Ethiopia
-
ఇథియోపియాలో ఘోర ప్రమాదం..
అడిస్ అబాబా: ఆఫ్రికా దేశం ఇథియోపియాలో నదిలో ట్రక్కు పడిన దుర్ఘటనలో 71 మంది మృత్యువాతపడ్డారు. దక్షిణ ప్రాంత సిడామాలోని లెమ్మ లగిడెలో ఆదివారం దుర్ఘటన చోటుచేసుకుంది. బాధితులంతా పెళ్లి బృందంలోని వారు. కిక్కిరిసిన ట్రక్కు గలానా నదిపైన వంతెన మీదుగా వెళ్తుండగా అదుపు తప్పి పడిపోయింది. అక్కడి కక్కడే 60 మంది అసువులు బాశారు. మిగతా 11 మంది చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని అధికారులు చెప్పారు. పేద దేశం కావడంతో వివాహాలు వంటి వేడుకలకు వెళ్లే వారు ఎక్కువ ఖర్చయ్యే బస్సులకు బదులుగా తక్కువకే దొరికే ట్రక్కులనే జనం వాడుతుంటారు. రహదారుల నిర్వహణ లోపభూయిష్టంగా మా రడంతో ఇక్కడ ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. ఇదీ చదవండి: గాలిలో ప్రాణాలు -
24 ఏళ్ల తర్వాత... ఇథోయోపియా అథ్లెట్కు పసడి పతకం
పారిస్: ఒలింపిక్స్ క్రీడలు ముగియడానికి ఒక రోజు ముందు ఇథియోపియా జట్టు పసిడి పతకం బోణీ కొట్టింది. పురుషుల మారథాన్ ఈవెంట్లో తమిరాత్ తోలా విజేతగా నిలిచి ఇథియోపియాకు తొలి స్వర్ణ పతకాన్ని అందించాడు. శనివారం జరిగిన మారథాన్ రేసులో నిర్ణీత 42.195 కిలోమీటర్ల దూరాన్ని 32 ఏళ్ల తోలా అందరికంటే వేగంగా 2 గంటల 6 నిమిషాల 26 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. బషీర్ ఆబ్ది (బెల్జియం; 2గం:06ని:47 సెకన్లు) రజతం... బెన్సన్ కిప్రోతో (కెన్యా; 2గం:7ని:00 సెకన్లు) కాంస్యం సాధించారు. 24 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ పురుషుల మారథాన్లో ఇథియోపియా అథ్లెట్ స్వర్ణ పతకం సాధించడం విశేషం. చివరిసారి 2000 సిడ్నీ ఒలింపిక్స్లో ఇథియోపియా అథ్లెట్ గెజాహెగ్నె అబెరా మారథాన్ విజేతగా నిలిచాడు. మరోవైపు మారథాన్లో ‘హ్యాట్రిక్’ ఒలింపిక్ స్వర్ణం లక్ష్యంగా బరిలోకి దిగిన కెన్యా దిగ్గజం ఎలూడ్ కిప్చోగే అనూహ్యంగా విఫలమయ్యాడు. 40 ఏళ్ల కిప్చోగే 30 కిలోమీటర్లు పరుగెత్తాక రేసు నుంచి వైదొలిగాడు. 2016 రియో, 2020 టోక్యో ఒలింపిక్స్లో కిప్చోగే స్వర్ణ పతకాలు సాధించాడు. కిప్చోగే ‘పారిస్’లోనూ విజేతగా నిలిచిఉంటే ఒలింపిక్స్ మారథాన్ చరిత్రలో మూడు బంగారు పతకాలు నెగ్గిన తొలి అథ్లెట్గా కొత్త చరిత్ర సృష్టించేవాడు. -
229కి చేరిన ఇథియోపియా మృతుల సంఖ్య
దక్షిణ ఇథియోపియాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 229కి చేరింది. గోఫా జోన్ ప్రభుత్వ కమ్యూనికేషన్ వ్యవహారాల విభాగం విడుదల చేసిన ప్రకటనలోని వివరాల ప్రకారం మృతులలో148 మంది పురుషులు, 81 మంది మహిళలు ఉన్నారు.ఇథియోపియా దక్షిణ ప్రాంతీయ రాష్ట్ర ప్రతినిధి అలెమాయేహు బావ్డి మరణాల సంఖ్యను ధృవీకరించారు. రెస్క్యూ ఆపరేషన్ వేగవంతంగా జరుగుతున్నదని తెలిపారు. కాగా బురదమట్టిలో నుంచి ఐదుగురిని సజీవంగా బయటకు తీసుకువచ్చామని, వారికి వైద్య చికిత్స అందిస్తున్నామని ఇథియోపియన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ (ఈబీసీ) తెలిపింది. మృతులలో అధికంగా స్థానికులు, ఉపాధ్యాయులు, ఆరోగ్య నిపుణులు వ్యవసాయ నిపుణులు ఉన్నారని పేర్కొంది.ఘటన జరిగిన ప్రాంతంలో ఇథియోపియన్ రెడ్క్రాస్ అసోసియేషన్తో పాటు ఇతర ప్రాంతాల నుండి వచ్చిన ప్రొఫెషనల్ రెస్క్యూ కార్యకర్తలు సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. భారీ వర్షాల నేపధ్యంలో దక్షిణ ఇథియోపియాలోని గోఫా ప్రాంతంలో ఆదివారం రాత్రి కొండచరియలు విరిగిపడటంతో భారీగా జనం సమాధి అయ్యారు. సోమవారం ఉదయం నుంచి సహాయక చర్యలు ప్రారంభంకాగా, ఇంతలో మరొక కొండచరియ విరిగిపడటం మరింత విషాదానికి దారితీసింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ఇవి ఎప్పటికి పూర్తవుతాయో తెలియదని, మృతదేహాలను ఇంకా బయటకు తీస్తున్నామని గోఫా ప్రాంత జాతీయ విపత్తు ప్రతిస్పందన సంస్థ అధిపతి మార్కోస్ మెలేస్ మీడియాకు తెలిపారు. ఘటనపై స్పందించిన ఇథియోపియా ప్రధాని అభి అమ్మద్ మాట్లాడుతూ భారీ ప్రాణనష్టం తనను ఎంతగానో కలచివేసిందని, విపత్తు ప్రభావాన్ని తగ్గించడానికి ఫెడరల్ అధికారులను ఘటన జరిగిన ప్రాంతానికి పంపించినట్లు తెలిపారు. ఇథియోపియా పార్లమెంటేరియన్ కెమల్ హషి మీడియాతో మాట్లాడుతూ బాధితులకు ఆశ్రయం కల్పించడంతో పాటు వారికి ఆహారం అందిస్తున్నామన్నారు. కాగా ఈ ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. The death toll from two landslides in southern #Ethiopia jumped to 229 and could rise further as the search for survivors and casualties continued into a second day.Following heavy rain a landslide buried people in Gofa zone in Southern Ethiopia regional state on Sunday night,… pic.twitter.com/uVyYiUxdP4— DD News (@DDNewslive) July 24, 2024 -
విరిగిపడిన కొండచరియలు.. 150 మందికి పైగా మృతి
ఆఫ్రికా దేశమైన ఇథియోపియాలో ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో 157 మంది మృత్యువాత పడ్డారు. దక్షిణ ఇథియోపియాలోని కెంచో షాచా గోజ్డి జిల్లాలోని గోఫా జోన్లో ఈ విషాదం చోటుచేసుకుంది.సమాచారం అందుకున్న సహాయక బృందాలు, పోలీసులు శిథిలాల్లో చిక్కుకున్నవారిని వెలికితీస్తుండగా మరోసారి కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడ గుమిగూడిన ప్రజలు, సహాయక బృందాలు శిథిలాల్లో చిక్కుకున్నారు. ఇప్పటివరకు 146 మంది మృతదేహాలను వెలికితీసినట్లుగా స్థానిక అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.వర్షం నుంచి వచ్చిన బురద కారణంగా సోమవారం కొండచరియలు విరిగిపడ్డాయని, మృతి చెందిన వారిలో చిన్నారులు, గర్భిణులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, మృతదేహాలను బురదలో నుంచి బయటకు తీస్తున్నామని చెప్పారు. ఒక కొండచరియ తర్వాత మరో కొండచరియ కూడా విరిగిపడటంతో ప్రమాదం తీవ్రత పెరిగిందని తెలిపారు.అయితే జులైలో ప్రారంభమయ్యే వర్షాకాలంలో ఇథియోపియాలో కొండచరియలు విరిగిపడటం సర్వసాధారణంగా మారింది. ఈ వర్షాకాలం సెప్టెంబర్ మధ్య వరకు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అక్కడి అధికారులు చెబుతున్నారు. -
ఆ దేశం ఇంకా 2016 లోనే ..!ఎందుకో తెలుసా..!
ప్రపంచం మొత్తం ఇంచుమించుగా ఒకే ఏడాదినే ఫాలో అవుతుంది. ఆయా దేశ కాలమాన పరిస్థితుల రీత్యా న్యూ ఇయర్ వేడుకులు వేర్వేరుగా జరగుతాయేమో..! గానీ అన్ని చోట సంవత్సరం ఒకటే ఉంటుంది. ఆయా స్థానిక సంప్రదాయాలు, మతాలు రీత్యా ఉండే ఏడాదులు వేరుగా ఉంటాయి. కానీ అంతర్జాతీయంగా ఫాలో అయ్యే ఇయర్ అనేది ప్రపంచమంతా ఒకటే ఉంటుంది. కానీ ఒక దేశం మాత్రం ఇంకా 2016వ సంవత్సరంలోనే ఉంది. ఇదేంటీ..? అనుకోకండి. ఎందుకుంటే..? అక్కడ దాదాపు ఏడేళ్లు వెనుక్కు ఉంటారట. మరీ వేరే దేశాలతో జరిగే కార్యకలాపాల్లో ఎలా..? అనే కదా..!. అందుకు వారేం చేస్తారంటే..ఇధియోపియా ఇంకా 2016వ ఏడాదిలోనే ఉంది. వచ్చే సెప్టంబర్11కి 2017 ఏడాదిలోకి అడుగుపెడుతుందట. దాదాపు ఎనిమిదేళ్ల వ్యత్యాసమా అని ఆశ్చర్యంగా ఉన్నా. ఇది వాస్తవం. ఆఫ్రికాలో రెండో అత్యధిక జనాభా కలిగిన దేశం అయిన ఇధియోపియా దేశం తమ సంప్రదాయ సమయపాలనకు కట్టుబడి ఉంది. ప్రపంచమంతా గ్రెగోరియన్ క్యాలెండర్ ఫాలో అయితే..అక్కడ మాత్రం ఆర్థోడాక్స్ చర్చి క్యాలెండర్ని ఫాలో అవుతుంది. ఇది గ్రెగోరియన్ క్యాలెండర్ కంటే ఏడు లేదా ఎనిమిదేళ్లు వెనుక్కు ఉంటుంది. చెప్పాలంటే ఇథియోపియా దేశం తమ సాంప్రదాయిక వ్యవస్థన పట్ల ఉన్న నిబద్ధతను చాటేలా.. తన సాంస్కృతిక మతపరమైన వారసత్వాన్ని ప్రతిబింబించేలా తాప్రతయపడుతోంది. అందుకోసమే ఇలా ప్రత్యేక క్యాలెండర్ని ఫాలో అవుతుంది. అంతేగాదు తాము వలస రాజ్యాన్ని వంటబట్టించుకోలేదని, మాకు స్వంత క్యాలేండర్, స్వంత వర్ణమాల ఉందని సగౌర్వంగా చెబుతున్నారు ఇథియోపియా వాసులు. ఇక ఇధియోఫియా క్యాలెండర్లో ఏకంగా 13 నెలలు ఉంటాయి. వాటిలో 12 నెలల్లో ఒక్కొక్కటి 30 రోజులు ఉండగా చివరినెల ఒక విధమైన సమయపాలను ఉంటుంది. ఇక్కడ ప్రజలు రెండు క్యాలెండర్లును ఫాలో అవ్వుతారు. అందరూ ఫాలో అయ్యే గ్రెగోరియన్ క్యాలెండర్ తోపాటు తమ దేశ క్యాలెండర్ని అనుసరిస్తారు. అందువల్ల ఇక్కడ ప్రజలు బర్త్ సర్టిఫికేట్లు రెండు ఉంటాయి. వాటిని ప్రాంతాల వారిగా ఒక తేదీ, అంతర్జాతీయంగా మరో తేదీ ఉంటుంది. ఇది కాస్త గందరగోళానికి గురి చేసే వ్యవహారమే అయినా వాళ్లు మాత్రం అలానే అనుసరించడం విశేషం. ఇథియోపియాలో పనిచేసే అంతర్జాతీయ సంస్థలు ఈ విషయంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి కూడా. అయితే అక్కడ ప్రజలకు మాత్రం ఇదేమంత పెద్ద విషయం కాదు. వాళ్లు చాలా సులభంగా రెండు క్యాలెండర్లను అనుసరిస్తారు.(చదవండి: డిప్రెషన్తో బాధపడ్డ నటుడు ఫర్దీన్ ఖాన్: బయటపడాలంటే..?) -
ఈ 'తియా శిలాఫలకాలు'.. ఏ కాలంనాటివో తెలుసా!?
ఇథియోపియా, అడిస్ అబాబాకు దక్షిణంగా ఉన్న సోడో ప్రాంతంలోని తియా పురావస్తు ప్రదేశం.. ప్రపంచాన్నే ఆకట్టుకుంటుంది. ఇక్కడ పదుల సంఖ్యలో మెగాలిథిక్ స్తంభాలు.. 12 లేదా 14వ శతాబ్దాల నాటి ఎన్నో కథలను.. ఊహించి చెబుతుంటాయి. అందుకే అవన్నీ మార్మిక సంకేతాలతో మానవ చరిత్రకు వారసత్వ సంపదగా చరిత్రలో నిలిచాయి.సంక్లిష్టమైన సామాజిక–మతపరమైన పద్ధతుల్లో కొన్ని రకాల చిహ్నాలు.. ఆ శిలాఫలకాలపై చెక్కి ఉన్నాయి. కత్తులు, బొమ్మలు ఇలా ఎన్నో భావనలతో చెక్కిన ఆ స్తంభాలు.. యునెస్కో గుర్తింపును కూడా పొందాయి. అందుకే ఇవన్నీ.. శాస్త్రవేత్తలను, పర్యాటకులను ఇట్టే ఆకర్షిస్తున్నాయి. పురాతన ఇథియోపియన్ సంస్కృతికి చెందిన ఆచారాలకు, నమ్మకాలకు ఇవి నిశ్శబ్ద సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయి. ఈ అమూల్యమైన ప్రదేశాన్ని సంరక్షించడానికి అక్కడి ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంది. ఈ శిలాఫలకాలు, వాటిపైనున్న మార్మిక చిహ్నాలు పురాతన రాతియుగం నాటి పరిస్థితుల్ని సూచిస్తాయి. కానీ ఆ సూచనలు నేటి తరాలకు ఏ మాత్రం అర్థం కాకుండా ఉన్నాయి.ఇక్కడ మొత్తంగా 36 మెగాలిథిక్ స్తంబాలు ఉన్నాయి. వాటి మీదున్న కత్తుల బొమ్మలు ఏదైనా దైవ శక్తిని లేదా సైనిక శక్తిని సూచిస్తూ ఉండవచ్చని నిపుణుల అంచనా. కానీ దానిపై స్పష్టత లేదు. ఇక ఇతర బొమ్మల విషయానికి వస్తే ఆనాటి జ్యోతిష వివరాలను, ఆనాటి నాగరికత వివరాలను తెలుపుతున్నట్లుగా అనిపిస్తున్నాయని కొందరు పరిశోధకులు అభిప్రాయపడ్డారు. 1930ల వరకు ఈ పురావస్తు ప్రదేశం వెలుగులోకి రాలేదు. ఇథియోపియా ప్రాంతీయ సర్వేల సమయంలో ఫ్రెంచ్ పరిశోధకులు వీటి ప్రాముఖ్యతను గుర్తించి, వీటి వివరాలను ప్రపంచానికి వెల్లడించారు.ఆ రాతిస్తంభాలన్నీ పురాతన యుగంలో.. అంటే 12 లేదా 14 శతాబ్దంలోని చనిపోయిన పూర్వీకుల జ్ఞాపకార్థం కావచ్చని కొందరు లేదంటే అప్పటి సమూహానికి నాయకుడిగా ఉన్న నాయకుడి గౌరవార్థం కావచ్చని మరికొందరు అంచనా వేశారు. ఆ లెక్కన చూస్తే.. ఇది పురాతన శ్మశానవాటిక కావచ్చని కూడా కొందరి అభిప్రాయం. అయితే ఈ స్తంభాలు వెనుకున్న అసలు కథ ఏమిటి? అన్నది మాత్రం నేటికీ మిస్టరీనే! – సంహిత నిమ్మన -
సౌదీ సైన్యం కాల్పుల్లో వందలాది మంది మృతి !
దుబాయ్: సరిహద్దులు దాటి దేశంలోకి ప్రవేశించేందుకు యతి్నంచిన ఇథియోపియా వలసదారులపై సౌదీ బలగాలు జరిపిన కాల్పుల్లో వందలాదిమంది మృతి చెందినట్లు హ్యూమన్ రైట్స్ వాచ్ మంగళవారం తెలిపింది. సైన్యం మెషిన్స్ గన్లు, మోర్టార్లతో జరిపిన కాల్పుల్లో చనిపోయిన వారి సంఖ్య వందల్లో ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను విడుదల చేసింది. యెమెన్ వైపు ఉన్న సరిహద్దు నుంచి వస్తున్న వలసదారులపైకి సౌదీ బలగాలు కాల్పులు జరపడంపై ఐక్యరాజ్యసమితి ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. హ్యూమన్ రైట్స్ వాచ్ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తోందని సౌదీ అధికారి ఒకరు ఖండించారు. సౌదీలో ప్రస్తుతముంటున్న 7.50 లక్షల మంది ఇథియోపియన్ శరణార్థుల్లో 4.50 లక్షల మంది అనధికారికంగా ఉంటున్నవారే. ఇప్పటికే నిరుద్యోగ సమస్యతో ఇబ్బందులు పడుతున్న సౌదీ ప్రభుత్వం వీరిని వెనక్కి పంపించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. -
ఇథియోపియాలో వైమానిక దాడి.. 26 మంది మృతి
నైరోబీ: ఇథియోపియాలోని కల్లోలిత అంహారా ప్రాంతంలోని ఓ పట్టణ కూడలిలో జరిగిన వైమానిక దాడిలో 26 మంది మరణించారు. మరో 55 మంది గాయాలపాలయ్యారు. ఈ మేరకు ఆ దేశానికి చెందిన సీనియర్ వైద్యాధికారి సోమవారం వెల్లడించారు. స్థానిక మిలీషియా ముఠాలను నిర్వీర్యం చేసేందుకు దేశ ఆర్మీ ప్రయత్నాలు చేస్తోంది. ఇదే క్రమంలో ఫినోట్ సెలామ్లోని కమ్యూనిటీ సెంటర్పై ఆదివారం ఉదయం వైమానిక దాడి జరిపింది. ఇదిలా ఉండగా గతవారం అమ్హారా ప్రాంతంలోని కీలక పట్టణాలను సైనిక చర్య ద్వారా ఇథియోపియా సైన్యం స్వాధీనం చేసుకుంది. ఉగ్రవాదులకు ఆహారం అందించి ఓ ట్రక్కుపై వెనక్కు వస్తున్న కొందరు వ్యక్తులను లక్ష్యంగా వైమానిక దాడులు జరిగినట్లు స్థానికులు పేర్కొన్నారు. చదవండి: పాక్ ఆపద్ధర్మ ప్రధానిగా కకర్ ప్రమాణం -
తమిళనాడు అబ్బాయి.. ఇథియోపియా అమ్మాయి
తమిళనాడు: ఇథియోపియా అమ్మాయితో సేలం అబ్బాయి హిందూ సంప్రదాయం ప్రకారం తాళికట్టి పెళ్లి చేసుకున్నాడు. సోమవారం జరిగిన ఈ వేడుక మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా సాగింది. సేలం జిల్లా అత్తార్ సమీపంలోని కల్పగనూర్ గ్రామానికి చెందిన సెల్లదురై కుట్టి మార్క్స్(32), ముంబై యూనివర్సిటీలో 5 సంవత్సరాలుగా అసోసియేట్ ప్రొఫెసర్, పరిశోధకుడిగా పనిచేస్తున్నారు. తనతో పనిచేసిన ఇథియోపియన్ అసోసియేట్ ప్రొఫెసర్ రియార్ మెన్బారే అక్లీలతో ప్రేమలో పడ్డాడు. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనిపై వారి తల్లిదండ్రులను సంప్రదించారు. సెల్లదురై కుట్టిమార్క్ హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనికి అతని తల్లిదండ్రులు కూడా అంగీకరించారు. దీంతో పెత్తనాయకన్పాళయంలోని హిందూ కల్యాణ మండపంలో వీరి వివాహ వేడుక జరిగింది. బంధువుల సమక్షంలో చెల్లదురై కుట్టి మార్క్స్, మెన్బారే అక్లీ మెడలో తాళి కట్టి పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహానికి పలువురు హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. -
ఇథియోపియాలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం..
