experience
-
జననేతతో మీ అనుభవం..
నాయకుడంటే.. అధికారం కోసం పాకులాడే వాడు కాదు. అధికారం పేరిట పెత్తనం చెలాయించడమూ కాదు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ గొప్పలు చెప్పుకోవడం అంతకంటే కాదు.. జనాల కోసం.. జనం నుంచి పుట్టేవాడు.. వారి బాగోగులను సొంతింటి మనిషిగా చూసుకునే వాడు. జనం గర్వంగా మనవాడని చెప్పుకోగలిగిన వాడు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఐదేళ్ల పాలనతో అందరి మనసులను చూరగొన్న ‘జగనన్న’! ఏపీ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం జగనన్న పాలన. విద్య, వైద్యం, వ్యవసాయం తదితర రంగాలన్నీ కొత్త పుంతలు తొక్కిన కాలమిది. రాష్ట్ర అభివృద్ధి.. ప్రజా సంక్షేమం విషయంలో ముందు చూపు ఉన్న నేత. అలాంటి నేతతో మీకూ అనుబంధం ఉందా?. 👉ఎప్పుడైనా జగన్తో కలిసి ఫొటోగానీ.. సెల్ఫీగానీ దిగారా? 👉ఆయన గురించి మీ అభిప్రాయం ఏమిటి? మాతో పంచుకోండి..మీరు చేయాల్సిందిల్లా... మీ వివరాలతో 9182729310 నెంబర్కు వాట్సాప్ చేయడమే. జగనన్న పుట్టినరోజు (డిసెంబర్ 21న) సందర్భంలో మీ ఫొటోలను, ఆ అనుభవాన్ని మేం ప్రచురిస్తాం.నోట్: సెల్ఫీ వీడియో నిమిషం వీడియో ఉండాలి. -
మలి సంధ్యా... మరో వసంతమే!
‘‘పండుటాకులము మిగిలితిమి.. ఇంకెన్ని పండుగలు చూడనుంటిమి’’ అని భర్త పదవీ విరమణ రోజు భార్య పాడుతున్నట్లుగా ఓ సినీ గీతిక సాగుతుంది. పాటలోని భావమూ మనకు భారంగా అనిపిస్తుంది, కానీ ప్రస్తుత ప్రపంచ ధోరణికి ఆ వాక్యాలు సరిపోవని అనిపిస్తుంది. వృద్ధులు పండుటాకులు కాదు. అనుభవంతో మన ముందు నిలిచే నిండైన అమృత భాండాలు.ప్రతి మనిషి జీవిత దశని రెండు ప్రధాన అంగాలుగా విభజించుకోవచ్చు. మొదటిది ఉద్యోగబాధ్యతలు నిర్వర్తిస్తూ భార్యాబిడ్డలతో కాలాన్ని గడపడం. రెండోది.. బాధ్యతలను పూర్తిచేసి, ఉద్యోగవిరమణ తర్వాత లేదా ఆరు పదులు నిండాక గడిపే కాలం. వీటిలో మొదటి దశకే ప్రాధాన్యం ఉందని, రెండో దశ పనికిరానిదని భావించడం ఏమాత్రం సమంజసం కాదు.ప్రతి జీవన దశలోనూ మనిషికి ప్రత్యేకమైన విషయాలపై శ్రద్ధ కనబరచవలసి ఉంటుంది. అదే విధంగా వృద్ధాప్యంలోనూ కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తే, మలిసంజెలో వెల్లివిరిసే కాంతులు వారికి మనోహరంగానే అగుపిస్తాయి.యవ్వనంలో పటుత్వం, బిగువు జీవులకు సహజ గుణం. వయసు పెరుగుతున్న కొద్దీ బిగువు సడలుతూ ఉంటుంది. అది శరీరానికుండే సహజ లక్షణం. గడచిపోయిన కాలం ఒక అనుభవాల సుమహారంలా పరిమళిస్తూ ఉంటుంది. ఎంతో విలువైన అనుభవాలు, అవి నేర్పిన పాఠాలను యువతరానికి నేర్పడాన్ని మించిన ఆనందం ఏముంటుంది? ప్రతి అనుభవం ఎంతో విలువైనది. ఎన్నో కష్టాలను, దుఃఖాలను దాటుకుని తెచ్చుకున్న విజయాలను పంచుకుని భావితరాలను తీర్చిదిద్దగలిగింది విశ్రాంత జీవనం గడిపి మలి సంజలో కాలం గడిపే అనుభవ సంపన్నులే. వారి అనుభవాల చేవను ఏ వ్యక్తిత్వ వికాస గ్రంథాలూ అందించలేవు. అనుభవైక వేద్యమైన వారి జీవనగమనాన్ని కొడుకులతో, మనవళ్ళతో పంచుకుంటూ గడపడం ఆహ్లాదకరమైన విషయం.దేశంలోని, ప్రపంచంలోని రకరకాల ప్రదేశాలు చూసే అవకాశం కేవలం విశ్రాంత జీవనంలోనే ఎవరికైనా సాధ్యమవుతుంది. ఉద్యోగంలో లేదా వేరే వ్యాపకంలో ఉండే పని ఒత్తిడివల్ల కొత్త ప్రదేశాలు చూసే సౌలభ్యం తక్కువగానే ఉంటుంది. ఆ విధంగా కొత్త కొత్తవిహారాల్లో సందర్శించే ప్రదేశాలు, అక్కడి వారి ఆహారపు అలవాట్లు, ప్రత్యేకమైన అభిరుచులు తిలకించి ఆనందం పొందడం ద్వారా వృద్ధుల మనసు మరింతగా ఉత్తేజితమవుతుంది. మరింతగా వాళ్ళను చిన్నవాళ్ళను చేసి ఆనంద సంభరితుల్ని చేస్తుందనడం అతిశయోక్తి కాదు.వయసు అనేది కేవలం ఒక అంకె మాత్రమే. మదిలో మెదిలే భావాలకు అనుగుణంగా మన జీవన నావ సాగుతూ ఉంటుంది. నేను ఎన్నటికీ నవ యువకుడినే అన్న భావం మదిలో నింపుకుంటే ఆనందం సముద్ర తరంగాల్లా ఉరకలు వేస్తూనే ఉంటుంది. మనం సాధించిన విజయాలూ మన జ్ఞాపకాల పందిరిలోంచి పరిమళించే మల్లికల్లా తొంగి చూస్తూ ఉత్సాహానికి ఊపిరులూదుతూనే ఉంటాయి.వ్యాఖ్యాన విశారద వెంకట్ గరికపాటివృద్ధాప్యం శాపం కాదు... ఆస్వాదిస్తే అణువణువూ ఆనందమే! ప్రతి జీవీ తమ జీవితంలో వృద్ధాప్యాన్ని ఎదుర్కొనక తప్పదు. అయితే ఈ వృద్ధాప్యాన్ని శాపంగా కాకుండా వరంగా భావించి ఆస్వాదిస్తే వృద్ధాప్యంలో కూడా హాయిగా సమయాన్ని అనుభవించవచ్చు. వృద్ధాప్యాన్ని బాధామయమని భావించకుండా, మన కోసం మనం జీవించే అద్భుత అవకాశంగా భావించిన నాడు వృద్ధాప్యం ఏమాత్రం బాధించదు. పెద్దవయసులో గుర్తుపెట్టుకోవలసింది మన వయసును కాదు.. గడిపే ప్రతి క్షణం తీసుకువచ్చే ఆనందాన్ని మాత్రమే..!! యవ్వనం కొంగ్రొత్త భోగాల సారం.. వృద్ధాప్యం అనుభవాల మణిహారం..!! -
సంపదలు సత్కార్యాలకు ద్వారాలు
సాధారణంగా సంపద అంటే డబ్బులు అనుకుంటారు. కాని, సనాతన ధర్మం ఎప్పుడు కాగితం ముక్కల్ని కాని, లోహపు బిళ్ళలని కాని ధనంగా పరిగణించినట్టు కనపడదు. అష్టలక్ష్ములు అని చేప్పే సంపదలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ధనంగా చెప్పటం జరిగింది. సత్కార్యాలు చేయటానికి చేతి నిండుగా డబ్బు లేదే అని బాధ పడ నవసరం లేదు. మనకి ఎన్నో రకాలైన సంపదలు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేయవచ్చు.సంపదలు ఉంటే ఎన్నో సత్కార్యాలు చేయవచ్చు అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. సంపదలు అనుభవించటానికి మాత్రమే అని లోకంలో ఉన్న అభిప్రాయం. కానీ, అవి ఎన్ని పనులు చేయటానికో సాధనాలు. దురదష్టవంతులు, దుర్మార్గులు అయినవారికి పతనానికి హేతువులుఅవుతాయి. సంపద అంటే ఇతరులకి ఎంత ఇచ్చినా తరగనంత ఉన్నది. తాను అనుభవించటానికి లేదే అని కొద్దిగా కూడా బాధ పడవలసిన అవసరం లేనంత ఉండటం. ఎవరికైనా ఇవ్వాలంటే ముందు తన దగ్గర ఉండాలి కదా! ఇవ్వాలని ఉద్దేశం ఉంది కాని, తన దగ్గర తగినంత లేక పోతే ఏమి చేయగలరు ఎవరైనా? అందువల్ల ఎవరికైనా సహాయం చేయాలంటే తగినంత సమకూర్చుకోవలసి ఉంటుంది. అన్నిటిని మించి ఆరోగ్యవంతమైన శరీరం ఉంది. దానితో శారీరకంగా బలహీనంగా ఉన్న వారికి సహాయం చేయ వచ్చు. బలహీనుడు మరొకరికి చేయూత నివ్వలేడు కదా! కనీసం ఈ సంపదని పెంపొందించు కోవచ్చు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం కోసమైనా ఆరోగ్యంగా, బలంగా ఉండాలి. అదీ కాక పోయినా, తాను ఇతరుల పైన ఆధార పడి ఉండకుండా ఉంటే అదే పెద్ద సహాయం. (నట్టింటి నుంచి.. నెట్టింటికి..)మరొక ప్రధాన మైన సంపద జ్ఞానసంపద. ఇతరులకి జ్ఞానాన్ని పంచాలి అంటే తన దగ్గర ఉండాలి. ఎంత చదువుకుంటే ఏం లాభం? అంటూ ఉంటారు చాలా మంది. నిజమే! దానిని ఎవరికి పంచక, తన జీవితంలో ఉపయోగపరచక పోతే వ్యర్థమే. సార్థకం చేసుకోవాలంటే తనకున్న జ్ఞానాన్ని వీలైనంత మందికి పంచుతూ పోవాలి. ఈ మాట అనగానే నాకు పెద్ద పెద్ద డిగ్రీలు లేవు నేనేం చేయ గలను? అంటారు. జ్ఞానం అంటే కళాశాలలలోనో, విశ్వవిద్యాలయాలలోనో చదివితే వచ్చేది కాదు. ఆ చదువు సహజంగా ఉన్న దానికి సహకరించ వచ్చు. అనుభవంతో, లోకాన్ని పరిశీలించటంతో వచ్చేది ఎక్కువ. ఆ జ్ఞానాన్ని తన వద్దనే ఉంచుకోకుండా పదిమందికి పంచితే నశించకుండా తరువాతి తరాలకి అందుతుంది. అందుకే ధర్మశాస్త్రాలు కూడా ఏదైనా విషయంలో కలిగిన సందేహానికి పరిష్కారం గ్రంథాలలో లభించక పోతే ఆ కుటుంబంలో వృద్ధురాలైన మహిళని అడగమని చెప్పాయి. అనుభవ జ్ఞానం అంత గొప్పది. అన్నిటినీ మించినది ప్రేమ. దీనితోఎన్నిటినో సాధించవచ్చు. ఈ సంపద పంచిన కొద్ది పెరుగుతూ ఉంటుంది. మనం ఇచ్చినదే మన సంపద. దాచుకున్నది ఏమవుతుందో తెలియదు. మనం అన్ని విధాలా సంపన్నులం అయే మార్గం తెలిసింది కదా! శారీరికంగా ఏమీ చేయలేనప్పుడు ఏ మాత్రం కష్టపడకుండా చేయగలిగిన సహాయం కూడా ఉంది. అది మాట సాయం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న వారికి మాట సహాయం చేయవచ్చు. తాను చేయ లేక పోయినా, చేసే వారిని చూపించ వచ్చు. అది కూడా తనకి అందుబాటులో లేక పోతే కష్టంలో ఉన్నప్పుడు ఓదార్పుగా ఒక్క మాట చెపితే ఎంతో ధైర్యం కలుగుతుంది. మాట్లాడితే నోటి ముత్యాలు రాలిపోవుగా! ఇదీ చేయటం రాక పోతే ఊరకున్నంత ఉత్తమం లేదు. పిచ్చి మాటలు మాట్లాడి చెడగొట్టకుండా ఉండటం కూడా గొప్ప సహాయమే అంటారు తెలిసిన పెద్దలు. నేర్పుగా మాట్లాడిన ఒక్క మాటతో సమస్యల పరిష్కారం, బాధల నుండి ఓదార్పు దొరకటం చూస్తూనే ఉంటాం. – డా. ఎన్. అనంతలక్ష్మి -
జాబ్ అంటే చావేనా? ఊపిరి తీస్తున్న ఉద్యోగాలు!
కార్పొరేట్ రంగంలో పని సంస్కృతి రానురాను విషపూరితంగా మారుతోంది. తీవ్రమైన పని ఒత్తిడితో ఉద్యోగులు సతమతవుతున్నారు. రోజూ నిద్రాహారాలు లేకుండా 15 గంటలకు పైగా సుదీర్ఘంగా పని చేయాల్సి ఉండటంతో శారీరక, మానసిక అనారోగ్యాలకు గురవుతున్నారు. ఒత్తిడి తాళలేక కొంత మంది తనువులు చాలిస్తున్నారు."పని ఒత్తిడి" కారణంగా ఎర్నెస్ట్ & యంగ్ (EY) కన్సల్టెంట్ 26 ఏళ్ల అన్నా సెబాస్టియన్ మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డెలాయిట్ మాజీ ఉద్యోగి దేశంలోని కార్పొరేట్ రంగంలో విషపూరితమైన పని సంస్కృతికి సంబంధించిన తన సొంత అనుభవాన్ని పంచుకోవడానికి ముందుకు వచ్చారు. ఇండోర్కు చెందిన జయేష్ జైన్ తన స్వానుభవాన్ని ‘ఎక్స్’(ట్విటర్)లో వివరించారు."అన్నా ఎంత ఒత్తిడి అనుభవించిందో పూర్తిగా అర్థం చేసుకోగలను" అంటూ తాను డెలాయిట్లో అనుభవించిన తీవ్రమైన ఒత్తిడిని వివరించారు. వేకువజామున 5 గంటల సమయంలో వర్క్ గురించి, తద్వారా తలెత్తిన ఆరోగ్య సమస్యల గురించి సహచరులతో చర్చించిన చాట్లకు సంబంధించిన స్క్రీన్ షాట్లను షేర్ చేశారు.రోజులో దాదాపు 20 గంటలు పని చేసేవాళ్లమని, అయితే అన్నేసి గంటలు పనిచేసినా కూడా 15 గంటలకు మించి పని చేసినట్టుగా లాగిన్లో చూపేందుకు వీలుండేది కాదని రాసుకొచ్చారు. "ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, మీరు వారికి (కంపెనీలకు) ఒక ఉద్యోగి మాత్రమే. కానీ మీ కుటుంబానికి మీరే సర్వస్వం" అంటూ ఒత్తిడి గురయ్యే ఉద్యోగులను ఉద్దేశించి హితవు పలికారు. "కార్పొరేట్ జీవితమంటేనే కఠినం. తొందరగానే అక్కడి నుండి బయటపడగలిగినందుకు సంతోషిస్తున్నాను" పోస్ట్ను ముగించారు.With EY case getting some lights. I would like to share my personal experience at Deloitte. Attaching some screenshots of chats with my team mate - friend where we were discussing the work and our health at 5AM in the morning. We use to work for around 20 hours and they won’t… pic.twitter.com/EjtqWjhwSm— Jayesh Jain (@arey_jainsaab) September 18, 2024 -
ఆ మాత్రం ఆలోచన ఎందుకు రాదు : గుత్తా జ్వాల ఫైర్, ఫోటో వైరల్
ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో పొల్గొనే భారతీయ క్రీడాకారుల యూనిఫాం డిజైన్పై అసంతృప్తి చెలరేగింది. ముఖ్యంగా తరుణ్ తహిలియానిపై విమర్శలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ముఖ్యంగా మహిళల దుస్తులపై అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి రియో ఒలింపిక్స్నాటి ఫొటోతో.. దుస్తులను, తమకెదురైన అసౌకర్యం గురించి తన అనుభవాన్ని షేర్ చేశారు. ఫోటోలను కూడా ట్వీట్ చేశారు. After not much of thinking..The garments which was made for the Indian contingent participating in Olympics this time has been a huge disappointment!! (Especially when the designer was announced I had huge expectations)First not all girls know how to wear a saree…why didn’t… pic.twitter.com/b5UjzpvUJQ— Gutta Jwala 💙 (@Guttajwala) July 28, 2024‘‘ఒలింపిక్స్లో పాల్గొనే భారత బృందం కోసం తయారు చేసిన వస్త్రాలు నిరాశ పరుస్తూనే వస్తున్నాయి. టీమిండియా దుస్తులు డిజైనర్ను ప్రకటించాక నేనైతే భారీ అంచనాలే పెట్టుకున్నా. కానీ దాదాపు అమ్మాయిలందరికీ చీర కట్టుకోవడం రాదు. ప్రస్తుత ట్రెండ్కు అనుగుణంగా రెడీ టూ వేర్ చీరను డిజైన్ చేయాలన్ని కనీస ఆలోచన ఎందుకు చేయలేక పోయారో అర్థం కాలేదు. ఆ పిచ్చి బ్లౌజ్లు, బాడీకి ఫిట్ కాక చాలా ఇబ్బందులు పడ్డాం. అస్సలు సౌకర్యంగా లేవు. పైగానాసికరంగా, చూడటానికి దారుణంగా ఉన్నాయి. భారత సంప్రదాయాలను ప్రతిబింబించేలా చీరలపై ఎంబ్రాయిడరీ లేదా హ్యాండ్ పెయింట్ ద్వారా మన కళలను ప్రదర్శించేందుకు డిజైనర్లకు అవకాశం ఉన్నాఎందుకు ఉపయోగించుకోలేదు. ఇప్పటికైనా మైదానం లోపల, బైట క్రీడాకారులకు ఇచ్చే దుస్తుల నాణ్యతపై క్రీడాకుటుంబం రాజీ లేని ధోరణి అవలంబిస్తారని ఆశిస్తున్నాను’’ అంటూ ఆమె ట్వీట్ చేశారు.దీంతో చాలామంది నెటిజన్లు కూడా గుత్తాజ్వాలకు మద్దతు పలికారు. ఇంట్రెస్టింగ్ షేడ్ అండ్ డిజైన్ ఉంటే బాగుండేది. అలాగే చుడీదార్ కుర్తా లేదా రెడీమేడ్ చీర అయితే బావుండేది. తరుణ్ తహిలియానీ భారతదేశ సంస్కృతిని ప్రదర్శించే మంచి అవకాశాన్ని కోల్పోయారని ఒకరు వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి : పీవీ సింధు ఒలింపిక్ చీరపై దుమారం.. నెట్టింట చర్చ కాగా ప్యారిస్ ఒలింపిక్స్లో భారత మహిళా క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో క్రీడాకారిణి మను భాకర్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు చరిత్ర సృష్టించేందుకు రెడీ అవుతోంది. మూడో ఒలింపిక్ మెడల్ సాధించే క్రమంలో ఆదివారం జరిగిన గ్రూప్–ఎమ్ తొలి మ్యాచ్లో సింధు 21–9, 21–6తో ఫాతిమా అబ్దుల్ రజాక్ (మాల్దీవ్స్)పై విజయం సాధించి శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం జరిగే రెండో మ్యాచ్లో సింధు.. క్రిస్టినా కుబా (ఈస్టోనియా)తో తలపడుతుంది. -
ఫ్రెషర్లకు పిడుగులాంటి వార్త!.. కొత్త ఉద్యోగాల్లో..
2024-25లో రిక్రూట్మెంట్ కార్యకలాపాలలో కొత్త పొజిషన్లను దాఖలు చేయడంపై దృష్టి పెట్టాలని సర్వేలు చెబుతున్నాయి. కొత్త ఉగ్యగాల భర్తీ కోసం అనుభవం, ప్రతిభ ఉన్న వారికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని స్టాఫింగ్ సొల్యూషన్స్ అండ్ హెచ్ఆర్ సర్వీసెస్ ప్రొవైడర్ జీనియస్ కన్సల్టెంట్స్ హైరింగ్, కాంపెన్సేషన్ & అట్రిషన్ మేనేజ్మెంట్ రిపోర్ట్ వెల్లడించింది.పరిశ్రమల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కొత్త పాత్రలను సృష్టించడం ద్వారా వృద్ధి, ఆవిష్కరణలను అభివృద్ధి చేయడం ప్రాథమిక లక్ష్యం.. అని జీనియస్ కన్సల్టెంట్స్ సీఎండీ ఆర్పీ యాదవ్ పేర్కొన్నారు. నియామకాలలో 4 నుంచి 8 సంవత్సరాలు అనుభవం ఉన్నవారికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. 32 శాతం అనుభవం ఉన్నవారికే కొత్త ఉద్యోగాల్లో అవకాశాలు ఉంటాయి.1 నుంచి 4 సంవత్సరాలు అనుభవం ఉన్న వారిని 26 శాతం, ఫ్రెషర్లను కేవలం 15 శాతం మాత్రమే రిక్రూట్ చేసుకునే అవకాశం ఉందని సమాచారం. తాత్కాలిక నియమాలు 27 శాతం, 25 శాతంతో ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్టు నియామకం, 24 శాతం గిగ్ స్టాఫ్ నియామకాలు ఉంటాయని తెలుస్తోంది. -
ఎదురయ్యే అనుభవాన్ని ఏవిధంగా తీసుకుంటావనే దానిపైనే..
చదువు వేరు జీవితం వేరు. చాలామంది అంత చదువుకున్నాడు అలా ఎలా నిర్ణయం తీసుకున్నాడు. పెద్ద పెద్ద చదువులు చదివి కూడా ఇలా ఎలా ఆలోచిస్తున్నాడు. వంటి మాటలు తరుచు వింటుంటాం. నిజానికి చదువుకి చాలా తేడా ఉంది. చదువులో రాజీ పడకుండా చదివితేనే గెలుపుని అందుకోగలం. అదే జీవితంలో బంధాలు నిలవాలన్న, కాపాడుకోవాలన్న రాజీపడాలి. అంటే ఇక్కడ ప్రతిసారి గమ్మని కూర్చొమని కాదు. తగ్గాల్సిన చోట తగ్గాలి పెదవి విప్పి గట్టిగా చెప్పాల్సినప్పుడూ చెప్పాలి. ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. ఏది మాట్లాడితే సమస్య రాదో ఎవ్వరికి గాయం కాకుండా సూటిగా విషయం అవగతమయ్యేలా చెప్పే నేర్పు, ఓర్పు కావాలి లేదంటే జీవితాలు తలకిందులవ్వుతాయి. ముందుకు అసలు జీవితంలో జరిగే ప్రతికూలతల విషయాలను ఎలా స్వీకరించాలో చూద్దాం!. జీవితంలో ఏం కావాలను కుంటారో అది చాలామందికి దక్కదు. దక్కకపోవడం సహజంగా బాధను కలిగిస్తుంది. దక్కినదాంట్లోనే ఆనందం వెతుక్కునేవారు మరోరకం. తృప్తి, అసంతృప్తి అనేవి మనుషుల ఆలోచనా విధానంలో ఉంటాయి. కొందరు నిరంతరం కావాల్సిన దానికోసం ప్రయత్నాలు సాగిస్తూనే ఉంటారు. ఏ పద్ధతిలో అన్నది ముఖ్యం. అన్నీ కలిసివస్తే అదృష్టవంతుడిగా చలామణీ అయ్యే మనిషి గెలుపును కేవలం తన ప్రతిభగా ప్రకటించుకోవడం ఎంతవరకు సమంజసం? కోరిక ఉండాలి. దాన్ని నెరవేర్చుకునేందుకు కృషి జరగాలి. ఫలితం ఎలా ఉన్నా ప్రయత్నంలో మాత్రం ఆనందం పొందాలి. లక్ష్యసాధనలో రాజీ పడకూడదు. జీవితం ఎలా రూపుదిద్దుకుంటుందో, ఎక్కడెక్కడ మలుపులు తిరుగుతుందో ఎవరూ చెప్పలేరు. మనం చేసే మంచి పనులే మన అదృష్టాన్ని నిర్ణయిస్తాయని భావించేవారు కొందరైతే, మనం గతంలో చేసుకున్నదాన్ని బట్టే ఈ స్థితి అని విశ్వసించేవారు మరికొందరు. ఎదురయ్యే అనుభవాన్ని ఏ విధంగా తీసుకుంటామన్నదే ముఖ్యం. అదే జీవితసత్యం. (చదవండి: ఆ పార్కులో మాటల్లేవ్! కేవలం నిశబ్దమే..మనుషులంతా విగ్రహాలే!) -
ఎక్స్పీరియన్స్ ఉందా? ...ఆ గృహిణిగా బోలెడంత!
