరణ పరిరక్షణకు అతి ముఖ్యమైన అడవులు, నదులు, సముద్రాలు , తేమ ప్రాంతాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి. 1990వ దశకంలో ఏడాదికి 1.6 కోట్ల హెక్టార్ల చొప్పున అడవులను కోల్పోయాం! 2015–2020 మధ్య కూడా ఏటా కోటి హెక్టార్ల చొప్పున తగ్గింది. అడవుల్ని కాపాడుకోవడం ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యం. ► ఐరాస ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) ప్రకారం మాంసాహారం తయారీ, రవాణా వల్ల 18% దాకా కర్బన ఉద్గారాలు విడుదలవుతున్నాయి. పశు పెంపకానికి నీటి వాడకమూ పెరుగుతోంది. దీన్ని తగ్గించాలంటే వ్యవసాయ రంగంలో చిన్న కమతాల్ని ప్రోత్సహించాలి. ► ప్రపంచవ్యాప్తంగా శాకాహారుల సంఖ్య 2015–2019 మధ్య 21 నుంచి ఏకంగా 58 శాతానికి పెరిగింది. దీన్నింకా పెంచడానికి దేశాలన్నీ కృషి చేయాలి. ► ప్రపంచవ్యాప్తంగా చమురు ఉత్పత్తి వల్ల 35 శాతం ఉద్గారాలు విడుదలవుతున్నాయి. అందు కే గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించాలి. సోలార్, విండ్ పవర్, ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీలివ్వాలి. ► గ్లోబల్ వార్మింగ్కు 30 నుంచి 35 శాతం దాకా కారణమవుతున్న బ్లాక్ కార్బన్, మీథేన్, ఓజోన్, హైడ్రో ఫ్లోరో కార్బన్స్ నియంత్రణకు గట్టి విధానాలు రూపొందించాలి. పర్యావరణ పరిరక్షణకు పాటుపడకుంటే.. ► ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు 1.5 నుంచి 2 డిగ్రీల దాకా పెరుగుతాయి. అప్పుడు జనాభాలో 14% అత్యంత తీవ్రమైన ఎండ వేడిమికి గురవుతారు. అది క్రమంగా 37 శాతానికి చేరే ప్రమాదముంది. ► 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా మెగా నగరాల్లోని 35 కోట్ల మందిని ఎండ వేడి బాధిస్తుంది. నీటి కరువుతో, కాటకాలతో నగర ప్రాంతాలు అల్లాడిపోతాయి. దక్షిణాసియా దేశాలకే ఈ ముప్పు ఎక్కువ. ► ముంబై, ఢిల్లీ, కోల్కతా, ఢాకా, కరాచీ నగర వాసులు ఎండతీవ్రతకి గురవుతారు. ► సముద్ర మట్టాలు 24 నుంచి 38 సెంటీమీటర్లు పెరిగి బ్యాంకాక్, జకార్తా, మనీలా నగరాలు మునిగిపోవచ్చు. ► 2050 నాటికి సగం జనాభాకు మలేరియా, డెంగ్యూ, జికా వైరస్ ముప్పుంటుంది. అస్తమా వంటి వ్యాధులు పెరిగిపోతాయి. ► కీటకాలు, మొక్కలు, జంతువుల ఆవాస ప్రాం తాలు సగానికి తగ్గి జీవ వైవిధ్యం నశిస్తుంది. మనం చేయాల్సిందేమిటి? ► ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల బదులు రీ యూజబుల్ బ్యాగులు వాడాలి. ► కాగితం వాడకాన్ని తగ్గించాలి. అత్యవసరమైతే తప్ప ప్రింట్లు తీయొద్దు. ► వారానికి ఒక్క రోజన్నా శాకాహారమే తినాలి. వీగన్ డైట్ ద్వారా కర్బన్ ఉద్గారాలను 73 శాతం తగ్గించవచ్చు. ► కారు బదులు బైక్ వాడితే కిలోమీటర్కు 250 గ్రాముల కర్బన్ ఉద్గారాలను కట్టడి చయగలం. ► ఇంట్లో నీళ్ల పైపుల లీకేజీని ఎప్పటికప్పుడు సరి చేస్తే కోట్లాది గాలన్ల నీరు ఆదా అవుతుంది. ► ఇళ్లల్లో ఫ్లోరోసెంట్ బల్బులు వాడితే 75% కరెంటు ఆదా అవుతుంది. ► రీ యూజబుల్ కరోనా మాస్కులు వాడాలి. యూజ్ అండ్ త్రో మాస్కులతో జంతుజాలానికి ఎనలేని హాని జరుగుతోంది. ► డిటర్జెంట్స్, వాషింగ్, లిక్విడ్ సోపుల్లో కనిపించని ప్లాస్టిక్ కణాలుంటాయి. నేచరల్ ప్రొడక్టులు వాడటం మేలు. ► ఇంటా బయటా అందరూ పెద్ద సంఖ్యలో మొక్కలు పెంచాలి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
కడ్తాల్: వాతావరణ మార్పుల నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని, పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ప్రముఖ పర్యావరణ వేత్త, ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం అన్మాస్పల్లిలోని ఎర్త్ సెంటర్లో, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఆధ్వర్యంలో ‘క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పీపుల్’ ముగింపు సదస్సులో ఆయన మాట్లాడారు. కాప్–26 సదస్సు నిరాశ పరిచిందని, పర్యావరణవాదుల ఆశలను నీరుగార్చిందని అభిప్రాయపడ్డారు. పబ్లిక్ పాలసీ నిపుణుడు దొంతి నరసింహారెడ్డి మాట్లాడుతూ, వ్యవసాయరంగంలో రసాయన ఎరువులను వాడటం వల్ల, భూమిలో కర్బన శాతం పెరిగి, ఆహార పంటల్లో పోషక విలువలు తగ్గుతున్నాయని చెప్పారు. దీంతో మనిషి జీవన ప్రమాణ రేటు తక్కువగా ఉంటుందన్నారు. తక్కువ నీటి వినియోగం ఉన్న పంటలపై రైతులు దృష్టి సారించాలని, వర్షాధార పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల జీవనశైలి, వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని పేర్కొన్నారు. గ్లాస్గో నగరంలో నిర్వహిస్తున్న కాప్–26 సదస్సులో చర్చించిన అంశాలను, క్షేత్రస్థాయిలో ఏ విధంగా తీసుకుపోవాలనే లక్ష్యంతో స్థానిక ఎర్త్ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సీజీఆర్ చైర్మన్ లీలా లక్ష్మారెడ్డి వివరించారు. ప్రతీఒక్కరు కనీసం ఐదు మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎర్త్ సెంటర్ డైరెక్టర్ సాయిభాస్కర్రెడ్డి, వందేమాతరం ఫౌండేషన్ మాధవరెడ్డి, సీజీఆర్ ఫౌండర్ లక్ష్మారెడ్డి, ధర్మసేవ ట్రస్ట్ చైర్మన్ నిశాంత్రెడ్డి, మదన్మోహన్రెడ్డి, ఉపేందర్రెడ్డి, వికాస్, నాగరాజు, అర్చన, రాజిరెడ్డి, కృష్ణారెడ్డి, ఇంద్రాసేనారెడ్డి, సిటీ కాలేజీకి చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. -
పచ్చందనమే పచ్చదనమే... తారలు ఏమంటున్నారంటే?
పర్యావరణాన్ని పరిరక్షించేది చెట్లే... చుట్టూ పచ్చని చెట్లు ఉంటే ఆహ్లాదానికి ఆహ్లాదం.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. పచ్చందమనే పచ్చదనమే.. అంటూ ఉల్లాసంగా ఉండొచ్చు. శనివారం (జూన్ 5) ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో పర్యావరణ పరిరక్షణకు పిలుపునిచ్చారు ప్రముఖ తారలు. ‘‘పర్యావరణం రోజు రోజుకు మరింత నాశనం అవుతోంది. ఈ సందర్భంగా పర్యావరణ వ్యవస్థలను తిరిగి పునరుద్ధరించడానికి ఈరోజు అందరం ప్రతిజ్ఞ చేద్దాం. మన భూ గ్రహాన్ని పచ్చగా మార్చడానికి ప్రయత్నిద్దాం’’ అని పేర్కొన్నారు మహేశ్బాబు. హీరో అల్లు అర్జున్ తన ఇంటి వద్ద మొక్కను నాటి, నీళ్లు పోస్తున్న ఫొటోని ట్విట్టర్లో షేర్ చేసి, ‘‘భూమిని రక్షించుకునేందుకు మనందరం మొక్కలు నాటుదామని, పర్యావరణాన్ని కలుషితం చేయని అలవాట్లను అలవరుచుకుంటామని, భవిష్యత్తు తరాల కోసం మన భూమిని పచ్చదనంగా మార్చుదామని అందరం ప్రతిజ్ఞ చేద్దాం’’ అన్నారు. ‘‘మనకు ఉన్న ఏకైక ఇల్లు భూమి. అలాంటి భూమిని నాశనం చేయడం ఆపేసి బాగు చేయడానికి సమయం కేటాయిద్దాం.. మనందరం చేతులు కలిపి మన ఇంటిని రక్షించుకుందాం’’ అని పోస్ట్ చేశారు సాయి తేజ్. ‘‘ప్రకృతి చేతుల్లోనే మనందరి ఆనందం, శాంతి దాగి ఉన్నాయి. అందుకే ప్రకృతిని సంరక్షించుకుందాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణ గురించి చాలా మాట్లాడుకుంటాం. అయితే ఆ ఒక్కరోజే కాదు.. ప్రకృతి పట్ల ప్రతిరోజూ మనందరం బాధ్యతగా ఉందాం’’ అన్నారు రాశీ ఖన్నా. -
International Day for Biological Diversity: జీవవైవిధ్య దినోత్సవం
సిరికొండ: సూక్ష్మజీవుల నంచి క్రిమికీటకాల వరకు వృక్షాల నుంచి జంతు జలచరాల వరకు ప్రకృతిలోని ప్రాణులన్ని పరస్పర జీవనం గడపడమే జీవవైవిధ్యం. ప్రకృతి వనరులను కొల్లగొడుతూ మానవుడు తన ఉనికిని ప్రశ్నార్థకం చేసుకుంటున్నాడు. సంరక్షణ మాట మరిచి ఇష్టానుసారంగా చెట్లను నరికి వేయడం, విరివిగా రసాయనాల వాడకం, ప్లాస్టిక్ వ్యర్థాలు ఇతరత్రా కాలుష్యాలకు కారణమవుతు జీవవైవిధ్య సమతుల్యతను దెబ్బతీస్తున్నాడు. నేడు ప్రపంచ జీవవైవిధ్య దినోత్సవం సందర్బంగా ప్రత్యేక కథనం. పర్యావరణ పరిరక్షణలో ఆహార గొలుసు చెడిపోకుండా 2002లో జీవవైవిధ్య చట్టం అమలులోకి వచ్చింది. దశాబ్దం తర్వాత 2014లో రాష్ట్ర జీవవైవిధ్య బోర్డును తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ ఆ బోర్డు ఆరంభశూరత్వంలా మారింది. గ్రామ, మండల జీవవైవిధ్య కమిటీల ఏర్పాటు సాగుతూనే ఉండటం, జిల్లాల్లో తగినంత సిబ్బందిని నియమించకపోవడం, కమిటీలు ఏర్పాటైన సభ్యులకు సరైన శిక్షణ లేకపోవడం, నిధుల ఖర్చుపై ఆడిట్ లేకపోవడం సమస్యలుగా మారాయి. పేరుకు కమిటీలు.. ఉమ్మడి జిల్లాలో జీవవైవిధ్య అమలు కోసం ఇద్దరు సమన్వయకర్తలు ఉండాలి. ఒక్కరే ఉన్నారు. ఉమ్మ డి జిల్లాలో 51 మండలాలకు నాలుగు మండలాల్లో 1056 గ్రామ పంచాయతీలకు 219 గ్రామాలలో మాత్రమే కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలకు పథకం అమలు, జీవవైవిధ్య సంరక్షణపై తగిన శిక్షణ ఇవ్వాలి. వారసత్వ సంపదలైన వృక్షా లు, జంతువులు, పవిత్రవనాలు, జలాశయాలు, వారసత్వ కట్టడాలు, ఔషధ మొక్కలు మొదలైన వాటిపై అవగాహన కలి్పంచాలి. కానీ గడిచిన ఏడెండ్లలో జిల్లా స్థాయి, మండల, గ్రామ స్థాయిలో తగిన శిక్షణ లేక కమిటీల పనితీరు నామమాత్రంగా మారింది. ప్రతి జిల్లాలో జీవవైవిధ్య కమిటీలకు రెండు దశల్లో నిధులు ఇవ్వాలని రాష్ట్ర జీవవైవిధ్య బోర్డు నిర్ణయించింది. అందులో భాగంగా గ్రామ జీవవైవిధ్య కమిటీకి రూ.1.50 లక్షలు, మండల కమిటీకి రూ.1.50 లక్షలు, జిల్లా కమిటీకి రూ.2.30 లక్షలు ఇవ్వాలి. 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలో 24 గ్రామ పంచాయతీలకు రూ. 8.80 లక్షలు విడుదల అయ్యాయి. వీటిలో కార్యాలయ ఏర్పాటు అవసరమైన రికార్డులు ఫరీ్నచర్ కొనుగోలు క్షేత్ర స్థాయి పరిశోధనలకు కేటాయించాలి. కానీ చాలా గ్రామ పంచాయతీల్లో వీటి ఏర్పాటు లేకుండానే నిధులు స్వాహ అయ్యాయి. సరైన ఆడిట్ లేనందువల్ల గత సర్పంచుల హయాంలో నిధులకు లెక్కలేకుండా పోయాయి. మిగతా నిధులు విడుదల చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చేయలేదు. దెబ్బతింటున్న జీవవైవిధ్యం ప్రకృతిలో జీవవైవిధ్యం దెబ్బతింటోంది. దీంతో హనికరమైన వైరస్లు విజృంభిస్తున్నాయి. గడిచిన వందేళ్లలో ప్రపంచవ్యాప్తంగా 20 వేల జాతుల జీవులు వైరస్లతో అంతరించిపోయాయి. మానవుల తప్పిదాలతో 75 శాతం మేర జన్యుజీవవైవిధ్య పంటలు కనుమరుగయ్యాయి. 24 శాతం క్షీరదాలు, 12 శాతం పక్షి జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. -
దిశా రవికి ఒక రోజు పోలీసు కస్టడీ
న్యూఢిల్లీ: ‘టూల్ కిట్’ కేసులో ఇటీవల అరెస్ట్ అయిన పర్యావరణ పరిరక్షణ మహిళా కార్యకర్త దిశా రవిని ఒక రోజు పోలీసు కస్టడీకి సోమవారం ఢిల్లీలోని చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు అనుమతించింది. ఇతర నిందితులతో కలిపి ఆమెను విచారించేందుకు అనుమతించాలని పోలీసులు కోరడంతో మెజిస్ట్రేట్ పంకజ్ శర్మ ఈ ఆదేశాలిచ్చారు. అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టించిన కేసు ఇదని పోలీసులు కోర్టుకు తెలిపారు. మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు మద్దతుగా చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరిస్తూ రూపొందిన టూల్ కిట్ను సోషల్ మీడియాలో షేర్ చేయడానికి సంబంధించి దిశా రవితో పాటు నికిత జాకోబ్, శంతను ములుక్లపై ఢిల్లీ పోలీసులు దేశద్రోహం సహా ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఎవరితో కలిపి తనను విచారించాలని పోలీసులు చెబుతున్నారో.. ఆ సహనిందితులు ప్రస్తుతం బెయిల్పై ఉన్నారని, పోలీసు కస్టడీలో లేరని, అలాంటప్పుడు తన కస్టడీని పోలీసులు ఎలా కోరుతారని దిశా రవి మెజిస్ట్రేట్ దృష్టికి తీసుకువచ్చారు. జ్యూడీషియల్ కస్టడీలో ఉంచి కూడా సహ నిందితులతో కలిపి తనను విచారించే అవకాశం ఉందని వాదించారు. మరోవైపు, దిశా రవి బెయిల్ పిటిషన్ సెషన్స్ కోర్టులో పెండింగ్లో ఉందని, మంగళవారం దానిపై తీర్పు వెలువడనుందని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. -
భారత్పై ట్రంప్ విమర్శలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు భారత్పై నోరు పారేసుకున్నారు. చైనా, రష్యాలతో కలిసి భారత్ ప్రపంచ పర్యావరణానికి విఘాతం కలిగిస్తోందని విమర్శించారు. నార్త్ కరోలినాలో ఎన్నికల ర్యాలీలో ట్రంప్ పాల్గొన్నారు. తన నేతృత్వంలో అమెరికా ఇంధన స్వయం సమృద్ధి సాధించిందని చెప్పారు. ‘‘ మన పర్యావరణ, ఓజోన్ ఇతర గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి. మరోవైపు ఇండియా, చైనా, రష్యాలు వాయు కాలుష్యాన్ని పెంచుతున్నాయి’’ అని ఆయన ర్యాలీలో ఆరోపించారు. పర్యావరణ పరిరక్షణకు ఉద్దేశించిన పారిస్ డీల్ నుంచి అమెరికా వైదొలుగుతున్నట్లు ట్రంప్ 2017లో ప్రకటించారు. ఈ డీల్తో తమకు కోట్లాది డాలర్ల వ్యయం అవుతుందని, పలు ఉద్యోగాలు పోతాయని అప్పట్లో ట్రంప్ విమర్శించారు. అవకాశం వచ్చినప్పుడల్లా పర్యావరణం విషయంలో చైనాతో పాటు భారత్పై ట్రంప్ అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారు. పారిస్ డీల్తో ఈ రెండు దేశాలకు బాగా మేలు జరుగుతుందని, యూఎస్కు ఏమీ ఉపయోగం ఉండదని ఆయన విమర్శించారు. తాజాగా ఇదే అక్కసును మరోమారు వెలిబుచ్చారు. పేపర్ వాడకంపై ఎద్దేవా పర్యావరణాన్ని రక్షించే క్రమంలో ప్లాస్టిక్ వాడకం తగ్గించి దాని బదులు పేపర్ వాడకం జరపాలన్న వాదనను ట్రంప్ ఎద్దేవా చేశారు. ఇలాంటి సూచనలిచ్చేవాళ్లను ‘క్రేజీ’అంటూ ఎగతాళి చేశారు. అమెరికాలో స్వదేశీయులకు ఎక్కువ ఉద్యోగాలు కల్పించడానికి ఎన్నో చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. స్వదేశీయులను కాదని విదేశీయులతో ఉద్యోగాలు నింపినందుకు టెన్నెసీ వాలీ అథార్టీ చైర్మన్ను తాను తొలగించినట్లు చెప్పకొచ్చారు. అక్రమవలసదారులకు పౌరసత్వ కల్పిస్తానన్న బైడెన్ వ్యాఖ్యలను ఆయన దుయ్యబట్టారు. -
పర్యావరణ పరిరక్షణకు పటిష్ట చట్టం
న్యాయనిపుణులను భాగస్వామ్యం చేస్తూ చట్టాన్ని సమర్థవంతంగా తీసుకురావాలి. ప్రతి కంపెనీ ఏటా పీసీబీ సూచనల అమలుపై ఒక రిపోర్టు ఇచ్చేలా చూడాలి. వాటిని థర్డ్ పార్టీ ఆడిటర్ ద్వారా సమీక్షించే విషయాన్ని పరిశీలించాలి. థర్డ్ పార్టీ ఆడిటర్లుగా ప్రఖ్యాత, విశ్వసనీయ ఏజెన్సీలను ఎంపానెల్ చేసేలా చర్యలు తీసుకోవాలి. ఆ ఏజెన్సీలు ఇచ్చిన అంశాలపై పీసీబీ దృష్టి సారిస్తూ.. ఆ నివేదికలను పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. వ్యర్థాలు, కాలుష్య కారకాలు, జలాలను పద్ధతి ప్రకారం నిర్వహించాల్సి ఉంటుంది. లేకపోతే భవిష్యత్ తరాలకు ఇబ్బంది వస్తుంది. శాస్త్రీయ విధానాలతో కాలుష్య కారక వ్యర్థాల నిర్వహణను ప్రభుత్వమే చేపడుతుంది. అందువల్ల కొంత మొత్తాన్ని కంపెనీలు చెల్లించేలా విధానం ఉండాలి. ఇందుకోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణకు ప్రత్యేకంగా పటిష్టమైన చట్టం తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు రూపొందించిన ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్ మెంట్ ఇంప్రూవ్మెంట్ చట్టంలోని ప్రతిపాదిత అంశాలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్ష వివరాలు ఇలా ఉన్నాయి. (23 నుంచి 30 వరకు వైఎస్సార్సీపీ సేవా కార్యక్రమాలు) ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్ మెంట్ ఇంప్రూవ్మెంట్ చట్టంలోని ప్రతిపాదిత అంశాలపై క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్ జగన్ ► రెడ్, ఆరెంజ్ జాబితాలో ఉన్న కంపెనీలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(పీసీబీ)కు నిరంతరం రియల్ టైం డేటా రావాలి. అయితే వస్తున్న డేటాను విస్మరించడం అనేది మన వ్యవస్థల్లో పెద్ద లోపంగా ఉంది. ఈ డేటా ఆధారంగా ఏం చర్యలు తీసుకుంటున్నామనేది చాలా ముఖ్యం. సత్వర చర్యలు అవసరం. ► రసాయనాల నిర్వహణ, నిల్వ, ప్రాసెసింగ్, ప్రమాదకర రసాయనాలు.. తదితర అంశాలపై ఎప్పటి కప్పుడు డేటాను స్వీకరించాలి. దీంతో పాటు.. ప్రఖ్యాత, విశ్వసనీయ సంస్థకూ ఈ డేటా పర్యవేక్షణ బాధ్యత ఇవ్వాలి. ► నిర్ణీత ప్రమాణాలను దాటి కాలుష్య కారక పరిస్థితులు, ప్రమాదకర పరిస్థితులు తలెత్తినప్పుడు వెంటనే హెచ్చరికలు జారీ కావాలి. ఈ హెచ్చరికలు ఎవరెవరికి వెళ్లాలన్న దానిపై ఒక స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) తయారు చేయాలి. కలెక్టర్, ఎస్పీ, సంబంధిత అధికారులకు వెంటనే హెచ్చరికలు వెళ్లాలి. ► హెచ్చరికలు జారీ అయ్యాక తగిన చర్యలు తీసుకోకపోతే పర్యావరణానికి జరిగిన నష్టం మేరకు జరిమానా విధించాలి. నిర్ణీత సమయంలోగా చెల్లించకపోతే షాక్ కొట్టేలా మరింత జరిమానా విధించాలి. ఈ ప్రక్రియలో ఎక్కడా అవినీతికి చోటు ఉండరాదు. ► ఈ సమీక్షలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరభ్ కుమార్ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సభ్య కార్యదర్శి వివేక్ యాదవ్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. (పోలవరం పనులు వేగవంతం ) పర్యావరణ పరిరక్షణ కోసం హరిత నిధి ► ఒక పక్క పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహిస్తూనే మరో పక్క పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ ఫండ్ (హరిత నిధి)ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అన్ని పరిశ్రమలు ఒక పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ► రెడ్, ఆరంజ్ విభాగాల్లోని పరిశ్రమల్లో కాలుష్యాన్ని కొలిచే అన్ని రకాల పరికరాలు ఉండాలి. ఎప్పటికప్పుడు ఆ సమాచారం రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి అనుసంధానం అయ్యేలా ఏర్పాటు చేసుకోవాలి. స్వల్ప నిబంధనలు ఉల్లంఘించినా భారీ పెనాల్టీ భరించాల్సి ఉంటుంది. ► ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ కాంపెన్సేషన్ (ఈడీసీ) వ్యవస్థను ఏర్పాటు చేయాలి. కాలుష్యం వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడం తోపాటు పాత పరిస్థితులను తీసుకురావడానికి అయ్యే వ్యయాన్ని ఈడీసీ అంచనా వేస్తుంది. ఆ మొత్తాన్ని గ్రీన్ ఫండ్లో జమ చేసి పర్యావరణ పరిరక్షణకు వినియోగించాలి. -
ఇంటి నుంచే పర్యావరణ ఉద్యమం