అడిస్ అబాబా: ఇథియోపియాలో ఆ దేశ ప్రభుత్వం శుక్రవారం ఎమర్జెన్సీని ప్రకటించింది. గత కొంతకాలంగా ఉత్తర అమ్హారా ప్రాంతంలో ఫెడరల్ భద్రతా దళాలకు స్థానిక మిలీషియాలకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఇక ఇదే వారంలో ఇథియోపియన్ నేషనల్ డిఫెన్స్ ఫోర్స్, ఫానో మిలీషియా గ్రూప్ మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు జరిగినట్లు స్థానిక మీడియా నివేదించింది. పొరుగున ఉన్న టైగ్రే ప్రాంతంలో రెండు సంవత్సరాల పాటు జరిగిన అంతర్యుద్ధం కారణంగానే ఈ ఘర్షణలు చెలరేగినట్లు చెబుతోంది ఇథియోపియా ప్రభుత్వం. సాధారణ న్యాయ వ్యవస్థ ఆధారంగా ఈ దారుణాలను నియంత్రించడం కష్టతరంగా మారినందుకే అత్యవసర పరిస్థితిని ప్రకటించాల్సిన అవసరం ఏర్పడిందని ప్రధాన మంత్రి అబీ అహ్మద్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. మొదటగా ప్రభుత్వం తరపున ఆర్డర్ను తిరిగి అమలు చేయాల్సిందిగా ఫెడరల్ అధికారుల సాయం కోరామని అయినా కూడా ఘర్షణలను నియంత్రించడం కష్టతరం కావడంతో ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్లో ఎమర్జెన్సీని ప్రకటించాల్సి వచ్చిందని ప్రధాన మంత్రి అబీ అహ్మద్ కార్యాలయం ప్రకటించింది. ఎమర్జన్సీ అమల్లో ఉండగా బహిరంగ సభలను నిషేధం.. అలాగే ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే వారెంట్లు లేకుండా అరెస్టులు జరుగుతాయని ఏ ప్రకటనలో పేర్కొంది. అవసరాన్ని బట్టి కర్ఫ్యూ విధించదానికి కూడా వెనుకాడమని ప్రకటనలో తెలిపింది. ఇది కూడా చదవండి: రష్యా యుద్ధనౌకపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. -
రైతు సంక్షేమ కార్యక్రమాలు భేష్
పెనుగంచిప్రోలు: ఏపీలో అమలవుతున్న రైతు సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయని ఇథియోపియా ప్రతినిధి బృందం పేర్కొంది. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఇథియోపియా బృందంలోని ఆరుగురు సభ్యులు శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో సాగవుతున్న డ్రాగన్ ఫ్రూట్ తోటను పరిశీలించారు. రైతు పెద్ది మోహనరావుతో మాట్లాడి సాగు వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయానికి ఇస్తున్న ప్రోత్సాహకాలు రైతులకు ఎంతో మేలు కలిగేలా ఉన్నాయన్నారు. ఆంధ్రా రైతులు రకరకాల ఉత్పత్తులు లాభసాటిగా పండిస్తున్నారన్నారు. ముఖ్యంగా రైతు భరోసా కేంద్రాలు ఎన్నో రకాల సేవలందిస్తున్నాయని ప్రశంసించారు. ఇక్కడ వ్యవసాయ రంగంలో అమలవుతున్న ప్రతి కార్యక్రమం తమ దేశంలో రైతులకు అందించేందుకు ఆసక్తిగా ఉన్నామని చెప్పారు. ఇథియోపియో ప్రతినిధులు రోసి, ఎల్షడే, అబ్రహాం, ఆలీ, ఏడీఆర్ డాక్టర్ జీఎంవీ ప్రసాదరావు, డీడీఈ డాక్టర్ బి.ముకుందరావు, ఏడీ శివప్రసాద్, గరికపాడు కృషి విజ్ఞానకేంద్రం శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. -
ఏపీ సహకారంతో ఇథియోపియాలో ఈ–క్రాప్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సాగవుతున్న వ్యవసాయ, ఉద్యాన పంటలను గుర్తించే ఎలక్ట్రానిక్ క్రాపింగ్ (ఈ–క్రాప్) అద్భుతంగా ఉందని, ఈ సాంకేతికతను తమ దేశంలో అమలు చేసేందుకు అవసరమైన సహకారాన్ని అందించాలని ఇథియోపియా ప్రతినిధి బృందం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర పర్యటనలో భాగంగా మూడో రోజైన గురువారం ఇథియోపియా ప్రతినిధి బృందం మంగళగిరిలోని వ్యవసాయ శాఖ కమిషనరేట్ క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయ ఉన్నతాధికారులతో భేటీ అయింది. ఈ సందర్భంగా ఏపీలో రైతు సంక్షేమం కోసం అమలు చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని తమ దేశంలో రైతులకు కూడా అందించేందుకు ఆసక్తిగా ఉన్నామని ఇథియోపియా ప్రతినిధి బృందం స్పష్టం చేసింది. ముఖ్యంగా ఈ–పంట నమోదుతోపాటు యంత్రసేవా పథకం, పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, వైఎస్సార్ రైతు భరోసా వంటి పథకాలను తమ రైతులకు అందించాలని భావిస్తున్నామన్నారు. వీటి అమలు కోసం అవసరమైన సాంకేతికతను అందించేందుకు చేయూతనివ్వాలని కోరారు. ఇథియోపియా దేశానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కమిషనర్ చేవూరు హరికిరణ్ వెల్లడించారు. ఎరువులు, పురుగు మందులపై ఆరా ఆర్బీకేల ద్వారా రైతులకు పంపిణీ చేస్తున్న ఎరువులు, పురుగు మందులు, విత్తనాలను ఎక్కడ నుంచి కొనుగోలు చేస్తున్నారు, ఎలా కొనుగోలు చేస్తున్నారనే విషయాలను ఇథియోపియా ప్రతినిధి బృందం ఆరా తీసింది. కాగా, వ్యవసాయ రంగంలో ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బృందానికి వివరించారు. ఈ–క్రాప్ నమోదు, ఉచిత పంటల బీమా, ఆర్బీకేల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, ఇతర ఇన్పుట్స్ పంపిణీ, ఆర్బీకేలకు అనుబంధంగా ఏర్పాటు చేసిన వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలు (కస్టమ్హైరింగ్ సెంటర్స్), డ్రోన్ టెక్నాలజీ, ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్, వైఎస్సార్ అప్లికేషన్ సాంకేతికతను, పొలం బడుల ద్వారా గ్యాప్ సర్టిఫికేషన్ జారీ అంశాలను వివరించారు. ఏపీ మార్క్ఫెడ్ ఎండీ రాహుల్పాండే, వ్యవసాయ శాఖ జేడీ వల్లూరి శ్రీధర్ వివిధ అంశాలపై మాట్లాడారు. -
పశుపోషణ, పాడి, డెయిరీ, సాగు రంగాల్లో.. ఏపీ దేశానికే ఆదర్శం
సాక్షి, అమరావతి/భవానీపురం/ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ) : పశుపోషణ, పాడి, డెయిరీ, సాగు రంగాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని కేరళ, ఇథియోపియా బృందాలు కొనియాడాయి. ఏపీలో అమలవుతున్న కార్యక్రమాలు.. అలాగే, రైతుభరోసా కేంద్రాలు (ఆర్బీకే) ద్వారా గ్రామస్థాయిలో అందిస్తున్న సేవలు నిజంగా అద్భుతంగా ఉన్నాయని తెలిపాయి. ఏపీలో తీసుకొస్తున్న లైవ్స్టాక్ అండ్ పౌల్ట్రీ ఫీడ్ అండ్ మినరల్ మిక్చర్ బిల్లు–2022ను స్ఫూర్తిగా తీసుకుని దానిని మరింత పటిష్టంగా తీర్చిదిద్దడంతో పాటు ఇక్కడ అమలవుతున్న కార్యక్రమాలను అధ్యయనం చేసి తమ రాష్ట్రంలో అమలుచేసే నిమిత్తం మంత్రి చెంచురాణి నేతృత్వంలోని 10 మంది ఎమ్మెల్యేలు, ఇతర ఉన్నతాధికారులతో కూడిన కేరళ ప్రభుత్వ సెలక్ట్ కమిటీ రాష్ట్రంలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా విజయవాడలో మంగళవారం రాష్ట్ర పశుసంవర్థక శాఖమంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, ఉన్నతాధికారులతో కేరళ బృందం సమావేశమైంది. మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ రంగాల్లో తమ ప్రభుత్వం నాలుగేళ్లలో ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చిందని వివరించారు. ప్రతీ ఆర్బీకేను రూరల్ లైవ్స్టాక్ యూనిట్గా తీర్చిదిద్దామన్నారు. జగనన్న పాల వెల్లువ ద్వారా మహిళా పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తూ డెయిరీ రంగం బలోపేతానికి కృషిచేస్తున్నామన్నారు. కేరళ ఎమ్మెల్యేల సందేహాలను మంత్రి అప్పలరాజు నివృత్తి చేశారు. ఏపీ పశుదాణా చట్టం–2020 అమలుతీరును పశుసంవర్థక శాఖ డైరెక్టర్ డాక్టర్ రెడ్నం అమరేంద్రకుమార్ వివరించారు. సీఎం జగన్ దూరదృష్టి అద్భుతం : కేరళ మంత్రి చెంచురాణి కేరళ మంత్రి చెంచురాణి మాట్లాడుతూ ఏపీలో అమలవుతున్న కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దూరదృష్టికి తామంతా ముగ్ధులయ్యామన్నారు. పశుపోషణ, పాడి, డెయిరీ రంగాల్లో ఏపీ సర్కార్ అందిస్తున్న సేవలను ఆమె ప్రశంసించారు. కేరళలో పాడి, పౌల్ట్రీ సంపదకు అవసరమైన దాణా, ఫీడ్ కోసం పొరుగు రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోందన్నారు. 50 శాతానికి పైగా పశు దాణా, పౌల్ట్రీ ఫీడ్లను దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. ఈ విషయంలో ఏపీ చేపట్టిన కార్యక్రమాలను కేరళలో కూడా అమలుచేసేందుకు తమ ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. వలంటీర్ వ్యవస్థ ఏర్పాటు, వైద్య, విద్యరంగాల్లో తీసుకొచ్చిన మార్పులను అడిగి తెలుసుకున్నారు. కేరళ మంత్రి, ఎమ్మెల్యేలు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆచరించదగ్గ ఎన్నో విషయాలున్నాయిక్కడ: ఇథియోపియా బృందం ప్రశంస మరోవైపు.. ఆర్బీకేల సేవలు అద్భుతంగా ఉన్నాయని ఇథియోపియా ప్రతినిధి బృందం కితాబిచ్చింది. ప్రపంచంలో వ్యవసాయాధారిత దేశాలన్నీ ఆచరించదగ్గ ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ అమలవుతున్నాయని అభిప్రాయపడింది. ఇథియోపియా బృందం పర్యటనలో భాగంగా రెండోరోజు ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ పరిధిలోని గొల్లపూడి ఆర్బీకే కేంద్రాన్ని బృందం సందర్శించింది. ఆర్బీకేలోని కియోస్క్ ద్వారా సర్టిఫై చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల బుకింగ్, సరఫరా గురించి రైతులను అడిగి బృందం సభ్యులు తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాన్ని పరిశీలించారు. రైతులకిచ్చిన ట్రాక్టర్ ఎక్కి రైతు క్షేత్రంలో దుక్కి పనుల్లో పాల్గొన్నారు. మూలపాడులో ఖరీఫ్ పంటల ఈ–క్రాప్ నమోదును పరిశీలించారు. రైతులతో ముఖాముఖిలో పాల్గొని ఆర్బీకే ద్వారా అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆర్బీకేల గురించి తాము విన్నదానికంటే ఎన్నో రెట్లు బాగున్నాయని బృంద సభ్యులు ప్రపంచానికే ఏపీ ఒక దిశానిర్దేశం చేసిందన్నారు. ఈ బృందంలో ప్రపంచ బ్యాంకు సలహాదారు హిమ్మత్ పటేల్, ఇథియోపియా వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు. -
ఏపీ విధానాలు ప్రపంచానికే ఆదర్శం
సాక్షి, అమరావతి: ‘రైతులకు సాంకేతికతను చేరువ చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కృషి బాగుంది. మీ ఆలోచన విధానాలు ప్రపంచానికే ఆదర్శం. మాది వ్యవసాయాధారిత దేశం. మీ విధానాలు, సాంకేతికత అందిపుచ్చుకోవాలని ఆశిస్తున్నాం. అందుకు తగిన సహకారం అందించండి’ అని ఇథియోపియా దేశ ప్రతినిధి బృందం ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఐదు రోజుల పర్యటన కోసం సోమవారం రాష్ట్రానికి విచ్చేసిన ఇథియోపియా బృందానికి వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్ స్వాగతం పలికారు. అనంతరం కృష్ణా జిల్లా గన్నవరంలోని సమీకృత రైతు సమాచార కేంద్రం(ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్), ఆర్బీకే చానల్ స్టూడియోలను ఇథియోపియా బృందం సందర్శించింది. ఆర్బీకేలు, ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ ద్వారా రైతులకు అందిస్తున్న సేవలను వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు వల్లూరు శ్రీధర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి వివరించారు. ఆర్బీకే యూట్యూబ్ చానల్ స్టూడియోలో శాస్త్రవేత్తలతో ముఖాముఖి, వివిధ పంటల సాగులో అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు తెగుళ్లు, పురుగుల నివారణకు వ్యవసాయ విశ్వవిద్యాలయ, వ్యవసాయ పరిశోధన స్థానాల శాస్త్రవేత్తల సూచనలతో రూపొందిస్తున్న వీడియోలను వారు పరిశీలించారు. రైతుల సందేహాలను శాస్త్రవేత్తలు నివృత్తి చేస్తున్న తీరును పరిశీలించడంతో పాటు ఆర్బీకేల ద్వారా అందిస్తున్న రైతు భరోసా సచిత్ర మాస పత్రిక గురించి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ కృషిని ఇథియోపియా బృందం ప్రశంసించింది. తమ దేశంలోనూ రైతులకు ఈ తరహా విధానాలను అందుబాటులోకి తెచ్చేందుకు తగిన సహకారం అందించాలని విజ్ఞప్తి చేసింది. బృందంలో ప్రపంచ బ్యాంకు సలహాదారు హిమ్మత్ పటేల్, ఇథియోపియా వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు డా.ఆదిషు బెజ్ బెహ్ అలి, అన్ దువాలేమ్, అబ్రహాం టేస్ పాయె, ఆరెగా సేమెగా, ఎల్ షాడే బెలేటే తదితరులున్నారు. కార్యక్రమంలో కృష్ణా జిల్లా వ్యవసాయాధికారి ఎన్.పద్మావతి, గన్నవరం ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ అధికారి వై.అనురాధ తదితరులు పాల్గొన్నారు. నేడు గొల్లపూడి ఆర్బీకే సందర్శన ఇథియోపియా ప్రతినిధి బృందం మంగళవారం గొల్లపూడి రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించనుంది. ఆర్బీకేల ద్వారా అందిస్తున్న సేవలను పరిశీలించి.. సంబంధిత సిబ్బంది, రైతులతో మాట్లాడనుంది. అనంతరం సమీప గ్రామాల్లో పర్యటిస్తుంది. బీమా కవరేజ్లో ఏపీ అద్భుతం సాక్షి, అమరావతి: కేంద్రం నోటిఫై చేసిన పంటలకు రైతులపై పైసా భారం పడకుండా.. సాగు చేసిన ప్రతి ఎకరాకు యూనివర్సల్ బీమా కవరేజ్ కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని కేంద్ర వ్యవసాయ కుటుంబ, సంక్షేమ శాఖ సహాయ కార్యదర్శి, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై) సీఈవో, నాఫెడ్ ఎండీ రితీశ్ చౌహాన్ ప్రశంసించారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా సోమవారం ఆయన అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గ పరిధిలోని దొడ్డిపల్లి రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించారు. ఆర్బీకే ద్వారా అందిస్తోన్న సేవలను పరిశీలించి రైతులతో సమావేశమయ్యారు. ఈ–క్రాప్ నమోదు, వైఎస్సార్ ఉచిత పంటల బీమా అమలు తీరుపై ఆరా తీశారు. ఈ–క్రాప్ నమోదుకు సంబంధించిన రశీదులను పరిశీలించి, ఎలా నమోదు చేస్తున్నారో సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గతంలో సాగు చేసిన పంటలకు కేంద్రం నిర్దేశించిన ప్రీమియం చెల్లించిన వారికే పరిహారం దక్కేదని రైతులు ఆయనకు తెలిపారు. అయితే తమ రాష్ట్రంలో ప్రస్తుతం నోటిఫై చేసిన ప్రతి పంటకు, ప్రతి ఎకరాకు బీమా సదుపాయం లభిస్తోందని చౌహాన్కు వివరించారు. దీంతో ఈ తరహా యూనివర్సల్ బీమా కవరేజ్ కల్పించడం నిజంగా అద్భుతమని ఆయన కొనియాడారు. అందువల్లే ఆంధ్రప్రదేశ్ను ఆదర్శంగా తీసుకొని ఫసల్ బీమా యోజన నిబంధనల్లో పలు మార్పులు చేశామన్నారు. ఖరీఫ్–22 సీజన్ నుంచి రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత పంటల బీమా పథకంతో పీఎంఎఫ్బీవైను అనుసంధానం చేసి అమలు చేస్తున్నామని చెప్పారు. -
అదానీ షేర్ల బ్లడ్ బాత్: ఆరు రోజుల నష్టం, ఆ దేశాల జీడీపీతో సమానం!
