foundation day
-
నేడు సీఆర్పీఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం.. ప్రధాని మోదీ శుభాకాంక్షలు
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) 86వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రతా బలగాలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దేశ భద్రతలో సీఆర్పీఎఫ్ పాత్ర అత్యంత కీలకమని అభివర్ణించారు. సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్లో.. దేశం పట్ల సీఆర్పీఎఫ్ జవాన్ల అంకితభావం, అవిశ్రాంత సేవ నిజంగా అభినందనీయమన్నారు. వారు ఎల్లప్పుడూ ధైర్యం, నిబద్ధతలతో దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి పాటుపడుతున్నారన్నారు.ఇదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా సీఆర్పీఎఫ్ జవాన్లకు, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. సీఆర్పీఎఫ్ ప్రారంభమైనప్పటి నుంచి జాతీయ భద్రతను తన మిషన్గా తీసుకుంది. దళంలోని వీర సైనికులు తమ ప్రాణాలను లెక్కచేయక దేశరక్షణకు తమ శక్తిమేరకు కృషి చేసి, విజేతలుగా నిలుస్తున్నారన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన సీఆర్పీఎఫ్ అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నానని అమిత్ షా పేర్కొన్నారు.1939లో బ్రిటిష్ వారు సీఆర్పీఎఫ్ను స్థాపించారు. నాడు ఈ దళం పేరు క్రౌన్ రిప్రజెంటేటివ్ పోలీస్. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఈ దళం పేరును సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్గా మార్చారు. జునాగఢ్, హైదరాబాద్, కతియావార్, కశ్మీర్ రాచరిక రాష్ట్రాలను భారతదేశంలోకి చేర్చడంలో సీఆర్పీఎఫ్ కీలక పాత్ర పోషించింది. అలాగే రాజస్థాన్, కచ్, సింధ్ సరిహద్దుల్లో చొరబాట్లను అరికట్టడంలోనూ సీఆర్పీఎఫ్ ముఖ్యపాత్ర పోషించింది. Greetings to CRPF personnel and their family members on their Raising Day.Since its inception, the @crpfindia has taken national security as its mission. The brave soldiers of the force have exerted all their might to accomplish this goal without ever caring for their lives and… pic.twitter.com/NhbmeRZvi3— Amit Shah (@AmitShah) July 27, 2024 -
కళామందిర్ ఫౌండేషన్ డే వేడుకలో ప్రముఖుల సందడి.. (ఫోటోలు)
-
SBI: కస్టమర్లకు మరిన్ని సేవలే లక్ష్యం
న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) 69వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురష్కరించుకుని తన కస్టమర్లకు సేవలను మరింత విస్తృతం చేయడానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పదకొండు కొత్త కార్యక్రమాలను ప్రారంభించినట్లు వివరించింది. డిజిటల్ బ్యాంకింగ్ ఫీచర్లను మెరుగుపరచడం, తన వ్యవసాయ రుణ పోర్ట్ఫోలియోలో నష్టాలను తగ్గిండానికి 35 కొత్త వ్యవసాయ కేంద్రీకృత ప్రాసెసింగ్ సెల్లను ప్రారంభించడం ఇందులో ఉన్నాయి. కస్టమర్ల బ్యాంకింగ్ అవసరాలను పూర్తి స్థాయిలో తీర్చడానికి, సేవల విస్తృతికి ఈ 11 చొరవలు దోహదపడతాయని బ్యాంక్ ప్రకటన ఒకటి పేర్కొంది. ఇందులో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. → తన డిజిటల్ చెల్లింపుల సౌలభ్యతను గణనీయంగా మెరుగుపరచుకున్నట్లు బ్యాంక్ పేర్కొంది. బీహెచ్ఐఎం ఎస్బీఐ పే యాప్లో ట్యాప్–అండ్–పే, అలాగే యోనో యాప్లో మ్యూచువల్ ఫండ్స్పై ఎండ్–టు–ఎండ్ (పూర్తిస్థాయి) డిజిటల్ లోన్లు వంటి రెండు అద్భుతమైన ఫీచర్లను పరిచయం చేసినట్లు ఈ సందర్భంగా పేర్కొంది. → ఎస్బీఐ సూర్య ఘర్ లోన్ విషయంలో పూర్తి డిజిటలైజేషన్ మరో కీలకమైన చొరవగా బ్యాంక్ వివరించింది. