forest range officer
-
‘నెమలి కర్రీ’ వీడియోతో బుక్కయ్యాడు
తంగళ్లపల్లి (సిరిసిల్ల): ‘ట్రెడిషినల్ పికాక్ కర్రీ రెసిపీ’ అంటూ ఓ యూట్యూబర్ తన చానల్లో వీడియో పోస్టు చేసి అడ్డంగా బుక్కయ్యాడు. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన కోడం ప్రణయ్కుమార్ శ్రీటీవీ అనే యూట్యూబ్ చానల్లో నెమలి వంట చేయడం గురించి వీడియో పోస్టు చేశాడు. ఈ విషయంపై ‘యూట్యూబ్లో నెమలికూర వంటకం’ అనే శీర్షికతో ‘సాక్షి’లో ఆదివారం ప్రచురితమైన కథనానికి అటవీ అధికారులు స్పందించారు.తంగళ్లపల్లిలో వంట చేసిన స్థలాన్ని పరిశీలించి, ప్రణయ్కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఫారెస్ట్ రేంజ్ అధికారి కల్పనాదేవి మాట్లాడుతూ, వంటకాన్ని స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపనున్నట్లు తెలిపారు. ఇప్పటికే నెమలి పేరుతో వీడియో పెట్టినందుకు అటవీచట్టం ప్రకారం కేసు నమోదు చేశామని, పలు అటవీ జంతువులు, పక్షుల వంటకాల వీడియోలు కూడా పోస్టు చేసినట్లు గుర్తించామన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. తనిఖీలలో ఫారెస్టు సెక్షన్ అధికారి శ్రవణ్కుమార్, బీట్ ఆఫీసర్ ఎంఏ ఖలీమ్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఏపీ: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్
సాక్షి, విజయవాడ: ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం మరో గుడ్న్యూస్ అందించింది. నాలుగు ఉద్యోగ నోటిఫికేషన్లను ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేసింది. 37 ఫారెస్ట్ రేంజ్ అధికారి పోస్టులకు, అయిదు స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు, నాలుగు ఫిషరీస్ డెవలప్మెంట్ అధిరారి పోస్టులకు, మూడు ఎలక్ట్రికల్ ఎన్స్పెక్టర్ల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ వివరాలు ►37 ఫారెస్ట్ రేంజ్ అధికారి పోస్టులకు నోటిఫికేషన్...ఏప్రియల్ 15 నుంచి మే 5 వరకు ధరఖాస్తుల స్వీకరణ. ►అయిదు స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్...ఏప్రియల్ 18 నుంచి మే 8 వరకు ధరఖాస్తుల స్వీకరణ. ►నాలుగు ఫిషరీష్ డెవలప్మెంట్ అధికారి పోస్టులకు నోటిఫికేషన్.. ఏప్రియల్ 23 నుంచి మే 13 వరకు ధరఖాస్తులకు అవకాశం. ►మూడు ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్.. మార్చ్ 21 నుంచి ఏప్రియల్ 10 వరకు ధరఖాస్తుల స్వీకరణ. చదవండి: యువతరానికి దిక్సూచి ‘భవిత’ -
అటవీశాఖ ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం
మంచిర్యాలక్రైం: ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ వేధింపులు భరించలేక ఓ బీట్ ఆఫీసర్ ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన అటవీ శాఖలో చర్చనీయాంశంగా మారింది. బీట్ ఆఫీసర్ కథనం ప్రకారం... మంచిర్యాల జిల్లా కోటపల్లి అటవీ శాఖ రేంజ్ పరిధిలోని బీట్ ఆఫీసర్ లత ఇటీవల సెక్షన్ ఆఫీసర్ రాందాస్తో కలిసి వెంచవెల్లి బీట్లో ప్లాంటేషన్ నిర్వహించారు. ఇందుకుగాను సెక్షన్ ఆఫీసర్ రాందాస్ రూ.2 లక్షలు కూలీల వేతనాలు, ప్లాంటేషన్ నిర్వహణకు ఇచ్చారు. అయితే ఇవికాకుండా అదనంగా రూ.1.50 లక్షలను కూలీలకు చెల్లించాల్సి ఉందని, బిల్లు ఇవ్వాలని ఎఫ్ఆర్వో రవిని లత కోరగా అసభ్యకరంగా మాట్లాడుతూ మానసికంగా వేధిస్తున్నారు. దీంతో ఆమె శుక్రవారంరాత్రి మంచిర్యాలలోని తన ఇంట్లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన లత భర్త ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. డీఎఫ్వోకు ఒడిశా కూలీల ఫిర్యాదు ప్లాంటేషన్ పనులు చేసిన ఒడి శా కూలీలు కూలి డబ్బులు ఇవ్వాలని ఎఫ్ఆర్వోను కోరగా ‘కూలి లేదు, డబ్బులు లేవు, దిక్కున్నకాడ చెప్పుకోండి’అని బెదిరించారు. దీంతో వారంతా జిల్లా అటవీశాఖ అధికారి శివ్ ఆశీశ్ సింగ్కు ఫిర్యాదు చేయగా ఎఫ్ఆర్వోను మందలించారు. ఈ విషయా న్ని మనసులో పెట్టుకొన్న రవి శుక్రవారం తనను కా ర్యాలయానికి పిలిపించి దుర్భాషలాడారని లత ఆ రోపించారు. కాగా, వేధింపుల విషయమై ఎఫ్ఆర్వో రవిని సంప్రదించగా, తాను బీట్ ఆఫీసర్ లతను ఎలాంటి వేధింపులకు గురిచేయలేదని తెలిపారు. -
ఎఫ్ఆర్వో హత్య కేసులో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో అటవీఅధికారి (ఎఫ్ఆర్వో) చళ్లమళ్ల శ్రీనివాసరావు హత్య కేసులో తీసుకున్న చర్యలేంటో వివరించాలని సుప్రీం కోర్టు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టులో అడవుల పరిరక్షణకు సంబంధించిన ఓ పిటిషన్ జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విక్రమ్నాథ్ల ధర్మాసనం విచారణ చేసింది. ఈ కేసులో అమికస్ క్యూరీగా వ్యవహరిస్తున్న సీనియర్ న్యాయవాది ఏడీఎన్ రావు...భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హత్యకు గురైన ఎఫ్ఆర్వో చళ్లమళ్ల శ్రీనివాసరావు అంశాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. వార్తాపత్రికల ఆధారంగా పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, అడవుల పరిరక్షణ వ్యవహారంపై కోర్టు నియమించిన కేంద్ర సాధికారిత కమిటీ నుంచి నివేదికను తీసుకోవాలని సీనియర్ న్యాయవాది ఏడీఎన్ రావు ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. అమికస్క్యూరీ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. ఇదీ చదవండి: అటవీ ప్రాంతాన్ని ఖాళీ చేయాల్సిందే -
ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్ రావు హత్యపై కుటుంబసభ్యుల అనుమానాలు
-
పోడు సర్వేకు బ్రేక్.. విధులు బహిష్కరించిన అటవీ సిబ్బంది
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: పోడు సర్వేకు బ్రేక్ పడింది. ఎఫ్ఆర్ఓ చలమల శ్రీనివాసరావు హత్యను నిరసి స్తూ అటవీశాఖ ఉద్యోగులు విధులను బహిష్కరించడంతో గ్రామసభలు నిలిచిపోయాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శాఖ సిబ్బంది గురువారం నిరసన వ్యక్తం చేశారు. ఖమ్మంలో నల్లబ్యాడ్జీలు ధరించి ప్రదర్శన చేయడంతో పాటు డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్సింగ్కు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. అలాగే గాందీచౌక్లోని గాంధీ విగ్రహానికి కూడా వినతిపత్రం ఇచ్చారు. ఇక శుక్రవారం నుంచి డివిజన్, జిల్లా స్థాయిలో ఆందోళనలకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సిబ్బంది తెలిపారు. తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు రాష్ట్రవ్యాప్తంగా దశల వారీగా ఉద్యమం చేపట్టనున్నట్లు ఫారెస్ట్ రేంజర్స్ అసోసియేషన్, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. అడవుల్లో విధులు నిర్వహించే తమ కు ఆయుధాలు ఇవ్వాలని, ప్రత్యేకంగా ఫారెస్ట్ స్టేష న్లు కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సిబ్బందిని పెంచడంతో పాటు ఎనిమిది గంటల పనివిధానం అమలు చేయాలని నినదించారు. అలాగే ఆర్ఓఎఫ్ఆర్ యాక్ట్ను బహిర్గతం చేయాల న్నారు. ఇక ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు హత్యకు సంబంధించిన దర్యాప్తును పారదర్శకంగా చేయా లని డిమాండ్ చేశారు. నిందితులను తామే పట్టు కుని పోలీసులకు అప్పగించినట్లు ఉద్యోగులు తెలిపారు. దరఖాస్తులపై గందరగోళం.. పోడు దరఖాస్తులపై గందరగోళం నెలకొంది. దర ఖాస్తుల స్వీకరణ గడువు తేదీని బహిర్గతం చేయకపోవడంతో ఇంకా దరఖాస్తులు వస్తూనే ఉన్నాయని అటవీశాఖ యంత్రాంగం తెలిపింది. ప్రస్తుతం పోడు కొడుతూ దరఖాస్తులు చేసుకుంటున్నారని, దీనిపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పోడు సర్వే చివరి దశకు చేరిందని ప్రకటిస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అటవీశాఖ సిబ్బంది చెబుతున్న సమస్యలను అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఇంతలోనే ఎఫ్ఆర్ఓ హత్య జరగడంతో వారిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయి సిబ్బంది ఆందోళనలు పోడు సర్వేపై ప్రభావం చూపిస్తున్నాయి. పోడు సర్వేలో అటవీ సిబ్బంది కీలకం కాగా.. వీరు లేకుండా రెవెన్యూ, గ్రామ పంచాయతీ సిబ్బంది సర్వేకు వెళ్లే అవకాశాలు లేవు. ఇదీ చదవండి: Recession: ముందు నుయ్యి... వెనుక గొయ్యి -
ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే.. సంయమనం పాటించాలి
చండ్రుగొండ ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్ ఆదివాసీల చేతిలో మరణించడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఆయన మరణం బాధాకరమే. నిజానికి ప్రభుత్వం పోడు భూములపై ఆదివాసీలకు హక్కులు కల్పించడంలో చూపిస్తున్న సాచివేత ధోరణే ప్రజలకూ – ప్రభుత్వ అధికారులకు మధ్య యుద్ధం జరగడానికి కారణం అని చెప్పక తప్పదు. అసలు ఈ సంఘటనకు కారణమేమిటో తేల్చడానికి జిల్లా జడ్జితో విచారణ జరిపించాలని ఆదివాసీలు కోరుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులకు అక్రమంగా తప్పుడు పద్ధతులలో భూ పట్టాలను మంజూరు చేస్తున్నారు అధికారులు. అలాగే గిరిజనేతరులు ఏజెన్సీ చట్టాలను ఉల్లంఘిస్తుంటే అధికారులు వత్తాసు పలుకుతున్నారు. ఇదంతా తెలిసినా ప్రజా ప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన షెడ్యూల్డ్ ప్రాంతంలో కనిపించకుండానే శాంతియుతమైన వాతావరణం క్రమక్రమంగా కరిగి పోతోంది. అందుకు ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్పై దాడి ఒక మంచి ఉదాహరణ. అటవీ అధికారులు రాష్ట్రంలో ఆదివాసీ మహిళల మీద, చిన్నారుల మీద దాడులు చేసినప్పడు; పంటలకూ, ఆహార ధాన్యాలకూ, ఇళ్ళకూ నిప్పుపెట్టినప్పుడూ, మనుషుల మీద మూత్రం పోసినప్పుడూ, ఇటువంటి మరికొన్ని అమానవీయ ఘటనలకు పాల్పడినప్పుడూ ప్రభుత్వం స్పందించిన దాఖలాలు కనిపించవు. పోడు భూములపై హక్కుల కోసం ఆదివాసీ సంఘాలు ఆందోళనలు నిర్వ హించినప్పుడు... పోడు సాగుదారులకు పట్టాలిస్తామనీ, పోడు సమస్యను పరిష్కరిస్తామనీ ఒకపక్క చెబుతూనే... మరోపక్క సాగు చేసుకుంటున్న ఆదివాసీలపై ఫారెస్ట్ అధికారులను ఉసిగొలుపుతోంది ప్రభుత్వం. ఆ నిర్లక్ష్య ధోరణి వల్లే ఈరోజు అటవీ అధికారి శ్రీనివాస్ హత్య జరిగింది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే. 50 లక్షల ఎక్స్గ్రేషియా, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు ముఖ్యమ్రంతి. చనిపోయిన శ్రీనివాసరావును ముఖ్యమంత్రి తిరిగి తీసుకొస్తాడా? ఆయన పోడు భూముల సాగుపై స్పష్టమైన వైఖరినీ, చిత్తశుద్ధినీ వెల్లడించకుండా ప్రతిసారీ ఎన్నికలసమయంలో సబ్ కమిటీల (అటవీ హక్కుల కమిటీలు) నియామకం పేరుతో కాలం వెళ్ళదీస్తూ అసలు విషయాన్ని దాటవేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆదివాసీలను కేవలం ఓటు బ్యాంక్గా వాడుకుంటూ రాజకీయ పబ్బం గడుపుకొంటున్నారు. ఏదేమైనా... ఆదివాసీ ప్రజలూ సహనం, ఓపికతో చట్టానికి లోబడే పోరాటం కొనసాగించాలే తప్ప... ఇలా ప్రభుత్వ అధికారులపై దాడులు చేయడం తగదు. సంయమనం పాటించాలి. (క్లిక్ చేయండి: 28 ఏళ్ల కిందట ఆయుధాలు రద్దు.. అటవీ సంరక్షకులకు రక్షణ ఏదీ?!) – వూకె రామకృష్ణ దొర, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ -
28 ఏళ్ల కిందట ఆయుధాలు రద్దు.. అటవీ సంరక్షకులకు రక్షణ ఏదీ?!
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఇటీవల కుమ్రంభీం జిల్లా సార్సాల గ్రామంలో అటవీశాఖ అధికారిణి అనితపై ఓ ప్రజాప్రతినిధి సోదరుడి ఆధ్వర్యంలో దాడి. మహబూబాబాద్ జిల్లా గంగారాం మండలం మడగూడెంలో పోడు భూముల సాగును అడ్డుకున్న డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కర్ణానాయక్పై దాడి. నిన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలంలోని గుండాలపాడు సమీపంలో సెక్షన్ ఆఫీసర్ నీలమయ్య, బీట్ ఆఫీసర్ భాస్కరరావులపై కర్రలతో దాడి. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు పంచాయతీ ఎర్రబోరు అటవీప్రాంతంలో ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు దారుణ హత్య. తెలంగాణ రాష్ట్రంలో అడవుల సంరక్షణే ధ్యేయంగా విధులు నిర్వర్తిస్తున్న అటవీశాఖ అధికారులు, సిబ్బందిపై జరుగుతున్న వరుస దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావుపై పగ పెంచుకున్న గొత్తికోయలు మంగళవారం ఆయనపై దాడి చేసి హత్య చేసిన నేపథ్యంలో.. ‘అటవీ సిబ్బందికి ఆయుధాలు’ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. అడవుల సంరక్షణ కోసం విధులు నిర్వహించే అటవీశాఖ సిబ్బందికి మళ్లీ ఆయుధాలు ఇవ్వాలనే డిమాండ్ ఎప్పట్నుంచో ఉంది. తాజాగా శ్రీనివాసరావు హత్యతో చలించిన ఎఫ్ఆర్ఓల సంఘం నాయకులు ఆ యుధాలు ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లేదంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘అర్హులైన గిరిజనులకు పోడు పట్టాల పంపిణీ’కార్య క్రమం సమస్యాత్మకంగా మారే అవకాశం ఉందని వారు స్పష్టం చేశారు. మావోయిస్టుల కార్యకలాపాల నేపథ్యంలో 28 ఏళ్ల కిందట అటవీ, ఆబ్కారీ శాఖలకు చెందిన ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. ఆయుధాలు, వైర్లెస్ సెట్ల కోసం మావోయిస్టులు దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్పట్లో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే గత పదేళ్లుగా రెండు శాఖల అధికారులు, సిబ్బందికి స్మగ్లర్లు, అక్రమార్కుల ఆగడాలు, పోడు భూముల సాగు నియంత్రణ సమస్యగా మారింది. 2013 సెప్టెంబర్ 15న నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం పెంబిలో అటవీ భూముల ఆక్రమణను అడ్డుకునేందుకు 11 మంది సిబ్బందితో వెళ్లిన ఎఫ్ఆర్ఓ గంగయ్య (42)పై.. అక్కడున్న జనం గొడ్డళ్లతో దాడి చేసి చంపేశారు. మరో ఏడుగురిని గాయపరిచారు. అప్పుడున్న సీఎం కిరణ్కుమార్రెడ్డి అప్పటి అటవీశాఖ పీసీసీఎఫ్ బీఎస్ఎన్ రెడ్డితో ఆయుధాల అప్పగింతపై చర్చలు జరిపారు. ఆ తర్వాత కూడా అనేక దాడులు జరగ్గా.. దాడులు జరిగినప్పుడు ఆయుధాల విషయం చర్చించడం ఆ తర్వాత మరిచిపోవడం ఓ తంతుగా మారింది. ‘పోడు’నేపథ్యంలో పెరుగుతున్న దాడులు ఒక వైపు అర్హులైన గిరిజనులకు పోడు భూములపై హక్కులు కల్పించే అంశాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తుండగా.. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల అటవీ ప్రాంతాల్లో పోడు కోసం అడవులు నరుకుతున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. అడ్డుకుంటున్న అటవీశాఖ అధికారులు, సిబ్బందిపై దాడులు జరుగుతున్నట్లు కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 12.46 లక్షల ఎకరాల పోడు భూములపై హక్కుల కల్పనకు సంబంధించి గిరిజనుల నుంచి 4,14,219 దరఖాస్తులు రాగా.. అందులో 10.36 లక్షల ఎకరాలకు సంబంధించిన 3.59 లక్షల దరఖాస్తులను పరిశీలించారు. భద్రాద్రి నుంచి 2,99,478 ఎకరాలపై 305 గ్రామాల నుంచి 83,663 అర్జీలు ఉన్నట్లు వరంగల్ సీసీఎఫ్ ప్రకటించారు. భద్రాద్రి జిల్లాలో ఎఫ్ఆర్ఓ హత్యకు పోడు భూముల సర్వే నేపథ్యం కూడా ఉండటంతో..ఈ అంశం భవిష్యత్తులో సర్వే ప్రక్రియకు అంతరాయం కలిగించే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. చదవండి: మల్లారెడ్డిపై ఐటీ దాడులు: సంచలనం రేపుతున్న ‘రూ.100 కోట్లు’ ఆయుధాలు ఇస్తేనే పోడు భూముల సర్వే అడవుల సంరక్షణ కోసం పనిచేస్తున్న అటవీశాఖ సిబ్బంది ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్రావు హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ హ్యత నేపథ్యంలో ఎఫ్ఆర్ఓల సంఘం సమావేశమై పలు నిర్ణయాలు తీసుకుంది. మా ప్రాణాలకు రక్షణ కల్పించకుండా పోడు భూముల సర్వేకు వెళ్లేది లేదు. ఆయుధాలు ఇవ్వాలని, మా ప్రాణాలకు రక్షణ కల్పించాలని మా ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. – షౌకత్ అలీ, రాష్ట్ర అధ్యక్షుడు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల సంఘం -
తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ అంత్యక్రియలు
-
ఫారెస్ట్ రేంజ్ అధికారి హత్యకేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్
-
దాడికి ముందు గుత్తికోయలతో ఎఫ్ఆర్వో.. ఫోటో వైరల్
సాక్షి, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాస రావు హత్యకేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. మడకం తుల(37), మంగ(43) అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు కొత్తగూడెం ఎస్పీ వినీత్ తెలిపారు. హత్యకు ఉపయోగించిన కత్తులను స్వాధీనం చేసుకున్నారు. సమగ్ర విచారణ జరిపి కసులో ఎవరెవరు ఉన్నారో అందరిని అరెస్ట్ చేస్తామని వెల్లడించారు. దోషులను చట్ట ప్రకారం శిక్షిస్తామని తెలిపారు. శ్రీనివాసరావును హత్యచేసిన వారిని ఉపేక్షించేది లేదని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇదిలా ఉండగా ఘటనకు ముందు గుత్తికోయలతో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస రావు మాట్లాడుతున్న ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలోని బెంబాలపాడు అటవీ ప్రాంతంలో ఎఫ్ఆర్ఓగా పనిచేస్తున్న చెలమల శ్రీనివాసరావును మంగళవారం గొత్తికోయలు హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే ప్లాంటేషన్ భూముల్లో పశువులు మేపడాన్ని అడ్డుకున్నందుకే గుత్తికోయలు ఫారెస్ట్ అధికారిని చంపినట్లు తెలుస్తోంది. చదవండి: ఫారెస్ట్ అధికారి మృతిపై అనుమానాలు.. ఆయుధాలు ఇవ్వాల్సిందే.. తెలంగాణ సర్కార్కు అల్టిమేటం -
Forest Range Officer: ఇక్కడ కాపాడిన ప్రాణం.. అక్కడ పోయింది!