ఒక ఉద్యోగంలో ఎవరైనా ఎన్ని గంటలు పని చేస్తారు? 8 గంటలు. మరి గృహిణి? 24 గంటలు. ఆ అనుభవం ఎక్కువా? ఈ అనుభవం ఎక్కువా? సీట్లో కూచుని చేసే ఉద్యోగం అనుకోండి... గృహిణికి ఇల్లే కదా సీటు. ఆ సీటు వదులుతుందా ఆమె. అందులోనే కూచుని అన్ని పనులూ చక్కబెడుతుంది. పిల్లలూ, వంట, బట్టలుతకడం, అత్తామామలను చూసుకోవడం, బంధువులొస్తే చేసి పెట్టడం.... సరే. బయట తిరిగి చేయాల్సిన ఉద్యోగం అనుకోండి. గృహిణి ఏమన్నా ఇంట్లో కూచుంటుందా ఏం? బయటే కదా తిరగాలి. పిల్లల్ని స్కూల్లో వదలడానికి, కూరగాయలు తేవడానికి, కరెంటు బిల్లు కట్టడానికి, సరుకుల కోసం, ఇంట్లో ఉండే పెద్దవాళ్లను ఆస్పత్రికి తీసుకెళ్లడానికి, మందులకూ మాకులకూ... తిరగాల్సిందే కదా. ఉద్యోగంలో నీకు అనుభవం ఉందా అనంటే ఆఫీసులో చేసిన ఉద్యోగానిది మాత్రమే అనుభవమా... గృహిణిగా ఉండి చేసింది అనుభవం కాదా? ఈ ప్రశ్నే వేసింది ఒక గృహిణి. అసలేం జరిగింది సాధారణంగా కొత్త జాబ్ వెతుక్కోవాలంటే సి.వి (రెజ్యూమె)ని పక్కాగా రెడీ చేసుకోవాలి. విద్యార్హతలు, నైపుణ్యాలతోపాటు అనుభవం తప్పనిసరిగా చెప్పాలి. ఉద్యోగం మానేసి మధ్యలో గ్యాప్ ఉంటే ఆ సమయంలో ఏం చేశామో కూడా సదరు కంపెనీకి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. దీనికోసం చాలామంది రకరకాల కారణాలను చూపిస్తుంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటోన్న ఓ మహిళ మాత్రం గతంలో ఉద్యోగం చేసి మానేసి తిరిగి ఉద్యోగానికి అప్లయి చేస్తూ గ్యాప్లో 13 ఏళ్లపాటు గృహిణిగా పని చేసానని రెజ్యూమెను అప్లోడ్ చేసింది. గ్రౌతిక్ అనే కంటెంట్ కంపెనీ వ్యవస్థాపకుడు యుగన్ష్ చోక్రా ఆమె సి.వి.ని చూసి మురిసిపోయాడు. ఈమె ఎంతో నిజాయితీగా గృహిణిగా పని చేశానని చెబుతోంది అని ప్రశంసిస్తూ సి.వి.ని లింక్డ్ఇన్లో పోస్టు చేశారు. ఈ పోస్టుప్రకారం... ఓ మహిళ గతంలో ఉద్యోగం చేసి 2009లో ఇంటి అవసరాల నిమిత్తం మానేసింది. ఇప్పుడు కాస్త వెసులుబాటు దొరకడంలో మళ్లీ చేసేందుకు రెడీ అయ్యింది. తన రెజ్యూమెని తయారు చేసింది. అందులో గ్యాప్లో ఏం చేశావ్? అనే ప్రశ్నకు పదమూడేళ్లపాటు గృహిణిగా చేశానని చెప్పింది. ‘గృహిణి అంటే ఫుల్టైమ్ జాబ్. సి.వి.లో దానిని ప్రత్యేకంగా చెప్పడం చాలా మంచి విషయం. ఎంతో మంది గ్యాప్లో ఏం చేశారంటే అక్కడ ఇక్కడ ఉద్యోగాలు చేశామని ఫేక్ ఎక్స్పీరియన్స్లు పెడుతుంటారు. కానీ ఈమె చాలా నిజాయితీగా చెప్పి తన వ్యక్తిత్వమేమిటో చెప్పకనే చెప్పింది’ అని చోక్రా ప్రశంసించారు. ఈ పోస్టును చూసిన నెటిజన్లు ఆమెను అభినందనల్లో ముంచెత్తుతున్నారు. ఇదో మేలుకొలుపు ఈ పోస్టు ఎంతో మంది మహిళలకు, కంపెనీలకు మేలుకొలుపులాంటిది. నిజానికి గృహిణిగా ఉండటానికి ఏ ఉద్యోగి అయినా గ్యాప్ తీసుకుంటే ఆమెకు అదొక ప్రత్యేక అర్హతగా భావించి ప్రత్యేక రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగం ఇచ్చే విషయాన్ని కూడా పరిశీలిస్తే తప్పు లేదు. కారణం? గృహిణిగా స్త్రీ ఇంటì ని, తద్వారా సమాజాన్ని నిలబెడుతుంది. పిల్లలను ఆరోగ్యకరంగా పెంచి మంచి పౌరులుగా సమాజానికి ఇస్తుంది. భర్త ఇంటి టెన్షన్లలో మునగకుండా పని మీద శ్రద్ధ పెట్టి మంచిగా పని చేసి వ్యవస్థ ముందుకెళ్లడంలో సాయపడుతుంది. ఇన్ని చేసిన స్త్రీ– తనకు వెసులుబాటు దొరికి ఉద్యోగం చేస్తానంటే పిలిచి ఉద్యోగం ఇవ్వాల్సిన బాధ్యత కంపెనీలకు ఉంటుంది. అలాంటి స్త్రీలను ప్రోత్సహించాల్సిన బాధ్యత సమాజానికుంటుంది. హోం మేకర్గా ఇక జీవితం అయిపోయింది అనుకోకుండా అదే ఒక అర్హతగా ఉద్యోగం వెతుక్కోవచ్చని ఈ పోస్టు భరోసా ఇస్తోంది. ఇంకెందుకు ఆలస్యం... గృహిణి అని చెప్పుకోవడానికి సిగ్గుపడకుండా ధైర్యంగా ఉద్యోగాలు వెతుక్కోండి మహిళలూ. -
ఇంటి గేటు దగ్గర ఎర్రని గుర్తులు.. నెటిజన్ల వివరణలకు మహిళ హడల్!
ప్రపంచంలో నేరాలు చేసేందుకు నేరస్తులు వివిధ మార్గాలను ఎన్నుకుంటుంటారు. కొందరు నేరస్తులు ఫోనులో బెదిరిస్తే, మరికొందరు నేరం చేసేముందు ఏదో ఒక సూచన చేస్తారు. అయితే ఇటీవల ఒక మహిళకు ఎదురైన అనుభవం ఆమెకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఆస్ట్రేలియాలోని విక్టోరియాకు చెందిన ఈ మహిళ తనకు ఎదురైన అనుభవాన్ని ఫేస్బుక్ మాధ్యమంలో అందరికీ తెలియజేసింది. ఆ మహిళ తన అనుభవాన్ని ఎఫ్బీలో తెలియజేస్తూ..‘కొద్దిరోజుల క్రితం మా ఇంటి లెటర్ బాక్స్పై ఎరుపు రంగు గుర్తులు కనిపించాయి. మరోమారు కూడా ఇంటి సైడ్ గేట్ దగ్గర మళ్లీ ఇటువంటి గుర్తులే కనిపించాయి. రెండు రోజుల క్రితం రాత్రి వేళ ఇంటి రెండవ గేటు తెరచివుంది. ఇలా ఎందుకు జరుగుతున్నదో నాకు అర్థం కాలేదు. దీనిపై నాలో ఆందోళన మొదలయ్యింది. ఆ గేటు కొంచెం కష్టంమీద తెరవాల్సి ఉంటుంది. అయినప్పటికీ గాలి కారణంగానే ఆ గేటు తెరుచుకుని ఉంటుందని భావిస్తున్నాను. ఎవరి ఇంటి దగ్గరైనా ఇటువంటి చిహ్నాలు కనిపించాయా? ఎవరికైనా ఇటువంటి అనుభవం ఎదురయ్యిందా?’ అని ఆమె నెటిజన్లను ప్రశ్నించింది. సదరు మహిళ ఈ పోస్టు విషయంలో ఎంతో సస్పెన్స్ మెయింటైన్ చేసింది. దీనిని స్పందించిన ఒక యూజర్ ‘మీ ఇంటిలోని కుక్కలను తీసుకుపోయేందుకు ఎవరో దొంగ ఈ చిహ్నాలు వేశాడని’ రాశారు. ఇటువంటి గుర్తులను కుక్కలను ఎత్తుకుపోయేవారు వేస్తుంటారని విన్నానని, మీ కుక్కలను జాగ్రత్తగా కోవాలంటూ ఆయన సలహా ఇచ్చారు. కొంతమంది యూజర్లు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేసి, సీసీటీవీ కెమెరాలు అమర్చుకోవాలని, గేటుకు తాళం వేయాలని సలహా ఇచ్చారు. కాగా ఆ మహిళ తన ఇంటి బయట ఉన్న గుర్తులకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఒక ఫొటోపై నాలుగు ఎర్రని సమాంతర రేఖలు ఉండగా, మరో ఫొటోపై ఎన్టీ ఆని రాసివుంది. మరో ఫొటోపై ఎస్ అని రాసి వుంది. దీనికి స్పందించిన ఒక యూజర్ ఎన్టీ అంటే ‘నో థ్రెట్’ ఎస్ అంటే సెక్యూరిటీ ఉందని పేర్కొన్నారు. చివరకు ఆ మహిళ పోలీసులకు ఈ సమాచారాన్ని తెలియజేసింది. పోలీసులు తదుపరి చర్యలు ప్రారంభించారు. ఇది కూడా చదవండి: కొడుకు బర్త్డేకి తల్లి సర్ప్రైజ్.. సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తోందంటూ.. -
‘ఈ ‘డర్టీ పాస్పోర్ట్’ పాస్ చేయాలంటే రూ. 82 వేలు కట్టాల్సిందే’.. యువతికి వేధింపులు!
ఎవరైనా సరే తమకు సంబంధించిన ముఖ్యమైన ధృవీకరణ పత్రాలను జాగ్రత్తగా కాపాడుకోకపోతే సమస్యల్లో పడతారు. ఇటువంటి నేపధ్యంలోనే అస్ట్రేలియాకు చెందిన ఒక మహిళ చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. ఎయిర్పోర్టు కౌంటర్లో.. బాలీ విమానాశ్రయం అధికారులు ఒక ఆస్ట్రేలియా యువతి దగ్గరున్నది ‘డర్టీ పాస్పోర్ట్’ అని ఆరోపిస్తూ, రూ. 1000 డాలర్లు వసూలు చేశారు. అధికారులు ఆమె దగ్గరున్న ‘డర్టీ పాస్ట్పోర్ట్’ను స్వీకరించలేమని పేర్కొన్నారు. న్యూయార్క్ పోస్ట్ రిపోర్టును అనుసరించి 28 ఏళ్ల యువతి తన తల్లితోపాటు సెలవుల్లో ఎంజాయ్ చేసేందుకు ఇండోనేషియా వెళుతోంది. బాటిక్ ఎయిర్పోర్టు కౌంటర్లో ఆమెకు చేదు అనుభవం ఎదురయ్యింది. ఆమె దగ్గరున్న పాస్పోర్ట్ పాతబడిపోవడంతో ఆమె కొత్తగా ఒక ఫారం నింపాల్సి వచ్చింది. 7 సంవత్సరాల క్రితంనాటిది కావడంతో.. ఎయిర్పోర్టు సిబ్బంది ఆమెచేత ఒక ప్రత్యేకమైన నీలిరంగు ఫారం మీద సంతకం చేయించారు. దానిని తనతో ఉంచుకోవాలని ఆదేశించారు. ఈ పత్రానికి సంబంధించిన ప్రక్రియతోపాటు ఇమిగ్రేషన్ పూర్తయిన తరువాత వారికి విమానం ఎక్కేందుకు అనుమతి లభించింది. ఆ యువతి తెలిపిన వివరాల ప్రకారం ఆ పాస్పోర్ట్ 7 సంవత్సరాల క్రితంనాటిది. దీంతో అది కాస్త మురికిగా తయారయ్యింది. ‘నన్ను ఎగతాళి చేశారు’ ఆమె తన అనుభవాన్ని వివరిస్తూ ‘మాకు నిజమైన ఇబ్బంది బాలీ ఎయిర్పోర్టులో ఎదురయ్యింది. బాలీ ఎయిర్పోర్టులో ఇమిగ్రేషన్కు ముందు అధికారులు నన్ను గంటపాటు ప్రశ్నించారు. వారు నన్ను చూసి నవ్వారు. చట్టాన్ని అతిక్రమించానని ఆరోపించారు. నా పాస్పోర్ట్ డ్యామేజ్ అయ్యిందంటూ ఎగతాళి చేశారు. 1000 డాలర్లు కడితే నా సమస్య పరిష్కారం అవుతుందని, లేనిపక్షంలో పాస్పోర్ట్ తిరగి ఇవ్వబోమని తెలిపారు. పాస్పోర్ట్ తిరిగి ఇవ్వబోమంటూ.. ఇటీవలే నేను ఉద్యోగాన్ని కోల్పోవడం వలన అంత మెత్తం చెల్లించలేనన్నాను. వెంటనే అధికారులు మా అమ్మతో మాట్లాడి, తన డర్టీ పాస్పోర్ట్ చెల్లుబాటుకు అనుమతినివ్వాలంటే 1000 డాలర్లు చెల్లించాలని మరోమారు తెలిపారు. అయితే ఆమె కూడా ఇందుకు సమ్మతించలేదు. దీంతో అధికారులు తన పాస్పోర్ట్ తిరిగి ఇవ్వబోమని హెచ్చరించారు. మరోమార్గం లేక అధికారులకు వారు అడిగినంత మొత్తం చెల్లించామని, అప్పుడు తమ ప్రయాణానికి ఏర్పడిన ఆటంకం తొలగిపోయిందని’ ఆమె ఆ పోస్టులో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఘరానా మోసం.. అమెరికా సర్కార్కే షాక్! -
‘ ఒక పెద్ద కుదుపు.. అంతా అయిపోయింది’
ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన భయానక రైలు ప్రమాదం అందరిలోనూ దడ పుట్టించింది. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటివరకూ 275 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు మృత్యుముఖాన్ని చూసి, ప్రాణాలతో బతికి బట్టకట్టారు. అలాగే ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసినవారు కూడా చాలామంది ఉన్నారు. వీరు ఈ ఘటనను మరువలేకపోతున్నామని చెబుతున్నారు. బాలేశ్వర్కు చెందిన జితేంద్ర నాయక్ ఈ ఘటనను ప్రత్యక్షంగా చూశారు. ఆయన ఈ దుర్ఘటన సంభవించిన సమయంలో తనకు ఎదురైన అనుభూతిని మీడియాకు తెలిపారు. జితేంద్ర నాయక్ మీడియాతో మాట్లాడుతూ ‘ నేను ఆ సమయంలో కోరమాండల్లోని జనరల్ బోగీలో ప్రయాణిస్తున్నాను. ఆ బోగీలో 100 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారు. దీంతో బోగీ రద్దీగా మారింది. బోగీలో నేను కింద కూర్చున్నాను. రైలు ముందుకు కదిలిన కొద్దసేపటికే రైలులో వైబ్రేషన్ మొదలయ్యింది. ట్రైన్ అటుఇటు కదులుతున్నట్లు అనిపించింది. కొన్ని నిముషాల తరువాత హఠాత్తుగా పెద్ద కుదుపు వచ్చింది. దాని తరువాత ఏమయ్యిందో తెలియలేదు. చదవండి: ఒడిశా రైలు దుర్ఘటన: ‘నువ్వు నా హృదయానికి దగ్గరయ్యావు’ రైలు అంతా పొగమయంగా మారిపోయింది. కళ్లు నులుముకుని చూసే సరికి, కొందరు చేతులు తెగి పడినవారు, కాళ్లను కోల్పోయినవారు, ముఖం, శరీరంపై తీవ్ర గాయాలయినవారు కనిపించారు. నేను రైలులో నుంచి ఎలాగోలా బయటకు వచ్చాను . అప్పుడు నాకు కొత్త జీవితం దొరికినట్లు అనిపించింది. ఆ సమయంలో నన్ను ఎవరూ కాపాడలేదు. నేనే అతి కష్టం మీద శిధిలాల నుంచి బయటపడ్డాను. ఆ సమయంలో చాలామంది క్షతగాత్రులు తమను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. నేను ప్రయాణించిన జనరల్ బోగీలోని ప్రయాణికులెవరూ బతికివుండే అవకాశం లేదు. భగవంతుడు నాకు నూతన జీవితాన్ని ప్రసాదించాడు. అందుకు నేను భగవంతునికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’ అని అన్నారు. -
అంతరిక్షంలో అరుదైన దృశ్యం, సూర్య మామతో చంద్రుడి ఆటలు
-
లేస్ గౌర్మెట్ చిప్స్: పెప్సికో ఇండియా మార్కెటింగ్ డైరెక్టర్ శైలజా జోషి ఏమన్నారంటే!
పెప్సికో 2022లో లేస్ గౌర్మెట్తో ప్రీమియం పొటాటో చిప్స్లోకి ప్రవేశించింది.ఈ కేటగిరీలో వినియోగదారులు మరిన్ని ప్రీమియం అనుభవాల కోసం చూస్తున్నారంటున్నారు పెప్సి కో ఇండియా మార్కెటింగ్ డైరెక్టర్ శైలజా జోషి. కేటగిరీ ప్రీమియమైజేషన్ గురించి, రూ.20 రేంజ్లో అందించే కొత్త ప్లాన్..తదితర వివరాలు ఆమె మాటల్లోనే.. ఆగస్టు 2022లో లే గౌర్మెట్ను ప్రారంభించాం. వీటికి మంచి స్పందన వచ్చింది. వినియోగదారుల గురించి, అవుట్లెట్ల గురించి తెలుసుకున్నాము. స్పందన బాగుంది. జీవితంలో మంచి విషయాలను ఆస్వాదించేవారు గౌర్మెట్ను ఆనందిస్తారు. ఈ స్నాక్ అందించే అనుభూతులు మరింత ఆనందంగా ఉంటాయి. ప్రతీ ఒక్కరు చక్కటి స్నాక్స్తో ట్రీట్ చేసుకోవాలనుకుంటుంటారు. లేస్ గౌర్మెట్కు వచ్చిన విశేష ఆదరణ దృష్ట్యా దానిని మరింత విస్తరించాలని భావిస్తున్నాం. అందువల్ల, మరింత మందికి లేస్ను చేరువచేసే లక్క్ష్యంతో రూ.20 ప్యాకెట్లను విడుదల చేస్తున్నాము. రిటైల్, వినియోగదారుల దృక్కోణం నుండి ఈ ధర అంశం చాలా ముఖ్యమైనది. రూ.20 ప్యాక్లు త్వరలో మార్కెట్లో లభింస్తాయి. మరింత విస్తృతంగా పంపిణీ చేయనున్నాం. లేస్ కన్సూమర్తో పోలిస్తే గౌర్మెట్ కొనేవాళ్లు భిన్నమని మీరు భావిస్తున్నారా? ఈ తేడాను జనాభా పరంగా చూడలేం, అప్పటికప్పుడు పుట్టుకొచ్చే అవసరం లేదా సందర్భం కావొచ్చు. ఒక వినియోగదారు ఒక సారి లేస్ను తినాలనుకోవచ్చు, ఎందుకంటే అతను/ఆమె స్నేహితులతో సరదాగా గడపాలని కోరుకుంటారు, ఇదొక సంబరం, ఇలాంటి నోరూరించే చిరుతిళ్లతో స్నేహితుల భేటీ సరదాగా ఉంటుంది. వేరే మూడ్లో లేదా వేరే సందర్భంలో ఉన్న ఒకే రకమైన వినియోగదారులు లేస్ గౌర్మెట్కు కూడా వినియోగదారుగా ఉండవచ్చు. అలాగే, కోవిడ్ తర్వాత, ప్రజలు మరింత కొత్త రుచుల కోసం ఎలా వెతుకుతున్నారో కూడా మేము గమనించాము. లే యొక్క గౌర్మెట్తో, చాలా మంది వినియోగదారులు స్నాకింగ్లోకి రావడాన్ని మేము ఖచ్చితంగా చూస్తాము, ఎందుకంటే వారు స్నాకింగ్లో చక్కని అనుభవాన్ని కోరుకుంటారు. Q. Not just cooked, crafted. ఈ లైన్ వినగానే సైఫ్ అలీ ఖాన్, ఆయన రాజవంశం గుర్తుకొస్తుంది. అప్పుడు లేస్ ప్రోడక్ట్ ప్రమోషన్లో ఈ వ్యాక్యం వాడారు. ఇప్పుడదే వ్యాక్యాన్ని అలాగే సైఫ్ను మళ్లీ ఇప్పుడు ఎంపిక చేసుకున్నారు. ఎలా చూడవచ్చు? సైఫ్ అలీ ఖాన్తో మా అనుబంధం చాలా గొప్పది. ఆయనతో చేసిన ప్రయాణం అద్భుతం అందుకే లేస్ గౌర్మెట్ కోసం సైఫ్నే మళ్లీ ఎంచుకున్నాం. లేస్ గౌర్మెట్ చిప్స్ బ్రాండ్కు అతడే సరైన ఎంపిక. మంచి రుచి, క్రమబద్ధత కలిగిన ఉత్పత్తులకు ప్రాతినిధ్యం వహించారు కాబట్టి సైఫ్ను ఎంపిక చేసుకున్నాం. బ్రాండ్ అంబాసిడర్ అవసరం ఎందుకు వచ్చింది? పెప్సీకో కింద ఎన్నో బ్రాండ్లు, ప్రోడక్టులున్నాయి. సైఫ్ అంశాన్ని బ్రాండ్ అంబాసిడర్ అవసరంగా చూడకూడదు. మా బ్రాండ్ ఇమేజ్కు మరింత ప్రయోజనం లభిస్తుందని భావించినప్పుడు మేము బ్రాండ్ అంబాసిడర్లతో కలిసి పని చేస్తాము. అలాగే బ్రాండ్ , అంబాసిడర్ రెండూ పరస్పర సంబంధం కలిగి ఉండాలి, రెండూ కలిసి వెళ్లాలి. మా బ్రాండ్కు ఉన్న గుర్తింపు, చక్కటి రుచి గురించి ఆలోచిస్తున్నప్పుడు, సైఫ్ అలీ ఖాన్ చాలా విలువను జోడించగలడని మా నమ్మకం. గౌర్మెట్తో కలిసి సైఫ్ నడవడం వల్ల ఆ ప్రయాణం మరింత అద్భుతంగా కనిపిస్తుంది. బ్రాండ్ ఇమేజ్ మరింత ఉన్నతమవుతుంది. అసలు సైఫ్ను తీసుకురావడం వెనక మా ఆలోచన ఇదే. చాలా ప్రీమియం బ్రాండ్ల ధరలు రూ.100 వరకు ఉన్నాయి. వాటితో పోలిస్తే గౌర్మెట్ ధర చాలా తక్కువగా ఉంది. ఇది గౌర్మెట్కు ఎలా సహాయపడుతుంది? రూ.30, రూ.50ల ఉత్పత్తుల విభాగంలో మీ వాటా వాటా ఎంత? ప్రపంచవ్యాప్తంగా పొటాటో చిప్స్ విభాగంలో అగ్రగామిగా ఉన్నాము. ఒక ఉత్పత్తిని తీసుకొస్తున్నప్పుడు మా నైపుణ్యాన్ని, మా అభ్యాసాలను కేవలం భారతీయ మార్కెట్కు పరిమితం చేయాలనుకోవడం లేదు. మార్కెట్పై మాకు ఉన్న అవగాహన మాకు గౌర్మెట్ సెగ్మెంట్ ధరల గురించి స్పష్టమైన ఆలోచనన ఇచ్చింది. చాన్నాళ్లుగా మేము మార్కెట్లో ఉన్నాం.ఇది కూడా సత్పలితాలను ఇస్తున్నట్టు కనిపిస్తోంది. ఇక మార్కెట్లో ఉన్న రూ.30 ప్యాక్ ఉత్పత్తులు ఎక్కువగా సాంప్రదాయ వినియోగదారులు కొంటున్నారు. మా వాటా కూడా దీంట్లోనే ఎక్కువ. అలాగే రూ.50 ప్యాక్ ఉత్పత్తులకు ఇ-కామర్స్లో డిమాండ్ ఎక్కువ. లేస్ గౌర్మెట్ చిప్స్ మూడు ఫ్లేవర్లలో ఉన్నాయి. లైమ్ అండ్ క్రాక్డ్ పెప్పర్, థాయ్ స్వీట్ చిల్లీ మరియు వింటేజ్ చీజ్ & పెప్రికా. వీటిలో ఎక్కువ అమ్ముడవుతున్న ఫ్లేవర్ ఏది? మరిన్ని ఫ్లేవర్లు తెచ్చే ఆలోచన ఉందా? థాయ్ స్వీట్ చిల్లీకి మంచి స్పందన వచ్చింది. ఎక్కువ మంది ఏది ఇష్టపడితే అదే ఫ్లేవర్ అవుతుంది. నిజానికి మూడు ఫ్లేవర్ల అమ్మకాల మధ్య పెద్ద తేడా ఏమీ లేదు. మేము కూడా ఎక్కువ ఉత్పత్తులను ప్రయత్నించే దశలో ఉన్నాము. వినియోగదారుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటికైతే ఎక్కువ మందికి ఈ రుచులు చేరాలని, వినియోగదారుల సంఖ్య పెరగాలని భావిస్తున్నాం. మా దగ్గర మరిన్ని ఆలోచనలున్నాయి. మార్కెట్ అవసరాలను బట్టి ఎప్పటికప్పుడు వాటిని అభివృద్ధి చేస్తాం. ప్రస్తుతానికయితే ఈ మూడు ఫ్లేవర్లతో మా వ్యాపారాన్ని పెంచుతాం. -
న్యూగ్రాండ్ విటారా ఎక్స్పీరియన్స్ డ్రైవ్: థ్రిల్ అయిన కస్టమర్లు
హైదరాబాద్: దేశీయ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ తన ఎస్యూవీ ఆల్ న్యూ గ్రాండ్ విటారాతో ‘‘ఎక్స్పీరియన్స్ డ్రైవ్’’ను నిర్వహించింది. సుమారు 300 మందికి పైగా కస్టమర్లు ర్యాలీలో పాల్గొని ఆల్ న్యూ గ్రాండ్ విటారా సామర్థ్యాన్ని పరీక్షించారు. ఈ డ్రైవ్లో వినియోగదారులు గ్రాండ్ విటారా అద్భుతమైన అనుభవం, సామర్థ్యాలతో పులకించి పోయారనీ, ఈ కార్యక్రమంలో హైదరాబాద్కు చెందిన ప్రముఖ నెక్సా డీలర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. సుజుకీ పేటెంట్ కలిగి ఆల్గ్రిప్ సెలెక్ట్ ట్రిమ్ ధర రూ.16.89 లక్షలు ఉంది. ఈ ఎక్స్పీరియన్స్ డ్రైవ్ ద్వారా గ్రాండ్ విటారాకు సుమారు 100 బుకింగ్లు వచ్చాయని కంపెనీ వెల్లడించింది. ఈ వేరియంట్ లీటరుకు 19.38 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. -
ఉబెర్ కొత్త డిజైన్: రైడర్లకు కొత్త ఫీచర్లు...ఇకపై ఈజీగా!