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకం కింద సోలార్ రూఫ్టాప్లను ఇన్స్టాల్ చేయడానికి వినియోగదారులు రుణాలను పొందవచ్చని పేర్కొంది. 10 కేవీ సామర్థ్యం వరకు ఈ రుణాలు అందుబాటులో ఉంటాయి. ఎంఎన్ఆర్ఈ/ఆర్ఈసీ పోర్టల్లో దరఖాస్తుదారుల నమోదు నుండి లోన్ పంపిణీ వరకు మొత్తం ప్రక్రియ ఎస్బీఐ డిజిటల్ ప్లాట్ఫారమ్లో నిర్వహించడం జరుగుతుందని తెలిపింది. → దేశం వృద్ధి చక్రాన్ని రూపొందించడంలో భారతీయ ప్రవాసుల గణనీయమైన సహకారాన్ని గుర్తించిన బ్యాంక్... పంజాబ్లోని పాటియాలాలో రెండవ గ్లోబల్ ఎన్ఆర్ఐ సెంటర్ (జీఎన్సీ) ప్రారంభించింది. ఎన్ఆర్ఐ ఖాతాదారుల కు సేవలను మెరుగుపరచడానికి బ్యాంక్ డే రోజున పాటియాలాలో ఈ రెండవ గ్లోబల్ ఎన్ఆర్ఐ సెంటర్ను చైర్మన్ దినేష్ ఖారా ప్రారంభించారు. ఈ సెంటర్లు గ్లోబల్ ఇండియన్ కమ్యూనిటీతో బ్యాంక్ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి దోహదపడతాయి. ఎక్సలెన్స్ హబ్లుగా పనిచేస్తాయి. ఎన్ఆర్ఐ కస్టమర్లకు ప్రత్యేక సేవలను అందిస్తాయి. భారతదేశంలో 434 ప్రత్యేక ఎన్ఆర్ఐ శాఖల నెట్వర్క్, 29 దేశాలలో విదేశీ కార్యాలయాలు, జీసీసీ ఆరు దేశాలలో (గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్– బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) 45 ఎక్సే్ఛంజ్ హౌస్లు, 5 బ్యాంకులతో భాగస్వామ్యంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఎన్ఆర్ఐ ఖాతాదారులకు సమగ్ర సేవలను అందించడానికి బ్యాంక్ సన్నద్దమైంది. → న్యాయవాదుల కోసం సేవలను మెరుగుపరిచే లక్ష్యంతో పూర్తి సదుపాయాలతో కూడిన హైకోర్టు శాఖలను దేశవ్యాప్తంగా ప్రారంభించింది. న్యాయవాదులు, న్యాయ నిపుణుల అవసరాలను ప్రత్యేకంగా తీర్చడానికి ఈ శాఖలు దోహదపడతాయి. → గృహ రుణాలకు సంబంధించిన ప్రాసెస్ మరింత పారదర్శకం కానుంది. గృహ రుణ గ్రహీతలు ఇప్పుడు వివిధ ప్రాసెసింగ్ దశల్లో వారి రుణ దరఖాస్తు స్థితికి సంబంధించి ఆటోమేటెడ్ ఈ–మెయిల్, ఎస్ఎంఎస్ నోటిఫికేషన్లను ఎప్పటికప్పుడు అందుకుంటారు. → వినియోగదారు పూర్తి సంతృప్తి, సౌలభ్యత లక్ష్యంగా ఆధునికీకరించిన ఈ నూతన చర్యలకు శ్రీకారం చుట్టినట్లు బ్యాంక్ వివరించింది. -
పార్టీ ఆవిర్భావ దినోత్సవం.. సీఎం జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. ఆనాడు వందమంది ఏకమై మనపై యుద్ధానికి వస్తే.. నాకు రక్షణగా నిలిచిన ప్రజల కోసం ప్రారంభమైన పార్టీయే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. ఇన్నాళ్ళూ తన ప్రతి అడుగులోనూ అండగా నిలిచిన ప్రతి ఒక్క కార్యకర్తకు, అభిమానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజాక్షేత్రంలో మరోసారి మనం గొప్ప విజయం సాధించేందుకు మీరంతా సిద్ధమా? అని సీఎం జగన్ తెలిపారు. నేడు మన @YSRCParty 14వ వ్యవస్థాపక దినోత్సవం. ఆనాడు వందమంది ఏకమై మనపై యుద్ధానికి వస్తే.. అప్పుడు నాకు రక్షణగా నిలిచిన ప్రజల కోసం ప్రారంభమైన పార్టీ మన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇన్నాళ్ళూ నా ప్రతి అడుగులోనూ అండగా నిలిచిన ప్రతి ఒక్క కార్యకర్తకు, అభిమానికి నా హృద… pic.twitter.com/rdk4qXVilV — YS Jagan Mohan Reddy (@ysjagan) March 12, 2024 -