చెట్టమ్మకు చుట్టమైండు. అడవి తల్లికి దడి కట్టిండు. దండెత్తిన మూకలను తరిమికొట్టిండు. పచ్చదనాన్ని కాపాడినందుకు మావోల హిట్లిస్ట్కెక్కిండు. చివరికి గొత్తికోయల చేతిలో హత్యకు గురైండు. ఇప్పుడా వనం కన్నీళ్లు కారుస్తోంది. చెట్లన్నీ నిలబడి సంతాపం తెలుపుతున్నాయి. ‘శ్రీనివాస్ అమర్ రహే’ అని మౌనంగా నినదిస్తున్నాయి. – బయ్యారం సాక్షి, మహబూబాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండలో ఎఫ్ఆర్ఓగా పనిచేస్తున్న చెలమల శ్రీనివాసరావును మంగళవారం గొత్తికోయలు హత్య చేశారు. 2011 నుంచి 2018 వరకు బయ్యారం అటవీశాఖ డీఆర్ఓగా శ్రీనివాసరావు పని చేశారు. ఆయన మృతితో ఉమ్మడి జిల్లాలో విషాదం నెలకొంది. అటవీరక్షణకు ఈప్రాంతంలోని సాయుధ దళాలతో పాటు లీగల్గా గట్టిపట్టు ఉన్న న్యూడెమోక్రసీ పార్టీని ఢీకొన్నారు. అటవీ రక్షణకు వెనకడుగు వేయలేదు. 2018లో పదోన్నతిపై ఉమ్మడి వరంగల్ జిల్లాలోని లింగాల ఎఫ్ఆర్ఓగా విధుల్లో చేరారు. ఆసమయంలో అటవీ రక్షణకు తనదైన శైలిలో పని చేశారు. దీంతో పోడు, సాగుదారుల ఫిర్యాదుల ఆధారంగా మావోయిస్టులు ఎఫ్ఆర్ఓను టార్గెట్ చేశారు. ఈవిషయాన్ని ఇంటెలిజెన్స్ అధికారులు అటవీ ఉన్నతాధికారులకు నివేదిక అందించారు. దీంతో ఎఫ్ఆర్ఓ ప్రాణాలు రక్షించుకునేందుకు ఆశాఖ అధికారులు భద్రాద్రి జిల్లా చండ్రుగొండకు బదిలీ చేశారు. చండ్రుగొండ రేంజ్ పరిధిలో సైతం శ్రీనివాసరావు అటవీ ప్రాంతం అన్యాక్రాంతం కాకుండా కృషి చేశారు. ఈక్రమంలో ఆప్రాంతానికి వలస వచ్చిన గొత్తికోయలు శ్రీనివాసరావును లక్ష్యంగా చేసుకొని హత్య చేశారు. లింగాలలో కాపాడినా.. చండ్రుగొండలో మాత్రం కాపాడుకోలేకపోయామని అటవీశాఖ అధికారులు కన్నీటి పర్యంతమయ్యారు. ఉమ్మడి జిల్లాలో విషాదం... బయ్యారం డీఆర్ఓగా, లింగాల ఎఫ్ఆర్ఓగా పని చేసిన శ్రీనివాసరావు హత్యకు గురవడంపై ఉమ్మడి జిల్లాలోని అటవీశాఖలో విషాదం నెలకొంది. అటవీ రక్షణకు శ్రీనివాసరావు చేసిన కృషిని ఈసందర్భంగా పలువురు అధికారులు కొనియాడారు. చదవండి: ఫారెస్ట్ అధికారి మృతిపై అనుమానాలు?.. హత్యకు ముందు శ్రీనివాసరావు వీడియో వైరల్ -
ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్ అంత్యక్రియల్లో ఉద్రిక్తత
-
ఫారెస్ట్ అధికారి మృతిపై అనుమానాలు?.. హత్యకు ముందు శ్రీనివాసరావు వీడియో వైరల్
సాక్షి, హైదరాబాద్: ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాసరావు మృతి వెనక పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్లాంటేషన్ భూముల్లో పశువులు మేపడాన్ని అడ్డుకున్నందుకే ఫారెస్ట్ అధికారిని చంపినట్లు ప్రచారం జరుగుతోంది. లింగాలలో పనిచేస్తున్న రోజుల్లో శ్రీనివాస రావు హిట్లిస్టలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో మావోయిస్టుల ప్రోత్సాహం ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్ రావునును గొత్తికోయలు వేట కొడవళ్లతో మెడపై దాడి చేసి క్రూరంగా హత్య చేసిన విషయం తెలిసిందే. మరో ఇద్దరు ఉద్యోగులను కర్రలతో బెదిరింపులకు గురి చేశారు. కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలోని బెండాలపాడు అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విధి నిర్వహణలో శ్రీనివాసరావు నిక్కచ్చిగా వ్యవహరిస్తారనే పేరు ఉంది. ఆయన రేంజ్లో ఎవరూ ఒక పుల్లను కూడా అడవిని నుంచి బయటకు తీసుకువెళ్లలేరనే విధంగా పేరు సంపాదించారు. ఈ క్రమంలో శ్రీనివాస రావు చనిపోక ముందు చెట్టు కర్ర గురించి గ్రామస్తులకు, ఇతర అధికారులకు అవగాహన కల్పిస్తున్న ఓ వీడియో ఒకటి తాజాగా వైరల్గా మారింది. పాడే మోసిన మంత్రులు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ ఈర్లపూడికి చేరుకున్నారు. శ్రీనివాసరావు మృతదేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇదే సమయంలో జోహార్ శ్రీనివాసరావు అంటూ అటవీశాఖ అధికారులు, సిబ్బంది నినాదాలు చేశారు. ఇదే సమయంలో మహిళ ఉద్యోగులు కన్నీటి పర్యంతమయ్యారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఇంద్రకరణ్ రెడ్డి.. శ్రీనివాస రావు పాడే మోశారు. అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడుతూ.. దాడులను సహించేది లేదని అన్నారు. శ్రీనివాస రావుపై దాడి చేసి, హత్య చేసిన ఎవరిని వదిలిపెట్టమని తెలిపారు. ప్రభుత్వం ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకుందని, సీఎం కెసీఆర్ గారు వెంటనే స్పందించి అధికార లాంఛనలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎస్ను ఆదేశించారని తెలిపారు. సీఎం కేసీఅర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం రూ. 50 లక్షల ఎక్స్గ్రేషియా, కుటుంబంలో ఒకరికీ ప్రభుత్వ ఉద్యోగం, ఇతర బెనిఫిట్స్ కల్పిస్తూ జీవో జారీ చేసినట్లు తెలిపారు. ఇక్కడి గిరిజనులతో సమస్య లేదని, ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ అక్రమంగా వలస వచ్చిన గుత్తి కొయలు అడవులను విచక్షణ రహితంగా నరికి వేస్తున్నారని మండిపడ్డారు. అడవులను నరికినట్లు అటవీ అధికారులపై కూడా దాడులు చేస్తాం అంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అటవీశాఖకు ఆయుధాల అంశం శ్రీనివాసరావు మృతితో అటవీశాఖ ఉద్యోగులకు ఆయుధాలు ఇచ్చే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై సీఎం కేసీఆర్కు ప్రతిపాదనలు చేస్తామని అటవీ శాఖ ఉద్యోగులు చెబుతున్నారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు మృతితో ఆయుధాలు లేకుండా అడవిలో డ్యూటీ చేయలేమని అటవీశాఖ సిబ్బంది తేల్చి చెప్తున్నారు. ఆరు నెలల క్రితమే గోత్తి కోయలు శ్రీనివాసరావు హత్యకు ప్లాన్ చేశారని సంచలన నిజాలు వెల్లడించారు అటవీశాఖ సిబ్బంది. తనకు ప్రాణహాని ఉందని అనేకమార్లు తమకు చెప్పారన్నారు. గతంలో కూడా ఆయుధాలు అంశానికి సంబంధించి అనేకమార్లు సీఎం దృష్టికి తీసుకెళ్లామని ఇప్పుడు మళ్ళీ మరోసారి తీసుకెళ్తామన్నారు.. శ్రీనివాసరావుది చివరి మృతి కావాలని ఫారెస్ట్ శాఖలో ఇక ఎవ్వరు చనిపోవద్దంటే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు. ఉద్రిక్తత ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస రావు అంత్యక్రియల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దాడులను నిరసిస్తూ ఫారెస్టు సిబ్బంది ఆందోళన చేపట్టింది. ర్యాలీగా బయలుదేరి వచ్చిన ఉద్యోగులు.. వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు లాగా తమకు తుపాకులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయుధాలు ఇచ్చి అటవీశాఖ అధికారులకు, సిబ్బంది ప్రాణాలకు రక్షణ కల్పించాలని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ ఎదుట అటవీ శాఖ సిబ్బంది నినాదాలు చేశారు. అటవీశాఖ సిబ్బందిని పోలీసులు అడ్డుకున్నారు. చివరకు ఫారెస్ట్ సిబ్బంది నిరసనతో మంత్రులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
పాత వీడియో వైరల్: ఫారెస్ట్ అధికారి మృతిపై పోలీసుల అనుమానం
-
కాళ్లమీద పడినా కర్కశంగా.. గొత్తికోయల దారుణ కృత్యం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/చంద్రుగొండ: బెండాలపాడు అటవీ ప్రాంతంలో తమ ఆఫీసర్పై దాడి చేయొద్దని సహచర సిబ్బంది కాళ్లపై పడి మొక్కినా గొత్తి కోయలు కనికరించలేదు. వేటకొడవళ్లతో దాడి చేయడంతో ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు మెడపై తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలో కింద పడి ఉన్న ఎఫ్ఆర్ఓపై తులా వేటకొడవలితో దాడి చేస్తుండగా.. ‘మీ కాళ్లు మొక్కుతా, మా సార్ను ఏం చేయొద్దు.. మేము ఇక్కడి నుండి వెళ్లిపోతాం’అంటూ రామారావు వేడుకున్నారు. అయినా పట్టించుకోకుండా చేతిలోని పదునైన ఆయుధంతో శ్రీనివాసరావు మెడ, తల, గొంతుపై అదే పనిగా దాడి చేశాడు. మంగును వాచర్ రాములు నిలువరించే ప్రయత్నం చేశాడు. అయితే ఆవేశంగా ఉన్న వారిద్దరినీ నిలువరించడం సాధ్యం కాక శ్రీనివాసరావును అక్కడే వదిలి రామారావు, రాములు తదితరులు ప్లాంటేషన్ నుంచి బయటకు పరుగులు తీశారు. పోలీసులు, అటవీ సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకునే వరకు సుమారు గంట పాటు ఎఫ్ఆర్ఓ రక్తపుమడుగులోనే ఉన్నారు. ఆ తర్వాత కారులో మధ్యాహ్నం 1:56 గంటల ప్రాంతంలో చంద్రుగొండ ప్రాథమిక ఆస్పత్రికి, ఆ తర్వాత ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. జీపులో వెళ్లుంటే..: ఫారెస్ట్ ఆఫీసర్గా కేటాయించిన జీపులోనే శ్రీనివాసరావు ఎక్కువగా ఫీల్డ్ విజిట్కు వెళ్తుంటారు. కొత్తగూడెం నుంచి చంద్రుగొండకు తన కారులో వచ్చి అక్కడి నుంచి ఫారెస్ట్ జీపులో అడవిలోకి వెళ్లడం ఆయనకు అలవాటు. జీపులో తనతో పాటు సిబ్బందిని తీసుకెళ్లేవారు. కానీ, మంగళవారం ఆయన బైక్ మీద ఫీల్డ్ విజిట్కు వెళ్లడం, ఆయన వెంట ఒక్కరే సిబ్బంది ఉండడంతో ఆయనపై పగ పెంచుకుని అదను కోసం చూస్తున్న గొత్తికోయలు తేలికగా దాడి చేయగలిగారని అటవీ సిబ్బంది చెబుతున్నారు. పచ్చదనమే ప్రాణంగా బతికారు పచ్చదనమే ప్రాణంగా బతికిన సిన్సియర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చలమల శ్రీనివాసరావు చివరకు ఆ పచ్చని చెట్ల మధ్యే ప్రాణాలు వదిలారు. అడవుల రక్షణే ఊపిరిగా జీవించిన ఆయన చివరకు విధి నిర్వహణలో తుదిశ్వాస విడిచారు. శ్రీనివాసరావు సహజంగానే అడవులంటే ప్రేమ కలిగిన ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నారు. ఎక్కడ పని చేసినా పోడు వ్యవసాయాన్ని అరికట్టడంతో పాటు అడవులు పెంచడంపై శ్రద్ధ చూపించేవారు. ఈ క్రమంలో అటవీ శాఖ నుంచి గోల్డ్ మెడల్ సైతం అందుకున్నారు. విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉండే ఆయన వ్యక్తిగతంగా మాత్రం చాలా సౌమ్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన రేంజ్లో ఎవరూ ఒక పుల్లను కూడా అడవిని నుంచి బయటకు తీసుకువెళ్లలేరనే విధంగా పేరు సంపాదించారని, అలాంటి ఆయన ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదకరమని తోటి అధికారులు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చదవండి: ఎఫ్ఆర్వో మృతి.. 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటన.. దోషులను కఠినంగా శిక్షిస్తామన్న సీఎం కేసీఆర్ -
ఎఫ్ఆర్వో మృతి.. సీఎం కేసీఆర్ స్పందన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు సహించబోమని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తి కోయల దాడిలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు మృతి చెందిన ఘటనపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తరపున బాధిత కుటుంబానికి రూ.50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు ఆయన. ఉద్యోగులపై దాడులను సహించబోమన్న సీఎం కేసీఆర్.. దోషులను కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు. అంతేకాదు.. శ్రీనివాసరావు కుటుంబానికి పూర్తి జీతభత్యాలు అందుతాయని, రిటైర్మెంట్ వయసు వరకు కుటుంబ సభ్యులకు వేతనం చెల్లిస్తామని తెలిపారు. చంద్రుగొండ మండలం బెండలపాడులో మంగళవారం ఈ దాడి ఘటన చోటు చేసుకుంది. విధి నిర్వహణలో శ్రీనివాసరావు ప్రాణాలు పొగొట్టుకోవడంతో ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. అధికార లాంఛనాలతో ఎఫ్ఆర్వో శ్రీనివాస రావుకు అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. -
గుత్తికోయల దాడిలో ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్ మృతి
-
అటవీ అధికారుల కంటపడ్డ వింతజీవి.. కాటేస్తే డౌటే!