ముంబై: రైడ్ షేరింగ్ కంపెనీ ఉబర్ మరింత మెరుగ్గా యాప్ను తీర్చిదిద్దింది. రైడ్ సమయంలో యాప్ను ప్రతీసారి తెరవకుండానే లాక్ స్క్రీన్పైనే లైవ్ యాక్టివిటీతో రైడ్, వాహన వివరాలు, ట్రిప్ స్టేటస్ను చూడవచ్చు. తన హోమ్స్క్రీన్, కొత్త ఫీచర్ల రీడిజైన్ చేసింది. కస్టమర్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని తొలిసారి ఇలాంటి మార్పులు ప్రకటించింది. యాప్ను మునుపెన్నడూ లేనంత సులభంగా, స్పష్టంగా , పర్సనలైజ్డ్గా తీసుకొస్తున్నామని ఉడెర్ హెడ్ జెన్ యు అన్నారు. తద్వారా క్యాబ్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్ రైడ్ ట్రాకింగ్ ఈజీగా ఉండేలా ఇంటర్ఫేస్ని రూపొందించింది. సో నెక్ట్స్ రైడ్ లేదా ఆర్డర్ ఫుడ్ బుక్ చేస్తే, యాప్ కొద్దిగా భిన్నంగా కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఐవోఎస్ ఉపకరణాలకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. త్వరలో ఆండ్రాయిడ్ డివైసెస్కు విస్తరించనున్నట్టు కంపెన ప్రకటించింది. సర్వీసెస్ ట్యాబ్ సైతం పొందు పరిచింది. శరవేగంగా లైఫ్ గడిచిపోతున్న ప్రస్తుత తరుణంలో కొన్ని, సెకన్లలో యాప్ ద్వారా నావిగేట్ చేయగలిగే అవసరాన్ని అర్థం చేసుకున్నామని ఉబర్ ఇండియా దక్షిణాసియా సెంట్రల్ ఆపరేషన్స్ డైరెక్టర్ నితీష్ భూషణ్ అన్నారు. తక్కువ ట్యాప్లతో ప్రయాణాలను మరింత సులభంగా బుక్ చేసుకునేందుకు రైడర్లకు సహాయ పడేందుకు హోమ్స్క్రీన్ను అనుభవాన్ని కూడా మెరుగ్గా అందించనుంది. ఇందుకోసం 'సర్వీసెస్' ట్యాబ్ను జోడించింది. దీని ద్వారా కొత్త యాప్లో సమీపంలోని మోటో నుండి ఆటో, ఇంటర్సిటీ, అద్దెలు, ఇతర వాటితో పాటు నగరంలోని రైడర్లకు అందుబాటులో ఉన్న అన్ని ఉత్పత్తులను కనుగొనడానికి ఒక-స్టాప్ షాప్గా కూడా ఉపయోగపడనుంది. అలాగే కొత్తగా యాడ్ చేసిన 'యాక్టివిటీ హబ్' గత రాబోయే రైడ్లను ఒకే చోట ట్రాక్ చేయడంలో సహాయపడుతుందని ఉబెర్ తెలిపింది. -
డిజిటల్ లెండింగ్ హవా
ముంబై: ఈ దశాబ్దంలో డిజిటల్ లెండింగ్ దూసుకుపోతుందని, ఫిన్టెక్ సంస్థలు ఈ సేవలను మరింతగా వినియోగదారుల చెంతకు తీసుకెళతాయని క్రెడిట్ సమాచార సంస్థ ఎక్స్పీరియన్స్ తెలిపింది. 2030 నాటికి అన్సెక్యూర్డ్ రుణాల్లో సంప్రదాయ రుణవితరణతో పోలిస్తే డిజిటల్ రుణాలదే పైచేయి అవుతుందని ఈ సంస్థ అంచనా వేసింది. అన్సెక్యూర్డ్ చిన్న సైజు రుణాలతోపాటు, సెక్యూర్డ్ అధిక సైజు రుణాల్లో డిజిటల్ లెండింగ్ మరింత విస్తరిస్తుందని పేర్కొంది. ‘‘సంప్రదాయ రుణదాతలు సాధారణంగా ఆస్తుల తనఖాపై రుణాల్లో (సెక్యూర్డ్) అధిక వాటా కలిగి ఉంటారు. డిజిటైజేషన్ పెరుగుతున్న కొద్దీ ఈ విభాగంలోకి సైతం ఫిన్టెక్ సంస్థలు చొచ్చుకుపోతాయి. దీంతో అవి చెప్పుకోతగ్గ మార్కెట్ వాటాను సొంతం చేసుకోగలవు’’అని ఎక్స్పీరియన్స్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ఇండియా ఎండీ సాయికృష్ణన్ శ్రీనివాసన్ తెలిపారు. డిజిటల్గా సౌకర్యవంతమైన అనుభవాన్ని కస్టమర్లకు అందిస్తున్నప్పటికీ డిజిటల్ లెండింగ్ సంస్థలకు తదుపరి దశ వృద్ధి అన్నది సవాలుగా ఈ నివేదిక పేర్కొంది. డిజిటల్ లెండింగ్ విభాగంలో బడా టెక్నాలజీ సంస్థలు కూడా కీలక పాత్ర పోషిస్తాయని అంచనా వేసింది. రికవరీ ఏజెంట్లపై ముందే చెప్పాలి: ఆర్బీఐ డిజిటల్ లెండింగ్ సంస్థలు (డిజిటల్ వేదికల రూపంలో రుణాలిచ్చేవి) కస్టమర్లకు రికవరీ ఏజెంట్ల వివరాలను ముందే వెల్లడించాలని ఆర్బీఐ ఆదేశించింది. ‘‘ఏదైనా రుణం చెల్లింపుల్లేకుండా ఆగిపోతే, ఆ రుణం వసూలుకు ఏజెంట్ను నియమించినట్టయితే.. సంబంధిత ఏజెంట్ పేరు, ఫోన్ నంబర్ తదితర వివరాలను కస్టమర్కు ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ రూపంలో తెలియజేయాలి’’అని తాజా ఆదేశాల్లో ఆర్బీఐ పేర్కొంది. డిజిటల్ లెండింగ్, రుణాల రికవరీకి సంబంధించిన నిబంధనలను ఆర్బీఐ గతేడాది చివర్లో కఠినతరం చేయడం తెలిసిందే. -
ప్రేమ భాష మాత్రమే తెలుసు: హీరోయిన్
Vaani Kapoor Reveals Her Horse Riding Experience: బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది బ్యూటిఫుల్ హీరోయిన్ వాణీ కపూర్. నాని నటించిన 'ఆహా కల్యాణం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితమే ఈ ముద్దుగుమ్మ. ఓ వైపు కమర్షియల్ మూవీస్తోపాటు మరోవైపు నటనకు ప్రాధాన్యమున్న రోల్స్లో నటిస్తూ మెప్పించే ప్రయత్నం చేస్తోంది ఈ బ్యూటీ. తాజాగా ఆమె నటించిన చిత్రం 'షంషేరా'. రణ్బీర్ కపూర్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీలో సోనా అనే పాత్రలో అలరించనుంది వాణీ కపూర్. అయితే ఈ పాత్ర కోసం వాణీ కపూర్ స్పెషల్గా గుర్రపు స్వారీ నేర్చుకున్నట్లు తెలిపింది. గుర్రపు స్వారీ నేర్చుకున్న అనుభవాలను 'షంషేరా' మూవీ ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 'ఇది నాకెంతో ఛాలేంజింగ్ పాత్ర. దీనికోసం ప్రత్యేకంగా గుర్రపు స్వారీ నేర్చుకున్నా. నా దృష్టిలో గుర్రాలు అత్యంత అందమైన జంతువులు. వాటికి ప్రేమ భాష మాత్రమే తెలుసు. స్వారీ నేర్చుకోవడానికి ముందు వాటితో సన్నిహితంగా ఉండటం, స్నేహం చేయడం, ఎమోషనల్ బాండింగ్ ఏర్పరచుకోవడం అవసరం. లేకపోతే అవి మనల్ని విసిరేస్తాయి. అందుకే శిక్షణ సమయంలో నేను వాటికోసం ఆహారం తీసుకొచ్చేదాన్ని. అలా వాటిని మచ్చిక చేసుకుని స్వారీ నేర్చుకున్నా.' అని తెలిపింది వాణీ కపూర్. కాగా కరణ్ మల్హోత్రా తెరకెక్కించిన 'షంషేరా' చిత్రాన్ని ఆదిత్య చోప్రా నిర్మించారు. ఈ సినిమాను హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లో జులై 22న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. Meet Sona ✨ Watch how Sona's character came to life.. pic.twitter.com/loe1mbEgUR Shamshera releasing in Hindi, Tamil & Telugu. Celebrate #Shamshera with #YRF50 only at a theatre near you on 22nd July. #RanbirKapoor @duttsanjay @RonitBoseRoy @saurabhshukla_s @karanmalhotra21 @yrf — Vaani Kapoor (@Vaaniofficial) July 9, 2022 -
హీరోయిన్కు వింత అనుభవం.. అతన్ని ఫాలో అవ్వమని కోరాడట
Shraddha Srinath Different Experience With Cab Driver And Airport Security: నేచురల్ స్టార్ నాని నటించిన 'జెర్సీ' మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైంది శ్రద్ధా శ్రీనాథ్. తర్వాత సిద్ధు జొన్నల గడ్డ కృష్ణ 'అండ్ హిజ్ లీల', 'మార' సినిమాలతో మరింత పాపులారిటీ దక్కించికుంది. దక్షిణాది భాషలన్నింటి సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది శ్రద్ధా. అయితే తాజాగా ఓ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లే క్రమంలో ఆమెకు జరిగిన వింత అనుభవాల గురించి సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది. సినిమా షూటింగ్ తర్వాత ఎయిర్పోర్ట్ వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకుంది. క్యాబ్లో ప్రయాణించేప్పడు డ్రైవర్ ఏసీ ఆన్ చేయలేదు. ఏసీ గురించి అడిగితే అందుకు డ్రైవర్ నిరాకరించాడు. 'పెట్రోల్ ధరలు పెరగడం వల్ల క్యాబ్ డ్రైవర్ ఏసీ ఆన్ చేసేందుకు నిరాకరించాడు. ఎంతోకొంత డబ్బు పొదుపు చేసేందుకు అలా చేశాడని నాకు అర్థమైంది. అందుకే నేను కూడా ఏం అనలేదు. కానీ ఓలా క్యాబ్ సంస్థ వాళ్ల సంపాదనను దోచుకుంటోంది.' అని ఇన్స్టాలో తెలిపింది. అలాగే తనకు ఎయిర్పోర్టులో జరిగిన మరో అనుభవాన్ని శ్రద్ధా వెల్లడించింది. 'ఎయిర్పోర్ట్ ఎంట్రాన్స్ వద్ద సెక్యూరిటీ ఒకతను నన్ను గుర్తుపట్టి, నా దగ్గరికి వచ్చి నా ఇన్స్టా గ్రామ్లో తన అకౌంట్ వెతికి అతన్ని ఫాలో అవ్వాల్సిందిగా కోరాడు. నేను సానుకూలంగా తిరస్కరించాను. దానికి అతను ఏ సమస్య లేదు. నేను మిమ్మల్ని ఫాలో అవుతాను. మీకు సపోర్ట్ చేస్తాను.' అని చెప్పాడని శ్రద్ధా పేర్కొంది. -
రాజ్యసభలో 72మంది సభ్యుల పదవీకాలం పూర్తి
-
అనుభవాన్ని అందరికీ పంచండి!
న్యూఢిల్లీ: త్వరలో రాజ్యసభ నుంచి రిటైరవుతున్న సభ్యులు దేశ ప్రయోజనాలకు అనుగుణంగా, యువతలో ఆసక్తి రేపేలా తమ అనుభవసారాన్ని అన్నిదిశలకు వ్యాపింపజేయాలని ప్రధాని నరేంద్రమోదీ సూచించారు. జ్ఞానం కన్నా అనుభవం గొప్పదని, సభ్యులంతా తమ అనుభవాన్ని దేశ సేవకు వినియోగించాలని కోరారు. రాజ్యసభలో రిటైరవుతున్న 72 మంది సభ్యులకు గురువారం వీడ్కోలు పలికారు. ఈ ఏడాది మార్చి– జూలై సమయంలో వీరంతా పదవీ విరమణ చేయనున్నారు. చట్టసభల సభ్యులు సమర్థవంతమైన పనితీరు చూపాలని, చట్టసభల విధులకు అంతరాయం కలిగించకుండా పనిచేయాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. -
డాక్యుమెంటరీ కోసం ఉక్రెయిన్ వెళ్లిన హాలీవుడ్ దర్శకుడు.. మెళ్లకు మైళ్లు నడిచి..
కీవ్: బాంబుల మోత మోగు తూ ఉంటే, క్షిపణులు వచ్చి మీద పడు తూ ఉంటే రాజు పేద తేడా లేనే లేదు. ఉండేదల్లా ప్రాణభయమే. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటే ఎన్నో కష్టనష్టాలను పంటి బిగువున భరించాల్సి ఉంటుంది. యుద్ధంపై డాక్యుమెంటరీ తీయడానికి ఉక్రెయిన్ వెళ్లి ఇరుక్కుపోయిన హాలీవుడ్ నట దర్శకుడు, ఆస్కార్ గ్రహీత సీన్ పెన్కు అలాంటి భయంకరమైన అనుభవాలే ఎదురయ్యాయి. గత ఏడాది నవంబర్ నుంచి ఉక్రెయిన్లో ఉంటూ ఉద్రిక్తతల్ని కెమెరాలో బంధిస్తున్న ఆయన చివరికి తన ప్రాణాలే ప్రమాదంలో పడడంతో కాళ్లకి పని చెప్పాల్సి వచ్చింది. 61 ఏళ్ల వయసులో మైళ్లకి మైళ్లు నడిచి పోలండ్ సరిహద్దులకి చేరుకున్నారు. రష్యా దాడిని తీవ్రతరం చేయడంతో ప్రాణ రక్షణ కోసం లక్షలాది మంది ఉక్రెయిన్లు సురక్షిత ప్రాంతాలకు వెళ్లడం మొదలు పెట్టారు. అన్ని సరిహద్దుల్లోనూ మైళ్ల కొద్దీ కార్లు వరస కట్టాయి. సీన్ పెన్, ఆయన బృందం కారులో వెళ్లడానికి సమయం సరిపోదని భావించి దానిని వదిలేసి నడుచుకుంటూ పోలాండ్ సరిహద్దులకు చేరుకున్నారు. ‘‘నేను, నా కొలీగ్స్ ఇద్దరూ కారుని రోడ్డు పక్కనే వదిలేసి మైళ్ల కొద్దీ నడుచుకుంటూ వచ్చాం. దారి పొడవునా నిలిచిపోయిన అన్ని కార్లలోనూ మహిళలు, పిల్లలే ఉన్నారు. వాళ్లెవరూ తమ వెంట లగేజీ తీసుకు రాలేదు. ఎంత మంది పడితే అంత మంది కార్లలోకి ఎక్కేసి సరిహద్దుల వైపు బయల్దేరారు’’ అని ట్విటర్ వేదికగా పెన్ వెల్లడించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్పై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘పుతిన్ చాలా క్రూరమైన తప్పు చేస్తున్నారు. ఎందరో జీవితాల్ని బలి తీసుకుంటున్నారు. ఆయనలో పశ్చాత్తాపం రాకపోతే మానవాళికే తీరని ద్రోహం చేసిన వారవుతారు’’ అని దుయ్యబట్టారు. ‘‘ఉక్రెయిన్ ప్రజలు ధైర్యానికి, నిబద్ధతకి చారిత్రక సంకేతాలుగా మిగిలిపోతారు’’ అని కొనియాడారు. పెన్ ఉక్రెయిన్లో ఉండగా అధ్యక్షుడు జెలెన్స్కీని కలుసుకున్నారు. రష్యా దాడి మొదలు పెట్టడానికి ముందు ప్రభుత్వం నిర్వహించిన ప్రెస్ మీట్లోనూ పాల్గొన్నారు. (చదవండి: ‘జెలెన్స్కీ’ బిజినెస్ బ్రాండ్) -
హైదరాబాద్లో ఓరియంట్బెల్ స్టోర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సెరామిక్ టైల్స్ తయారీలో ఉన్న ఓరియంట్బెల్ తాజాగా హైదరాబాద్లో ఎక్స్పీరియెన్స్ స్టోర్ను తెరిచింది. సికింద్రాబాద్లో 2,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో మహాలక్ష్మి ఎంటర్ప్రైసెస్ దీనిని ఏర్పాటు చేసింది. 2020లో దేశవ్యాప్తంగా 69 ఎక్స్పీరియెన్స్ సెంటర్స్ను ప్రారంభించామని ఓరియంట్బెల్ టైల్స్ చీఫ్ సేల్స్ ఆఫీసర్ పినాకి నంది తెలిపారు. 1977లో కంపెనీని స్థాపించారు. -
జియోసావన్ లో మరో సరికొత్త ఫీచర్
దక్షిణ ఆసియాలో అతిపెద్ద స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ అయిన సంగీత ప్రియులకు ఇష్టమైన జియోసావన్ మరో కొత్త ముందుకు వచ్చింది. జియోసావన్ టీవీ పేరుతో విదేయో కంటెంట్ అందించనుంది. ఇప్పటివరకు రేడియో, పాడ్ క్యాస్ట్ సేవలను అందించిన జియోసావ్న్ ఇప్పడు వీడియో సేవలను అందించనుంది. ప్రత్యేకమైన ఈ వీడియో ఫీచర్ వల్ల మరింత మందికి అద్భుతమైన కంటెంట్ అందించనున్నట్లు పేర్కొంది. జియోసావన్ ప్లాట్ఫాం విస్తృతంగా ప్రాచుర్యం పొందిన ఆడియో సేవలతో పాటు సంగీతం కోసం కొత్తగా టెలివిజన్ అనుభవాన్ని సృష్టిస్తుంది. ఈ ఫీచర్ వినియోగదారులకు అత్యధిక నాణ్యత గల వీడియో స్ట్రీమింగ్ అందిస్తుంది. వినియోగదారులు ఇప్పుడు హోమ్పేజీలోని క్రొత్త ట్యాబ్లో మ్యూజిక్ టీవీ ఛానెల్లను, మ్యూజిక్ వీడియో ప్లేజాబితాలను యాక్సెస్ చేయవచ్చు. దీనివల్ల చూడాలనుకుంటున్న వీడియోను వెంటనే చూడటానికి వీలు కలుగుతుంది. కొత్త ఫీచర్ వల్ల ఎందరో ప్రసిద్ద కళాకారులు చెందిన వీడియోలను సులభంగా చూడవచ్చు. చదవండి: చిన్న ఎస్ఎంఎస్తో ఆధార్ డేటాను రక్షించుకోండి -
ఈ బ్యాంకులో ఖాతా ఉందా? రేణూ దేశాయ్ షాకింగ్ పోస్ట్
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నటి రేణూ దేశాయ్కు చేదు అనుభవం ఎదురైంది. సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటూ, ఇటీవల కరోనా బాధితులకు అండగా నిలుస్తున్న రేణూ బ్యాంకింగ్ వ్యవహారాలపై ఒక షాకింగ్ విషయాన్ని ఇన్స్టాలో షేర్ చేశారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ను కూడా పోస్ట్ చేశారు. దీంతో సదరు బ్యాంకు ఖాతాదారులతో ఇతరులు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇది చాలా తీవ్రమైన తప్పు. మన ఖాతాలో వేరొకరు లాగిన్ అయ్యి నగదు బదిలీ చేసే అవకాశా లున్నాయంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వక్తం చేశారు. రేణూ దేశాయ్ పంచుకున్న విషయాల ప్రకారం... ఆమె ఇండస్ఇండ్ బ్యాంకు మొబైల్ యాప్లోకి లాగిన్ అయినప్పుడు, అది వేరొకరి ఖాతాలోకి లాగిన్ అయింది. అంతేకాదు సదరు ఖాతాలోని పూర్తి వివరాలను కూడా చూడగలిగారు. దీంతో తాను షాక్ అయ్యాను అంటూ ఇన్స్టాగ్రామ్లో రేణూ వివరాలను షేర్ చేశారు. హెల్ప్లైన్ నంబర్కు ఫోన్ చేసినా వారు సీరియస్గా తీసుకోలేదంటూ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ తీసుకున్న వెంటనే ఈ ఖాతా నుండి లాగ్ అవుట్ అయ్యానంటూ వివరించారు. కస్టమర్లకు ఆ బ్యాంకు ఇస్తున్న భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన ఆమె తన అకౌంట్ను సోమవారం క్లోజ్ చేయబోతున్నట్టు కూడా వెల్లడించారు. బ్యాంకింగ్ లావాదేవీలు, భద్రతాలోపాలపై విమర్శలు గుప్పిస్తూ కొంతమంది నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరికొంతమంది ‘డిజిటల్ ఇండియా’ అంటూ వ్యంగ్యోక్తులు విసురుతున్నారు. మరి ఈ మొత్తం వ్యవహారంపై ఇండస్ ఇండ్ బ్యాంకు ఎలా స్పందిస్తుందో చూడాలి. చదవండి: Digital Rules: ట్విటర్కు ఫైనల్ వార్నింగ్ View this post on Instagram A post shared by renu (@renuudesai) -
ఆన్లైన్లో టీనేజర్స్ : మంచీ మర్యాద!