సాక్షి,ముంబై: హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన పరిశోధన నివేదిక సునామీతో అదానీ గ్రూప్ షేర్లన్నీ పతనం వరుసగా కొనసాగుతోంది. కంపెనీకి చెందిన 10 స్టాక్లు భారీ నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. దీంతో ఆసియా కుబేరుడుగా నిలిచిన అదానీ చైర్మన్ గౌతం అదానీ, ప్రపంచ బిలియనీర్ల ర్యాంకు నుంచి 16 స్థానానికి పడిపోయారు. అదానీ నికర విలువ ఒక వారంలో దాదాపు సగానికి పడిపోయింది. కేవలం ఆరు ట్రేడింగ్ సెషన్ల వ్యవధిలో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్లో రూ. 8.76 లక్షల కోట్లు (107 బిలియన్ డాలర్లు) నష్టపోయాయి. ఇది (రూపాయి-డాలర్ మార్పిడి రేటు 81.80 వద్ద) ఇథియోపియా లేదా కెన్యా జీడీపీతో సమానమట. వీటి వార్షిక జీడీపీ 110-111 బిలియన్ల డాలర్లు (ప్రపంచ బ్యాంకు). అదానీ టోటల్ గ్యాస్ 6 రోజుల రూట్లో 29 బిలియన్ల డాలర్లు పైగా నష్టపోయింది. మార్కెట్ విలువలో 26.17బిలియన్ల డాలర్లను కోల్పోయింది. బ్లూమ్బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం,గత సంవత్సరం సెప్టెంబర్లో గరిష్టంగా 150 బిలియన్ల డాలర్లున్న అదానీ వ్యక్తిగత సంపద హిండెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపణల తరువాత ( జనవరి 24 నాటికి) 119 బిలియన్ల డాలర్లకు పడిపోయింది. కాగా ఫోర్బ్స్ అదానీ సంపదను 64.6 బిలియన్ డాలర్లుగా గురువారం అంచనా వేసింది. దీని ప్రకారం అదానీ వ్యక్తిగత సంపద 85 బిలియన్ డాలర్లు పతనం. ఇది బల్గేరియా వార్షిక జీడీపీకి సమానం! అదానీ పోర్ట్స్ మార్కెట్ క్యాప్ రూ. 65,000 కోట్లకు పైగా క్షీణించగా, అదానీ ఎంటర్ప్రైజెస్ గత ఆరు ట్రేడింగ్ సెషన్లలో రూ. 2.1 లక్షల కోట్లు హుష్ కాకి అయిపోయాయి. గత సంవత్సరం అదానీ కొనుగోలు చేసిన అంబుజా సిమెంట్స్, దాని m-క్యాప్ దాదాపు రూ. 29,000 కోట్లు పడిపోయింది, ఇది 29శాతం పతనం. అదానీ గ్రీన్ ఎనర్జీ (16.95 బిలియన్ డాలర్లు క్షీణత) అదానీ ట్రాన్స్మిషన్ (16.36 బిలియన్ డాలర్లు కోల్పోయింది) విలువపరంగా భారీ పెట్టుబడిదారుల సంపదను కోల్పోయిన అదానీ గ్రూప్ స్టాక్లు. ఇంకా అదానీ పోర్ట్స్ & SEZ (7.89 బిలియన్ డాలర్లు), అంబుజా సిమెంట్స్ (3.55 బిలియన్ డాలర్లు ) అదానీ విల్మార్ (2.4బిలియన్ డాలర్లు ) ఏసీసీ (1.13 బిలియన్ డాలర్లు) కోల్పోయాయి. ఇక ఎఫ్పీవో ఉపహసంహరణ తరువాత అదానీ షేర్లను కొనేవాళ్లకు లేక చాలా వరకు లోయర్ సర్క్యూట్ కావడం గమనార్హం. గురువారం అదానీ షేర్ల తీరు ఇలా అదానీ ఎంటర్ప్రైజెస్ ఎఫ్పీవో ఉపసంహరణ తరువాత ఈ స్టాక్ గురువారం రెండవ వరుస సెషన్లో 30శాతం క్రాష్ అయ్యింది. 1,494.75 వద్ద కొత్త 52 వారాల కనిష్ట స్థాయిని నమోదు చేసింది అదానీ టోటల్ గ్యాస్ 10 శాతం పడి, రూ. 1,707లోయర్ సర్క్యూట్ అదానీ గ్రీన్ ఎనర్జీ 10 శాతం కుప్పకూలి కొత్త 52 వారాల కనిష్టాన్ని తాకింది. అదానీ ట్రాన్స్మిషన్ కొత్త 52 వారాల కనిష్ట స్థాయి, 10శాతం నష్టంతో లోయర్ సర్క్యూట్ను అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ 14.35 కుప్పకూలి , 52 వారాల కనిష్ట స్థాయి అదానీ పవర్ 5శాతం నష్టంతో లోయర్ సర్క్యూట్ అదానీ విల్మార్ 5శాతం నష్టంతో లోయర్ సర్క్యూట్ను తాకింది. -
ఏపీలో ఆర్బీకేలు అద్భుతం
సాక్షి, అమరావతి/ఉయ్యూరు: ‘రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. మేము ఊహించిన దానికంటే చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి. ఆర్బీకేలు గ్రామ స్థాయిలో రైతులకు అందిస్తున్న సేవలు చాలా ఇన్నొవేటివ్గా ఉన్నాయి. కియోస్క్ ద్వారా రైతులే నేరుగా వారికి కావల్సిన ఇన్పుట్స్ బుక్ చేసుకోవడం, సకాలంలో వాటిని అందించడం అద్భుత విధానం. ల్యాబ్ టు ల్యాండ్ కాన్సెప్ట్ కింద పరిశోధన ఫలితాలు, విస్తరణ కార్యక్రమాలను రైతుల ముంగిటకు తీసుకెళ్లడం నిజంగా మంచి ఆలోచన. ప్రపంచంలో ఎక్కడా ఈ తరహా సేవలందిస్తున్నట్టు వినలేదు. ఈ తరహా ఆలోచన చేసిన సీఎం వైఎస్ జగన్ను అభినందిస్తున్నాం’ అంటూ ఇథియోపియా దేశ వ్యవసాయ శాఖ మంత్రి మెలెస్ మెకోనెన్ ఐమెర్ ప్రశంసించారు. రాష్ట్రంలో ఆర్బీకే వ్యవస్థ గురించి తెలుసుకున్న ఇథియోపియా ప్రభుత్వం, వాటిని తమ దేశంలో కూడా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆర్బీకే వ్యవస్థ పరిశీలనకు ఆ దేశ వ్యవసాయ శాఖ మంత్రి మెలెస్ మెకోనెన్ ఐమీర్ నేతృత్వంలో ఓ బృందాన్ని పంపింది. ఆ బృందం బుధవారం తొలుత గన్నవరంలోని సమీకృత రైతు సమాచార కేంద్రం (ఐసీసీ), ఆర్బీకే చానల్ను, ఆ తర్వాత కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం గండిగుంట ఆర్బీకే–2ను సందర్శించింది. ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్లో రైతుల నుంచి వస్తున్న కాల్స్ను రిసీవ్ చేసుకుంటున్న తీరు, అక్కడున్న శాస్త్రవేత్తలు, అధికారులు బదులిస్తున్న తీరును పరిశీలించింది. ఆర్బీకే చానల్ ద్వారా రైతులకు సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నారో తెలుసుకుంది. గండిగుంట ఆర్బీకేలోనే రెండున్నర గంటలు ఆర్బీకేల సేవలను తెలుసుకునేందుకు ఈ బృందం గండిగుంట ఆర్బీకేలో రెండున్నర గంటల పాటు గడిపింది. రైతులతో మమేకమైంది. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల స్టాల్స్ను లకించింది. కియోస్క్ ద్వారా రైతులు ఇన్పుట్స్ బుక్ చేసుకుంటున్న విధానాన్ని పరిశీలించింది. డిజిటల్ లైబ్రరీ, కొనుగోలు కేంద్రం, వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రం, వెటర్నరీ అంబులెన్స్, రైతు రథం, పొలం బడి క్షేత్రం ఇలా ప్రతి ఒక్కటీ పరిశీలించి వాటి పనితీరు, సేవలను తెలుసుకుంది. వ్యవసాయ సలహా మండళ్ల ఏర్పాటు, విధులు, బాధ్యతలపై బృందం సభ్యులు ఆరా తీసారు. మూడేళ్లుగా ఆర్బీకేలు అందిస్తున్న సేవలను వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య వివరించారు. ఆర్బీకేలొచ్చిన తర్వాత వ్యవసాయ అవసరాల కోసం గ్రామం విడిచి వెళ్లడంలేదని రైతులు ఈ బృందానికి వివరించారు. అనంతరం విజయవాడలో అధికారులతో సమావేశమయ్యారు. శాఖలవారీగా అమలు చేస్తున్న కార్యక్రమాలు, అందిస్తున్న సేవలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ బృందానికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి ముందుకెళ్తాం ఆర్బీకేలు నిజంగా రోల్ మోడల్గా ఉన్నాయని ఇథియోపియా వ్యవసాయ మంత్రి చెప్పారు. వీటి సాంకేతికతను అందిపుచ్చుకుంటామని, తమ దేశంలో కూడా ఈ సేవలు అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి ముందుకెళ్తామని చెప్పారు. వ్యవసాయాధార దేశమైన ఇథియోపియాలో రైతులకు నాణ్యమైన సేవలందించడమే లక్ష్యమని చెప్పారు. సౌత్సౌత్ కో ఆపరేషన్ సమావేశంలో భారతప్రభుత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న కార్యక్రమాలు తెలుసుకున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరు, సీఏం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని కొనియాడారు. ఈ పర్యటనలో ఇథియోఫియా బృందం సభ్యులతో పాటు వ్యవసాయ, ఉద్యాన, మత్స్య శాఖల కమిషనర్లు చేవూరు హరికిరణ్, శ్రీధర్, కన్నబాబు, పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ అమరేంద్రకుమార్ పాల్గొన్నారు. -
AP: రైతు భరోసా కేంద్రాలకు ఇథియోపియా బృందం ప్రశంసలు
సాక్షి, అమరావతి: ఇథియోపియా బృందంతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు. ఏపీ పర్యటనలో భాగంగా ముందుగా గన్నవరంలో ఇంటిగ్రేటెడ్ కాల్సెంటర్ను ఇథియోపియా బృందం సందర్శించింది. తర్వాత కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలం గండిగుంటలో ఆర్బీకే -2 కేంద్రాన్ని సందర్శించింది. చదవండి: సీఎం జగన్ను కలిసిన అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ రైతు భరోసా కేంద్రాల వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందని, సీఎం జగన్ దార్శనికత కనిపిస్తోందని ఇథియోపియా వ్యవసాయశాఖ మంత్రి అన్నారు. ఆయన ఆలోచనలు క్షేత్రస్థాయిలో అద్భుతంగా అమలవుతున్నాయి. ఆర్బీకేల వ్యవస్థ రైతులకు చేదోడు వాదోడుగా నిలుస్తోంది. ఆర్బీకేల వ్యవస్థ విషయంలో ఈ ప్రభుత్వం నుంచి మేం నేర్చుకోవాల్సింది ఉంది. ఆర్బీకేల్లో వ్యవసాయరంగంలో వివిధ విభాగాల అనుసంధానం బాగుంది. డిజటల్, సాంకేతిక పరిజ్ఞానాన్ని బాగా వినియోగించుకుంటున్నారు. వ్యవసాయరంగంలో మీకున్న పరిజ్ఞానాన్ని మేం వినియోగించుకుంటాం. అలాగే మాకున్న పరిజ్ఞానాన్ని నైపుణ్యాలను మీతో పంచుకుంటాం. వ్యవసాయరంగంలో రైతుకు అండగా నిలవాలి, వారికి మంచి జరగాలన్న మీ అభిరుచి, సంకల్పం క్షేత్రస్థాయిలో మంచి మార్పులకు దారితీయడం మమ్మల్ని అబ్బురపరుస్తోందని’’ ఆయన అన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, ‘‘మీకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది, కొనసాగుతుంది. ఏ రూపంలో కావాలన్నా మేం తోడుగా ఉంటాం. అలాగే మీ సహాయాన్ని కూడా తీసుకుంటాం. ఆర్బీకేలను సందర్శించడం, అక్కడ రైతులతో మాట్లాడ్డం సంతోషకరం. ప్రతి గ్రామానికీ కూడా వ్యవసాయరంగంలో ప్రభుత్వం చేపట్టే కార్యకలాపాలు చేరుకోవాలన్నది లక్ష్యం, దీంట్లో భాగంగానే ఆర్బీకేలు వచ్చాయి. కల్తీ విత్తనాలు, కల్తీ పురుగుమందులు, ఎరువుల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్న ఘటనలు ఉన్నాయి. ఈ సమస్యకు పరిష్కారం కోసం మార్గాన్వేషణ చేశాం. అదే సమయంలో రైతుకు సరైన మార్గనిర్దేశం, అవగాహన కల్పించాలన్నది ఉద్దేశం. పంట చేతికి వచ్చిన తర్వాత ధర లేకపోతే రైతులు ఇబ్బంది పడతారు. ఇవన్నీకూడా మిలియన్ డాలర్ల ప్రశ్నలు. వీటికి సమాధానాలు వెతికే ప్రయత్నం చేశాం. అలాగే పారదర్శకతకు పెద్దపీట వేయాలని నిర్ణయించాం. ప్రభుత్వం ఏదైనా కార్యక్రమం చేపడితేం అర్హులందరికీ అది అందాలి. ఈ ఆలోచనల క్రమంలోనే ఆర్బీకేలు, గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ వచ్చింది. గ్రామ సచివాలయానికి విస్తరణగా ఆర్బీకేలు తీసుకు వచ్చాం. అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ను ఆర్బీకేలో పెట్టాం. ఆక్వా ప్రాంతాల్లో ఆరంగంలో గ్రాడ్యుయేట్ను, హార్టికల్చర్ సంబంధిత గ్రాడ్యుయేడ్ను ఆర్బీకేల్లో ఉద్యోగాల్లో ఉంచాం. ఆర్బీకేల్లో కియోస్క్ను కూడా పెట్టాం. ఆర్డర్ ఇచ్చిన వాటిని రైతుల దగ్గరకే చేరుస్తున్నాం. తద్వారా కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులను నివారిస్తున్నాం. ఆర్బీకేల్లో వ్యవసాయ సలహామండళ్లను ఏర్పాటు చేశాం. ఇ–క్రాపింగ్ కూడా చేస్తున్నాం జియో ట్యాగింగ్ కూడా చేస్తున్నాం ఇ– క్రాపింగ్ను రైతులు కూడా ఆధీకృతం చేస్తున్నారు. ఫిజికల్ రశీదు, డిజిటల్ రశీదును కూడా ఇస్తున్నాం. పంటలకు వచ్చే ధరలను నిరంతరం పర్యవేక్షించడానికి సీఎంయాప్ను కూడా వినియోగిస్తున్నాం. ఎక్కడైనా ధరలు తగ్గితే అలర్ట్ వస్తున్నాయి. ప్రభుత్వం నుంచి జోక్యం చేసుకుని రైతులకు నష్టంరాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం. రైతులకు కనీస మద్దతు ధరలు అందిస్తున్నాం. ప్రతిరోజూకూడా విలేజ్అగ్రికల్చర్ అసిస్టెంట్ల నుంచి పంటల ధరలపై నివేదికలు తీసుకుంటున్నాం. వ్యవసాయ రంగంలో క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలకు పరిష్కారంగా ఈ విధానాలను అనుసరిస్తున్నాం. అంకిత భావంతో పనిచేసే అధికారుల వల్ల ఇవన్నీకూడా సాకారమవుతున్నాయి. వ్యవసాయంతోపాటు పాడిపరిశ్రమకు తోడ్పాటు ఇవ్వడం ద్వారా రైతులకు అదనపు ఆదాయాలు వచ్చేలా కృషిచేస్తున్నాం. జీవనోపాధి కోసం పట్టణాలకు వచ్చే వలసలను నివారించేందుకు ఈ బృహత్తర కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. విచక్షణ రహితంగా ఎరువులు, రసాయనాలు, పురుగు మందులు వాడకుండా నివారించాలన్నది మరో లక్ష్యం. దీనికోసం మార్చి, ఏప్రిల్, మే నెలల్లో భూసార పరీక్షలు కూడా నిర్వహించడానికి కార్యక్రమాన్ని రూపొందించాం. సాయిల్ టెస్ట్ ఫలితాల ఆధారంగా ఎలాంటి పంటలు వేయాలి? ఎంత మోతాదులో ఎరువులు, రసాయనాలు వాడాలి? అన్నదానిపై రైతులకు పూర్తి అవగాహన కల్పిస్తాం. దీనికి సంబంధించి రిపోర్టు కార్డులను కూడా ఇస్తాం. ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్ను వచ్చే ఏడాది జూన్ నుంచి అమల్లోకి తీసుకు వస్తాం’’ అని సీఎం అన్నారు. ఆర్బీకేల్లో డిజిటల్ సొల్యూషన్స్ విషయంలో తమకు సహకారాన్ని అందించాల్సిందిగా ఇథియోపియా బృందం కోరగా, కచ్చితంగా సహకారం అందిస్తామని సీఎం జగన్ వెల్లడించారు. ఈ భేటీలో ఇథియోపియా బృందంతో పాటు వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, వ్యవసాయశాఖ కమిషనర్ సీహెచ్ హరికిరణ్, ఏపీస్టేట్ సీడ్స్ డవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ డాక్టర్ జి. శేఖర్బాబు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
ఏపీకి ప్రపంచ బ్యాంక్ బృందం రాక
సాక్షి, అమరావతి: ప్రపంచ బ్యాంక్ ప్రతినిధి బృందం మంగళవారం రాష్ట్రంలో పర్యటించనుంది. తూర్పు ఆఫ్రికా దేశమైన ఇథియోపియాలో ఆర్బీకే తరహాలో సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు వరల్డ్ బ్యాంక్ ఆర్థిక చేయూత అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఏపీ వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్యతో పాటు కేంద్ర ప్రభుత్వం, వరల్డ్ బ్యాంక్ ప్రతినిధుల బృందం గత నెలలో ఇథియోపియాలో పర్యటించింది. ఏపీ వ్యవసాయ రంగంలో అమలు చేస్తున్న వినూత్న విధానాలను అధ్యయనం చేసేందుకు వరల్డ్ బ్యాంక్లోని అగ్రికల్చర్ అండ్ ఫుడ్ గ్లోబల్ ప్రాక్టీస్ సీనియర్ కన్సల్టెంట్ హిమ్మత్ పటేల్ నేతృత్వంలోని ఈ బృందం ఢిల్లీ నుంచి మంగళవారం ఉదయం 8.45 గంటలకు విజయవాడ చేరుకోనుంది. గన్నవరంలోని ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్, ఆర్బీకే చానల్ను సందర్శిస్తారు. అక్కడ నుంచి పెనమలూరు మండలం వణుకూరు చేరుకుని ఆర్బీకే కేంద్రాన్ని సందర్శించి రైతులతో భేటీ అవుతారు. అనంతరం ఘంటసాలలోని కేవీకేని సందర్శిస్తారు. అనంతరం విజయవాడ చేరుకుని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డితో భేటీ అవుతారు. వ్యవసాయ, అనుబంధ శాఖల ద్వారా అమలవుతున్న వివిధ కార్యక్రమాలను పరిశీలిస్తారు. -
ఇథియోపియాలో ఘర్షణలు.. 200 మందికిపైగా మృతి
నైరోబీ: ఇథియోపియాలో శనివారం రెండు జాతుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో అమ్రాహా తెగకు చెందిన 200 మందికిపైగా జనం మృతిచెందారు. ఒరోమియా ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. దేశంలో ఇటీవలి కాలంలో ఇదే అతిపెద్ద ఘర్షణ కావడం గమనార్హం. తాను 230 మృతదేహాలను లెక్కించా నని గింబీ కౌంటీకి చెందిన స్థానికుడు అబ్దుల్–సయీద్ తాహీర్ చెప్పారు. మృతదేహాలను అధికారులు సామూహికంగా ఖననం చేశారు. పునరావాస పథకం కింద 30 ఏళ్ల క్రితం ఇక్కడ స్థిరపడిన అమ్రాహా తెగపై ఒరోమో లిబరేషన్ ఆర్మీ దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. ఎయిర్ ఇండియా చరిత్రలో అతిపెద్ద ఎయిర్క్రాప్ట్ డీల్ సాంకేతిక లోపం.. కేబుల్ కారులో చిక్కుకున్న 11 మంది టూరిస్టులు -
మనం 2022లో ఉంటే.. ఇథియోపియా ఇంకా 2014లోనే!