రాయగడ(భువనేశ్వర్): జిల్లాలోని మునిగుడ సమితి లోదిపొంగ అడవుల్లో అటవీశాఖ అధికారులకు ఓ వింతజీవి తారసపడింది. దీనిని చాకచక్యంలో పట్టుకుని అటవీశాఖ కేంద్రానికి తరలించారు. శనివారం రాత్రి కొంతమంది అటవీశాఖ సిబ్బంది అడవిలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఈ జీవి కనిపించిందని అటవీశాఖ అధికారి ప్రసన్నకుమార్ మిశ్రొ తెలిపారు. అయితే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఏ పేరుతో పిలుస్తారనే విషయాలపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు. అయితే ఇది విషపూరితమైన జీవమని, మనుషులపై దాడి చేసి, కాటు వేస్తుందని వన్యప్రాణుల సంరక్షణ విభాగానికి చెందిన తెలిపారు. దాడి చేసే స మయంలో శరీరంలోకి విషం ఎక్కి, ప్రమాదంలో చిక్కుకునే అవకాశం ఉందని సమాచారం. దీనిపై వివరాలు సేకరిస్తున్నారు. చదవండి: సామూహిక లైంగిక దాడి చేసి.. ఆమెకు ఇలా వెల కట్టారు -
అదిగో పులి... ఇదిగో తోక
కోటవురట్ల: పులి భయంతో అటవీ పరిధి గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. నిన్న మొన్నటి వరకు అటవీ పరిధిలో సంచరించిన పులి తాజాగా నర్సీపట్నం–రేవుపోలవరం రోడ్డుపై కూడా సంచరిస్తోందన్న ప్రచారం సాగుతోంది. గురువారం రాత్రి ఇందేశమ్మవాక ఘాట్రోడ్డులో పలువురికి పులి కనిపించినట్టు చెబుతున్నారు. ఎస్.రాయవరం మండలం చినగుమ్ములూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులు గురువారం రాత్రి 8 గంటల సమయంలో ఇంటికి వెళుతుండగా ఘాట్రోడ్డులో పులి కనిపించడంతో బైకును అక్కడే వదిలేసి వెనక్కి పరుగులు తీసినట్టు చెబుతున్నారు. పందూరు గ్రామానికి చెందిన కిర్రా నాగేశ్వరరావు ఇందేశమ్మతల్లి ఆలయంలో ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తుంటారు. ఎప్పటిలానే గురువారం రాత్రి 9 గంటల సమయంలో అమ్మవారికి దీపం పెట్టి తిరిగి పందూరులోని ఇంటికి వెళ్లేందుకు బయటకొచ్చి బైక్ స్టార్ట్ చేసేసరికి లైట్ వెలుతురులో సుమారు 200 అడుగుల దూరంలో పులి కొండపైకి ఎక్కుతూ కనిపించినట్టు నాగేశ్వరరావు చెబుతున్నారు. తాను స్పష్టంగా చూశానని, పులి తోక, కాళ్లు కనిపించాయని రోడ్డు నుంచి కొండపైకి ఎక్కుతుండడంతో భయపడి వెంటనే గుడిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నట్టు తెలిపాడు. మరికొద్ది సమయానికి అటుగా రెండు లారీలతో పాటు కొందరు యువకులు బైకులపై రావడంతో వారితో పాటు హారన్లు కొట్టుకుంటూ ఆ ప్రాంతం నుంచి తప్పించుకున్నట్టు చెబుతున్నారు. అయితే ఇదంతా కేవలం వదంతులేనని ఫారెస్టు రేంజరు రాజుబాబు కొట్టిపారేస్తున్నారు. పులి కొండల్లో సంచరిస్తున్న మాట వాస్తవమేనని, ఘాట్రోడ్డుపైకి రావడం కేవలం వదంతులే అన్నారు. శ్రీరాంపురంలో దున్నపై దాడి జరిగిన ప్రాంతంలో ట్రాక్ కమెరాలు ఏర్పాటు చేశామని, ఆ పులి మళ్లీ అటువైపు రాలేదని తెలిపారు. ప్రస్తుతం దాని దిశ మార్చుకుని నక్కపల్లి, పాయకరావుపేట మండలాల వైపు వెళ్లే అవకాశం ఉందన్నారు. దున్నను వేటాడి ఆహారం తీసుకుని సుమారు 30 గంటలు దాటుతోందని, మళ్లీ అటాక్ చేసే అవకాశం ఉందన్నారు. దానిని బట్టి పులి ఆచూకీ తెలుసుకుని ఆ ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. తమ సిబ్బంది, రెస్క్యూ టీమ్ అనుమానం వచ్చిన ప్రాంతాలలో తనిఖీలు చేస్తున్నారని తెలిపారు. రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో పులి పాదముద్రలు లభ్యం కావడం లేదన్నారు. సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం.. ఇందేశమ్మ వాక ఘాట్రోడ్డులో పులి తిరుగుతోందని అడ్డురోడ్డు నుంచి కోటవురట్ల వైపు ఎవరూ వెళ్లొద్దని గురువారం రాత్రి వాట్సప్ గూపుల్లో ప్రచారం జరిగింది. వేర్వేరు ప్రాంతాలల్లో పులి సంచరిస్తున్న వీడియోలను గ్రూపుల్లో అప్లోడ్ చేసి హడలెత్తిస్తున్నారు. దాంతో ఘాట్రోడ్డులో రాకపోకలు బాగా తగ్గిపోయాయి. అణుకు, అల్లుమియ్యపాలెం, రామచంద్రపురం, గూడెపులోవ, పందూరు, బంద, శ్రీరాపురం, తడపర్తి, బోనుకొత్తూరు గ్రామాలను పులిభయం వెంటాడుతోంది. ఒంటరిగా బైకులపై వెళ్లేందుకు భయపడుతున్నారు. అడవి వైపు వెళ్లొద్దు... యలమంచిలి రూరల్ : రిజర్వ్ ఫారెస్ట్ను అనుకొని ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆటవీశాఖ అధికారి రామ్ నరేష్ అన్నారు. శుక్రవారం పెదపల్లి అటవీ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వ్ ఫారెస్ట్లోకి పులి ప్రవేశించడంతో ప్రజలు ఒంటరిగా అడవిలోకి వెళ్లరాదన్నారు. అడవిని ఆనుకొని ఉన్న రైతులు పశువులను ఇంటికి తరలించడంతో పాటు అటు వైపు వెళ్లరాదని హెచ్చరించారు. పెదపల్లి రిజర్వాయర్, కొక్కిరాపల్లి రిజర్వాయర్ సమీపంలో ఉన్న రైతులు అప్రమత్తంగా ఉండడంతో పాటు పశువులను గ్రామానికి తరలించాలని సూచించారు. పులికి ఆహారం లభించు స్థలం, నీరు అందుబాటులో ఉన్న ప్రదేశాలను పరిశీలించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పెదపల్లి ఆటవీ శాఖ ప్రాంతంలోకి బెంగాల్ టైగర్ ప్రవేశించడంతో అటవీ శాఖ అధికారులు వెంకటపురం, పెదగొల్లలపాలెం, చిన గొల్లలపాలెంతో పాటు పలు గ్రామాల్లో పర్యటించి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి ఆటవీ శాఖ అధికారులు రవి కుమార్, గోవిందు, ప్రభాకర్, మూర్తి పాల్గొన్నారు. (చదవండి: రైతులకు సిరులు కురిపిస్తోన్న పత్తి..) -
అటవీశాఖ అధికారులపై గ్రామస్తుల దాడి
కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ ఫారెస్ట్ రేంజ్ అటవీ అధికారులపై దాడి జరిగింది. తప్పించుకునే క్రమంలో పరుగెడుతూ 8 నెలల గర్భిణీ అయిన ఎఫ్బీవో అస్వస్థతకు గురయ్యారు. కాగజ్నగర్ ఫారెస్ట్ రేంజ్ ఆధ్వర్యంలో అగ్నిప్రమాదాలపై అవగాహన కల్పించడం కోసం కుమురంభీం జిల్లా కాగజ్నగర్ మండలం ఊట్పల్లిలో మంగళవారం కళాజాత నిర్వహించారు. వంట చెరుకును తీసుకోనివ్వకుండా అధికారులు అడ్డుకుంటున్నారని, గొడ్డళ్లు, సైకిళ్లను స్వాధీనం చేసుకుంటున్నారని అధికారులను గ్రామస్తులు ఘెరావ్ చేశారు. దీంతో కళాజాత బృందం సభ్యులు అర్ధాంతరంగా కార్యక్రమాలను ఆపేసి వెళ్లిపోయారు. కోసిని ఎఫ్బీవో శిరీష, వాచ్మేన్లు దేవ్సింగ్, రాములు, శంకర్ తమ ద్విచక్ర వాహనాలపై బయల్దేరుతుండగా గ్రామస్తులు అడ్డుకొని కర్రలతో దాడికి దిగారు. శిరీష ఎడమ చేతికి గాయాలయ్యాయి. దాడి నుంచి తప్పించుకోవడానికి పరుగెత్తడంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న శిరీష భర్త బైక్పై ఆమెను పట్టణంలోని ప్రైవేటు హాస్పిటల్కు తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం అటునుంచి ఆమెను మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. -
మహిళా అధికారినిపై దాష్టీకం: డ్యూటీలో ఉంది.. అందులోనూ గర్భిణి!
కొంతమంది ఇటీవల కాలంలో అత్యంత ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. ఆడ, మగ అనే తారతమ్యం లేకుండా అత్యంత దారుణంగా దిగజారి ప్రవర్తిస్తున్నారు. అచ్చం అలాంటి అమానుష ఘటనే మహారాష్ట్రలో చోటు చేసుకుంది. పైగా సాటి మహిళ, గర్భిణి అని చూడకుండా అత్యంత పాశవికంగా ఆమె పై దాడి చేశారు. అసలు విషయంలోకెళ్తే....మహారాష్ట్రలోని సతారా జిల్లాలో అటవీ శాఖలో పనిచేస్తున్న గర్భిణి అధికారి పై పల్సవాడే మాజీ సర్పంచ్ అతని భార్య అత్యంత అమానుషంగా దాడిచేశారు. మహిళా అటవీ శాఖాధికారులు తనకు సమాచారం ఇవ్వకుండా కూలీలను వేరే స్థలంలో పనిలో పెట్టుకున్నారని స్థానిక అటవీ కమిటీలో మాజీ సర్పంచ్ రామచంద్ర గంగారాం వాపోయారు. అంతేకాదు మాజీ సర్పంచ్ సోమవారం మహిళా అధికారిణిని ఫోన్లో బెదిరించాడు కూడా. ఈ మేరకు మాజీ సర్పంచ్ రామచంద్ర గంగారాం జంకర్, అతని భార్య ప్రగతి జంకర్.. మహిళా అటవీ అధికారి, ఆమె భర్త పై దాడి చేశారు. పైగా మాజీ సర్పంచ్ భార్య ప్రగతి జంకర్... సాటి మహిళ, గర్భిణి అనే కనికరం లేకుండా అటవీ అధికారి జుట్లు పట్టుకుని లాగి కిందపడేసి, చెప్పుతో కొట్టి అవమానించారు. ఈ మేరకు ఈ ఘటనను ఆ మహిళా ఆఫీసర్ భర్త, అటవీ సిబ్బంది రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి మాజీ సర్పంచ్ని అతని భార్యను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. (చదవండి: ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఏందయ్యా ఇది..) -
అక్కడ చెట్లను తొలగిస్తే.... బహుమతులు ఇస్తారట!
Callery Pear Tree Smells Bad In US state of Maine: చెట్లను నాటండి అంటూ మన దేశాల్లో పచ్చదనం, హరిత విప్లవం అంటూ రకరకాల కార్యక్రమాలను చేపడుతుంటారు. అయితే అందుకు విరుద్ధంగా యూఎస్లోని మైనే రాష్ట్రంలోని అధికారులు మొక్కలను తొలగిస్తే బహుమతులు ఇస్తాం అంటున్నారు. అసలే ప్రపంచ దేశాలన్ని కాలుష్యం కోరల్లో చిక్కుకుని బెంబేలెత్తుతుంటే ఏంటిది వెటకారంగా అని అనుకోకండి. (చదవండి: బాప్రే!.... నెపోలియన్ ఖడ్గం వేలంలో రూ. 21 కోట్లు పలికిందట!) అసలు విషయంలోకెళ్లితే... మానవుల మనగడ చెట్లతోనే సాధ్యం అని అందరికి తెలిసి విషయమే. కానీ యూఎస్కి తూర్పున ఉన్న మైనే రాష్ట్రంలోని కాలరీ పియర్ చెట్లు మాత్రం ప్రజలకు సమస్యగా మారి ఇబ్బందులకు గురిచేస్తోంది. అంతేకాదు సౌత్ కరోలినా ఫారెస్ట్రీ కమిషన్ కాలరీ పియర్ చెట్లను తొలగించాలనుకునే వారికి ఐదు కొత్త చెట్ల బహుమతిగా ఇస్తానని ప్రకటించింది. అయితే ఈ కాలరీ పియర్ చెట్టు యూఎస్కి చెందినది కాదు. అంతేకాదు ఈ చెట్టు చైనా, వియత్నాంకు చెందిన పియర్ చెట్టు జాతి. ఈ మేరకు ఇది 1900లలో అనేక ఆసియా దేశాల నుండి యూఎస్ దేశానికి వచ్చింది. అయితే 1960ల నాటికల్లా ఈ చెట్లు వాటికి పూచే ఆకర్షణీయమైన తెల్లని పువ్వుల కోసం రాష్ట్రాలలోని అనేక శివారు ప్రాంతాల్లో విస్తారంగా వీటిని నాటారు. పైగా యూఎస్లో విస్తృతంగా సాగు చేయబడిన 'బ్రాడ్ఫోర్డ్' పియర్ చెట్టుగా కూడా పిలుస్తారు. ఏ ఆకర్షణీయమైన పువ్వుల కోసం అయితే ఈ మొక్కలను నాటారో ఆ పువ్వులు అత్యంత భయంకరమైన వాసనను కలిగి ఉన్నాయన్న విషయాన్ని ప్రజలు గ్రహించలేకపోయారని మైనే వ్యవసాయ సంరక్షణ అటవీ శాఖకు చెందిన ఉద్యానవన నిపుణులు అన్నారు. అంతేకాదు ఈ పియర్ చెట్లు వల్ల స్థానిక జాతి చెట్ల పై తీవ్ర వినాసకరమైన ప్రభావాన్ని చూపాయని చెప్పారు. దీంతో అక్కడి అధికారులు 2024 నాటికల్లా ఈ పియర్ మొక్కలను పూర్తిగా నిషేధించాలని నిర్ణయించారు. పైగా అక్కడి అధికారులు ఇప్పటికే ఉన్న కాలరీ పియర్ చెట్లను తొలగించినందుకు ఇంటి యజమానులకు బహుమతులు అందించే వరకు వెళ్లడం గమనార్హం (చదవండి: జైలును ఆర్ట్ సెంటర్గా మార్చడం కోసం... కోట్లు సేకరిస్తున్నాడు!!) -
కొంగుపట్టి లాగి.. జాకెట్ చించి..
టేకులపల్లి (భద్రాద్రి కొత్తగూడెం): పోడుభూములను సాగు చేసుకుంటున్న ఆదివాసీ మహిళారైతులపై అటవీఅధికారులు దౌర్జన్యం చేయడంతోపాటు అసభ్యంగా ప్రవర్తించారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం గంగారం పంచాయతీ సిద్ధారం సమీపంలో గురువారం చోటుచేసుకుంది. సిద్ధారం సమీపంలో ఆదివాసీలు 30 ఏళ్లుగా పోడు సాగు చేసుకుంటున్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొందరికి పట్టాలు ఇచ్చారు. మరికొన్ని భూములకు ఫారెస్టు అధికారులు రీసర్వే చేయడంతో బాధిత రైతులు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో గురువారం సాగు చేసుకుంటున్న రైతులు మధ్యాహ్న భోజనానికి ఇళ్లకు వెళ్లిన సమయంలో అటవీ అధికారులు పోడు భూముల వద్దకు చేరుకున్నారు. అక్కడ ఉన్న మహిళలను దుర్భాషలాడుతూ వారిపై దౌర్జన్యానికి దిగారు. ‘ఎవడబ్బ సొమ్మని పోడు దున్నుతున్నారు’ అని తిడుతూ అరకలను తొలగించేందుకు ప్రయత్నించగా మహిళారైతులు అడ్డుకున్నారు. బీట్ ఆఫీసర్ మోతీలాల్ ఆగ్రహంతో మహిళా రైతులు జోగ కుమారి, కోరం రమణల కొంగుపట్టి లాగడంతో వారి జాకెట్లు చిరిగిపోయాయి. ఈ విషయమై వివరణ కోరేందుకు ఎఫ్ఆర్వోను ‘సాక్షి’ ఫోన్లో ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. కాగా, ఈ ఘటనపై బాధితులు జోగ కుమారి, కోరం రమణతోపాటు మహిళారైతులు స్వరూప, సమ్మక్క, పవిత్ర, లక్ష్మీ, నాగమణి, పద్మ, వివిధ పార్టీల నేతలు బోడు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. బీట్ ఆఫీసర్లు మోతీలాల్, రమేష్పై కఠినచర్యలు తీసుకోవాలని కోరారు. -
మేధావి కీర్తిని ‘రేంజర్ దీదీ’ అని ఎందుకు పిలుస్తారో తెలుసా?
ఉత్తరాఖండ్లోని భద్రగడ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు మేధావి కీర్తి. గతేడాది మే నెలలో ఫారెస్ట్ రేంజ్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన కీర్తిని స్థానికులంతా ‘రేంజర్ దీదీ’ అని ప్రేమగా పిలుచుకుంటారు. పేరుకు తగ్గట్టుగానే స్థానిక మహిళలకు తోడబుట్టిన అక్కలా వ్యవహరిస్తున్నారు ఈ యంగ్ ఆఫీసర్. ఫారెస్ట్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న అనేకమంది మహిళలకు చేయూతనిస్తూ వారి ఆర్థికాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారు కీర్తి . ‘ధాత్రీ’ అనే సంస్థను స్థాపించి, భుట్గావ్, నెగ్యానా, బండసరి, తిక్రీ సుమన్కారి గ్రామాల్లోని మహిళల ఆర్థిక ఇబ్బందులను దూరం చేస్తున్నారు. ధాత్రీ సంస్థ ద్వారా కుట్లు, అల్లికలు, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి పనుల్లో స్థానిక మహిళలకు శిక్షణ ఇప్పిస్తున్నారు. ట్రైనింగ్ పూర్తయిన మహిళలతో వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేయించి వాటిని మంచి లాభాలకు విక్రయిస్తూ ఆదాయాన్ని పదింతలు చేస్తున్నారు. దీపాలు, పూజాసామగ్రి, కుండల తయారీ, సుంగధ ద్రవ్యాల ఉత్పత్తులు, స్థానికంగా పండే బార్లీ, రాజ్మా, మండెవా, రోడోడెండ్రాన్ రసం వంటివాటిని తయారు చేయిస్తున్నారు. అంతేగాక స్థానికంగా పెరిగే మలు, తిమ్లీ అనే మొక్కల నుంచి తయారు చేసిన ప్లేట్స్, గిన్నెలను ‘వేదిక్ పత్రావళి’ పేరుతో విక్రయిస్తున్నారు. కొంతమంది మహిళలను ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి ఆవుపేడతో కళాఖండాలు తయారు చేయిస్తున్నారు. ‘నందినీ’ అనే బ్రాంచ్ ప్రారంభించి దీనిలో పెళ్లికాని అమ్మాయిలతో వివిధ రకాల వస్తువులను ఉత్పత్తి చేయిస్తున్నారు. ప్రారంభంలో ఇక్కడి మహిళలను ఒప్పించడం చాలా కష్టమైంది. కానీ తరువాత సీనియర్ అధికారుల సాయంతో ముందుకు సాగగలిగానని కీర్తి చెప్పారు. మహిళలకు శిక్షణ నివ్వడం గతేడాది దీపావళి పండుగకు ఒక నెలముందు ప్రారంభించాం. అప్పుడు కొన్ని రకాల మెషిన్లు, కొంతమంది ట్రైయినర్లతో శిక్షణ ఇప్పించడంతో.. నెలరోజుల్లోనే వేగంగా నేర్చుకుని దీపావళి పండుగ సమయంలో అనేక ఉత్పత్తులు అందించిన మహిళలు వాటిని విక్రయించడం ద్వారా రూ.40 వేలు ఆదాయం పొందారు’’ అని కీర్తి చెప్పారు. ‘‘ఆవుపేడతో కళాఖండాలు తయారు చేయడంలో నైపుణ్యం కలిగిన నాగ్పూర్కు చెందిన ఓ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాం. పశువులు పాలు ఇవ్వడం ఆపేసిన తరువాత వాటిని పెద్దగా పట్టించుకోరు. అటువంటి పశువుల నుంచి పేడ సేకరించి వాటిని ఉపయోగపడే కళాఖండాలుగా తీర్చితిద్ది వాటి ద్వారా గ్రామీణ మహిళలకు మరికొంత ఆదాయం సృష్టించడమే తమ లక్ష్యం’’ అని ఆమె పేర్కొన్నారు. ‘‘మేధావి కీర్తి ఎంతో కష్టపడి ఇక్కడి మహిళలను అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారు. నాణ్యతతో కూడిన స్వదేశీ ఉత్పత్తులకు ధాత్రీ మంచి బ్రాండ్గా ఎదుగుతుంది’’ అని ముస్సోరీ డివిజినల్ ఫారెస్ట్ అధికారి కహంకన్ నసీమ్ అన్నారు. ధాత్రీ ద్వారా ఉపాధి పొందుతున్న తమకు రేంజర్ దీదీ తల్లిలా, అక్కలా తమని ఆదుకుంటున్నారని ధాత్రీద్వారా లబ్ధి పొందుతున్న మహిళలు చెప్పారు. ఎప్పటికప్పుడు తమని మోటివేట్ చేస్తూ తమలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి ఆదాయంగా మలుస్తున్నారు. మహా కుంభమేళా–2021లో మా ఉత్పత్తులను విక్రయించేందుకు దీదీ అధికారుల నుంచి అనుమతి కూడా తీసుకున్నారు. దీనిద్వారా తమ ఆదాయం పెరుగుతుందని వారు ఆనందం వ్యక్తం చేశారు. -