సాక్షి, హైదరాబాద్: భారతీయులు ఆన్లైన్ ప్రపంచంలో కొంత మర్యాద నేర్చుకున్నారని మైక్రోసాఫ్ట్ సంస్థ చెబుతోంది. ‘సివిలిటీ, సేఫ్టీ అండ్ ఇంటరాక్షన్స్ ఆన్లైన్’పేరుతో ఈ ఐటీ దిగ్గజం ఇటీవల ఓ వార్షిక నివేదిక విడుదల చేసింది. ఆన్లైన్ వినియోగదారుల మర్యాద విషయంలో డిజిటల్ సివిలిటీ ఇండెక్స్ (డీసీఐ)2020లో భారత్ 2019లో ఉన్న 71వ స్థానం నుంచి 68వ స్థానానికి పెరిగింది. అంటే ఆన్లైన్లో కొంచెం తక్కువ మంది దురుసు ప్రవర్తన ఎదుర్కొంటున్నారని అర్థం. అయితే ఆసియా పసిఫిక్ దేశాల్లో మాత్రం ఇతర దేశాలతో పోలిస్తే భారత్ స్థానం దిగువనే ఉండటం గమనార్హం. అంతేకాదు.. 2016తో పోలిస్తే విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం రెట్టింపు అయ్యిందని, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం, స్కామ్లు, మోసాలు 5 శాతం వరకు పెరిగి ప్రస్తుతం 22 శాతంగా నమోదైంది. వివక్ష అంశంలోనూ భారతీయుల ఆన్లైన్ ప్రవర్తన సరిగా లేదు. 2016లో ఇది 10 శాతంగా ఉంటే 2020 నాటికి 6 శాతం పెరిగింది. సానుకూల సంభాషణలతో మంచి సంబంధాలు.. డీసీఐ తాజా సర్వే కోసం మైక్రోసాఫ్ట్ ఆస్ట్రేలియా, ఇండియా, ఇండొనేసియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్లాండ్, వియత్నాం వంటి దేశాల్లోని మొత్తం 32 ప్రాంతాల్లో 16 వేల మందిని ప్రశ్నించారు. ఆన్లైన్లో సంభాషణలు, ప్రమాదాలు వంటి అంశాలపై అడిగిన సర్వేలో పెద్దవారితో పాటు యువత కూడా పాల్గొంది. ఆన్లైన్ సంభాషణలు సానుకూలంగా ఉండేలా ప్రోత్సహించేందుకు మైక్రోసాఫ్ట్ ఈ సర్వే నిర్వహిస్తోందని, డిజిటల్ టెక్నాలజీల వినియోగం అంతకంతకూ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఆన్లైన్ అనుభవం బాగా ఉంటేనే సమాజ సామరస్యం సాధ్యమవుతుందని మైక్రోసాఫ్ట్ ఉన్నతాధికారి కేశవ్ ధక్కడ్ తెలిపారు. మార్పులో యువతదే ప్రధాన పాత్ర ఆన్లైన్ ప్రవర్తనలో కొంత మార్పులు వచ్చిన విషయంలో యువతది (13–16 మధ్య వయస్కులు) ప్రధానపాత్ర అని డీసీఐ 2020 సర్వే తెలిపింది. ఆన్లైన్లో మర్యాద పాటించే వారిని గుర్తించేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన సూచీలో పెద్దలు 69 స్కోరు సాధించగా, యువత 67 స్కోరు సాధించారు. భారత్లో సర్వేకు స్పందించిన వారిలో 38 శాతం మంది కరోనా సమయంలో ఆన్లైన్ మర్యాద మెరుగ్గా ఉందని వ్యాఖ్యానించగా, చాలామంది ఇతరులకు సాయపడాలన్న దృక్పథాన్ని కనబరిచారని ఈ సర్వే తెలిపింది. ఇదే సమయంలో 22 శాతం మంది కరోనా సమయంలో ఆన్లైన్లో మర్యాదపూర్వక ధోరణి తగ్గిందని, తప్పుడు సమాచారం ఎక్కువగా ప్రసారమైందని, వ్యక్తిగత దూషణలు, నెగెటివ్ కామెంట్స్ ఎక్కువయ్యాయని అభిప్రాయపడ్డారు. -
కరోనా : సానియా మీర్జా భావోద్వేగం
సాక్షి, హైదరాబాద్ : కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఒక్కరినీ గడ గడలాడించింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎపుడు.. ఎక్కడనుంచి ఎలా వస్తుందో అనే భయం సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు వెంటాడింది. తాజాగా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కోవిడ్ అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. కరోనా సోకి ఒంటరిగా, కుటుంబానికి, బిడ్డకు దూరంగా ఉండటం చాలా భయానకం అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా తాను కూడా కరోనా వైరస్ బారినపడ్డాననీ, కానీ ఆ దేవుడి దయ వల్ల ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానంటూ ఇన్స్టాలోను, ట్విటర్లోనూ పోస్ట్ చేశారు. తనకి కరోనా పాజిటివ్ అని తేలినప్పటికీ.. అదృష్టవశాత్తూ తనకు ఎలాంటి లక్షణాలు కనిపించ లేదని సానియా మీర్జా ఇన్స్టాలో వెల్లడించారు. అయినా ముందు జాగ్రత్త చర్యగా ఐసోలేషన్లోనే ఉన్నానన్నారు. అయితే ఈ సమయంలో కుటుంబానికి, ముఖ్యంగా తన రెండేళ్ల చిన్నారికి దూరంగా ఉండటం చాలా భయంకరంగా అనిపించిందన్నారు. కానీ కరోనాతో తీవ్ర అనారోగ్యానికి గురై, ఆసుపత్రిలో ఒంటరిగా, కుటుంబానికి, ఆత్మీయులకు దూరంగా ఉన్న వారి పరిస్థితి ఊహించడానికే కష్టం. ఎపుడు ఏం జరుగుతుందో తెలియదు..రోజుకో లక్షణం.. రోజుకో కొత్త స్టోరీ... ఇలాంటి అనిశ్చితి పరిస్థితిని డీల్ చేయడం అటు శారీరంగానూ, ఇటు మానసికంగానూ చాలా కష్టం. అందుకే కరోనా మహమ్మారిని అసలు జోక్గా తీసుకోవద్దు. దీని పట్ల జాగ్రత్తగా ఉందాం. మాస్క్లు ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోడం ద్వారా మిమ్మల్ని మీ వాళ్లను కాపాడుకోండి. మన కుటుంబాన్ని రక్షించుకునేందుకు మనం చేయగలిగినదంతా చేయాలి. కలిసికట్టుగా ఈ యుద్ధం చేస్తున్నామంటూ సానియా పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Sania Mirza (@mirzasaniar) -
కరోనాను ఇలా గెలిచాను
స్వర్ణ కిలారి తన ‘లిప్తకాలపు స్వప్నం’ అనే పుస్తకం ద్వారా హైదరాబాద్ సాహితీ బృందాల్లో సుపరిచితులు. ఇప్పుడు ఫేస్బుక్ వల్ల మరింత మందికి తెలిశారు. దానికి కారణం కోవిడ్ను జయించాక ఆమె రాసిన పోస్ట్ వైరల్గా మారడమే. ఆ పోస్ట్ ఎంతోమందికి ధైర్యం ఇవ్వడమే. ఆ పోస్ట్లో ఆమె రాసిన అనుభవం ఆమె మాటల్లో.... ‘‘కరోనా మన ఇండియాకి వచ్చిందని మార్చ్ నెల మొదటి వారంలో తెలిసింది. మార్చ్ మూడో వారం నుండి లాక్డౌన్ ప్రారంభం అయింది. నా భర్త, తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం అప్పటికే రోజూ ఆఫీస్కు వెళ్లి వస్తున్నాడు కనుక ముందు జాగ్రత్తగా సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లిపోయాడు. అదే సమయంలో వలస కార్మికుల ఇబ్బందులు మొదలయ్యాయి. వారి కష్టం చూడలేక కొంతమేరకు తోచిన సాయం చేయగలిగాను. కొన్నాళ్ళు గడిచాక వ్యాధి విస్తృతంగా వ్యాపించడం మొదలుపెట్టింది. మొదట్లో ఎవరో తెలియని వ్యక్తులకు వచ్చింది, కానీ త్వరలోనే మన దగ్గరి వాళ్లకు కూడా వస్తుంది అని అర్ధం అయింది’’. నాకెలా తెలిసిందంటే... ఒకరోజు ఒళ్ళు కాస్త వేడిగా అనిపించింది. రాత్రికల్లా ఎక్కువయి పారసిటమాల్ వేసుకునే స్థితి ఏర్పడింది. రెండో రోజు, మూడో రోజు కూడా 99–100 డిగ్రీలు వుండేది టెంపరేచర్. తర్వాత మాతోనే ఉండే చెల్లి కూతురు దరహాసకు కూడా జ్వరం మొదలైంది. ఎందుకో కరోనా వచ్చిందా అనే అనుమానం వచ్చి ఇద్దరం ఆసుపత్రిలో టెస్ట్కి శాంపిల్ ఇచ్చి వచ్చాం. రిపోర్ట్ వచ్చేసరికి మా జ్వరం తగ్గిపోయింది కానీ బాగా నీరసం, దగ్గు, బ్రీతింగ్ ప్రాబ్లం, వాసన, రుచి కోల్పోవడం, తలనొప్పి. రిపోర్టులో మాకు పాజిటివ్ అని వచ్చింది. ఆదుర్దా పడ్డాం కానీ వెంటనే తేరుకుని తరువాత ఏం చేయాలో ఆలోచించాము’’. వాడిన మందులు వెంటనే తెలిసిన ఇద్దరు గవర్నమెంట్ డాక్టర్లతో ఫోన్లోనే మాట్లాడి, వారిచ్చిన ప్రిస్క్రిప్షన్ ట్రీట్మెంట్ తీసుకోవడం మొదలుపెట్టాం. మొదటి నాలుగు రోజులు పారసిటమాల్, తరువాత విటమిన్ సీ, డీ, జింక్, ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఒక యాంటీబయోటిక్ కూడా ఇచ్చారు. ప్రతీరోజూ థర్మామీటర్తో జ్వరం చెక్ చేసుకోవడం, ఆక్సీమీటర్తో ఆక్సిజన్ శాచురేషన్ చెక్ చేసుకోవడం చేశాము. ఉదయం ఒకసారి కషాయం, ఉడకబెట్టిన గుడ్డు, నానబెట్టిన బాదం, మొలకలు, అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, మళ్లీ సాయంత్రం కషాయం, ఒక ఫ్రూట్ జ్యూస్, రాత్రికి చపాతీ, ఒక కప్పు పసుపు వేసిన పాలు. రెండ్రోజులకు ఒకసారి భోజనంలో చికెన్ కూడా తీసుకున్నాము. కరోనా టైంలో నేను చేసిన పనులు ► అమేజాన్, నెట్ఫ్లిక్స్లలో ఎప్పటినుండో చూడాలి అనుకున్న సినిమాలు చూసాను. ► ఎప్పటినుండో పెండింగ్లో వున్న ఒక రెండు ఆర్టికల్స్ పూర్తి చేయగలిగాను. ► రోజూ యోగాసనాలు, గదిలోనే నడక. మధ్యలో రెగ్యులర్గా ప్రభుత్వ కాల్ సెంటర్ నుండి ఫోన్ చేసి ఆరోగ్యం ఎలా ఉందో వాకబు చేశారు. ఐసొలేషన్ కిట్ పంపిస్తాం అంటే ఆల్రెడీ అవన్నీ ఉన్నాయి, కిట్ వద్దని చెప్పాను. నాతోపాటు దరహాస కూడా ఉండటం వల్ల పెద్దగా బోర్ కొట్టకుండా, ఒకరికొకరం అన్నట్టు ఉండగలిగాం. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే... ఇదొక కొత్త వ్యాధి. లక్షణాలు ఒక్కొక్కరికీ ఒక్కోలా వున్నాయి. లక్షణ తీవ్రతను బట్టి ఆసుపత్రిలో వుండాలా, యింట్లోనే ఐసోలేషన్ లో వుండాలో డాక్టర్ సలహాతో నిర్ణయించుకోవాలి. ఈ వ్యాధి తగ్గి, మనం ఆరోగ్యంగా బయట పడాలంటే ముఖ్యంగా కావలసింది ధైర్యం. కరోనా రావడం నేరం, ఘోరం కాదు. రహస్యంగా వుంచాల్సిన అవసరమూ లేదు. మన చుట్టుపక్కల వాళ్లు జాగ్రత్తగా ఉంటూ, ఎక్కువ వ్యాప్తి చెందకుండా నివారించవచ్చు. నాకు అర్థమయ్యింది ఏమిటంటే కరోనా పట్ల మనకు వుండాల్సింది అప్రమత్తత. భయాందోళనలు కాదు! -
ఐకియా బంపర్ ఆఫర్
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ గృహోపకరణాల సంస్థ ఐకియా వార్షికోత్సవం సందర్భంగా తన కస్టమర్లకు గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ నెల 18లోగా ఫ్యామిలీ మెంబర్షిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని స్టోర్లో కొనుగోలు చేసిన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. మెంబర్షిప్ కార్డు తీసుకుని ఆపై తమ అనుభూతులను, ఫోటోలతో సహా ఐకియా ఫ్యామిలీ పేజీలో పంచుకున్న వారి నుండి టాప్ 20 కథనాలను ఎంపిక చేసి వెబ్సైట్లో ఓటింగ్ పెడతామని, సెప్టెంబర్ 9 నుండి 20వ తేదీ వరకు సాగే ఓటింగ్లో విజేతలుగా నిలిచిన కుటుంబాలను స్వీడన్లోని (6 డేస్, 5 నైట్స్) వివిధ ప్రాంతాల్లో పర్యటించే అవకాశం కల్పిస్తామని ఐకియా ప్రకటన పేర్కొంది. తెలంగాణా వాసులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుంది. -
వామ్మ! హైద్రాబాద్!!
నానిగాడు ఫస్ట్టైమ్ హైద్రాబాద్ చూశాడు పోయిన్నెల. అమ్మ ఏదోవిధంగా రాకుండా చేస్తా అని మాటిచ్చింది. అయినా నా దగ్గర అంతకుముందు రోజు తీసుకున్న మాట ఉందిగా, తప్పలేదు. తీసుకొచ్చా. పదప్పుడు బయల్దేరాం ఇంటి నుంచి. నాకు భయంగానే ఉంది, వీడెక్కడ సతాయిస్తాడో అని. బస్ ఎక్కేముందు ‘ఓహో! ఇక్కడ టికెట్ తీస్కోవాల్నా?’ అన్నప్పుడు చాలా హుషారుగా సమాధానమిచ్చా. ఆ తర్వాత, ‘ఇదెంత మావయ్యా?’ అని వాటర్ బాటిల్ కొనేప్పుడు అడిగాడు. ఉత్సాహంగానే సమాధానం ఇచ్చా. ‘ఊరు దాటంగానే రోడ్డు పెద్దగయ్యింది. అదెట్ల?’ అన్నాడు. చెప్పా. ‘ఆహా.. ఇదేనేమో నువ్ చదివిన కాలేజ్ అయితే!’ అన్నప్పుడు అవునన్నా. ‘ఈడ్నే గదా చెర్వుగట్టు?’ అన్నప్పుడు, ‘అవును నీకెట్ల తెలుసురా?’ అనడిగా. ‘నాకన్ని తెల్సు’ అన్నాడు. కాస్త పొగరుగా ఎవ్వరేం మాట్లాడినా నాకు నచ్చదు. నేనందుకే సైలెంట్గా ఉండిపోయా. ‘ఇదేంటిదీ మావయ్యా?’ మళ్లీ వాడే కదిలించాడు. ‘అటు లోపలికి పోతే ఊరు. పైనించే పోతే హైద్రాబాద్’ అని చెప్పా. వాడికి అప్పటికి ఫ్లై ఓవర్ అనే పదాన్ని పరిచయం చేయలేదు నేను. ‘హిహి! మనమిప్పుడు హైద్రాబాద్కి పోతున్నం కాబట్టి పైనించే పోతం అంతెగా!?‘ కళ్లెగరేశాడు.‘అంతే అంతే!’బస్సలా వేగంగా పోతూనే ఉంది. వాడు ఏదోక ప్రశ్న అడుగుతూనే ఉన్నాడు. నేను నాకు తెలిసినంతవరకూ సమాధానాలు చెబుతూనే ఉన్నా. నిజానికి మనకిన్ని విషయాలు తెలుసన్న విషయాన్ని పిల్లలే తెలియజెప్పాలి. టోల్ గేట్ వస్తే, ‘ఇదేంటిది మావయ్యా?’ అనడిగాడు. చెప్పా. ‘ఫ్రీగ రోడ్డు ఎయించుకుర్రుగా మావయ్యా!’ అని వాడు నవ్వుతూ ఉంటే నాకూ నవ్వొచ్చింది. రామోజీ ఫిల్మ్ సిటీ వచ్చింది. ఎప్పుడైనా తీస్కపోతా అని చెప్పా. కాసేపు దాని గురించి ఆలోచించాడు. ఇంకేదో అనుకునే లోపే ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది. ‘వామ్మ.. ఇట్ల ఉందేంది మావయ్యా ఇదీ!’ ఆ కొద్దిసేపు బస్సంతా అన్ని దిక్కులా చూస్తూ, ఔటర్ రింగ్ రోడ్ను అన్నివిధాలా క్యాప్చర్ చేసుకున్నాడు. ఆ దారంతా వినాయకుడి బొమ్మలు కనిపిస్తే, ‘ఇక్కణ్ణించే వస్తయా గణేశ్ బొమ్మలన్నీ?’ అడిగాడు. అవునన్నా. ‘మన చౌరస్తల బొమ్మలు గూడ?’ ‘అవును’‘మరి మనం గుడ ఈనించే కొన్కపోవచ్చుగ!?’‘ఈసారదే చేద్దాం!’‘హ్మ్..’ ఆలోచిస్తూన్నాడు ఏదో.ఎల్బీనగర్ వచ్చింది. మెట్రో పిల్లర్లను, ఫ్లై ఓవర్ వేను చాలాసేపు అలా కళ్లప్పగించి చూస్తూ కూర్చున్నాడు. ‘అదేంది మావయ్యా?’ అనడిగాడు. ‘మెట్రో రైల్రా! దాని మీనించే రైలు పోతది!’ ‘అవునా! తీస్కపోవచ్చుగ నన్ను!!’‘మనం పోయే దిక్కు పోవవి’‘ఉత్తగనే పోతం కద కొంచం దూరం’‘ఈ దార్ల ఇంక రెడీ కాలె! అయినంక పోదాం’‘ఏమొద్దులే!’ అలిగాడు. ‘సరే! వచ్చేటప్పుడు టైముంటే పోదం!’ముద్దిచ్చాడు. కాసేపింక ఏం మాట్లాడకుండా పెద్ద పెద్ద బిల్డింగ్లు, మెట్రో రైల్ పిల్లర్లు చూస్తూన్నాడు.సడెన్గా నావైపు తిరిగి, ‘నేను ఇన్నిన్ని కొత్త కొత్త ప్రపంచాలు చూస్తానుకోలే! ఇదేంది మావయ్యా ఇట్లుంది హైద్రాబాద్!! వామ్మ!!!’ అన్నాడు.నవ్వొచ్చింది. కొత్త కొత్త ప్రపంచాలు అనే మాట వాడు ఎక్కడ అందుకున్నాడో అడగాలనిపించింది. వాణ్ణి డిస్టర్బ్ చేయాలనిపించలేదు అలాగే! ఫ్లై ఓవర్ అనే పదం తెల్సుకున్నాడు నేను చెప్తే. దాని మీంచి బస్సులు పోవని నాతో వాదించాడు. ఒక బస్సు ఫ్లై ఓవర్ ఎక్కుతుంటే చూసి, ఓడిపోయినట్టు నవ్వాడు. ట్రాఫిక్ జామ్ అంటే అర్థమైంది. సిగ్నల్స్ తెల్సుకున్నాడు. బస్సు టైప్స్, రేట్లు అడిగాడు. నిమ్మకాయ్ శర్బత్ ఒకటి తాగాం. పాత ఆఫీస్కి వచ్చి అక్కడి ఫ్రెండ్స్తో మాట్లాడాడు. పనయ్యాక పంజాగుట్ట మెరిడీయన్లో బిర్యాని తిన్నాం. ‘మస్త్ తిరిగినం మావయ్యా! ఇంటికి పోదాం’ అన్నాడు. ‘హహహ! ఇంక చాలా పన్లున్నయిరా’ అన్నా. ‘అంత సీన్ లేదు. నాకు తెల్సులే! ఇంక పోదం మావయ్యా!’ ‘సరే! పోదాం!!’ నవ్వి కౌగిలించుకున్నాడు. మళ్లీ దిల్సుఖ్నగర్ బయల్దేరాం. సాయంత్రం నాలుగైంది. వాడికి అలసటొచ్చి పడుకున్నాడు. దిగేప్పుడు లేపితే మళ్లీ లేచి, ‘పండుకున్ననా?’ అన్నాడు. ఊరికి పోయే బస్సెక్కే ముందు వాటర్ బాటిల్, కొన్ని బిస్కెట్ ప్యాకెట్స్ అవీ తీసుకొని ఎక్కాం. ‘ఇప్పుడు పండుకో ఇగ! ఎట్లుంది హైద్రాబాద్?’ అడిగా.‘అబ్బ! మస్తుంది మావయ్య!’ అన్నాడు. ‘నిద్రొస్తలేదులే!’ పడుకో అని మరోసారంటే ఈ మాటన్నాడు. వచ్చేప్పుడు వాడికి అనుభవంలోకి వచ్చిన ప్రతిదీ చెప్పుకొచ్చాడు. బస్లో మా పక్కన కూర్చున్న అమ్మాయి (చాలా అందంగా ఉంది!) వీడి మాటలన్నీ వింటూ నవ్వింది. వీడింక ఏం మాట్లాడలేదు ఓ గంట పాటు. ఇంటికి చేరేసరికి పడుకున్నాడు. నిద్ర లేపి అన్నం తినిపించింది అమ్మ. ‘మమ్మీ అసలు ఏం హైద్రాబాదే మమ్మీ!!’ అంటూ అమ్మకు కథలు చెప్పడం మొదలుపెట్టాడు. పాపం వాడికి ఒక ఆర్డర్ తెలీదుగా, ఒకటి చెప్పి, అర్రె ఇది చెప్పలేదు అని ఇంకోటి చెప్పి, అదిగాదు మమ్మీ ఇది అని వేరొకటి చెప్పి అది ఇదీ అని ఏది గుర్తొస్తే అది చెప్పి గోల చేశాడు.‘మమ్మీ నీకొకటి తెల్సా! అక్కడ గూడ మనుషులు సిగరెట్లు తాగుతరే!!‘ అని నవ్వుతూ చెప్పాడు. ‘అక్కడ గుడ సిగరెట్లు తాగుతర మావయ్యా! అడగడం మర్చిపోయిన!’ మేము సమాధానం చెప్పకపోయేసరికి వాడే మళ్లీ అడిగాడు. ‘మనుషులు ఎక్కడ్నైనా ఒక్కటే!’ చెప్పా. అమ్మ నవ్వింది. వాడు నవ్వాడు. నేనూ నవ్వాను. వాడడిగిన ప్రశ్నకి ఈసారి కూడా నవ్వుంటే వేరే ప్రశ్నడిగేవాడేమో! నేనప్పుడు ఈ అబద్ధం చెప్పే అవసరం రాకుండేదేమో! – అజు, హైదరాబాద్ -