ప్రపంచంలో చిట్టచివరి కరోనా కేసు కూడా నెగెటివ్ అని తేలిన తర్వాత? దాదాపు అన్ని దేశాలలో అమలవుతున్న లాక్ డౌన్ ఎత్తివేశాక? ఇక మళ్లీ ప్రపంచం గాడిన పడ్డట్టేనా? యథావిధిగా మన జీవితాలు కొనసాగినట్టేనా? అవునని అనుకుంటే మాత్రం ఇంత పెద్ద ఉత్పాతం నుంచి మనం ఏమీ నేర్చుకోనట్టే అంటున్నారు లియత్ ఓలెనిక్, అలెజాండ్రో దాల్ బాన్. ధరిత్రీ దినోత్సవం సందర్భంగా ఈ పర్యావరణ ఆందోళనకారులు అమెరికా ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తిచూపుతూ, మిగిలిన దేశాలు నడవాల్సిన దిశ ఏమిటో సూచిస్తున్నారు. 1970 ఏప్రిల్ 22న సుమారు రెండు కోట్ల మంది అమెరికన్లు వీధుల్లోకి వచ్చి పర్యావరణ హిత సమాజం కోసం గొంతెత్తారు. అదే మొదటి ధరిత్రీ దినోత్సవం. దీని ఫలితమే అదే ఏడాది ఏర్పాటైన ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (ఈపీఏ). తర్వాత అమెరికన్ కాంగ్రెస్ స్వచ్ఛమైన గాలి చట్టం, స్వచ్ఛమైన నీటి చట్టం, అంతరించిపోయే ప్రమాదం ఉన్న జీవజాతుల సంరక్షణ చట్టం చేసింది. సరిగ్గా 50 ఏళ్ల తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్లోబల్ వార్మింగ్ను నిరాకరిస్తూ, పర్యావరణ హిత చట్టాలన్నీ బలహీనపడేలా వ్యవహరిస్తున్నాడు. ఉష్ణోగ్రతల పెరుగుదల, కారుచిచ్చులు, తుపాన్లు, వరద బీభత్సాల తర్వాత ఇప్పుడు కరోనా మహమ్మారి ఎంతోమంది ప్రాణాలను బలిగొంది, ఎంతోమంది ఉపాధిని పోగొట్టింది. ఇదే మేలుకొలుపుగా మన భవిష్యత్ ఏమిటో ప్రశ్నించుకోవాలి అంటున్నారు లియత్, అలెజాండ్రో. కోవిడ్–19 అమెరికన్ సమాజంలో ఏళ్లుగా వేళ్ళూనుకుని ఉన్న అసమానతలను ఎత్తిచూపింది. హెల్త్ కేర్ లేనివాళ్లు, కలుషిత గాలిని పీలుస్తూ బతకాల్సిన వాళ్ళు, పత్రాలు లేని వలస జీవులు, ఖైదీలు, ఇంటి భద్రత లేనివాళ్ళు– ఎవరికి వారికి అందాల్సిన సాయం అందడం లేదు. దశాబ్దాలుగా అమలవుతున్న పర్యావరణ వివక్ష ఈ వర్గాలను తీవ్రంగా దెబ్బ కొట్టింది. పవర్ ప్లాంట్ల దగ్గర ఉన్న వాళ్ళలో ఉబ్బస బాధితులు ఎక్కువ. చమురు వెలికితీత ప్రదేశాల్లో కేన్సర్ కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. కరోనా వైరస్ వల్ల ఎక్కువగా నష్టపోయిన జనం వీళ్లే. న్యూయార్క్ నగరంలోని క్వీన్స్లోని వలసల ఆవాసాలు, బ్రాంక్స్ లోని అల్పాదాయ వర్గాల వాడలు కోలుకోలేని దెబ్బతిన్నాయి. కోవిడ్–19 లాగే ఈ పర్యావరణ సంక్షోభం కూడా ప్రపంచాన్ని తీవ్రంగా అస్థిరపరుస్తుందనీ; ఇది మరెన్నో కొత్త విపత్తులను తేనుందనీ వేలాదిమంది పర్యావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే ఎన్నో రకాల వ్యాధులు ఇందులో ఒకటి. తగిన చర్యలకు ఉపక్రమించకపోతే గనక పంటలు నాశనం కావడం, వరదలు, ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా 2050 నాటికి సుమారు 100 కోట్ల మంది తమ ఆవాసాలకు దూరం అవుతారని వీరు హెచ్చరిస్తున్నారు. 2030 నాటికి అమెరికా నూటికి నూరు శాతం పునర్వినియోగ ఇంధన వనరుల వైపు మారిపోవాలనీ, కరోనా సంక్షోభమే సాకుగా ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టేలా శిలాజ ఇంధన సంస్థలు ఉల్లంఘనలకు పాల్పడకుండా నిరోధించాలనీ వీరు కోరుతున్నారు. పర్యావరణ నియంత్రణల మీద ఈపీఏ వెనక్కి తగ్గడం మార్చి 26నే మొదలైంది. ఉల్లంఘనలకు పరిహారం వసూలు చేయకపోగా, సంస్థలే ’స్వీయ పరిశీలన’ చేసుకోవాలని అనడం అంటే, ప్రజారోగ్యాన్ని మరింత ప్రమాదం వైపు నెట్టినట్టే. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి అమెరికా ప్రభుత్వం ఇప్పటికే తన రెండు ట్రిలియన్ డాలర్ల బెయిల్ అవుట్ ప్యాకేజీలో భాగంగా, కంపెనీల కోసం 500 బిలియన్లు ఖర్చు చేసింది. అట్లాంటిది పర్యావరణ హితం కోసం ఒక గ్రీన్ డీల్ కుదుర్చుకోవడానికి ఈ 50వ ధరిత్రీ దినోత్సవం ఒక సందర్భం ఎందుకు కాకూడదని ప్రశ్నిస్తున్నారు లియత్, అలెజాండ్రో. ఈ సొమ్మును కార్మికులు, పునర్వినియోగ ఇంధన వనరుల పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన, పర్యావరణ సంక్షోభం బారినపడే సముదాయాలకు బదలాయించాలని కోరుతున్నారు. వ్యక్తులు, బ్యాంకులు, విశ్వవిద్యాలయాలు, సంస్థలు అన్నీ అటవీ క్షయాన్ని అరికట్టేలా, పర్యావరణానికి మేలు జరిగేలా తమ స్థాయిలో ప్రభావితం చేస్తామని ప్రతిన బూనాలి. 50 ఏళ్ల క్రితం ఇదే కారణంతో రెండు కోట్ల మంది వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేశారు. మనల్ని మనం కరోనా భారీ నుంచి కాపాడుకోవడానికి ప్రస్తుతం ఇళ్లకే పరిమితమై ఉన్నాం. ఇదే ఉత్సాహంతో ఈ భూగోళాన్ని కాపాడుకోవడానికీ, తద్వారా దాన్ని మరింత నివాసయోగ్యం చేసుకోవడానికీ ఇంటి నుంచే, ఈ రోజు నుంచే పోరాటం ప్రారంభిద్దాం. (ధరిత్రీ దినోత్సవానికి నేటితో 50 ఏళ్లు) – పి. శివకుమార్ -
వృక్షారామం
ద్రాక్షారామం గురించి విన్నాం, మరి ఈ వృక్షారామం ఏంటి అనుకుంటున్నారా..! ఒకే వేదికగా నక్షత, సప్తర్షి, నవగ్రహ, అశోకవనాలతో విలసిల్లుతూ ఆధ్యాతికతకు ఆలవాలమైంది. దేవతా వృక్షారామంగా పేరొందిన ఆ ఆరామం తూర్పుగోదావరి జిల్లా మండపేటలోని ఆర్తమూరులో ఉంది. చుట్టూ పచ్చని చెట్లు. అరవైకి పైగా వృక్షజాతులు. పండ్లు, పూల మొక్కలు. ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతూ అక్కడి చెట్లు శక్తి స్వరూపాలుగా పూజలందుకుంటాయి. నింగిలోని నక్షత్రాలకు నేల మీది వృక్షాలకు ఉన్న అనుబంధాన్ని చాటి చెబుతుంటాయి. అగస్త్య మహాముని నడయాడిన నేల, ఇరువురు జీయర్ల జన్మస్థలమైన తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం అర్తమూరులోని దేవతా వృక్షారామం ఇందుకు వేదికైంది. మొక్కలంటే ఎనలేని మక్కువతో గ్రామానికి చెందిన ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్టు చైర్మన్, ఆధ్యాత్మికవేత్త సత్తి బులిస్వామిరెడ్డి సప్తర్షి ఆరామం, నవగ్రహ ఆరామం, నక్షత్ర ఆరామం, అశోక వనాలతో ఈ వృక్షారామాన్ని నెలకొల్పారు. పచ్చందనమే ప్రధానం ఆధునిక ప్రపంచంలో అంతా కాంక్రీట్ మయమైపోతుండగా పచ్చదనం కనుమరుగైపోతోంది. ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్టు ద్వారా పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నారు బులిస్వామిరెడ్డి. ఏటా ట్రస్టు వార్షికోత్సవ వేడుకలు, ఇతర కార్యక్రమాల సందర్భంగా రెండు లక్షలకు పైగా మొక్కల పంపిణీ చేశారు. జీవకోటి మనుగడకు ప్రాణాధారమైన మొక్కల ప్రాధాన్యతను చాటి చెప్పడం, సనాతన ధర్మం గూర్చి నేటి తరం వారికి తెలియజెప్పే లక్ష్యంతో బులిస్వామిరెడ్డి సొంత స్థలంలో తన తల్లిదండ్రుల పేరిట శ్రీసత్యలక్ష్మణ దేవతావృక్షారామాన్ని నెలకొల్పారు. ప్రత్యేకంగా పనివారిని ఏర్పాటుచేసి కంటికి రెప్పలా మొక్కలను సంరక్షిస్తున్నారు. మహాబిల్వం, ఏకబిల్వం, రుద్రాక్ష, నాగకేసరి, మహాలక్ష్మి ఫలం, దేవకాంచన, యాపిల్ తదితర ఎన్నో చెట్లు ఈ వృక్షారామంలో చూపరులకు కనువిందు చేస్తుంటాయి. అశోకవనంలో చైనా నుంచి తీసుకువచ్చిన చైనా బాల్స్ చెట్టు పూలు సుగంధాలను వెదజల్లుతుంటాయి. వన ఆరామాలు సాధారణంగా అక్కడక్కడ నక్షత్ర వనరామాలను ఏర్పాటు చేసినా చాలావరకు ఒకే రోజు మొక్కలు నాటుతుంటారు. అయితే అర్తమూరులో ఏ రోజు వచ్చే నక్షత్రానికి సంబంధించిన మొక్కను అదే రోజు నాటుతూ 27 రోజులు పాటు పారాయణం, హనుమాన్ చాలీసా, నిత్యహోమం, మాలధారణతో బులిస్వామిరెడ్డి వృక్షారామాన్ని నెలకొల్పారు. కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమి, జమదగ్ని, వశిష్టుడు మొదలైన సప్తరుషులు, బుధ, శుక్ర, చంద్ర, గురువు, రవి, కుజ, కేతు, శని, రాహువు మొదలైన నవగ్రహాలకు ప్రతిరూపాలైన మొక్కలను వృక్షారామంలో నాటారు. వివిధ రకాల పూలు, పండ్ల మొక్కలతో అశోకవనం ఏర్పాటు చేశారు. దేశంలోని వివిధ దేవాలయాల వద్ద నుంచి తీసుకువచ్చిన మట్టితో వనవిహారి రాధా కృష్ణుల విగ్రహాన్ని వృక్షారామంలో ప్రతిష్టించారు. పూజలు నిర్వహించేందుకు యాగశాలను నిర్మించారు. వృక్షారామంలో చెట్ల నుంచి రాలిన ఆకులు, ఎండు కొమ్మలను బయట పడేయకుండా ప్రతీ సోమ, శనివారాల్లో నిర్వహించే యాగానికి వినియోగిస్తారు. ఏ నక్షత్రంలో జన్మించిన వ్యక్తి ఆ నక్షత్రానికి ప్రతీకైన మొక్కను నాటి సంరక్షిస్తే సకల దోషాలు పోతాయని సనాతనధర్మం చెబుతుంది. దేవతా వృక్షారామంలో స్థానికులు తమ జన్మనక్షత్రానికి సంబంధించిన మొక్కకు నీళ్లు పోసి, చుట్టూ ప్రదిక్షిణలు చేసి పూజలు చేస్తుంటారు. పెనుబోతుల విజయ్కుమార్, సాక్షి, మండపేట, తూర్పుగోదావరి మొక్కలతోనే మనుగడ ఆలయాన్ని నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్టిస్తే అది దేవాలయం. దైవానికి ప్రతీకగా మొక్కలు ప్రతిష్టిస్తే అది దేవతా వృక్షారామం. మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యం. కుటుంబ సభ్యులందరి జన్మనక్షత్ర సంబంధమైన వృక్షాలను సేకరించి, వాటిని ఒక చోట పెంచి, పూజించడం చాలామందికి సాధ్యంకాదు. గ్రహ, నక్షత్ర దోషాలను నివారించుకుని ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలన్న సంకల్పంతో దేవతా వృక్షారామంను ఏర్పాటుచేసి అందరికి అందుబాటులోకి తేవాలన్న నా కల ఇన్నాళ్లకు నెరవేరింది. సత్తి బులిస్వామిరెడ్డి, ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్టు చైర్మన్ -
బిహార్లో 5 కోట్ల మంది మానవహారం
పట్నా: పర్యావరణ పరిరక్షణ, సామాజిక రుగ్మతల నిర్మూలన కోసం ప్రభుత్వానికి మద్దతుగా బిహార్లో 5.17 కోట్ల మంది కలసి ఆదివారం భారీ మానవహారం ఏర్పాటు చేశారు. ఈ చైన్ దాదాపు 18,034 కిలోమీటర్ల పొడవుంది. 2017, 18లలో మద్యనిషేధం, వరకట్నం–బాల్యవివాహాల నిర్మూలన కోసం ఏర్పాటు చేసిన మానవహారం కంటే ఇదే అతిపెద్దది కావడం విశేషం. ఈ మానవహారం పొడవు 2018 కంటే 14 వేల కిలోమీటర్లు, 2017 కంటే 11 వేల కిలోమీటర్లు అధికం. 2017లో మొదటిసారి మొదలైన ఈ మానవ హారం అప్పట్లోనే గిన్నిస్ ప్రపంచ రికార్డుల్లో బంగ్లాదేశ్ రికార్డును అధిగమించిందని అధికారులు చెప్పారు. డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా మానవహారం ఫొటోలు తీశారు. ఈ కార్యక్రమంలో ఓ అపశ్రుతిచోటు చేసుకుంది. దర్భంగా జిల్లాలో ఓ వ్యక్తి, సమస్తిపూర్లో ఓ మహిళ గుండెపోటుతో మృతి చెందారు. -
కాల్చేస్తే ఖతం.. కుళ్లిపోతే విషం!
సాక్షి, అమరావతి: చెత్తాచెదారం కుళ్లిపోతే ఎరువుగా మారుతుంది. ఇది భూమికి లాభం చేకూరుస్తుంది. అదే మనుషులకొచ్చే జబ్బులను నయం చేసే మందులు కుళ్లిపోతే విషమవుతాయి. ఇవి భూమిని విషతుల్యంగా మారుస్తాయి. భూగర్భ జలాలు కలుషితమై కొత్త జబ్బులొస్తాయి..ప్రస్తుతం రాష్ట్రంలో ఇదే జరుగుతోంది. అత్యధిక ఉష్ణోగ్రతల మధ్య (100–200 డిగ్రీల సెల్సియస్ల మధ్య) కాలి్చవేయాల్సిన మందులు..మున్సిపాలిటీ డంపింగ్ యార్డుల్లో కుళ్లిపోతుండడంతో ప్రమాదం ముంచుకొస్తోంది. కొత్తరకం బాక్టీరియా పుట్టుకొస్తోంది. కాలం చెల్లిన మందులతోనే తీవ్ర సమస్యలు మందుల షాపుల యాజమాన్యాలు కాలం చెల్లిన మందులను చెత్త డబ్బాల్లో వేసి కొత్త సమస్యలకు తెరతీస్తున్నారు. వీటితో పాటు పలు ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సీవరేజీ ట్రీట్మెంటు ప్లాంట్లు లేకపోవడం వల్ల బయో ద్రవ వ్యర్థాలు (బయో లిక్విడ్ వేస్ట్) మురికి కాలువల్లో కలుస్తున్నాయి. దీనివల్ల కూడా భయంకరమైన జబ్బులు వస్తున్నాయి. దీనిపై సీపీసీబీ (కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి) ఇటీవలే తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితులు ఏ మాత్రం ఉపేక్షించతగ్గవి కావని, దీనిపై ఆయా రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్లు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అన్నిటికీ మించి కాలం చెల్లిన యాంటీబయోటిక్స్ మందులు కుళ్లిపోయి తీవ్ర ముప్పును తెస్తున్నట్టు సీపీసీబీ పేర్కొంది. మందులు కుళ్లిపోతే వచ్చే నష్టాలు... ►కాలం చెల్లిన యాంటీబయోటిక్స్ కుళ్లిపోవడం వల్ల కొత్తరకం బాక్టీరియా పుట్టుకొస్తోంది. ఈ బాక్టీరియా వల్ల జబ్బులు సోకితే అత్యంత సామర్థ్యం కలిగిన యాంటీబయోటిక్స్ వాడినా తగ్గే అవకాశం ఉండదు. ►చెత్త కుప్పల్లో మందులు కుళ్లిపోతే వాయు కాలుష్యం తీవ్రమవుతుంది. గాలి ద్వారా వ్యాప్తి చెందే జబ్బుల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ►భూగర్భ జలాలు విషతుల్యమవుతున్నాయి ►ఈ జలాలు తాగడం వల్ల మూత్రపిండాలు, కాలేయ సమస్యలు, హెపటైటిస్ బి వంటి జబ్బులు వస్తున్నాయి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏం చెబుతోంది పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం మందులను బయట పడేయకూడదు. వాటిని విధిగా బయోవ్యర్థాల నిర్వహణ సంస్థలకే అప్పజెప్పాలి. పర్యావరణానికి ఎలాంటి హాని లేకుండా వీటిని క్లోజ్డ్ డిగ్రేడబుల్ హౌస్ (నాలుగు గోడల మధ్య ఉన్న బయోవ్యర్థాల ప్లాంటు)లో కాలి్చవేయాలి. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకునే హక్కు, జరిమానాలు విధించే అధికారం ఆయా రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్లకు ఉంది. కేరళలో ‘ప్రౌడ్’ ప్రాజెక్టు వినియోగించని మందుల నిర్వీర్యంపై కేరళ అద్భుతమైన చర్యలు చేపట్టింది. దీనికోసం ప్రౌడ్ (ప్రోగ్రాం ఆన్ రిమూవల్ ఆఫ్ అన్యూజ్డ్ డ్రగ్స్)ను ప్రారంభించింది. కేరళ డ్రగ్ కంట్రోల్ అథారిటీ, కేరళ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో పనికిరాని, కాలం చెల్లిన మందుల నిరీ్వర్యం చేయడంలో ముందంజ వేశాయి. ఒక్క మాత్ర కూడా మున్సిపాలిటీ డబ్బాల్లోకి వెళ్లకుండా చేయగలుగుతున్నాయి. తిరువనంతపురంలో మొదలైన ఈ పైలెట్ ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని కేరళ యోచిస్తోంది. రాష్ట్రంలో ఫార్మసీ సంస్థల వివరాలు ఇలా ►మాన్యుఫాక్చరింగ్ లైసెన్సులు 258 ►రిటైల్ అండ్ హోల్సేల్ ►మెడికల్ స్టోర్లు 33,039 ►బయోవ్యర్థాల నిర్వహణ ప్లాంట్లు 12 ►2018–19లో నిబంధనల ఉల్లంఘనలు 6,385 ►సీజ్చేసిన షాపుల సంఖ్య 66 అగ్రిమెంటు లేకుంటే లైసెన్సులు రద్దు చేస్తాం మందుల షాపులు గానీ, సీ అండ్ ఎఫ్ (క్యారీ ఫార్వర్డ్ ఏజెన్సీలు)లు గానీ కాలం చెల్లిన మందులను చెత్త బుట్టల్లో వేయడానికి వీల్లేదు. కచి్చతంగా బయోవ్యర్థాల ప్లాంట్లకు పంపించాల్సిందే. సీ అండ్ ఎఫ్ ఏజెన్సీలు బయోవ్యర్థాల నిర్వాహకులతో అవగాహన ఒప్పందం చేసుకోకపోతే లైసెన్సులు రద్దు చేస్తామని చెప్పాం. మందులు మున్సిపాలిటీ చెత్త డబ్బాల్లో వేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణలో నిఘా పెంచాం. – ఎంబీఆర్ ప్రసాద్, సంచాలకులు, ఔషధనియంత్రణ మండలి ఈ చట్టం ఆస్పత్రులకు మాత్రమే వర్తిస్తోంది ఎన్వీరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది కేవలం ఆస్పత్రుల బయోవ్యర్థాల నిర్వీర్యం కోసం మాత్రమే ఉపయోగపడుతోంది. ఇప్పటివరకూ మెడికల్షాపులు లేదా మాన్యుఫాక్చరింగ్ సంస్థలు మందులను నిబంధనలకు విరుద్ధంగా పారబోస్తే వాటిపై చర్యలు తీసుకుని, జరిమానాలు విధించిన దాఖలాలు కనిపించలేదు. – ఎ.విజయభాస్కర్రెడ్డి, ఫార్మసీ కౌన్సిల్ మాజీ అధ్యక్షులు -
ప్రపంచాన్ని కదిలిస్తున్న బాల పర్యావరణవేత్తలు
మాడ్రిడ్: వారిద్దరూ స్కూలుకెళ్లి చక్కగా చదువుకుంటూ, ఆడుకుంటూ కాలం గడపాల్సిన వాళ్లు. కానీ పర్యావరణ పరిరక్షణపై వారికున్న ఆసక్తి ప్రపంచ దేశాల నేతల ముందు వక్తలుగా మార్చింది. మణిపూర్కు చెందిన ఎనిమిదేళ్ల లిసిప్రియా కంగుజమ్ వాతావరణంలో వస్తున్న మార్పులపై చర్యలు తీసుకోండి అంటూ ప్రపంచ అధినేతలను కోరుతోంది. స్పెయిన్ వేదికగా ఈనెల 13 వరకు జరుగుతున్న సీఓపీ25 వాతావరణ సదస్సులో భాగంగా ఆమె ప్రసంగించారు. ఆడుకోవాల్సిన వయసులో తమ భవిష్యత్తు కోసం పోరాటం చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. ఆమె తండ్రి కేకే.సింగ్ మాట్లాడుతూ..తమ కూతురు ఇప్పటికే 21 దేశాల్లో వాతావరణ మార్పుల గురించి ప్రసంగాలు చేసిందన్నారు. ఐక్యరాజ్య సమితి సమావేశంలో ‘హౌ డేర్ యూ ?’ అంటూ ప్రపంచ నేతలనుద్దేశించి ప్రశ్నించిన స్వీడన్ టీనేజర్ గ్రెటా థన్బర్గ్ (16) టైమ్స్ మేగజీన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2019గా నిలిచింది. మానవాళికి ఉన్న ఒకే గృహాన్ని నాశనం చేయవద్దంటూ ఆమె చేసిన పోరాటం మన్ననలు అందుకుందని టైమ్స్ మేగజీన్ బుధవారం తెలిపింది. వ్యక్తిగతంగా ఈ రికార్డును అందుకున్న అతి పిన్న వయస్కురాలు గ్రెటానే అంటూ టైమ్స్ ఆమెను కొనియాడింది. లిసిప్రియా, గ్రెటాలు ఇద్దరూ పర్యావరణం గురించి నిరసనల్లో పాల్గొనేందుకు స్కూలుకు సైతం సరిగా వెళ్లేవారు కాదు. టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా గ్రెటా థన్బర్గ్ -
పుట్టిన చోటుకే ప్లాస్టిక్ చెత్త
మట్టిలో కలిసిపోయేందుకు వందల ఏళ్లు పడుతుందని ప్లాస్టిక్ వినియోగాన్ని ఆపేస్తే... ఈ క్షణమే బతుకు బండి ఆగిపోయేంతగా మనుషులు ప్లాస్టిక్కి అలవాటు పడిపోయారు. అయితే ప్లాస్టిక్ ఏ ఇంధనంలోంచి తయారవుతోందో ఆ ఇంధనంలోకే తిరిగి తీసుకెళ్లడం ద్వారా పర్యావరణానికి పొంచి ఉన్న ముప్పు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు చెన్నైలో ఉంటున్న విద్య. విద్య కామర్స్ గ్రాడ్యుయేట్. వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీ నిర్వహిస్తూ ఉన్నట్లుండి తన ప్రయాణాన్ని వేస్ట్ మేనేజ్మెంట్ వైపు మలుపు తిప్పుకున్నారు. ‘ఎ జర్నీ ఫ్రమ్ వెల్త్ టూ వేస్ట్’ అని నవ్వుతారామె. ఞ్ఞ్ఞఅంతేకాదు, ‘‘చెన్నైలో తాగడానికి పనికి వచ్చే నీటి చుక్క కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. వ్యర్థాలను విడుదల చేసే ఫ్యాక్టరీలు ఆ వ్యర్థాల మేనేజ్మెంట్ మీద దృష్టి పెట్టడం లేదు. నిజానికి వాళ్లు ఆ పని చేస్తే సమాంతరంగా రెండు రకాల ఆర్థిక ప్రయోజనాలను పొందగలుగుతాం. ఇందుకోసం పర్యావరణ పరిరక్షణ మీద కనీస స్పృహ కల్పించాల్సిన అవసరం ఉంది’’ అంటారు విద్య. తప్పదు నిజమే ఏడాదికి దేశంలో దాదాపు అరవై లక్షల టన్నుల ప్లాస్టిక్ వేస్ట్ వస్తోంది. అందులో 20 శాతం మాత్రమే రీసైకిల్ అవుతోంది. మిగిలిన ప్లాస్టిక్ భూమిని, తాగునీటిని, సముద్రాలను కలుషితం చేస్తోంది. ప్లాస్టిక్ వాడకాన్ని నివారించమని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ హెచ్చరిస్తూనే ఉంది. అయితే క్యారీ బ్యాగ్ల బదులు క్లాత్ బ్యాగ్ వాడకం తప్ప మరేదీ మన చేతిలో ఉండదు. ఉదయం పాలప్యాకెట్ నుంచి రాత్రి వేసుకునే మందుల డబ్బా వరకు ప్లాస్టికే. ఏ వస్తువు అయినా భద్రంగా రవాణా చేయాలంటే ప్యాకింగ్కి ప్లాస్టిక్ మీదనే ఆధారపడాల్సి వస్తోంది. వాడటం తప్పనిసరి అయినప్పుడు ప్లాస్టిక్ను డీ కంపోజ్ చేయడానికి సరైన పద్ధతి ఉంటే సమస్య నివారణ అయినట్లే. సరిగ్గా ఆ సామాజిక బాధ్యతనే తలకెత్తుకున్నారు విద్య, ఆమె భర్త అమర్నాథ్. వీళ్లేం చేస్తున్నారంటే..! విద్య దంపతులు ప్లాస్టిక్ వేస్ట్తో పర్యావరణ హితమైన ఇంధనాన్ని తయారు చేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే... ప్లాస్టిక్ని తిరిగి మూలరూపానికి తెస్తారు. ప్లాస్టిక్ వస్తువుల తయారీకి మూలవస్తువు క్రూడ్ ఆయిల్. వీళ్లు వేస్ట్ ప్లాస్టిక్ని ఐదువందల సెల్సియస్ వేడిలో కరిగించి పూర్వ రూపమైన క్రూడ్ అయిల్ను తీసుకువస్తారు. పైరోలిసిస్ అనే రియాక్టర్.. ప్లాస్టిక్ వేస్ట్ని పైరోసిలిస్ ఆయిల్, హైడ్రో కార్బన్ గ్యాస్, నల్లటి కార్బన్ పౌడర్లుగా మారుస్తుంది. గ్యాస్ని తిరిగి ప్లాస్టిక్ను వేడి చేయడానికి ఉపయోగిస్తారు. పౌడర్ని పెయింట్ కంపెనీలు, సిమెంట్ పరిశ్రమలు తీసుకుంటాయి. ఈ ఇంధనం మార్కెట్లో దొరికే మామూలు ఇంధనం కంటే 25 శాతం తక్కువ ధరకే లభిస్తోంది. వేస్ట్ మేనేజ్మెంట్ ఒక టన్ను ప్లాస్టిక్ వేస్ట్ నుంచి 500 లీటర్ల ఆయిల్ వస్తుంది. గ్యాస్, పౌడర్ వంటి బై ప్రోడక్ట్స్ కాకుండా ఆయిల్ లెక్క ఇది. ఇలాంటి పరిశ్రమలను దేశమంతటా స్థాపించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు విద్య. ‘‘ప్లాస్టిక్ని తప్పు పట్టడం మానేయాలి. మనిషి సృష్టించిన అద్భుతాల్లో ప్లాస్టిక్ ఒకటి. ఇరవయ్యో శతాబ్దం పారిశ్రామికాభివృద్ధి వేగవంతం కావడంలో ప్లాస్టిక్ పాత్ర ముఖ్యమైనది. అయితే ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న అసమతుల్యతకు కారణం... రీసైకిల్ చేసి మరీ వాడుకోగలిగిన ఈ మెటీరియల్ని నిర్లక్ష్యం చేయడమే. విలువైన ప్లాస్టిక్ వస్తువులను మాత్రమే రీసైకిల్ చేస్తున్నారు. మిగిలిన వాటిని వదిలేస్తున్నారు. అందుకే ఆ విలువలేని ప్లాస్టిక్ వేస్ట్ని ఇలా రీసైకిల్ చేస్తున్నాం’’ అని వివరించారు విద్య. – మను -