ఏనుగు మృతి.. వెక్కివెక్కి ఏడ్చిన అధికారి
చెన్నై: సొంతవాళ్లు చనిపోతేనే పట్టించుకోని ఈ సమాజంలో ఒక మూగజీవి ప్రాణంపోయిందని ఒక ఆఫీసర్ వెక్కివెక్కి ఏడ్చిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాలు.. ముదుమలై టైగర్ రిజర్వ్లోని సాదివాయల్ ఎలిఫెంట్ క్యాంప్లో ఒక ఏనుగు తీవ్రంగా గాయపడింది. ముదుమలై ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గాయపడిన ఏనుగును దగ్గరికి తీసుకొని సపర్యలు చేసి వైద్యుల చేత దానికి చికిత్స అందిస్తున్నాడు. అయితే చికిత్స పొందుతూ ఆ ఏనుగు మరణించడంతో ఖననం చేసేందుకు అటవీ శాఖ సిబ్బంది ఏర్పాట్లుచేశారు. లారీలో ఉన్న ఏనుగుకు కడసారి వీడ్కోలు పలికేందుకు దాని దగ్గరకు వెళ్లిన ఆఫీసర్కు కన్నీళ్లు ఆగలేదు. దాని తొండాన్ని నిమురుతూ వెక్కి వెక్కి ఏడ్చాడు. ఈ వీడియోను భారత అటవీ అధికారి రమేష్ పాండే ట్విటర్లో షేర్ చేశారు. ఈ వీడియో పెట్టిన రెండు రోజుల వ్యవధిలో లక్ష్యల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. -
అటవీ శాఖ రేంజర్ హత్య
సాక్షి, చర్ల: సరిహద్దు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు శుక్రవారం అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ను హతమార్చారు. పోలీసుల కథనం ప్రకారం.. బీజాపూర్ జిల్లా బైరంగడ్ అటవీ రేంజ్ పరిధిలోని గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి కూలీలకు డబ్బులు చెల్లించి తిరిగి వస్తున్న రేంజ్ ఆఫీసర్ కొండ్రోజీని మావోయిస్టులు అడ్డుకొని కిడ్నాప్ చేశారు. అనంతరం గొడ్డళ్లతో నరికి దారుణంగా హతమార్చారు. సమాచారం తెలుసుకున్న జంగ్లా పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. దుంకుతున్నదుమ్ముగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం కుమ్మరిగూడెంలోని దుమ్ముగూడెం ఆనకట్ట జలకళను సంతరించుకుంది. విస్తారంగా కురిసిన వర్షాలకు తోడు ఎగువ ప్రాంతాల నుంచి తరలివస్తున్న గోదావరి వరద పరవళ్లు తొక్కుతోంది. ఫలితంగా చూసేకొద్దీ మళ్లీ చూడాలనిపించే ఆనకట్ట అందాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. శుక్రవారం ‘సాక్షి’కెమెరా ఈ దృశ్యాన్ని బంధించింది. -
డిప్యూటీ ఫారెస్ట్ రేంజర్ ఆత్మహత్య
గండేడ్ (మహబూబ్నగర్): కుటుంబ కలహాలతో అటవీశాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగి అక్కడే పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చుక్కాయిపల్లికి చెందిన భానుప్రకాష్ ఖిల్లాఘనపూర్ వాసి వాహెదాబేగం (32) 2007 నుంచి 2010 వరకు మహబూబ్నగర్లో ఎంవీఎస్ డిగ్రీ కాలేజీలో చదువుకున్నారు. అదే సమయంలో ప్రేమించుకుని 2014లో మతాంతర వివాహం చేసుకున్నారు. వారికి 2016లో కుమార్తె జన్మించింది. (అగ్నికీలల్లో ఆర్తనాదాలు ) కొన్నాళ్లుగా భర్త మహబూబ్నగర్ డీఎఫ్ఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా, భార్య గండేడ్ మండలంలోని మహమ్మదాబాద్ అటవీ కార్యాలయంలో డిప్యూటీ ఫారెస్ట్ రేంజర్గా పనిచేస్తున్నారు. అయితే వారిద్దరి మధ్య కొన్నేళ్లుగా ఓ మహిళ విషయమై గొడవలు జరుగుతున్నాయి. ఇదే తరుణంలో అంతకుముందే ప్రేమించిన ప్రియాంక అలియాస్ పప్పీని వివాహం చేసుకుంటానని కొన్ని రోజులుగా వాహెదాబేగాన్ని భర్త వేధించేవాడు. దీంతో విభేదాలు పెరిగి మానసిక క్షోభ భరించలేక బుధవారం ఉదయం భార్య పురుగుమందు డబ్బాతోనే కార్యాలయానికి వచ్చింది. మధ్యాహ్నం అక్కడే తాగిన ఆమెను గమనించిన తోటిసిబ్బంది వెంటనే మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తల్లి ముబారక్బేగం ఫిర్యాదు మేరకు మహమ్మదాబాద్ ఎస్ఐ నాగరాజు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. -
చెర్లపల్లిలో బెబ్బులి సంచారం
సాక్షి, బెల్లంపల్లి : బెల్లంపల్లి మండలం చెర్లపల్లి గ్రామ శివారు ప్రాంతంలో సోమవారం పులి సంచారం స్థానికులను తీవ్ర భయభ్రాంతులకు గురి చేసింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామ శివారు ప్రాంతంలో ఉన్న ఒడ్నాలమ్మ చెరువు సమీపంలో ఉదయం కొంతమంది యువకులు చేపల వేటకు వెళ్లారు. చెరువు కాలువ వద్ద గాలం వేసి చేపలు పట్టే క్రమంలో అలికిడి రావడంతో యువకులు దూరంగా ఉన్న చెట్ల పొదల వైపు తొంగిచూశారు. అంతలోనే పులి కనిపించడంతో పెద్దగా కేకలు వేస్తూ ప్రాణ భయంతో ఇళ్ల వైపు పరుగులు తీశారు. యువకుల అరుపులకు పులి సైతం గాండ్రిస్తూ పరుగులు పెట్టింది. చెరువు సమీపంలో ఉన్న గుట్టవైపున్న చెట్ల పొదల్లోకి వెళ్లింది. వెంటనే అప్రమత్తమైన గ్రామస్తులు, యువకులు చెట్ల వైపు వెళ్లగా అప్పటికే పులి బెల్లంపల్లి – వెంకటాపూర్ బీటీ రోడ్డు దాటి మళ్లీ అచ్చులాపూర్ అడవులోకి పరుగులు తీసింది. అనంతరం గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన బెల్లంపల్లి అటవీరేంజ్ అధికారి మజారొద్దిన్ ఇతర సిబ్బందిని వెంటేసుకుని పులి సంచరించిన ప్రాంతాన్నీ నిశితంగా పరిశీలించారు. సదరు యువకులు చెప్పిన ప్రకారంగా ఆ ప్రాంతాన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేసి, అచ్చులాపూర్ అడవిలోకి వెళ్లిపోయారు. అటవీ శాఖ అధికారులకు పులి అడుగులు దర్శనమిచ్చాయి. వీటిని అధికారులు సేకరించి ఉన్నతాధికారులకు పంపారు. ఎన్నడూ లేని విధంగా పులి సంచారం జరుగుతుండటంతో గ్రామ ప్రజలు తీవ్రంగా భీతిల్లుతున్నారు. సరిగ్గా వారం రోజుల క్రితం.. తాండూర్ మండలం అచ్చులాపూర్ గ్రామ పంచాయతీ పరిధి కొమ్ము గూడెం శివారులో సరిగ్గా పులి సంచరించిన పాదముద్రలు వెలుగు చూశాయి. పశువుల కాపర్లు ఆ అడుగులను గుర్తించి అటవీ శాఖ అధికారులకు తెలియ జేయడంతో పులి సంచారిస్తున్న విషయం తెలిసింది. ఆ సంఘటన ఇంకా మరవక ముందే తాజాగా బెల్లంపల్లి మండలం చెర్లపల్లి గ్రామ శివారు అటవీ ప్రాంతంలో పులి దర్శనమివ్వడం తీవ్ర కలకలం రేపుతుంది. సీసీ కెమెరాల ఏర్పాటుకు యత్నాలు పులి సంచారం జరుగుతుండటంతో సత్వరంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని అటవీశాఖ అధికారులు చెబు తున్నారు. సంచరిస్తున్న పులి ఆధారంగా రక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు కదలికలను కనిపెట్టడానికి కెమెరాలను అటవీ ప్రాంతంలో బిగిస్తామని ఓ అటవీశాఖ అధికారి తెలిపారు. అటవీ శివారు ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అటవీ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లవద్దని అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు. -
ఫారెస్ట్ అధికారుల తీరుపై కలెక్టర్ అసహనం
సాక్షి, కీసర: కీసరగుట్ట అటవీప్రాంతాన్ని దత్తత తీసుకొని ఎంపీ సంతోష్కుమార్ హరితహారంలో భాగంగా ఇటీవల పెద్దఎత్తున మొక్కలు నాటిని విషయం తెలిసిందే. మంగళవారం కలెక్టర్ ఎంవీ రెడ్డి ఆ ప్రాంతాన్నిపరిశీలించారు. మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఫారెస్టు అధికారుల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. మొక్కలు నాటి 15 రోజులు కావొస్తున్నా వాటికి సపోర్టు కర్రలు ఎందుకు నాటలేదని, చనిపోయిన మొక్కల స్థానంలో మళ్లీ ఎందుకు నాటలేదని అటవీశాఖ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మొక్కలను నాటినప్పటి నుంచి ఫీల్డ్ఆఫీసర్ ఇటు పక్కకు రాలేదని, నాటిన మొక్కలను సంరక్షించనందుకు కీసర ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ను వెంటనే సస్పెండ్ చేయాలని జిల్లా అటవీశాఖ అధికారి సుధాకర్రెడ్డిని ఆదేశించారు. అనంతరం గుట్టలో గల ఆర్అండ్బి అతిథిగృహంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. కీసరగుట్ట అబివృద్ధికి ప్రణాళికను తయారు చేసి వెంటనే ప్రతిపాదనలు పంపాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. కీసరగుట్టలోని ఎంట్రెన్స్లో గల సిమెంట్ నంది విగ్రహాన్ని మార్చి, దానిస్థానంలో రాతితో చెక్కించి నంది విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు. కీసరగుట్ట జాతర సందర్భంగా పార్కింగ్ ఇబ్బందులు ఏర్పడకుండా స్థలాన్ని గుర్తించాలని తహసీల్దార్ నాగరాజుకు సూచించారు. జెడ్పీ వైస్చైర్మన్ బెస్త వెంకటేష్, డీఆర్డీఏ పీఓ కౌటిల్యారెడ్డి, సీపీఓ సౌమ్య, ఎంపీపీ ఇందిర వైస్ ఎంపీపీ సత్తిరెడ్డి, ఆలయ చైర్మన్ తటాకం నారాయణశర్మ, సర్పంచ్ మాధురి, ఉపసర్పంచ్ కందాడి బాలమణి పాల్గొన్నారు. -
ప్లాస్టిక్ బాటిళ్లతో అందమైన గార్డెన్
మిడ్నాపూర్ : పశ్చిమబెంగాల్లోని మిడ్నాపూర్ డివిజన్ పరిధిలోని పిరకాట రేంజ్కు చెందిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పాపన్ మొహంత ప్లాస్టిక్ సీసాలు, రబ్బరు టైర్లను ఉపయోగించి అందమైన గార్డెన్ను సృష్టించారు. నాలుగేళ్లుగా ఎంతో కష్టపడి ఈ గార్డెన్ను తయారు చేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రతిరోజు యధావిధిగా తన విధులను ముగించుకున్న తర్వాత పిరాటక రేంజ్లో ఉన్న ఖాళీ స్థలంలోనే గార్డెన్ పెంపకాన్ని చేపట్టినట్లు మొహంత తెలిపారు. ''తాను మొదటిసారి పోస్టింగ్పై పిరాటక రేంజ్కు వచ్చినప్పుడు ఈ ప్రాంతం మొత్తం వ్యర్థాలతో నిండిపోవడం చూశాను. ఎలాగైనా దీన్ని ఒక అందమైన ప్రదేశంగా తయారు చేయాలని నిశ్చయించుకున్నాను. మొత్తం 1100 ప్లాస్టిక్ బాటిళ్లు, పాడైపోయిన రబ్బర్ ట్యూబ్లతో గార్డెన్ను తయారు చేశాను. గార్డెన్ను సందర్శించిన వారు అభినందించడం తన కష్టాన్ని మరిచిపోయేలా చేసిందని'' మెహంతా చెప్పుకొచ్చారు. గార్డెన్లో రకరకాల సీజనల్ పూల మొక్కల్ని ఏర్పాటు చేసినట్లు మెహంతా తెలిపారు. దీన్ని సందర్శించిన సమీపంలోని పాఠశాలలు, సీఆర్పీఎఫ్ జవాన్లు ఇదే తరహాలో గార్డెన్లు ఏర్పాటు చేయడం తనకు సంతోషాన్ని కలిగించిందని ఆనందం వ్యక్తం చేశారు. ‘భవిష్యత్తులో భుమికి ఎలాంటి ప్రమాదం జరగకుండా ప్లాస్టిక్ ఉత్పత్తుల్ని ఉపయోగించి ఇలాంటి కార్యక్రమాలను చేపడితే కొంతవరకైనా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు. తాను చేసిన ఈ ప్రయత్నాన్ని సామాజిక బాధ్యతతో పాఠశాలు, ఇతర మార్గాల ద్వారా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాను’ అని మొహంత తెలిపారు. -
కొల్లేరు ప్రక్షాళనకు రెడీ
ఏలూరు రూరల్ : టీడీపీ నేతల కబంధ హస్తాల నుంచి కొల్లేరు మరోసారి విముక్తి కానుంది. కొద్దిరోజుల్లో అటవీశాఖ అధికారులు కొల్లేరు ప్రక్షాళన చేపట్టబోతున్నారు. ఇందుకోసం అభయారణ్యంలో 8,800 ఎకరాల విస్తీర్ణంలో అక్రమ చెరువులు గుర్తించారు. ఉన్నతధికారులు ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఇన్చార్జి డీఎఫ్ఓ అనంత్శంకర్ క్షేత్రస్థాయిలో పర్యటించి అక్రమ చెరువులను గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక ఎమ్మెల్యేల అనుచరుల పేదల పేరుతో అభయారణ్యంలో పెద్ద ఎత్తున అక్రమ చెరువులు తవ్వారు. చేపలు, రొయ్యల సాగు చేసే బినామీలకు లీజుకు కట్టబెట్టారు. ఐదేళ్లలో కోట్ల రూపాయలు దండుకున్నారు. అడ్డుచెప్పిన అటవీశాఖ అధికారులను దూషించారు. ప్రశ్నించిన అటవీశాఖ అధికారులను బదిలీ చేశారు. యథేచ్ఛగా సాగిన అక్రమాలతో టీడీపీ నాయకులు కోట్ల రూపాయలకు పడగలెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో టీడీపీ నేతలంతా తమ అక్రమ సంపాదనకు గండి పడుతుందని భయపడుతున్నారు. 10 గ్రామాల పరిధిలో భారీగా అక్రమ చెరువులు కొల్లేరు అభయారణ్యం పరిధిలో ఏలూరు, పెదపాడు, నిడమర్రు, భీమడోలు తదితర ప్రాంతాల్లోని సుమారు 10 గ్రామాల పరిధిలో వేలాది ఎకరాల్లో అక్రమ చెరువులు వెలసినట్టు అ«టవీశాఖ అధికారులు గుర్తించారు. ఇందులో 4,403 ఎకరాలు అభయారణ్యంలో తవ్వగా మరో 4,396 ఎకరాల చెరువులు జిరాయితీ భూముల్లో తవ్వినట్టు అధికారులు గుర్తించారు. ఆక్రమణల ఇలా.. మొండికోడు డ్రెయిన్ పరిసరాల్లో సుమారు 100 ఎకరాలకు పైగా పెద్ద ఎత్తున చెరువులు తవ్వారు. ఈ చెరువులను మాజీ సర్పంచ్లతో పాటు గ్రామ టీడీపీ నాయకులు వంతులు వేసుకుని చేపలు, రొయ్యలు సాగు చేస్తున్నారు. ఏలూరు మండలం కలకుర్రు గ్రామంలో 100 ఎకరాల విస్తీర్ణంలో చేపల చెరువు తవ్వకాలు జరిగాయి. కొట్టేసిన వందలాది ఎకరాలు చేపల చెరువులు నేడు మళ్లీ పూర్వస్థితికి చేరుకున్నారు. కాంటూరు దిగువన కొల్లేరులో వెలసిన ఈ గ్రామానికి చుట్టుపక్కల ఒక్క సెంటు రెవెన్యూ భూమి లేకపోయినప్పటికీ పెద్ద ఎత్తున అక్రమ చెరువులు వెలిశాయి. జాలిపూడి, మాదవాపురం రెవెన్యూ ప్రాంతాల మధ్య గతంలో కొట్టేసిన 200 ఎకరాలల్లో సొసైటీ చెరువును టీడీపీ నాయకులు తవ్వారు. ఈ విషయం బయటకు పొక్కడంతో మిన్నకుండిపోయారు. ఈ ప్రాంతానికి పొక్లెయిన్లు, బుల్డోజర్లు తరలించేందుకు ఇప్పటికే రోడ్డు ఏర్పాటు చేసుకున్నారు. గండ్లను పూడ్చేసి సాగు శ్రీపర్రు ఊరు వెనుక అభయారణ్యంలో గతంలో అధికారులు కొట్టేసిన చెరువుల గండ్లను కొందరు వ్యక్తులు పూడ్చేశారు. వందల ఎకరాల విస్త్రీర్ణంలో ఉన్న ఈ చెరువుల్లో పెద్ద సంఖ్యలో చేపలు, రొయ్యల సాగు జరుగుతోంది. కోట్ల రూపాయలు విలువ చేసే చేపలు, రొయ్యలను టీడీపీ అనుయాయులు ఎగుమతి చేస్తున్నారు. జైపురం శివారున అభయారణ్య పరిధిలో 50 ఎకరాల విస్తీర్ణంలో పాత చెరువులకు గట్లు వేసి సాగు చేస్తున్నారు. ప్రత్తికోళ్లలంక, పెదయాగనమిల్లి, కోమటిలంక, కలకుర్రు, పైడిచింతపాడు తదితర గ్రామాల సమీపంలో సైతం కొల్లేరులో గుట్టుచప్పుడు కాకుండా అక్రమ చెరువులు వెలిశాయి. ఈ చెరువులకు వేలం పాట నిర్వహించి టీడీపీ నాయకులు ఏటా కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. 8 వేల ఎకరాల్లో అక్రమ చెరువులు అభయారణ్యాన్ని సంరక్షించాల్సిన బాధ్యత మాపై ఉంది. కొల్లేరు పరిధిలో అక్రమ చెరువులపై నివేదికను తయారు చేశాం. వేలాది ఎకరాల్లో అక్రమ చెరువులు గుర్తించాం. గత మూడేళ్ల నుంచి వీటిలో చేపలు, రొయ్య ల సాగు జరుగుతోంది. సుమారు 8,000 వేలకు పైగా జిరాయితీ, అభయారణ్యంలో చెరువులు తవ్వినట్టు తెలుస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు చేపడతాం. – బి.రమణప్రసాద్, ఏలూరు రేంజర్ -
నా ప్రాణాలకు రక్షణ కల్పించండి: అనిత
హైదరాబాద్: మళ్లీ విధులకు వెళితే తన ప్రాణాలకు రక్షణ ఉండదని, ప్రభుత్వం రక్షణ కల్పించాలని సిర్పూర్ కాగజ్నగర్ ఘటనలో గాయపడిన ఎఫ్ఆర్వో అనిత కోరారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె సోమవారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాలను అమలు చేసేందుకు మాత్రమే అక్కడికి వెళ్లానని, 4 రోజుల ముందే గ్రామస్తులతో సమావేశం నిర్వహించి స్పష్టంగా చెప్పిన తర్వాత పొలంలోకి వెళ్లామని చెప్పారు. తాము మొక్కలు నాటే పనులు చేస్తుండగా జెడ్పీ వైస్ చైర్మన్ కృష్ణతోపాటు మిగతావారు వచ్చి తనను చుట్టుముట్టి కొట్టారని చెప్పారు. ఎంత వేడుకున్నా వినకుండా దాడి చేశారన్నారు. ఇక్కడ రాజకీయ నాయకులు గ్రామస్తులను రెచ్చగొట్టడం, అధికారులపై దాడులకు ఉసిగొల్పడం చేస్తుంటారని, గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయని చెప్పారు. దాడి చేసిన వారిపై ఏదో ఒక కేసు పెడితే మళ్లీ రాజకీయ బలంతో బయటకు వస్తారని, అప్పుడు తన ప్రాణాలకు రక్షణ ఉండదని భయాందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వీరిపై చర్యలు తీసుకుని తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరారు. -
ఆత్మరక్షణకు ఆయుధాలివ్వండి..!