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఖాయం
సాక్షి, హైదరాబాద్: సాధారణ ఎన్నికల తర్వాత ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ కాలం చెల్లిన మందులాంటి (ఎక్స్పైర్డ్ మెడిసిన్)వారని, ఆయన వచ్చే ఎన్నికల తర్వాత షెడ్డుకు వెళ్లడం ఖాయమని వ్యాఖ్యానించారు. రాహుల్గాంధీ 150 రోజులు, దాదాపు 4 వేలకు పైగా కిలోమీటర్లు భారత్ జోడో యాత్ర చేశారని, ఆ స్ఫూర్తితోనే కర్ణాటకలో, ఆ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించిందని చెప్పారు. కర్ణాటక, తెలంగాణ తర్వాత మహారాష్ట్రలో రాహుల్ ప్రవేశించారని, వచ్చే ఎన్నికల్లో మహారాష్ట్రలోనూ పార్టీ గెలుపు తథ్యమని జోస్యం చెప్పారు. నాగ్పూర్లో గురువారం జరిగిన కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు డబుల్ ఇంజిన్ అంటే మోదీ, అదానీ బీజేపీ డబుల్ ఇంజిన్ అని పదేపదే చెబుతోందని, డబుల్ ఇంజిన్ అంటే మోదీ, అదానీ అని రేవంత్ విమర్శించారు. రాహుల్గాంధీ పార్లమెంట్లో అదానీ గురించి నోరు విప్పగానే ఆ ఇంజిన్ ఆగిపోయిందని ఎద్దేవా చేశారు. మోదీ ఎప్పుడూ చప్పన్ ఇంచ్ ఛాతీ అని గొప్పలు చెప్పుకుంటారని, కానీ ఆయన నేతృత్వంలో నడుస్తున్న లోక్సభలోనే ఒక సామాన్యుడు ప్రవేశించి హంగామా చేస్తుంటే ఏమీ చేయలేకపోయారని విమర్శించారు. ‘మోదీ జీ..మీరు ఒక సామాన్య వ్యక్తిని పార్లమెంట్లోకి రాకుండా ఆపలేకపోయారు. రేపు ఎర్రకోట మీద కూడా కాంగ్రెస్ జెండా ఎగరకుండా ఆపడం కూడా మీతరం కాదు..’ అని అన్నారు. జనవరి 14 నుంచి రాహుల్గాంధీ ‘భారత్ న్యాయ యాత్ర’ మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు కొనసాగుతుందని, దీనితో మోదీ ఇంజిన్ షెడ్డుకు వెళ్లక తప్పదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చి దేశాన్ని కాపాడుకుందామని, పార్టీ శ్రేణులు వచ్చే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు. -
‘దళితబంధు’లో ఎమ్మెల్యేల అవినీతి.. కేసీఆర్ సీరియస్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పని చేసుకోవాలన్నారు. లేకుంటే నష్టపోతారని, సరిగా పని చేయని ఎమ్మెల్యేల తోక కత్తిరిస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ భవన్లో గురువారం పార్టీ ఆవిర్భావ వేడుకలతోపాటు సర్వసభ్య సమావేశం జరిగింది. దాదాపు ఏడుగంటలపాటు ఈ సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. నేతలకు క్లాస్పీకిన కేసీఆర్ ఎన్నికలపై సీఎం కేసీఆర్ నేతలను ఉద్దేశించి మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తూనే.. నేతలకు క్లాస్ పీకారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పనిచేయాలని పేర్కొన్నారు. బాగా పనిచేసిన వారికే ఈసారి టికెట్లు దక్కుతాయని