ఇవాళ తేదీ 14–05–2022.. ఇది అందరికీ తెలుసు. ప్రత్యేకంగా చెప్పేదేముంది అంటారా! అవును.. ఇది మనకైతే కరెక్టే. కానీ ఇథియోపియాలో మాత్రం కాదు. ఈ రోజు వాళ్ల తేదీ ఏమిటో తెలుసా.. 6–9–2014. ఇదేదో చిత్రంగా ఉందనిపిస్తోందా? ఈ వివరాలేమిటో తెలుసుకోవాలని ఉందా.. అయితే పదండి.. – సాక్షి సెంట్రల్ డెస్క్ వలస పాలన ప్రభావం తప్పించుకుని.. 16, 17, 18వ శతాబ్దాల్లో యూరప్ దేశాలు ప్రపంచవ్యాప్తంగా వలస పాలన నెలకొల్పడమే.. గ్రెగోరియన్ కేలండర్ విస్తృతికి ముఖ్య కారణం. అయితే ఇథియోపియా ఎన్నడూ వలస పాలనప్రభావానికి లోనుకాలేదు. 1935లో ముస్సోలినీ ఆధ్వర్యంలోని ఇటలీ నియంతృత్వ ప్రభుత్వం ఇథియోపియాను ఆక్రమించినా అది1941లోనే ముగియడంతో.. ప్రభావంపడలేదు.ఇథియోపియన్లు తమ సొంత కేలండర్, సమయం వంటివి కొనసాగించుకున్నారు. సొంత కేలండర్తో.. ప్రస్తుతం మన దేశంతోపాటు ప్రపంచమంతా వినియోగిస్తున్న తేదీ, సమయం విధానాన్ని గ్రెగోరియన్ కేలండర్ అంటారు. సుమారు రెండు శతాబ్దాలుగా ప్రపంచమంతా ఇదే అధికారిక కేలండర్గా కొనసాగుతోంది. కానీ ఇథియోపియా మాత్రం తమ దేశంలో భిన్నమైన సొంత కేలండర్ను వినియోగిస్తోంది. ఇది ప్రపంచదేశాల కంటే సుమారు ఏడున్నరేళ్లు వెనుక కొనసాగుతుంది. వారికి 13 నెలలు.. మనకు ఏడాదిలో 12 నెలలుంటే.. ఇథియోపియాలో 13 నెలలు ఉంటా యి. 12 నెలలపాటు ప్రతినెలా 30 రోజులు ఉంటాయి. 13వ నెల మాత్రం మామూలు సంవత్సరాల్లో ఐదు రోజులు, లీప్ సంవత్సరంలో ఆరు రోజులు ఉంటుంది. ఈ నెలను పగ్యూమ్గా పిలుస్తారు. పగ్యూమ్ అనే పేరు గ్రీక్ భాషలోని ‘ఎపగోమీన్’ నుంచి వచ్చిందని చెప్తారు.. ‘ఏడాదిలో సమయాన్ని లెక్కిస్తూ మరిచిపోయిన రోజులివి’ అని ఈ పదానికి అర్థమట. ఉదయం ఆరు తర్వాతే రోజు మొదలు.. ఇథియోపియాలో సమయాన్ని లెక్కించే విధానమూ భిన్నమే. మన కేలండర్లో అర్ధరాత్రి 12 తర్వాత మరుసటి రోజు ప్రారంభమవుతుంది. కానీ వారికి ఉదయం ఆరు గంటలకు మరుసటి రోజు మొదలవు తుంది. ూ ఉదాహరణకు మనం శనివారం పొద్దున ఐదున్నరకు నిద్రలేస్తే.. ఆ రోజంతా శనివారమే ఉంటుంది. ఇథియోపియాలో పొద్దున ఐదున్నరకు నిద్రలేస్తే.. అప్పటికి ఇంకా శుక్రవారమే. ఇంకో అరగంట గడిచి ఆరు దాటితేనే శనివారం మొదలైనట్టు. బైబిల్ ఆధారం.. ఆలోచనల సముద్రం! ఇథియోపియన్లు బైబిల్ ఆధారంగా తమ కేలండర్ను రూపొందించుకున్నారు. దీనిని వారు ‘సీ ఆఫ్ థాట్స్ (ఆలోచనల సముద్రం)’గా చెప్పుకొంటారు. దేవుడి తొలి సృష్టి అయిన ఆడమ్ అండ్ ఈవ్ ఇద్దరూ ఏడేళ్లపాటు గార్డెన్ ఆఫ్ ఈడెన్లో నివసించారని.. తర్వాత వారి పాపాల ఫలితంగా బయటికి పంపేయబడ్డారని.. వారు పశ్చాత్తాపడటంతో 5,500 ఏళ్ల తర్వాత వారిని రక్షిస్తానని దేవుడు మాటిచ్చాడని బైబిల్ లోని వాక్యాలను గుర్తుచేస్తారు. ఈడెన్ గార్డెన్లో ఆడమ్అండ్ ఈవ్ గడిపిన ఏడేళ్లను తమ కేలండర్ నుంచి తొలగించారని చెప్తారు. ప్రపంచమంతా జీసస్ పుట్టినది క్రీస్తుశకం 1వ సంవత్సరంలోనని గుర్తిస్తే.. ఇథియోపియన్లు మాత్రం అంతకు ఏడేళ్ల ముందు క్రీస్తుపూర్వం 7వసంవత్సరంలో జీసస్ జన్మించాడని నమ్ముతారు. ఇథియోపియా కేలండర్లో వారంలో మొదటిరోజును ‘ఎహుద్’గా పిలుస్తారు. బైబిల్ ప్రకారం దేవుడు భూమిని, స్వర్గాన్ని సృష్టించడం మొదలుపెట్టిన రోజు అని దీని అర్థం. ప్రపంచమంతా జనవరి 1న నూతన సంవత్సరాన్ని జరుపుకొంటే.. ఇథియోపియన్లు సెప్టెంబర్ 11న (లీప్ సంవత్సరమైతే 12వ తేదీన) సంబరాలు చేసుకుంటారు. వారి వార్షిక కేలండర్ ఆ రోజు నుంచే మొదలవుతుంది. లీప్ సంవత్సరం వచ్చే ప్రతి నాలుగు ఏళ్లను బైబిల్ ఎవాంజలిస్టులు అయిన నలుగురి పేర్లతో పిలుస్తారు. మొదటి ఏడాదిని జాన్ ఇయర్గా, రెండో ఏడాదిని మ్యాథ్యూ ఇయర్, మూడో ఏడాదిని మార్క్ ఇయర్, నాలుగో ఏడాదిని ల్యూక్ ఇయర్గా వ్యవహరిస్తారు. ఈసారి వారి 2015 నూతన సంవత్సర వేడుకలు ‘2022 సెప్టెంబర్ 11’న జరగనున్నాయి. -
900 యేళ్లనాటి ఈ గ్రామానికి రెండే ద్వారాలు... కారణం అదేనట..
ఇంటింటికీ ఓ సందు.. సందుసందుకీ ఓ దారి సహజమే. అలాంటిది, కొన్ని వందల ఇళ్లు ఉండే ఊరంటే.. ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. సందులు, దారులు, రహదారులు, అడ్డదారులు ఇలా చాలానే ఉంటాయి. కానీ ఆ గ్రామం మొత్తానికీ రెండే రెండు ద్వారాలు ఉన్నాయి. లోపల ఎన్ని సందుగొందులు తిరిగినా ఆ రెండు ద్వారాల నుంచే బయటికి రావాలి, లోపలికి పోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే వందల కుటుంబాలు కలిగి, రెండు ద్వారాల ఇల్లులాంటి ఊరది. ప్రపంచంలోనే ఎల్తైన గ్రామాల్లో ఇదొకటి. ఇథియోపియాలోని అమ్హారా అనే ప్రాంతంలో షోంకే అనే ఎత్తైన పర్వతశిఖరంపైన ఈ ప్రాచీన గ్రామం ఉంది. ఆ ఊరు పేరు షోంకే. తొమ్మిదొందల ఏళ్ల క్రితమే అది ఏర్పడింది. ఈ గ్రామం సముద్ర మట్టానికి 5,200 అడుగుల ఎత్తులో ఉంటుంది. అక్కడ జీవించిన వారిలో 20 తరాలకు సంబంధించిన వివరాలు, లెక్కలతో కూడిన ఆధారాలు ఉన్నాయట. షోంకే ప్రజలను ‘అర్గోబా’ అని పిలుస్తారు. అంటే దాని అర్థం ‘అరబ్బులు లోపలకి వచ్చారు’ అని. మహ్మద్ ప్రవక్త ఇస్లాం మతం ప్రారంభించినప్పుడు ఆయాప్రాంతాల్లో కొన్ని ఘర్షణలు జరిగాయి. ఆ సందర్భంలో దాడుల నుంచి కాపాడేందుకు.. కొందరిని ఇథియోపియాలోని ఈ ప్రాంతానికి పంపించారు అప్పటి పాలకులు. భద్రత కారణాలతో అప్పట్లోనే ఈ గ్రామానికి కేవలం రెండు ద్వారాలే ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఆ ద్వారాల ముందు గార్డులు కాపలా కాస్తుంటారు. ఇస్లాం బోధనలో అక్కడున్న షోంకే మసీదు పేరు గాంచినది. అక్కడ ప్రాచీన తరహా ఇస్లాంని బోధిస్తారు. ప్రస్తుతం ఈ గ్రామ జనాభా దాదాపు సగానికి తగ్గిపోయింది. ఒకప్పుడు ఇక్కడ దాదాపుగా 500 కుటుంబాలకు పైగానే ఉండేవి. కానీ ప్రస్తుతం 250 కుటుంబాలు మాత్రమే మిగిలాయి. చాలామంది గ్రామస్తులు వ్యవసాయం కోసం, కొండప్రాంతాలను ఆనుకుని ఉండే ఇతర ప్రాంతాలకు తరలిపోయారట. ‘ఇది మా పూర్వీకుల గ్రామం, అందుకే మేము దీన్ని వీడలేని జ్ఞాపకంగా భావిస్తాం. వేరే ప్రాంతాలకు వెళ్లిపోవడం మాకు ఇష్టంలేదు’ అంటున్నారు మిగిలిన స్థానికులు. ఇప్పటికీ స్థానికంగా లభ్యమయ్యే రాళ్లతోనే వాళ్లు ఇళ్లు కట్టుకుంటారు. నగరాల్లోని హంగులు, ఆర్భాటాలను వీళ్లు పెద్దగా ఇష్టపడరు. దాంతో ఈ గ్రామం పర్యాటక ఆకర్షణగా నిలిచింది. చదవండి: దుస్తులకు లింగ భేదం ఏంటీ..! స్కూల్కి స్కర్టులతోనే వస్తాం!! -
డబ్ల్యూహెచ్ఓ చీఫ్గా టెడ్రోస్ ఏకగ్రీవ ఎన్నిక
జెనీవా: ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్గా టెడ్రోస్ అధ్నామ్ ఘెబ్రెయాసస్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో ఐదేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. నామినేషన్లకు గడువు ముగిసిన తర్వాత టెడ్రోస్ పేరు మొదట్లో ఉండగా ఆయన అభ్యర్థిత్వానికి ఫ్రాన్స్, జర్మనీ మద్దతునిచ్చాయి. ఇథియోపియాకు చెందిన టెడ్రోస్ డబ్ల్యూహెచ్ఓకి సారథ్యం వహించిన మొట్టమొదటి ఆఫ్రికన్. -
అథ్లెటిక్స్ తొలి స్వర్ణం ఇథియోపియా ఖాతాలో
టోక్యో: ఒలింపిక్స్ అథ్లెటిక్స్ ఈవెంట్లో తొలి స్వర్ణ పతకం ఇథియోపియా ఖాతాలోకి వెళ్లింది. శుక్రవారం అథ్లెటిక్స్ ఈవెంట్స్ ప్రారంభంకాగా... పురుషుల 10,000 మీటర్ల ఫైనల్ జరిగింది. ఇందులో ఇథియోపియా అథ్లెట్ సెలెమన్ బరేగా అందరికంటే ముందుగా 27 నిమిషాల 43.22 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి విజేతగా నిలిచాడు. వరల్డ్ చాంపియన్, వరల్డ్ రికార్డు తన పేరిట లిఖించుకున్న కెన్యా అథ్లెట్ జోషువా చెప్తెగె (ఉగాండా) రజతం పతకంతో సరిపెట్టుకున్నాడు. చెప్తెగె 27 నిమిషాల 43.63 సెకన్లలో గమ్యానికి చేరాడు. శనివారం మహిళల 100 మీటర్ల సెమీఫైనల్స్తోపాటు ఫైనల్ ను నిర్వహిస్తారు. మహిళల 100 మీటర్ల ఫైనల్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల 20 నిమిషాలకు జరుగుతుంది. పురుషుల డిస్కస్త్రో, 4్ఠ400 మీటర్ల మిక్స్డ్ రిలే ఫైనల్స్ కూడా జరుగుతాయి. -
వైరల్: మృగాళ్ల బారి నుంచి బాలికను కాపాడిన సింహాలు
అడ్డిస్బాబా: బుద్ధి, జ్ఞానం విచక్షణా శక్తి ఉన్న మనుషులు మృగాళ్లలా మారినా వేళ.. నోరు లేని మూగ జీవాలు మానవత్వం చూపాయి. ఓ చిన్నారి జీవితాన్ని నాశనం చేయడననికి ప్రయత్నించిన మృగాళ్ల బారీ నుంచి మృగరాజుల కాపాడాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆఫ్రికా ఖండం, ఇథోపియా దేశ రాజధాని అడ్డిస్ బాబా అనే ప్రాంతంలో 12 ఏళ్ల బాలిక కిడ్నాప్కు గురైంది. తన కుమార్తె కనిపించడం లేదంటూ బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిన్నారి ఆచూకీ కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. మరోవైపు కిడ్నాపర్లు బాలికను చిత్రహింసలకు గురిచేశారు. లైంగికంగా వేధించి బలవంతంగా పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించగా, బాలిక కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకొని స్థానికంగా ఉన్న ఓ అడవిలోకి వెళ్లింది. చిన్నారి జాడ కోసం కిడ్నాపర్లు అడవిలోకి వెళ్లారు. అలా సగం దూరం అడవిలోకి వెళ్లిన బాలికకు సింహాలు అండగా నిలిచాయి. ఓ చెట్టుకింద 3 సింహాలు కిడ్నాపర్ల నుంచి రక్షించేందుకు బాధితురాల్ని రౌండప్ చేశాయి. దీంతో కిడ్నాపర్లు గుండెల్ని అరచేతిలో పెట్టుకొని బ్రతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి పరారయ్యారు. కాగా గాలింపు చర్యలు చేపడుతున్న పోలీసులు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారణ చేపట్టారు. విచారణలో చిన్నారి సురక్షితంగా ఉందని, ఆమెను సింహాలు కాపాల కాస్తున్నాయని చెప్పారు. దాంతో షాక్ తిన్న పోలీసులు, అటవీ శాఖ అధికారులు ఘటనస్థలానికి వెళ్లారు. అక్కడ తీవ్రగాయాలతో షాక్కు గురైన చిన్నారిని అక్కున చేర్చుకొని అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం స్పృహలోకి వచ్చిన చిన్నారి అడవిలో జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్లు పోలీసులకు చెప్పింది. దీంతో పోలీసులు సింహాలపై ప్రశంసల వర్షం కురిపించారు. కిడ్నాప్కు పాల్పడిన నిందితుల్ని కటకటల్లోకి నెట్టారు. సింహాలు బాలికను రక్షించకపోయి ఉంటే పరిస్థితి దారుణంగా ఉండేదని అటవీ శాఖ అధికారి వెండాజు తెలిపారు. ఈ ప్రాంతంలో చిన్నారులపై లైంగిక దాడులు ఎక్కువగా జరుగుతాయి. లైంగిక దాడుల అనంతరం బలవంతంగా పెళ్లిచేసుకుంటారు. ఒప్పుకోలేదంటే ప్రాణాలు తీసి పైశాచికానందం పొందుతారని ఆవేదన వ్యక్తం చేశాడు. చదవండి: నెల రోజుల్లో భార్యకు 3 సార్లు విడాకులిచ్చి.. -
మగాళ్లను భయపెట్టి సొంతిట్లో ఆడవాళ్లపై అత్యాచారం
న్యూయార్క్ : ఇథియోపియాలోని టిగ్రే జాతిపై సరిహద్దు దేశం ఎరిట్రియా సైనికులు దారుణాలకు పాల్పడుతున్నట్లు యునైటెడ్ నేషన్స్ ప్రతినిధి వాఫా గురువారం మీడియాకు వెల్లడించారు. దాదాపు 516 మంది అత్యాచారానికి గురయ్యారని, ఆ సంఖ్య అంతకంటే ఎక్కువగానే ఉండొచ్చని ఆమె అన్నారు. వాఫా మాట్లాడుతూ.. ‘‘ ఎరిట్రియా సైనికులు టిగ్రే జాతి వారు నివసించే ప్రాంతాల్లోకి చొరబడి మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడుతున్నారు. కుటుంబసభ్యుల కళ్లెదుటే ఈ దారుణానికి పాల్పడుతున్నారు. కుటుంబంలోని మగాళ్లను భయపెట్టి వారితోటే సొంతిట్లోని ఆడవాళ్లపై అత్యాచారం చేయిస్తున్నారు. మెకెల్లే, అడిగ్రట్, ఉక్రో, షిరేలోని మెడికల్ సెంటర్లలో దాదాపు 516 అత్యాచార కేసులు నమోదయ్యాయి. చాలా వరకు మెడికల్ సెంటర్లు సరిగా పనిచేయటం లేదు’’ అని పేర్కొన్నారు. దీనిపై ఇథియోపియా యూన్ఎన్ అంబాసిడర్ టాయే అస్కేసెలస్సీ అంబ్డే స్పందించారు. ఈ అత్యాచార ఆరోపణలను తమ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుందని చెప్పారు. నిజానిజాలు తేల్చటానికి ఓ కమిటీని ఏర్పాటు చేస్తుందని అన్నారు. ఈ ఘటనపై ఎరిట్రియా సమాచార శాఖ మంత్రి యమనె గెబ్రెమెస్కెల్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. అత్యాచార ఘటనలు ఎరిట్రియా సమాజానికి అసహ్యమన్నారు. అలాంటివి జరిగినట్లయితే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. -
ఇథియోపియాను చూసి నేర్చుకుందాం!