సాక్షి, హైదరాబాద్: ‘మాకు రక్షణ ఏర్పాట్లు చేయకపోతే అడవుల్లోకి వెళ్లలేం. మాపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో అడవుల సంరక్షణ బాధ్యతలు చేపట్టలేం. అడవుల్లో స్థానికంగా రాజకీయ జోక్యం పెరుగుతోంది. పోలీసు, రెవెన్యూ శాఖలు సహకరించడం లేదు. మమ్మల్ని మేము రక్షించుకునేందుకు అధికారులు, సిబ్బంది వద్ద ఆయుధాలు కూడా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. మా రక్షణకు ప్రభుత్వపరంగా స్పష్టమైన హామీ ఇవ్వకపోతే ఇకముందు విధుల నిర్వహణ కష్టమవుతుంది..’అని రాష్ట్ర ప్రభుత్వానికి ఐఎఫ్ఎస్ స్థాయి మొదలుకుని వివిధ స్థాయిల్లోని అటవీ అధికారులు విజ్ఞప్తి చేశారు. తాజాగా కాగజ్నగర్లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనితపై దాడి జరిగిన నేపథ్యంలో తమపై దాడులు జరగకుండా నిరోధించాలని, బాధ్యులపై పీడీయాక్ట్ పెట్టాలని, ఈ దాడి వెనక రాజకీయంగా ఎవరున్నారో తేల్చి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అటవీ కేసులను త్వరితంగా పరిష్కరించేందుకు వీలుగా ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం అరణ్యభవన్లో ఐఎఫ్ఎస్ స్టేట్ ఫారెస్ట్ సర్వీస్, రేంజ్ ఆఫీసర్స్, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్, తదితర సంఘాల నేతలు సమావేశమై కాగ జ్నగర్ దాడి పరిణామాల నేపథ్యంలో సర్కార్ నుంచి అన్నివిధాలా సహకారం అందించాలని పీసీసీఎఫ్ పీకే ఝాకు వినతిపత్రాన్ని సమర్పించాయి. అధికారులు, సిబ్బంది అధైర్యపడొద్దని, శాఖాపరంగా అన్నివిధాలా మద్దతుగా నిలుస్తామని, ప్రభు త్వపరంగా పూర్తి సహాయ సహకారాలు అందించేలా చర్యలు తీసుకుంటామని పీకే ఝా పేర్కొన్నట్టు సమాచారం. అటవీ సిబ్బంది ప్రభుత్వ నిబంధనల ప్రకారమే హరితహారంలో భాగంగా ప్రత్యామ్నాయ అటవీ పెంపకం చేస్తున్నట్టు సమావేశంలో వివిధ స్థాయిల అధికారులు పేర్కొన్నారు. అటవీ భూములను ఆక్రమించటమే కాకుండా తమపైనే దాడికి దిగుతున్న వారిపై ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలని, వేగంగా విచారణ చేయటంతో పాటు చట్ట ప్రకారం నిందితులను శిక్షించాలని కోరా రు. సమావేశంలో ఐఎఫ్ఎస్ అధికారుల సంఘం అధ్యక్షుడు పి.రఘువీర్, వైస్ ప్రెసిడెంట్ మునీంద్ర, సెక్రటరీ లోకేష్ జైస్వాల్, జాయింట్ సెక్రటరీ స్వర్గం శ్రీనివాస్, స్టేట్ ఫారెస్ట్ సర్వీస్ అసోసియేషన్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల అసోసియేషన్, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ల అసోసియేషన్ ప్రతినిధులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అడవుల్లోని పరిస్థితులపై సర్కార్కు నివేదిక.. కాగజ్నగర్ ఘటన నేపథ్యంలో అడవుల్లో చోటు చేసుకుంటున్న పరిస్థితులు, అధికారులు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు, ఇతరత్రా అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి పీసీసీఎఫ్ పీకే ఝా నివేదిక సమర్పించినట్టు సమాచా రం. ప్రస్తుతం వర్షాల సీజన్ మొదలవుతుండటం తో అటవీ ఆక్రమణలు వేగం పుంజుకుంటున్నాయని, కొత్తగా పెరుగుతున్న ఆక్రమణలను అరికట్టే క్రమంలో దాడులు పెరుగుతున్నాయని అటవీ శాఖ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. కొత్తగా అటవీభూమిని సాగులోకి తెచ్చేందుకు దున్నడం, ఇతర పొలం పనులు మొదలుపెట్టి దానిని కొన్నేళ్లుగా సాగు చేస్తున్నట్టుగా చూపే యత్నం జరుగుతోందని, రాజకీయ నేతల జోక్యం పెరగడంతో, స్థానిక స్థాయిల్లో వారి అండతో అనుచరుల దాడులు పెరిగాయని పేర్కొన్నట్టు తెలిసింది. అడవుల్లో హరితహారం, ప్రత్యామ్నాయ అడవుల పెంపకం వంటి కార్యక్రమాలకు వీరి నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించినట్టు సమాచారం. అటవీ ఆక్రమణలు బాగా పెరుగుతు న్నాయని వరంగల్ రూరల్ జిల్లాలో అత్యధికంగా 85 శాతం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో 27 శాతం, ఆదిలాబాద్ జిల్లాలో 21 శాతం, భద్రాద్రి కొత్తగూడెంలో 18 శాతం, కొమురం భీం జిల్లాలో 15 శాతం ఆక్రమణలు చోటుచేసుకున్నట్టు ప్రభు త్వం దృష్టికి తెచ్చినట్టు సమాచారం. -
మహిళా ఎఫ్ఆర్వోపై దాడి.. స్పందించిన కేటీఆర్
-
ఎఫ్ఆర్వోపై దాడిని ఖండించిన జీవన్ రెడ్డి
-
మహిళా ఎఫ్ఆర్వోపై దాడి.. స్పందించిన కేటీఆర్
హైదరాబాద్ : సిర్పూర్ కాగజ్నగర్లో అటవీశాఖ అధికారిణి అనితపై జరిగిన దాడిపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మహిళా అధికారిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు కేటీఆర్ ట్విటర్లో పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఉన్న మహిళ అధికారిపై దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు, జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణ వ్యవహార శైలిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని కేటీఆర్ స్పష్టం చేశారు. కోనేరు కృష్ణపై కేసు నమోదయిందని.. పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారని తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై సీఎం కేసీఆర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటపై సమగ్ర విచారణ జరిపించాలని సీఎం అధికారులను ఆదేశించారు. కాగా, ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం కొత్త సారసాల గ్రామంలో విధి నిర్వహణలో ఉన్న మహిళా అధికారిపై కోనేరు కృష్ణ తన అనుచరులతో కలిసి దాడికి తెగబడిన సంగతి తెలిసిందే. ఈ దాడిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి : మహిళా ఎఫ్ఆర్వోపై ఎమ్మెల్యే సోదరుడి దాడి.! నేను బతుకుతానని అనుకోలేదు: ఎఫ్ఆర్వో అనిత -
ఎఫ్ఆర్వోపై దాడి సీఎం కేసీఆర్ ఆగ్రహం
-
కోనేరు కృష్ణ తీరుపై సీఎం కేసీఆర్ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్ : విధి నిర్వహణలో ఉన్న మహిళా అటవీశాఖ అధికారిణిపై దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యే సోదరుడు, జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణ వ్యవహార శైలిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి సమగ్ర విచారణ జరిపించాలని ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే భవిష్యత్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని టీఆర్ఎస్ నాయకత్వం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. చదవండి: నేను బతుకుతానని అనుకోలేదు: ఎఫ్ఆర్వో అనిత కాగా ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం కొత్త సారసాల గ్రామంలో అటవీ శాఖ అధికారులపై తన అనుచరులతో హంగామా సృష్టించి, దాడికి పాల్పడ్డ కోనేరు కృష్ణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఆదివారం మధ్యాహ్నం జెడ్పీ వైస్ చైర్మన్, జడ్పీటీసీ పదవికి రాజీనామా చేశారు. కోనేరు కృష్ణ తన రాజీనామా లేఖను జిల్లా కలెక్టర్కు పంపించారు. అయితే పార్టీ ఆదేశాల మేరకు ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కాగా ఎఫ్ఆర్వో అనితపై దాడి చేసిన కేసులో కోనేరు కృష్ణ సహా 16మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి 30మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. చదవండి: మహిళా ఎఫ్ఆర్వోపై ఎమ్మెల్యే సోదరుడి దాడి.! దాడి ఘటన ఖండించిన మంత్రి అల్లోల మరోవైపు అధికారులపై జరిగిన దాడిని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సంఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ.. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలే తప్ప, భౌతిక దాడులకు పాల్పడటం సరికాదని అన్నారు. అలాగే అటవీశాఖ సిబ్బందిపై దాడిని ఐఎఫ్ఎస్ అధికారుల సంఘం ఖండించింది. విధి నిర్వహణలో ఉన్న వారిని అడ్డుకోవడం, మహిళా అధికారిని తీవ్రంగా గాయపరచడం తీవ్రమైన చర్య అని, బాధ్యులపై వెంటన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. -
ఎఫ్ఆర్వోపై దాడి కోనేరు కృష్ణపై కేసు నమోదు
-
ఎఫ్ఆర్వోపై దాడిని ఖండించిన జీవన్ రెడ్డి
కాగజ్నగర్ : సిర్పుర్ కాగజ్నగర్లో అటవీశాఖ అధికారిణిపై ఆదివారం ఉదయం జరిగిన దాడిని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం పోడు భూముల్లో చెట్లను నాటాలని అదేశించి.. ఎమ్మెల్యే అనుచరులతో అధికారులపై దాడి చేయించడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. 2008- 2009లో అప్పటి కేంద్ర ప్రభుత్వం పోడు భూమూలపై గిరిజనులకు పూర్తి అధికారాలు ఇచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడు గిరిజనలను బలవంతంగా వారికి కేటాయించిన పోడు భూముల నుంచి వెళ్లగొట్టటం దురదృష్టకరమంటూ మండిపడ్డారు. ఎఫ్ఆర్వో అనితపై కాగజ్నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కోనేరు కృష్ణ దాడిని ఖండిస్తున్నామని, పోడు భూముల రక్షణకు స్థానిక ఎమ్మల్యే బాధ్యతలు తీసుకోవాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. పోడు భూములను గిరిజనుల నుంచి లాక్కునే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం సరికాదన్నారు. -
నేను బతుకుతానని అనుకోలేదు: ఎఫ్ఆర్వో అనిత
సాక్షి, సిర్పూర్ కాగజ్ నగర్ : ఎఫ్ఆర్వో అనితపై దాడికి తెగబడ్డ ఘటనలో ఎమ్మెల్యే సోదరుడు కోనేరు కృష్ణ సహా 16మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిపై 147,148, 207,332,353,427 సెక్షన్ల కింద ఈజ్గామ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. కాగా దాడిలో గాయపడ్డ మహిళా అధికారిణి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘కోనేరు కృష్ణ మొదటగా నాపై దాడికి పాల్పడ్డారు. తర్వాత మరో 10మంది కోనేరు కృష్ణ అనుచరులు కర్రలతో నా తలపై కొట్టారు. ఆ క్షణంలో నేను బతుకుతానని అనుకోలేదు.’ అని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా సిర్పూర్ కాగజ్నగర్ ప్రాంతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ప్రత్యామ్నాయ అటవీకరణ పనులు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాంతో కాగజ్నగర్ అటవీ ప్రాంతంలోని సార్సాలా గ్రామంలో 20 హెక్టార్లలో చెట్లు నాటేందుకు అటవీ అధికారులు సిద్ధమయ్యారు. చెట్లు నాటేందుకు వీలుగా భూమిని చదును చేసేందుకు ట్రాక్టర్లు, సిబ్బందితో కలిసి ఆదివారం ఉదయం అక్కడికి చేరుకున్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని సిర్పూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు, జెడ్పీ వైఎస్ చైర్మన్ కృష్ణ తన అనుచరులతో అడ్డుకోవడమే కాకుండా అటవీ శాఖ అధికారులపై దాడికి తెగబడ్డారు. -
లంచం ఇవ్వలేదని స్క్వాడ్కు సమాచారం
కర్నూలు, ఆదోని: ఎవరు తవ్వుకున్న గుంతలో వారే పడతారంటే ఇదేనేమో. లంచం ఇవ్వలేదని బొగ్గుల వ్యాపారిని అక్రమ వ్యాపారం కేసులో ఇరికించిన ఆదోని ఫారెస్ట్ రేంజర్ వెంకటసుబ్బుడు చివరకు అయనే ఏసీబీకి చిక్కి కటకటాల పాలయ్యాడు. సోమవారం పట్టణ శివారులోని రాంజల రోడ్డులోని ఫారెస్ట్ రేంజర్ కార్యాలయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ జయరామరాజు, బాధితుడు నాగార్జున రెడ్డి తెలిపిన సమాచారం మేరకు వివరాలు.. పత్తికొండకు చెందిన నాగార్జున రెడ్డి 2018 నవంబరులో బొగ్గుల బట్టీ లైసెన్స్ కోసం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసరు వెంకటసుబ్బుడికి దరఖాస్తు చేసుకున్నాడు. ఇందుకు ఆయన రూ.30,000 లంచం డిమాండ్ చేయడంతో ఇచ్చేందుకు నిరాకరించాడు. దీంతో సదరు అధికారి ఆ వ్యాపారికి లైసెన్స్ జారీకి సిఫారసు చేయకుండా కాలయాపన చేశారు. వేలరూపాయలు ఖర్చు పెట్టి బొగ్గుల బట్టీ సిద్ధం చేసుకున్నానని, జాప్యంతో తాను చాలా ఇబ్బంది పడుతున్నానని దరఖాస్తు దారుడు మొరపెట్టుకున్నా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కరుణించకపోగా అతడిని ఎలాగైనా ఇరికించాలని లైసెన్స్ లేకుండానే వ్యాపారం చేసుకోమని ఉచిత సలహా ఇచ్చాడు. ఎవరైనా పట్టుకుంటే దరఖాస్తు చేసుకున్నట్లు రసీదు చూపించాలని సూచించాడు. లంచం ఇవ్వని తనపై ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కుట్ర చేశాడనే విషయం తెలియక నాగార్జున రెడ్డి బొగ్గుల బట్టీ ప్రారంభించాడు. తర్వాత అదే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసరు.. ఫారెస్ట్ స్క్వాడ్ అధికారులకు ఉప్పందించడంతో వారు రెండు నెలల క్రితం పట్టుకుని నాగార్జునరెడ్డికి రూ.2,75,000 భారీ జరిమానా విధించారు. రివెంజ్ ఇలా .. లంచం ఇవ్వకపోవడంతోనే ఫారెస్ట్ రేంజ్ అధికారి అక్రమ వ్యాపారం కేసులో ఇరికించారని తెలుసుకున్న నాగార్జున రెడ్డి తిరిగి ఆయన వద్దకెళ్లాడు. నేను చెప్పినట్లు నడుచుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదంటూ మళ్లీ లంచం అంశాన్ని సదరు అధికారి గుర్తు చేశాడు. ఇందుకు వ్యాపారి అంగీకరించి మొదట రూ.16,000 ఇస్తానని, లైసెన్స్ చేతికి అందిన తరువాత మిగిలిన మొత్తం ఇస్తానని నమ్మించాడు. ఆదివారం కర్నూలు వెళ్లి సదరు అధికారి లంచం డిమాండ్ చేస్తున్న విషయం ఏసీబీ అధికారులకు చెప్పడంతో వారు కొన్ని నోట్లు ఇచ్చారు. వాటిని తన నోట్లలో కలుపుకుని సోమవారం పట్టణ శివారులోని ఫారెస్ట్రేంజ్ కార్యాలయంలో వెంకటసుబ్బుడి చేతికి ఇచ్చారు. సమీపంలోనే మాటు వేసిన ఏసీబీ అధికారులు వెంటనే వచ్చి రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. తాను లంచం డిమాండ్ చేయలేదని బుకాయించేందుకు యత్నించగా లైసెన్స్ జారీని ఎందుకు పెండింగ్లో పెట్టారన్న ఏసీబీ డీఎస్పీ ప్రశ్నకు నీళ్లు నమిలాడు. తర్వాత ఆదోనిలోని మండగిరిలో ఉన్న నిందితుడి ఇంట్లో సోదాలు నిర్వహించారు. సోదాలు పూర్తయ్యాక వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ అధికారి వెల్లడించారు. కర్నూలులో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు కర్నూలు: ఆదోని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వెంకటసుబ్బుడు నివాసం ఉంటున్న కర్నూలు అర్బన్ పరిధిలోని ముజాఫర్నగర్లో ఏసీబీ సీఐలు శ్రీధర్, గౌతమి ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఇంట్లో రూ.55వేల నగదు, ఇళ్లకు సంబంధించిన మూడు డాక్యుమెంట్లు, బ్యాంకు పాస్ బుక్కులు, ఇన్సూరెన్స్ కాగితాలు, ఏటీఎం కార్డులు, 330 గ్రాముల బంగారు ఆభరణాలు బయటపడినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం కర్నూలులోని ఏసీబీ కోర్టులో వెంకటసుబ్బుడును హాజరు పరచనున్నట్లు తెలిపారు. -
మూగవేదన