మంచివాడు
‘సింగ్పూర్ అనగానే నాకు అందమైన అనుభవం సినిమా గుర్తుకొస్తుందండీ. బాలూ రాగం తీసి పాడుతాడు చూడండి... అందమైన’ అని గ్యాప్ ఇచ్చి ‘అనుభవం’ అన్నాడు. నవ్వుతుందేమోనని చూశాడు.లేదు. ‘దాంట్లో రజనీకాంత్కు పిల్లిగడ్డం ఉంటుంది. అతని గర్ల్ఫ్రెండ్ నీ గడ్డమంటే నాకు చాలా ఇష్టం అనగానే అవునా అయితే తీసుకో అని పీకి చేతిలో పెడతాడు. భలే ఫన్నీ’ నవ్వాడు. నవ్వలేదు. సింగపూర్లో ఎనిమిది గంటలు ఉండాలి. అంతసేపూ ఎయిర్పోర్ట్లో బోర్ అని టూ అవర్స్ ఫ్రీ టూర్ ఏర్పాటు చేస్తే రోడ్ల మీద పడ్డారు. ఈవిడది పక్కసీటు. ఎక్కినప్పటి నుంచి అదో మాదిరిగా ఉంది.మేల్కొంటుంది. నిద్రపోతుంది. మేగజీన్ తిరగేస్తుంది. అంతలోనే విండోవైపు తల తిప్పుకుని కళ్లు తుడుచుకుంటుంది. ఇండియా దాకా ఇదే తంతు నడిచిందంటే బోరైపోతాడు. అందుకే మాటల్లో దింపుదామని చూస్తున్నాడు. ఎవడో గౌన్లు అమ్ముతున్నాడు. పూలుపూలుగా బావున్నాయి. ఆగి రెండు కొంటూ అన్నాడు– ‘నాకు ఇద్దరు ఆడపిల్లలండీ తీసుకుంటున్నా. అమెరికాకు తిరిగి వెళ్లాక ఇస్తే చాలా సంతోషపడతారు. చిన్నదైతే ఢిష్యుం ఫైటరే అనుకోండి. నా దగ్గర భలే చనువు’పక్కకు తిరిగి విపరీతంగా వెక్కుతూ ఉంది.‘చూడండి. మీరెవరో నేనెవరో. ప్రయాణంలో కలిశాం. మళ్లీ ఎప్పటికీ కలవం. కనుక మీకేదైనా బాధ ఉంటే నాతో చెప్పండి. అమెరికాలో చచ్చినా మీ ఇంటికి రాను. మా ఇంటికి పిలువను. సరేనా?’హ్యాండ్ కర్చీఫ్తో కళ్లు తుడుచుకుంది.‘పాప గుర్తుకొస్తోంది’‘ఎన్నేళ్లు’‘మూడు’‘వదిలేసి వచ్చారా? ఏం పర్లేదండీ. పిల్లలు అడ్జస్ట్ అవుతారు. మళ్లీ వెళ్లేలోపు మీరిలాగే ఏడుస్తుంటే బరువు మూడు కిలోలు తగ్గుతారు’‘మళ్లీ వెళ్లను’‘అదేంటీ?’‘నేను నా భర్తనూ పాపనూ వదిలేసి శాశ్వతంగా ఇండియా వెళ్లిపోతున్నాను’ ఇది కొంచెం కాఫీ తాగుతూ మాట్లాడాల్సిన సంగతే అనిపించింది. బస్సు మీ ఇష్టంరా రేయ్ తిరిగేసి రండి అన్నట్టు హాల్ట్ అయ్యింది. అక్కడే కాఫీ షాప్ ఉంటే తీసుకెళ్లాడు. ఇద్దరూ ఎదురూబొదురూ కూర్చున్నారు. కొంచెం ఈజ్ చేయడానికి అన్నాడు–‘అమెరికా అన్నాక ఏవో ఒక ఇష్యూస్ ఉండనే ఉంటాయండీ. ఇప్పుడు మా ఆవిడ ఉంది. ఇద్దరు చిన్నపిల్లలు. వాళ్లను చూసుకుంటూ ఉద్యోగం చేయాలంటే మహా అవస్థ. ఆరునెలలు మా అమ్మానాన్నలు ఆరునెలలు వాళ్ల అమ్మానాన్నలు వస్తే ఉంటే చేసి పెడతారు. రెండోది కడుపులో ఉండగా ఉద్యోగం మానేస్తాను అని అంది. వద్దు అని చెప్పాను. ఇంత దూరం వచ్చింది సంపాదించి బాగుపడటానికే కదండీ. ఒళ్లు వొంచాల్సిందే. ఫలితంగా ఏవో చికాకులు నడుస్తూనే ఉంటాయ్. మీ సంగతి?’ మౌనంగా ఉంది. ‘కొంపదీసి అదే కేసా. ఉద్యోగం చేయనన్నారా?’ ‘చేస్తానన్నాను’ ‘చదువు సరిపోలేదా. డిగ్రీపాటి చదువైనా చదివారా?’ సూటిగా చూస్తూ అంది ‘అయామ్ ఏ డాక్టర్’ ‘ఓ’ ‘కాని ప్రస్తుతం హోమ్మేకర్ని. చదివిన చదువును సద్వినియోగం చేయమని ఓత్ తీసుకుంటారు మా చేత. కాని పెళ్లినాటి ప్రమాణాల్లో అది కొట్టుకుపోయింది. మా వారికి నేను ఉద్యోగం చేయడం ఇష్టం లేదు.’ ‘చిత్రంగా ఉందే’ ‘నేనిక్కడ మెడికల్ కోర్సు చేయాలనుకున్నాను. ఈ సంబంధం ఓకే అనడానికి అది కూడా ఒక కారణం. చేద్దూలే చేద్దూలే అంటాడు. పాప పుట్టనీలే అంటాడు. మూడేళ్లు రానీలే అంటాడు. మొత్తానికి ఉద్యోగం చేయడం ఇష్టం లేదని మాత్రం అనడు’ ‘ఎంచేత?’ ‘ఇండియాలో అతనికి ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు. కనుక ఇద్దరు వదినలు కూడా ఉంటారు. వాళ్లు బాగా చదువుకున్నారు. ఇంట్లో వుండి చక్కటి వంటలవీ చేస్తూ ఉంటారు. బాగా చదివి ఇంట్లో ఉంటూ వంట చేసి పెట్టే భార్యలు ఉండటం మర్యాదే కదా. తనకూ అలాంటి మర్యాద కావాలని నా భర్త కోరిక. నా భార్య మెడిసిన్ చేసిందోయ్ అని చెప్పుకోవాలి. సాయంత్రం ఇంటికి రాగానే జీడిపప్పు పకోడీ చేసి పెట్టాలి. బాగుంది కదూ’ ‘ఊ’ ‘అసలు సంగతి అది కాదు. సాఫ్ట్వేర్లో ఎంతొస్తాయో మీకు తెలియదా. నేను ఉద్యోగంలో చేరితే డాక్టరుగా అంతకంటే ఎక్కువ సంపాదించగలను. భార్యకు తన కంటే ఎక్కువ సంపాదన ఉండటం భర్తకు నచ్చదు. తక్కువ సంపాదించాలి. భర్త మీద డిపెండెంట్గా ఉండాలి. అప్పుడు సెక్యూరిటీ ఫీలవుతాడు. కష్టపడి చదువుకుని మంచి డాక్టర్నయ్యానండీ నేను. ఓ పాతికేళ్లైనా పని చేయగలను. అది కాదు... మెడిసిన్ అంటే ప్రాణాలు కాపాడే నోబెల్ ఫ్రొఫెషన్’... ఉద్వేగంతో ఆగింది. ‘తుప్పు ఇనుముకు పట్టాలి. మనిషికి కాదు. అందుకే వెళ్లిపోతున్నాను’ అంది. బస్సు కదలబోతున్నట్టు అర్థమైంది. వచ్చి ఎక్కేశారు. ఇండియాకు వెళ్లబోయే ఫ్లయిట్లో ఇద్దరికీ పక్కపక్క సీట్లు రాలేదు. కనుక మాట్లాడటం కుదరలేదు. హైదరాబాద్లో దిగాక క్యూలో తారసపడ్డారు. పలకరింపుగా నవ్వుతూ అన్నాడు– ‘మీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాను. నాకు మీ ఆయనెందుకో మంచివాడు కాదనిపిస్తోంది’ చురుగ్గా చూసింది. ‘మీరు మంచివారేనా’ ‘మీకలా అనిపించలేదా?’ ‘మంచివారే. మా ఆయన కూడా మంచివాడే. భార్యను అపురూపంగా చూసుకుంటూ ఒక్క మాట అనకుండా ఒక్క పోట్లాట పెట్టుకోకుండా చాలా బాగా చూసుకునే మంచివాడు. కాని ఉద్యోగం వద్దంటే మీరు మీ ఆవిడ చేత చేయిస్తున్నారు. చేస్తానంటే నా భర్త నాతో వద్దంటున్నాడు. మీ ఇద్దరిలో కామన్ పాయింట్ ఏమిటో తెలుసా?’ ‘ఏంటి?’‘ఇద్దరు మగాళ్లు. అందరిలాంటి మగాళ్లు’ తిరిగి చూడకుండా ఉక్రోషం పెల్లుబికుతుండగా బయటకు నడిచింది. కథ ముగిసింది. సాయి బ్రహ్మానందం గొర్తి రాసిన ‘అతను’ కథ ఇది. తాను మంచివాణ్ణి అనుకునే మగాడు ఎంత మంచివాడో చెక్ చేసుకుంటాడా ఎప్పుడైనా. తన అహానికి, ఆధిక్యానికి, సౌలభ్యానికి ఆటంకం రానంత వరకు తల్లితో, చెల్లితో, భార్యతో, ఆఫీస్లో లేడీ కలీగ్తో మంచితనంలో ఎంతదూరమైనా వెళతాడు. కాని వాటికి భంగం వాటల్లితే సమంజసమైన కారణాలను కూడా తిరస్కరించి చేతికి మట్టంటకుండా నస పెట్టడంలోనూ సిద్ధహస్తుడు. ఒళ్లు శుభ్రం చేసే సబ్బు ఉన్నట్టు మగ స్వభావాన్ని శుభ్రం చేసే సబ్బు కూడా దొరికితే బాగుంటుందంటారా? పునః కథనం: ఖదీర్ -సాయి బ్రహ్మానందం గొర్తి -
విదేశీ ఖైదీల విడుదల
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘ఫీల్ ది జైల్’లో భాగంగా సంగారెడ్డి జిల్లా పాత కేంద్ర కారాగారంలో రెండు రోజుల పాటు గడిపిన ఇద్దరు మలేషియా దేశస్తులు సోమవారం విడుదలయ్యారు. రోజుకు రూ.500 చొప్పున చెరో రూ.వేయి చెల్లించిన వీరు జైలు జీవితాన్ని అనుభవించారు. జైలులో సాధారణ ఖైదీలకు కల్పించే సౌకర్యాలనే జైలు అధికారులు వీరికి కూడా కల్పించారు. ప్రపంచంలో ఈ రకమైన అవకాశం ఎక్కడా లేనందునే.. ఇంటర్నెట్ ద్వారా తెలుసుకుని మరీ వచ్చామని ‘సాక్షి’కి వెల్లడించారు. మలేషియాకు చెందిన దంత వైద్యుడు క్వెన్, రెస్టారెంట్ యజమాని కెల్విన్ ఇద్దరూ స్నేహితులు. మలేషియాలోని జైలు మ్యూజియాన్ని సందర్శించిన వీరు ఇతర దేశాల్లోనూ జైలు మ్యూజియాల గురించి ఇంటర్నెట్లో శోధించారు. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా కేంద్ర కారాగారం (పాత)లో ‘ఫీల్ ది జైల్’ అనే వినూత్న అవకాశం ఉన్నట్లు తెలిసింది. జైలు సూపరింటెండెంట్ సంతోష్ కుమార్ రాయ్ను ఫోన్లో సంప్రదించిన వీరు.. ఫీల్ ది జైల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్కు వచ్చిన వీరు.. ఈ నెల 27న సంగారెడ్డికి చేరుకుని ‘ఫీల్ ది జైల్’ కోసం రూ.500 చొప్పున రెండు రోజుల కోసం ఇద్దరూ కలిసి రూ.2వేలు రుసుం చెల్లించారు. అనంతరం జైలు అధికారులు వీరికి సాధారణ ఖైదీల తరహాలో దుస్తులు, దుప్పట్లు తదితర సామగ్రి అందజేశారు. రెండు రోజుల పాటు జైలు జీవితాన్ని అనుభవించిన ఈ ఇద్దరూ సోమవారం ఉదయం విడుదలయ్యారు. ఈ సందర్భంగా తమ అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. బయటి ప్రపంచంతో సంబంధం లేదు.. ‘సాధారణ ఖైదీల తరహాలోనే రెండు రోజుల పాటు జైలు దుస్తులు ధరించాం. ఖైదీలకు ఇచ్చే అన్నం, పప్పు జిల్లా జైలు నుంచి తెప్పించి అందించారు. ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పించలేదు. సెల్ఫోన్, ఇతర కమ్యూనికేషన్ సాధనాలేవీ మాతో పాటు అనుమతించలేదు. దినచర్యలో భాగంగా మొక్కలకు నీళ్లు పట్ట డం, జైలు ఆవరణ శుభ్రం చేయడం వం టి పనుల్లో పాల్గొన్నాం. రెండు రోజుల పాటు ఒక ఇంగ్లిష్ దినపత్రికను అందించారు. 48 గంటల పాటు మేం అనుభవించిన జైలు జైవితాన్ని ఇంటర్నెట్ ద్వారా పంచుకునే ప్రయత్నం చేస్తాం. ఐదురోజుల పర్యటనలో భాగంగా రెండు రోజులు జైలులో గడిపాం. మరో మూడురోజులు హైదరాబాద్లోని పర్యాటక ప్రాంతాలను సందర్శించి స్వదేశానికి తిరిగి వెళ్తాం’ అని వెల్లడించారు. కాగా ఫీల్ ది జైల్లో ఇప్పటి వరకు 47 మంది తమ పేర్లు నమోదు చేసుకోగా, ఇందులో ఏడుగురు మహిళలు సైతం ఉన్నారు. కర్ణాటక, మహా రాష్ట్ర తదితర ప్రాంతాలకు చెందిన వారు కూడా రాగా, తొలిసారి ఇద్దరు విదేశీయులు వచ్చినట్లు జైలు అధికారులు తెలిపారు. -
‘కేసీఆర్కు అనుభవం లేదని రుజువైంది’
-
‘కేసీఆర్కు అనుభవం లేదని రుజువైంది’
హైదరాబాద్సిటీ: కేసీఆర్కు పాలనా అనుభవం లేదని రెండున్నరేళ్ల పాలనతో రుజువైందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ విమర్శించారు. శుక్రవారం షబ్బీర్ అలీ విలేకరులతో మాట్లాడుతూ.. హామీలు గాలికొదిలేసి.. పిట్టల దొరల మాటలతో పాలన గడిపేస్తున్నారని అన్నారు. అబద్ధాలు ధైర్యంగా, అందంగా చెప్పడంలో కేసీఆర్ పాస్ అయ్యారని చెప్పారు. అయితే.. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో మాత్రం కేసీఆర్ విఫలం అయ్యారని విమర్శించారు. బంగారు తెలంగాణ కాస్తా చీకట్ల తెలంగాణాగా మారిపోయిందన్నారు. -
‘నా చుట్టూ శవాలు.. నేనొక్కడినే బతికిన వాడిని’
పుఖ్రయా: ‘నేను ఉన్న బోగీని సగానికి కట్ చేశారు. అందులో ఇరుక్కుపోయిన నన్ను బయటకు తీశారు. అప్పుడు నన్ను అంబులెన్స్ వద్దకు తీసుకెళుతున్నట్లు గుర్తుంది. నా చుట్టూ ఉన్న మృతదేహాల మధ్య నేను ఒక్కడిని మాత్రమే బతికినవాడిని’ అంటూ రైలు ప్రమాదానికి సంబంధించి తన భయంకరమైన అనుభవాన్ని ఉత్తమ్ కుమార్ అనే విద్యార్థి మీడియాకు వెళ్లడించాడు. ఉత్తరప్రదేశ్లోని ఫుఖ్రయా వద్ద ఇండోర్ పట్నాఎక్స్ ప్రెస్ ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. పట్టాలు తప్పిన ఆ రైలు దాదాపు 140మందిని బలగొంది. అందులో ఉత్తమ్ కుమార్ అనే 26 ఏళ్ల వ్యాపార విభాగంలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థి కూడా ఉన్నాడు. ప్రమాదానికి గురైన తర్వాత నలిగిపోయిన రైలు పెట్టెలో అతడు మూడు గంటలపాటు నానా నరకం అనుభవించాడు. ఆర్తనాదాలు చేశాడు. అతడి కేకలు వినిపిస్తున్నాయి కానీ ఏమీ చేయలేని పరిస్థితి. సహాయక చర్యలు శరవేగంగానే జరుగుతున్నాయి కానీ, అతడు ఇరుక్కుపోయిన బోగీ బాగా దెబ్బ తిని త్వరగా బయటకు తీయలేని తీరుగాఉంది. ‘అక్కడ ఉన్నవారంతా నా అరుపులు వింటున్నారు.. కానీ, నేను ఉన్న రైలు పెట్టే మరో రైలు పెట్టెలో ఇరుక్కుపోయి ధ్వంసం అయి ఉండటంతో వారు ఏం చేయలేకపోయారు. అందుకే నేను గట్టిగా మా ఇంటి ఫోన్ నెంబర్ చెప్పాను. ఎవరైనా వింటే ఇంట్లో చెప్తారుగా అని. చివరకు నా అరుపులు విని కాపాడారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను’ అని చెప్పాడు. ఉత్తమ్ తలకు వెన్నుకు బలమైన దెబ్బలు తగిలాయి. మరో విషాధం ఏమిటంటే అతడి పక్కనే కూర్చున్న వాళ్ల తాత ఎక్కడ ఉన్నాడో ఏమయ్యాడో తెలియని పరిస్థితి. -
అక్కడ విందుభోజనం 13.4 కోట్లు..!!
సింగపూర్ః ఎంత పెద్ద ఫంక్షన్ చేసినా... ఎంతమంది అతిథులను పిలిచి విందు భోజనం పెట్టినా కోటి రూపాయలకు మించి ఖర్చు కాదేమో... కానీ సింగపూర్ లోని ఓ రెస్టరెంట్ లో విందు భోజనం ఖరీదు సుమారు 13.4 కోట్ల రూపాయలు అంటే నమ్ముతారా? ఇంతకూ ఆ భోజనానికి అంత ప్రత్యేకత ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా? సింగపూర్ లోని ' సె లా వీ' హోటల్లో కాలు పెట్టాలంటేనే కోటీశ్వరుడయ్యుండాలి. అత్యంత సంపన్నులకోసం ఏర్పాటు చేసిన ఆ రెస్టరెంట్ లో సింగపూర్ లోని మరీనా బే శాండ్స్.. రష్యన్ వరల్డ్ ఆఫ్ డైమండ్స్ సంయుక్తంగా ప్రత్యేక విందును ఏర్పాటు చేశాయి. ఇద్దరు లక్కీ కపుల్ కోసం ఏర్పాటు చేసిన ఈ విందు భోజనం ఖరీదు 13.4 కోట్ల రూపాయలు. అయితే ఎంతటి ఖరీదైన ఆహార పదార్థాలను పెట్టినా అంతటి ఖర్చు ఉండదు కదా! అందుకే అక్కడ విందు చేయాలనుకునేవారికి ' సె లా వీ' కొన్ని ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఎనిమిది గంటలపాటు రెస్టరెంట్లో గడిపే అవకాశంతోపాటు.. భోజనానికి టికెట్ బుక్ చేసుకున్నవారికి ముందుగా 45 నిమిషాలపాటు హెలికాప్టర్ లో సింగపూర్ అందాలను చూపించే ఏర్పాటు చేసింది. అనంతరం రోల్స్ రాయిస్ కారులో మరీనా బే శాండ్ హోటల్ రూఫ్ పైన ఉండే ' సె లా వీ' రెస్టరెంట్ కు తీసుకెడతారు. సుమారు 10,000 తాజా గులాబీలతో చేసిన అలంకరణ వచ్చిన అతిథులకు ప్రత్యేక ఆహ్వానం పలుకుతుంది. 'సె లా వీ' కి చేరిన అథిదులిద్దరూ సింగపూర్ సిటీ అందాలను తిలకించేందుకు వీలుగా బాల్కనీలో విందు భోజనం ఏర్పాటు చేస్తారు. ఈ విందులో కూడా అత్యంత ఖరీదైన 18 రకాల వంటకాలను వడ్డిస్తారు. వాటిని తినేందుకు వచ్చిన వారి పేర్లతో వజ్రాలు పొదిగిన చాప్ స్టిక్ లను, 40-50 సంవత్సరాలనాటి ఓల్డ్ వింటేజ్ వైన్ సర్వ్ చేస్తారు. విందు భోజనం ఆస్వాదించిన ఇద్దరికీ ప్రపంచంలోనే అరుదైన వజ్రాలతో తయారు చేసిన 2.08 క్యారెట్ డైమండ్ ఉంగరాన్ని గిఫ్ట్ గా ఇస్తారు. అయితే ఈ వజ్రం ఖరీదు సుమారు 13 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, సంపన్నమైన విందు అనుభవం అని, 'డైమండ్ ఇన్ ద స్కై' అన్నట్లు సంపన్నులకు ' సె లా వీ' ఆకాశం లోని నక్షత్రంలాంటిదని వరల్డ్ ఆఫ్ డైమండ్ గ్రూప్ డైరెక్టర్ కరన్ తిలానీ చెప్తున్నారు. అయితే ఈ విందు కేవలం ఎంపిక చేసిన ఇద్దరికి మాత్రమే ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆ ఇద్దర్నీ ఎంపిక చేసే విషయంలో మాత్రం సదరు వజ్రాల వ్యాపారులు చాలా కండిషన్లే పెట్టినట్లు తెలుస్తోంది. -
నాటకరంగ అనుభవమే భుక్తి
ప్రముఖ సినీ నటుడు వైజాగ్ప్రసాద్ ఖమ్మం కల్చరల్ : ఆ నాటి నాటక రంగ అనుభవమే నేటి ముక్తికి మార్గమైందని ప్రముఖ సినీ నటుడు వైజాగ్ ప్రసాద్ పేర్కోన్నారు. నెలనెలా వెన్నెల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు ఖమ్మం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం నటనా రంగంలో అనుభవంతో పనిలేకుండా ఎవరితో పడితే వాళ్లతో నటింపజేసి నాణ్యతలేని, జీవం లేని సినిమాలు, సీరియళ్లను నిర్మించడం దారుణమన్నారు. మరీ కొన్ని సినిమాలు, సీరియళ్లలో సంస్కృతి, సంప్రదాయాలను మంటగలిపేస్తున్నారని వాపోయారు. 50 ఏళ్లుగా నాటకాలు వేస్తున్నానని, సినిమాల్లో అనేక పాత్రలు చేశానని తెలిపారు. నాటకరంగలో రచన, నటన, దర్శకత్వం రంగాల్లో గుర్తింపు లభించిందని, అనేక అవార్డులొచ్చాయని చెప్పారు. మాట్లాడుతున్న వైజాగ్ ప్రసాద్ -
వారికి.. మెట్రో సౌకర్యాలపై అవగాహన!