నమో ఆరోగ్య దీపావళి
ధర్మశాస్త్రాలలో చెప్పిన దీపావళికి ఇప్పటి దీపావళికి సంబంధం లేదు. ఈనాటి పండుగ ధన వ్యయానికి, ప్రాణప్రమాదాలు, గాయాలకు కారణమౌతోంది. అసలైన దీపావళిని శారీరక మానసిక ఆరోగ్యాల కోసం మన ఋషులు ఏర్పరిచారు. చలికాలంలో పర్యావరణ పరిరక్షణ, వ్యాధి నిర్మూలన ఈ పండుగ నిర్దేశిత లక్ష్యాలు. చలితో మంచుతో వాతావరణంలో, ఉష్ణోగ్రతలో మార్పులను తట్టుకొనే విధంగా నువ్వుల నూనెతో అసంఖ్యాకంగా దీపాలను వెలిగించటమే దీపావళి. ఎన్నో ప్రత్యేకతలు, విశిష్టతల సమ్మేళనంగా ఏర్పడిన దీపావళి పండుగ భారతీయ పర్వదినాలలో ప్రధానమైనది. పౌరాణికంగా ఈ పండుగ ద్వాపర యుగంలో సత్యభామాశ్రీకృష్ణులు నరకాసురుని సంహరించిన సందర్భంగా ఏర్పడింది. పదహారు వేలమంది స్త్రీలను చెరపట్టిన పరమ దుర్మార్గుణ్ని చంపినప్పుడు ప్రజలలో కలిగిన ఆనందానికి ఈ పండుగ సంకేతం అయినప్పటికీ ఇందులోని పరమార్థం వేరే ఉంది. చలికాలంలో వచ్చే చర్మవ్యాధులకు, నడుము నొప్పి, కీళ్ల నొప్పులు, రక్తపోటు మొదలైన అనేక వ్యాధుల నివారణకు నువ్వులు, నువ్వులనూనె వాడకం సులభోపాయం. దీపావళి పండుగలోని పరమార్థం కూడా ఇదే! వేదాలు, ఉపనిషత్తులలో, పితృకార్యాలలో ప్రస్తావించబడిన తిలలు (నువ్వులు) ద్వాపర యుగం అనగా అయిదు వేల సంవత్సరాలకు పూర్వం నుండి భారతదేశంలో పండుతున్నాయి. శ్రీకృష్ణావతార కాలానికి – నువ్వుల పంట భౌగోళిక చరిత్రకు... లెక్క సరిపోతుంది. ఆశ్వయ్యుజ కృష్ణపక్షస్య చతుర్దశ్యాం విధూదయే తిలతైలేన కర్తవ్యం స్నానంనరక భీరుణా (నిర్ణయ సింధు) నరక చతుర్దశినాడు తప్పకుండా అందరూ నల్ల నువ్వులతో కలిపి కొట్టిన సున్నిపిండిని నువ్వుల నూనెను తలకు, ఒళ్లంతా పూసుకుని కుంకుడుకాయ రసంతో తలంటి పోసుకోవాలి. అమావాస్యనాడు సాయంకాలం లక్ష్మీదేవి పూజ చేసి నువ్వులనూనెతో అసంఖ్యాకంగా దీపాలు వెలిగించాలి. అప్పుడు ఉష్ణోగ్రత పెరిగి చలి తగ్గుతుంది. పొలాల్లో, ఇళ్లల్లో బాధించే క్రిమికీటకాలు దీపాల వెలుగుకు ఆకర్షింపబడి దీపాల చుట్టూ తిరుగుతూ చచ్చిపోతాయి. నువ్వులనూనెతో వెలిగే దీపాలకున్న శక్తిని తెలపటానికే దీపావళి పండుగ ఏర్పడింది. దీపైః నీరాజనాదత్రసైషా దీపావళీ స్మృతా’ (మత్స్యపురాణం) పిల్లలు, పెద్దలు స్వయంగా తయారుచేసుకునేవన్నీ వెలుగునిచ్చేవే. పేలుడు పదార్థాలకు దీపావళి పండుగకు సంబంధం లేదు. ఆవు పేడ, తాటి పూలు, బొగ్గులతో చుట్టిన పూల పొట్లాలను వీధిలో నిలబడి గిరగిరా తిప్పితే శారీరక వ్యాయామంగా పౌరుష సూచకంగా పర్యావరణ పరిరక్షణకు పనికివస్తాయి. శబ్దాలు, మిరుమిట్లు గొలిపే కాంతులతో చెవులు, కళ్లు పాడుచేసుకోమని దీపావళి చెప్పలేదు. గోగు పుల్లలకు గుడ్డ చుట్టి నువ్వులు, బెల్లం కలిపి చేసిన ఉండలు ప్రసాదంగా అందరికీ పంచిపెట్టాలి. దీపావళి నాడు ఉదయం నువ్వులతో పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి. నువ్వులనూనెతో చేసిన గారెలు, వడలు వంటి పిండివంటలు, చిమ్మిరి ఉండలు నైవేద్యం పెట్టాలి. నువ్వు తెలగపిండి కూరల్లో కలిపి వండాలి. ఇలా శారీరక ఆరోగ్యానికి అన్నివిధాల లాభదాయకమై... పర్యావరణాన్ని, పంటలను రక్షించటానికి, చలిని పోగొట్టటానికి ఏర్పడింది దీపావళి పండుగ. నరకాసురుని కథ ద్వారా యువతరంలో సత్ప్రవర్తనను, తల్లిదండ్రులకు చక్కని పిల్లల పెంపకాన్ని తెలియచేసే కర్తవ్యబోధిని. శాస్త్రీయంగా, నిరాడంబరంగా నిర్భయంగా నిజమైన దీపావళి పండుగను జరుపుకుందాం. దేవ, పితృ, ఋషి ఋణాలు తీర్చుకుందాం. – డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ -
కొత్త మలాలా
వాతావరణంలోని పెనుమార్పులకు, ఆ మార్పులు వల్ల సంభవించబోయే విపత్తులకు రాజకీయ నాయకుల నిర్లక్ష్యమే కారణమని పదహారేళ్ల స్వీడన్ పర్యావరణ పరిరక్షణ కార్యకర్త గ్రెటా థన్బర్గ్ చేసిన ప్రకటన ఐక్యరాజ్యసమితి దృష్టి వరకు వెళ్లింది. గ్రెటా తాజాగా ‘వేకప్’ (మేల్కొండి) అంటూ యు.ఎస్.పార్లమెంటు సభ్యులను ఉద్దేశించి ఈ ప్రకటన చేశారు. గత ఏడాది తరగతి గది నుండి బయటికి వచ్చి తక్కిన పిల్లలతో పాటు స్వీడన్ పార్లమెంటు భవనం ఎదుట ‘వాతావరణాన్ని కాపాడండి’ అని నినాదాలు చేయడంతో గ్రేటా గురించి తొలిసారి ప్రపంచానికి తెలిసింది. -
భారత పర్యావరణ కృషి భేష్
ఐక్యరాజ్య సమితి: పర్యావరణ పరిరక్షణ కోసం భారత్ చేస్తున్న కృషి అద్భుతమని, సంప్రదాయేతర ఇంధన రంగాన్ని ముందుకు పరుగులు పెట్టించడంలో ఆ దేశం అమోఘంగా పనిచేస్తోందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ కొనియాడారు. ప్రధాని మోదీని తను పలుమార్లు కలుసుకున్నానని సౌర విద్యుత్ని వినియోగించుకోవడానికి అంతర్జాతీయ దేశాలను కూడగట్టడంలో ఆయనలోని నాయకత్వ లక్షణాలు ప్రపంచానికి తెలిసాయని ప్రశంసించారు. ఐరాస ప్రధాన కార్యాలయంలో ఏర్పాటైన గాంధీజీ సోలార్ పార్క్ని మోదీ 24న ప్రారంభించనున్నారు. ఐక్యరాజ్య సమితి పర్యావరణ సదస్సుని పురస్కరించుకొని గుటెరెస్ మీడియా ప్రతినిధులకు ప్రత్యేకంగా విందు సమావేశం ఏర్పాటు చేశారు. సౌర విద్యుత్ రంగంలో భారత్ భారీగా పెట్టుబడులు పెడుతోందని, అయితే ఇంకా థర్మల్ పవర్ వినియోగాన్ని బాగా తగ్గించాల్సిన అవసరం ఉందని అన్నారు. -
‘వాతావరణ అత్యవసర పరిస్థితిని ప్రకటించాలి’
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచానికి పెను సవాలుగా మారిన వాతావరణ మార్పు పరిస్థితుల నుంచి భావితరాలనే కాకుండా ప్రస్తుత తరాన్ని రక్షించేందుకు దేశంలో వాతావరణ అత్యవసర పరిస్థితి ప్రకటించాలని కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవెల్యూషన్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ సదస్సులో తీర్మానించారు. వాతావరణ మార్పులకు దారితీస్తున్న గ్లోబల్ వార్మింగ్ వల్ల మానవాళికి ఏర్పడుతున్న ముప్పును గ్రహించి ప్రచంలోని 18 దేశాలు ఇప్పటికే వాతావరణ అత్యవసర పరిస్థితిని ప్రకటించిన దృష్ట్యా, భారతదేశంలో పర్యావరణ పరిరక్షణకు వరల్డ్ కమిషన్ ఆన్ ఎన్వైర్మెంట్ అండ్ డెవలెప్మెంట్ సంస్థ మార్గదర్శకాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విధానాలతో ముందుకు రావాలని తీర్మానించారు. ఈ సమావేశంలో పలువురు పర్యావరణ వేత్తలు పాల్గొని ప్రసంగించారు. ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు రాజ్యాంగం కల్పించిందని, దానిలో భాగంగానే పౌరులందరికీ మంచి వాతావరణం ఉండాలని విస్తృత స్థాయిలో నిర్వచనం చెప్పినట్లు జస్టిస్ స్వతంత్ర కుమార్ అభిప్రాయపడ్డారు. చట్టాలు కఠినంగా అమలు చేస్తేనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని అన్నారు. ఒక్క ప్లాస్టిక్ బాటిల్ వల్ల 20 మందికి కాన్సర్.. సమావేశంలో స్వతంత్ర కుమార్ మాట్లాడుతూ.. ‘ప్రపంచంలో 785 మిలియన్ల ప్రజలకు సురక్షిత మంచినీరు దొరకడం లేదు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు, వాతావరణాన్ని నాశనం చేస్తుండడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణం అందించడం మన బాధ్యత. ఢిల్లీలో విద్యార్థులకు బ్లాక్ మాస్కులు ధరించి పాఠశాలకు వెళ్తున్నారు. భవిష్యత్తు తరాలకు పాడైపోయిన వాతావరణ పరిస్థితులు ఇవ్వడం ఎంతవరకు సబబు. కోర్టుల జోక్యం కారణంగా పర్యావరణం కొంత కాపాడు కలుగుతుంది. అడవులు, పర్యావరణ పరిరక్షణకు పటిష్ట విధానాలు రావాలి. చెరువుల నగరంగా ఉన్న బెంగుళూర్లో చెరువులన్నీ మాయం అయ్యాయి. ఢిల్లీలో 1650 మెట్రిక్ టన్నుల చెత్త జమ అవుతుంది. ఒక ప్లాస్టిక్ బాటిల్ కాల్చడం వల్ల 20 మందికి కాన్సర్ రోగాలు వచ్చే ప్రమాదం. పర్యావరణాన్ని పాఠ్యాంశంగా చేర్చాలి. పర్యావరణ చట్టాలు అనేకం వున్నాయి, కానీ అమలు జరగడం లేదు. కాలుష్యానికి సరిహద్దులు లేవు, అందరూ పర్యావరణ పరిరక్షణ చేయాలి. సమిష్టిగా ప్రజలు, ప్రభుత్వం కలిసి పనిచేస్తేనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది’ అని అన్నారు. భయానక పరిస్థితులు తప్పవు.. నల్లమల్ల అడవుల్లో యురేనియం తవ్వకాలు ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారరి ఆర్టీఐ మాజీ కమిషనర్ దిలీప్రెడ్డి అన్నారు. ప్రజల ఒత్తిడితో ప్రభుత్వం దిగివచ్చి యూనియన్ తవ్వకాలకు అనుమతి ఇవ్వడం లేదని చెప్పినట్లు ఆయన గుర్తుచేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘అనంతగిరిలో బాక్సైట్ తవ్వకాలను నిషేధించారు. ప్రజలు నిరంతరం అప్రమత్తంగా పర్యావరణాన్ని కాపాడుకోవాలి. లేదంటే చెన్నై నీటి కరువు, ముంబై వరదలు, ఢిల్లీ వాయు కాలుష్యము తరహాలో భయానక పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నీటి కరువు కారణంగా చెన్నైలో ఆఫీసులు రైల్వేలు సైతం తమ సర్వీసులో నిలిపివేయాల్సి వచ్చింది.’ అని పేర్కొన్నారు. గంటకు ఒకరు చనిపోయే పరిస్థితి.. రెన్యువబుల్ ఎనర్జీపై ప్రపంచమంతా దృష్టిసారించాలని ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ బూరెలాల్ అభిప్రాయపడ్డారు. ‘సోలార్ ఎనర్జీ ద్వారానే విద్యుత్ ఉత్పత్తి జరగాలి. అప్పుడే పర్యావరణానికి ఎటువంటి హాని జరగదు. న్యూక్లియర్ ఎనర్జీ వల్ల మన అవసరాలు తీరవు పర్యావరణానికి హాని జరుగుతుంది. దీనివల్ల వాయు, భూమి, నీటి కాలుష్యం ఏర్పడుతుంది. భూమి కేవలం ఎనిమిది బిలియన్ల ప్రజలను మాత్రమే మోయగలుగుతుంది. 21వ శతాబ్దం కల్లా ప్రపంచ జనాభా 9 మిలియన్ దాటుతుంది అదే జరిగితే పర్యావరణం తనంతట తానుగా విధ్వంసం సృష్టించే పోతోంది. వైద్యంపై పెట్టే ఖర్చు కొన్ని వందల రెట్లు పెరుగుతుంది. వాయు కాలుష్యం వల్ల ఢిల్లీలో గంటకు ఒకరు చనిపోయే పరిస్థితి ఏర్పడింది’ అని అన్నారు. -
వనం ఉంటేనే మనం
సాక్షి, అమరావతి బ్యూరో: మనం నాటే ప్రతి మొక్క భూమాతకు ఎనలేని మేలు చేస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. ఈ సృష్టిలో సమతూకం ఉండాలంటే అందరూ కచ్చితంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అడవులను పెంచితేనే భూమిపై మనుషుల మనుగడ కొనసాగుతుందని ఉద్ఘాటించారు. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రు వద్ద శనివారం 70వ వన మహోత్సవాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా వేప మొక్క నాటారు. అటవీ శాఖ ఏర్పాటు చేసిన జీవ వైవిధ్యం, వన్యప్రాణి సంరక్షణ ప్రదర్శనశాలను తిలకించారు. అనంతరం అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు. రాష్ట్ర భూభాగం 37,258 చదరపు కిలోమీటర్లు ఉంటే, ఇందులో 23 శాతం భూభాగంలో మాత్రమే అడవులు ఉన్నాయని తెలిపారు. జాతీయ అటవీ విధానం ప్రకారం 33 శాతం భూభాగంలో అడవులు పెంచాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఇంకా ఏం చెప్పారంటే.. ‘‘కేవలం రెండు మూడు నెలలు మాత్రమే ఉండే పంటలు వేస్తుండడం, మిగతా తొమ్మిది నెలలు భూమిపైకి నేరుగా సూర్యకిరణాలు పడుతుండడం వల్ల రాయలసీమ జిల్లాలు మరింత వేగంగా ఎడారిగా మారుతున్నాయని సీనియర్ పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్ ఒక సందర్భంలో చెప్పారు. సంవత్సరమంతా భూమిపై పచ్చదనం ఉంటే ఇలాంటి పరిస్థితి రాదు. పర్యావరణం బాగుంటేనే మనమంతా బాగుంటాం. అందుకే పర్యావరణాన్ని తప్పనిసరిగా పరిరక్షించుకోవాలి. మన రాష్ట్రంలో 2,351 రకాల వృక్ష జాతులు, 1461 రకాల జంతు జాతులు ఉన్నాయి. కొన్ని జంతు జాతుల, వృక్ష జాతులు అంతరించిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో ఇప్పుడున్న పులుల సంఖ్య 48 మాత్రమే. వీటి గురించి మనం పట్టించుకోవడం మానేస్తే రాష్ట్రంలో ఇక పులులు అనేవే ఉండవు. సింహాలది కూడా అదే పరిస్థితి. వనమహోత్సవం కార్యక్రమానికి హాజరైన ప్రజానీకంలో ఓ భాగం 25 కోట్ల మొక్కలు నాటుతాం మన రాష్ట్రాన్ని కాపాడుకునే దిశగా అడుగులు వేస్తున్నాం. వన మహోత్సవం సందర్భంగా ఈ సీజన్లో రాష్ట్రంలో 25 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఈ వ్యవసాయ సీజన్లో ఇప్పటిదాకా 4 కోట్ల మొక్కలు నాటాం. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలు నాటబోతున్నాం. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటడం కాదు, కనీసం మూడు, నాలుగు మొక్కలు నాటాలి. అప్పుడే మన రాష్ట్రాన్ని కాపాడుకోగలుగుతాం. గ్రామ వలంటీర్ల ద్వారా ప్రజలకు మొక్కలు పంపిణీ చేస్తున్నాం. మొక్కల పెంపకం కార్యక్రమంలో భాగంగా పండ్ల చెట్లు, నీడనిచ్చే చెట్లు, ఎర్ర చందనం, టేకు.. ఇలాంటివి అక్షరాలా 12 కోట్ల మొక్కలు నాటడానికి అటవీ శాఖ సిద్ధంగా ఉంది. మరో 13 కోట్ల మొక్కలను మన పట్టు పరిశ్రమ శాఖ, ఉద్యానవన శాఖ, పేపర్ మిల్లులు నాటనున్నాయి. పారిశ్రామిక సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో తప్పనిసరిగా మొక్కలు నాటాలని కోరుతున్నా. పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం.. పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. ఇటీవల సమీక్ష చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు తెలిశాయి. రాష్ట్రంలో పరిశ్రమలు తెచ్చుకోవడానికి అడుగులు ముందుకు వేస్తున్నాం. ఏదైనా ఒక పరిశ్రమ వచ్చేటప్పుడు దానివల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందా లేదా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాలుష్య నియంత్రణ మండలి వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయబోతున్నాం. ఏదైనా పరిశ్రమ రావడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తే తొలుత ఆ ఫైల్ను పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు పంపించాలి. సదరు పరిశ్రమ వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని లేదు అని బోర్డు ధ్రువీకరించిన తర్వాతే ఆ ఫైల్ ముందుకు కదిలేలా ప్రక్షాళన చేయబోతున్నాం. ఫార్మా రంగం ద్వారా భారీగా కాలుష్యం వెలువడుతోంది. ఇందులో చాలా వరకు వాతావరణంలో, సముద్రంలో కలిసిపోతోంది. ఇలాంటి పరిస్థితి మారాలి. పరిశ్రమలకు సంబంధించిన కాలుష్యాన్ని పూర్తిగా నివారించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుంది. ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సులు ప్రజా రవాణా వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాం. ఈ సంవత్సరం ఏపీఎస్ఆర్టీసీలో 1,000 ఎలక్ట్రికల్ బస్సులను తీసుకొస్తున్నాం. ఆర్టీసీలో ఉన్న 10 వేల బస్సులను దశలవారీగా తొలగిస్తూ, ఎలక్ట్రిసిటీతో నడిచే బస్సులను తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. నింగి, నేల, నీరు, గాలి.. ఇవి కలుషితం అవుతుంటే కళ్లు మూసుకుని కూర్చోకూడదు. వాటిని కాపాడుకునే ప్రయత్నం అందరూ చేయాలి’’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. అనంతరం నవ్యాంధ్రప్రదేశ్ను పచ్చని హారంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామంటూ ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆరుగురు అటవీ శాఖ సిబ్బందికి ముఖ్యమంత్రి ఆయుధాలు అందజేశారు. విధి నిర్వహణలో అత్యుత్తమ సేవలందించిన 80 మంది అటవీ అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు ఇచ్చి, సత్కరించారు. వన మహోత్సవంలో మంత్రులు మేకతోటి సుచరిత, పేర్ని వెంకట్రామయ్య, మోపిదేవి వెంకటరమణ, శాసన మండలిలో చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, నందిగం సురేష్, ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, సామినేని ఉదయభాను, ఆళ్ల రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నంబూరు శంకర్రావు, కిలారి వెంకట రోశయ్య, విడదల రజని, బొల్లా బ్రహ్మనాయుడు, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ప్రభుత్వ ఉన్నతాధికారులు, సిబ్బంది, వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. -
పర్యావరణ పరిశోధనలను ప్రోత్సహించాలి
న్యూఢిల్లీ: పర్యావరణానికి సంబంధించిన అంశాలపై పరిశోధన, వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించడం చాలా కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పర్యా వరణ పరిరక్షణకు తక్షణం చర్యలు ప్రారంభించాలనీ, ఈ అంశంపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కొన్ని దినపత్రికల్లో బుధవారం ప్రచురితమైన ఓ వ్యాసంలో మోదీ ఈ అంశాలను ప్రస్తావించారు. వాతావరణా నికి సంబంధించిన ప్రశ్నలపై ప్రజలు వీలైనంత ఎక్కువగా మాట్లాడాల్సిన, రాయాల్సిన, చర్చించాల్సిన, వాదించాల్సిన, దీర్ఘంగా ఆలో చించాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణాంశాల్లో నూతన ఆవిష్కరణలు, పరిశోధనల ద్వారా ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న క్లిష్ట సమస్యలు, వాటికి పరిష్కారాలు జనానికి తెలుస్తాయని మోదీ వివరించారు. -
నేనూ బాధితుడినే...!