అచ్చంపేట: పెద్ద పులుల సంరక్షణ ప్రాంతమైన నల్లమలలో వన్యప్రాణులు తాగునీటికి అల్లాడుతున్నాయి. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాజెక్టులో నీటి వనరులు వట్టిపోయాయి. ఐదేళ్లుగా నల్లమలలో సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. దీంతో నీటివసతి ఉన్న ప్రాంతాలకు వన్యప్రాణులు వస్తున్నాయి. పంట పొలాలు, బోరు బావులు, చెరువుల వద్దకు వస్తున్నాయి. ప్రతి ఏటా ఏప్రిల్, మే నెలలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండేది. ఈసారి నెల రోజుల ముందే ఎండలు ఎక్కువగా ఉండడంతో సమస్య మరింత ఉత్పనమైంది. అభయారణ్య ప్రాంతంలోని వన్యప్రాణులకు ఎండకాలంలో తాగునీటి సమస్య తీర్చేందుకు అటవీశాఖ ప్రతి ఏటా రూ.లక్షల నిధులు ఖర్చు చేస్తోంది. ఈ నిధులతో వన్యప్రాణుల దాహార్తి తీరుస్తున్నామని బాహాటంగా చెబుతున్నా.. వాటికి నీరు అందడం లేదు. అటవీశాఖ పూర్తిస్థాయిలో వన్యప్రాణులకు నీటి వసతి కల్పిస్తే నీటి కోసం గ్రామాల వైపు జంతువులు ఎందుకు వస్తాయన్న భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జంతువులు సాధారణంగా ఆహార అన్వేషణలో భాగంగా 4కి.మీ. పరిధిలో తిరుగుతాయి. నల్లమలను అనుసరించి 140 కి.మీ. పరిధిలో కృష్ణానది ప్రవహిస్తుంది. అటవీ ప్రాంతంలో నిరంతరం నీళ్లు ఉండే సహజ జల వనరుల దగ్గర ఎక్కువగా ఉంటాయి. అటవీ సరిహద్దు గ్రామాలైన మన్ననూర్, మద్దిమడుగు, బాణాల, బిల్లకల్లు, లక్ష్మిపల్లి, అప్పాయిపల్లి, ఎర్రపెంట, చెన్నంపల్లి, వట్టువర్లపల్లి, సార్లపల్లి, కుడి చింతలబైలు, ఉడిమిళ్ల, తిర్మలాపూర్(బీకే) తదితర గ్రామాల్లో వ్యవసాయ పొ లాల్లో ఉండే బోర్ల వద్దకు దుప్పులు, ఎలుగుబంట్లు వస్తున్నట్లు గ్రామస్తులు తెలిపా రు. బల్మూర్ మండలం బిల్లకల్లు అటవీ ప్రాంతంలోని రుసుల చెరువులో మాత్ర మే కొద్దిగా నీరు ఉంది. అత్యధికం గా వన్యప్రాణులు అక్కడి వస్తుంటాయి. వేసవిలో వన్యప్రాణులకు తాగునీటి వసతి ఏర్పాటు చేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు ఆర్భాటంగా ప్రకటించుకోవడమే తప్ప ఎక్కడ కూడా అమలు చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. అటవీశాఖ చెబుతున్న ఏర్పాట్లు ఇవే.. వన్యప్రాణుల తాగునీటి సమస్య అధిగమించడానికి గతంలో అటవీశాఖ నల్లమ ల ప్రాంతంలో 36 సాసర్లు ఏర్పాటు చేశా రు. వన్యప్రాణులు, జీవరాశులు సంచరించే ప్రాంతాల్లో గతేడాది 428 సాసర్లు నిర్మించడంతో పాటు పాతవాటికి కూడా మరమ్మతులు చేపట్టారు. వీటిని అత్యధికంగా రోడ్డు, వాహనాలు వెళ్లగలిగే ప్రాం తాల్లో నిర్మించారే గానీ లోతట్టు ప్రాం తంలో ఏర్పాటు చేయడం లేదు. వీటితో చాలా వరకు ప్రయోజనం తక్కువగా ఉం టుంది. అత్యధికంగా ఇవి పర్హాబాద్ నుం చి వ్యూపాయింట్, అప్పాపూర్, మల్లాపూ ర్, భౌరాపూర్, రాంపూర్, మేడిమల్కల రోడ్డు మార్గంలో ఉన్నాయి. పర్హాబాద్ వ ద్ద ఏర్పాటు చేసిన సోలార్ డిఫ్వెల్ పం పింగ్ సిస్టమ్తో ట్యాంకర్కు నీటిని నింపి వన్యప్రాణులకు తాగునీటి వసతి కల్పిం చాలి. రోజుకు ఒక ట్యాంకరు ద్వారా నీటి సరఫరా చేస్తున్నాం అని అటవీ శాఖ అ«ధికారులకు చెబుతున్నా.. రెండు, మూడు రోజులకు ఒకసారి కూడా వెళ్లడం లేదు. ట్యాంకర్ల ద్వారా అటవీ జంతులవుల దాహార్తి తీరుస్తున్నామని అటవీ శాఖ లెక్కలు చెబుతున్నాయి గానీ అదీ ఆచరణంలో సక్రమంగా అమలు కావడం లేదు. అత్యధికంగా వన్యప్రాణులు తిరిగే ప్రదేశమైన పిచ్చకుంట్ల చెరువు, రాళ్లవాగు, గుడేశ్వరం, తాళ్లచెరువు నీళ్లులేక ఎండిపోయాయి. లోతట్టు అటవీ ప్రాంతంలో సాసర్ల ఏర్పాటు లేకపోవడంతో అక్కడ తాగునీరు లేక వన్యప్రాణులు బయటికి వస్తున్నాయి. సాసర్లలో నీటిని పోయిస్తున్నాం.. జంతువులకు నీటికి ఇబ్బంది లేదు. నారాయణపేట, మహబూబ్నగర్ జిల్లా పరిధిలో ఉన్న అడవుల్లో 71 సాసర్లు, నాలుగు సోలార్ పంపులు ఏర్పాటు చేశాం. ట్రాక్టర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నాం. ఉమ్మడి జిల్లాలోని అభయారణ్య ప్రాంతంలో అటవీశాఖ తరుఫున జంతువుల కోసం సాసర్లలో నీటిని పోయిస్తున్నాం. – గంగారెడ్డి, డీఎఫ్ఓ, మహబూబ్నగర్ -
ఒంటరిగా తిరగొద్దు.. చిరుత సంచరిస్తోంది
సాక్షి, యాచారం: అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తుంది. జాగ్రత్తగా ఉండాలని ఇబ్రహీంపట్నం డివిజన్ అటవీ శాఖ రేంజ్ అధికారి సత్యనారాయణ ప్రజలకు సూచించారు. కొత్తపల్లి గ్రామంలో పక్షం రోజుల క్రితం చిరుత దాడిలో మృతిచెందిన ఆవుదూడకు సంబంధించి రూ. 6 వేల పరిహారాన్ని రైతు ఈగ శ్రీనువాస్రెడ్డికి అధికారి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... యాచారం, మాడ్గుల, ఆమనగల్లు, కడ్తాల్ మండలాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తున్నట్లు తెలిపారు. అటవీ ప్రాంతం సమీప గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాత్రి సమయాల్లో ఒంటరిగా అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని, పగలు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అటవీ ప్రాంతంలో పలు చోట్ల బోన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో చిరుతను పట్టుకుంటామన్నారు. కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ జగన్, గ్రామస్తులు గుండాలు తదితరులు పాల్గొన్నారు. -
మాజీ ఎమ్మెల్యే హల్చల్
పందిరిపల్లిగూడెం (కైకలూరు): ఎన్నికలు తరుముకొస్తున్న వేళ ఏ చిన్న అవకాశాన్ని అధికార పార్టీ నాయకులు వదలడం లేదు. ప్రజలను ఆకట్టుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. అటవీ శాఖ నిబంధనలకు కొల్లేరు గ్రామాల్లో తూట్లు పొడుస్తున్నారు. నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ మరోసారి ‘చింతమనేని’ అవతారం ఎత్తారు. మహిళా అధికారి అని కూడా చూడకుండా ఫోన్లో రేంజర్ను ఇష్టానుసారం తిట్టారు. కొల్లేరు నాయకులతో అటవీ సిబ్బందిని నిర్బంధించారు. దీంతో కొల్లేరు పెద్దింట్లమ్మ దర్శనానికి వచ్చే యాత్రికులు గంటల తరబడి ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు. వివరాల్లోకి వెళితే పందిరిపల్లిగూడెం నుంచి కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం వరకు రోడ్డును ఆర్అండ్బీ అ«ధికారులు నిర్మించడానికి గ్రావెల్ తోలారు. బుధవారం కొల్లేరు పరిశీలనకు వచ్చిన అటవీ శాఖ డీఎఫ్వో అనంత్శంకర్, రేంజర్ విజయ కొల్లేరు అభయారణ్య పరిధిలో అటవీ శాఖ అనుమతి లేకుండా రోడ్డు ఎలా నిర్మిస్తారని, పనులను అడ్డుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. దీంతో గురువారం పనులను అటవీ శాఖ సిబ్బంది అడ్డుకున్నారు. జయమంగళ హల్చల్.. పెద్దింట్లమ్మ దేవస్థానానికి వచ్చే భక్తుల కోసం రోడ్డును వేస్తుంటే ఫారెస్టు అధికారులు అడ్డుకోవడం ఎంటీ? అని మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ రెచ్చిపోయారు. పెద్దింట్లమ్మ దర్శనానికి పార్టీ నాయకులతో వచ్చిన ఆయన దారిలో అటవీ సిబ్బందిని నిర్బంధించారు. ఫారెస్టు రేంజర్ విజయతో ఫోన్లో ఇష్టానుసారం మాట్లాడారు. ముందుగా రోడ్డు ఏర్పాటుకు అటవీ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలని చెప్పినా ఆమె మాట వినలేదు. చివరకు రేంజర్.. జయమంగళకు ఘాటుగా సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో దేవస్థానానికి చేరే భక్తులు గంటల తరబడి ఎండలో ఇబ్బందులు పడ్డారు. చివరకు సీఐ రవికుమార్ వచ్చి భక్తులకు దారి ఇవ్వాలని చెప్పారు. ఆర్అండ్బీ సిబ్బంది ఎట్టకేలకు రోడ్డు వేయడానికి దించిన మెటీరియల్ను వెనక్కు తీసుకువెళ్ళారు. అనుమతులు తీసుకోవాలి.. కొల్లేరు అభయారణ్యంలో వేలాది ఎకరాల్లో అక్రమ చేపల చెరువులను అడ్డగోలుగా తవ్వితే పట్టించుకోని అటవీ శాఖ అధికారులు భక్తులకు అవసరమైన రోడ్డు నిర్మాణంలో ఆంక్షలు విధించడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. అయితే, అటవీ అధికారులు మాత్రం నిబంధనల ప్రకారం ముందుగా తమకు దరఖాస్తు చేసుకోవాలంటున్నారు. పందిరిపల్లిగూడెం రోడ్డు పక్కా అభయారణ్యంలో ఉందని స్పష్టం చేస్తున్నారు. -
అడవిని కాపాడాల్సిందే!
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: ‘‘జంగిల్ బచావో, జంగిల్ బడావో అనే నినాదంతో అధికార యంత్రాంగం ముందుకు సాగాలి. ఓ వైపు చెట్లు పెంచడం కోసం హరితహారం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ, మరోవైపు అడవులు అంతరించి పోతుంటే చూస్తూ కూర్చోవడం వల్ల లాభం లేదు. అడవిని కాపాడకుంటే హరితహారం లాంటి ఎన్ని కార్యక్రమాలు అమలు చేసినా, ఫలితం రాదు. అడవిని కాపాడే విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలి. ఇందుకోసం పోలీసులు, అటవీశాఖ అధికారులు కలిసి పనిచేయాలి. అటవీశాఖకు సాయుధ పోలీసులు అండగా నిలుస్తారు. అడవులును నరికే వారిని, స్మగ్లింగ్ చేసే వారిని గుర్తించే పనిలో ఇంటెలిజెన్స్ ఉంది. స్మగ్లింగ్ జీరో సైజుకు రావాలి. స్మగ్లింగుకు పాల్పడే వారిపై పీడీ యాక్టు నమోదు చేయాలి’’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అటవీ శాఖ అధికారులకు దిశా నిర్ధేశం చేశారు. అడవుల సంరక్షణ విషయంలో గత కొద్ది రోజులుగా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి అటవీశాఖ అధికారులతో శనివారం హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ ఎస్.కె.జోషి, డీజీపీ మహేందర్రెడ్డి, అటవీ శాఖ పీసీసీఎఫ్ పికె ఝా, అడిషనల్ డీజీ జితేందర్, ఐజీలు నవీన్చంద్, స్టీఫెన్ రవీంద్ర, నాగిరెడ్డి, సీసీఎఫ్ రఘువీర్, సీఎంఓ అధికారులు భూపాల్రెడ్డి, ప్రియాంక వర్గీస్, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్రెడ్డి, బాల్క సుమన్, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శంభీపూర్ రాజు, కార్పొరేషన్ల చైర్మన్లు శేరి సుభాష్ రెడ్డి, గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ అడవుల నుంచి నిజామాబాద్ మీదుగా హైదరాబాద్ వరకు సాగుతున్న జీరో దందాపై ప్రధానంగా సమీక్షించినట్లు సమాచారం. ఇటీవల ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు లా అండ్ ఆర్డర్ పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన 8 మంది అటవీ శాఖ అధికారులను అరెస్టు చేయడం, మరో ఇద్దరు లా అండ్ ఆర్డర్ సీఐ, ఎస్ఐలను బదిలీ చేయడం వంటి సంఘటనల నేపథ్యంలో ఈ సమీక్ష సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. అటవీ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, అడవి నుంచి పూచిక పుల్ల కూడా బయటకు పోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సాయుధ పోలీసులు, అటవీ శాఖ అధికారులతో కలిసి జాయింట్ ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆ బృందాలు అడవిలో నిరంతర తనిఖీలు నిర్వహించడంతోపాటు, అడవి నుంచి వెళ్లే మార్గాలపై నిఘా పెట్టాలని, జిల్లా కలెక్టర్, ఎస్పీ, డీఎఫ్ఓలు కలిసి తమ జిల్లా పరిధిలో అడవుల సంరక్షణకు కావాల్సిన కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. క్షేత్ర స్థాయిలో పోలీస్ ఇన్స్పెక్టర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో అడవులు రక్షించే బాధ్యతుల నెరవేర్చాలని కోరారు. స్మగ్లర్లపై ఉక్కుపాదం కలప స్మగ్లింగ్కు పాల్పడే వారిపైన కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి పునరుద్ఘాటించడంతోపాటు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరైనా కలప స్మగ్లింగ్కు పాల్పడితే అందరికన్నా వారినే ముందు అరెస్టు చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించడం గమనార్హం. ప్రభుత్వం అటవీ సంరక్షణకు ఇస్తున్న ప్రాధాన్యతను ఆయన ఈ వ్యాఖ్యల ద్వారా తెలియజేశారు. అడవుల సంరక్షణ కోసం ప్రస్తుతమున్న అటవీ చట్టాలను పూర్తి స్థాయిలో సమీక్షించాలని ఆదేశించారు. రాష్ట్రంలో పచ్చదనం పెంచడం, అడవులను రక్షించడం, స్మగ్లర్లను శిక్షించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లక్ష్యానికి అనుగుణంగా పర్యావరణ రక్షణ కోసం కొత్త చట్టం రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. పచ్చదనం పెంచే కార్యక్రమానికి నిధుల కొరత రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కాంపా నిధుల వినియోగంపై కూడా ఆయన స్పష్టత ఇచ్చారు. ముఖ్యమంత్రి సమీక్ష నేపథ్యంలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కలప దందాపై ఉక్కుపాదం మోపినట్లే. ఈ పరిణామం అధికారులతోపాటు అడవిలో దందాసాగిస్తున్న స్మగ్లర్లకు కలవరానికి గురి చేస్తోంది. -
వనమేధం
తలమడుగు(బోథ్): మానవాళి మనుగడకు అడువులే ఆధారం. వాతావరణ సమతుల్యతను కాపాడుతూ జీవరాశికి ఎంతో ఉపయోగపడుతున్న అరణ్యంలో వనమేధం జోరుగా జరుగుతోంది. అటవీపెంపకానికి ఓవైపు ప్రభుత్వం రూ.కోట్లువెచ్చి హరితహారం మొక్కలు నాటుతుంటే పచ్చని చెట్లను నరికిస్తూ ఇతరప్రాంతాలకు తరలించి కలప స్మగ్లర్లు సొమ్ముచేసుకుంటున్నారు. గ్రామాల్లో పంటపొలాల్లోని గట్లపై, వాగుల సమీపంలో చెట్లను విక్రయించాలన్నా, తరలించాలన్నా తప్పనిసరిగా అటవీశాఖ అధికారుల అనుమతి తీసుకోవాలి. కాని ఇదేమీ లేకుండానే వ్యాపారులు చెట్లను నరికి కలప తరలిస్తున్నారు. నిబంధనలు తుంగలో తొక్కి వ్యాపారులు మూడు చెట్లు ఆరు దుంగులుగా మార్చి వ్యాపారం సాగిస్తున్నారు. అడవిని కాపాడే అధికారులు ఏమీ పట్టనట్లు నిద్రమత్తులో ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో మొత్తం 18 మండలాలు ఉన్నాయి. అంతటా ఇదే తంతు జరుగుతోంది. కొన్ని గ్రామాల్లో రాత్రి వేళల్లో కలప తరలుతోంది. మహారాష్ట్ర సరిహద్దు మండలాలైన తాంసి తలమడుగు, బేల, జైనథ్, బజార్హత్నూర్, బోథ్, మండలం నుంచి కలప వ్యాపారం జోరుగా సాగుతోంది. గ్రామపంచాయతీల్లో అటవీ సంపద, వ్యవసాయ పొలాలు, వాగులు, కొండల సమీపంలో చెట్లు నేలకొరుగుతున్నాయి. వ్యాపారులు రైతు వద్ద పట్టా జిరాక్స్ పత్రాలు ఒక్కసారి తీసుకొని పలుమార్లు కలప తరలిస్తున్నారు. దీంతో అటవీప్రాంతాలు, పంటపొలాలు, ఎడారులుగా మారిపోతున్నాయి. చెట్లను నరికి లారీల్లో మామిడి, వేపచెట్లు, తుమ్మ , చింత తదితర చెట్లు నిత్యం నరికేస్తున్నారు. చెట్లను క్షణాల్లో నరికేందుకు పెట్రోల్ యంత్రాలు విచ్చలవిడిగా మార్కెట్లోకి రావడంతో వ్యాపారుల పని సులువుగా మారింది. ఇంత జరుగుతున్నా లారీలను పట్టుకున్న దాఖలాలు లేవు. అనుమతి లేకుండా అక్రమంగా రవాణా చెట్లను నరకాలంటే అటవీశాఖ రేంజ్ అధికారుల అనుమతి తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది. అనుమతి వచ్చిన తరువాత రైతు వ్యాపారికి తన పట్టా పాసుపుస్తకం, జిరాక్స్ అందించాలి. రైతు చెట్టు నరికిన స్థానంలో మరో మొక్క నాటాలి. కానీ అవి ఏమీ లేకుండానే వ్యాపారులు రైతుకు ఎంతోకొంత డబ్బు ముట్టజెప్పి విలువైన చెట్లు డింబర్డిపోలకు తరలిస్తున్నారు. అధికారులను మభ్యపెడుతూ కలపదందా కొనసాగిస్తున్నారు. అటవీశాఖ అధికారులు ఇవేమీ పట్టించుకోకపోవడం మూలంగా పచ్చని చెట్లతో ఉండాల్సిన పొలాలు, కొండలు ఎడారిగా మారుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెట్లను నరికి అక్రమ కలప రావాణా సాగించే వారిపై చర్యలు తీసుకొని జిల్లాలో వనమేధం పూర్తిగా నిర్మూలించాలని జిల్లాప్రజలు కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం గ్రామాల్లో నుంచి అనుమతి లేకుండా తరలిస్తే సమాచారం అందించాలి. రవాణాపై మా దృష్టికి రాలేదు. వస్తే వ్యాపారులపై కేసులు నమోదు చేస్తాం. పట్టాభూమిలో నుంచి చెట్లు నరికి విక్రయిస్తే తప్పనిసరిగా వాటిస్థానంలో రైతు మరో మొక్కనాటాలి. ఇప్పటివరకు ఎవ్వరికి ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. – ప్రకాశ్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ -
ఎఫ్ఆర్వో పోస్టులకు అక్టోబర్ 5న ఇంటర్వ్యూలు
సాక్షి, హైదరాబాద్: అటవీ శాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్ఆర్వో) పోస్టులకు సం బంధించిన ఇంటర్వ్యూలను అక్టోబర్ 5న నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ఉదయం 9.30 గంటలకు ఇంటర్వ్యూలు ఉంటాయని ఒక ప్రకటనలో పేర్కొంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు www. tspsc. gov. in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించింది. -
ఇటు విషాదం..అటు దొంగతనం