సాక్షి, హైదరాబాద్: ఆ దేశ జనాభా 11 కోట్లు.. అక్కడి ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న వెంటిలేటర్లు 450.. ఇతర జబ్బులతో బాధపడుతున్న వారికి పోను, కరోనా బాధితుల కోసం కేటాయించినవి కేవలం 54 మాత్రమే. ఇలాంటి తరుణంలో ఆ వైరస్ విజృంభిస్తే పరిస్థితేంటి..? ఇది ఆఫ్రికా దేశం ఇథియోపియా ముందున్న భయం. సమస్య పెరిగితే తట్టుకోవటం కష్టం. అందుకే సమస్యను ఉన్నంతలో కట్టడి చేయాలని నిర్ణయించింది. అసలే అతి చిన్న ఆర్థిక వ్యవస్థ.. లాక్డౌన్ చేస్తే మరింత చితికిపోతామన్న ఉద్దేశంతో ప్రజల్లో అవగాహన కల్పించింది. కేవలం అవసరమున్నవారు తప్ప మిగతావారు ఇళ్లకే పరిమితం కావాలని ఆదేశించింది. బయటకు వచ్చిన వారు గుమి కూడకుండా కనీసం మీటరుకు ఒకరు చొప్పున దూరం పాటించాలని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిణామాలు గుర్తించి జనం కూడా సహకరించటం ప్రారంభించారు. ఇప్పుడు ఆ దేశంలో ఉన్న పాజిటివ్ కేసుల సంఖ్య కేవలం 65 మాత్రమే. ప్రజలు క్రమశిక్షణగా ఉన్నారు.. ‘భౌతిక దూరం పాటించటం ఒక్కటే కరోనాను నియంత్రించే మంత్రం. ఇప్పుడు ఇథియోపియా జనం అదే చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాన్ని పాటించటంలో క్రమశిక్షణ చూపుతున్నారు. ఈ పేద దేశాన్ని ఆ క్రమశిక్షణే గట్టునపడేస్తుందని మేం నమ్ముతున్నాం’అని డాక్టర్ రాజు రమేశ్రెడ్డి చెప్పారు. అర్బా మించ్ యూనివర్సిటీ సివిల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఆయన.. కరోనాను ఎదుర్కొనేందుకు ఇథియోపియా అనుసరిస్తున్న తీరును ‘సాక్షి’కి వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడు కరోనాను సకాలంలో నియంత్రించలేక అల్లకల్లోలమవుతోంది. మరి అమెరికా లాంటి దేశాల ఆర్థిక సాయంతో నెట్టుకొచ్చే పేద ఇథియోపియా తట్టుకోగలదా.. అందు కే మార్చి తొలివారంలోనే అక్కడి ప్రభుత్వం మేల్కొంది. సరిహద్దులను మూసేసింది, విమానాలను రద్దు చేసింది. రాజధాని నగరం అడిస్ అబాబాలో కఠిన ఆంక్షలు విధించింది. కేసుల సంఖ్య తక్కువగానే ఉండటంతో ఇప్పటికీ లాక్ డౌన్ విధించలేదు. కానీ విద్యాసంస్థలు మూసేసి, అవకాశం ఉన్న వారందరినీ ఇంటి నుంచే పనిచేయమని పురమాయించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఆదేశించింది. వాహనా ల్లో సీటుకు ఒకరే కూర్చోవాలని, ఆటోరిక్షాల్లో ఇద్ద రు మాత్రమే ఉండాలని ఆదేశించింది. ఇక ప్రజ ల్లో అవగాహన కోసం 35 వేల మందితో బృందా లు ఏర్పాటు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిణామాలు చూసి ఆందోళన లో ఉన్న జనం ఆ నిబంధనలను బాగా పాటిస్తున్నారు. స్వీయ నియంత్రణతో క్రమశిక్షణగా ఉంటున్నారు. ఒక్కరోజే 8 కేసులు.. హెల్త్ ఎమర్జెన్సీ రాజధాని నగరంలో 44 పాజిటివ్ కేసులు మాత్రమే ఉండేవి. మంగళవారం ఒక్కరోజే 8 కేసులు పెరిగి ఆ సంఖ్య 52కు చేరుకుంది. దీంతో ప్రభుత్వం వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. 4 కేసులు మాత్రమే రాజధాని ఆవల ఉన్నాయి. ఇప్పటివరకు రాజధానిలోనే ఉన్న కఠిన ఆంక్షలు ఇప్పుడు ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించనున్నారు. దేశమంతటా ప్రజల్లో క్రమశిక్షణ కనిపిస్తున్నందున సమస్యను పెరగకుండా చూసే అవకాశముంది. ఇంజీరాతో రోగనిరోధక శక్తి ఇథియోపియా ప్రజల సంప్రదాయ ఆహారం ఇంజీరా. గసాల ఆకారంలో ఉండే మిల్లెట్ (టెఫ్) పిండితో తయారు చేసే ఈ ఆహారం అక్కడి ప్రజల రోగ నిరోధకశక్తిని బాగా పెంచుతోంది. ఎన్నో వ్యాధుల నుంచి వారికి ఇది రక్షణగా ఉంటుంది. 80% గ్రామీణ జనాభాతో ఉండే ఈ దేశంలో కాలుష్యం చాలా తక్కువే. వెరసి ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి ఇవి ఎంతో ఉపకరిస్తున్నాయి. ఇప్పుడు కరోనాను కూడా వారి శరీరం తట్టుకునే అవకాశముంది. ఇటు భారత్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇథియోపియా జనాన్ని చూసైనా భారతీయులు స్వీయ క్రమశిక్షణ పాటిస్తే పరిస్థితి కుదుటపడే అవకాశముంది. అయితే భారత్తో పోలిస్తే మేం చాలా ధైర్యంగా ఉన్నామని డాక్టర్ రాజు రమేశ్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. -
సరైన నేతకు ‘నోబెల్ శాంతి’
శాంతి అంటే యుద్ధం లేకపోవడం ఒక్కటే కాదు... సమాజంలో అందరూ గౌరవంగా బతికే స్థితి కల్పించడం, సమానత్వం సాధించడం. ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ను ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారానికి ఎంపిక చేస్తూ... పొరుగు దేశమైన ఎరిట్రియాతో రెండు దశాబ్దాలుగా సాగుతున్న యుద్ధానికి స్వస్తి పలికి, ఆ దేశంతో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని నోబెల్ ఎంపిక కమిటీ శుక్రవారం ప్రకటించింది. అబీ సాధించిన ఇతరేతర విజ యాలు ఆ కమిటీ పరిశీలనలోకి రాకపోయి ఉండొచ్చు. లేదా వారు నిర్దేశించుకున్న నిబంధనల చట్రంలో అవి ఒదిగి ఉండకపోవచ్చు. కానీ ఆ విజయాల్లో అనేకం అత్యుత్తమమైనవి. చాలా దేశాల్లో పాలకులు అమలు మాట అటుంచి... కనీసం ఆలోచించడానికి కూడా సాహసించనివి. ఇథియో పియాలో అబీ అహ్మద్ అధికార పగ్గాలు చేపట్టి ఏడాదైంది. ఇంత తక్కువ వ్యవధిలోనే ఆయన అనూ హ్యమైన విజయాలు సాధించారు. ఆయన అనుసరించిన విధానాలు ఇథియోపియా సమాజంలో అన్ని వర్గాలు గౌరవంగా బతికే స్థితిని కల్పించాయి. దశాబ్దాలుగా ఇథియోపియాలో తెగల మధ్య సాగుతున్న ఘర్షణలను ఆయన చాలావరకూ నియంత్రించగలిగారు. లింగ వివక్షను అంతమొం దించే దిశగా అవసరమైన చర్యలు తీసుకున్నారు. తమ పొరుగున ఉన్న సుడాన్లో సైనిక పాలకు లకూ, నిరసనోద్యమ నేతలకూ మధ్య ఎడతెగకుండా సాగుతున్న పోరును ఆపి వారి మధ్య సామర స్యాన్ని నెలకొల్పారు. దేశంలో గత పాలకులు జైళ్లల్లో కుక్కిన వేలాదిమంది రాజకీయ ఖైదీలకు విముక్తి కల్పించారు. వారిని చిత్రహింసలపాలు చేసిన గత ప్రభుత్వ తీరుకు క్షమాపణ చెప్పి వారం దరికీ సాంత్వన చేకూర్చారు. ఉగ్రవాదులుగా ముద్రపడి వేరే దేశాలకు వలసపోయిన వేలాదిమంది తిరిగొచ్చేందుకు దోహదపడ్డారు. పౌరుల ప్రాథమిక హక్కులను పునరుద్ధరించారు. గత ఏడాది నుంచి ఇంతవరకూ పాత్రికేయులను కటకటాల్లోకి నెట్టని ఏకైక దేశం ప్రపంచంలో ఇథియోపియా ఒక్కటే అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకటించిందంటే అబీ గొప్పతనమేమిటో తెలుసుకోవచ్చు. అంతక్రితం వరకూ మీడియాపై అమల్లో ఉన్న ఆంక్షలన్నిటినీ తొలగించారు. భావప్రకటనా స్వేచ్ఛకు వీలు కల్పించారు. దేశంలోని అమ్హారా ప్రాంతంలో మొన్న జూన్లో సైనిక తిరుగుబాటు తలెత్తిన ప్పుడు మాత్రం కొన్ని రోజులపాటు తాత్కాలికంగా ఇంటర్నెట్ను నిలిపివేశారు. ఆ తర్వాత క్షమా పణ చెప్పి పునరుద్ధరించారు. అధికారంలోకొచ్చి అయిదారు నెలలు గడవకముందే జనాభాలో సగ భాగంగా ఉన్న మహిళలకు అన్ని స్థాయిల్లోనూ సమానావకాశాలు దక్కేందుకు అబీ చర్యలు ప్రారం భించారు. తన కేబినెట్లో 50 శాతం స్థానాలను వారికి కేటాయించారు. కూటమిలోని భాగస్వామ్య పక్షాలతో మాట్లాడి ఏకాభిప్రాయం సాధించి దేశాధ్యక్ష పదవికి తొలిసారి మహిళ ఎన్నికయ్యేలా చూశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఒక మహిళను ఎంపిక చేశారు. దేశంలో ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేసి, అవినీతికి ఆస్కారం లేకుండా చేయడం అబీ సాధించిన విజయాల్లో ప్రధా నమైనది. వచ్చే ఏడాది దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా స్వేచ్ఛాయుత ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన వాగ్దానం చేశారు. ఆఫ్రికా అంటే ప్రపంచంలోని ఇతరచోట్ల చిన్న చూపు ఉంటుంది. మీడియాలో ఆ ప్రపంచం గురించిన వార్తలు పెద్దగా ఉండవు. ఆఫ్రికా దేశాల మధ్య ఘర్షణలు తలెత్తినప్పుడో, ఉగ్రవాద దాడుల్లో భారీ సంఖ్యలో జనం మరణించినప్పుడో ఆ దేశాల ప్రస్తావన కనబడుతుంది. ఆ సమయాల్లో మాత్రమే ఆఫ్రికా ఖండం గుర్తొస్తుంది. కనుక అక్కడి నేతల గురించి, వారు సాధిస్తున్న విజయాల గురించి బయటి ప్రపంచానికి పెద్దగా తెలియదు. అబీ కూడా తన సంస్కరణ విష యంలో హంగూ ఆర్భాటం ప్రదర్శించలేదు. తాను అమలు చేస్తున్న నిర్ణయాల వల్ల కలిగే ఫలితా లేమిటన్న అంశంపైనే అధికంగా దృష్టి సారించారు. అవన్నీ ఇప్పుడు కళ్లముందు కనబడుతు న్నాయి. వీటిల్లో పాశ్చాత్య ప్రపంచాన్ని అబీ అమలు చేస్తున్న ఆర్థిక సంస్కరణలు, పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించడం వగైరాలు ఆకర్షించి ఉండొచ్చు. ఎర్ర సముద్రానికి ఆవల ఉన్న ఇథియో పియాలో జరుగుతున్నదేమిటో... వాటివల్ల ఎలాంటి సత్ఫలితాలు వస్తున్నాయో యెమెన్, ఇతర గల్ఫ్ దేశాలు గుర్తించాయి. పొరుగునున్న ఉన్న సోమాలియా, జిబౌతి, సుడాన్, దక్షిణ సుడాన్ దేశాలు సైతం అబీని స్ఫూర్తిగా తీసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. పదికోట్లమంది జనాభా ఉన్న ఇథియోపియాలో ప్రధానంగా ఉన్న నాలుగైదు తెగల మధ్య నిత్యం సాగే ఘర్షణలు, పొరుగునున్న ఎరిట్రియాతో యుద్ధం ఆ దేశాన్ని కుంగదీశాయి. ఆ యుద్ధం వల్ల 80,000మంది మరణించడం మాత్రమే కాదు...లక్షలమంది వలసలు పోయారు. ఈ నిరర్ధక యుద్ధంవల్ల అసలే పేద దేశాలుగా ఉన్న ఎరిట్రియా, ఇథియోపియా ఆర్థికంగా మరింత కుంగి పోయాయి. దీన్నంతటినీ అబీ చాలావరకూ చక్కదిద్దగలిగారు. ఈసారి ఆయనతో నోబెల్ శాంతి బహుమతికి పోటీపడినవారిలో స్వీడన్ పర్యావరణ ఉద్యమకారిణి పదహారేళ్ల గ్రేటా థన్బర్గ్ ఉంది. సాధారణంగా నోబెల్ శాంతి బహుమతి చుట్టూ ఎప్పుడూ వివాదాలు అల్లుకుంటాయి. రేసులో చాలా ముందున్నారని భావించినవారి పేరు ఒక్కోసారి పరిశీలనకే రాదు. అలాగే శాంతి బహుమతి ప్రకటించిన వెంటనే ఎంపికైనవారి అనర్హతలపై ఎక్కువ చర్చ ఉంటుంది. కానీ ఈ ఏడాది అబీ విష యంలో దాదాపుగా అలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదంటే అందుకు ఆయన వ్యక్తిత్వం, ఆయన వరసపెట్టి తీసుకుంటున్న చర్యలు కారణం. ప్రపంచంలో నాగరిక దేశాలుగా చలామణి అవుతు న్నవి, అలా చలామణి అయ్యేందుకు ప్రయత్నిస్తున్నవి అబీ తీసుకుంటున్న చర్యలనూ, ఇథియోపి యాను ప్రజాస్వామిక దేశంగా, శాంతికాముక దేశంగా తీర్చిదిద్దడానికి ఆయన చేస్తున్న ప్రయత్నా లనూ గమనించాల్సి ఉంది. ఇప్పుడు ప్రకటించిన నోబెల్ శాంతి అందుకు దోహదపడితే మంచిదే. -
ఇథియోపియా ప్రధానికి శాంతి నోబెల్
స్టాక్హోమ్: ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారం ఈ ఏడాది ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీని వరించింది. ఆఫ్రికా దేశంలో శాంతి స్థాపన, అంతర్జాతీయ సహకారంలో ఆయన చేసిన కృషికిగాను ఈ అవార్డు దక్కింది. ప్రధానంగా ఇ«థియోపియాకు సరిహద్దుల్లో ఉన్న ఎరిట్రియా దేశంతో దశాబ్దాల తరబడి నెలకొని ఉన్న సరిహద్దు ఉద్రిక్తతల్ని నివారించడానికి శాంతి ఒప్పందం కుదుర్చుకోవడంలో అబీ అహ్మద్ చూపించిన చొరవకు గుర్తింపుగా ఈ అవార్డు ప్రకటిస్తున్నట్టుగా ఓస్లోలో నార్వే నోబెల్ ఇనిస్టిట్యూట్ ప్రకటించింది. ఇథియోపియా దేశానికి చెందిన వ్యక్తికి అత్యున్నత పురస్కారం రావడం ఇదే మొదటిసారి. 43 ఏళ్ల అబీ నోబెల్ పురస్కారం పొందిన 100వ విజేత. ఈ పురస్కారం కింద 90 లక్షల స్వీడిష్ క్రౌన్స్ (దాదాపు రూ.9.40 కోట్లు) అబీ అహ్మద్కు అందజేస్తారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతిని పురస్కరించుకొని డిసెంబర్ 10న నార్వేలోని ఓస్లోలో శాంతి పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. స్వీడన్ పర్యావరణ ఉద్యమకారిణి, 16 ఏళ్ల వయసున్న గ్రేటా థెన్బర్గ్ రేసులో ముందున్నారు. ఆమెకే అవార్డు వరిస్తుందని అందరూ భావించారు. కానీ చివరి నిమిషంలో అబీ అవార్డును గెల్చుకున్నారు. 20 ఏళ్ల సంక్షోభానికి తెర ఒకప్పుడు ఇథియోపియాలో భాగమైన ఎరిట్రియా సుదీర్ఘ పోరాటం చేసి 1993లో స్వతంత్ర దేశంగా అవతరించింది. అప్పట్నుంచి ఆ రెండు దేశాల మధ్య సరిహద్దు సమస్యలు ఉన్నాయి. అంతర్జాతీయ ఒప్పందాలను బేఖాతరు చేస్తూ ఎరిట్రియా 1998లో ఇథియోపియాపై సమరభేరి మోగించింది. 1998–2000 మధ్య భీకర పోరులో చివరికి ఎరిట్రియా వెనక్కి తగ్గింది. అప్పట్నుంచి ఉద్రిక్తతలు చెలరేగుతూనే ఉన్నాయి. 2018లో అబీ అహ్మద్ ప్రధానమంత్రి పగ్గాలు చేపట్టాక ఎరిట్రియా అధ్యక్షుడు ఇసాయిస్ అఫ్వెర్కికు స్నేహహస్తం అందించారు. మూడు నెలల్లోనే ఉద్రిక్తతల్ని చల్లార్చడానికి శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దేశంలో ప్రభుత్వ నిబంధనలన్నింటినీ అబీ అహ్మద్ సరళీకరించారు. కేబినెట్లో అత్యధికంగా మహిళల్ని అబీ అహ్మద్ తీసుకున్నారు. పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్నవారినీ అక్కున చేర్చుకున్నారు. దేశ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడడానికి సరళీకృత ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టారు. పొరుగు దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఏళ్ల తరబడి అభద్రతలో ఉన్న ప్రజల్లో భవిష్యత్ పట్ల భరోసాను నింపారు. ఒక ప్రధానిగా అబీ అహ్మద్ సయోధ్య, సంఘీభావం, సామాజిక న్యాయం అనే అంశాలను బాగా ప్రచారంలోకి తీసుకువచ్చారు. అతడే ఒక సైన్యం ఒక సైనికుడిగా జీవితాన్ని ప్రారంభించి సైబర్ ఇంటెలిజెన్స్ విభాగంలో సాహసోపేతంగా వ్యవహరించి, ప్రధానిగా శాంతి స్థాపనకు పలు సంస్కరణలు తీసుకువచ్చిన అబీ అహ్మద్ ప్రస్థానం ఎంతో ఆసక్తికరం. దక్షిణ ఇథియోపియాలో జిమా జోన్లో 1976లో అబీ జన్మించారు. ఆయన తండ్రి ముస్లిం. తల్లి క్రిస్టియన్. చదువుల్లో ఎప్పుడూ ముందుండేవారు. చదువుపై ఆసక్తితో ఎన్నో డిగ్రీలు సొంతం చేసుకున్నారు. శాంతిభద్రతల అంశంలో అడ్డీస్ అబాబా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు. లండన్లో గ్రీన్ విచ్ యూనివర్సిటీ నుంచి నాయకత్వ మార్పిడి అనే అంశంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. టీనేజ్లో ఉండగానే సైన్యంలో చేరారు. లెఫ్ట్నెంట్ కల్నల్ పదవి వరకు ఎదిగారు ప్రమాదాలు ఎదుర్కొని వాటిని పరిష్కరించడం అయనకు ఎంతో ఇష్టమైన విషయం. 1998–2000 మధ్య ఎరిట్రియాతో యుద్ధ సమయంలో నిఘా విభాగంలో పనిచేశారు. గూఢచారిగా మారి ఎరిట్రియా నుంచి రక్షణకు సంబంధించి పలు రహస్యాలను రాబట్టారు. 1995లో ర్వాండాలో ఐక్యరాజ్యసమితి శాంతి కార్యకర్తగా సేవలు అందించారు. 2010లో రాజకీయాల్లో చేరారు. ఒరోమో పీపుల్స్ డెమోక్రటిక్ ఆర్గనైజేషన్ సభ్యుడిగా చేరి పార్లమెంటుకి ఎన్నికయ్యారు. 2018 ఏప్రిల్లో ప్రధాని పగ్గాలు చేపట్టి దేశం దశ దిశ మార్చడానికి కృషి చేస్తున్నారు. థ్రిల్లింగ్గా ఉంది: అబీ అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి పురస్కారం ఇథియోపియా ప్రధాని అబీని వరించడంతో ఆ దేశ ప్రజలు ఆనందోత్సాహాల్లో ఉన్నారు. ఈ పురస్కారం దేశానికే గర్వకారణమని ప్రధాని కార్యాలయం ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. తనకి ఎంతో థ్రిల్లింగ్గా ఉందని అబీ అన్నారు. ఈ పురస్కారం ఆఫ్రికాకే చెందుతుందని చెప్పారు. ఈ అవార్డుతో స్ఫూర్తి పొంది ఆఫ్రికా ఖండంలో ఇతర దేశాల నాయకులు శాంతి స్థాపనకు కృషి చేస్తారని భావిస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఇథియోపియా ప్రధానికి నోబెల్ శాంతి పురస్కారం
ఓస్లో(నార్వే) : ఇథియోపియా ప్రధాన మంత్రి అబీ అహ్మద్ అలీకు(43) అరుదైన గౌరవం దక్కింది. ఈ ఏడాది గానూ నోబెల్ శాంతి పురస్కారం ఆయనను వరించింది. ఆయనకు నోబెల్ శాంతి పురస్కారం అందజేయనున్నట్టు నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. ముఖ్యంగా తమ పక్క దేశమైన ఎరిట్రియాతో ఉన్న శత్రుత్వాన్ని పరిష్కరించడానికి అలీ చేసిన కృషికి గానూ ఆయనను నోబెల్ శాంతి పురస్కారానికి ఎంపిక చేసినట్టు జ్యూరీ సభ్యులు తెలిపారు. డిసెంబర్ 10న జరిగే కార్యక్రమంలో అలీ శాంతి పురస్కారాన్ని అందుకోనున్నారు. 2018 ఏప్రిల్లో ఇథియోపియా ప్రధానిగా భాద్యతలు చేపట్టిన అహ్మద్.. సరిహద్దు దేశాలతో ఉన్న సమస్యలను పరిష్కరించడమే.. కాకుండా తన దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే విధానాలను అవలంభించారు. కేవలం ఆరు నెలల్లోనే చాలా ఏళ్ల పాటు ఇథియోపియాకు శత్రు దేశంగా ఉన్న ఎరిట్రియాతో శాంతి కుదిరేలా చేశారు. -
ఇథియోపియా ఆర్మీ చీఫ్ హత్య
అదిస్ అబాబా: ఇథియోపియా సైన్యాధిపతి సియరే మెకొన్నెన్ హత్యకు గురయ్యారు. మెకొన్నెన్ అంగరక్షకుల్లో ఒకరు ఆయనను ఇంటిలోనే కాల్చి చంపారని ప్రభుత్వ ప్రతినిధి బిలెనె సియోమ్ తెలిపారు. ఈ ఘటన జరగడానికి కొన్ని గంటల ముందు ఉత్తరాన గల అంహరలో స్వయంప్రతిపత్తి మండలి ప్రభుత్వాన్ని (అటానమస్ రీజన్)కూల్చివేసేందుకు విఫలయత్నం జరిగిందని, ఆ సందర్భంగా జరిగిన కాల్పుల్లో అంహర అధ్యక్షుడు అంబచ్యూ మెకనెన్ చనిపోయారని, పలువురు గాయపడ్డారని ఆమె చెప్పారు. అయితే, ఈ రెండు ఘటనలకు సంబంధం ఉన్నదీ లేనిదీ ఇప్పుడే చెప్పలేమన్నారు. అంహర రాజధాని బహిర్ దార్లో శనివారం మధ్యాహ్నం అధ్యక్షుడు అంబచ్యూ ఉన్నతాధికారులతో సమావేశం జరుపుతుండగా, సైన్యాధికారి అసమిన్యూ నాయకత్వంలో కొందరు వారిపై దాడి చేశారు. ఆ సందర్భంగా జరిగిన కాల్పుల్లో అంబచ్యూతో పాటు ఆయన సలహాదారుడు కూడా చనిపోయారు .అసమిన్యూ తప్పించుకున్నారని ప్రభుత్వం తెలిపింది.ఈ ఘటన జరిగిన కొన్ని గంటలకు మెకొన్నెన్ హత్య జరిగింది. ఆ సమయంలో సైన్యాధిపతితో ఉన్న రిటైర్డ్ సైన్యాధికారి కూడా చనిపోయారు. హంతకుడిని అదుపులోకి తీసుకున్నట్టు ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. గతంలో ప్రభుత్వంపై తిరుగుబాటు చేసినందుకుగాను అసమిన్యూ అరెస్టయ్యారు. గత ఏడాదే క్షమాభిక్ష కింద విడుదలయ్యారని స్థానిక మీడియా పేర్కొంది. రాజధానిలో కొన్ని గంటల పాటు కాల్పులు జరిగాయని విదేశీ జర్నలిస్టు ఒకరు తెలిపారు. విదేశీ దౌత్యవేత్తలు, అంతర్జాతీయ సంస్థలు ఉండే బోలె జిల్లాలో మెకొన్నెన్ హత్య జరగడంతో ఆయా దేశాలు తమ సిబ్బందిని అప్రమత్తం చేశాయి. అంహరలో పరిస్థితి ప్రస్తుతం పూర్తిగా అదుపులో ఉందని ప్రధాని కార్యాలయం ప్రకటించింది. జనాభా రీత్యా ఆఫ్రికాలో రెండో పెద్ద దేశమైన ఇధియోపియా ఆర్థికంగా ఎదుగుతోంది. ఏడాది క్రితం ప్రధాని పగ్గాలు చేపట్టిన అబి అహ్మద్ పలు సంస్కరణలు చేపట్టారు. అందులో భాగంగా రాజకీయ ఖైదీలను విడుదల చేశారు. రాజకీయ పార్టీలపై నిషేధాన్ని ఎత్తివేశారు. మానవ హక్కులను ఉల్లంఘించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకున్నారు. సైన్యానికి, నిఘా విభాగాలకు ఈ సంస్కరణలు రుచించకపోవడంతో వారు ప్రధానికి శత్రువులుగా మారారు. మరోవైపు అంహరా సహా దేశంలో చాలా ప్రాంతాల్లో తీవ్రమవుతున్న జాతి పోరాటాలు ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగిస్తున్నాయి. దేశంలో ఒరోమో, అంహర తెగల ప్రజలు అత్యధికంగా ఉన్నారు. ప్రత్యర్థిపై పోరాటానికి సిద్దంగా ఉండాల్సిందిగా గత వారం అసమిన్యూ అంహర తెగ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశంలో అంహర సహా తొమ్మిది అటానమస్ రీజన్లు ఉన్నాయి. సరిహద్దు విషయంలో ఈ మండళ్లలో తెగల మధ్య ఘర్షణలు చెలరేగుతున్నాయి. ఏ తెగకు ఆ తెగ స్వపరిపాలనకు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఘర్షణలు జరుగుతున్నాయి. -
శరణార్థి దినోత్సవం రోజు ప్రియాంక స్పెషల్ వీడియో
ఇటీవల కాలంలో వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న ప్రియాంక చోప్రా, సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాలుపంచుకుంటున్నారు. జూన్20న ప్రపంచ శరణార్థుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆమె ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. బాలల హక్కుల కోసం పోరాడుతున్న ఆమె ఇటీవల ఇథియోపియాలోని చిన్నారులను కలిశారు. వారితో గడిపిన క్షణాలను భావోద్వేగపూరిత వీడియో ద్వారా షేర్ చేస్తూ ‘‘ఈ ప్రపంచం భవిష్యత్తు నేటి చిన్నారుల చేతుల్లో ఉంది. కానీ, వాస్తవం ఏమిటంటే... ఈ అమాయక పిల్లలు ప్రస్తుతం తమ భవిష్యత్ పట్ల ఎటువంటి ఆలోచన లేకుండా జీవనం సాగిస్తున్నారు. అనేక కుటుంబాలు హింస, ప్రకృతి వైపరీత్యాల కారణంగా తమ ఇళ్లను విడిచి, వలస బాట పడుతున్నారు. మనం వారి పక్షాన నిలబడి, వారి భవిష్యత్కు భరోసా ఇవ్వాలి’’ అని అన్నారు. అదేవిధంగా ‘‘ఈ రోజు ప్రపంచ శరణార్థుల దినోత్సవం కావునా ప్రపంచంలోని శరణార్థులందరికీ నా ప్రేమను పంచుతున్నాను. మీరు మీ ప్రతి కలను సాకారం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తారని కాంక్షిస్తున్నాను’’ అని 36 ఏళ్ల ప్రియాంక అన్నారు. యూనిసెఫ్లో భాగంగా ప్రియాంక జోర్డాన్, బంగ్లాదేశ్లోని శరణార్థి శిభిరాలకు వెళ్లి వచ్చారు. View this post on Instagram The truth is quite simple...the future of this world lies in the hands of the children of today. But the harsh reality is that there is an entire generation of innocent children growing up right now without any prospects for thier future...these children are affected by displacement due to serious conflict and emergencies in thier various regions. When families are forced to leave their homes due to violence, persecution, and natural disasters, they are torn apart and it's the children that end up suffering the most. The numbers are staggering, yes...but we have to continue to stand for them, in whatever capacity we can as individuals. They are the future and we need to help. Join me and @unicef by clicking the link in my bio to help keep refugee children safe. #AChildIsAChild #WorldRefugeeDay A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on Jun 19, 2019 at 10:41pm PDT -
ఇథియోపియాలో నగరవాసి మృతి!