సాక్షి, హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 కింద శబ్ద కాలుష్యాన్ని నివారించేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2010లో రూపొందించిన నిబంధనలు అమలవుతున్న దాని కంటే ఉల్లంఘించడమే ఎక్కువగా ఉంది. వీటిని అమలు చేయాల్సిన అధికార యంత్రాంగానికి ఎంత మాత్రం బాధ్యత కనిపించడం లేదు. ప్రజలు మౌనంగా ఈ దారుణమైన శబ్ద కాలుష్యాన్ని భరిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఏరియాలో దీనికి నేనూ ఓ బాధితుడినే. ఉదయం 4 గంటల నుంచే మైకుల నుంచి భక్తి పాటలు, అయ్యప్ప భజనలు, మసీదుల నుంచి ఉదయ ప్రార్థనలు మొదలవుతాయి. మా ఏరియాలో పెద్ద సంఖ్యలో మసీదులున్నాయి. ఈ శబ్ద కాలుష్యం హైకోర్టు మాత్రమే తగిన చర్యలు తీసుకోగలదు.అధికారులను, ఉల్లంఘనులను బాధ్యులను చేసి, ప్రశాంతత నెలకొనేలా చూడగలరు. – న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ శబ్ద కాలుష్య బాధను భరించలేని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ సరైన సందర్భం దొరకడంతో తన గోడును హైకోర్టుకే వెళ్లబోసుకున్నారు. ఇదే అంశంపై గుంటూరు, ఎల్ఐసీ కాలనీకి చెందిన వి.వి.సుబ్బారావు అనే వ్యక్తి రాసిన లేఖను పిల్గా పరిగణించాలని ఆయన సిఫారసు చేశారు. జస్టిస్ కోదండరామ్ అభిప్రాయంతో న్యాయమూర్తులు జస్టిస్ సురేశ్ కుమార్ కెయిత్, పి.వి.సంజయ్కుమార్, జస్టిస్ ఎస్.వి.భట్లు సైతం ఏకీభవించారు. ఇలా ఏదైనా అంశంపై హైకోర్టుకు లేఖలు రాస్తే, ఆ లేఖలను పిల్గా పరిగణించాలా?వద్దా? అన్న అంశాన్ని ఐదుగురు న్యాయమూర్తుల పిల్ కమిటీ తేలుస్తుంది.దీంట్లో జస్టిస్ కెయిత్, జస్టిస్ సంజయ్కుమార్, జస్టిస్ కోదండరామ్, జస్టిస్ భట్, జస్టిస్ సీతారామమూర్తిలున్నారు. శబ్ద కాలుష్య నియంత్రణకు సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానిని పాటించడం లేదంటూ వి.వి.సుబ్బారావు ఈ ఏడాది ఆగస్టులో హైకోర్టుకు లేఖ రాశారు. దేవాలయాలు, చర్చిలు, మసీదుల నుంచి లౌడ్ స్పీకర్ల ద్వారా ఒక రోజులో దాదాపు 18 గంటల పాటు భక్తిగీతాలు, ప్రార్థనలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు వస్తున్నాయని, ఈ శబ్ద కాలుష్యాన్ని భరించలేకపోతున్నామని ఆ లేఖలో వివరించారు. ఈ కాలుష్యం దెబ్బకు ఇళ్లల్లో ఫోన్లు మాట్లాడలేకపోతున్నామన్నారు. ఇళ్లలో ప్రశాంతంగా ప్రార్థనలు చేసుకోలేకపోతున్నామని వివరించారు. పిల్లలు చదవలేక, పరీక్షలకు సిద్ధం కాలేకపోతున్నారని తెలిపారు. వృద్ధులు, రోగులు నిద్ర కూడా పోలేకపోతున్నారన్నారు. ఈ లేఖను అందుకున్న హైకోర్టు రిజిస్ట్రీ దీనిని పిల్ కమిటీకి నివేదించింది. ఆవేదనకు అక్షరరూపమిచ్చిన కోదండరామ్... ఈ లేఖను పరిశీలించిన కమిటీలో ఐదుగురు న్యాయమూర్తులు కూడా తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇందులో జస్టిస్ సీతారామమూర్తి ఈ లేఖను పిల్గా పరిగణించాల్సిన అవసరం లేదన్నారు. శబ్ద కాలుష్యానికి తానూ ఓ బాధితుడినేనంటూ జస్టిస్ కోదండరామ్ తన ఆవేదనకు అక్షరరూపం ఇచ్చారు. తన వేదనను ఆయన అందులో ప్రస్తావించారు. సుబ్బారావు రాసిన లేఖను పిల్గా పరిగణించాలని కోరారు.దీంతో మిగిలిన ముగ్గురు న్యాయమూర్తులు ఏకీభవించారు. హైకోర్టు రిజిస్ట్రీ, పిల్ కమిటీ అభిప్రాయాలను ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచింది. నోటీసులిచ్చిన ధర్మాసనం... వాటిని పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్ మెజారిటీ న్యాయమూర్తుల అభిప్రాయం మేరకు సుబ్బారావు లేఖను పిల్గా పరిగణించాలని రిజిస్ట్రీకి పాలనాపరమైన ఆదేశాలిచ్చారు. రిజిస్ట్రీ ఆమేరకు చర్యలు తీసుకోవడంతో దీనిపై ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్ల ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ప్రతివాదులుగా ఉన్న ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులిచ్చింది. కౌంటర్లు వేయాలని విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. -
ఊపిరి పీల్చుకున్న వరద బాధితులు
అశ్వారావుపేట రూరల్: భద్రాద్రి కొత్తగూడెం– పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దులో అశ్వారావుపేట మండలం గోగులపూడి అటవీ ప్రాంతంలో ఉన్న గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం వద్ద ఆదివారం చిక్కుకున్న భక్తులను ఎట్టకేలకు సురక్షితంగా బయటకు లాగారు. భారీ వర్షంతో ఆలయ సమీపంలోని కొండవాగు ఉగ్రరూపం దాల్చింది. దీంతో 400 మంది భక్తులు, 100 మంది వ్యాపారులు అడవిలోనే దాదాపు 12 గంటలపాటు ఉండిపోయారు. సోమవారం ఉదయం వరకు కూడా వాగు ఉధృతి ఏ మాత్రం తగ్గలేదు. దాంతో అడవిలో ఉన్న భక్తులు వాగు దాటే పరిస్థితి లేకుండా పోయింది. భక్తులు చిక్కుకుపోయారని ఆదివారం రాత్రి టీవీ చానళ్లలో వచ్చిన వార్తలతో ఏపీలోని బుట్టాయిగూడెం మండల రెవెన్యూ, పోలీసు అధికారులు అతి కష్టం మీద అక్కడికి చేరుకున్నారు. కానీ భక్తులను వాగు దాటించలేక పోయారు. రాత్రి సమయం కావడంతో సహాయక చర్యలు సాధ్యం కాలేదు. దీంతో సోమవారం ఉదయం ఏడు గంటలకు స్థానిక ఆర్డీవో మోహన్రావు, కన్నాపురం ఐటీడీఏ పీవో హరిప్రసాద్, జంగారెడ్డిగూడెం సీఐ బాలరాజు వచ్చి రెవెన్యూ, పోలీస్ యంత్రాంగాన్ని రంగంలోకి దింపారు. రెస్క్యూటీమ్ల ఆధ్వర్యంలో పెద్ద తాళ్ల సాయంతో భక్తులను సురక్షితంగా వాగు దాటించారు. ఎట్టకేలకు అడవి, వాగు నుంచి క్షేమంగా బయటపడటంతో ఇటు అధికారులు, అటు బాధితుల కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, వాగు ప్రవాహంలో లారీతోపాటు పలు వాహనాలు కొట్టుకుపోగా వాటిని బయటకు తీయడం సాధ్యం కాలేదు. చేయి చేయి కలిపితేనే తట్టుకోగలం వాతావరణ మార్పులపై సీఎస్ జోషి సాక్షి, హైదరాబాద్: పర్యావరణ నాశనంలో మానవ తప్పిదాల పాత్ర చాలా ఉందని, పరిస్థితిని సరిదిద్దుకోకపోతే భూమ్మీద మనిషి మనుగడ కష్టమేనని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి హెచ్చరించారు. సోమవారం హైదరాబాద్లోని జి.పి.బిర్లా సైన్స్ సెంటర్లో ‘వీ 4 క్లైమెట్’ పేరుతో సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్, జర్మన్ సంస్థ జీఐజెడ్ నిర్వహించిన కార్యక్రమంలో సీఎస్ మాట్లాడారు. వాతావరణ పరిరక్షణకు ప్రభుత్వాల తోపాటు వ్యక్తులు కూడా బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రభుత్వా లు విధానాలు రూపొందించగలవే గానీ అమల్లో ప్రజలదే కీలకపాత్ర అన్నారు. -
మమ్మల్ని పిచ్చోళ్లను చేస్తున్నారు
న్యూఢిల్లీ: ‘ప్రభుత్వాలు మమ్మల్ని పిచ్చోళ్లను చేస్తున్నాయి. పర్యా వరణ పరిరక్షణ, ప్రజల ప్రయోజ నాల కోసం ఖర్చు చేయాల్సిన సుమారు రూ.లక్ష కోట్లను ఇతర కార్యక్రమాల కోసం మళ్లించారు’ అని దేశ అత్యున్నత న్యాయస్థానం మంగళ వారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కార్యనిర్వాహక వ్యవస్థపై తాము చాలా నమ్మకం పెట్టుకున్నామని, అయితే అధికారులు ఎటువంటి పనీ చేయడం లేదని, దీనికి సంబంధించి కోర్టు ఏమైనా వ్యాఖ్యలు చేస్తే న్యాయస్థానాలు పరిధి దాటుతున్నాయని విమర్శలు వస్తున్నాయంది. పర్యావరణ పరిరక్షణకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వివిధ పేర్లతో నిధులను సృష్టించారని, ఇలా సేకరించిన భారీ మొత్తం నిధులను పర్యావరణ పరిరక్షణకు, ప్రజల ప్రయోజనాల కోసమే వినియోగిం చాలని జస్టిస్ మదన్.బి.లోకూర్, జస్టిస్ దీపక్గుప్తాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నిధులను రోడ్ల నిర్మాణానికి, బస్టాండ్ల పునరుద్ధరణకు, కాలేజీల్లో సైన్స్ లేబొరేటరీల నిర్మాణానికి వినియోగించామని ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అఫిడవిట్ దాఖలు చేయడంతో కోర్టు తీవ్రంగా స్పందించింది. ఎందు కోసమైతే ఆ నిధులను కేటాయించారో.. అందుకోసం మాత్రమే వాటిని వినియోగించాలంది. ‘మీరు ఆ నిధులను దారిమళ్లించారు. మా నమ్మకాన్ని వమ్ము చేశారు. మేము చిన్న మొత్తం గురించి మాట్లాడటం లేద’ంటూ.. ఇది తమను తీవ్ర నిరాశకు గురిచేస్తోందని చెప్పింది. -
అమలు చేయకపోవడమే అసలు సమస్య
పర్యావరణ పరిరక్షణ చట్టాలపై జస్టిస్ స్వతంతర్కుమార్ హైదరాబాద్లో ఎన్జీటీ బెంచ్ ఏర్పాటుకు సుముఖమేనని వెల్లడి సాక్షి, హైదరాబాద్: దేశంలో పర్యావరణ పరి రక్షణకు అవసరమైన చట్టాలున్నా వాటిని సరిగా అమలు చేయకపోవడమే అసలైన సమస్యని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చైర్మన్ జస్టిస్ స్వతంతర్ కుమార్ అన్నారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా భారత రాజ్యాంగంలో పర్యావరణ పరిరక్షణకు ప్రత్యే కంగా మూడు అధికరణలు ఉన్నాయని చెప్పా రు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్క రించుకుని సోమవారం అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవెల్యూషన్–సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం ఆధ్వర్యంలో నిర్వహిం చిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. కొన్నేళ్ల కింద ఏసీ సిటీగా ఉన్న బెంగళూరులో ప్రస్తుతం ఏసీలు తప్ప మరేమి లేవన్నారు. హైదరాబాద్లో బెంచ్కు సుముఖమే.. పర్యావరణ సంబంధ కేసులపై చెన్నైలోని బెంచ్కు వెళ్లడం వ్యయప్రయాసలతో కూడు కుందని, హైదరాబాద్లో బెంచ్ ఏర్పాటు చేస్తే త్వరగా పరిష్కరించే వీలుందని పర్యావరణ వేత్త ప్రొ.కె.పురుషోత్తంరెడ్డి సూచించారు. హైదరాబాద్లో గ్రీన్ట్రిబ్యునల్ బెంచ్ ఏర్పా టుకు తాము సుముఖంగా ఉన్నామని, అయితే దీనిపై నిర్ణయించాల్సింది ప్రభుత్వమేనని జస్టిస్ స్వతంతర్కుమార్ అన్నారు. యమునా నది ప్రక్షాళన, ఫ్రాన్స్కు చెందిన ఓడ ద్వారా ఇక్కడి సముద్రజలాలను కాలుష్యం బారిన పడకుండా చేయడం, వ్యవసాయ వ్యర్థాలను కాల్చివేయకుండా కట్టడి, వాయుకాలుష్యం నియంత్రణకు చర్యలు వంటివి ఎన్జీటీ సాధిం చిన విజయాలని చెప్పారు. ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ప్రొ.కె.సీతారామారావు మాట్లాడుతూ.. ఫ్రాన్స్ వాతావరణ మార్పు ఒప్పందం నుంచి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైదొలగడం దురదృష్టకరమన్నారు. దీనిపై అన్ని దేశాలు ఏకతాటిపైకి వచ్చి పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సి ఉంద న్నారు. పశ్చిమ కనుమల సంరక్షణతో సమానంగా తూర్పు కనుముల పరిరక్షణకు కూడా కేంద్రం చర్యలు తీసుకోవాలని సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఆర్.దిలీప్రెడ్డి డిమాండ్ చేశారు. ఆరు రాష్ట్రాలు, 1700 కి.మీ పరిధిలో ఉన్న తూర్పు కనుమల పరిరక్షణపై ఒత్తిడి తెచ్చేందుకు త్వరలోనే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవెల్యూషన్ ఆధ్వర్యంలో ఆ ప్రాంత ఎంపీలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. అబ్దుల్కలాం స్మృత్యర్థం 500 పాఠశాలల్లో కలాం స్మృతివనాలు ఏర్పాటు చేస్తున్నట్లు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవెల్యూషన్ అధ్యక్షురాలు లీలా లక్ష్మారెడ్డి చెప్పారు. కలాం జయంతి రోజైన జూలై 27న మొక్కలను ఇచ్చే రోజుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సదస్సు ముగింపు సందర్భంగా సభికులు, పెద్ద సంఖ్యలో వచ్చిన స్కూలు విద్యార్థులతో పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తామని జస్టిస్ స్వతంతర్కుమార్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఏపీ, తెలంగాణ బార్కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి, నేషనల్ అకాడమి ఆఫ్ కనస్ట్రక్షన్ డైరెక్టర్ జనరల్ కె.భిక్షపతి, ఓపెన్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు మధుసూదనరెడ్డి, వైఎస్ కిరణ్మయి, నారా యణరావు పాల్గొన్నారు. పర్యావరణాన్ని కాపాడినప్పుడే... పర్యావరణాన్ని కాపాడి పచ్చదనాన్ని పెంచినప్పుడే మనుషులు సహా అన్ని జీవుల మనుగడ సాధ్యమవుతుందని జస్టిస్ స్వతంతర్కుమార్ అన్నారు. ప్రజల్లో పర్యావరణం, వాటి చట్టాల పట్ల ప్రజల్లో అవగాహన, చైతన్యం కల్పించాల్సిన బాధ్యత న్యాయవాదులపై ఉందన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏపీ, తెలంగాణ హైకోర్టుల న్యాయవాదుల సంఘం సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జస్టిస్ స్వతంత్రకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్ పాల్గొన్నారు. సాక్షి, హైదరాబాద్: దేశంలో పర్యావరణ పరి రక్షణకు అవసరమైన చట్టాలున్నా వాటిని సరిగా అమలు చేయకపోవడమే అసలైన సమస్యని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చైర్మన్ జస్టిస్ స్వతంతర్ కుమార్ అన్నారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా భారత రాజ్యాంగంలో పర్యావరణ పరిరక్షణకు ప్రత్యే కంగా మూడు అధికరణలు ఉన్నాయని చెప్పా రు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్క రించుకుని సోమవారం అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవెల్యూషన్–సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం ఆధ్వర్యంలో నిర్వహిం చిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. కొన్నేళ్ల కింద ఏసీ సిటీగా ఉన్న బెంగళూరులో ప్రస్తుతం ఏసీలు తప్ప మరేమి లేవన్నారు. హైదరాబాద్లో బెంచ్కు సుముఖమే.. పర్యావరణ సంబంధ కేసులపై చెన్నైలోని బెంచ్కు వెళ్లడం వ్యయప్రయాసలతో కూడు కుందని, హైదరాబాద్లో బెంచ్ ఏర్పాటు చేస్తే త్వరగా పరిష్కరించే వీలుందని పర్యావరణ వేత్త ప్రొ.కె.పురుషోత్తంరెడ్డి సూచించారు. హైదరాబాద్లో గ్రీన్ట్రిబ్యునల్ బెంచ్ ఏర్పా టుకు తాము సుముఖంగా ఉన్నామని, అయితే దీనిపై నిర్ణయించాల్సింది ప్రభుత్వమేనని జస్టిస్ స్వతంతర్కుమార్ అన్నారు. యమునా నది ప్రక్షాళన, ఫ్రాన్స్కు చెందిన ఓడ ద్వారా ఇక్కడి సముద్రజలాలను కాలుష్యం బారిన పడకుండా చేయడం, వ్యవసాయ వ్యర్థాలను కాల్చివేయకుండా కట్టడి, వాయుకాలుష్యం నియంత్రణకు చర్యలు వంటివి ఎన్జీటీ సాధిం చిన విజయాలని చెప్పారు. ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ప్రొ.కె.సీతారామారావు మాట్లాడుతూ.. ఫ్రాన్స్ వాతావరణ మార్పు ఒప్పందం నుంచి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైదొలగడం దురదృష్టకరమన్నారు. దీనిపై అన్ని దేశాలు ఏకతాటిపైకి వచ్చి పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సి ఉంద న్నారు. పశ్చిమ కనుమల సంరక్షణతో సమానంగా తూర్పు కనుముల పరిరక్షణకు కూడా కేంద్రం చర్యలు తీసుకోవాలని సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఆర్.దిలీప్రెడ్డి డిమాండ్ చేశారు. ఆరు రాష్ట్రాలు, 1700 కి.మీ పరిధిలో ఉన్న తూర్పు కనుమల పరిరక్షణపై ఒత్తిడి తెచ్చేందుకు త్వరలోనే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవెల్యూషన్ ఆధ్వర్యంలో ఆ ప్రాంత ఎంపీలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. అబ్దుల్కలాం స్మృత్యర్థం 500 పాఠశాలల్లో కలాం స్మృతివనాలు ఏర్పాటు చేస్తున్నట్లు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవెల్యూషన్ అధ్యక్షురాలు లీలా లక్ష్మారెడ్డి చెప్పారు. కలాం జయంతి రోజైన జూలై 27న మొక్కలను ఇచ్చే రోజుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సదస్సు ముగింపు సందర్భంగా సభికులు, పెద్ద సంఖ్యలో వచ్చిన స్కూలు విద్యార్థులతో పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తామని జస్టిస్ స్వతంతర్కుమార్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఏపీ, తెలంగాణ బార్కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి, నేషనల్ అకాడమి ఆఫ్ కనస్ట్రక్షన్ డైరెక్టర్ జనరల్ కె.భిక్షపతి, ఓపెన్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు మధుసూదనరెడ్డి, వైఎస్ కిరణ్మయి, నారా యణరావు పాల్గొన్నారు. పర్యావరణాన్ని కాపాడినప్పుడే... పర్యావరణాన్ని కాపాడి పచ్చదనాన్ని పెంచినప్పుడే మనుషులు సహా అన్ని జీవుల మనుగడ సాధ్యమవుతుందని జస్టిస్ స్వతంతర్కుమార్ అన్నారు. ప్రజల్లో పర్యావరణం, వాటి చట్టాల పట్ల ప్రజల్లో అవగాహన, చైతన్యం కల్పించాల్సిన బాధ్యత న్యాయవాదులపై ఉందన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏపీ, తెలంగాణ హైకోర్టుల న్యాయవాదుల సంఘం సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జస్టిస్ స్వతంత్రకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్ పాల్గొన్నారు. -
పర్యావరణహితంగా పండుగలు జరుపుకోవాలి
గ్రీన్ దీపావళి పోస్టర్ను ఆవిష్కరించిన మంత్రి జోగు రామన్న సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత జీవన విధానంలో ప్రకృతికి నష్టం కలిగించని రీతిలో పండుగలు జరుపుకోవాల్సిన అవసరం ఉందని అటవీ, పర్యావరణశాఖ మంత్రి జోగు రామన్న చెప్పారు. దీపావళికి పెద్ద ఎత్తున బాణసంచా కాల్చడం వల్ల శబ్ద, వాయుకాలుష్యం ఏర్పడి మనుషుల ఆరోగ్యం, పెంపుడు జంతువులపైనా తీవ్ర ప్రభావాన్ని చూపుతోందన్నారు. భూగోళం వేడెక్కి, వాతావరణంలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు. గ్రీన్ దీపావళి జరుపుకోవాలని కోరుతూ శ్వాస ఫౌండేషన్ రూపొందించిన పోస్టర్ను బుధవారం సచివాలయంలో జోగురామన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్వాస ఫౌండేషన్ అధ్యక్షురాలు జి.కళ్యాణి మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. -
పర్యావరణ పరిరక్షణ కోసం..