మంచిర్యాలక్రైం : రోగం తగ్గించుకుందామని ఆసుపత్రికి వస్తే, ఆపరేషన్ చేయాలన్నారు. గంటలో ఆపరేషన్ పూర్తవుతుందని చెప్పి ఎనిమిది గంటల పాటు ఆపరేషన్ థియేటర్లో ఉంచారు. ఇదిగో అదిగో అంటూ అయిన వారిని సైతం చూడనీయకుండా గంటల తరబడి వేచి ఉంచారు. తీరా చికిత్స వికటించిందని చెప్పి శవాన్ని అప్పగించి చేతులు దులుపుకున్నారు. థైరాయిడ్ వ్యాధికి ఆపరేషన్ పేరుతో అటవీశాఖ అధికారి నిండు ప్రాణాన్ని బలిగొన్నారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. అటవీశాఖలో డిప్యూటీ రేంజ్ అధికారిణిగా పనిచేస్తున్న అభిష్ట వరప్రదాయిని(35) కొద్ది రోజులు గా థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. తెలిసిన డాక్టర్ సూచన మేరకు మంచిర్యాలలోని శ్రీ హాస్పిటల్లో చికిత్స చేయించుకునేందుకు సోమవారం ఉదయం భర్తతో కలిసి వచ్చారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అదే రోజు మధ్యాహ్నం ఆపరేషన్ చేయాలని చెప్పారు. మధ్యాహ్నం 3.30 గంటలకు వరప్రదాయినిని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్లారు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్లు ఆశ్లేష, ప్రత్యూషలను పిలిపించారు. ప్రత్యూష అనస్థీషియన్ కాగా, ఆశ్లేష జనరల్ సర్జన్. గంటలో ఆపరేషన్ అయిపోతుందని ఆసుపత్రి వైద్యులు పేషంట్ భర్త శ్రీనివాస్కు తెలిపారు. కానీ తన భార్య సాయంత్రం 7గంటలు అవుతున్నా బయటకి రాకపోవడంతో ఆసుపత్రి సిబ్బందిని అడగగా.. చికిత్స జరుగుతోందని, ఇంకా కొంచెం సమయం పడుతుందని వారు చెప్పారు. రాత్రి 9గంటలు దాటినా తన భార్యను చూపించకపోవడంతో అనుమానం వచ్చిన శ్రీనివాస్ తన బంధువులకు సమాచారం అందించారు. బంధువులు రాగానే ఆసుపత్రి నిర్వాహకులు హడావుడిగా ‘మందులు తీసుకురండి.. రక్తం కావాలి.. ఈసీజీ మిషన్ తేవాలి.. ఆక్సిజన్ పెట్టాలి’ అంటూ కొద్దిసేపు హడావుడి చేశారు. రాత్రి 10గంటలు దాటినా వరప్రదాయినిని చూపించకపోవడంతో భర్త శ్రీనివాస్తోపాటు బంధువులు, అటవీశాఖ సిబ్బంది గట్టిగా నిలదీయడంతో కొంచెం సీరియస్గా ఉందని ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. దీంతో శ్రీనివాస్ తన భార్యను చూపించాలని కోరుతూ లోపలికి వెళ్లి చూడగా చలనం లేకుండా, నిర్జీవంగా పడి ఉందని బోరున విలపించారు. ఆపరేషన్ సరిగా చేయకుండా తన భార్యను చంపేశారంటూ రోదించారు. అతడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆసుపత్రి నిర్వాహకులు, వైద్యులపై కేసు నమో దు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పట్టణ సీఐ మహేష్ తెలిపారు. శ్రీనివాస్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాగా.. వీరికి ఇద్దరు కుమారులు ఆకర్‡్ష, అక్షయ్ ఉన్నారు. 2004లో అటవీశాఖలో ఉద్యోగం 2004లో వరప్రదాయిని అటవీశాఖలో ఎఫ్ఎస్వోగా చేరి జన్నారం, లక్సెట్టిపేట రేంజ్లలో విధులు నిర్వహించారు. డిప్యూటీ రేంజ్ అధికారిగా పదోన్నతి పొంది ప్రస్తుతం లక్సెట్టిపేట రేంజ్ పరిధిలోని హాజీపూర్ మండలంలో పని చేస్తున్నారు. సిబ్బందితో, ఉన్నతాధికారులతో కలివిడిగా ఉండే ఆమె మృతితో జిల్లా అటవీశాఖలో ఓ మంచి ఉద్యోగిని కోల్పోయామని సిబ్బంది కంటతడి పెట్టుకున్నారు. ఆందోళనకు దిగిన అటవీశాఖ సిబ్బంది, కుటుంబసభ్యులు.. వరప్రదాయిని మృతి విషయం తెలుసుకున్న జిల్లా అటవీశాఖ సిబ్బంది, ఎఫ్డీవో వెంకటేశ్వర్లు, లక్సెట్టిపేట ఎఫ్ఆర్వో అనిత, సిబ్బందితో కలిసి కుటుంబసభ్యులు, బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. ఏసీపీ గౌస్బాబా, పట్టణ సీఐ మహేష్ 30 మంది సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని వారితో మాట్లాడారు. వరప్రదాయిని మృతికి కారకులైన ఆసుపత్రి మేనేజింగ్ చైర్మన్ ముప్పిడి జయప్రకాష్రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్రెడ్డి, వైద్యులు ప్రత్యూష, ఆశ్లేష, చరణ్లపై కేసు నమోదు చేయాలని, ఆసుపత్రిని సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ తెల్లవారేవరకు ఆసుపత్రి ఎదుటనే ఆందోళన చేశారు. మంగళవారం ఉదయం అటవీశాఖ సిబ్బంది, కుటుంబసభ్యులు కలెక్టర్ క్యాంపు కార్యాలయం ముందు నిరసనకు దిగారు. వరాప్రదాయిని కుటుంబానికి న్యాయం చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్æ చేస్తూ కలెక్టర్ కర్ణన్కు వినతిపత్రం అందజేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీవో శ్రీనివాస్, డీఎంహెచ్వో భీష్మ, తహసీల్దార్ కుమారస్వామి హాస్పిటల్కు చేరుకొని మృతురాలి కుటుంబసభ్యులను పరామర్శించారు. మృతదేహాన్ని పరిశీలించి ఆపరేషన్ థియేటర్లోని సౌకర్యాలపై డీఎంహెచ్వో భీష్మతో కలిసి ఆరా తీశారు. ఆర్డీవో, తహసీల్దార్, పోలీసుల స మక్షంలో వీడియో రికార్డు చేస్తూ పోస్టుమార్టం నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించడంతో అధికా రులు దగ్గరుండి పోస్టుమార్టం పూర్తి చేశారు. రిమ్స్ వైద్యులతో పోస్టుమార్టం... ఆదిలాబాద్కు చెందిన రిమ్స్ వైద్యులతో వరప్రదాయిని మృతదేహానికి పోలీసు బందోబస్తు మధ్య పోస్టుమార్టం నిర్వహించారు. కుటుంబసభ్యులు ఆరుగురి సమక్షంలో అధికారులు వీడియో రికార్డు చేశారు. ఇటు విషాదం.. అటు దొంగతనం వరప్రదాయిని మృతిచెందిన విషాదంలో ఉండగానే... మారుతినగర్లోని ఆమె నివాసంలో సోమవారం రాత్రి దొంగలు పడ్డారు. కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి ఆసుపత్రి వద్ద ఉన్న సమయంలో దొంగలు చోరీకి పాల్ప డ్డారు. 23 తులాల బంగారు ఆభరణాలు, రూ.19 వేల నగదును దోచుకుపోయినట్లు కుటుంబసభ్యులు మంగళవారం తెలిపారు. ఓ పెళ్లి కోసం తెలిసిన వారి దగ్గర వరప్రదాయిని బంగారు ఆభరణాలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోగా.. ఆమె మరణించిన రోజే దొంగలు వాటిని దోచుకుపోవడం మరో విషాదం. -
పైరవీలు చేయిస్తార్రా..?
గోవిందరావుపేట: ‘మేము కేసు పెట్టేదాకా చూడాలె.. అంతేగానీ వాళ్లతో.. వీళ్లతో పైరవీలు చేయిస్తార్రా? అంటూ పస్రాకు చెందిన యువకులపై అటవీశాఖ డిప్యూటీ రేంజర్ మైసయ్య జులుం ప్రదర్శించాడు. కార్యాలయానికి పిలిపించి కర్రతో చావబాదాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా పస్రాలో గురువారం జరిగింది. 18 రోజుల క్రితం నాలుగు ఎడ్లబండ్లలో కలపతరలిస్తుండగా, అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. దీనిపై ఎలాంటి కేసు నమోదు చేయకుండా డిప్యూటీ రేంజర్ మైసయ్య నిందితులను కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు. దీంతో ఆ యువకులు ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్లి తమ బాధను చెప్పుకున్నారు. వారి కోసం ప్రజాప్రతినిధుల నుంచి ఫోన్లు వస్తుండడంతో డిప్యూటీ రేంజర్కు కోపమొచ్చింది. గురువారం నిందితులు బైరబోయిన నరేశ్, పులుగుజ్జు సురేశ్, దామ సారంగంను కార్యాలయానికి పిలిపించిన ఆయన చితకబాదాడు. వారిలో సురేశ్, సారంగంలకు తీవ్ర గాయాలు కాగా, వారు పస్రా సీఐ బాలాజీకి ఫిర్యాదు చేశారు. వారికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఈ విషయమై డిప్యూటీ రేంజర్ మైసయ్యను ‘సాక్షి’ వివరణ కోరగా, తాను వారిని కొట్టాననటం నిజం కాదన్నారు. కలప స్మగ్లింగ్ వెనుక వేరే వ్యక్తులు ఉన్నారని, వారి వివరాలు చెప్పాలని ప్రశ్నించినట్లు తెలిపారు. కాగా, అటవీశాఖ సిబ్బందిపై దాడి చేసిన కేసులో ఈ ఇద్దరు ఇప్పటికే నిందితులుగా ఉన్నారు. -
నీటి కోసం వచ్చి.. కుక్కల పాలైంది..
అడవిలో నీళ్లు దొరక్క గ్రామ సమీపంలోకి వచ్చిన ఓ జింకపై కుక్కలు దాడి చేయడంతో మృత్యువాత పడింది. రంగారెడ్డి జిల్లా మోమిన్పేట మండలం రావులపల్లిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. స్థానిక అడవిలోంచి ఓ జింక ఉదయం దాహం తీర్చుకునేందుకు రావులపల్లి గ్రామ సమీపంలో నిర్మిస్తున్న సోలార్ ప్లాంటు వద్దకు వచ్చింది. ఈక్రమంలో నీళ్లు తాగుతున్న జింకపై వీధికుక్కలు దాడి చేశాయి. గాయపడిన జింకను అక్కడే ఉన్న రైతులు గమనించి చేరదీసి ఫారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. వికారాబాద్ నుంచి అధికారులు రావడం ఆలస్యమవడంతో పరిస్థితి విషమించి జింక మృతి చెందింది. అనంతరం ఫారెస్టు రేంజ్ అధికారి అరుణ జింకను ఖననం చేశారు. -
ఎఫ్ఆర్వోపై దాడికి నిరసనగా ర్యాలీ
అచ్చంపేట: మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేట అటవీ రేంజ్ అధికారి(ఎఫ్ఆర్వో) పై ఎమ్మెల్యే అనుచరుల దాడికి నిరసనగా అచ్చంపేటలో శనివారం భారీ ర్యాలీ జరిగింది. అటవీ శాఖకు చెందిన అతిథి గృహం కేటాయింపు విషయంలో ఎఫ్ఆర్వో రామేశ్వర్రెడ్డి పై ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అనుచరులు శుక్రవారం దాడి చేసిన విషయం విదితమే. ఈ ఘటనకు నిరసనగా అటవీ సిబ్బంది పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. దాడులకు కారకులపై చర్యలు తీసుకోవాలంటూ తహశీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ర్యాలీలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు రవీందర్, మాజీ ఎమ్మెల్యే రాములు, ఎఫ్ఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోహన్, ప్రధాన కార్యదర్శి విజయానందరావు, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. -
ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ రేంజ్ అధికారి
నర్సాపూర్ (మెదక్) : ఓ రైతు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటూ.. ఫారెస్ట్ అధికారి ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్లో శుక్రవారం చోటుచేసుకుంది. నర్సాపూర్ ఫారెస్ట్ రేంజ్ అధికారి మధుసూధన్ రావు స్థానిక రైతు నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా.. ముందస్తు సమాచారంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. -
తెలుగు తమ్ముళ్ల భూ దందా
మాచర్లరూరల్ : తెలుగుతమ్ముళ్ల భూదందాకు అంతులేకుండా పోతోంది. ప్రభుత్వ భూములే కాకుండా ఫారెస్టు భూములను సైతం కబ్జాచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కొత్తపల్లి గ్రామంలోని 534 ఎకరాల ఎద్దులబోడు భూ ఆక్రమణ మరువక ముందే అదే మండలంలో పశువేముల గ్రామంలో 340/1, 341/2, 340 సర్వేనంబర్ల సరిహద్దు ప్రాంతంలో సుమారు 50 ఎకరాల్లో జేసీబీ యంత్రాలతో భూములను చదును చేసి యథేచ్చగా భూదందా కొనసాగిస్తున్నారు. ఆ భూములకు పక్కనే ఉన్న ఫారెస్టు భూములను సైతం కబ్జా చేస్తున్నారు. వీటిపై అధికారులు ఇప్పటి వరకు కన్నెత్తి చూడకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. మండలంలో సాగు చేసేందుకు భూమి కావాలంటే అధికారులను సంప్రదించటం కంటే ముందుగా రెవెన్యూ పొలాన్ని గుర్తించి ఆ భూముల్లో చొరబడి అనేక ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్నామనే దరఖాస్తుతో సులభంగా పట్టా పొందే మార్గాలు అన్వేషిస్తున్నారు. వీరికి అధికార పార్టీకొమ్ముకాస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నారుు. తుళ్లూరు ప్రాంతంలో భూములు అమ్ముకునేవారు ఈ ప్రాంతానికి వచ్చి కొనుగోళ్లు చేపడుతున్నారని తెలియడంతో ఇలాంటి భూములతో కాసులు పోగేసుకోవచ్చని భావిస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడి కాలువ పరిధిలో 40 ఎకరాల రెవెన్యూ భూమి ఇక్కడ ఉంది. దీని పై ప్రాజెక్టు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు. అందుకే అవికాస్తా ఆక్రమణల బారినపడుతున్నారుు. ఈ విషయమై తహశీల్దార్ గర్నెపూడి లెవీని సాక్షి సంప్రదించగా పశువేములలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూములకు గతంలోనే డీకే పట్టాలు ఇచ్చారని తెలిసిందని, అయినప్పటికి ఇంకా ఏమైన ఆ ప్రాంతంలో కబ్జాకు గురైతే వాటిని పరిశీలించి క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ ప్రసన్నజ్యోతి మాట్లాడుతూ పశువేముల బీట్ పరిధిలో ఫారెస్టు భూములను కబ్జా చేసిన వారిని గుర్తించి తగు చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే ఈ ప్రాంతం పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. గతంలో కొందరు ఆక్రమణలకు పాల్పడితే ఆ ప్రాంతంలో మొక్కలు నాటి సంరక్షిస్తున్నామన్నారు. -
వినుకొండ ఫారెస్ట్ రేంజ్ రెండు ముక్కలు
- నూతనంగా కోటప్పకొండ రేంజి ఏర్పాటు - విభజనతో అడవులకు పూర్తిస్థాయి రక్షణ - పెరగనున్న ఉద్యోగ అవకాలు వినుకొండ: వినుకొండ అటవీశాఖ రేంజి రెండు ముక్కలు కాబోతోంది. కోటప్పకొండ రేంజిని కొత్తగా ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రక్రియ పూర్తికావడంతో త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. దీనివల్ల నిఘా మరింతగా పెంచేందుకు అవకాశం ఏర్పడుతుంది. వినుకొండ రే ంజి పరిధిలో 44,830 హెక్టార్ల విస్తీర్ణంలో అడవులు విస్తరించి ఉన్నాయి. విభజనలో భాగంగా వినుకొండ రే ంజి పరిధిలో 32,421.76 హెక్టార్లు, కోటప్పకొండ రేంజి పరిధిలో 12,408.24 హెక్టార్ల అడవులు ఉంటాయి. విభజన ప్రకటన కొద్ది రోజుల్లో వచ్చే అవకాశం ఉందని రేంజి అధికారి వి.వి.రమణారావు తెలిపారు. బ్రిటీష్ కాలం నుంచి ఉన్న వినుకొండ రేంజి పరిధి మేళ్ళవాగు నుంచి నరసరావుపేట వరకు ఉంది. రేంజి పరిధి తగ్గించడం వల్ల అడవులు, వణ్యప్రాణుల సంరక్షణ పూర్తి స్థాయిలో చేసేందుకు, ఉద్యోగ అవకాశాలు పెరిగేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. గతంలో వినుకొండ రేంజి పరిధిలో ఐదు సెక్షన్లు, 18 బీట్లు ఉన్నాయి. విభజన అనంతరం కోటప్పకొండ రేంజ్ పరిధిలో 3 సెక్షన్లు, 12 బీట్లు ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. గతంలో గుంటూరు రేంజి పరిధిలోని నకరికల్లు సెక్షన్ను కోటప్పకొండ రేంజిలో విలీనం చేశారు. అదేవిధంగా చేజర్ల బీటు, బొల్లాపల్లి మండల పరిధిలోని గరికపాడు, మేళ్లవాగు, జయంతిరామపురం బీట్లు కోటప్పకొండ రేంజి పరిధిలో ఉంటాయి. ఇప్పటి వరకు వినుకొండ రేంజి పరిధిలో ఉన్న కారంపూడి సెక్షన్ మాచర్ల రేంజిలో కలిపారు. విస్తీర్ణం అధికంగా ఉన్నందునే... వినుకొండ రేంజి విస్తీర్ణం అధికంగా ఉండటం వల్ల పూర్తి స్థాయిలో అడవులను కాపాడలేకపోతున్నాం. రెండుగా విభజించడం వల్ల అడవుల పర్యవేక్షణ పూర్తి స్థాయిలో ఉండే అవకాశం ఉంది. కోటప్పకొండ రేంజి ఏర్పా టు జరగడం వల్ల కొత్తగా రిక్రూట్మెంట్ నిర్వహించారు. వీరికి త్వరలో పోస్టింగ్లు ఇచ్చే అవకాశం ఉంది. వినుకొండ రేంజిని రెండుగా విభజించారు. అయితే వినుకొండ రేంజి పరిధిలో గతంలో ఉన్న సెక్షన్లు, బీట్లు యదావిధగా ఉంటాయి. అలాగే ఉద్యోగులు కూడా యథావిధిగానే ఉంటారు. - వి.వి.రమణారావు, ఫారెస్టు రేంజి అధికారి, వినుకొండ -
అటవీ అధికారుల జులుం
ఆత్మకూరురూరల్, న్యూస్లైన్: ఏ పాపం ఎరుగని అమాయక ప్రజలపై అటవీ అధికారులు అక్కసు వెల్లగక్కారు. మాట్లాడేందుకు పిలిచిపించి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చితకబాదిన సంఘటన శనివారం ఆత్మకూరులో వెలుగుచూపింది. మండల పరిధిలోని సిద్దపల్లె గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రమణారెడ్డి, మురహరి పుల్లయ్య, కుమ్మరి శ్రీనుపై అటవీ అధికారులు శుక్రవారం జులుం ప్రదర్శించారు. అడవికి వెళ్లామని వారితో బలవంతంగా సంతకాలు చేయించుకోవడంతో ఆ పార్టీ నాయకులు, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. సిద్దపల్లె గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రమణారెడ్డి, మురహరి పుల్లయ్య, కుమ్మరి శ్రీను గతంలో అడవికెళ్లి వెదుర్లను సేకరించి విక్రయించేవారు. అటవీ హక్కుల చట్టం తీవ్రతరం చేయడంతో వారు అడవిలోకి వెళ్లడం మాని వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబ జీవనం సాగిస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో వీరు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పనిచేశారని టీడీపీ గ్రామ నాయకులు అడవికి వెళ్లినట్లు ఫారెస్టు అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చారు. దీంతో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అశోక్కుమార్యాదవ్ విచారణ పేరుతో పట్టణ శివారు ప్రాంతంలోని కలాం హోటల్లో టీ తాగుతున్న రమణారెడ్డి, పుల్లయ్య, శ్రీనులను జీపులో ఎక్కించుకుని రేంజ్ ఆఫీసుకు తీసుకెళ్లారు. తాము అడవికి వెళ్లడం లేదని వారు చెప్పిన వినకుండా రేంజర్ విరుచుకుపడ్డారు. అడవిలోకి వెళ్లినట్లుగా ఒప్పుకొని సంతకాలు చేయాలంటూ బలవంతం చేశారు. ఏ తప్పు చేయకున్నా సంతకాలు ఎలా చేస్తామంటూ వారు రేంజర్ను ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ గంగాధర్రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు శ్రీనివాసులు, బంధువులు కార్యాలయానికి చేరుకొని అటవీ అధికారులను నిలదీశారు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు తమ కార్యకర్తలపై కక్ష సాధింపులో భాగంగానే అటవీ అధికారులను పురికొల్పుతున్నారని సర్పంచ్ ఆరోపించారు. రేంజర్ తీరుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై రేంజర్ అశోక్కుమార్ను న్యూస్లైన్ వివరణ కోరగా గ్రామానికి చెందిన ఈ ముగ్గురు వ్యక్తులు సైకిళ్లపై వెదురు బొంగులు తీసుకొని వచ్చి ఆత్మకూరులో విక్రయించి వెళ్తున్నట్లు సమాచారం అందడంతో అదుపులోకి తీసుకున్నామని వివరించారు. -