హైదరాబాద్: తూర్పు ఆఫ్రికా దేశమైన ఇథియోపియాలో కారులో ప్రయాణిస్తున్న హైదరాబాద్కు చెందిన ఓ ఔత్సాహిక పారిశ్రామికవేత్తను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సజీవదహనం చేశారు. ఈ ఘటనలో నగరవాసి మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుడు ముషీరాబాద్లోని అశోక్నగర్ వాసి టీవీ శశిధర్గా అక్కడి పోలీసులు తేల్చారు. సన్రైజ్ మైనింగ్ పీఎల్టీ పేరిట ఇథియోపియాలో మైనింగ్ వ్యాపార సంస్థను ప్రారంభించేందుకు రెండేళ్లుగా శశిధర్ ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో తరచూ అక్కడికి వెళ్లి వస్తున్నారు. ఈనెల 9న మళ్లీ అక్కడకు వెళ్లిన శశిధర్ ముగ్గురు ఇథియోపియా దేశస్తులతో పాటుగా జపాన్కు చెందిన మరో వ్యక్తితో కలసి మంగళవారం రెండు కార్లలో బయటకు బయల్దేరారు. శశిధర్ రెండో కారులో ప్రయాణిస్తుండగా మార్గమధ్యంలో కొందరు దుండగులు అడ్డగించి కారును దహనం చేసేశారు. అయితే ముందు బయల్దేరిన మొదటి కారులోని వ్యక్తులు శశిధర్ కారు ఇంకా రావటం లేదని గమనించి వెనుదిరిగి చూసేసరికి కారు తగలబడిపోతున్నట్లు కన్పించింది. దీంతో వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనలో శశిధర్ మృతి చెంది ఉండ వచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. శశిధర్ నివాసం వద్ద విషాద ఛాయలు శశిధర్ మృతితో అశోక్నగర్లోని స్ట్రీట్ నంబర్ 2లోని జీహెచ్ఎంసీ–56 ఇంటివద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. శశిధర్కు భార్య, కూతురు తేజస్విని, కొడుకు అభిషేక్ ఉన్నారు. శశిధర్ మరణ వార్తను తెలుసుకున్న ఇక్కడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. అయితే ఇథియోపియాలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించగా, ఆయన మృతికి సంబంధించి అధికారికంగా ఎటువంటి సమాచారం రాలేదని చెప్పారని కుటుంబసభ్యులు తెలిపారు. తరచూ తమతో మాట్లాడే శశిధర్ నుంచి గత రెండ్రోజులుగా ఎటువంటి సమాచారం లేదని, ఆయన ఫోన్ కూడా కలవలేదని శశిధర్ వ్యాపార భాగస్వామి రామకృష్ణ, శశిధర్కు చెందిన ఎగ్జిమ్ కంపెనీ మేనేజర్ సంతోష్ తెలిపారు. ఈ ఘటనలో శశిధర్ తప్పించుకుని ఉండాలని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు. -
బాబోయ్ ఆ విమానాలు మాకొద్దు!
సింగపూర్ : ఆదివారం జరిగిన ఇథియోపియా విమాన ప్రమాదం నేపథ్యంలో సింగపూర్ తన విమానయాన సంస్థల వద్ద వున్న బోయింగ్ 737 విమానాలను పక్కనపెట్టాలని నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయం తాత్కలికమే అని అధికారులు తెలిపారు. ఇథియోపియా దేశ ఎయిర్లైన్స్కు చెందిన 'బోయింగ్ 737 మ్యాక్స్ - 8' విమానం బయలుదేరిన కాసేపటికే కుప్పకూలి 157 మంది మరణించడంతో సింగపూర్ ఈ నిర్ణయం తీసుకుంది. చైనా, ఇండొనేషియా కూడా సింగపూర్ బాటలోనే నడుస్తున్నాయి. ఇథియోపియా విమాన ప్రమాదం నేపథ్యంలో చైనా, ఇండోనేషియా దేశ విమానయాన సంస్థలు కూడా బోయింగ్ 737 మ్యాక్స్ విమాన సర్వీసులను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశాయి. విమానాల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైనా పేర్కొంది. ఐదు నెలల కిందట ఇదే రకం లయన్ ఎయిర్ విమానం ఇండోనేసియాలో కుప్పకూలడంతో 189 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఆదివారం ప్రమాదానికి గురైన బోయింగ్ విమానం కూడా బయలుదేరిన కొన్ని నిమిషాలకే ప్రమాదానికి గురవడంతో వీటి భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
‘ఇథియోపియా’ బ్లాక్బాక్స్ దొరికింది
ఎజియర్: ఇథియోపియాలో 157 మంది ప్రాణాలను బలిగొన్న అత్యంత విషాద విమాన ప్రమాదఘటనకు సంబంధించి కీలక ఆధారంగా భావించే బ్లాక్బాక్స్ దొరికింది. ‘విమానానికి సంబంధించి లభ్యమైన ఈ బ్లాక్బాక్స్లో విమాన సమాచారం, కాక్పిట్ వాయిస్ రికార్డు అయి ఉంది’ అని ఇథియోపియా ఎయిర్లైన్స్ సోమవారం పేర్కొంది. ‘అయితే బ్లాక్బాక్స్ పాక్షికంగా దెబ్బతింది. దాని నుంచి ఎంత సమాచారం పొందగలమనే దాన్ని మేం పరిశీలిస్తున్నాం’ అని ఎయిర్లైన్స్ అధికారి ఒకరు మీడియాకు చెప్పారు. మరోవైపు, రెడ్క్రాస్ కార్యకర్తలు విమాన కూలిన ప్రాంతంలో చెల్లాచెదురుగా పడి ఉన్న 157 మంది ఆచూకీ కోసం వెతుకుతున్నారు. ఘటనాస్థలిలో నలిగిపోయిన పాస్పోర్టులు, వస్తువులు, సామగ్రి చిందరవందరగా పడిఉన్నాయి. బోయింగ్కు చైనా షాక్! చైనా తన స్వదేశీ విమాన సంస్థలకు చెందిన దాదాపు వంద బోయింగ్ 737 మాక్స్–8 రకం విమానాల సేవలను నిలిపివేయాలని ఆదేశించింది. విమానాల భద్రత దృష్ట్యా ఈమేరకు నిర్ణయించినట్లు పేర్కొంది. అడిస్ అబాబాలో ఇథియోపియా ఎయిర్లైన్స్కు చెందిన విమానం కూలి పోయిన సంగతి తెలిసిందే. ఐదు నెలల కిందట ఇదే రకం లయన్ ఎయిర్ విమానం ఇండోనేసియాలో కుప్పకూలడంతో 189 మంది చనిపోయారు. ఇండోనేసియా, ఇథియోపియా కూడా ఈ రకం విమానాల సేవలు నిలిపివేయాలని ఆదేశించాయి. విమాన ప్రమాద నేపథ్యంలో స్వదేశీ ఎయిర్లైన్స్ నిర్వహించే ఈ రకం విమానాల భద్రతపై సమీక్ష చేపట్టాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ)ను కోరినట్లు భారత పౌర విమానయాన మంత్రి సురేశ్ ప్రభు ట్వీట్ చేశారు. -
రెండు నిమిషాలు.. ఒక ప్రాణం
ఏథెన్స్ : ఆలస్యం అమృతం విషం.. ఇది సాధారణంగా అందరూ చెప్పే మాటే కానీ! ఆ ఆలస్యమే ఓ వ్యక్తి పాలట అమృతమైంది.. అతన్ని చావునుంచి తప్పించుకునేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. అడిస్ అబాబా నుంచి కెన్యా రాజధాని నైరోబి బయల్దేరిన బోయింగ్ 737–8 మ్యాక్స్ విమానం ఆదివారం ఇథియోపియా వద్ద కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 157 మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఒక వ్యక్తి మాత్రం అదృష్టం కొద్ది.. కాదు కాదు ఆలస్యం కొద్ది ప్రాణాలతో బయటపడగలిగాడు. అతడే గ్రీకుకు చెందిన ఆంటోనిస్ మావ్రోపోలస్. ఆంటోని ‘‘ఇంటర్నేషనల్ సాలిడ్వేస్ట్ అసోషియేసన్’’ అనే ఓ స్వచ్ఛంద సంస్థకు అధ్యక్షుడు. యూఎన్ నిర్వహించే ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి నైరోబికి టిక్కెట్ బుక్ చేసుకున్నాడు. ఆదివారం ఆంటోనితో కలిపి 150మంది ప్రయాణికులతో విమానం బయలుదేరాల్సిఉంది. కానీ ఆంటోని ఆలస్యం చేయటం వల్ల 149 మంది ప్రయాణికులతోటే విమానం నైరోబి బయలుదేరింది. అనంతరం ప్రమాదానికి గురై అందులో ఉన్న వారందరూ మరణించారు. ఆలస్యం కారణంగా ఎయిర్ పోర్టు అధికారులతో చివాట్లు తిన్న ఆంటోని మాత్రం క్షేమంగా మిగిలాడు. ఈ సంఘటనపై ఆంటోని స్పందిస్తూ.. ‘‘ఆ రోజు నేను విమానాశ్రయానికి తొందరగా వెళ్లాలని చాలా ప్రయత్నించాను. కానీ నాకెవ్వరూ సహాయం చేయలేదు. అప్పుడు నాకు పిచ్చిపట్టినట్లైంద’’ని తెలిపాడు. విమానం కూలిపోయిందన్న విషయం తెలుసుకుని మొదట బాధపడ్డా తను ఆ విమానంలో లేనందుకు సంతోషించాడు. తన ఫేస్ బుక్ పేజీలో ‘‘ మై లక్కీ డే’’ అని ఫోటోలను ఉంచి ఆనందాన్ని వ్యక్తం చేశాడు. చదవండి : ఇథియోపియా మృతుల్లో గుంటూరు యువతి -
ఇథియోపియా మృతుల్లో గుంటూరు యువతి
సాక్షి, గుంటూరు : ఆఫ్రికా దేశంలోని ఇథియోపియా గగనతలంలో ఆదివారం బోయింగ్ 737–8 మ్యాక్స్ విమానం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న సిబ్బంది, ప్రయాణికులు మొత్తం 157 మంది చనిపోయారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారిలో నలుగురు భారతీయులు ఉండగా ఒకరిని ఆంధ్రప్రదేశ్ గుంటూరుకు చెందిన యువతి నూకవరపు మనీషాగా అధికారులు గుర్తించారు. గుంటూరు వైద్య కళాశాలలో ఎమ్బీబీఎస్ పూర్తి చేసిన మనీషా అమెరికాలో ఉన్నత చదువులు చదివి అక్కడే స్థిరపడింది. నైరోబిలోని తన అక్కను చూడడానికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మనీషా మృతితో ఉంగుటూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చదవండి : ఇథియోపియాలో కూలిన విమానం -
ఇథియోపియాలో కూలిన విమానం
అడిస్ అబాబా: ఆఫ్రికా దేశం ఇథియోపియా గగనతలంలో ఆదివారం పెను విషాదం చోటు చేసుకుంది. రాజధాని అడిస్ అబాబా నుంచి కెన్యా రాజధాని నైరోబి బయల్దేరిన బోయింగ్ 737–8 మ్యాక్స్ విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న సిబ్బంది, ప్రయాణికులు మొత్తం 157 మంది చనిపోయారు. మృతుల్లో నలుగురు భారతీ యులుసహా చైనీయులు, కెనడా, అమెరికా దేశాల పౌరులున్నట్లు తెలిసింది. ఈ ప్రమాదా నికి కారణమేంటో తెలియరాలేదు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ప్రయాణికులు బతికున్నట్లు సమాచారమేదీ లేదని ఇథియోపియా ప్రధాని కార్యా లయం ప్రకటించింది. విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది అంతా చనిపోయారని, మృతుల్లో 33 దేశాలకు చెందిన వారు ఉన్నారని ఇథియోపియా ప్రభుత్వ రంగ మీడియా సంస్థ ఈబీసీ వెల్లడించింది. బయల్దేరిన ఆరు నిమిషాలకే.. అడిస్ అబాబాలోని బోలె విమానాశ్రయం నుంచి బయల్దేరిన ఇథియోపియా ప్రభుత్వ రంగ సంస్థ ఇథియోపియన్ ఎయిర్లైన్స్ విమా నం ఆరు నిమిషాలకే కుప్పకూలింది. దక్షిణ అడిస్ అబాబాకు సుమారు 50 కి.మీ దూరం లోని బిషోఫ్తులో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8.44 గంటలకు ఈ ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో విమానంలో ఉన్న 149 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది మృతిచెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. ప్రమాదాన్ని పసిగట్టిన పైలట్ ఎమర్జెన్సీ కాల్ చేశాడని, వెనక్కి వచ్చేందుకు అనుమతి ఇచ్చామని విమానయాన సంస్థ సీఈవో తెలిపారు. విమానం టేకాఫ్ అయిన తరువాత అస్థిర వేగంతో పైకి ఎగిరిందని ఎయిర్ ట్రాఫిక్ మానిటర్ వెల్లడించారు. ప్రమాదానికి గురైన విమానం బోయింగ్ 737–8 మ్యాక్స్ గత నవంబర్లోనే ఎయిర్లైన్స్లో చేరినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో 32 మంది కెన్యా, 9 మంది ఇథియోఫియా, 18 మంది కెనడా పౌరులున్నట్లు చెప్పారు. అలాగే, చైనా, అమెరికా, ఇటలీ నుంచి ఎనిమిది మంది చొప్పున, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల నుంచి ఏడుగురు చొప్పున, ఈజిప్టు నుంచి ఆరుగురు, నెదర్లాండ్స్ నుంచి ఐదుగురు, భారత్, స్లోవేకియా నుంచి నలుగురేసి చొప్పున ప్రయాణికులు ఉన్నట్లు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు ఇథియోపియా ప్రధాన మంత్రి కార్యాలయం ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఈ దుర్ఘటనపై విమాన తయారీ సంస్థ బోయింగ్ విచారం వ్యక్తం చేసింది. భారతీయ మృతుల గుర్తింపు.. విమాన ప్రమాదంలో మరణించిన భారతీయుల వివరాలను ఇథియోపియా రాయబార కార్యాలయం వెల్లడించింది. అందులో కేంద్ర పర్యావరణ శాఖకు సలహాదారుగా పనిచేస్తున్న ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం కన్సల్టెంట్ శిఖా గార్గ్ ఉన్నారని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ చెప్పారు. గార్గ్ యూఎన్ఈపీ సమావేశానికి వెళ్తున్నారని చెప్పారు. మిగిలిన ముగ్గురు వైద్య పన్నాగేశ్ భాస్కర్, వైద్య హాసిన్ అన్నాగేశ్, నూకవరపు మనీషా అని వెల్లడించారు. మృతుల కుటుంబాలకు మంత్రులు సుష్మా స్వరాజ్, హర్షవర్థన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
జింబాబ్వే అధ్యక్షుడిపై హత్యాయత్నం
బులవాయో: జింబాబ్వే అధ్యక్షుడు ఎమర్సన్ మునగాగ్వా(75) బాంబు దాడి నుంచి సురక్షితంగా బయటపడ్డారు. శనివారం బులవాయోలో జరిగిన అధికార జింబాబ్వే ఆఫ్రికన్ నేషనల్ యూనియన్–పేట్రియాటిక్ ఫ్రంట్ (జాను–పీఎఫ్)పార్టీ ర్యాలీలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, దేశ ఉపాధ్యక్షుడితోపాటు మరికొందరు నేతలు, ప్రజలు గాయపడ్డారు. ప్రసంగం ముగిసిన అనంతరం అధ్యక్షుడు మునగాగ్వా వేదిక దిగి వస్తుండగా ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఉపాధ్యక్షుడు కెమో మొహాది, జాను–పీఎఫ్ ఉపాధ్యక్షురాలు, క్యాబినెట్ మంత్రి ఒప్పా ముచింగురి–కషిరి, పార్టీ కార్యదర్శి ఎంగెల్బర్ట్ రుగెజె గాయపడ్డారని అధికార మీడియా తెలిపింది. అధ్యక్షుడు లక్ష్యంగానే ఈ దాడి జరిగిందనీ, దీనిపై దర్యాప్తు జరుపుతున్నామని హోం మంత్రి ఒబెర్ట్ ముఫొఫు తెలిపారు. ఘటన అనంతరం అధ్యక్షుడిని వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలిపారు. జూలై 30వ తేదీన జరిగే దేశాధ్యక్ష ఎన్నికలకు గాను అధ్యక్షుడు శనివారం బులవాయోలో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఇథియోపియా ప్రధానిపై కూడా.. అడిస్అబాబా: ఇథియోపియా ప్రధాని శనివారం గ్రెనేడ్ దాడి నుంచి త్రుటిలో బయటపడ్డారు. సంస్కరణల వాదిగా పేరున్న ప్రధాని అబియ్ అహ్మద్(42) శనివారం రాజధాని అడిస్అబాబాలో జరిగిన భారీ ర్యాలీనుద్దేశించి ప్రసంగించిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది. ఆయన్ను వెంటనే భద్రతా బలగాలు సురక్షిత ప్రాంతానికి తరలించాయి. ఈ ఘటనలో ఒకరు చనిపోగా 83మంది గాయపడ్డారు. ఈ ఘటన అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. ‘ఇది పథకం ప్రకారం జరిగిన దాడి. ప్రజలను విడదీయటానికి జరిగే ప్రయత్నం విజయవంతం కాబోదు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. గత ఏప్రిల్లో అధికార పగ్గాలు చేపట్టిన అహ్మద్.. జైళ్లలో ఉన్న వేలాది మంది ఖైదీలను విడుదల చేశారు. ప్రభుత్వ కంపెనీల్లో ప్రైవేట్ పెట్టుబడులకు దారులు తెరిచారు. -
టాప్ ఇండియన్ ఎగ్జిక్యూటివ్ కాల్చివేత
ఓ టాప్ ఇండియన్ ఎగ్జిక్యూటివ్ గుర్తు తెలియని దుండగుల చేతిలో హత్యకు గురయ్యారు. నైజిరియాకు చెందిన డాగెంట్ సిమెంట్ కంపెనీకి కంట్రీ మేనేజర్గా పనిచేస్తున్న దీప్ కామ్రాను ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఇథియోపియాలో హత్య చేసినట్టు మీడియా రిపోర్టులు పేర్కొన్నాయి. ఆయనతో పాటు మరో ఇద్దరిని కూడా వారు హత్య చేశారు. సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి అడ్డిస్ అబాబాకు తిరుగు ప్రయాణమైన దీప్ కామ్రాను ఓరోమియా ప్రాంతంలో దుండగులు అడ్డగించి ఈ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కామ్రాతో పాటు ఆయన సెక్రటరీ, డ్రైవర్ కూడా మరణించినట్టు అక్కడి ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ఆ దుండగులను పట్టుకోవడానికి సెక్యురిటీ బలగాలు రంగంలోకి దింపినట్టు పేర్కొంది. నైజిరియాకు చెందిన డాంగెట్ కంపెనీ ఆఫ్రికాలో 10 ప్రాంతాల్లో తన కార్యకాలపాలను సాగిస్తోంది. ఇథియోపియాలో అతిపెద్ద సిమెంట్ ఉత్పత్తిదారిగా డాంగెట్ కంపెనీ ఉంది. అత్యధిక నైపుణ్యమున్న 32.5, 42.5 గ్రేడ్ సిమెంట్ను ఉత్పత్తి చేస్తూ.. మార్కెట్ అవసరాలను ఇది అతి సులువుగా చేధిస్తోంది. -
రెండు ముక్కలుకానున్న ఆఫ్రికా ఖండం..??