నకిరేకల్ : పర్యావరణ పరిరక్షణలో భాగంగా జిల్లాలో ప్రపథమంగా నకిరేకల్లోని పన్నాలగూడెంలో ఎమ్మెల్యే వేముల వీరేశం క్యాంపు కార్యాలయం ఎదుట నెలకొల్పిన మట్టి వినాయక విగ్రహాన్ని బుధవారం రాత్రి మండపం వద్దే పర్యావరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో హీత నిమజ్జనం (నీళ్లతో కరిగించడం) చేశారు. నీళ్లతో అభిషేకాలు నిర్వహించారు. అయితే విగ్రహాలను నిమజ్జనానికి వేరే ప్రాంతాలకు తీసుకెళాల్లంటే ట్రాఫిక్ ఇబ్బందులతోపాటు చెరువుల్లో వేస్తే నీటి కాలుష్యం అవుతున్న నేప£ý ్యంలో నీటితో అభిషేకం చేసి కరిగించారు. కరిగించిన తరువాత మట్టిని భక్తులు తమ ఇళ్లకు తీసుకెళ్లడం గమనార్హం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొని మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలుగకుంఆ మట్టి విగ్రహాలను నెలకొల్పడం అభినందనీయమన్నారు. వచ్చే ఏడాది నియోజకవర్గ వ్యాప్తంగా మట్టి విగ్రహాలు నెలకొల్పేవిధంగా అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సమితి ప్రతినిధులు శ్రీనివాస్రావు, విద్యాసాగర్రెడ్డి, నవీన్రెడ్డి, తిరుమలేశ, విగ్రహదాత పన్నాల చంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పేపర్ గణపతికి ‘రికార్డు’ గుర్తింపు
యాకుత్పురా: పర్యావరణ పరిరక్షణలో భాగంగా పేపర్తో చేసిన వినాయకుడిని నెలకొల్పిన పాతబస్తీ గౌలిపురా అంబికానగర్ ప్రాంతానికి చెందిన ఎంబీఏ విద్యార్థి ఆర్.చంద్రకాంత్ చారికి లండన్కు చెందిన ‘ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం లభించింది. ఇతడు మూడేళ్లుగా పేపర్ వినాయకుడిని ఏర్పాటు చేస్తూ స్థానికంగా గుర్తింపు పొందాడు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని 20 కిలోల న్యూస్ పేపర్లు, గోధుమ పిండి, వెదురు బొంగులతో 8.4 అడుగుల విగ్రహాన్ని రూపొందించాడు. సోమవారం రాత్రి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు ఇండియా ప్రతినిధులు బింగి నరేందర్ గౌడ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రతినిధి డాక్టర్ గుర్రం స్వర్ణశ్రీ.. చంద్రకాంత్కు గుర్తింపు పత్రాన్ని ఇచ్చారు. -
మట్టి గణపతికి జై
సాక్షి, సిటీబ్యూరో : గణనాథుల పండగ సమీపిస్తోంది. ఈ ఏడు పండగ తనతో పాటు నగర వాసుల్లో పర్యావరణ స్పృహను మోసుకొస్తోంది. గతానికి పూర్తి భిన్నంగా కాలనీలు, అపార్ట్మెంట్ సంఘాలు మహా నగర పర్యావరణానికి విఘాతం కలగని రీతిలో మట్టి గణపతులకు జైకొడుతున్నాయి. ఆలివ్, ట్రీగార్డ్, రెయిన్బో విస్టా సంస్థలతో కలిసి ‘సాక్షి’ మీడియా గ్రూప్ ఆదివారం నుంచి మట్టి గణపతుల తయారీలో శిక్షణ, పంపిణీకి శ్రీకారం చుడుతోంది. మరో వైపు కాలుష్య నియంత్రణ మండలితో పాటు మరి కొన్ని స్వచ్ఛంద సంస్థలు వివిధ ఆకృతుల్లో మట్టి గణపతులను అందుబాటులోకి తేబోతున్నాయి. నేటి నుంచి తయారీ–శిక్షణ: మట్టి గణనాథుల తయారీపై ‘సాక్షి–ఆలివ్ మిఠాయి’ సంయుక్తంగా నగరంలోని రెయిన్బో విస్టా, మలేషియన్ టౌన్షిప్ (రెయిన్ ట్రీపార్క్) తదితర గేటెడ్ కమ్యూనిటీల్లో ఈనెల 28న (ఆదివారం)ఉదయం విగ్రహాల తయారీపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నాయి. మట్టితో తయారు చేసే ప్రతిమలను స్థానికులకు అక్కడే ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ఆలివ్ మిఠాయి సంస్థల అధినేత దొరరాజు తెలిపారు. ఇళ్లలో పూజించుకునేందుకు సుమారు 5 వేల ప్రతిమలను గ్రేటర్ వ్యాప్తంగా ప్రజలకు పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. -
కలిసికట్టుగా ‘హరితహారం’
♦ విద్యార్థులను భాగస్వాములను చేయాలి ♦ ఆ గురుతర బాధ్యత ఉపాధ్యాయులదే ♦ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ ప్రోగ్రాం ♦ చైర్మన్ ఆర్.దిలీప్రెడ్డి సాక్షి, సంగారెడ్డి: పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని కౌన్సిలర్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ ప్రోగ్రాం చైర్మన్ ఆర్.దిలీప్రెడ్డి అన్నారు. ఉద్యమంలా హరితహారం కార్యక్రమం చేపట్టాలన్నారు. ఇందులో విద్యార్థుల భాగస్వాములను చేయాల్సిన గురుతర బాధ్యత ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులపైనే ఉందన్నారు. మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ‘బంగారు తెలంగాణ-బాలల హరితహారం’పై నిర్వహించిన సమావేశానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, అటవీశాఖ మంత్రి జోగురామన్న, భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ ప్రోగ్రాం చైర్మన్, ఆర్టీఐ మాజీ కమిషనర్ ఆర్.దిలీప్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దిలీప్రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల మదిలో మొక్కలు పెంచాలన్న భావన పెంచాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు కౌన్సిలర్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ చిత్తశుద్దితో కృషి చేస్తున్నదన్నారు. పర్యావరణ సమత్యులత దెబ్బతినటం వల్లే వర్షాలు సకాలంలో కురవటంలేదన్నారు. దీనిని నివారించాలంటే మొక్కలు పెంపకం ఒక్కటే మార్గమన్నారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ అధ్యక్షురాలు లీలా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులంతా బాలల హరితహారం విజయవంతానికి సహకరించాలని కోరారు. సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ రాజమణి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీలు సుధాకర్రెడ్డి, భూపాల్రెడ్డి, రాములు నాయక్, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, బాబూమోహన్, మదన్రెడ్డి, జి.మహిపాల్రెడ్డి, భూపాల్రెడ్డి, జాయింట్ కలెక్టర్, డీఈఓ తదితరులు పాల్గొన్నారు. -
సంప్రదాయ పద్ధతులే మేలు
♦ పర్యావరణ పరిరక్షణపై ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ మల్లేశ్ ♦ సీజీఆర్ సదస్సులో పర్యావరణ రక్షణకు వక్తల సూచనలు సాక్షి, హైదరాబాద్: పర్యావరణాన్ని పరిరక్షించేందుకు సంప్రదాయంగా వస్తున్న పాత పద్ధతులను అవలంభించడమే మేలని ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ఎస్.మల్లేశ్ అన్నారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్(సీజీఆర్) మంగళవారం జేఎన్ఏఎఫ్ఏయూలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రకృతి ప్రసాదించిన సహజ వనరులను ఎవరికి ఇష్టమొచ్చినట్లు వారు పూర్తిగా వాడేస్తున్నారని, దీనివల్ల భవిష్యత్ తరాల వారికి ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడుతోందని అన్నారు. నష్టమేనని తెలిసినప్పటికీ పర్యావరణానికి హాని తలపెడుతున్నామని, పెరుగుతున్న కాలుష్యం ఫలితంగా భవిష్యత్తులో ఆక్సిజన్ సిలెండర్లు వెంట తీసుకెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయేమోనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణ పట్ల యువతకు దిశానిర్ధేశం చేసే బాధ్యత అధ్యాపకులపై ఉందని మల్లేశ్ అన్నారు. భవిష్యత్ తరాలు మనుగడ సాధించాలంటే ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ‘సాక్షి’ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్రెడ్డి అన్నారు. వాతావరణంలో మార్పుల కార ణంగా పరిస్థితులు ఆందోళనకరంగా ఉంటున్నాయన్నారు. ప్రసార మాధ్యమాల్లోనూ రాజకీయ అంశాలకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని పర్యావరణ అంశాల కు ఇవ్వడం లేదన్నారు. ఆ అంశాల పట్ల ప్రజల నుంచి స్పందన కూడా అంతంత మాత్రంగానే ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణ ఎన్నో అంశాలతో ముడిపడి ఉన్నది కనుకనే, విభిన్న రంగాలకు చెందిన నిపుణులను ఈ సదస్సుకు ఆహ్వానించామని ప్రముఖ పర్యావరణ వేత్త పురుషోత్తమ్రెడ్డి అన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత కనుకనే ఎల్కేజీ నుంచి పీజీ వరకు అన్ని స్థాయిల్లో పర్యావరణం సబ్జెక్ట్ను తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వు లు జారీచేసిందన్నారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అధ్యక్షురాలు లీలా లకా్ష్మరెడ్డి మాట్లాడుతూ.. మెరుగైన సమాజమే లక్ష్యంగా సీజీఆర్ కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సీబీఐటీ చైర్మన్ మాలకొండారెడ్డి, పర్యావరణ నిపుణులు సురేశ్లాల్, డాక్టర్ నర్సింహారెడ్డి, ప్రసన్నషీల, విజయలక్ష్మి, ప్రియకుమారి, కృష్ణారెడ్డి, అక్తర్ అలీ తదితరులు పాల్గొన్నారు. -
పేద దేశాలకు రెట్టింపు నిధులు: జాన్ కెర్రీ
పారిస్: శుక్రవారం ముగియనున్న పారిస్ పర్యావరణ సదస్సులో సభ్య దేశాల మంత్రుల సమావేశం తర్వాత ‘సంయుక్త ఒప్పందం’పై ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ ఒప్పందం ముసాయిదాను 48 పేజీల నుంచి 29 పేజీలకు కుదించి సభ్య దేశాలకు పంపించినట్లు ఫ్రాన్స్ తెలిపింది. మరోవైపు, పేద దేశాలు పర్యావరణ పరిరక్షణ దిశగా చేసే ప్రయత్నాలకు ఇచ్చే నిధులను రెట్టింపు చేస్తున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ప్రకటించారు. అగ్రరాజ్యంగా తమ బాధ్యతను నిర్వర్తిస్తామన్నారు. -
పదింతల పచ్చదనం
పదింతల పచ్చదనం {పతి ఒక్కరూ పది మొక్కలు పెంచాలి ఐదు కోట్ల జనాభా భాగస్వాములైతే భవిష్యత్ తరాలకు గ్రీనరీ కార్తీక వనమహోత్సవంలోముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనంతవరంలో విద్యార్థులతో ముఖాముఖి గుంటూరు : ప్రతి వ్యక్తి సంవత్సరానికి పది మొక్కలు పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ఈ విధంగా రాష్ట్రంలోని ఐదు కోట్ల జనాభా మొక్కలు నాటితే మొత్తం 50 కోట్ల మొక్కలు పెరిగి భవిష్యత్ తరాలకు ఉపయోగపడే గ్రీనరీ ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తుళ్లూరు మండలం అనంతవరం గ్రామంలో బుధవారం ఏర్పాటుచేసిన కార్తీక వనమహోత్సవం కార్యక్రమంలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ విద్యార్థి దశ నుంచి వాతావరణ కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలిగించేందుకు ప్రతి పాఠశాలలో వివిధ దశల్లో పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు, అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్, అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎ.కె.ఫరీద తదితరులు ప్రసంగించారు. మొక్కలు నాటిన ముఖ్యమంత్రి తొలుత ముఖ్యమంత్రి మొక్కలు నాటి కార్తీక వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులకు మొక్కల పెంపకంపై అవగాహన కలిగించారు. వారితో ముఖాముఖి మాట్లాడారు. విద్యార్థులకు వేదికపై ప్రసంగించే అవకాశం కల్పించారు. చెట్ల పెంపకాన్ని ఒక బాధ్యతగా చేపడుతున్న అనంతవరం గ్రామానికి చెందిన బండ్లి పాపమ్మ అనే వృద్ధురాలిని సీఎం సభాముఖంగా అభినందించారు. గ్రామ సర్పంచ్ రాజేష్, డ్వాక్రా గ్రూపు సభ్యులు గ్రామంలో చెట్లు పెంచే కార్యక్రమాన్ని చేపడుతుందీ లేనిదీ విద్యార్థుల నుంచి సీఎం అడిగి తెలుసుకున్నారు. అనంతరం భవనచంద్ర పర్యావరణ పరిరక్షణ సమితి రూపొందించిన పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. ఆ తరువాత కార్యక్రమంలో భాగస్వాములైన వారందరి చేత హరిత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, శాసనసభ్యులు కొమ్మాలపాటి శ్రీధర్, జి.వి.ఎస్.ఆర్. ఆంజనేయులు, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, కలెక్టర్ కాంతిలాల్దండే, జాయింట్ కలెక్టర్ ఎన్.శ్రీధర్, సంయుక్త కలెక్టర్ -2 ఎం.వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
ప్లాస్టిక్తో సముద్రానికి ముప్పు
ప్లాస్టిక్ వ్యర్థాలవల్ల సముద్రానికి తీరని నష్టం వాటిల్లుతోందని కృష్ణపట్నం ఇండియన్ కోస్ట్గార్డ్స్ కమాండెంట్ వేణు మాధవ్ తెలిపారు. శనివారం కోస్టల్ క్లీనప్ డే సందర్భంగా కృష్ణపట్నం రేవులోని సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు పెను సవాలుగా మారిన ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే కార్యక్రమం యుద్ధప్రాతిపదికన చేపట్టామన్నారు. -
కబ్జా కోరల్లో నగర సరస్సులు
బెంగళూరు: ఉద్యాననగరిలోని సరస్సులను కబ్జా చేయడానికి తెరవెనక ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రభుత్వంలోని కొంత మంది బడా నాయకులే కబ్జాదారులతో చేతులు కలిపి ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నారని దీంతో మరి కొన్నేళ్లలో నగరంలో సరస్సులు ఉన్న ప్రాంతాల్లో భవనాలు వెలిసే ప్రమాదం ఉందని పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీబీఎంపీ పరిధిలో 183 సరస్సులు బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీ ఎంపీ) పరిధిలో 183 సరస్సులు ఉన్నట్లు ఆ విభాగం గుర్తించింది. ఈ సరస్సులు 7,209 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నాయి. అయితే వీటిలో 80 శాతం సరస్సుల్లో పూడిక పేరుకుపోవడం, నాచు పెరిగింది. దీంతో ఆహ్లాదాన్ని పంచాల్సిన సరస్సులు అధ్వానం గా తయారయ్యాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి నగరంలో అవసాన దశలో ఉన్న 132 సరస్సులను అభివృద్ధికి గాను దాదాపు ఐదేళ్ల క్రితం ప్రభుత్వం బీబీఎంపీకి నిధులు విడుదల చేసింది. సరస్సులోని పూడిక, నాచును తొలగించడం దాని చుట్టూ ఉన్న భూభాగం ఆక్రమణకు గురికాకుండా చూడటం బీబీ ఎంపీ ప్రధానవిధి. చుట్టుపక్కల పర్యాటకులను ఆకర్షించేలా రాళ్లతో కృత్రిమ శిల్పాలు నెలకొల్పడం, చెట్లు పెంచడం, చిన్నచిన్న రెస్టారెంట్లు ఏర్పాటు చేయడం కూడా సరస్సుల అభివృద్ధి, ఆధునికీకరణలో భాగమే. మొదట్లో బాగానే సాగిన పనులు హ ఠాత్తుగా ఆగిపోయాయి. తమ వద్ద తగిన సిబ్బంది లేరని అందువల్ల సరస్సులను పర్యవేక్షించడానికి సాధ్యం కాదని బీబీఎంపీ చేతులెత్తేసింది. ఈమేరకు ప్రభుత్వానికి ఆరునెలల ముందు నివేదిక అందజేసింది. దీంతో వెంటనే ప్రభుత్వం సరస్సుల అభివృద్ధిని బెంగళూరు డెవెలప్మెంట్ అథారిటీ (బీడీఏ)కి అప్పగించింది. అయితే ఈ విషయం లక్ష్మణరావు కమిటీ సిఫార్సులకు వ్యతిరేకమని పలువురు పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నివేదిక ఏం చెబుతుంది... నగరంలో సరస్సుల అభివృద్ధిపై 1988లో ప్రముఖ సామాజిక పర్యావరణ వేత్త లక్ష్మణరావు నేతృత్వంలోని కమిటీ అప్పటి ప్రభుత్వానికి నివేదిక అందించింది. దీని ప్రకారం సరస్సుల అభివృద్ధిని ప్రభుత్వమే చేపట్టాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకాని, ప్రభుత్వ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు గాని అందచేయకూడదనేది ఆనివేదికలోని ప్రధాన సారాంశం. బీడీఏ అనేది ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చే సంస్థ. దీని ప్రధాన విధి నగరంలోని ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని వాటిని అభివృద్ధి చేసి ప్రైవేట్ వ్యక్తులకు కానీ, సంస్ధలకు కానీ అప్పగించడం. అందువల్ల సరస్సుల అభివృద్ధిని బీడీఏకి అప్పగిస్తే అభివృద్ధి ముసుగులో సరస్సులు, వాటి చుట్టుపక్కల ఉన్న భూభాగంలో వాణిజ్య భవంతులను నిర్మించి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయం పై బీడీఏ అధికారి ఒకరు మాట్లాడుతూ ‘ బీబీఎంపీ నుంచి ప్రభుత్వానికి లేఖ రాయించడం, తర్వాత ఆ పనులు బీడీఏకు దక్కడం వెనక రాష్ట్ర మంత్రి మండలిలో ప్రముఖ స్థానంలో ఉన్న ఓ మంత్రితో పాటు బెంగళూరు గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి హస్తం ఉంది. బీడీఏ పనులన్ని ఆయన కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. అభివృద్ధి పేరుతో సరస్సులకు చెందిన భూ భాగాన్ని ఆక్రమించడమే ఆయన ముందున్న లక్ష్యం’. అని పేర్కొన్నారు. -
గూడు చెదిరిన పక్షులు
పక్షుల కిలకిలారావాలు... పురివిప్పిన మయూరాల మనోహర విన్యాసాలు... కోకిల గానాలు... మహా నగరానికి దూరమవుతున్నాయి. అందమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతున్నాయి. భారీ నిర్మాణాలు, బహుళ అంతస్థుల భవనాల కోసం తొలగిస్తున్న కొండలు, గుట్టలు, చెట్టు, చేమ... జీవకోటి ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. పర్యావరణ అసమతౌల్యం, చెట్ల తొలగింపుతో అనేక రకాల పక్షులు చెదిరిపోతున్నాయి. బంజారాహిల్స్, కేబీఆర్ పార్కు, మెహిదీపట్నం, అంబర్పేట్ వంటి ప్రధాన ప్రాంతాల్లోనే కాకుండా రాయదుర్గం, అత్తాపూర్, ఇంజాపూర్, ఆదిభట్ల, శంషాబాద్, టోలీచౌకి, మియాపూర్, మణికొండ, పుప్పాలగూడ, హఫీజ్పేట్ వంటి శివారు ప్రాంతాల్లోనూ పక్షుల మనుగడపైనీలినీడలు కమ్ముకున్నాయి. -సాక్షి, సిటీబ్యూరో/ రాయదుర్గం చెదురుతున్న గూళ్లు ఆకాశాన్ని తాకే భవనాలతో అలరారుతున్న కాంక్రీట్ జంగిల్లో పక్షులు గూళ్లు కట్టుకునేందుకు రవ్వంత చోటు కరువవుతోంది.తీతువు లాంటి కొన్ని రకాల పక్షులు బంజరు భూముల్లోనే గుడ్లు పెట్టి పొదుగుతాయి. కొన్నిరకాల పిట్టలు ముళ్ల పొదల్లో ఆవాసం ఏర్పాటు చేసుకుంటాయి. గుబురుగా పెరిగే రావి, మర్రి, వేప చెట్లూ పక్షులకు ఆవాసాలే. కాకులు తుమ్మచెట్లపైన గూళ్లు కట్టుకుంటాయి. నెమళ్లు అడవి అంచున సేదదీరుతాయి. కానీ ఇప్పుడు అలాంటి భూములు, చెట్లు మచ్చుకైనా కనిపించడం లేదు. కొండలు, గుట్టలు, చెట్లు, చెరువులు జీవ వైవిధ్యానికి ఆనవాళ్లు. ఒకప్పుడు ఇలాంటి వాతావరణంతో ఉన్న అనేక ప్రాం తాలు ఇప్పుడు నగరంలో కలిసిపోయాయి. శేరిలింగంపల్లి ప్రాంతంలోని రాయదుర్గం, నానక్రాంగూడ, ఖాజాగూడ, మధురానగర్, ప్రశాంతిహిల్స్, చిత్రపురి కాలనీ, గోపన్పల్లి, కూకట్పల్లి, బోడుప్పల్, ఎల్బీనగర్, హయత్నగర్ వంటి ప్రాంతాల్లోని నిర్మాణాలు, భారీ ఎత్తున కొనసాగుతున్న క్వారీ పేలుళ్లతో పక్షుల గూళ్లు చెదిరిపోయాయి. పారిశ్రామికీకరణ సైతం వీటి మనుగడకు పెనుసవాల్గా మారింది. నెమళ్లకు ఎంత కష్టమో... రాయదుర్గం, నానక్రాంగూడ, గోపన్పల్లి వంటి ప్రాంతాల్లో మట్టితో కూడిన సహజసిద్ధ కొండలు, గుట్టల్లో నెమళ్లు కనువిందు చేస్తాయి. సర్వే నెంబర్ 83లో గుట్టపై పెద్ద సంఖ్యలో నెమళ్లు సందడి చేస్తున్నాయి. ఉదయం ఏడు గంటల లోపు, సాయంత్రం వేళ గుట్టల్లోకి వెళితే పురివిప్పి ఆడే మయూరాలు మనసు దోచుకుంటాయి. ఈ గుట్టకే ఇప్పుడు ముప్పు పొంచి ఉంది. దీని చుట్టూ ఉన్న స్థలాన్ని టీఎస్ఐఐసీ ప్రైవేటు సంస్థలకు కేటాయించింది. క్వారీ పేలుళ్లతో నెమళ్ల ఉనికికే ముప్పు ఏర్పడుతోంది. చెరువులు కనుమరుగవుతుండడంతో నీటి లభ్యత కూడా జటిలంగానే మారింది. ఈ పక్షులకు గడ్డుకాలం.... ప్రస్తుతం ఎన్నో జాతుల పక్షుల జీవనం ప్రమాదంలో పడింది. నెమళ్లతో పాటు, ఊదా తేనె పిట్ట, వడ్రంగిపిట్ట, పిగిలిపిట్ట, ఊర పిచ్చుకలు, చిన్న సైద, తీతువు, ఫ్లవర్పెకర్, కొంగలు, కోయిలలు, పావురాళ్లు, కాకులు, రామచిలుకలు, చమురుకాకి, నీటి కొంగలు, వంగపండు, పాలపిట్టలు, డేగలు వంటి అనేక రకాల పక్షులకు గూడు కట్టుకునేందుకు చోటేలేదు. ఇవి గుడ్లు పొదిగేందుకు అనువైన వాతావరణం లేక అంతరించిపోతున్నాయి. మున్ముందు అనేక రకాల పక్షులు అంతరించిపోయే వాటి జాబితాలో చేరే ప్రమాదం ఉందని పక్షి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేపటి తరం కోసమైనా.. సహజంగా పెరిగిన చెట్లు, పొదలు పోయాయి. అందం కోసం రకరకాల చెట్లతో పార్కులను నింపేస్తున్నారు. వీటికి కొమ్మలు ఉండవు. దీంతో పక్షులు గూళ్లు కట్టుకోలేకపోతున్నాయి. రేపటి తరాల కోసం వీటిని కాపాడుకోవాలి. -రజని, వక్కలంక (కాల్బ్యాక్ స్వచ్ఛంద సంస్థ) ఓ గంటైనా కేటాయించాలి పక్షుల కిలకిలారావాలతో నిద్ర లేచే ఊరు ఎంతో ఆహ్లాదంగా, ఆనందంగా ఉంటుంది. మనసుకు హాయినిస్తుంది. అలాంటి సహజమైన వాతావరణాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ ఇంటి చుట్టూ కనిపించే పక్షుల రక్షణ పైన దృష్టి పెట్టాలి. సజ్జలు, జొన్నలు వంటి గింజలు, నీళ్లు ఏర్పాటు చేసి వాటిని కాపాడేందుకు కృషి చేయాలి. -దేవకి జ్యోతి, పక్షి ప్రేమికులు -
వన రాజధానిగా అమరావతి
వనమహోత్సవంలో సీఎం సాక్షి, విజయవాడ: అమరావతిని వన రాజధానిగా అభివృద్ధి చేసి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకువద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం విజయవాడ నగర సమీపంలోని కొత్తూరు తాడేపల్లి రిజర్వు పారెస్టు ప్రాంతంలో కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్తో కలసి ఆయన మొక్కలు నాటారు. చంద్రబాబు మాట్లాడుతూ రాజధాని ప్రాంతాన్ని హరితవనంగా తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అడవుల అభివృద్ధికి రూ.55వేల కోట్లు.. కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ.. అభివృద్ధితోపాటు మొక్కలపెంపకం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తామని చెప్పారు. దేశంలో పచ్చదనం, స్వచ్ఛభారత్, గ్రీన్ఇండియాకోసం 14వ ఆర్థికసంఘం ద్వారా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. ముస్లిం ఆడపిల్లల పెళ్లి బాధ్యత ప్రభుత్వానిదే: ఇఫ్తార్ విందులో సీఎం ముస్లిం పేదల్లో ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయడం కష్టంగా మారిందని, ఇకనుంచీ వారి పెళ్లి బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. శుక్రవారం సాయంత్రం విజయవాడలో రాష్ట్ర మైనార్టీశాఖ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఇచ్చారు. దీనికి హాజరైన చంద్రబాబు మాట్లాడుతూ పేద ముస్లిం ఆడపిల్లలకోసం ఎన్ని కళాశాలలైనా పెట్టి, ఎంత ఖర్చుపెట్టయినా చదివిస్తామని చెప్పారు. ఇమామ్లకు నెలకు రూ.4వేలు, మేజాలకు రూ.2వేలు చొప్పున గౌరవవేతనాలిస్తామని ప్రకటించారు. * కొత్తూరు తాడేపల్లిలో నిర్వహించిన వనమహోత్సవంలో పాల్గొన్న సీఎం జక్కంపూడి గ్రామ సమీపంలో పోలవరం కుడికాల్వ తవ్వకం పనుల్ని పర్యవేక్షించారు. -
సముద్రాన్నీ లాక్కోవాలనుకుంటోంది
మోదీ సర్కారుపై రాహుల్ ధ్వజం చవక్కాడ్(కేరళ): విలువైన రైతుల భూములను గుంజుకుంటున్నట్లే జాలర్ల నుంచి సముద్రాన్నీ లాక్కోవడానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. ‘భారత్లో భూమి బంగారంగా మారింది. వాళ్లు ఆ బంగారాన్ని తమ రైతుకు కాకుండా తమ మిత్రులకు ఇవ్వాలనుకుంటున్నారు. జాలర్ల విషయంలో ఈ పనే చేస్తున్నారు’ అని అన్నారు. కేరళలో రాహుల్ బుధవారం రెండో రోజు పర్యటనలో భాగంగా త్రిస్సూర్ జిల్లా చవక్కాడ్లో జరిగిన జాలర్ల సభలో ప్రసంగించారు. సముద్ర పర్యావరణ రక్షణ కోసం తీర ప్రాంతాల్లో చేపల వేటపై నిషేధాన్ని 45 రోజుల నుంచి 61 రోజులకు పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన దుయ్యట్టారు. అంతకుముందు ఆయన చవక్కాడ్లోని బ్లాంగద్ బీచ్లో ఉన్న జాలర్ల కాలనీలో 51 ఇళ్లకు వెళ్లి వారి స్థితిగతులను తెలుసుకున్నారు. తర్వాత కిజక్కోట్ కరుణాకరన్ అనే జాలరి గుడిసెకు వెళ్లారు. అక్కడ రాహుల్కు చేపల కూర, ఇతర వంటకాలతో భోజనం పెట్టారు. తనకు అత్యంత రుచికరమైన చేపల కూరతో భోజనం పెట్టారని, ఈ వంటకాలను రుచి చూడ్డానికి మళ్లీ వస్తానని రాహుల్ తర్వాత జాలర్ల సభలో అన్నారు. -
మనమే నాయకత్వం వహించాలి!