ఏసీబీకి చిక్కిన ఎఫ్ఆర్ఓ
ములుగు, న్యూస్లైన్ : బిల్డింగ్ సబ్ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఏసీబీ అధికారులకు చిక్కిన సంఘటన ములుగు ఫారెస్ట్ కార్యాలయం శనివారం చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ సాయిబాబా కథనం ప్రకారం.. ములుగు ఫారెస్ట్ కార్యాలయంలో బీట్ ఆఫీసర్ల కో సం భవనాలు మంజూరయ్యాయి. ఈ భవన నిర్మాణ పనులను హన్మకొండకు చెందిన కాంట్రాక్టర్ రాజయ్య చేపట్టారు. నిబంధనల ప్రకారం బిల్డింగ్ కి 14 పిల్లర్లు నిర్మించాల్సి ఉండగా సదరు కాంట్రాక్టర్ 13 పిల్లర్లు మా త్రమే నిర్మిస్తున్నాడని, ఇం దుకు సంబంధించిన బిల్లు పై సంతకం చేయాలంటే తనకు రూ.50 వేలు లంచంగా ఇవ్వాలని రేంజ్ అఫీసర్ వేణుగోపాల్ డిమాండ్ చేశాడు. దీంతో సదరు కాంట్రాక్టర్ రూ.20 వేలు సమర్పించాడు. అయినా అతడు ఊరుకోకుండా మిగతా రూ.30 వే ల కోసం వేధించడంతో ఈ నెల 19వ తేదీన ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలోనే రాజయ్య నుంచి ఎఫ్ఆర్ఓ వేణుగోపాల్ తన కార్యాలయంలో రూ.12 వేలు తీసుకుంటుండగా అక్కడే పొంచి ఉన్న ఏసీబీ అధికారులు రెడ్ హ్యాం డెడ్గా పట్టుకున్నారు. అనంతరం కార్యాలయం లో ఇప్పటి వరకు పట్టుకున్న వాహనాలను, వాటికి అధికారులు తీసుకున్న లావాదేవీలను పరిశీలించారు. డీఎస్పీ వెంట సీఐలు పి. సాంబయ్య, రాఘవేందర్రావు, రియాజ్ ఉన్నారు. -
పోలీసు కస్టడీకి సీపీఎం నేతలు
సాక్షి, నిజామాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇందల్వాయి ఎఫ్ఆర్ఓ (ఫారెస్టు రేంజ్ అధికారి) రొడ్డ గంగయ్య హత్య కేసు దర్యాప్తులో ఓ అడుగు ముందుకు పడింది. కోర్టులో లొంగిపోయిన నిందితుడు సీపీఎం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, ఆ పార్టీ మహిళా నాయకురాలు జమునను పోలీసులు రెండురోజుల కస్టడీకి తీసుకున్నారు. వీరిని ప్రశ్నిం చేందుకు పది రోజులు కస్టడీకి ఇవ్వాలని జిల్లా రెండో అదనపు మేజిస్ట్రేట్ కోర్టుకు విజ్ఞప్తి చేయగా, కోర్టు రెండు రోజుల కస్టడీకి అనుమతించింది. గత నెల 15న అటవీ భూ ఆక్రమణదారుల చేతుల్లో గంగయ్య దారుణ హత్యకు గురయ్యారు. పథకం ప్రకారం ఆయనను కిరాతకంగా దాడి చేసి హతమార్చారు. ఈ ఘటనను రాష్ట్ర సర్కారు తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనలో మొత్తం 36 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందులో 33 మందిని అరెస్టు చేసిన పోలీసులు పెద్ది వెంకట్రాములుతో పాటు, జమున పరారీలో ఉన్నారని ప్రకటించారు. ఎట్టకేలకు వీరిద్దరు నెల రోజుల అనంతరం ఈనెల 15న కోర్టులో లొంగిపోయారు. కోర్టు 15 రోజుల జుడీషియల్ కస్టడీకి ఆదేశించినట్లు వీరిని జిల్లా జైలుకు తరలించారు. సోమవా రం జిల్లా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నా రు. ఇంకా ఈ కేసులో ట్రాక్టర్ డ్రైవర్ రాజు పరారీలోనే ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. రాజు మినహా ఈ దారుణ ఘట నలో ప్రమేయం ఉన్న పాత్రదారులందరిని అరెస్టు చేసిన పోలీసులు.. సూత్ర దారులెవరో గుర్తించే పనిలో పడ్డారు. హత్యకు పథ క రచన చేసిందెవరో పరిశోధిస్తున్నారు. పెద్ది వెంకట్రాములు, జమునను అన్ని కోణాల్లో ప్రశ్నిస్తామని ఎస్పీ కేవీ మోహన్రావ్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. వారి స్టేట్మెంట్ను రికార్డు చేస్తామన్నారు. ఇంకా అందని పోస్టుమార్టం రిపోర్టు గంగయ్య హత్య కేసుకు సంబంధించి వైద్యులు ఇచ్చే పోస్టుమార్టం నివేదిక ఇంకా తమకు అందలేదని కేసు దర్యాప్తు అధికారి, నిజామాబాద్ డీఎస్పీ అనిల్కుమార్ తెలి పారు. మరణించిన గంగయ్యతో పాటు, స్వల్ప గాయాలపాలైన మరో ఆరుగురు అటవీశాఖ సిబ్బందికి సంబంధించిన పోస్టుమార్టం నివేదిక కూడా పోలీసులకు అందాల్సి ఉంది. హత్యకు వినియోగించిన గొడ్డలి, కర్ర తదితర ఆయుధాలను స్వాధీ నం చేసుకున్న పోలీసులు వాటిని ఫొరెన్సిక్ ల్యాబ్కు పంపారు. -
రూ.17 లక్షల ఎర్రచందనం స్వాధీనం
చిత్తూరు(క్రైమ్)/ పుత్తూరు/ యాదమరి/పీలేరు రూరల్, న్యూస్లైన్: జిల్లాలో మంగళవారం పోలీసులు ఐదు చోట్ల దాడులు జరిపి రూ.17 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురు స్మగ్లర్లను, 21మంది ఎర్రచందనం కూలీలను, ఇద్దరు వాహన డ్రైవర్లను అరెస్ట్ చేసి ఆరు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు డీఎస్పీ రాజేశ్వర్రెడ్డి మంగళవారం వన్టౌన్ స్టేషన్ ఆవరణంలో వివరాలు వెళ్లడించారు. తిరుపతి పరిసరాల్లోని శేషాచల అడవుల నుంచి ఎర్రచందనం తరలిస్తున్నట్లు చిత్తూరు పట్టణ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే చిత్తూరు వన్టౌన్ సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్సై జహీర్అహ్మద్ సిబ్బంది వాహనాల తనిఖీ చేపట్టారు. ఖాళీ టమోటా బాక్సులతో కేఏ09 సి4369 నెంబర్ ఈచర్ వాహనం వేగంగా వెళ్లింది. పోలీసులకు అనుమానం వచ్చి వాహనాన్ని వెంబడించి రెడ్డిగుంట వద్ద ఆపి తనిఖీ చేయగా, ఖాళీ బాక్సుల మధ్య 10 ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. ఈ వాహనంలోనే ఉన్న గుడిపాల మండలం వెప్పననాయనిచెరువు గ్రామానికి చెందిన ఆనంద్(44), తమిళనాడులోని దిండివనం జిల్లా వీరపట్ల గ్రామానికి చెందిన పొన్నుస్వామి(32), తిరుపతి మంగళం కాలనీకి చెందిన పరంధామ(34)ను అదుపులోకి తీసుకుని విచారించారు. తాము ఎర్రచందనాన్ని సేకరించి చెన్నైలో స్మగ్లర్లకు విక్రయిస్తామని వారు తెలిపారు. ఎర్రచందనం తరలించేందుకు చిత్తూరుకు చెందిన శీన, తిరుపతికి చెందిన శంకర్ వాహనాలు ఏర్పాటు చేస్తుంటారని చెప్పారు. ఆ ఇద్దరినీ పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించామని డీఎస్పీ తెలిపారు. నిందితులను కోర్టుకు హాజరుపరచనున్నట్లు తెలిపారు. లారీ సహా ఎర్రచందనం స్వాధీనం పుత్తూరు: పుత్తూరు అటవీశాఖ పరిధిలోని కేఎం.అగ్రహారం సమీపంలో మంగళవారం తెల్లవారుజామున లారీ సహా ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నామని ఫారెస్టు రేంజి ఆఫీసర్ నాగరాజు తెలిపారు. రహస్య సమాచారం మేరకు పుత్తూరు సెక్షన్ ఆఫీసర్ జయశంకర్ బృందాన్ని అప్రమత్తం చేశామన్నారు. వారు అంజేరమ్మ కనుమ కింది భాగంలో కాపు కాచారు. తిరుపతి వైపు నుంచి చెన్నై వెళుతున్న లారీని ఆపేందుకు ప్రయత్నించగా వేగంగా వెళ్లింది. దానిని వెంబడించగా అగ్రహారం వద్ద లారీని నిలిపి డ్రైవరు పారిపోయాడు. లారీలో ఉన్న 54 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.7లక్షలు ఉంటుందన్నారు. దుంగలున్న లారీని సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 21మంది ఎర్రకూలీల అరెస్ట్ యాదమరి: యాదమరి పోలీసులు మంగళవారం 21మంది ఎర్రచందనం కూలీలను అరెస్టు చేశారు. మండల పరిధిలో సోమవారం రాత్రి తమిళనాడుకు చెందిన ఎర్రచందనం కూలీలను అదుపులోకి తీసుకుని ఒక టాటాసుమో, టవేరా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కూలీలంతా తమిళనాడు విల్లుపురం జిల్లా చిన్నశాలం తాలూకా మేల్మురవం గ్రామానికి చెందిన వారని యాదమరి ఎస్సై ఉమామహేశ్వర్రావ్ తెలిపారు. కూలీలతో పాటు సుమో డ్రైవర్ మురగేశన్ (39), టవేరా డ్రైవర్ దినేష్ (36)ను అరెస్టు చేశామన్నారు. రెండు వాహనాలు, ఎర్రచందనం స్వాధీనం పీలేరు రూరల్ : రెండు వాహనాలు సహా 21 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, నలుగురు నిందితులను అరెస్ట్ చేశామని పీలేరు ఎస్ఐ ఎస్.విశ్వనాథరెడ్డి తెలిపారు. ఆయన చెప్పిన వివరాల మేరకు.. మంగళవారం తెల్లవారుజామున యల్లమంద నుంచి పీలేరు వైపు వస్తున్న టీఎన్ 37 ఏఏ 4120 నెంబరు గల మినీ లారీని పోలీసులు తనిఖీ చేశారు. టమాట బాక్సుల మధ్యలో 12 ఎర్రచందనం దుంగలు తరలిస్తున్నట్లు గుర్తించారు. 420 కేజీల బరువు గల ఎర్రచందనం దుంగలతోపాటు మినీ లారీని స్వాధీనం చేసుకున్నారు. లారీలో ఉన్న ఎర్రావారిపాళెం మండలం యల్లమందకు చెందిన అంకెల రమేష్బాబు, ఉస్తికాయలపెంట మొరంకిందపల్లెకు చెందిన రఘునాథరెడ్డిని అరెస్ట్ చేశారు. పీలేరు పట్టణం చిత్తూరు మార్గంలోని రైల్వేగేటు సమీపంలో కేఏ 03 ఎన్ 7822 నెంబరు కారును తనిఖీ చేయగా 9 ఎర్రచందనం దుంగలు దొరికాయి. కారుతోపాటు 170 కేజీల బరువు గల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. సదుం మండలం అమ్మయ్యగారిపల్లెకు చెందిన జీ.కుమార్, ఎన్.ఎర్రయ్యను అరెస్ట్ చేశారు. ఈ దాడిలో ట్రైనీ ఎస్ఐ బాలకృష్ణ, సిబ్బంది సుబ్రమణ్యం, చక్రవర్తి, నాగరాజ, చెంగల్రాయుడు, విజయ్ పాల్గొన్నారు. -
ఎఫ్ఆర్ఓ గంగయ్య హత్య కేసులో మరోకోణం
సాక్షి, నిజామాబాద్ : ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ గంగయ్య హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భూ ఆక్రమణదారులు ఒక్క గంగయ్యనే లక్ష్యంగా చేసుకొని దాడి చేసినట్లు సంఘ టన జరిగిన తీరును బట్టి తెలుస్తోంది. ఈ విషయమై హతుడు గంగయ్య కుటుంబ సభ్యులు సైతం పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆయనకు స్వల్ప వ్యవధిలోనే పదోన్నతి లభించిందని, ఇది శాఖలోని పలువురికి కంట గింపుగా మారిందని వారంటున్నారు. విధుల్లో నిక్కచ్చిగా వ్యవహరించేవారని, దీంతో కొందరికి ఆయనంటే పడలేదని పేర్కొంటున్నారు. అయితే గంగయ్య కుటుంబ సభ్యులనుంచి రాత పూర్వకంగా గానీ మౌఖికంగా గానీ తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని ఎస్పీ మోహన్రావు పేర్కొన్నారు. హత్య విషయమై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ విషయమై అటవీ శాఖ ఉన్నతాధికారులూ స్పందించారు. ‘‘కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యలో అటవీశాఖ అధికారులు, సిబ్బంది ప్రమేయం పరోక్షంగానైనా ఉందని తేలిన పక్షంలో శాఖాపరమైన విచారణ చేపడతాం’’ అని నిజామాబాద్ సర్కిల్ సీసీఎఫ్ గోపీనాథ్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. వివాదాలిలా.. ఒక్క ఇందల్వాయి రేంజ్లోనే కాదు.. జిల్లావ్యాప్తంగా పలుచోట్ల పెద్ద ఎత్తున అటవీ భూములు ఆక్రమణలకు గురయ్యాయి. అటవీ శాఖలోని కొందరు అధికారులు, సిబ్బంది పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని భూ ఆక్రమణలను చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇలా డబ్బులు పుచ్చుకున్న అధికారులు ఆక్కడి నుంచి బదిలీపై వెళ్లగా, ఆ స్థానంలోకి వచ్చిన అధికారులు ఆక్రమణలకు అడ్డుతగులుతుండడంతో గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆ గొడవలే దాడులకు దారితీస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భూములు, పట్టాలు ఇప్పిస్తామంటూ కొందరు నేతలు, రెవెన్యూ అధికారులు అమాయకుల వద్ద నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కాగా అటవీ భూము లా? రెవెన్యూ భూములా అన్న విషయం తేల్చకుండానే అధికారులు అందినకాడికి దండుకుని పట్టాలిస్తుండడంతో అమాయక గిరిజనులు, గ్రామీణలు అటవీ భూములను దున్నుకుంటున్నారు. తీరా అటవీశాఖ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంతో వివాదం ముదురుతోందని, భూ ఆక్రమణదారులు అఘాయిత్యాలకూ పాల్పడుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంతాపసభ సుభాష్నగర్ : భూఆక్రమణదారుల చేతిలో ఇటీవల హత్యకు గురైన ఎఫ్ఆర్ఓ గంగయ్య సంతాప సభను ఆదివారం జిల్లాకేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో నిర్వహించారు. మాదిగ ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో బీజేపీ శాసనసభాపక్ష నేత యెండల లక్ష్మీనారాయణ, డీసీసీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్, ఫెడరేషన్ నాయకులు సీహెచ్.గంగాధర్, ఎస్.సురేశ్, ఎస్.లింగయ్య, సీతయ్య, మహేశ్కుమార్, గంగారాం, గంగయ్య, సాయిలు, చిన్నయ్య, పోశెట్టి, బాలచందర్, రాములు తదితరులు పాల్గొన్నారు. ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షుడు తెడ్డు గంగారాం అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. గంగయ్య సేవలను వక్తలు కొనియాడారు. హంతకులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పరామర్శ కలెక్టరేట్ : ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ గైని గంగారాం, నాయకులు బాబూరావు, దేవయ్య తదితరులు ఆదివారం గంగయ్య కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంగయ్య కుటుంబ సభ్యులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. దోషులకు కఠిన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు. అరెస్టు అయింది వీరే.. సాక్షి, నిజామాబాద్ : ఎఫ్ఆర్ఓ గంగయ్య హత్య కేసులో మొత్తం 36 మందిపై కేసు నమోదు చేశామని, 11 మందిని అరెస్టు చేశామని ఎస్పీ మోహన్రావు తెలిపారు. మిగిలిన 25 మందిలో కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నిందితులపై 147, 148, 353, 332, 307, 302, 120(బి) రెడ్విత్ 149 ఐపీసీ, సెక్షన్ 15, ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ చట్టం 4, 5 సెక్షన్ల కింద, పీడీపీపీ చట్టం సెక్షన్ 3 (1), ఎస్సీ, ఎస్సీ అట్రాసిటీ చట్టం సెక్షన్ 3 (2)(వి) కింద కేసులు నమోదు చేశామన్నారు. అరెస్టు అయినవారిలో ఒడ్డె భాస్కర్, ఒడ్డె రాములు, మందుల ముత్యం (ఆటోడ్రైవర్), మందుల పెద్దసాయిలు (మెకానిక్), గొల్ల మల్లేశ్ (మెకానిక్), మక్కాల చిన్న వెంకటి, శివరాత్రి ప్రసాద్ (సుమో డ్రైవర్), సింగజోగి పోచయ్య, మందుల లింగం, సింగజోగి పోచయ్య, బాదావత్ గోపాల్ (కెకె తండా) ఉన్నారన్నారు. వీరి నుంచి గొడ్డలి, కొడవలి, కర్రలను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిజామాబాద్ డీఎస్పీ అనీల్కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారని, పరారీలో ఉన్నవారిని వెంటనే పట్టుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సమావేశంలో ఓఎస్డీ సుదర్శన్రెడ్డి పాల్గొన్నారు. -
ఎఫ్ఆర్ఓ గంగయ్య హత్య కేసులో 11 మంది అరెస్ట్
ఎఫ్ఆర్ఓ గంగయ్య హత్య కేసులో 11 మందిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ మోహనరావు ఆదివారం వెల్లడించారు. ఆ హత్య కేసులో మొత్తం 36 మంది నిందితులు ఉన్నారని తెలిపారు. వారిని కూడా సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు మోహనరావు వివరించారు. నిందితుల్లో సీపీఐ జిల్లా కార్యదర్శి వెంకటరాములు కూడా ఉన్నారని తెలిపారు. గత శనివారం అర్థరాత్రి నిజామాబాద్ జిల్లాలోని దర్పల్లి మండలం నల్లవెల్లి ప్రాంతంలో ప్రభుత్వానికి చెందిన అటవీ భూమిని కబ్జాదారులు సాగుచేస్తున్నారు. ఆ సమాచారం అందుకున్న ఎఫ్ఆర్ఓ తనతోపాటు మరో ఆరుగురు అధికారుల హుటాహుటిన ఆ ప్రదేశానికి బయలుదేరి వెళ్లారు. అప్పటికే దాడికి సిద్దంగా ఉన్న కభ్జాదారులు ఎఫ్ఆర్వోపై దుండగులు కళ్లలో కారంచల్లి.. గొడ్డలితో నరికి చంపారు. మిగిలిన వారిపై దాడి చేశారు. ఆ ఘటనలో మిగిలిన అధికారులు తీవ్రంగా గయపడ్డారు. ఎఫ్ఆర్ఓ హత్య జిల్లా వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. పోలీసులు ఆ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా ప్రత్యక్ష సాక్షులకు విచారించారు. దాంతో వారం రోజుల్లో 11 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.