సాక్షి, వెబ్ డెస్క్ : ప్రపంచంలో రెండో అతిపెద్ద ఖండమైన ఆఫ్రికా రెండుగా చీలిపోనుందా..? ఆఫ్రికా వాసుల మెదళ్లను ప్రస్తుతం తొలుస్తున్న ప్రశ్న ఇదే. కెన్యా రాజధాని నైరోబికి చేరువలోని హైవేపై ఏర్పడిన పగులు ఈ ఆందోళనలకు కేంద్ర బిందువు అయింది. టెక్టోనిక్ ప్లేట్లలో నైరుబీ వద్ద వస్తున్న కదలికలు ఆఫ్రికా రెండుగా విడిపోతుందనే నమ్మకాన్ని బలపరుస్తున్నాయి. నైరుతీ కెన్యాలో గల రిఫ్ట్ వ్యాలీ వద్ద భారీ పగులు ఏర్పడింది. కొన్ని మైళ్ల పాటు విస్తరించిన ఈ పగులు కారణంగా నైరోబీ-నరోక్ హైవే కూడా దెబ్బతింది. అంతేకాదు కొన్ని ఇళ్లు సగానికి చీలిపోయాయి కూడా. ఈ పగులు కారణంగా భవిష్యత్లో ఆఫ్రికా రెండు ముక్కలు అవుంతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే ఇందుకు కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుందని చెప్పారు. నుబియన్ ప్లేట్ నుంచి సోమాలి టెక్టానిక్ ప్లేట్ విడిపోయే క్రమంలో ఈ చీలిక జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అతి నెమ్మదిగా జరిగే ఈ ప్రక్రియ కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత పూర్తవుతుందని వివరించారు. ప్రకృతి బద్దంగా జరిగే ఈ ప్రక్రియను అడ్డుకోవడం అసాధ్యమని పేర్కొన్నారు. విడిపోయే ముక్కలో ఉండే సోమాలియా, కెన్యా, ఇథియోపియాలు హిందూ మహాసముద్రంలో ద్వీపాలుగా మారుతాయని చెప్పారు. దీనివల్ల ఆఫ్రికా ఖండం చిన్నగా మారుతుందన్నారు. -
బంగారు దేశం!
ఆఫ్రికా దేశం ఇథియోపియా అంటే కేవలం పేదరికం, యుద్ధాలు, అంతర్యుద్ధాలే గుర్తొస్తాయి. కానీ ప్రపంచంలోనే మరే దేశంలోనూ లేనంత బంగారం ఈ దేశ భూగర్భంలో ఉండొచ్చని శాస్త్రవేత్తలు తాజాగా చెబుతున్నారు.ఈ స్వర్ణ లోహాన్నంతటినీ వెలికి తీయడం ప్రారంభిస్తే బంగారం ఉత్పత్తిలో ఇథియోపియా దక్షిణాఫ్రికాను కూడా వెనక్కి నెట్టే అవకాశం ఉంటుందన్నారు. స్కాట్లాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ అబెర్దీన్కు చెందిన లియామ్ బుల్లాక్, ఒవెన్ మోర్గాన్ అనే ఇద్దరు భూగర్భ శాస్త్రజ్ఞులు ఇథియోపియాలో పరిశోధనలు సాగించారు. ఇథియోపియా పశ్చిమ భాగాన, సూడాన్ సరిహద్దుకు దగ్గర్లో అసోసా అనే ప్రాంతం ఉంటుంది. మైదానాలు, పర్వత ప్రాంతాలు, లోయలు, నదీ ప్రవాహాలతో కలగలసి ఉండే ఇథియోపియాలో దట్టమైన అడవులూ బాగా ఎక్కువే. 1930 నుంచి 1974 వరకు ఇథియోపియా చక్రవర్తిగా ఉన్న హైలీ సెలాస్సీ అసోసాలో బంగారాన్ని వెలికి తీయడంపై శ్రద్ధ చూపారు. అనంతరం అంతర్యుద్ధం తదితర కారణాలతో బంగారు గనుల తవ్వకాల గురించి ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. మళ్లీ 2000 తర్వాత ప్రభుత్వం గనుల తవ్వకాలకు లైసెన్సులు ఇవ్వడం ప్రారంభించింది. తులు కపి అనే ప్రాంతం నుంచి ఇప్పటికే 48 టన్నుల బంగారాన్ని బయటకు తీశారు. అసోసా ప్రాంతంలోనూ 48 టన్నుల బంగారమే ఉందని ఈజిప్టుకు చెందిన ఆస్కామ్ అనే కంపెనీ గుర్తించింది. వాస్తవానికి ఇంకా చాలా ఎక్కువ మొత్తంలో బంగారం ఉంటుందని అంచనా వేస్తున్నట్లు శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. -
ఆవు రక్తం తాగే ఆచారం వారిది
ఆడిస్ అబాబా: ఇథియోపియాలోని బోడి తెగకు చెందిన ఆదివాసీల్లో ఓ విచిత్ర ఆచారం ఇప్పటీకి అమల్లో ఉంది. వారు కొత్త సంవత్సరంగా పిలిచే 'కాయెల్' వేడుకలను పురస్కరించుకొని ప్రతి ఏటా పెళ్లికాని యువకులకు ఓ పోటీని నిర్వహిస్తారు. ఆ యువకులు ఆరు నెలలపాటు ప్రతి రోజు సూర్యోదయం నుంచి లీటర్ల కొద్ది ఆవు పాలు, ఆవు రక్తం తాగుతూ బరువు పెంచుకోవాలి. ఒక ఆరు నెలలపాటు ఇలా చేసిన తర్వాత వారి తెగలో ఎవరు ఎక్కువ బరువు పెరుగుతారో, ఎవరి నడుము చుట్టు కొలత ఎక్కువగా ఉంటుందో వారిని విజేతగా ప్రకటిస్తారు. ప్రతి ఏటా ఒక్క పెళ్లి కాని యువకుడిగా ఎంపిక చేస్తారు. ఆ విజేతకు ఎలాంటి బహుమతులు ఇవ్వరు. వారిని తెగవారంతా ఎంతో మర్యాదగా గౌరవిస్తారు. ఆరాధ్య భావంతో చూస్తారు. ఆ యువకుడితో లైంగిక వాంఛలు తీర్చుకునేందుకు మహిళలు తహతహలాడుతారు. జూన్లో ప్రారంభమయ్యే కొత్త సంవత్సరం వేడుకలను పురస్కరించుకొని ఆరు నెలల ముందుగా ఈ విచిత్ర పోటీని మొదలు పెడతారు. ఈ పోటీకి ప్రతి ఇంటి నుంచి ఓ పెళ్లికాని యువకుడిని పంపించవచ్చు. పోటీలో పాల్గొనే ప్రతి యువకుడు ఆరు నెలలపాటు సెక్స్కు దూరంగా ఉండాలి. గుడిసె పరిసరాలను వదిలి బయటకు వెళ్లడానికి వీల్లేదు. ఆవు పాలు, రక్తం తాగడమే పనిగా పెట్టుకోవాలి. కొందరు పచ్చిపాలు, రక్తం మోతాదుకు మించి తాగలేక వాంతులు చేసుకుంటారు. అర్ధంతరంగా పోటీల నుంచి కూడా నిష్క్రమిస్తారు. పోటీలో కొనసాగిన వారికి ఆరు నెలలపాటు కావాల్సిన పచ్చి ఆవు పాలను పెద్ద పాత్రల్లో సొంతింటి వాళ్లు, పక్కింటివాళ్లు తెచ్చి పోస్తారు. పోటీలో పాల్గొనే యువకులు ఆవు పచ్చి రక్తాన్ని తాగుతారు తప్ప వాటిని చంపరు. ఎంతో గౌరవంగా ఆవులను చూస్తారు. తాగే రక్తం కోసం మాత్రం వాటి నరాలకు రంధ్రంచేసి రక్తం పడతారు. తర్వాత బంక మన్నుతో ఆ రంధ్రాన్ని పూడ్చేస్తారు. బోడి తెగలో యుగ యుగాలుగా కొనసాగుతున్న ఈ ఆచారం మరెంతో కాలం మనుగడలో ఉండకపోవచ్చని సామాజిక శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఎందుకంటే ఇథియోపిలో నివసిస్తున్న ఈ తెగకు చెందిన దాదాపు మూడు లక్షల మందికి పునరావాసం కల్పించాలని ప్రభుత్వం ఇటీవలనే నిర్ణయించింది. -
చెత్తకుప్పలు మీద పడి 35 మంది మృతి
-
ఇథియోపియాలో తెలుగువారు సురక్షితం
సాక్షి, న్యూఢిల్లీ: ఇథియోపియాలోని బాలెరోబోలో చిక్కుకున్న దాదాపుగా 30 మంది తెలుగువారు క్షేమంగా ఉన్నారని, మాడవలబు వర్సిటీ లోపలి వారు సురక్షితంగా ఉన్నారని ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు తెలిపారు. ఓరోమో వర్గీయులు తమ నిరసనలో భాగంగా బాలెరోబోకి వెళ్లే రహదారులను మూసివేయడంతో తెలుగు వారు బాలెరోబోలోని వర్సిటీలో చిక్కుకున్నారు. తమకు మరిన్ని హక్కులు కావాలని, ప్రజాస్వామ్యం నెలకొనాలని ఒరిమోలు నిరసనలు చేపట్టారు. ఇథియోపియాలోని భారత రాయబార కార్యాలయం అధికారులు మాడవలబు వర్సిటీ అధ్యాపకులతో మాట్లాడారని, తెలుగువారు సురక్షితమని ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు తెలిపారు -
ఇథియెఫియాలో చిక్కుకున్న తెలుగు ప్రొఫెసర్లు
ఆఫ్రికా: తూర్పు ఆఫ్రికాలోని ఇథియెఫియాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రొఫెసర్లు చిక్కుకున్నారు. బాలేరోబో సిటీలోని మడవలబు యూనివర్సిటీలో చిక్కుకున్న వారిలో 30 మంది తెలుగు ప్రొఫెసర్లు ఉన్నారు. పాలన, ప్రజాస్వామ్యంలో హక్కుల కోసం అక్కడి ప్రజలు ఇథియోపియాలో రహదారిని దిగ్బంధించడంతో వీరు చిక్కుకుపోయారు. దీంతో వారం రోజులుగా ప్రొఫెసర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలుగు ప్రొఫెసర్లు క్షేమంగా ఉన్నట్లు భారత రాయబార కార్యాలయం సోమవారం తెలిపింది. వారిని సురక్షితంగా భారత్ రప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు చెప్పారు. దీనిపై ఇథియోపియా ఎంపసీ అధికారులతో మాట్లాడుతున్నామన్నారు. ప్రొఫెసర్ల కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. వారిని క్షేమంగా తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని వారి కుటుంబసభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
పెళ్లి కావాలంటే 'దూకుడు' ఉండాల్సిందే!
ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి ఆఫ్రికా దేశం ఇథియోపియా గిరిజన ప్రాంతం ఓమీ లోయకు చెందిన హమర్ తెగ యువకుడు. ఇతడు ఇలా ఎద్దులపై నుంచి దూకడం వెనుక పెద్ద కథే ఉంది. అది ఏంటంటే.. పెళ్లీడుకు వచ్చిన యువకులు తమకు నచ్చిన యువతిని ఎంచుకోవడానికి హమర్ గిరిజన పెద్దలు ఏటా ‘జంపింగ్’ పోటీలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వరుసగా నాలుగు కంటే ఎక్కువ ఎద్దులను నిలబెడతారు. వీటన్నింటిపై నుంచి కింద పడకుండా నడిచి అవతలివైపు దూకేయాలి. అలా చేసిన యువకులు మాత్రమే పెళ్లికి అర్హత సాధిస్తారు. లేదా నాలుగైదు ఎద్దుల పైనుంచి నేరుగా ఎగిరి దూకిన వారు పోటీలో గెలుపొందినట్లే. పోటీలో విఫలమైతే కొన్నిసార్లు జీవితాంతం బ్రహ్మచర్యం పాటించాల్సి ఉంటుందట. పెళ్లి జరిగిన రోజు మాత్రం దంపతులు అలసిపోయేలా తమ తెగకు సంబంధించిన పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. పెళ్లి తర్వాత ఇక్కడి తెగ వారు మరో వింత ఆచారాన్ని పాటిస్తుంటారు. భర్త చేతిలో ఓ తాడులాంటి వస్తువుతో భార్యను కొడతాడు. అలా తనకు నచ్చిన రీతిలో, కాస్త సమయం చెలరేగిపోయి భార్యను కొట్టి ఆపేస్తారు. తెగలో కొందరైతే కర్రసాములో పాల్గొని విజేతగా నిలిచిన వారు పెళ్లి చేసుకుని జీవితాన్ని గడుపుతుంటారు. ఓడిన వాళ్లు మరో ఏడాది మళ్లీ ప్రయత్నించి ఏదో రకంగా కొన్ని నియమాలలో విజయం సాధించి వివాహానికి అర్హత సాధిస్తారు. హమర్ తెగలో వివాహ వయసు పురుషులకు దాదాపు 30 ఏళ్లకు పైగా ఉండగా.. మహిళలకు 17 ఏళ్లు నిండితే చాలు. కాబోయే భార్య కుటుంబానికి వరుడు పెద్ద మొత్తంలో సంపదను ఇచ్చుకోవాల్సి ఉంటుంది. 30 మేకలు లేదా గొర్రెలను అత్తింటివారికి వరుడు సమర్పించుకోవాలి. అయితే చాలావరకూ పురుషులు తమ జీవితకాలంలో చెప్పినమేరకు మేకలు, గొర్రెలను ఇచ్చుకోవడంలో విఫలమవుతుంటారు. ఈ తెగలో భార్యలతే పెత్తనం. వయసులో భర్త పెద్దవాడు కావడం, భార్య యుక్తవయసులో ఉండటమే ఇందుకు కారణమని చెప్పవచ్చు. -
23 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు
మహిళల 10 వేల మీటర్ల రేసులో అల్మాజ్ అయానాకు స్వర్ణం 29ని:17.45 సెకన్లతో కొత్త ప్రపంచ రికార్డు రియో డి జనీరో: ప్రేక్షకులు అంతంత మాత్రంగానే హాజరైనా... రియో ఒలింపిక్స్ అథ్లెటిక్స్ పోటీల తొలి రోజే ప్రపంచ రికార్డు బద్దలైంది. శుక్రవారం జరిగిన మహిళల 10 వేల మీటర్ల రేసులో ఇథియోపియా అథ్లెట్ అల్మాజ్ అయానా ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. 29 నిమిషాల 17.45 సెకన్లలో గమ్యానికి చేరుకున్న అయానా... ఈ క్రమంలో 1993లో 29 నిమిషాల 31.78 సెకన్లతో వాంగ్ జున్జియా (చైనా) నెలకొల్పిన ప్రపంచ రికార్డును తిరగరాసింది. అయానా ధాటికి ఈ విభాగంలో ప్రపంచ చాంపియన్ వివియన్ చెరియోట్ (కెన్యా-29ని:32.53 సెకన్లు) రజతం దక్కించుకోగా... డిఫెండింగ్ చాంపియన్ తిరునిష్ దిబాబా (ఇథియోపియా-29ని:42.56 సెకన్లు) కాంస్యపతకంతో సంతృప్తి పడింది. 24 ఏళ్ల అయానా 10 వేల మీటర్ల రేసులో పాల్గొనడం ఇది రెండోసారి మాత్రమే కావడం విశేషం. రెండు నెలల క్రితం ఇథియోపియా జాతీయ ట్రయల్స్లో తొలిసారి 10 వేల మీటర్ల రేసులో పాల్గొని అత్యుత్తమ సమయాన్ని నమోదు చేసి ఆమె రియో బెర్త్ను ఖాయం చేసుకుంది. ఒలింపిక్స్ క్రీడల వేదికలో 10 వేల మీటర్ల విభాగంలో ప్రపంచ రికార్డు నెలకొల్పిన తొలి మహిళా అథ్లెట్గా అయానా గుర్తింపు పొందింది. -
భూతల నరకం
భూతల నరకం అనే మాటను విని ఉండకపోవచ్చు గానీ... చూడవచ్చు! . ఇథియోపియాలోని ‘ఎర్టా ఆలే’ను భూతల నరకం (గేట్ వే ఆఫ్ హెల్) అని పిలుస్తారు. భూమి అంతర్గత పొరల్లో ఉండే తీవ్రమైన ఉష్ణోగ్రత వల్ల రాళ్లు సైతం కరగి ద్రవరూపంలోకి మారుతాయి. ఇలా కుతకుతలాడిపోయే రాతి ద్రవాన్ని లావా అంటారన్న విషయం తెలిసిందే. ఎర్టా ఆలే అన్నది నిజానికి ఒక అగ్నిపర్వతం. అయితే దీని వాలు మరీ ఎక్కువగా ఉండదు. దీని ఎత్తు కేవలం 613 మీటర్లు మాత్రమే. అయితే వాలు తక్కువగా ఉన్న దీని ముఖద్వారం (క్రేటర్) నుంచి లావా ఉడికిపోతూ పైకి ఉబుకుతూ ఉంటుంది. ఈ లావా అంతా ఒక ద్రవరూప అగ్నిసరస్సులా ఉంటుంది. ప్రపంచంలోని ప్రాచీన అగ్నిసరస్సులలో ఇది కూడా ఒకటి. 1906 నుంచి రగులుతూనే ఉంది.శాస్త్రీయ వాస్తవాలతో సంబంధం లేకుండా ఈ అగ్నిసరస్సు చుట్టూ ఎన్నో కాల్పనిక కథలు ఉన్నాయి. -
ఇథియోపియాలో 400 మంది హత్య
అడిస్ అబాబా: ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన 400 మందిని ఇథియోపియా ప్రభుత్వం హతమార్చిందని ఇంగ్లండ్కు చెందిన మానవహక్కుల పరిశీలన సంస్థ ప్రకటించింది. గత ఏడాది నవంబరు నుంచి ఈ హత్యలు జరిగాయని గురువారం తెలిపింది. ఒరోమియా ప్రాంతంలో జరిగిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న వేలాది మంది ఆందోళనకారులను అరెస్టు చేశారని పేర్కొంది. రాజధాని విస్తరణ కోసం సాగు భూమిని ఉపయోగించుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఆందోళనకారులపై ఇథియోపియా ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించిందని, అరెస్టయిన వారికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా చేసిందని తెలిపింది. ఇథియోపియా ప్రభుత్వం ఈ ఆరోపణలను ఖండించింది. -
అందం సరే.. ముద్దులు ఎలా?