పర్యావరణ పరిరక్షణకు ప్రధాని పిలుపు వాతావరణ మార్పుపై పోరులో కలసిరావడం లేదని పాశ్చాత్య దేశాలు విమర్శిస్తున్నాయి స్వచ్ఛమైన అణు విద్యుత్ ఉత్పత్తిలో సహకరించకుండా మనపై అభాండాలు వేస్తున్నారు న్యూఢిల్లీ: వాతావరణ మార్పు విషయంలో భారత్పై అభాండాలు వేస్తున్నారని అభివృద్ధి చెందిన దేశాలపై ప్రధాని నరేంద్రమోదీ ధ్వజమెత్తారు. పర్యావరణ పరిరక్షణ భారత దేశ సంప్రదాయంలోనే ఒక భాగమని తేల్చిచెప్పారు. ‘వాతావరణ మార్పు, భూ తాపోన్నతిపై పోరులో కలసి రావడం లేదంటూ ఒకవైపు భారత్పై అభాండాలు వేస్తున్నారు. మరోవైపు స్వచ్ఛమైన అణువిద్యుత్ ఉత్పత్తికి అవసరమైన ఇంధనాన్ని సమకూర్చమంటూ మనం చేస్తున్న విజ్ఞప్తులను మాత్రం పెడచెవిన పెడ్తున్నార’ంటూ సంపన్న దేశాల వైఖరిని మోదీ ఎండగట్టారు. స్వచ్ఛమైన ఇంధనాన్ని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేందుకు అవసరమైన పర్యావరణ అనుకూల అణు ఇంధనాన్ని దిగుమతి చేసుకునేందుకు అనుమతించాలని అంతర్జాతీయ అణు ఇంధన దేశాల కూటమికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాల పర్యావరణ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్న సదస్సునుద్దేశించి మోదీ సోమవారం ప్రసంగించారు. వాతావరణ మార్పుపై పోరుకు భారత్ కట్టుబడి ఉందన్న ప్రధాని.. భూతాపోన్నతి సమస్యకు పరిష్కారాలను కనుగొనడంలో భారత్ ప్రపంచానికి దారి చూపాలని, వాతావరణ మార్పుపై పోరుకు నేతృత్వం వహించాలని పిలుపునిచ్చారు. ‘ఇతరులు రూపొందించిన నిబంధనలను మనం బలవంతంగా పాటించడం కాదు. ఈ రంగంలో మనకు శతాబ్దాల వారసత్వ అనుభవం ఉంది. ఈ సమస్య పరిష్కారానికి మనమే ప్రపంచానికి మార్గం చూపగలం. నేతృత్వం వహించగలం’ అని అన్నారు. ‘ప్రపంచమంతా వాతావరణ మార్పుపై ఆందోళన చెందుతూ, ఆ సమస్యకు పరిష్కారాలను వెతికేందుకు కృషి చేస్తుంటే.. భారత్ మాత్రం ఆ కృషికి అడ్డంకులు సృష్టిస్తోందంటూ అంతా అనుకుంటున్నారు. కానీ ప్రకృతిని దైవంగా పూజించే, వాతావరణ పరిరక్షణను దైవకార్యంలా భావించే సంస్కృతి మనది’ అని స్పష్టం చేశారు. సగటు కర్బన ఉద్గారాలు భారత్లోనే అతితక్కువగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. భారత్లోని మెట్రో నగరాల్లో వాయు కాలుష్యం భారీగా ఉంటోందని, అత్యంత కాలుష్యపూరిత నగరాల్లో ఒకటిగా ఢిల్లీ ఉందని, అందువల్ల ఢిల్లీలోని అనేక ఎంబసీలు, విదేశీ సంస్థలు వాయు శుద్ధి పరికరాలను తమ కార్యాలయాల్లో ఏర్పాటు చేసుకుంటున్నాయంటూ పాశ్చాత్య దేశాలు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో మోదీ పై వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక వృద్ధి, పర్యావరణ పరిరక్షణ. కలసికట్టుగా ప్రగతిపథంలో ముందుకు సాగాలని మోదీ పేర్కొన్నారు. పౌర్ణమి రోజుల్లో ఇళ్లల్లో దీపాలార్పేయడం, వారానికి ఒకరోజైనా సైకిల్ వాడటం లాంటి చర్యలు చేపట్టాలని మోదీ సూచించారు. జీవనశైలి వల్లనే.. ప్రజల జీవన శైలిలో వస్తున్న మార్పుల వల్లనే పర్యావరణానికి హాని కలుగుతోందని మోదీ అన్నారు. ప్రజల్లో విపరీతంగా పెరిగిన వినియోగతత్వం పర్యావరణ సంక్షోభానికి ప్రధాన కారణమని, వినియోగం పెరుగుతున్న కొద్దీ ప్రకృతి నాశనమవుతూ ఉంటుందని అన్నారు. విపక్షాలు తప్పుదారి పట్టిస్తున్నాయి: భూసేకరణ బిల్లు పరిధిలో గిరిజన, అటవీ భూముల అంశాలు లేకున్నా విపక్షాలు ప్రజలను తప్పు దారి పట్టిస్తున్నాయని మోదీ ఆరోపించారు. దీని వల్ల దేశ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని అన్నారు. జాతీయ వాయు స్వచ్ఛత సూచీ ప్రారంభం దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వాయు స్వచ్ఛతను ఎప్పటికప్పుడు తెలిపేందుకు, కాలుష్య నివారణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఉద్దేశించిన జాతీయ వాయు స్వచ్ఛత సూచీ(ఎన్ఏక్యూఐ)ని సోమవారం మోదీ ప్రారంభించారు. ఎన్ఏక్యూఐలో భాగంగా ప్రస్తుతం ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఆగ్రా, కాన్పూర్, వారణాసి, లక్నో, అహ్మదాబాద్, ఫరీదాబాద్లలో వాయుస్వచ్ఛతను నిర్ధారిస్తారు. ఈ సూచీలో ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా ఒకే రంగు, ఒకే సంఖ్య, ఒకే వివరణ ఉంటుంది. ఎన్ఏక్యూఐని 22 రాష్ట్రాల రాజధానులు, 10 లక్షల కన్నా ఎక్కువ జనాభా ఉన్న 44 పట్టణాలకు కూడా దీన్ని విస్తరిస్తామని కేంద్ర పర్యావరణ శాఖ తెలిపింది. -
కాలుష్య కోరలకు కత్తెర !
సాక్షి, సిటీబ్యూరో: విశ్వనగరం దిశగా అడుగులేస్తున్న గ్రేటర్లో పర్యావరణ కాలుష్యం మోతాదు మించుతోన్న ప్రాంతాలపై ఇక నుంచి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) దృష్టి సారించనుంది. ప్రస్తుతం పటాన్చెరు-బొల్లారం పారిశ్రామిక క్లస్టర్ పరిధిలో పర్యావరణ కాలుష్యం అవధులు దాటుతుండడంతో గత కొన్నేళ్లుగా ఆయా ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణకు తీసుకున్న చర్యలు, వాయు, జల, ఘన, భూగర్భ కాలుష్యం నమోదవుతున్న తీరుతెన్నులపై రాష్ట్ర పీసీబీ రూపొందించిన నివేదికలను పరిశీలించడంతోపాటు నష్ట నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై తగు సలహాలు, సూచనలు అందజేస్తోంది. ఇక నుంచి ఈ జాబితాలో మరిన్ని ప్రాంతాలు చేరే అవకాశాలున్నట్లు తెలిసింది. ముఖ్యంగా కూకట్పల్లి, బాలానగర్, మియాపూర్, కాటేదాన్, జీడిమెట్ల తదితర ప్రాంతాల్లో నమోదవుతున్న వాయు, జల కాలుష్య నివేదికలను ప్రతి ఆరు నెలలకోమారు సీపీసీబీ నిపుణులు పరిశీలించనున్నారు. సీపీసీబీ పర్యవేక్షణ ఇలా... పరిశ్రమల కారణంగా అధిక కాలుష్యం నమోదవుతున్న ప్రాంతాల్లో జల, వాయు కాలుష్యంపై రాష్ట్ర పీసీబీ రూపొందించిన నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తాజాగా రాష్ట్ర పీసీబీకి సూచించినట్లు తెలిసింది. రాష్ట్ర సర్కారు నుంచి ఈ నివేదికలను స్వీకరించిన సీపీసీబీ నిపుణులు వివిధ కాలుష్య కారకాల మోతాదును మరోసారి ప్రైవేటు ల్యాబ్ల సౌజన్యంతో పరీక్షిస్తారు. ఆ తర్వాత కేంద్ర పర్యావరణ కాలుష్య సూచీ(సెపీ) ఆధారంగా కాలుష్య ఉద్గారాల తీవ్రతను లెక్కగడతారు. దీని ప్రకారం సూచి 55 పాయింట్లు దాటిన ప్రాంతాల్లో అధిక కాలుష్యం నమోదవుతున్న ప్రాంతాలుగా, సూచీ 70 దాటిన పక్షంలో అత్యధిక కాలుష్యం నమోదవుతున్న నమోదయ్యే ప్రాంతాలుగా గుర్తించి ప్రకటిస్తాయి. ఆయా ప్రాంతాల్లో పరిశ్రమలు కాలుష్య ఉద్గారాల కట్టడికి తీసుకున్న చర్యలు, జీరో లిక్విడ్ డిశ్ఛార్జీ(తక్కువ కాలుష్యం విడుదల)కు తీసుకోవాల్సిన చర్యలపై తగిన సలహాలు, సూచనలు సీపీసీబీ అందిస్తుంది. ఎంత మోతాదులో.. గతంలో పటాన్చెరు-బొల్లారం పారిశ్రామిక క్లస్టర్పరిధిలో సూచీ 70.07గా నమోదైనట్లు పీసీబీ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. మరోవైపు కూకట్పల్లి, బాలానగర్, మియాపూర్, కాటేదాన్, జీడిమెట్ల ప్రాంతాల్లోనూ సూచీ 55 పాయింట్లకు మించి నమోదయ్యేఅవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నామన్నాయి. తాజాగా రూపొందించే నివేదిక ఆధారంగా ఆయాప్రాంతాల్లో ఎంత మోతాదులో కాలుష్యం నమోదవుతుందో తెలుస్తుందని వెల్లడించాయి. త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించే అవకాశాలున్నాయని స్పష్టం చేశాయి. -
మైటీ గర్ల్
ఆడపిల్లంటే.. ఒక జన్మకు సరిపడా కష్టాలు, కన్నీళ్ల కలబోత. తరతరాలుగా కథలు, కవితలు, పాటలు... అన్నింటా అదే వ్యథ. ఇలా ఎన్నాళ్లు.. ఇంకెన్నాళ్లు?.. ఇండియాస్ డాటర్స్ మైటీ గాళ్స్గా మారాలంటోంది ‘ఎ మైటీ గాళ్’. ‘మన వీరోచిత ఇతివృత్తాలను రాసుకుందాం మనమే కథానాయికలమవుతూ! మన ఆడబిడ్డలకు ఆ కథల్నే చెబుదాం ఇకనుంచైనా!’ అంటూ ఎలుగెత్తుతోంది. ఇదీ ఆడపిల్లల కొత్త కథ ఇతివృత్తం!. ఇంతకీ ఎవరీ మైటీ గాళ్? ఆమె వెనుక ఎవరున్నారు?.. .:: శరాది అనగనగా ఆడపిల్ల.. కష్టాలన్నీ చుట్టుముడతాయి. కన్నీళ్లు దిగమింగుకుని.. దేవుడిపై భారం వేయడమో.. లేక తీర్చేవాళ్లెవరో ఉంటారు.. వస్తారనే భరోసాతో జీవితాన్ని వెళ్లదీయడమో చేస్తుంది. అంతేతప్ప తెగువ చూపించే స్వతంత్ర వ్యక్తిగా కనిపించదు... దేశకాలమాన పరిస్థితులకు అతీతంగా (ఆయా నేపథ్యాలకనుగుణంగా పాత్రల పేర్ల మార్పుతో) దాదాపు ప్రతి ఆడపిల్లా ఇలాంటి ‘బేల’ కథలనే వింటూ పెరుగుతుంది. ఇకపై అలాంటి కథలకు ఇక కాలం చెల్లింది. ‘above all, be the heroine in your life, not the victim' అని ఉద్బోధ చేయాలనుకుంటోంది ‘ఎ మైటీ గాళ్’. అసలు దీని కథేంటో తెలుసుకుందాం... ఇదీ నేపథ్యం.. కెరోలిన్ డాంకెర్ట్, ఆరన్ స్మిత్.. భార్యాభర్తలు. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ఓ స్వచ్ఛంద సంస్థలో పనిచేసేది కెరోలిన్. వాళ్ల అక్కచెల్లెళ్ల పిల్లల బర్త్డేలు వచ్చినప్పుడు ఆ పిల్లలకు గిఫ్ట్స్గా బుక్స్నివ్వడం ఆమెకు ఇష్టం, అలవాటు కూడా. ఓసారి ఒకమ్మాయి పుట్టినరోజుకి పుస్తకమివ్వాలని వెదుకుతున్నారు. ఎంతసేపూ అమ్మాయిలను బేలగా చూపించే కథల పుస్తకాలే తప్ప వాళ్ల శక్తియుక్తులను చూపించే ఒక్క పుస్తకమూ కనపడలేదు. పోనీ బయోగ్రఫీస్ చూద్దామన్నా.. అబ్రహంలింకన్, బెంజిమన్ ఫ్రాంక్లిన్, ఐన్స్టీన్, చాప్లిన్.. ఇవే తప్ప స్త్రీలకు సంబంధించినవి వేళ్లపై లెక్కపట్టగలిగినన్నే కనిపించాయి. సరే అప్పటికి ఆ అమ్మాయికి ఏదో పుస్తకం కొని కానుకగా ఇచ్చినా... ఆ జంట మనసులో మాత్రం ఆ వెలితి ఉండిపోయింది. సర్దుకుపోయే మనస్తత్వాన్ని చిత్రించే అమ్మాయి కథలే తప్ప ఓ సమస్యను పరిష్కరించుకునే, సాహసాన్ని ప్రదర్శించే కథలే లేవేంటి? అన్న ఆలోచన వాళ్లను తొలిచేసింది. మౌఖిక, లిఖిత సాహిత్యాల్లోనూ అదే లోటు. ఒక్క అమెరికాలోనే ఇలాంటి పరిస్థితి ఉందా? అనుకుని.. యూరప్, ఆఫ్రికా, ఆసియా ఖండాల సాహిత్యాన్నీ పరిశీలించారు. అక్కడా అంతే. ఏ దేశంలోనైనా స్త్రీల పరిస్థితి ఒకేరకంగా ఉండానికి గల కారణమూ అర్థమైంది. వ్యక్తిత్వ వికాసంలో సాహిత్యానిది ప్రధాన పాత్ర. సాహసాలు, పరిశోధనలు, ప్రతిభా పాటవాలను చూపించే భూమికలన్నీ మగవాళ్లవే. అలాకాక స్త్రీ కథానాయికగా.. అంటే ఓ సాహసనారిగా, చతురత కలిగిన మూర్తిగా, పరిశోధనా స్ఫూర్తిగా సాగిపోయే కథల అన్వేషణ మొదలుపెట్టి అలాంటి వాటన్నిటినీ పోగుచేసి ఓ వెబ్సైట్లో పెట్టాలనుకున్నారు. అలా కొన్ని నెలల శ్రమ తర్వాత ‘ఎ మైటీ గాళ్’ వచ్చింది. సంస్థగా, వెబ్సైట్గా, ఫేస్బుక్ పేజ్గా కూడా! కథానాయికల కథల కోసం.. దంపతులిద్దరూ ప్రపంచంలోని ప్రతి దేశానికి వెళ్లి.. అక్కడి పాఠశాలలను, కళాశాలలను, సాంస్కృతిక సంస్థలను, ప్రచురణ సంస్థలను సంప్రదించి, తాము చేస్తున్న పనిని వివరిస్తారు. ఆయా దేశాల్లో స్త్రీలను కథానాయికలుగా చూపించే కథలు ఏమున్నాయో తెలుసుకుంటారు. ఆడపిల్లలను హీరోయిగ్గా చూపించే పుస్తకాలనే కాక స్త్రీలు రాసిన పుస్తకాలనూ పోగు చేస్తున్నారు. పబ్లిషింగ్ హౌసెస్నూ కలుస్తున్నారు. ఇలా నాలుగేళ్లలో ప్రపంచవ్యాప్తంగా సేకరించిన రెండు వేల పైచిలుకు పుస్తకాలను తమ వెబ్సైట్లో ఉంచారు. భిన్న అభిరుచి ఉన్న వాళ్లు తమ ఆలోచనలను, అభిప్రాయాలను పంచుకోవడానికి, అలాంటి పుస్తకాలనూ షేర్ చేసుకోవడానికి బుక్ క్లబ్నూ నిర్వహిస్తోందీ సంస్థ. ప్రపంచంలోని అమ్మాయిలంతా ఇందులో లాగిన్ అయి సభ్యత్వం తీసుకోవచ్చు. ఎన్నెన్నో బుక్స్.. గైడ్స్ బయోగ్రఫీస్, యాక్షన్, అడ్వంచర్, క్లాసిక్స్, జానపద గాథలు, గ్రాఫిక్ నావల్స్, హాస్య ప్రధానమైనవి, మిస్టరీ, ఫిక్షన్, మల్టీకల్చరల్ ఫిక్షన్, సైన్స్ ఫిక్షన్, రియలిస్టిక్ ఫిక్షన్, పిక్చర్ బుక్స్ ఇలా రకరకాల పుస్తకాలుంటాయి. అంతేకాదు.. అమ్మాయికి సూచనలు, ఆరోగ్య సలహాలు, ఆత్మరక్షణ చిట్కాలు, ఎవరైనా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే మాటలు మాట్లాడుతున్నప్పుడు వాళ్లకి ఎలాంటి కౌంటర్లు ఇవ్వాలి, సమస్యలను డీల్ చేసే విధానాలతో ‘ఎ స్మార్ట్ గాళ్స్ గైడ్’ కూడా ఇందులో ఉంటుంది. అయితే ఎ మైటీ గాళ్లో కేవలం ఆడపిల్లలే కాకుండా అడల్ట్ విమెనూ చదువుకోదగ్గ పుస్తకాలూ ఉంటాయి. సినిమాలు, సంగీతం, బొమ్మలు.. ఒక్క పుస్తకాలే కాక, అమ్మాయిలకు సంబంధించిన సంగీతం, సినిమాలూ ఇందులో ఉంటాయి. ఎంతసేపూ వంటింటి పావులు, బొమ్మల పెళ్లి ఆటలాడి పెద్దయ్యాక పాత్రల్లో జీవించి అలసిపోకుండా కొత్త బొమ్మల్నీ పరిచయం చేస్తోందీ వెబ్సైట్. అమ్మాయిలు పర్వతారోహణ చేస్తున్నట్టు, సర్ఫింగ్, బంగీజంప్లు, వ్యోమగాములుగా, సైటింస్ట్లుగా ల్యాబ్స్లో, డాక్టర్స్గా.. ఇట్లాంటి బొమ్మలన్నీ ఇందులో ఉంటాయి. ఆడపిల్లలకు స్ఫూర్తినిచ్చేవిగా. మైటీ కాన్సెప్ట్తో సిటీకొచ్చాం! ప్రపంచమంతా తిరుగుతూ రెండు రోజుల కిందటే హైదరాబాద్ చేరుకున్నాం. అమెరికన్ కాన్సులేట్ సహకారంతో ఇక్కడున్న స్కూళ్లు, పబ్లిషింగ్ హౌసెస్తో భేటీ అయ్యాం. ఇక్కడి వ్యవస్థలో స్త్రీలకున్న స్థానాన్ని బట్టి చూస్తే ఎ మైటీ గాళ్ సేవల ఆవశ్యకత ఎక్కువే అనిపిస్తోంది. ఇక్కడున్న అక్షరాస్యత, పిల్లల డ్రాపవుట్స్, మిడిల్, లోయర్ మిడిల్ క్లాస్ తల్లిదండ్రుల్లో చాలామంది అక్షరాస్యులు కాకపోవడం ఎట్సెట్రా.. మాకు సవాళ్లే. అయినా మేం వెళ్లిన స్కూళ్లు మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నాయి. అసలు ఇండియా నుంచి మా వెబ్సైట్లో అప్లోడైన పుస్తకాలే మేం ఇక్కడికి రావడానికి ప్రేరణ. హైదరాబాద్ నుంచీ వచ్చాయి. పూర్ ఎకనామికల్ అండ్ సోషల్ బ్యాక్ గ్రౌండ్ నుంచి మలావత్ పూర్ణ అనే అమ్మాయి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన ప్రయత్నాన్ని, సాహసాన్ని కథగా పంపారు. రియల్లీ వండర్ఫుల్ స్టోరీ. తమిళనాడు, రాజస్థాన్లాంటి చోట్ల నుంచీ చాలా కథలు, బయోగ్రఫీస్ అప్లోడ్ అయ్యాయి. ఇవన్నీ మంచి బొమ్మలు, గ్రాఫిక్స్తో వస్తున్నాయి. మేం స్కూల్లో విద్యార్థినులకే కాక టీచర్స్కీ, పేరెంట్స్కీ ఇలాంటి స్టోరీస్ గురించి చెప్తాం. ఏ దేశంలోనైనా ఆడపిల్లలంటే కొంచెం అటుఇటుగా ఒకటే! కాబట్టి ఈ కథలు వాళ్లకు ఒక ఎడ్యుకేషన్. మైటీ కాన్సెప్ట్తో ఆడపిల్లల్లో స్వావలంబన, సాధికారత సాధించడమే మా లక్ష్యం. - కెరోలిన్ డాంకెర్ట్, ఆరన్ స్మిత్ -
చెట్లు నరకడమెందుకు..