బెంగళూరుః దృశ్య, శ్రవణ లోపాలున్న ఓ బృదం మొదటిసారి మెట్రో రైల్లో ప్రయాణించి తమ అనుభవాలను తెలిపింది. ఓ ఎన్జీవో సంస్థతో పాటు ఐటీ సంస్థ సాయంతో వారు 'నమ్మ మెట్రోస్' అండర్ గ్రౌండ్ మెట్రో కారిడార్ లో ప్రయాణించారు. లోపాలున్న వ్యక్తులకు మెట్రోలో కల్పించే ప్రత్యేక సౌకర్యాలపై అవగాహన కల్పించేందుకు సైన్స్ ఇంటర్నేషనల్ ఇండియా ప్రత్యేక రైడ్ నిర్వహించింది. దృష్టి, వినికిడి లోపాలున్నవారికి మెట్రో రైల్లో ప్రయాణ సౌకర్యాలపై మొదటిసారి ప్రత్యేక అవగాహనా కార్యక్రమాన్ని చేపట్టారు. లోపాలున్న 34 మంది తోపాటు వారి సహాయకులు సైన్స్ ఇంటర్నేషనల్ నిర్వహించిన ప్రత్యేక రైడ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రత్యేక రైడ్ లో కాగ్నిజెంట్ నుంచి 13 మంది వాలంటీర్లు సైతం భాగం పంచుకున్నారు. భారతదేశంలోని దక్షిణ, పశ్చిమ ప్రాంతాలకు చెందిన పలువురు ఈ రైడ్ లో పాల్గొని మెట్రో రైల్లో తమకు ప్రత్యేకంగా కల్పించిన సౌకర్యాలపై అనుభవ పూర్వకంగా తెలుసుకున్నారు. బెంగళూరులోని స్వామీ వివేకానంద మెట్రో స్టేషన్ నుంచి కబ్బన్ పార్క్ మెట్రో స్టేషన్ వరకూ వారి ప్రయాణం సాగింది. ఇంద్రియ సంబంధమైన వైకల్యాలతో బాధపడుతున్న వారికి జాతీయ శిక్షణలో భాగంగా ఈ ప్రత్యేక రైడ్ నిర్వహించినట్లు సైన్స్ ఇంటర్నేషనల్ ఓ ప్రకటనలో తెలిపింది. శిక్షణా కార్యక్రమంలో భాగంగా మైట్రో రైళ్ళలో వికలాంగులకు అనుకూలంగా అందించే ప్రత్యేక సౌకర్యాలను వారికి వివరించినట్లు తెలిపారు. -
ఓ నాన్న కథ
రేపు ఫాదర్స్ డే నాన్న గొప్ప చెట్టు. చాలా చాలా చాలా చాలా పెద్ద చెట్టు. కానీ... చాలా చాలా చాలా చాలా చిన్నగా ఉంటాడు. తన నీడ పడితే బిడ్డ పెరగడేమోనని భయం కాబోలు... తను ఒదిగి ఉండి, మనల్ని ఎదగనిస్తాడు.చిన్న చెట్లకు పెద్ద పండ్లంటే ఇదేనేమో. మన జీవితం పండించడానికి తను పడ్డ కాయకష్టం ఇది. పిల్లలు చెప్పిన తండ్రుల కథలివి. నా తల నిమరలేదు... నా భుజం తట్టలేదు.... ‘నాన్నకు బాలేదురా’ - అమ్మ ఫోన్! అంబులెన్స్ సైరన్... ఫోన్లోంచి మొత్తుకుంటోంది. హైదరాబాద్లో సైరన్లు నాకు మూమూలే. అమ్మ గొంతే.. ఎప్పుడూ ఉన్నంత ధైర్యంగా లేదు. ‘ఏమైందమ్మా?’ అన్నాను. చెప్పింది. నాన్నకు హార్ట్ ఎటాక్! గుంటూరు తీసుకెళుతున్నారు. ‘‘పెద్దోడొచ్చాడు’’... నాన్నకు చెబుతోంది అమ్మ. నాన్న ఐసీయులో ఉన్నారు. పూర్తిగా పడుకున్నట్లు కాకుండా, పూర్తిగా కూర్చున్నట్లు కాకుండా బెడ్ మీద ఉంచారు ఆయన్ని. అమ్మ మాటకు నెమ్మదిగా కళ్లుతెరిచి చూశారు. నాన్న కాళ్లకు ఎదురుగా నిలబడ్డాను. ‘ఏమిటి గెడ్డం?’ అన్నట్లు నవ్వుతూ చూశారు. ‘ఏం లేదు’ అని తల ఊపాను. నేను ఆయన్నే చూస్తున్నాను. నాన్న కళ్లు కదలించారు. ఏదో చెప్పబోయారో, ఏదో అడగబోయారో! రాత్రి రెండయింది. ‘ఆయన్ని విశ్రాంతిగా పడుకోనివ్వండి’ అంటున్నారు డాక్టర్. అటెండెంట్స్ వరండాలో ఉండాలి. అమ్మకు చెప్పి బయటికి వచ్చేస్తున్నాను. ‘‘ఆగరా’’ అంది అమ్మ. నాన్న వైపు చూశాను. దగ్గరకి రమ్మన్నారు. వెళ్లాను. ఇంకా దగ్గరికి రమ్మనట్లుగా సైగ చేశారు. వెళ్లాను. ఆయన చేతులకు అందేంత దగ్గరగా. తల నిమురుతారేమో అనుకున్నాను. ఊరికే అలా అనుకున్నాను. ఏ వయసులోనూ ఆయన నా తల నిమిరిన జ్ఞాపకం నాకు లేదు. గంభీరమైన ఆయన కంఠం ఒక్కటే నా జీవితకాలంలో నన్ను తాకింది. నన్ను దిద్దింది. మరింత దగ్గరికి వెళ్లాను.. దాదాపుగా ఆయన మీదకు ఒరిగాను. ఆయన నా తల నిమరలేదు. నా చుబుకాన్ని తాకలేదు. నా భుజాన్ని తట్టలేదు. నా చేతుల్ని తన చేతుల్లోకి తీసుకోలేదు. నా కళ్లలోకి చూడలేదు. నా చొక్కా జేబుకు తన వేళ్లను తాకించారు. కొద్దిగా తల పైకి లేపి నా జేబులోకి చూశారు. తర్వాత తలను వెనక్కి అన్చుకున్నారు. అమ్మ.. నాన్ననే చూస్తోంది. ‘‘హైద్రాబాద్లో వాడు ఎట్లా ఉన్నాడో... డబ్బుకి ఇబ్బంది పడుతున్నాడో ఏమో’’ అంటుండే వారట నాన్న. చనిపోయే ముందు ఆయనకు ఆ మాట అనే శక్తి లేకపోయింది. నా జేబును తాకి చూశారు. - నాన్న లేని ఒక నాన్న నాడి అమ్మయితే... నరం నాన్న! అదొక రాతికట్టడపు బావి. అంచు నుంచీ అడుగు వరకూ రాతి మెట్లు. మామూలుగా అయితే ఈత నేర్పే ఆ సమయంలో నాన్న నాతోనూ, నాలా ఈదులాడే ఇంకొంత మంది పిల్లలతోనూ బావిలో ఉండేవారు. నేను ఈదడం మొదలు పెట్టాక ఆయన బావిలోకి దిగడం క్రమంగా తగ్గించారు. ఆ నీళ్లలో మేం తుళ్లుతూ ఉండటం... అలా అలవోకగా కాళ్లూ చేతులు కదిలిస్తూ ఈదడం చూసి నాన్నకు ఆనందించేవారు. ఈతలో మేం ఆనందించే సేమ్ టు సేమ్ అనుభూతినే నాన్న మమ్మల్ని చూస్తూ ఆస్వాదించేవారు. అలా గంటా గంటన్నర సేపూ మమ్మల్ని చూస్తూ ఒపిగ్గా ఉండిపోయేవారాయన. కానీ ఏదో ఒక సమయంలో ఇంటికి తీసుకెళ్లాలి కదా. అందుకోసం మమ్మల్ని నీళ్లలోంచి బయటకు తీసుకురావాలి కదా. అందుకే ఆ చర్య తనకు వ్యక్తిగతంగా ఇష్టం లేకపోయినా తప్పదు కాబట్టి అలా చేశారని పెద్దయ్యాక గానీ తెలియలేదు. ఇలా మమ్మల్ని ఈతకు వదిలి... ఆయన గట్టు మీద నుంచి చూస్తూ ఉండటం నాన్నకు నిత్యకృత్యం. టైమ్కు అతీతమైన ఒక పారవశ్య దృశ్యం. కొన్నాళ్ల తర్వాత మమ్మల్ని ఈదులాడించడానికి వచ్చినా ఆయన తన ఫుల్షర్ట్, ప్యాంట్తో ఉండేవారు. ఇలాంటి టైమ్లోనే ఈత నేర్చుకునేందుకు సిద్ధపడ్డ మరో చిన్నపిల్లాడు బావిలోకి దిగాడు. ఈత రాకపోవడంతో నన్ను పట్టుకున్నాడు. అంతే... ఆ మరుక్షణం నేనూ, అతడూ ఇద్దరమూ మునక. బావి నీళ్లు గొంతుల్లోకి గుటక. అయితే అది క్షణకాలం పాటే... అక్కడ జరిగిందేమిటన్నది కొద్దిసేపటి తర్వాత గానీ నాకు తెలియరాలేదు. అనంతానంత దిగంతాల ఆవల నుంచి కాంతి ప్రయాణానికి వత్సరాలు కావాలేమో. కానీ అదే దూరాన్ని నాన్న క్షణాల్లో అధిగమించగలరని తేలిపోయింది! అదే డ్రస్తో ఆమాంతం బావిలోకి దూకి కడుపున పుట్టిన తన పిల్లాడినీ, కడుపున పుట్టని ఇంకో పిల్లాడినీ రక్షించారు నాన్న. తొలిసారి జీవితాన్ని ప్రసాదించడం నాన్నలకు మామూలే. కానీ ఎన్నోసార్లు తాను ఆవిర్భవింజేసిన జీవితాన్ని కాపాడారాయన. వాటిల్లో ఒకటి ఇది. ఇదే సంఘటన చెప్పి... నాకు అయిన చిన్నగాయం చూసి అమ్మ కంగారపడిందేమో... కానీ నాన్న గర్వపడ్డారు. గాయాల్ని చూసి గర్వపడటం నాన్నలకు మామూలే. అమ్మ పాదాల దగ్గర స్వర్గం ఉంటుందన్న మాట నిజమే. కానీ దాంతో పాటు సమస్త భువనాలు నాన్న పాదాల దగ్గర దాస్యం చేస్తుంటాయి. ఇంకో మాటలో చెప్పాలంటే సంస్పందిచే నాడి (రక్తనాళం) అమ్మయితే నరం నాన్న. - ఒక కొడుకు కొడుకు గొప్ప... నాన్న గొప్ప... నాకు డ్రాయింగ్ అంటే పిచ్చి. మా నాన్నకు మాత్రం పిచ్చికోపం. బొమ్మలు తప్ప సైకిల్ షాపులోనైనా, మోటర్ మెకానిక్ షాపులోనైనా ఏదో ఒకటి చదువుతోపాటు నేర్చుకుంటే బతుకు బస్టాండ్ కాదని అనే వాడు. నేను దొంగతనంగా డ్రాయింగ్ వేస్తుంటే బస్టాండ్ ముందు ఆంజనేయస్వామి, ఏసు ప్రభువు బొమ్మలు వేస్తూ అడుక్కునే వాళ్లను చూపించి అలా కావద్దని అనేవాడు. లైన్మెన్ ఆయన. పైగా మా నాన్న కింద పని చేసినోళ్లు మంచి వర్కర్స్గా తయారయ్యారు. నాకు మాత్రం డ్రాయింగ్ పిచ్చి వదల్లేదు. దాని నుంచి తప్పించాలని నన్ను చివరికి మా నాన్న ఓ రేడియో షాపులో పెట్టాడు. మధ్యమధ్యలో వచ్చి సూపర్వైజింగ్ చేసేవాడు. నేను డ్రాయింగ్ వేస్తూ నాన్న వచ్చే టయానికి రేడియోతో ఫోజు పెట్టేవాడిని. నాన్న దిల్ ఖుష్! మేరే దిల్ పసంద్! నేను ఓవారం రోజులు కూర్చుని లక్ష్మీదేవి బొమ్మలు గీసిన. ఆభరణాలు, పోలికలు వగైరా వగైరా అన్నీ వచ్చినయ్ ఒక ఫేస్ తక్క. కళు,్ల ముక్కు వేయడం.. చెరపటం ఓ ఇరవైసార్లు! నేను గీసిన డ్రాయింగ్ షీట్ ఫేస్ భాగం వరకూ ఉల్లిపొర కాగితం అయ్యింది. ఇంకొకసారి గీయడమే చెడిపే ఛాన్స్ లేదు. చినిగే ఛాన్స్ మిగిలింది. క్లాసుకు తీసుకుపోయిన. మా డ్రాయింగ్ సార్ శ్రీరాములు నా బొమ్మ చూసి ఇంత అద్భుతంగా ఉంది, ఫేస్ వేయరాకపోవడానికి ఏముందిరా శంకర్ అని పెన్సిల్తో నా కళ్ల ముందే లక్ష్మీదేవి కళ్లు, ముక్కు గీసేసరికి నాకు ఆర్టిస్ట్ కావాలనే కోరిక ఇంకా గట్టిగా ఫిక్సయిపోయింది. ఆ ఒక్క ఫేసుతో బొమ్మ వెలిగిపోయింది. సీన్ కట్చేస్తే ... అలా డ్రాయింగ్ వేస్తూ చిన్నగా కార్టూన్ల వైపు మళ్లింది మనసు. కార్టూన్లు గీస్తూ వారపత్రికలకు పంపేవాడిని. కొన్ని పత్రికలు పారితోషికం కూడా పంపేవి. ఒకసారి నా కార్టూన్లు అచ్చయిన ఓ వారపత్రిక కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చి నాన్నకు చూపించలేక అమ్మకు చూపించిన. నాన్నకు కూడా చూపించురా సంతోషపడ్తడు అంది. నేను ఆ ధైర్యం చేయలేకపోయిన. అమ్మ చూపిస్తే ఒకింత ఆశ్చర్యపోతూ మనోడి కార్టూన్లు ఇందులో పడ్డాయా అని ఖుషీ అయిండని చెపితే నేను మస్తు ఖుషి. ఓ పత్రిక నుంచి ఓరోజు మా నాన్న ఇంట్లో ఉండగానే మనియార్డర్ వచ్చింది. సంతకం చేసి తీసుకున్నా. అలా ఆయన ముందు ఓ నాలుగుసార్లు మనియార్డర్లు వచ్చాయి. కార్టూన్స్కు పైసలు కూడా ఇస్తారా అని ఆయన మా అమ్మను అడిగితే అవునని చెప్పేసరికి నా మీద ఓ చిన్న పాజిటివ్ దృక్పధం ఏర్పడింది. అలా నా ముందు నాన్న ఉన్నా కార్టూన్లు గీసే స్థాయికి చేరాను. ఓ రోజు నేను ఇంట్లోకి అడుగుపెడుతూంటే పత్రికల్లో అచ్చయిన కార్టూన్లు మా నాన్న తన దోస్తులందరినీ పిలిచి చూపిస్తూ... మావోడు మామూలోడు కాదు వాడు గీసిన బొమ్మలను పత్రికలోళ్లు వేసుకుంటారు మళ్లీ వాటికి పైసలు కూడా ఇస్తారు తెల్సా... చాలా ఫేమస్.. అని కార్టూన్ కింద నా సంతకం చూపిస్తే వాళ్లకు నా గురించి గొప్పగా చెపుతూ తను ఇంకా గొప్పగా ఫీలవుతుంటే ఇంట్లోకి రాకుండా గోడ పక్కనే నిలబడిపోయా... కళ్లలోకి వచ్చిన నీళ్లతో! - శంకర్, కార్టూనిస్ట్ ఆ కళ్లు! ఒకసారి నేను తెల్లకాగితం మీద ఇలా రాసుకున్నాను... ‘తెల్లగోడ మీద బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో మా అబ్బ నా చిన్నప్పుడు... యవ్వనమప్పుడు...ఇప్పుడు... అచ్చు అలాగే ఉన్నాడు. అమ్మ మాత్రం...మారిపోయింది’ అని. క్రాఫ్ చెరగని, తల వెంట్రుకలు నెరవని, యవ్వనం చెదరని అబ్బ ఎంత అదృష్టవంతుడు. చాలామంది ‘మా నాయిన ఇట్లా’ ‘మా నాయిన అట్ల’ అని చెబుతుంటారు. మా అబ్బ ‘ఇట్లా’ ‘అట్లా’ అని చెప్పడానికి నా దగ్గర ఏమీ లేదు. ‘శ్రీరామకృష్ణ శిశుమందీర్’లో రెండో క్లాసో, మూడో క్లాసో చదువుతున్నప్పుడు ఒక మధ్యాహ్నం మా సజ్జు మామ కావచ్చు... స్కూల్కు వచ్చి ‘చిట్టిబాబును ఇంటికి తీసుకపోవాలె’ అని హెడ్మాస్టర్తో చిన్నగా ఏదో మాట్లాడి తీసుకెళ్లాడు. చిట్టి గంట మోగకుండానే ఇంటికి వెళ్లడం అంత సంతోషం ఏముంటుంది? ఆ సంతోషపు నావలో ఆడుతు పాడుతూ వస్తుండగానే...మా ఇంటి ముందు నుంచి దుఃఖపు సముద్రం ఎదురొచ్చింది. బీమారితో వారం రోజులు అమృల్లా హస్పటల్లో ఉలుకూపలుకు లేకుండా బెడ్ మీద ఉన్న అబ్బ చనిపోయాడట. మా అమ్మ, అన్న, తమ్ముడు...అక్కలు...అందరూ ఏడుస్తున్నారు. ఆ దుఃఖపు నది ఇప్పటికీ ఎండిపోలేదు. ఏ కాలనికి ఎండిపోదు! నేను ఊళ్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు మా అబ్బ ఫోటో చూస్తాను. ఆయన పలకరిస్తున్నట్లు అనిపిస్తుంది. తిడుతున్నట్లు అనిపిస్తుంది. జాగ్రత్తలు చెబుతున్నట్లు అనిపిస్తుంది. అబ్బ లేకపోవచ్చు అమ్మ రెండు కళ్లు ఉన్నాయి. ఆ కళ్లలో అబ్బ ఉన్నాడు. ఆ కళ్లు నాతో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉన్నాయి! - పాషా మా చిన్నాయన.... నాయన అన్నా, అమ్మ అన్నా నాకు మా చిన్నాయన మహబూబ్ బాషే. నేను పుట్టగానే ఏం పనిబడిందో ఏమో నాతో చెప్పా చేయకుండా మా అమ్మ దేవుని ఊరికి వెళ్ళిపోయింది. మా తండ్రి మిలట్రి మనిషి. పరాయి రాష్ట్రాల్లో కాపురం. చుట్టపు చూపుగా వచ్చేవాడు, అట్లాంటి దిక్కులేనితనంలో మా చిన్నాయన, జేజీ, మేనత్త నన్ను సాకినారు. అందరిలోకీ మా మాబ్బాష చిన్నాయన అన్నీ తనై నన్ను తన చేతుల్లోకి తీసుకున్నాడు. ప్రాణంపోయేంత జబ్బు చేసిన పసిగుడ్డుని నానా తంటాలు పడి కాపాడుకున్నాడట! ఎంత అన్న కొడుకైనా, రక్తపాశం వున్నా ఎంతోటి కరుణ, ఎంత దయ లేకపోతే ఆయన ఆ వయసులో నాకు నాయనగా మారిపోతాడు? వయసుకు మించి గంభీరం ఆయనది. పేద పెద్ద కుటుంబం ఆయనకి పెద్దరికం తొడిగింది. దాన్నే ఆలంబనగా చేసుకుని తన పెద్దకుటుంబానికి పెద్ద దికైై్క నిలబడినాడు, యవ్వనమంతా నొవామాదిరి కుటుంబాన్ని నావలో కూచోబెట్టి లాగినాడు, తను నీళ్ళల్లొనే వుండి. స్ఫురద్రూపం అనే కఠినమైన మాటకు అర్థం నాకు తెలియదు కానీ అటువంటిది ఏదైనా వుంది అంటే మా మాబ్బాష నాయన మొహమే నా కళ్ళ ముందుకు వస్తుంది. చక్కని రూపం, ఇక ముక్కు సంగతి చెప్పనక్కరలేదు. నూనెపల్లె గ్రామంలో మా సూటి ముక్కుల తీరు మరెక్కడా ఇంకెక్కడా కానరాదు, అటువంటి ముక్కుకింద కోర తిరిగిన మీసాలతో కనపడే చక్కని రూపం ఆయనది. ఏనాడూ ఆయన నన్ను ప్రేమారాగాలతో సాకలేదు. భయభక్తులతో పెంచాడన్నదే నిజం. ఆ భయభక్తుల్లోంచే మేం నేర్చుకోవాల్సిందేమైనా వుంటే అది నేర్చుకున్నాం. ఆ మాదిరి భయభక్తుల వల్లే పుట్టి భూమ్మీద పడి నలభై యేళ్ళయినా ఈ రోజుకు మా చిన్నాయన ముందు కూచుని ఎరుగం, పట్టుమని అయిదు నిముషాలు ఆయనతో మాటకలిపే ధైర్యం చేయం, అదే బావుంటుంది కూడా నాకు. జన్మకు నాయన ఒకరే వుంటారు, చిన్నాయన రెండ్లు, మూడ్లు, నాలుగయిదులు. అంటే ఎక్కువ ప్రేమలు అని దేవుడు నాకు మాత్రమే తెలిపిన వరం. - అన్వర్, ఆర్టిస్ట్ పోర్చుగీస్ నాన్న - ది బెస్ట్ ప్రపంచంలో అత్యుత్తమ తండ్రులు ఏ దేశం వాళ్ళు? చిన్నపిల్లల సంరక్షణ, బాధ్యతల విషయంలో ఏ దేశం వాళ్ళు ఎలా ఉంటారన్న దానిపై ప్రధానమైన 15 దేశాల్లో ‘ఫాదర్హుడ్ ఇన్స్టిట్యూట్’ అధ్యయనం జరిపింది. బ్రిటన్కు చెందిన తండ్రులు ప్రపంచంలోకెల్లా ‘వరస్ట్’ అని ఇందులో తేలింది. బ్రిటన్లో తల్లులు తమ పిల్లల్ని చూసుకోవడానికి గంట గడిపితే, అక్కడి తండ్రులు మాత్రం పిల్లల సంరక్షణకు కేవలం 24 నిమిషాల సమయమే వెచ్చిస్తున్నారట! దాంతో, అధ్యయనం చేపట్టిన 15 దేశాల్లో అన్నిటి కన్నా అట్టడుగున బ్రిటన్ నిలిచింది. అభివృద్ధి చెందిన దేశాలన్నిటిలోకీ చిట్టచివరి ర్యాంకు తెచ్చుకుంది. విశేషం ఏమిటంటే, ఈ దేశాల్లోకెల్లా మొట్టమొదటి ర్యాంకు పోర్చుగల్కు దక్కింది. ఆ దేశంలో తల్లులు ఒక గంట పాటు పిల్లల సంరక్షణలో గడిపితే, తండ్రులు 39 నిమిషాల సమయం పిల్లల బాధ్యతలు చూస్తున్నారు. ఈ అధ్యయనంతో సంబంధం లేదు కానీ, ఆ మధ్య కొన్నేళ్ళ క్రితం ఇండియాలో కూడా ఒక సర్వే జరిగింది. ఆ సర్వేలో మన దగ్గర తండ్రులు తమ పిల్లలతో రోజుకు 8 నిమిషాలే మాట్లాడుతున్నారట! ఇక, ఉద్యోగినులైన తల్లులు 11 నిమిషాలు, గృహిణులైన అమ్మలైతే రోజుకు 30 నిమిషాల పైగా పిల్లలతో సంభాషిస్తున్నారట! అంకెల మాట ఎలా ఉన్నా, పిల్లల సమగ్ర వికాసం కోసం వాళ్ళతో రోజూ వీలైనంత ఎక్కువ టైమ్ గడపడమే మంచిదని విశ్లేషకుల మాట! కేవలం పిల్లల స్కూలు విషయాలు, హోమ్ వర్క్ విషయాలే కాకుండా, వాళ్ళ ఆలోచనలు, అనుమానాలు కూడా పంచుకోవడం మంచిదని చెబుతున్నారు. అప్పుడే తల్లితండ్రులతో పిల్లలకు బంధం బలపడుతుంది. ఉత్తమ తండ్రులుగా, తల్లులుగా తలెత్తుకు నిలబడడానికి వీలవుతుంది. నాన్నతో గడిపితే తెలివితేటలు... పిల్లలు తమ తండ్రులతో కాలక్షేపం చేస్తుంటే ఏ తల్లి ఆనందానికైనా అవధులు ఉండవు. ఎందుకంటే, దాని వల్ల ఒకపక్క తనకు కాస్తంత విశ్రాంతి చిక్కడమే కాకుండా, మానసికంగా కూడా ఆనందంగా ఉంటుంది. అయితే, తల్లుల ఆనందం కోసమే కాదు, పిల్లల తెలివితేటలు పెరగడానికి కూడా తండ్రులతో హాయిగా కాలక్షేపం చేయడం అవసరమని పరిశోధకులు చెబుతున్నారు. తండ్రులతో ఎక్కువసేపు గడపడం వల్ల పిల్లల ఐ.