ముద్దు లేదా చుంబనం, ఆంగ్లంలో కిస్.. ప్రేమను వ్యక్తం చేసే ఒకానొక పద్ధతి. ఈ ప్రక్రియలో ప్రధాన పాత్రను పోషించేవి పెదవులు లేదా అధరములు. ప్రేమను వ్యక్తంచేసే ఓ తల్లి తన బిడ్డ నుదుటిపై ఆప్యాయంగా ముద్దుపెడుతుంది. కొన్ని దేశాల్లో స్వాగతం, వీడ్కోలు పలికేటప్పుడు ముద్దులు పెట్టుకోవడం సంస్కృతిలో భాగం. హ్యూమన్ ఎమోషన్స్ లో ఇంత ప్రాముఖ్యమున్న ముద్దుల ప్రక్రియకు దూరంగా ఉంటూకూడా ఆప్యాయతను పంచడం ఎలాగో ఈ ఇథియోపియన్ గిరిజన మహిళలను చూసి నేర్చుకోవాల్సిందే. అరుదైన ముర్సి తెగకు చెందిన కొన్ని కుటుంబాలు ప్రఖ్యాత మాంగో నేషనల్ పార్క్ లో జీవనం సాగిస్తున్నాయి. (వాళ్లు పార్క్ లో ఉండటంకాదు, వాళ్లు ఉంటోన్న ప్రదేశాన్నే పార్క్ గా మార్చారు). ఆ తెగ మహిళలు తమ పెదవులు ఎంత పొడవుగా సాగితే అంత అందంగా ఉంటామని నమ్ముతారు. అందుకే యుక్త వయసు రాగానే కింది పెదవిని సాగదీస్తూ లోహపు ప్లేట్లు ధరిస్తారు. పెదవిలో అమర్చిన ప్లేట్ ఎంత పెద్దగా ఉంటే అంత అందగత్తెలని వాళ్ల నమ్మకం. పోలండ్ కు చెందిన ప్రచారకర్త సెజారేఫిలే (54) ఇటీవలే ఇథియోపియాలో పర్యటించిన సందర్భంలో తనకు కనిపించిన ముర్సీ మహిళలను చూసి ఆశ్చర్యపోయారట. వారి అనుమతితో అక్కడి అందగత్తెల ఫొటోలు తీశారు. వాటిలో కొన్ని ఇవి.. -
ప్రపంచంలోనే డేంజరస్ వర్క్ ప్లేస్
అడిస్ అబాబా: కొండలు, గుట్టలు, మారుమూల ప్రదేశాల్లో కాయకష్టం చేయడం ఎంతో కష్టమని మనం అనుకుంటాం. కానీ మంటలు ఎగజిమ్ముతూ లావా ప్రవహించే అగ్ని పర్వతాల సరసన, వేడి వేడి ఆవిరిల మధ్య గంధకం కక్కే భూముల్లో పని చేయడం మరెంత కష్టం. ఇతియోపియాకు ఉత్తరానున్న డనాకిల్ డిప్రెషన్ అలాంటి స్థలమే మరి. ‘గేట్ వే ఆఫ్ హెల్’గా ముద్రపడిన ఆ ప్రదేశంలో కూడా వందలాది మంది కూలీలు కష్టించి పనిచేస్తున్నారు. సముద్ర మట్టానికి 300 అడుగుల దిగువనున్న డనాకిల్లో ఉప్పుగనులు అపారంగా ఉన్నాయి. అక్కడ ఉష్ణోగ్రత సరాసరిగా 60 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. 50 డిగ్రీలకన్నా ఎప్పుడూ తగ్గదు. భూమి నుంచి వేడి వేడి ఆవిరిలు ఉబికి వస్తుండగా, వాటి వేడికి చర్మం కాలిపోతున్నట్లు మంటపెడుతున్నా పొట్ట గడవడం కోసం పదుల సంఖ్యలో కూలీలు తెల్లవారుజాము నుంచి రాత్రి పొద్దుపోయే వరకు పనిచేస్తున్నారు. అలాంటి వేడి వాతావరణంలోనే వారు గుడిసెలు వేసుకొని కుటుంబాలతో జీవనం సాగిస్తున్నారు. వారు చతురస్రాకారంలో ఉప్పు గడ్డలను తవ్వి తీయడం, వాటిని ఒంటెలపై ఎక్కించి సమీపంలోని బర్హలే పట్టణంలోకి విక్రయానికి పంపించడం రోజువారి దినచర్య. ఉప్పుగడ్డల ఆకారంబట్టి వాటిని సాల్ట్ టైల్స్ అని పిలుస్తున్నారు. భయంకర పరిస్థితుల్లో వారు పనిచేయడాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఆస్ట్రేలియాకు చెందిన ఫొటోగ్రాఫర్ మస్సిమో రుమీ ఇటీవల అక్కడికి వెళ్లి వారి ఫొటోలను తీశారు. ప్రపంచంలో ఇంతకన్నా భయంకర వర్క్ప్లేస్ లేదేమోనని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. తాను కాసేపు కూడా అక్కడి వేడిని తట్టుకోలేకపోయానని ఆయన చెప్పారు. కఠినమైన వాతావరణంలో తాము కష్టపడి పనిచేయడం ఎంత కష్టమో, ఉప్పుటైల్స్ను ఒంటెలపైకి ఎక్కించి మూడు రోజులపాటు అగ్ని పర్వతాల సమీపం నుంచి ప్రయాణించడం అంతేకష్టమని అక్కడి కూలీలు తెలియజేశారు. తాము పొద్దంతా కష్టపడితే 200 ఉప్పు టైల్స్ను వెలికితీస్తామని, ఒక్కో టైల్కు తమకు 13 పెన్నీలు ముడుతుందని వారు చెప్పారు. -
ముంబై మారథాన్కు భారీస్పందన
జెండా ఊపి ప్రారంభించిన గవర్నర్ సీహెచ్ విద్యాసాగర రావు సాక్షి, ముంబై: నగరంలో ఆదివారం ఉదయం జరిగిన స్టాండర్డ్ చాటర్డ్ మారథాన్లో ఇథోపియా దేశానికి చెందిన అథ్లెట్లు విజయకేతనం ఎగురవేశారు. ఏకంగా ఐదు పతకాలు పురుష, మహిళ అథ్లెట్లు దక్కించుకున్నారు. ఈసారి ముంబై మారథాన్లో ఎవరు గెలుస్తారనే దానిపై ప్రారంభం నుంచి ఉత్కంఠ నెలకొంది. ఇథోపియా, కేనియా దేశాల మధ్య గట్టి పోటీ కనిపించింది. ఈ మారథాన్ను అజాద్మైదాన్వద్ద ఏర్పాటుచేసిన వేదికపై రాష్ట్ర గవర్నర్ సి.హెచ్.విద్యాసాగర్రావు జెండా చూపించి ప్రారంభించారు. ఫుల్ మారథాన్లో పురుష విభాగంలో కాంస్య (బ్రాంజ్) పతకం మినహా మిగతా ఐదు పతకాలు (పురుష విభాగంలో రెండు, మహిళా విభాగంలో మూడు) ఇథోపియా అథ్లెట్లు దక్కించుకున్నారు. మొత్తం 42 కి.మీ. దూరాన్ని (పురుష విభాగంలో) ఇథోపియాకు చెందిన తేజ్ఫాయే అబేరా 2.9.46 సెకన్లలో పూర్తిచేసి బంగారు పతకాన్ని దక్కించుకున్నారు. అలాగే డెరేజ్ డెబెలెన్ 2.10.31 సెకన్లలో పూర్తిచేసి రెండో స్థానంలో నిలిచారు. కేనియాకు చెందిన బ్ల్యూక్ కిబెట్ 2.10.57 సెక్లన్లలో పూర్తిచేసి మూడో స్థానంలో నిలిచారు. అదేవిధంగా ఫుల్ మారథాన్లో 42 కి.మీ. దూరాన్ని (మహిళ విభాగం) డిన్కేష్ మెకాష్ 2.30 నిమిషాల్లో పూర్తిచేసి మొదటి స్థానంలో నిలిచి 41వేల డాలర్ల బహుమతిని చేజిక్కించుకున్నారు. గత ఏడాది నిర్వహించిన మారథాన్లో కూడా ఆమె ఇలాగే మొదటి స్థానంలో నిలిచారు. రెండో స్థానంలో నిలిచిన కుమేషీ సిచాలాకు 2.30.56 సెకన్ల సమయం పట్టగా మూడో స్థానంలో నిలిచిన మార్టీ మెగారాకు 2.31.45 సెకన్ల సమయం పట్టింది. దేశ ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న ముంబైపై ఇప్పటికే ఉగ్రవాదుల దృష్టి ఉంది. ఈ నేపథ్యంలో మారథాన్లో ఎలాంటి అపశృతులు చోటుచేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. క్విక్ రెస్పాన్స్ టీం, బాంబు నిర్వీర్యృబందం, రాష్ట్ర భద్రత దళాలను నియమించారు. డిప్యూటీ పోలీసు కమిషనర్ ధనంజయ్ కులకర్ణి మార్గదర్శనంలో మారథాన్ వెళ్లే రహదారి వెంబడి అడుగడుగున పోలీసులను మోహరించారు. ఛత్రపతి శివాజీ టర్మినస్ (సీఎస్టీ)కు కూతవేటు దూరంలో ఉన్న ఆజాద్మైదాన్ నుంచి ఆదివారం ఉదయం ముంబై మారథాన్ ప్రారంభమైంది. బాంద్రా నుంచి తిరిగి (42 కి.మీ.) ఆజాద్మైదాన్కు చేరుకుంది. ఇందులో ఫుల్, ఆఫ్ మారథాన్ ఉండగా సుమారు నాలుగు వేలకుపైగా అథ్లెట్లు పాల్గొన్నారు. ఇందులో ముఖ్య అథ్లెట్లు సుమారు 150 వరకు ఉండగా 290 మంది వికలాంగులు ఉన్నారు. మిగతా వారిలో ప్రముఖ వ్యాపార వేత్తలు, రాజకీయ నాయకులు, పలువురు సినీ నటీ, నటులు, బుల్లి తెర నటులు, సీనియర్ సిటిజన్లు, ముంబై పోలీసు శాఖకు చెందిన సిబ్బంది ఉన్నారు. -
చివరి క్షణాలు
ఆకలి... మనిషికి అతి పెద్ద శత్రువు. గుప్పెడు మెతుకులు లేక పేగులు మెలిపడుతుంటే... కలిగే బాధ కన్నీరుగా కనుల జారుతుంటే... బతుకు మీద ఆశ అడుగంటిపోతుంది. ఇలాంటి జన్మనిచ్చినందుకు భగవంతుడి మీద సైతం కోపం వస్తుంది. ఎనభైల్లో ఇథియోపియా ప్రజల పరిస్థితి అదే! 1983 నుంచి 85 వరకు ఇథియోపియాలో దారుణమైన కరవు కమ్ముకుంది. ఆకలి మంటలకు నాలుగు లక్షల మంది జీవితాలు ఆహుతైపోయాయి. ఎక్కడ చూసినా ఆకలి కేకలు. అభాగ్యుల ఆక్రందనలు. వీధుల నిండా శవాల గుట్టలు. వాటిని పీక్కు తినడానికి వచ్చిన రాబందుల రెక్కల చప్పుళ్లు. అంతా భయానకం... బీభత్సం... బాధాకరం... హృదయ విదారకం! పెద్దవాళ్లే ఆకలికి తాళలేక అలమటిస్తుంటే... ఇక పసివాళ్ల పరిస్థితి ఎలా ఉంటుంది! డొక్కలు ఎండిపోయి, చర్మాలు అతుక్కుపోయి, ఎముకల గూళ్లలా ఉన్న బిడ్డలను చూసి కన్నవాళ్ల మనసులు కుంగిపోయేవి. కళ్లముందే బిడ్డలు నిర్జీవంగా రాలిపోతుంటే నిస్సహాయంగా చూస్తూండి పోవడం తప్ప ఏమీ చేయలేక కన్నీళ్లు పెట్టేవారు. అలాంటి పరిస్థితుల్లో తన బిడ్డని కాపాడుకోవడానికి ఓ తండ్రి పడిన తపనకు సాక్ష్యమే ఈ చిత్రం. ఆ దారుణ కరవును తరిమి కొట్టలేకపోయినా... కొందరి ప్రాణాలనైనా నిలబెట్టాలన్న ఆశతో కొన్ని ఎన్జీవోలు ఆహా రంతో అక్కడకు చేరుకున్నారు. వారు జావను ఇవ్వగానే ఓ తండ్రి... చావుబతుకుల్లో ఉన్న తన బిడ్డకు గబగబా దాన్ని తాగించసాగాడు. ‘తాగు నాన్నా తాగు’ అంటూ కొడుకును బతికించుకోవాలని తపన పడ్డాడు. అప్పుడే ఫొటోగ్రాఫర్ జాన్ ఐజక్ ఈ ఫొటో తీశాడు. కానీ దురదృష్టం... తర్వాతి రోజు రాత్రే ఆ చిన్నారి కన్నుమూశాడు. అతడు పోయినా... అతడి చివరి క్షణాలను ఈ ఫొటో తనలో దాచుకుంది. నాటి దారుణ స్థితిని ప్రపంచానికి పదే పదే గుర్తు చేస్తూనే ఉంది! -
అధరమెంతో.. అందమంత..
ఈమె ఇథియోపియాలోని సూరి తెగకు చెందిన మహిళ. నోట్లో ఈ ప్లేట్ చూశారా.. వీటిని లిప్ ప్లేట్స్ అంటారు. ఈ తెగలో ఓ సంప్రదాయముంది. అమ్మాయికి యుక్తవయసు రాగానే.. నోట్లోని పై రెండు పళ్లను తొలగిస్తారు. ఇలా మట్టితో చేసిన ప్లేట్లాంటిదాన్ని నోట్లో బిగిస్తారు. పెదాలు సాగేకొద్దీ.. ఆ సైజు పెరిగిపోతుంటుంది. ఎందుకిదంతా అంటే.. ఇదే వారి అందానికి చిహ్నమట. పెళ్లి సమయంలో వారి లిప్ ప్లేట్ ఆధారంగా పెళ్లి కూతురు తండ్రి పెళ్లి కొడుకు నుంచి కన్యాశుల్కం(ఆవులు) డిమాండ్ చేస్తాడట. చిన్నసైజు లిప్ ప్లేట్ ఉంటే.. 40 ఆవులు.. పెద్దదైతే.. 60 ఆవులు డిమాండ్ చేస్తారట. కొందరు అమ్మాయిలైతే.. చెవులకూ ప్లేట్లు తగిలించుకుంటారు. అయితే, ఈ మధ్య కొత్తతరం అమ్మాయిలు ఇలా ప్లేట్లు బిగించుకోవడానికి నిరాకరిస్తున్నారట. -
ఉత్సాహంగా పుణే మారథాన్
పింప్రి, న్యూస్లైన్: పుణే అంతర్జాతీయ మారథాన్ ఆసక్తికరంగా సాగింది. ఆదివారం ఉదయం డెక్కన్ ఖండోజీ బాబా చౌక్ నుంచి ప్రారంభమైన ఈ పోటీల్లో ముందునుంచి అనుకున్నట్టుగానే పురుష, మహిళల విభాగాల్లో ఇథియోపియో అథ్లెట్లే సత్తా చాటారు. బేలాచు ఎండలే అబానేహ పురుషుల ఫుల్ మారథాన్ను నెగ్గి కెరీర్లో తొలి టైటిల్ కైవసం చేసుకున్నాడు. పురుషుల, మహిళల హాఫ్ మారథాన్లో హబతాము అర్గా, అబేరూ జూహూదె తేసేమా నెగ్గి రెండు స్వర్ణాలను కైవసం చేసుకున్నారు. దీంతో ఇథియోపియన్ అథ్లెట్లు మూడు బంగారు పతకాలను తమ ఖాతాలో వేసుకున్నట్టయ్యింది. తమకు పోటీగా వచ్చిన కెన్యా అథ్లెట్లపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. కాగా, పురుషుల ఫుల్ మారథాన్లో ఇథియోపియా అథ్లెట్ బేలాచు ఎండలే అబానేహ 2.17.52 సెకన్లలో 42 కిలోమీటర్ల గమ్యాన్ని చేరుకొని తొలి స్థానంలో నిలిచాడు. కెన్యా అథ్లెట్ ఎజికియల్ చెరోప్ 2.18.16 సెకన్లతో రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఖడికిలోని బాంబే ఇంజనీరింగ్ గ్రూప్ నుంచి ఉదయం 7 గంటల 20 నిమిషాలకు ప్రారంభమైన హాఫ్ మారథాన్లో నగరవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అయితే విజేతలుగా ఇథియోపియన్ అథ్లెట్లే నిలిచారు. తర్వాత స్వార్గేట్ వద్ద గల నెహ్రూ స్టేడియంలో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యుడు సురేష్ కల్మాడీ, నగర మేయర్ చంచలా కోద్రే తదితరులు పాల్గొన్నారు. ప్రభావం చూపని భారత్ అథ్లెట్లు రాష్ట్ర సహకార మంత్రి హర్షవర్ధన్ పాటిల్, ప్రముఖ క్రీడాకారిణి (షూటర్) అంజలీ భగావల్ ప్రారంభించిన ఈ మారథాన్లో భారత్ అథ్లెట్లు ప్రభావం చూపలేదు. నాసిక్కు చెందిన భికు కైర్నర్ 2.27.04 సెకన్లలో గమ్యాన్ని చేరి బెస్ట్ టైమింగ్ నమోదు చేసి 16వ స్థానంలో నిలిచాడు. స్థానిక అథ్లెట్లు కే.మూర్తి (2.51.51), విజయ్ అహీర్ (3.03.33) 23, 26వ స్థానాల్లో నిలిచారు.