సాక్షి, ముంబై: కుంభమేళా ఏర్పాట్ల కోసం ఏకంగా 2,400 చెట్లు నరికివేయాల్సిన అవసరం ఏమొచ్చిందని, పర్యావరణ నష్టాన్ని ఎలా పూడుస్తారని ముంబై హైకోర్టు నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్ఎంసీ) పరిపాలన విభాగాన్ని ప్రశ్నించింది. అందుకు సంబంధించిన స్పష్టమైన నివేదికను త్వరలో అందజేయాలని ఎన్ఎంసీని ఆదేశించింది. వచ్చే సంవత్సరం ఆగస్టులో నాసిక్లో కుంభమేళా జరగనుంది. ఈ ఉత్సవాలకు దేశం నలుమూలల నుంచి కోటికిపైగా భక్తజనం వస్తారని అంచనావేశారు. అందుకు రోడ్లను వెడల్పు చేయడం, ఇతర సదుపాయాలు కల్పించాలంటే అడ్డువస్తున్న చెట్లను నరికివేయాల్సి ఉంటుంది. ఒకవేళ చెట్లను తొలగించని పక్షంలో వచ్చే భక్తులకు పూర్తి సదుపాయాలు కల్పించం కష్టమని ఎన్ఎంసీ స్పష్టం చేసింది. దీంతో వాటిని నరికి వేయడానికి అనుమతివ్వాలని ఎన్ఎంసీ పరిపాలన విభాగం కోర్టుకు దరఖాస్తు చేసుకుంది. ఈ దరఖాస్తును పరిశీలించిన కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఓ ధార్మిక కార్యక్రమానికి వందేళ్ల పాత చెట్లు, ఇంత పెద్ద సంఖ్యలో తొలగించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది. దీనిపై సమగ్ర నివేదిక అందజేయాలని కోర్టు స్పష్టం చేసింది. పర్యావరణాన్ని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరికి ఉందని, కాని ఎన్ఎంసీ కార్పొరేషన్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని కోర్టు వ్యాఖ్యానించింది. చెట్లు నరికివేయడం వల్ల పర్యావరణానికి జరిగే నష్టాన్ని ఎలా పూడుస్తారో ముందు తేల్చాలని కోర్టు కోరింది. అదేవిధంగా కుంభమేళా జరిగే పరిసరా ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు ఎన్ని ఉన్నాయో వాటి వివరాలు అందజేయాలని ఆదేశించింది. ఇదిలాఉండగా కుంభమేళాకు అవసరమయ్యే నిధుల మంజూరు విషయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య ఇంతవరకు రాజీ కుదరలేదు. త్వరగా నిధులు అందజేస్తే ఏర్పాట్లు, ఇతర పనులు ప్రారంభిస్తామని ఇదివరకే ఎన్ఎంసీ విజ్ఞప్తి చేసింది. కాని ఎవరి వాటా ఎంతో తేలకపోవడంతో నిధులు ఇంతవరకు పంపిణీ కాలేదు. -
జిల్లాపై కాలుష్య రాకాసి
* విష వాయువులు, పదార్థాలు ఉత్పత్తి చేస్తున్న పరిశ్రమలు * విజృంభిస్తున్న ధ్వని, వాయు, నీటి కాలుష్యాలు * క్యాన్సర్ వంటి ప్రమాదకర రోగాల వ్యాప్తి మంచి ఆరోగ్యానికి ఏం కావాలి? స్వచ్ఛమైన నీరు, గాలి, వాతావరణం పక్షపాతం లేకుండా ప్రకృతి అందరికీ వీటిని ఇస్తుంది .. అయితే ఇవి కూడా కాలుష్యమైపోతే గాలిలో విషవాయువులు వాతావరణంలో బీభత్స ధ్వనులు నీటిలో కాలుష్య కారకాలుంటే.. ప్రజలు ఏమై పోవాలి? వేరే గ్రహాలకు వెళ్లాలా? ఇలాగే జబ్బులతో కాలం వెళ్లదీయాలా? దీనిపై పాలకులకు చిత్తశుద్ధి లేదా? పరిశ్రమలపై కొరడా ఝళిపించలేదా? ... ... ... ఒక్క నిమిషం.. ప్రజలారా పర్యావరణ పరిరక్షణలో మీకు భాగస్వామ్యం లేదా? ఈ భూమి మీది కాదా? చెట్లను పరిరక్షించడం మీ చేతుల్లో లేదా? ఒక్కసారి ఆలోచించండి.. చేయి, చేయి కలపండి ప్రకృతిని కాపాడండి.. కాలుష్య కోరలు విరవండి సేవ్ ఎర్త.. సేవ్ పీపుల్.. సేవ్.. ఎన్విరాన్మెంట్! కర్మాగారాల సమీపాలు ఇలా ఉండాలి.. ఏ పారిశ్రామిక వాడలో గమనించినా రణగొణ ధ్వనులు కార్మికుల కంటిమీద కునుకు లేకుండా చేస్తాయి. దీనిని నివారించాలంటే ధ్వని నియంత్రణ మాపనులను యాజమాన్యాలు కచ్చితంగా వాడాలి. కార్మికులకు కూడా అలాంటి పరికరాలు సమకూర్చాలి. నిత్యం పరిశ్రమల్లో పని చేసి వచ్చిన కార్మికులకు మనశ్శాంతి కలిగించడం కోసం వారు ఉండే ప్రదేశాల్లో పచ్చని పార్కులు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చూడాలి. దీనివల్ల అపస్మారక స్థితికి వెళ్లినవారు కూడా తిరిగి యథాస్థితికి వచ్చే అవకాశం ఉంటుంది. ధూళి మేఘాలు కమ్మేస్తున్నాయ్ చీమకుర్తి, బల్లికురవలోని గ్రానైట్ గనులతో పాటు మార్కాపురం పలకల గనుల్లో పనిచేసే కార్మికులకు ఎలాంటి సౌకర్యాలు లేవు. నిబంధనల ప్రకారం ఇక్కడ మెటల్ రోడ్లే ఉండాలి. వాటిపై క్రమం తప్పకుండా నీరు చల్లుతూ దుమ్ముధూళి లేవకుండా యాజమాన్యాలు చర్యలు చేపట్టాలి. ఇది జరగకపోగా చిప్స్.. ఇసుక.. ఇతర పదార్థాలు తరలించేటప్పుడు ధూళి మేఘాల్లా లేస్తూ వాహన దారులను మింగేస్తోంది. దుమ్ము కళ్లల్లో పడిన సందర్భాల్లో చాలామంది ప్రమాదాలబారినపడుతున్నారు. ఇటుక బట్టీలు విషవాయువులు వెదజల్లుతున్నాయి. దీని దెబ్బకు జనం అనారోగ్యం పాలవుతున్నారు. గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లు కాలుష్య నివారణ సంస్థ.. పరిశ్రమలను మూడు రకాలుగా వర్గీకరించింది. అవి గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లు. మారిన నిబంధనల ప్రకారం స్టోన్ క్రషర్స్, గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లను కూడా ‘రెడ్’ కిందకు తీసుకువచ్చారు. పర్యావరణానికి హాని కలిగించని వాటిని గ్రీన్ కిందకు.. కాస్త ప్రమాదకరంగా ఉన్నవాటిని ఆరెంజ్గా.. అత్యంత ప్రమాదంగా ఉండే పరిశ్రమలను రెడ్ జోన్లుగా వర్గీకరిస్తారు. జిల్లాలో 300 పైగా పరిశ్రమలున్నాయి. అయితే అందులో పది పరిశ్రమలు కూడా గ్రీన్ జాబితాలో లేవు. 80 వరకు ఆరెంజ్ జాబితాలో ఉండగా..మిగిలిన 210 పైగా పరిశ్రమలు రెడ్ జాబితాలో ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరి ఎంతమంది రెడ్ జోన్ కింద ప్రమాదకర రీతిలో ఉపాధి పొందుతున్నారో ఆలోచించాల్సిన అవసరం ప్రభుత్వానిదే! గాలి కాలుష్య పరిధి ఇదే * గాలిలోని విష పదార్థాల వల్ల వస్తాయి ఈ వ్యాధులు * రేణువులు: శ్వాసకోశ సంబంధిత వ్యాధులు * సల్ఫర్ డైఆక్సైడ్: బ్రాంకైటీస్కు కారణం * నైట్రోజన్ డైఆక్సైడ్: కళ్లు, ముక్కు మండడం, శ్వాశ పీల్చడంలో తీవ్ర చికాకు * కార్బన్ మోనాక్సైడ్: శరీర జీవకణాలకు ఆక్సిజన్ లేకుండా చేస్తుంది. అపస్మారక స్థితి కలుగుతుంది. 100 పీపీఎం దాటితే మరణానికి దారితీస్తుంది * హైడ్రోకార్బన్లు: కేంద్ర నరాల వ్యవస్థకు నష్టం * అమ్మోనియా: శ్వాసకోశ భాగాలన్నింటినీ ఇబ్బంది పెడుతుంది. కళ్లు తీవ్రంగా మండుతాయి. * క్లోరిన్: ఊపిరితిత్తులతో పాటు కళ్లు మంట * హైడ్రోజన్ సల్ఫైడ్: శ్వాసకోశాలకు పక్షపాతం. తక్షణమే మూర్ఛ పోతారు * ఆస్బెస్టాస్: ఊపిరితిత్తుల క్యాన్సర్ కారకం * సీసం(లెడ్): మెదడు పాడైపోవడం, కండరాల పక్షవాతం సంభవిస్తాయి శబ్ద కాలుష్యానికి హద్దులు ధ్వని కలిగిస్తుందీ చేటు * విపరీత శబ్దాలు ఉండే ధ్వనుల వల్ల గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. ఫలితంగా రక్తపోటు వస్తుంది * 65 డెసిబుళ్ల చప్పుడు మీరితే గుండె జబ్బులతో పాటు చెవుడు కూడా రావొచ్చు * అధిక ధ్వని వల్ల పనిచేసే శక్తిని కోల్పోతాం. నిద్రపట్టదు. తలనొప్పి, అలసట ఎక్కువవుతాయి * ఎక్కువైతే మానోవేదన కూడా కలుగుతుంది. దుష్పరిమాణాలు రాకుండా ఉండాలంటే ధ్వనులకు దూరంగా ఉండాలి. సచ్ఛమైన నీరు ఉండాలిలా నీరు కాలుష్యమైతే జీవితం అంతే! * చెరువుల్లో ఆక్సిజన్ అందక చేపలు చనిపోతాయి * తాగడానికి, స్నానానికి , పరిశ్రమల్లో వినియోగించేందుకు, ఈత కొట్టేందుకు సైతం పనికిరావు * ఇలాంటి నీటిని తాగితే న్యూమోనియా, టైఫాయిడ్, కామెర్లు, విరేచనాలు, కోరింతదగ్గు, జలుబు, పోలియో కూడా రావొచ్చు * సల్ఫేట్లు, ఫ్లోరైడ్లు, కాల్షియం, మెగ్నీషియం మిశ్రమ పదార్థాలు అధికంగా ఉంటే నీటిని ఆవిరి చేస్తాయి. ఉప్పు శాతం ఎక్కువవడం వల్ల సబ్బు అధికంగా వినియోగించాలి. నిల్వ చేస్తే తెల్లని తెట్టు ఏర్పడుతుంది. * రసాయనాలు మితి మీరితే జీవులు, జీవకణాలు కదలకుండా ఆపుతాయి లేదా చచ్చిపోతాయి. (హెవీ మెటల్స్, ఆమ్లాలు, ఆల్కీన్లు, ఫినాయిల్, సైనైడ్లు, చీడపీడ మందులు మొదలైనవి) * ఫినాయిల్, క్లోరో ఫినాయిల్, పారాఫిన్ హైడ్రోకార్బన్ల వల్ల నీటి రుచి, వాసనలు మారిపోతాయి. తాగేందుకు పనికిరావు. * డిటర్జెంట్లు, సబ్బు నురగలు, జీవజాలాన్ని చంపేస్తాయి. పంటలకి, పశువులకు ప్రమాదం వాటిల్లుతుంది. * బెరీలియం, సెలీనియం, క్యాడ్మియం, ఆర్థోఫాస్పరస్ చీడల మందులు, పీవీసీ , రేడియో యాక్టివ్ న్యూక్లయిడ్లు క్యాన్సర్కి దారితీస్తాయి. * చెత్తా చెదారం , ఇటుక రాళ్లు.. తనంత తాను నీరు శుభ్రం చేసుకోగల శక్తిని తగ్గిస్తాయి. * థర్మల్ కాలుష్యంలో మండే మంటల వల్ల ఆక్సిజను తగ్గుతుంది. వేడి పెరిగి ఎన్నో పదార్థాల్లో విషం పెరుగుతుంది. 40 డిగ్రీల సెంటీగ్రేడుకు మించిన వేడివల్ల చేపలు వలసపోతాయి లేదా చచ్చిపోతాయి. చెట్లను నరకడం శాపం కలప, వంట చెరకుతో పాటు హైవే విస్తరణ కోసం చెట్లను విపరీతంగా నరికేస్తున్నారు. దీనివల్ల కార్బన్డయాక్సైడ్ శాతం పెరిగిపోతోంది. ఆక్సిజన్ తగ్గిపోతోంది. అటవీసంపదను నరికివేయకుండా అటవీ సంరక్షణ చట్టాలను కఠినతరం చేస్తూ పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా పరిస్థితి ఇంకా మెరుగు పడాల్సి ఉంది. పొల్యూషన్ ‘నో చెక్’ ఒంగోలు నగరంలో పెరిగిన వాహనాల వల్ల ధ్వని, వాయు కాలుష్యాలు విపరీతమయ్యాయి. ఇరుకు రోడ్లు, సరైన ప్రణాళిక లేకపోవడంతో వాహనాలు ప్రతి చోటా ఆగాల్సి వస్తోంది. దీనివల్ల కార్బన్ మోనాక్సైడ్ శాతం పెరిగిపోతోంది. 5 సంవత్సరాలకు మించి వాహనాలను వాడకూడదనే చట్టం ఉంది. పొల్యూషన్ చెక్ క్రమం తప్పకుండా చేయించుకోవాలి. కానీ ఈ ఏర్పాట్లు అప్పుడప్పుడూ హైవేలపైనే కనిపిస్తున్నాయి. కాలం చెల్లిన వాహనాలను వాడకుండా నియంత్రించడంలేదు. పెట్రోలు, డీజిల్ కల్తీ వల్ల కూడా కాలుష్యం పెరిగిపోతుంది. ట్రాఫిక్ జామ్ అయితే వాహనల హారన్ల శబ్దాన్ని భరించే పరిస్థితి ఉండదు. అక్కడ ఆస్పత్రులు ఉంటే రోగుల పరిస్థితి అంతే! ఆ ఫ్యాక్టరీలు పర్యావరణ విఘాతాలు ఒంగోలు సమీపంలో ఓ కెమికల్ ఫ్యాక్టరీ ఉంది. ఇక్కడ నుంచి సంబంధిత వ్యర్థాలను హైదరాబాదు సమీపంలోని మెయిన్ ఫ్యాక్టరీ వద్దకు తరలించేం దుకు రెండేళ్ల క్రితం యాజమాన్యం చర్యలు తీసుకుంది. అయితేఅవి వెళ్లేంతవరకు ఆ మార్గంలో ఉన్న ప్రజలు వాసన దెబ్బకు వాంతులు చేసుకున్నారు. ఇక ఈ ఫ్యాక్టరీ సమీపంలో ఉండేవారు కెమికల్స్ ఘాటుకు జనం బిత్తర పోతున్నారు. కానీ నివారణ చర్యలు మాత్రం కనిపించవు. అలాగే నెల్లూరు- ఒంగోలు మార్గమధ్యంలో రైల్వే ట్రాక్ మార్గంలో మరో ఫ్యాక్టరీ ఉంది. ఇక్కడకు వెళ్లగానే దానిలో నుంచి వచ్చే దుర్వాసన పేగులను కూడా తోడేసేలా ఉంటుంది శ్వాస తీసుకోవడానికి సైతం ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కాలుష్యాన్ని నివారించేందుకు సంబంధిత శాఖ జిల్లాలో లేకపోవడం కూడా సమస్యగా మారింది. అందుకే యాజమాన్యాలు ఇష్టానుసారం ప్రవర్తిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలాగాటం ఆడుతున్నాయి. -
జీవ వైవిధ్యాన్ని కాపాడే.. వైల్డ్లైఫ్ ఎక్స్పర్ట్
భూమిపై మనిషి క్షేమంగా మనుగడ సాగించాలంటే.. చుట్టూ ఉన్న జీవజాలం భద్రంగా ఉండాలి. అవి నశిస్తే మానవ జాతి ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది. భూగోళంపై అన్ని జీవులు ఒకదానిపై ఒకటి ఆధారపడి జీవిస్తుంటాయి. ఇది ఒక గొలుసుకట్టు చర్య. ఒక చోట తెగిపోతే తలెత్తే పరిణామాలు భయంకరంగా ఉంటాయి. విలువైన అటవీ సంపదను, జీవ వైవిధ్యాన్ని కాపాడేవారే వైల్డ్లైఫ్ ఎక్స్పర్ట్స్. పర్యావరణ పరిరక్షణకు ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత పెరుగుతుండడంతో ఇలాంటి నిపుణులకు డిమాండ్ అధికమవుతోంది. ప్రభుత్వ, కార్పొరేట్ రంగాల్లో అవకాశాలు వైల్డ్లైఫ్ నిపుణులు అటవీ సంపదను, ప్రకృతిలోని అన్నిరకాల పశుపక్ష్యాదులను, జంతువులను, వృక్షాలను కాపాడాల్సి ఉంటుంది. వీరికి ప్రధానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అటవీ శాఖల్లో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల్లోనూ ఉపాధి అవకాశాలు దక్కుతున్నాయి. కన్సల్టెంట్గా కూడా సేవలందించొచ్చు.అంతేకాకుండా తగిన ఆసక్తి ఉంటే విద్యాసంస్థల్లో ఫారెస్ట్రీ కోర్సులను బోధించే ఫ్యాకల్టీగా చేరొచ్చు. వైల్డ్లైఫ్ నిపుణులకు ప్రభుత్వ, కార్పొరేట్ రంగాల్లో అధిక వేతనాలుంటాయి. సవాళ్లను ఇష్టపడేవారు ఇందులోకి నిరభ్యంతరంగా ప్రవేశించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కావాల్సిన నైపుణ్యాలు: వైల్డ్లైఫ్ నిపుణులకు ప్రకృతిపై ఆసక్తి ఉండాలి. జీవజాలాన్ని, పచ్చటి అరణ్యాలను అభిమానించే గుణం ఉండాలి. శాస్త్రీయ దృక్పథం అవసరం. మెరుగైన కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు తప్పనిసరి. వేగంగా నిర్ణయాలు తీసుకొనే నేర్పు కావాలి. ఈ రంగంలో ఎక్కువగా క్షేత్రస్థాయిలో పనిచేయాల్సి ఉంటుంది. తరచుగా ప్రయాణాలు ఉంటాయి. అవసరాన్ని బట్టి అడవుల్లో రోజుల తరబడి ఉండాల్సి వస్తుంది. కాబట్టి అందుకు తగ్గట్లుగా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అడవుల్లో ఫారెస్ట్ మాఫియా, స్మగ్లర్లు దాడులు చేసే అవకాశం ఉంటుంది. వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధపడాలి. వైల్డ్లైఫ్ నిపుణులుగా మారితే జీవరాశులను, ప్రకృతిని కాపాడుతున్నామన్న ఆత్మసంతృప్తి లభిస్తుంది. అర్హతలు: మనదేశంలో ఫారెస్ట్ మేనేజ్మెంట్లో డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులు ఉన్నాయి. సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్లో ఉత్తీర్ణులైనవారు ఈ కోర్సుల్లో చేరొచ్చు. వేతనాలు: ప్రభుత్వ రంగంలో అటవీ శాఖలో వైల్డ్లైఫ్ నిపుణులకు, ఫారెస్ట్ అధికారులకు ఆకర్షణీయమైన వేతనాలు ఉంటాయి. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్కు నెలకు రూ.75 వేల నుంచి రూ.80 వేలు, అడిషనల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్కు రూ.35 వేల నుంచి రూ.60 వేలు, డిప్యూటీ కన్జర్వేటర్కు నెలకు రూ.20 వేల నుంచి రూ.35 వేల వేతనం లభిస్తుంది. కిందిస్థాయి సిబ్బందికి, గార్డులకు ప్రారంభంలో నెలకు రూ.20 వేల వేతనం అందుతుంది. కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్-భోపాల్ వెబ్సైట్: www.iifm.org ఇన్స్టిట్యూట్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ-హైదరాబాద్ వెబ్సైట్: http://frc.icfre.gov.in అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ వెబ్సైట్: www.amu.ac.in డాక్టర్ వైఎస్ పార్మర్ యూనివర్సిటీ ఆఫ్ హార్టికల్చర్ అండ్ ఫారెస్ట్రీa వెబ్సైట్: www.yspuniversity.ac.in పోస్టు గ్రాడ్యుయేట్ స్కూల్, ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్-న్యూఢిల్లీ వెబ్సైట్: www.iari.res.in ఆసక్తి, అభిరుచి ఉండాలి! ‘‘పర్యావరణం, వన్యప్రాణులపై ఆసక్తి, అభిరుచి ఉన్నవారు వైల్డ్లైఫ్ ఎక్స్పర్ట్గా కెరీర్ను ప్రారంభించొచ్చు. డిగ్రీ పూర్తిచేసిన తర్వాత మాస్టర్స్ స్థాయిలో వైల్డ్లైఫ్ కోర్సులు అం దుబాటులో ఉన్నాయి. భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా-డెహ్రాడూన్ ఈ కోర్సులను ఆఫర్ చేస్తోంది. దేశంలో ఇతర విద్యాసంస్థలు కూడా పలు డిప్లొమా కోర్సులను అందిస్తున్నాయి. ప్రభుత్వం వన్యప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యతనిస్తుండడంతో వైల్డ్లైఫ్ నిపుణులకు అవకాశాలకు కొదవ లేదు. సైన్స్ విద్యార్థులు ముఖ్యంగా వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం విద్యార్థులు ఈ రంగంలో సులభంగా రాణిస్తారు. దేశంలోని పలు జంతు ప్రదర్శనశాలలు, ఫారెస్ట్ మేనేజ్మెంట్ విద్యా సంస్థలతోపాటు అంతర్జాతీయ సంస్థల్లోనూ వైల్డ్లైఫ్ నిపుణులకు అవకాశాలున్నాయి. వైల్డ్లైఫ్ శాస్త్రవేత్తలుగా సైతం కెరీర్లో స్థిరపడొచ్చు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్ఎస్) పరీక్షలో అర్హత సాధించి ఉన్నత సర్వీస్లో చేరొచ్చు’’ - డా. ఎం.ఆర్.జి.రెడ్డి, ఐఎఫ్ఎస్, డెరైక్టర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ, హైదరాబాద్ -
బిగ్ గ్రీన్ గణేషా
వినాయక చవితి సందర్భంగా బిగ్ ఎఫ్ఎం ఈ ఏడాది సైతం ‘గ్రీన్ గణేశ’ కార్యక్రమం చేపడుతోంది. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో 2008 నుంచి వినాయక చవితి సందర్భంగా ఏటా ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా పద్నాలుగు ప్రధాన నగరాల్లో పాత న్యూస్పేపర్లను సేకరించి, వాటిని ప్రముఖ శిల్పులకు అందజేస్తోంది. పాత న్యూస్పేపర్లతో వారు ఆకర్షణీయమైన వినాయక విగ్రహాలను తయారు చేస్తారు. హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, గోవా, షోలాపూర్, ఇండోర్, భోపాల్, గ్వాలియర్, సూరత్, బరోడా, మైసూరు, తిరుపతి, విశాఖపట్నం, మంగళూరు నగరాల్లో వినాయక విగ్రహాల తయారీ కోసం టన్నుల కొద్దీ పాత న్యూస్పేపర్లను ఇప్పటికే సేకరించారు. పర్యావరణ అనుకూలమైన ఈ కార్యక్రమానికి గుర్తింపుగా బిగ్ ఎఫ్ఎంకు 2012లో ఇండియా రేడియో ఫోరం అవార్డు కూడా లభించింది. -
ప్లాస్టిక్ను నిషేధించాలి
ఎమ్మిగనూరు టౌన్ : ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాలంటూ బుధవారం ప్రజారోగ్యశాఖ ఆధ్వర్యంలో కస్తూరి కాన్సెప్ట్ స్కూల్, బాలికల హైస్కూల్ విద్యార్ధినీ, విద్యార్థులు పురవీధుల గూండా ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లితుందని, పర్యావరణ పరిరక్షణ నిమిత్తం ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ను బహిష్కరించాలని నినదించారు. అనంతరం సోమప్ప సర్కిల్ వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. ఆగస్ట్ 15వ తేదీ నాటికి ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి ప్రతి ఒక్కరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ప్రజారోగ్యశాఖ అధికారులు, సిబ్బంది లక్ష్మీనారాయణ, బసిరెడ్డి, సూర్యనారాయణ, బందెనవాజ్, మెప్మా ప్రాజెక్ట్ ఆఫీసర్ ప్రమీలారాణి, పట్టణ సమైక్య కార్యదర్శి హేమలత, విద్యార్థినీ, విద్యార్థులు, పొదుపు మహిళలు, పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
వానొస్తేనే వనమహోత్సవం!