క్యు పెరుగుతుందనీ, చిన్నతనంలో పిల్లలపై పడే తండ్రి ప్రభావం వల్ల పిల్లల భవిష్యత్ కెరీర్ బాగుంటుందనీ తేలింది. బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ న్యూక్యాజిల్కు చెందిన పరిశోధకులు 1958లో పుట్టిన కొన్ని వేల మంది బ్రిటీషు స్త్రీ పురుషుల్ని సర్వే చేసి, ఈ సంగతి తేల్చారు. పిల్లల కోసం పుస్తకాలు చదివి వినిపించడం, వాళ్ళతో ఆటలు ఆడడం, కలసి బయటకు విహారానికి వెళ్ళడం లాంటివాటికి తండ్రులు ఎంత టైమ్ వెచ్చిస్తున్నారన్న దాన్ని బట్టి, పిల్లల ఐ.క్యు ఉందట! ‘ఎవల్యూషన్ అండ్ హ్యూమన్ బిహేవియర్’ అనే పత్రికలో ఈ సర్వే ఫలితాలను ప్రచురించారు. గమ్మత్తేమిటంటే, ఈ పిల్లలు పెద్దవాళ్ళయి, ముప్ఫై ఏళ్ళు వచ్చిన తరువాత కూడా చిన్నప్పుడు తండ్రితో గడిపిన క్షణాలు ప్రభావం చూపుతాయి. దీన్నిబట్టి, పిల్లలకూ, తల్లితండ్రులకూ మధ్య ఉండాల్సిన బంధం విషయంలో మన భారతీయ విలువలు ఎంత గొప్పవన్నది తెలుస్తోంది. పాశ్చాత్య దేశాల్లో లాగా మన దేశంలో పిల్లలు పెద్దవగానే, వాళ్ళతో తల్లితండ్రుల బంధం తెగిపోదు. తల్లితండ్రులతో కలిసే ఉండడం, ఒక వేళ విడిగా ఉన్నప్పటికీ తరచూ వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు కనుక్కోవడం లాంటివన్నీ ఉపయోగమని తాజాగా సైన్స్ కూడా నిరూపించినట్లయింది. ఆ తెగలో... మగ అమ్మలు ప్రపంచంలోని అత్యుత్తమ తండ్రుల గురించి చెప్పమంటే, ఆంథ్రొపాలజిస్ట్లు ఆఫ్రికన్ గిరిజన్ తెగ ‘అకా’లోని మగవాళ్ళ ముచ్చటే ఎత్తుతున్నారు. ఆఫ్రికాలోని ఈ సంచార గిరిజన తెగలోని మగవారు పిల్లల పెంపకంలో అమ్మను తలపిస్తుంటారు. అమ్మ దగ్గర లేక పసిబిడ్డ గుక్కపెడుతుంటే, తండ్రులే తల్లులై తమ చనుమొనల్ని పిల్లల నోట పెడతారు. అలా అప్రయత్నంగా అమ్మలు అవుతారు. పసిబిడ్డలు వాటిని చప్పరిస్తూ, నాన్నలోనే అమ్మను చూసుకుంటారు. ఇలా పిల్లలకు మగవాళ్ళు చనుబాలు ఇవ్వడమనే విచిత్రమైన అలవాటు గురించి అమెరికన్ ఆంథ్రొపాలజిస్ట్ ఒకరు తొలిసారిగా ప్రపంచానికి చాటిచెప్పారు. ఆఫ్రికా మధ్య ప్రాంతంలో నివసించే ఈ ‘అకా పిగ్మీ’ గిరిజన తెగ మొత్తం జనాభా దాదాపు 20 వేల దాకా ఉంటుందని అంచనా. విశేషం ఏమిటంటే, ఈ గిరిజన తెగలోని తండ్రులు రోజు మొత్తంలో దాదాపు 47 శాతం సమయం తమ పిల్లలకు అందుబాటులో ఉంటారు. ఈ భూమండలం మీద ఏ ఇతర సాంస్కృతిక బృందంలోనూ తండ్రులు ఇంతగా అందుబాటులో ఉండరంటే అతిశయోక్తి కాదని నిపుణుల మాట. అందుకే, ‘అకా’ తెగ పురుషుల్ని ‘‘ప్రపంచంలోకెల్లా అత్యుత్తమ తండ్రులు’’గా అభివర్ణిస్తుంటారు. అవును... నేను ఆయన కూతుర్నే.... ‘నన్నెందుకు వదిలేసారు వాళ్ళు?’ మూడోసారి అడిగానా ప్రశ్న. నాకు పెరుగన్నం తినిపించిన చేతి మునివేళ్ళను వసారాలో కడుక్కుంటూ ‘అప్పుడు నువ్వు ముప్ఫయ్ రోజుల పసిగుడ్డువి’ అన్నాడాయన. ‘అమ్మ జైల్లోనూ, నాన్న అడవిలోనూ ఉన్నారు మరి నిన్నెవరు చూస్తారు? అందుకే నీకు జోలపాడమని నా దగ్గరుంచారు’ నులక మంచంమీద పక్క సర్దుతూ అన్నాడు. అడవిలోనూ, జైల్లోనూ ఎందుకున్నారు? నా ప్రశ్నకి సమాధానం ఇవ్వకుండానే నన్ను జోకొడుతూ రోజూ పాడే పాట ‘జో అచ్చుతానంద...జోజోముకుందా...’ పాటెప్పుడాగిపోయిందో తెలియదు. తెల్లవారి కళ్ళు తెరిచి చూసేసరికి ఇంటిముందు రాకాసి బొగ్గు దుమ్ము రేపుకుంటూ రయ్యిన వచ్చి ఆగింది పోలీసు జీపు. ‘దిగు శేషయ్యా...’ కరుకుగా వచ్చింది మాట. ఆయన దిగాడు. రాత్రి పెరుగన్నం ముద్దలు తినిపించిన తమలపాకుల్లాంటి మునివేళ్ళకొసలు రక్తమోడుతున్నాయి. అడుగుతీసి అడుగువేయలేకపోతున్నాడు. తూలిపడబోతూ ఇంటిబయటి గుంజను పట్టుకుని నిలదొక్కుకున్నాడు. తెల్లటి లాల్చీ, పంచెపై అక్కడక్కడా నెత్తుటి మరకలు. బిక్కచచ్చిపోయి భయం భయంగా చూస్తున్న నన్ను రమ్మన్నట్టు సైగచేసాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి కాళ్ళకు చుట్టుకుపోయి బోరుమన్నాను. నాకేదో అర్థం అయ్యి కాదు. పోలీసుల ఇనుపబూట్లు చిగురుటాకులాంటి వేళ్లను ఎలా చిదిమేస్తాయో ఆయన చెప్పిన కథ గుర్తుకొచ్చి. రాత్రి పోలీసులొచ్చి ఆయనను పట్టుకెళ్ళి ఒక నక్సలైటు కూతురిని పెంచడానికి నీకెంత ధైర్యం అంటూ రోకలి బండ కాళ్ళసందుల్లో దూర్చి, ఎలా చిత్రహింసలు పెట్టారో చెపుతుంటే విని వెక్కి వెక్కి ఏడ్చాను. ఆ రాత్రే నా కథని పూర్తి చేసాడాయన. నన్ను కన్న తల్లిదండ్రులు నక్సలైట్లని, నాన్న పైలా వాసుదేవరావు ఎవరికీ కనిపించడని, అమ్మ చంద్రమ్మని జీవితాంతం జైల్లోనే ఉంచారని, వాళ్ళంతా తినటానికి తిండికూడాలేని పేదజనం కోసం తుపాకులు పట్టుకొని పోరాడుతున్నారని, నన్నీ ఇంటికి చేర్చిన ఆయన పెద్దన్నయ్య అత్తలూరి మల్లికార్జునరావు చిలకలూరి పేట పోలీస్ స్టేషన్పై దాడి లో చనిపోయాడని, ఆయన గుర్తుగా నిన్ను గుండెల్లో పెట్టుకుని దాచుకుంటున్నామని చెప్పాడు. గుంటూరు జిల్లా చింతలపూడిలో పోలీసుల దాడులనుంచి కాపాడుకునేందుకు ఓ గొడ్ల చావిట్లో తలదాచుకుంది ఈ కుటుంబం. 11 మంది సంతానంలో కటిక దారిద్య్రం మధ్య అనుకోని విధంగా ఆ యింట్లో చేరాను నేను. నన్ను బతికించుకోవడమే వారికోసవాల్గా మారింది. ఆకలితో గుక్కపెట్టి ఏడుస్తున్న నాకు పక్కింటోళ్ళిచ్చిన మజ్జిగన్నంతోనే కడుపినింపాడు. ఓ అర్థరాత్రి చుట్టుపక్కలెవ్వరికీ తెలియకుండా కుట్టుమిషన్ని పట్టుకుని ఆదిలాబాద్ జిల్లా రామకృష్ణాపురంకి వలసవెళ్ళింది మా కుటుంబం. నన్ను మొదటి సారిగా, చివరిసారిగా అడిగింది ఒక్కటే తన ఇంటిపేరుని నా పేరుచివరనుంచి తొలగించొద్దని. అందుకే నా ఇంటిపేరు పైల అయినా నా పేరు చివర అత్తలూరి అనే పెట్టుకుంటాను. అవును... నేను అత్తలూరి శేషయ్య కూతుర్ని. కనక పోయినా నన్ను పెంచిన... నేను నాన్న అని పిలిచిన ఆయనే మా నాన్న. - అత్తలూరి అరుణ నాన్న కళ్లలో నీళ్లు! మా ఇంట్లో అది తొలి పెళ్లి. నా పెళ్లి. నన్ను పట్టుచీర, పూలజడతో అలంకరించారు. నాకెంతో ఉత్సాహంగా ఉంది. నేను పుట్టిపెరిగిన అమ్మమ్మ ఇల్లే నా అత్తవారిల్లు కావడాన ఎప్పుడెప్పుడు వెళ్లాలా అని ఉరకలు వేస్తోంది మనసు. ‘ఇంక బయలుదేరాలి. రాహుకాలం వచ్చేలోపు చేరాలి కదా’ అని ఎవరో అన్నారు. నేను మా వారితోపాటు ఇంట్లో నుంచి బయటకొచ్చాను. వరండాలోకి రాగానే పందిట్లోనే ఉన్న నాన్న కుర్చీలో నుంచి లేచి నిలుచున్నాడు. ఎప్పుడూ తెల్ల బట్టలతో మెరిసిపోయే నాన్న ఆ రోజు కూడా తెల్లబట్టలే వేసుకున్నారు. కానీ ఆయన ముఖమే వివర్ణమై, చిన్నదిగా మారిపోయింది. ఆయన చెప్పింది చేయడమే కానీ ఆయన ముఖంలోకి చూసి మాట్లాడాలన్నా నాకు భయమే. అలాంటిది ఎందుకలా ఉన్నాడో అని అడిగే ధైర్యం లేదు. నా పక్కనే ఉన్న మా అమ్మ, పెద్దమ్మ... ‘ఊరికెళ్లొస్తానని నాన్నతో చెప్పు’ అన్నారు. అలాగేనని తలూపి నాన్న ముఖంలోకి చూస్తూ ‘వెళ్లొస్తా’నన్నట్లు తలూపాను. ఆయనా అలాగేనన్నట్లు తలూపారు. వెంటనే టవల్ అంచుతో కన్నీటిని అద్దుకున్నారు. ‘నాన్న కూడా ఏడుస్తాడా’ ఆశ్చర్యం వేసింది. మా నాన్న కళ్లలో కన్నీటిని చూడడం అదే మొదటిసారి. ఆయన జీవితంలో పంటలు వరదలో కొట్టుకుపోవడం, వ్యాపారంలో రావాల్సిన డబ్బు చేజారిపోవడం, బంధువులు దూరం కావడం, స్నేహితులు అనుకున్న వాళ్లు ముఖం చాటేయడం వంటివెన్నో జరిగాయి. కానీ అప్పుడెప్పుడూ ఆయన కళ్లు చెమర్చలేదు. అలాంటిది కూతురికి పెళ్లి చేసినప్పుడు ఒకవైపు పొంగిపోతూనే మరోవైపు కూతుర్ని ఇంటి నుంచి పంపించడానికి నలిగిపోవడం ఆయన వల్ల కాలేకపోయింది. ఒక్కసారికే అలా తల్లిడిల్లిపోయిన ఆయన గుండె మా చెల్లికి పెళ్లి చేసినప్పుడు మరోసారి అంతే ఆటుపోట్లకు లోనయింది. ఆ గుండె అనేక గాయాల్ని తట్టుకోగలిగింది. కానీ అనుబంధాల కోతకు మాత్రం తల్లడిల్లి పోయింది. ఇది జరిగి పాతికేళ్లయింది. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మా నాన్న మా అమ్మతో ‘మా ఇంటి ఆడపడుచులు అత్తగారిళ్లలో కీలకమవుతారు అని నా ముగ్గురు అక్కలు నిరూపించారు. నా కూతుళ్లూ అదే వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు’ అని చెప్పుకుని మురిసిపోతుంటారు. - మను అది నాన్న మనసు పెళ్లయ్యాక తొలిసారి అమ్మా వాళ్లింటికి వెళ్లాను. మా బాంబే ట్రిప్ గురించి అడిగారు అమ్మానాన్న. ముభావంగానే చెప్పాను. నా ముభావాన్ని అమ్మ గమనించలేదు కాని నాన్న కనిపెట్టారు. మా ఇంట్లో తూగుటుయ్యాల ఉండేది. రాత్రి భోజనలయ్యాక దాని మీద కాసేపు సేదతీరడం నాన్నకు ఆలవాటు. ఎప్పటిలాగే ఆ రోజూ రాత్రి భోజనలయ్యాక ఉయ్యాల మీద కూర్చుని ‘ఏమైంది బెటా... మీ ఆయన ఏమన్నా అన్నాడా?’ అని అడిగారు. ఏం లేదు అని చెప్పానే కానీ దుఃఖమాగక ఏడ్చేశాను. ‘మీరంతా మంచివాడు, మర్యాదస్తుడు అంటేనే కదా అతన్ని చేసుకున్నాను’ అన్నాను. ఆప్యాయంగా నా వెన్ను నిమురుతూ ‘విషయం ఏంటి బేటా...?’ అని అడిగేసరికి మా బాంబే ట్రిప్లో జరిగింది చెప్పేశాను. ‘అక్కడ నేను ఎత్తుమడమల చెప్పుల జత ఒకటి చూశాను. మొదటిసారి నోరు తెరిచి కొనివ్వమని అడిగాను. నువ్వేమన్నా సినిమా యాక్టర్వా అలాంటి చెప్పులు వేసుకోవడానికి? అంటూ వెటకారమాడాడు. ఆ చెప్పుల రూపం నా మనసులో నాటుకుపోయింది. అవి ఎంత బాగున్నాయో’ అంటూ ఆత్రంతో ఓ కాగితం తీసుకొని వాటి బొమ్మ కూడా వేశాను. రంగునూ వర్ణించాను. అంతా విని నాన్న నవ్వారు. ‘ఇక్కడ నువ్వు కూతురువి. ఇది నీ రాజ్యం. అక్కడ భార్యవు. అది ఆయన రాజ్యం. సర్దుకుపోవాలి’ అంటూ నచ్చజెప్పారు. కాని ఆ రాత్రి ఆయన నిద్రపోలేదు. తెల్లవారి పదింటికి నేను గీసిచ్చిన చెప్పుల బొమ్మ కాగితం పట్టుకొని ఇంటి నుంచి బయటపడ్డారు. ఊర్లోని ప్రతి చెప్పుల షాపూ తిరిగారు. ఎక్కడా నేను కోరుకున్న చెప్పులు దొరకలేదు. ఆ సాయంత్రమే బాంబే రైలు ఎక్కి మూడో రోజు తెల్లవారు జామున ఆరున్నరకు వచ్చారు. నేనింకా నిద్రలేవనే లేదు. నా మంచం దగ్గరకు వచ్చి ‘బేటా..’ అంటూ ఆత్మీయంగా పిలిచాడు. దిగ్గున లేచి కూర్చున్నాను. కళ్లు తెరిచి చూద్దును కదా.. నేను మనసు పడ్డ ఎత్తమడమల చెప్పులు! పట్టలేని సంతోషం. అది నా కళ్లల్లో చూసుకొని తృప్తిగా అక్కడి నుంచి వెళ్లాడు. చెప్పులు అరుగుతాయి.. కాని తండ్రి ప్రేమ అరిగేది కరిగేది కాదు కదా... ఆ ప్రేమకు రూపమైన ఆ ఎత్తుమడమలను అరగనీయకుండా దాచుకున్నాను! - లక్ష్మీశాస్త్రి అలా వెళ్లిన నాన్న మళ్లీ రాలేదు... మా నాన్న జగమెరిగిన మాస్టారు. కుంచనపల్లి, నంబూరు, వేజండ్ల, వడ్డేశ్వరం, కొలనుకొండ గ్రామాలలో ట్యుటోరియల్ సెంటర్లు నిర్వహించారు. ఎంతోమందికి చదువు చెప్పారు. తన దగ్గర చదువుకున్న విద్యార్థుల చేత ప్రైవేట్ క్యాండిడేట్లుగా పరీక్షలు రాయించేవారు. అందుకోసం పరీక్షాకేంద్రానికి దగ్గరలో ఒక ఇల్లు తీసుకుని, దాదాపు నెలరోజుల పాటు అక్కడే ఉండి, వాళ్లకు పాఠాలు చెప్పి శ్రద్ధగా పరీక్షలు రాయించేవారు. మేము పరీక్షలు రాసేటప్పుడు కూడా నాన్న మమ్మల్ని దగ్గరుండి పరీక్ష హాలుకి తీసుకెళ్లేవారు. తిరిగి మేము పరీక్ష రాసి హాలు బయటికి రాగానే చిరునవ్వుతో ఎదురొచ్చేవారు. చిన్నప్పుడు నాన్నను చూస్తే చచ్చేంత భయం. అల్లరి చేసేటప్పుడు గట్టిగా ఒక్క కేక వేశారంటే చాలు. చెడ్డీ తడిసిపోయేది. అలాగని కోపిష్టి ఏమీ కాదు. ఆయన్ని చూస్తే మాకు భయంతో కూడిన భక్తి అంతే! మేమంటే ఆయనకు చాలా ప్రేమ. ఎక్కడికైనా వెళ్లినప్పుడు మాకోసం పండ్లు, స్వీట్లు, ఇంకా ఏవైనా చిరుతిళ్లు తెచ్చేవారు. అప్పటికి మేము నిద్రపోతుంటే లేపి, నోట్లో పెట్టేవారు. మేము నిద్రలోనే నాన్న తినిపించిన వాటిని తినేవాళ్లం. మర్నాడు మళ్లీ మాకోసం ఏమి తెచ్చావు నాన్నా అని అడిగితే, పండ్ల తొక్కలు చూపించేవారు నవ్వుతూ. మిన్ను విరిగి మీద పడుతోందన్నా చలించేవాడు కాదు నాన్న. నిబ్బరంగా ఉండేవారు. మా అక్క పెళ్లి కొద్దిరోజుల్లోకి వచ్చింది. చేతిలో పైసా లేదు. అయినా ఆయన పట్టించుకునేవాడు కాదు. ఊళ్లో ఆయన అంటే అభిమానమున్న వాళ్లు కొందరు ‘పంతులుగారూ, అమ్మాయిగారి పెళ్లంట కదా, ఇది ఉంచండి’ అంటూ తలా కాస్త చేబదులుగా ఇచ్చారు. ఒకరి కింద ఉద్యోగం చెయ్యడం ఇష్టం లేకనే, ట్యుటోరియల్సు, కాన్వెంటూ పెట్టుకుని సంసారాన్ని ఎలాగో నెట్టుకొచ్చాడు. చివరి రోజుల్లో అందరూ చెబుతుండడంతో అయిష్టంగానే విజయవాడలోని ఒక ప్రైవేటు స్కూల్లో టీచర్గా ఉద్యోగం చేశాడు. మా ఊరినుంచి రోజూ ఓ సెకండ్ హ్యాండ్ టీవీఎస్ ఫిఫ్టీ మీద స్కూలుకు వెళ్లి వచ్చేవారు. ఓ రోజు పొద్దున్నే అలా స్కూలుకని ఇంటినుంచి బయలుదేరి వెళ్లిన మా నాన్న మళ్లీ రాలేదు. లారీ ఢీకొట్టడంతో ఆయన శరీరం మాత్రమే ఇంటికి వచ్చింది. దాంతో ఇప్పటికీ నాకు ద్విచక్రవాహనమంటే అలర్జీ. ఎన్ని ఇబ్బందులున్నా సరే, బస్సు తప్ప, బండి ఎక్కను. ఒకవేళ ఎక్కాలన్నా, నాన్న పోయిన రోజున మా అమ్మ ఏడుపులే గుర్తొస్తాయి. - బాచి -
చైనాలో ‘చావు’ ట్రెండ్
బీజింగ్: చైనాలో ఇటీవల ‘చావు’ ట్రెండ్ మొదలైంది. చనిపోయిన తర్వాత మనిషి ఎలా ఫీలవుతాడు? ఆ అనుభూతి ఎలా ఉంటుంది? ప్రత్యక్షంగా అనుభవించాలనుకోవడమే ఆ ట్రెండ్. అందుకోసం వారు కఫిన్లో దూరి కళ్లు మూసుకుంటున్నారు. చచ్చినట్లు శవంలా పడుకుంటున్నారు. ఎవరు ఎక్కువసేపు చచ్చిన శవంలా పడి ఉండే అదో మరచిపోలేని అనుభూతి. అదో సంతృప్తి. ఇటీవల ప్రజల్లో బాగా పెరిగిన ఈ ట్రెండ్ను క్యాష్ చేసుకునేందుకు ‘డెత్’ పార్లర్లు దేశవ్యాప్తంగా పుట్టుకొచ్చాయి. కొన్ని పార్లర్లయితే ఏకంగా అచ్చం శవానికి జరిగినట్లుగానే నకిలీ అంత్యక్రియలు కూడా జరపుతున్నాయి. శాంఘైలో ‘ది సమాధి’ అంటూ ఓ థీమ్ పార్క్ను కూడా ఏర్పాటు చేశారు. అక్కడ నిజంగా చావు అనుభూతిని తెలుసుకునేందుకు 4డెమైన్షన్ స్టిమ్యులేటివ్ సిస్టమ్ను కూడా ఏర్పాటు చేశారు. ఈ చావు ట్రెండ్కు మరింత ప్రచారం కల్పించేందుకు ప్రత్యేక ప్రదర్శనలు కూడా నిర్వహిస్తున్నారు. గత శుక్రవారం టియాంజిన్ సిటీలో ‘ఎక్స్పీరియెన్సింగ్ డెత్’ పేరిట చావును చూపించారు. విద్యార్థులు సహా అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. వారు కఫిన్లో మౌనంగా వీలైనంత సేపు గడిపి అనంతరం బయటకు వచ్చాక తమ అనుభూతిని ఇతరులతో పంచుకున్నారు. అలా చచ్చిన శవంలా పడుకోవడం వల్ల తమ బాధలన్నింటినీ మరచిపోయామని, బయటకు వచ్చాక మనుసు తేలికపడ్డట్టుగా, ఎంతో ప్రశాంతంగా అనిపించిందని కూడా వారు చెప్పడం విశేషం. చైనాలోని చాంగింగ్ నగరంలో కూడా మార్చి 27వ తేదీన ఇలాంటి ఈవెంట్నే నిర్వహించారు. అక్కడ కాఫిన్లకు ‘డ్రంక్ డ్రైవర్’ అని ‘డ్రంకెన్ స్టూపర్’ లేబుళ్లు కూడా తగిలించారు. దక్షిణ కొరియాలో కూడా ఈ ట్రెండ్ ఉంది. అక్కడ పదంటే పది నిమిషాలు కఫిన్లో పడుకొని చూట్టూ ఉన్న చీకటిని, ప్రశాంతతను అనుభూతి చెందుతారు. -
ప్రచారంలో టీఆర్ఎస్కు చేదు అనుభవం
-
అనుభవం అయ్యేనా పాఠం?