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రతీ నియోజకవర్గానికి 40 లక్షలు, గ్రామానికి 33వేలు.. ఏటా 3.30 కోట్ల మొక్కలు నాటాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం. వచ్చే మూడేళ్లలో తెలంగాణ రాష్ట్రం హరితవనం కావాలన్నది ఆయన కల. దీనికోసం పదికోట్ల మొక్కలు నాటి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్ని పచ్చటి వనంలా మార్చాలని అధికారులను ఆదేశించారు. అయితే పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం చేపట్టిన ‘వనమహోత్సవానికి’ వరుణుడు కరుణించడంలేదు. ఏటా జూలై మొదటివారంలో నిర్వహించాల్సిన వనమహోత్సం.. వర్షాలు కురవకఆలస్యమవుతోంది. ఈ సంవత్సరం వనమహోత్సవానికి ఇబ్రహీంపట్నం రేంజ్లోని బొంగ్లూర్ అటవీ ప్రాంతం వేదిక కానుంది. పనులు పూర్తి చేసుకుని వాన రాకకోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరుసగా మన జిల్లాలోనే.. వనమహోత్సంలో భాగంగా ప్రభుత్వం ప్రారంభించే మొక్కలు నాటే సామూహిక కార్యక్రమం వరుసగా మన జిల్లాలోనే నిర్వహిస్తున్నారు. గత ఏడాది మేడ్చల్ మండలం కండ్లకోయ వద్ద, అంతకుముందు సంవత్సరం మహేశ్వరం మండలం తుమ్మలూరు అటవీ ప్రాంతంలో వనమహోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సంవత్సరం ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోని బొంగ్లూర్ అటవీ ప్రాంతంలో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 6 హెక్టార్ల విస్తీర్ణంలో 6,060 మొక్కలను నాటే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆయన చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. కానీ ఈ కార్యక్రమం జరగాలంటే భారీస్థాయి వర్షం అవసరం. ఇప్పటివరకు ఇబ్రహీంపట్నం ప్రాంతంలో మోస్తరు వర్షాలు తప్ప భారీ వర్షం కురవలేదు. దీంతో వనమహోత్సవం తేదీ ఖరారు కాలేదు. సీఎం కార్యక్రమానికి అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 6 హెక్టార్ల విస్తీర్ణంలో భూమిని దుక్కి చేసి మొక్కలు నాటేందుకు గుంతలు తీస్తున్నారు. అటవీశాఖ అధికారుల పర్యవేక్షణలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆగస్టు మూడో వారంలో..? సరిపడా వర్షాలు కురవక పోవడంతో కార్యక్రమ నిర్వహణకు ఆలస్యమవుతోంది. గత రెండ్రోజులుగా ముసురు పడుతుండడం.. మరో రెండు మూడు రోజుల్లో భారీ వర్ష సూచనకు అవకాశం ఉండటంతో త్వరలోనే తేదీ ఖరారయ్యే అవకాశాలున్నాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆగస్టు మూడో వారంలో వనమహోత్సవ కార్యక్రమం జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవేళ భారీ వర్షం కురిస్తే ఈ కార్యక్రమాన్ని అంతకుముందుగానే పూర్తి చేయించే పరిస్థితులూ లేకపోలేదు. దీనికి వర్షమే ఆధారం కావడంతో ఎదురుచూపులు తప్పడం లేదు. -
దయగల హృదయమేదయా?
పద్యానవనం: ఫలములిచ్చెడు పాదపప్రతతి గనియు పాలు గురిసెడు గోసమూహాల గనియు కరిగి వర్షించు నీలిమేఘాల గనియు కనికరము నేర్చుకొనని ముష్కరుడు నరుడు సకల జీవుల్లో మనిషి ఉత్కృష్టమైన ప్రాణి అంటారు. మేధస్సు కలిగి ఆలోచనతో నడుచుకునే జీవి మనిషి. కానీ, ఇతర జీవుల పట్ల, జీవవైవిధ్యం పట్ల, ప్రకృతి సమతుల్యత పట్ల, మొత్తానికి ప్రకృతి పట్ల స్పృహ నానాటికి సన్నగిల్లుతోంది. ప్రకృతిని కాపాడుకోవాలని, అలక్ష్యం చేస్తే భవిష్యత్తరాల మనుగడ ప్రశ్నార్థకమౌతుందన్న మౌలికాంశాన్నే మనిషి విస్మరిస్తున్నాడు. ప్రకృతికి తద్వారా మొత్తం భూమండలానికే ముంచుకు వస్తున్న ముప్పు పట్ల, సమాజహితంలో ఆలోచించే వారు, పర్యావరణ ప్రేమికులు ఇటీవలి రెండు సందర్భాల్లో తమ ఆందోళనల్ని వ్యక్తం చేశారు. ఏప్రిల్ 22న ధరిత్రీ దినం, రెండోది జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినం సందర్భంగా ఈ ఆందోళనలు వ్యక్తమయ్యాయి. మనిషి పాత్ర-ప్రమేయం వల్లే ప్రకృతి సమతుల్యత చెడి ఈ ధరిత్రికి ప్రమాదమేర్పడుతోంది. దీనికి విరుగుడుగా... ఏదో చేయాలి! పూని ఏదో ఒకటి చేయకుంటే, ప్రమాదం అత్యంత వేగంగా ముంచుకు వస్తోందన్నది ఆందరూ అంగీకరించే సత్యం. ప్రపంచమంతా కూడబలుక్కొని ఏదేదో చేసేయడం ఉన్నపళంగా సాధ్యపడదు. దేశాలు దేశాలుగా శ్రద్ధ వహించి కృషి చేయాలి. అంతకు మించి, ఎవరికి వారు, తమ తమ స్థాయిలో చేయగలిగినంత మేరకు పర్యావరణ పరిరక్షణకు దోహదపడే చిన్న చిన్న చర్యలతోనైనా చొరవ చూపాలన్నది ఐక్యరాజ్య సమితి పిలుపు. ఇటువంటి పూనికకు ముందు, ప్రతి మనిషిలో ఎంతో కొంత కనికరం, దయ, అనుకంప అనేవి ఉండాలి, ఉండి తీరాలనేది ప్రకృతి సూత్రం. కానీ, ఎందుకో మనిషి రోజు రోజుకు కనికరం నశించి కటువుగా తయారవుతున్నాడు. పరిస్థితుల ప్రాబల్యమా? మనిషి మనిషికి మధ్య అంతరం పెరిగి మానవత్వం మృగ్యమవడమా? కష్టపడకుండా అవకాశాలు లభించని ఈ సంక్లిష్ట వ్యవస్థలో, శ్రమపడకుండా అవతలి వాళ్ల అవకాశాల్ని తానే తన్నుకుపోవాలనే దుర్బుద్ధా? అన్నీ తనకే కావాలనే అవధులు మించిన స్వార్థమా? కారణమేదైనా కావచ్చు, మనిషనేవాడు మాత్రం కనుమరుగవుతున్నాడు. మానవేతిహాసం మొదలయిన్నుంచి మనిషి తనకన్నా పూర్వం నుండి ఉన్న వాటిని అనుసరిస్తూనో, అనుకరిస్తూనో (మ్యుటేషన్ ఆర్ ఇమిటేషన్) ముందుకు సాగుతున్నాడు. ఎడనెడ తన సృజనతో కొత్త కొత్త విషయాల్ని కనుగొంటూ సాధించే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని జత చేస్తూ పురోగమిస్తున్నాడు. అంతిమ లక్ష్యం ఆనందం పొందడం. సర్వేజనాః సుఖినోభవంతు! మరి, మంచి నేర్చుకోవడానికి, తనలో అప్పటికే ఉన్న మంచిని కాపాడుకోడానికి ఉన్న అవరోధమేంటో అర్థం కాదు. పారశీక తాత్వికుడు, కవి ఉమర్ ఖయ్యామ్ను తెనుగించిన కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి ఈ పద్యంలో అదే చెబుతున్నాడు. రాయితో కొట్టేవాడికి కూడా తియ్యటి ఫలాలనిచ్చే చెట్టు నుంచి స్ఫూర్తి పొందవచ్చు. తన బిడ్డకు అవసరమయ్యే ఆహారంకన్నా ఎన్నోరెట్లు అధికంగా పాల రూపంలో సంపూర్ణ ఆహారాన్ని మానవ మనుగడ కోసం అందిస్తున్న గోమాత నుంచీ అటువంటి స్ఫూర్తి లభిస్తూనే ఉంది. తాము నిలువెల్లా కరిగిపోతూ కూడా నిరతం వర్షించి నేలను సశ్యశ్యామలం చేసే నీలి మేఘాలూ స్ఫూర్తి దాతలే! ఇవన్నీ చూస్తూ కూడా, అవిచ్చే ఫలాలు అనుభవిస్తూ కూడా మనిషి కనికరం, దయ, అనుకంప నేర్చుకోడు. అలా నేర్వనివాడు నరుడు కాడు ముష్కరుడన్నది పెద్దల భావన. కృష్ణుడు ఉజ్జయినిలో సాందీపుని వద్ద విద్యాభ్యాసం చేసేటప్పటి బాల్యమిత్రుడు సుధాముడు. తర్వాత ఆయన తన స్వస్థలం మధురలో ఉంటాడు. చాలా సంవత్సరాల తర్వాత... తొలిసారి కృష్ణుడు మధురకు వస్తున్నాడని తెలిసి సంబరపడిపోతాడాయన. కానీ, పేదవాడైన తాను మితృడికేమివ్వగలనని మధనపడి, కడకు తనకు చేతనైన విద్య, వృత్తి, ప్రవృత్తి మాలలల్లడమే కనుక, ఓ మంచి దండ తయారు చేస్తాడు. అది వేయగానే పులకించిపోయిన కృష్ణుడు ఏదైనా కోరుకొమ్మని మిత్రుడినడుగుతాడు. అప్పుడు సుధాముడు, ‘‘నీపాద కమల సేవయు, నీపాదార్చకులతోడి నెయ్యము, నితాంతాపార భూతదయయును, తాపస మందార నాకు దయజేయగదే!’’ అంటాడు. ఒకటి తన కోసం, భగవంతుని సేవకుడిగా అనుగ్రహించమంటాడు. రెండు, తన చుట్టూ ఉన్న వారి కోసం, తన స్నేహమల్లా భగవత్భక్తి కలిగిన సజ్జనులతోనే సాగేట్టు చేయమంటాడు. ఇక మూడోది, సమస్త జీవ కోటి కోసం, సకల జీవుల పట్లా తనకు అపారమైన అవ్యాజమైన ప్రేమ, దయ, అనుకంప కలిగి ఉండేలా వరమీయమంటాడు మితృడైన భగవంతుడిని. ఎంత గొప్ప సద్భావన! ఈ సూర్యమండంలోని ఇతర ఏ గ్రహాలపైనా లేని జీవం కలిగి ఉన్న మన పృథ్విని కాపాడుకోవడానికి మనందరిలోనూ ఉండాల్సింది ఈ సద్భావనే! - దిలీప్రెడ్డి -
భారతీయుడికి గోల్డ్మాన్ బహుమతి
శాన్ ఫ్రాన్సిస్కో: క్షేత్రస్థాయిలో పర్యావరణ పరిరక్షణకు విశేష కృషి చేసిన ఛత్తీస్గఢ్ పర్యావరణ కార్యకర్త రమేశ్ అగర్వాల్ ప్రతిష్టాత్మక ‘గోల్డ్మాన్ పర్యావరణ బహుమతి’ని గెలుపొందారు. రమేశ్తో సహా ఈ ఏడాది ఆరు ఖండాల నుంచి ఆరుగురు కార్యకర్తలు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. అవార్డు కింద విజేతలకు రూ.1.06 కోట్ల నగదు అందజేస్తారు. రాయ్పూర్లో ఇంటర్నెట్ కేఫ్ నడుపుతున్న రమేశ్ సమాచార హక్కు చట్టం ద్వారా స్థానికుల్లో పర్యావరణ పరిరక్షణపై చైతన్యం తీసుకొచ్చారు. పర్యావరణ అనుమతులు లేకుండానే బొగ్గు గనుల తవ్వకం కోసం ప్రయత్నించిన జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్కు వ్యతిరేకంగా పోరాడిన రమేశ్ ఆ కంపెనీ ప్రాజెక్టును అడ్డుకున్నారు. దీంతో ఆయనపై కత్తిగట్టిన పారిశ్రామిక శక్తులు 2008లో కిరాయి వ్యక్తి ద్వారా కాల్పులు జరిపించగా కాలి ఎముకలు ఛిద్రమై ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. -
ప్రపంచవ్యాప్తంగా ‘చీకటి గంట’
న్యూఢిల్లీ: పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపు ప్రచారం కోసం నిర్వహిస్తున్న ‘ఎర్త్ అవర్’ను శనివారం ప్రపంచవ్యాప్తంగా పాటించారు. వేలాది నగరాల్లోని కోట్లాది ఇళ్లు, కార్యాలయాల్లోకి గంటపాటు స్వచ్ఛందంగా చీకటిని ఆహ్వానించారు. పలు దేశాల్లోని ప్రసిద్ధ పర్యాటక స్థలాలు, భవనాల్లో రాత్రి 8.30 గంటల నుంచి 9.30 వరకు గంటపాటు విద్యుత్ దీపాలను ఆర్పేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్, ఎర్రకోట, కోల్కతాలోని హౌరా వంతెన తదితర ప్రాంతాలు చీకట్లో దోబూచులాడాయి. పారిస్లోని ఈఫిల్ టవర్, సిడ్నీలోని ఒపేరా హౌస్, లండన్లోని బ్రిటిష్ పార్లమెంట్, న్యూయార్క్లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్లలో లైట్లు ఆర్పేశారు. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఏటా మార్చి చివర్లో ఎర్త్ అవర్ను నిర్వహిస్తుండడం తె లిసిందే. -
పర్యావరణ పరిరక్షణలోనూ పూరే!
ఈపీఐ జాబితాలో భారత్కు 155వ స్థానం దావోస్: పర్యావరణ పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్య విషయాల్లో భారతదేశం దారుణమైన ప్రదర్శన కనబరుస్తోంది. ఆ విభాగంలో భారత్ 155వ స్థానం దక్కించుకోవడం దానిని ప్రస్ఫుటం చేస్తుంది. 2014 పర్యావరణ ప్రదర్శన సూచీ (ఈపీఐ) శనివారం విడుదల చేసిన ర్యాంకుల్లో పాకిస్థాన్ (139), నేపాల్ (148) కన్నా భారత్ వెనుకబడింది. ఇక బ్రిక్స్లోని మిగతా దేశాలైన బ్రెజిల్ (77), రష్యా (73), చైనా (118) స్థానాల్లో నిలిచాయి. -
పర్యావరణంపై నిర్లక్ష్యం శోచనీయం: జైపాల్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వా లు, ఆర్థిక వేత్తలు, రాజకీయ నాయకులు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం శోచనీయమని కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణ ముప్పు అణుబాంబు కన్నా ప్రమాదకరమన్నారు. స్వచ్ఛంద సంస్థ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవెల్యూషన్ ఆధ్వర్యంలో సోమవారం ఇక్కడ జూబ్లీహాలులో జరిగిన కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణకు విశేష కృషి చేసిన ఆచార్య కె. పురుషోత్తమ రెడ్డి, డాక్టర్ కె. తులసీరావుకు మంత్రి పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి మాట్లాడుతూ, పారిశ్రామిక విప్లవమే పర్యావరణానికి ముప్పు తెచ్చిందని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి పేరిట పర్యావరణాన్ని ప్రపంచ దేశాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. నీటి కాలుష్యం వల్ల రోజూ మన దేశంలో 580 మంది, ప్రపంచవ్యాప్తంగా 14 వేల మంది చనిపోతున్నారని చెప్పారు. కొన్ని పంటలు అంతరించిపోవడం ప్రమాదకరమని హెచ్చరించారు. విద్యార్థి దశ నుంచే పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని సూచించారు. శాసనమండలి చైర్మన్ చక్రపాణి మాట్లాడుతూ భూకబ్జాలను అరికట్టాలని, భూగర్భ జలాలను పరిరక్షించాలన్నారు. ఈ దిశగా స్వచ్ఛంద సంస్థలు కృషి చేసి, ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు మూడేళ్ళుగా కార్యక్రమాలు నిర్వహించామని కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవెల్యూషన్ అధ్యక్షులు లీలా లక్ష్మారెడ్డి తెలిపా రు. పర్యావరణ పరిరక్షణ దిశగా తాము చేస్తున్న న్యాయపోరాటానికి తగిన తోడ్పాటు లభించడం లేదని జీవిత సాఫల్య పురస్కా రం గ్రహీత పురుషోత్తమరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టుల తీర్పులను పాలకులు అమలు చేయకపోవడం ప్రమాద కరమన్నారు. పర్యావరణ పార్కుకు గచ్చిబౌలిలో ప్రభుత్వం కేవలం 5 ఎకరాల స్థలం కేటాయించడాన్ని గ్రీన్లీడర్ అవార్డు గ్రహీత తులసీరావు తప్పుపట్టారు. పార్కు చుట్టుపక్కల స్థలం ఆక్రమణలకు గురికాకుండా చూడాలని, హైదరాబాద్లో పర్యావరణ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు. ‘అప్పట్లో చిన్నపాటి రౌడీని!’ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి తనను తాను రౌడీగా చెప్పుకున్నారు. కాకపోతే అది విద్యార్థి దశలో అని తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహాల్లో జరిగిన పర్యావరణ అవార్డుల ప్రదానోత్సవంలో మాట్లాడుతూ.. ‘ఏదైనా 18 ఏళ్ళలోపే నేర్చుకోవాలి. ఆ తర్వాత అసలు వీలుకాదు. నా విషయాన్నే చూడండి. కాలేజీలో చదివేటప్పుడు అంతా టైపింగ్ నేర్చుకోమని చెప్పారు. వింటేనా? వినలేదు! ఎందుకంటే.. అప్పట్లో మనం చిన్నపాటి రౌడీ.. (కాస్త సవరించుకుని) విద్యార్థి నాయకులం కదా! ఆ దెబ్బతో టైపింగ్ అబ్బలేదు.’ అని వివరించారు.