బైలైన్ పార్లమెంటులో అధికార ప్రతిపక్షాల పాత్రలు ఆసక్తికరంగా తారుమారు కావడమే గత ఏడాదిలో చాలా కాలాన్ని మింగేసింది. ఆగ్రహంతో ఒళ్లు మరచి ఊగిపోయే పరిస్థితులు ఏర్పడటమంటే పార్లమెంటరీ వ్యవస్థ ఆరోగ్యానికి కీడు జరుగుతున్నదని సంకేతం. స్వల్పకాలిక సమావేశాలను నిర్వహించడంలో ప్రభుత్వానికేమైనా స్వార్థ ప్రయోజనాలు ఉండవచ్చునని ఊహించడం తర్కబద్ధమైనదే. పెద్దగా చర్చలేకుండానే చట్టాలు చేసేయడం దానికి ఆదర్శప్రాయం కావచ్చు. ప్రభుత్వాలంటే సువ్యవస్థితమైన పాలనా యంత్రాంగాలు కాబట్టి, అవి కనీస పరిశీలనకు గురవుతూ, గరిష్ట వెసులుబాటును కోరుకుంటాయి. అందుకు బదులుగా ప్రభుత్వంపై ప్రజాభిప్రాయమనే ఒత్తిడిని తెచ్చే వేదికగా పార్లమెంటు అందించే పలు అవకాశాలను ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీయే స్వయంగా కాలరాచివేయాలనే కృత నిశ్చయంతో ప్రవర్తించింది. హేళనగా కూతలు పెట్టడం, గావుకేకలు వేసి అడ్డగించడం ద్వారా కాంగ్రెస్ పదే పదే ప్రశ్నోత్తరాల సమయాన్ని హతం చేసింది. బోర్డింగ్ స్కూల్లో ఇలాంటి ప్రవర్తనకు టర్మ్ ముగిసేసరికి తీవ్రమైన మందలింపులు తప్పవు. కొన్ని బిల్లుల ఆమోదానికి కాంగ్రెస్ సహకరించిన మాట నిజమే. అయితే అవి కూడా చాలా వరకు ప్రతికూల ప్రజాభి ప్రాయమంటే భయంతో పెద్దగా చర్చ లేకుండా ఆమోదించినవే. అయితే కాంగ్రెస్ ఏకాకి కావడం గమనించదగ్గ వాస్తవం. మిగతా ప్రతిపక్ష పార్టీలన్నీ అలాంటి ఎత్తుగడలకు దూరంగా ఉన్నాయి. ఇదేమైనా కాంగ్రె స్ ప్రవర్తనలో ముందు ముందు పెద్దగా తేడాను కలుగజేస్తుందా? నిర్హేతు కమైన వ్యూహం ఏ మలుపు తీసుకుంటుందో ముందుగా చెప్పడం కష్టం. ఈ ఏడాది మాటగా చెప్పుకోవాల్సిన సూక్తి ఒక పెద్ద విషయంగానే విస్తరింపజేయగలిగినది. అయితే మొన్ననే సెలవు పలికి నిష్ర్కమించిన ఏడాది అనుభవంపై ఆధారపడి ఆ సూక్తి ఉత్పన్నార్థాన్ని నిర్మించాల్సి ఉంటుంది. ఫ్రెంచ్ తత్వవేత్త వోల్టేర్ దేవుని పట్ల పెద్దగా విధేయత గలవాడుగా సుప్రసిద్ధుడు కాడు. అయినా ఆయన ఆకాశం వైపు తలెత్తి చూసినప్పుడల్లా భగవంతుడా! అంటూ అత్యంత అర్థస్ఫోరకమైన ఓ మంచి మాట చెప్పేవాడు. ఓసారి ఆయన ‘‘ఓ ప్రభువా, నా శత్రువులను పరిహాసాస్పదులను చేయుము’’ అన్నాడు. ఉత్సాహంగా పలు భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యే ప్రజా జీవితంలో ఎవరైనాగానీ అంతకంటే ఎక్కువగా కోరగలిగేది ఏముంది? కాలక్రమానుగుణంగా పుట్టుకొచ్చే ఆందోళనలు కూడా కొన్ని ఇతర చర్చల్లాగే తయారు చేయాల్సినవి. అయితే అవి భోజనానికి అనుబంధంగా ఉండాల్సిన రుచికరమైన పదార్థాలేగానీ, ఆవశ్యకం కానివి. కానీ పసందైన భోజనానికి అవి అనుబంధంగా ఉండాల్సిందే. లిటరరీ క్రిస్మస్ క్రాకర్ (క్రిస్మస్ సందర్భంగా పత్రికలు ఒకప్పుడు ప్రచురిస్తుండే సాహిత్య అనుబంధంలోని చమత్కారాల శీర్షిక) ఏమైపోయింది? లిటరరీ అనే ముందు మాటను బట్టే ఇదేదో టపాకాయలా ఇలా పేలి, అలా చచ్చిపోయేది కాదని తెలుస్తోంది. చమత్కారపూరితమైన ప్రశ్న, అనూహ్యమైన సమాధానం రూపంలో దాగిన మేధోపరమైన సృజనాత్మక పదప్రయోగ చమత్కారం అది. ఆ సమాధానం అర్థం స్ఫురింపజేసేదానికంటే ఒకింత ఎక్కువ అర్థాన్నే అది కలిగి ఉంటుందనేది స్పష్టమే. విసుగుదనం లేదా అంతకంటే అధ్వానమైనదైన నైతికత నుంచి సమాచారాన్ని కాపాడి, బోధించడమేగాక ఉల్లాసపరుస్తుంది. కళలు, పుస్తకాలకు వార్తా పత్రికలు ఎక్కువ స్థలాన్ని కేటాయించి, వాటిని సంకలనపరిస్తే అవే తదుపరి ఏడాదికి పాఠకులకు నూతన సంవత్సర కానుకలవుతాయి. బ్రిటన్ వార్తా పత్రికలు ఇంకా ఆ అద్భుత వినోదానికి శ్రద్ధను, సమయాన్ని కేటాయిస్తున్నాయి. మన దేశం నుంచి అది నిష్ర్కమించడం చింతించాల్సిన విషయం. సీమట పాకాయ పెరిగి పెద్దదై క్విజ్గా మారిందని, అన్ని కాలాలూ అందుబాటులో ఉంటోందని ఆశావాదులు వాదించొచ్చు. అయినా గతంలో ఉండే మంచి ఉండనే ఉంది. అందుకు నేనో ఉదాహరణ చెబుతాను. లీనింగ్ టవర్ ఆఫ్ పీసాను (ఇటలీలోని ఒరిగి ఉండే సుప్రసిద్ధ కట్టడం) నిటారుగా నిలపాలని ఎవరు అనుకుంటారు? ముస్సోలినీ. మరింత విడమర్చి చెప్పాలంటే... ప్రజాస్వామ్యంలేని అధికారం వెర్రి. క్రిస్మస్ ఒక జననానికి సంబంధించినది. అది పరిరక్షకుని పుట్టుకకు సంబంధించిన పండుగ. మనకంటే దురదృష్టవంతులైనవారిపట్ల దయ, దాతృత్వం చూపడమే క్రైస్తవ మత లక్ష్యం. ప్రిసిల్లా చాన్, ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్బర్గ్లే 2015 క్రైస్తవులు. వారు తమ తొలి సంతానం పుట్టుక సందర్భాన తమ అపార సంపదలో 99 శాతాన్ని చాన్ జుకెర్బర్గ్ ఇనిషియేటివ్కు ఇచ్చేస్తామని వాగ్దానం చేశారు. అది నమ్మశక్యం కానంతటి మొత్తం. దాదాపు 45 బిలియన్ల (4,500 కోట్లు) డాలర్లు. ఉన్నదున్నట్టుగా చెబుతున్నా, నాకైతే బిలియన్ డాలర్లంటే ఎంతో తెలీదు. 45 బిలియన్లంటే ఓ చిన్న దేశం వార్షిక రాబడంత కావచ్చు. ప్రిసిల్లా, మార్క్లు జీవితంలో వచ్చే జన్మ కోసం బీమా పాలసీలను తీసుకోవాలని ఆరాటపడాల్సిన దశలో లేరు. ఇంకా యవ్వనంలోనే ఉన్నారు. అమెరికాలోని కొత్తా, పాతా బిలియనీర్లలో వారు ఒంటరివారు కారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కూడా 44 బిలియన్ డాలర్ల ట్రస్టు ఆర్థిక సహాయంతో నడిచే గేట్స్ ఫౌండేషన్ను ఏర్పాటు చేశారు. ఆ సంస్థ ఇతర దేశాలతోపాటూ మన దేశంలో కూడా అద్భుతమైన కృషి చేస్తోంది. భారతదేశంలో అలాంటి బిలియనీర్లు కనబడేదెన్నడు? ఈ ఏడాది అత్యుత్తమ కొటేషన్ ఖ్యాతి మాత్రం మరుపున పడిపోయిన హాలీవుడ్ స్టార్ బర్డ్ రేనాల్డ్స్ ఆత్మకథకే దక్కుతుంది. ఇటీవలే ప్రచురితమైన అందులో ఆయన, అలనాటి గ్లామరస్ నటి జోన్ క్రాఫోడ్ మరణాన్ని గుర్తు తెచ్చుకున్నారు. ఆ రోజు సాయంత్రం జరిగిన ఒక పార్టీకి, క్రాఫోడ్ బద్ధ శత్రువైన మరో నటి బెట్టీ డెవిస్ కూడా హాజరైంది. విలేకర్లతో మాట్లాడుతూ ఆమె ఇలా అంది... ‘‘చనిపోయిన వారి గురించి మంచే తప్ప, చెడు మాట్లాడకూడదు, జోన్ క్రాఫోడ్ చనిపోయింది. మంచిది! ’’ - ఎం.జె. అక్బర్ సీనియర్ సంపాదకులు వ్యాసకర్త బీజేపీ అధికార ప్రతినిధి -
మళ్లీ తెరపైకి చిరంజీవి - శ్రీదేవి!
హైదరాబాద్: అబ్బనీ తియ్యనీ దెబ్బ.. అంటూ కుర్రకారు గుండెల్లో హుషారెత్తించిన ఆ దృశ్యకావ్యం మళ్లీ వెండితెరపై ప్రత్యక్షం కాబోతోంది. 26 ఏళ్ల క్రితం క్రేజీ కాంబినేషన్తో వెండితెరపై సంచలనం సృష్టించిన సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి. ఇప్పుడు ఈ చిత్రం మరోసారి వెండితెరపై మెరవనుంది. హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహిస్తున్న హైదరాబాద్ స్కై ఫెస్ట్ 2015లో అభిమానుల విజ్ఞప్తి మేరకు ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నట్టు దర్శకుడు కె. రాఘవేంద్రరావు స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి, స్టన్నింగ్ బ్యూటీ శ్రీదేవి జంటగా నటించిన సోషియో ఫాంటసీ చిత్రం 'జగదేకవీరుడు అతిలోక సుందరి' చిత్రాన్ని మళ్లీ అభిమానుల ముందుకు తేనున్నట్టు తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అయితే ఈ ప్రదర్శనను కేన్సర్ బాధితుల సహాయార్థం నిర్వహిస్తున్నామని తెలిపారు. డిసెంబర్ 27న 'శ్రీమంతుడు' సినిమాను ప్రదర్శించనున్నట్టు కూడా ట్విట్టర్లో షేర్ చేశారు. తద్వారా వచ్చిన నిధులను కేన్సర్ బాధితులకు అందించనున్నామన్నారు. అభిమానులు, ప్రేక్షకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తమకు సహకరించాలని కోరారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, అశ్వనీదత్, చిరంజీవి, శ్రీదేవిల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా చిరంజీవి కెరీర్లోనే కాకుండా తెలుగు సినిమా చరిత్రలోనే మెగాహిట్గా నిలిచింది. చిరంజీవి, శ్రీదేవిల మధ్య కెమిస్ట్రీ, ఇళయారాజా సంగీతం, అమ్రేష్ పూరి విలక్షణ డైలాగ్ డెలివరీ సినిమా విజయానికి పెద్ద ఎసెట్గా నిలిచాయి. మొత్తంగా ఈ చిత్రం ఓ సుందర దృశ్యకావ్యంగా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. -
నా అనుభవంపైనే ఆధారపడతాను
► స్పిన్నర్ హర్భజన్ సింగ్ న్యూఢిల్లీ: 15 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ అనుభవం ఉన్న తను ఇప్పుడు కొత్తగా నిరూపించుకోవాల్సిందేమీ లేదని భారత ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఇదే అనుభవాన్ని ఉపయోగించి టీమిండియా మరోసారి టి20 ప్రపంచ చాంపియన్గా నిలిచేందుకు దోహదపడతానని, కొత్త ప్రయోగాల జోలికి పోవాల్సిన అవసరం లేదన్నాడు. ఆసీస్ పర్యటన కోసం తను పొట్టి ఫార్మాట్కు ఎంపికైన విషయం తెలిసిందే. ‘క్యారమ్ బాల్లాంటి వాటితో నేను ఇప్పుడు కొత్తగా ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు. నా బలమైన ఆఫ్ స్పిన్, దూస్రాలతోనే రెచ్చిపోతాను. వీటి ఆధారంగానే గత 15 ఏళ్లలో సత్తా చాటి 700కు పైగా అంతర్జాతీయ వికెట్లు తీశాను. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్లో మెరుగ్గానే ఆడాను. అయితే ఇప్పుడు నా దృష్టంతా టి20పైనే ఉంది. ఈ ఫార్మాట్తో పాటు వన్డే ప్రపంచకప్ కూడా నా ఖాతాలో ఉన్నాయి. మరోసారి నెగ్గి హ్యాట్రిక్ టైటిల్స్లో నా పాత్ర ఉంటే సంతోషిస్తా’ అని భజ్జీ తెలిపాడు. అలాగే తన సన్నిహితుడు ఆశిష్ నెహ్రా నాలుగున్నరేళ్ల అనంతరం జట్టులోకి రావడం ఆనందంగా ఉందని అన్నాడు. 2003, 11 ప్రపంచకప్ల్లో అతడిది కీలక పాత్ర అని చెప్పాడు. పాక్తో మొహాలీలో జరిగిన ప్రపంచకప్ సెమీస్లో డెత్ ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ చేసినా జట్టులో చోటు కోల్పోయాడన్నాడు. ఎవరికైనా ప్రదర్శనే ముఖ్యమని, వయస్సు కాదని 35 ఏళ్ల హర్భజన్ స్పష్టం చేశాడు. -
అబద్ధం... నిజమైంది!
అనుభవం నేనొక నటుడ్ని. ప్రకాశం జిల్లా రావులపాలెంలో నాటక ప్రదర్శన ముగించుకొని, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలేనికి వచ్చేశాం. మా ‘అహంబ్రహ్మ’ నాటక ప్రదర్శన సాయంత్రం ఆరు గంటలకి కదా అని, నేను, మా సాంకేతిక నిపుణుడు ‘సింహా’ సినిమాకి రహస్యంగా వెళ్లాం. సినిమా సగం నడిచింది. ఇంటర్వెల్లో ఫోన్ చూస్తే పందొమ్మిది మిస్డ్కాల్స్. భయపడుతూనే ఫోన్ చేశా. మా సహనటుడు ‘‘రా. ఎక్కడున్నా?’’వని గట్టిగా అడిగాడు. అంతే! ఒక్క ఉదుటున రిహార్సల్స్లో ప్రత్యక్షమయ్యా. మా దర్శకులు ఎక్కడికెళ్లావని ప్రశ్నిస్తే, పర్సు పోయిందని, వెతకడంలో ఆలస్యమయిందని అబద్ధం చెప్పేశా. రిహార్సల్స్, నాటక ప్రదర్శన పూర్తయింది. పాలకొల్లుకి బయల్దేరాం. ట్రైన్లో శనగలు అమ్ముతున్న ముసలావిడ కొనమని బతిమాలింది. జేబులోకి చెయ్యి దూర్చా. అంతే! పర్సు లేదు. పర్సు పోయిందని మధ్యాహ్నమే చెప్పాను కదా, నిజంగా పోయినా నోరు మెదపలేకపోతున్నాను. నన్ను నేనే తిట్టుకొని బాధపడ్డాను. నిజాన్ని దాచటం ఎంత కష్టమో అబద్ధాన్ని చెప్పడం అంతే నేరమని అప్పుడే తెలిసింది. ఇప్పటికీ ఆ సంఘటన గుర్తుకొస్తే, నామీద అసహ్యం కలుగుతుంది. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత తిరుపతికి మహతీ ఆడిటోరియంలో నాటక ప్రదర్శన కోసం వెళ్లాం. ఒక అమ్మాయి నుంచి ఫోన్. ‘‘మాది బుచ్చిరెడ్డిపాలెం. నా పేరు మంజులాదేవి. నేను షాపింగ్కెళ్లి వస్తుంటే దార్లో మీ పర్సు కనబడింది. అందులోని మీ నంబరు చూసి ఫోన్ చేశా. ఇందులో మీ ఐడెంటిటీ కార్డు, మూడు వేలు, ఇతర ప్రూఫ్స్ ఉన్నాయి’’ అని చెప్పింది. బ్యాంకు అకౌంటు నంబరు చెప్తే డిపాజిట్ చేస్తానంది. నా డబ్బులు నాకు అందాయి. అందుకు కృతజ్ఞతలు తెలిపాను. కాని ఆమె మంచితనమే నన్ను మార్చివేసింది. - బొడ్డుపల్లి హరికృష్ణ -
నూతన ఆవిష్కరణలకు అనుభవంతో పనిలేదు
‘తల నెరిస్తేనే’ సిండ్రోమ్ నుంచి భారతీయులు బైటపడాలి లేకపోతే అవకాశాలను అందిపుచ్చు కోలేరుటాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా ముంబై: అనుభవంతో తల నెరిస్తేనే నవకల్పనలను సాధించగలమన్న అపోహ నుంచి భారతీయులు బైటికి రావాలని పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా చెప్పారు. ఇలాంటి భ్రమల వల్ల అవకాశాలను అందిపుచ్చుకోలేమని పేర్కొన్నారు. అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ ఎక్స్ప్రైజ్ భారత విభాగం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా టాటా ఈ విషయాలు చెప్పారు. నవకల్పనలను ఆవిష్కరించేందుకు భారతీయుల్లో అపారమైన శక్తి సామర్ధ్యాలు ఉన్నాయన్నారు. ‘జుట్టు నెరిస్తేనే (అనుభవంతో) ఏదైనా సాధ్యపడుతుందన్న భ్రమల్లో నుంచి దేశం బైటికి రావాలి. ఇలాంటి ఆలోచనా విధానం వల్ల అవకాశాలను అందుకోలేం’ అని టాటా పేర్కొన్నారు. భారతీయ ఇంజినీర్లు, ఆవిష్కర్తలు అంతర్జాతీయ సమస్యలకు పరిష్కారం కనుగొనగలరని.. కానీ భారత్లో ఉంటూ ఇలా చేయడానికి అవకాశాలు లభించలేదన్నారు. అద్భుతమైన ఐడియాలున్న యువతకు ఊత మిస్తున్న ఎక్స్ప్రైజ్ రాకతో ఈ పరిస్థితి మారగలదని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. అమెరికా అద్భుత ఫలితాలు సాధించిన వాటిల్లో భారతీయులూ తమ సత్తా నిరూపించుకునేలా అవకాశాలు కల్పించగలగాలని తాను కోరుకుంటున్నట్లు టాటా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నవకల్పనలకు సంబంధించి ఎక్స్ప్రైజ్ ఇండియా అనేది.. నోబెల్ బహుమతి స్థాయిలో పేరు తెచ్చుకోగలదని ఆయన చెప్పారు. -
మంచికి పోతే...
కనువిప్పు మంచికి పోతే చెడు ఎదురైంది... అనే మాటను చాలాసార్లు విన్నాను. అయితే అది నాకు కూడా అనుభవంలోకి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. ఫ్రెండ్స్ ఎవరైనా కష్టాల్లో ఉంటే నా వంతుగా సహాయపడడం నాకు అలవాటు. అయితే, ఒక్కోసారి హద్దు దాటేవాడిని. ‘‘కష్టాల్లో ఉన్నాను’’ అని ఎవరైనా అంటే చాలు వివరాలేమీ తెలుసుకోకుండా సహాయపడేవాడిని. నేను డిగ్రీలో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ నా దగ్గరకు వచ్చి- ‘‘నువ్వు చాలామందిని ఆదుకున్నావని అందరూ అంటుంటారు. నేను చాలా కష్టాల్లో ఉన్నాను. డబ్బు కావాలి. అప్పు కోసం వెళితే స్యూరిటీ కావాలి అంటున్నారు. ఎవరూ షూరిటీ ఇవ్వడం లేదు. నువ్వు షూరిటీ ఇస్తే నా కష్టాలను తీర్చినవాడివి అవుతావు. ప్లీజ్...’’ అని బతిమిలాడుకున్నాడు. ఆ మాటలకు నేను నిలువెల్లా కరిగిపోయాను. ‘‘దానిదేముంది. పద!’’ అని తొందర చేశాను కూడా. అప్పు తీసుకున్న రెండు వారాల తరువాత అతను కనిపించకుండా పోయాడు. నాకు భయం పట్టుకుంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తడం లేదు. ఒకరోజు అప్పు ఇచ్చిన వ్యక్తి... కాలేజీకి వచ్చి పెద్ద గొడవ చేశాడు. ‘‘వాడు పారిపోయాడు. నువ్వు స్యూరిటీ ఇచ్చావు కాబట్టి ఆ డబ్బు నువ్వు ఇవ్వాల్సిందే’’ అని డిమాండ్ చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించాడు. కాలేజీలో నాకు ‘రాముడు మంచి బాలుడు’ లాంటి ఇమేజి ఉంది. అలాంటి నన్ను ‘అప్పు’ దెబ్బతో కొందరు అపార్థం చేసుకున్నారు. ‘‘రెండు వారాల్లో నీ అప్పు వడ్డీతో సహా చెల్లిస్తాను’’ అని చెప్పాను. ఎప్పుడూ ఎవరినీ అప్పు అడగని నేను తెలిసిన వారి దగ్గరల్లా అప్పు చేసి ఆ అప్పు తీర్చాను. వెనకా ముందు చూడకుండా ఇంకెప్పుడూ... తొందరపడకూడదని ఈ సంఘటన నాకు పాఠం నేర్పింది! - ఆర్.శశికాంత్, భువనగిరి.