తేల్చి చెప్పారు. నియోజవర్గంలో టికెట్ల పంచాయతీ ఎందుకు వస్తుందని.. టికెట్లు ఎవరికి ఇవ్వాలో తనకు తెలుసని అన్నారు. పార్టీలో గ్రూప్ తగాదాలను పరిష్కరింగే బాధ్యత మంత్రులదేనని స్పష్టం చేశారు. చదవండి: వారికే టికెట్లు.. ఎన్నికలపై కేసీఆర్ క్లారిటీ! అవినీతిపై సీరియస్ కాగా పని తీరు సరిగా లేని ఎమ్మెల్యే జాబితా తన వద్ద ఉందన్నారు సీఎం కేసీఆర్. కానీ ఇప్పుడు వారి పేర్లను బహిర్గతం చేయదలచలేదన్నారు.. సమయం వచ్చినప్పుడు అన్ని చెబుతానని, అంతా బాగానే ఉన్న వ్యక్తిగత కారణాలతో కొంతమంది ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ఇది చాలా క్లిష్టమైన సమయమన్న సీఎం కేసీఆర్.. మీరు పనులతో సంతృప్తి పరచకపోతే చేసేదేమి లేదన్నారు. అదే విధంగా డబుల్బెడ్ రూం, దళితబంధులో అవినీతి జరుగుతుందంటూ కేసీఆర్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలకు వార్నింగ్ కొందరు ఎమ్మెల్యేలు దళిత బంధు పథకం కింద మూడు లక్షల దాకా వసూలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. వారి చిట్టా అంతా తన వద్ద ఉందన్నారు. ఇదే చివరి వార్నింగ్ అంటూ ఎమ్మెల్యేలను కేసీఆర్ హెచ్చరించారు. మళ్లీ వసూలు చేస్తే గనుక టికెట్ ఇవ్వకపోవడమే కాకుండా పార్టీ నుంచి బయటకు పంపిస్తామని హెచ్చరించారు. వారి అనుచరులు డబ్బులు తీసుకున్నా సరే ఎమ్మెల్యేలదే బాధ్యత అని స్పష్టం చేశారు. తలెవరూ అవినీతికి పాల్పడకుండా.. ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. చదవండి: Vizag Beach: వివాహిత శ్వేత మృతి కేసులో ఊహించని ట్విస్ట్ -
సెబీ కొత్త లోగో ఆవిష్కరణ
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ 35వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కొత్త లోగోను ఆవిష్కరించింది. సెబీ మాజీ చైర్మన్సహా ప్రస్తుత, మాజీ పూర్తికాల సభ్యుల సమక్షంలో సరికొత్త లోగోను విడుదల చేసింది. గణాంకాలు, టెక్నాలజీ, కన్సల్టేషన్, పార్టనర్షిప్ తదితరాల వినియోగం ద్వారా సెక్యూరిటీల మార్కెట్లో అత్యుత్తమ నిర్వహణను కొనసాగిస్తున్నట్లు సెబీ ఒక ప్రకటనలో పేర్కొంది. సంస్థకుగల అత్యుత్తమ సంప్రదాయాలు, డేటా, టెక్నాలజీ ఆధారిత కార్యాచరణ, సెక్యూరిటీ మార్కెట్ల అభివృద్ధి, నియంత్రణ, ఇన్వెస్టర్ల పరిరక్షణ కొత్త లోగోలో ప్రతిఫలిస్తున్నట్లు చైర్పర్శన్ మాధవి పురీ బచ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. సెబీ 1988 ఏప్రిల్లో ఏర్పాటైంది. పరిశ్రమతో చర్చలు, భాగస్వామ్యం తదితరాలను చేపడుతూ సత్సంప్రదాయాలను పాటిస్తున్నట్లు సెబీ ఒక ప్రకటనలో తెలియజేసింది. -
బీజేపీ 43వ ఆవిర్భావ దినోత్సవం: పార్టీ పురోగతిలో ఎన్నో త్యాగాలు: ప్రధాని
ఢిల్లీ: నేడు బీజేపీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రసంగించారు. ఈరోజు ఉదయం 9.00 గం.లకు బీజేపీ కేంద్ర కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ జెండాను ఆవిష్కరించిన తర్వాత.. బీజేపీ శ్రేణులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘బీజేసీ పురోగతిలో ఎందరివో త్యాగాలు ఉన్నాయి. హనుమాన్ మాదిరిగా కార్యకర్తలు పని చేయాలి. ప్రజాస్వామ్యానికి బారత్ ఓ మాతృక’ అని మోదీ పేర్కొన్నారు. నేటి మధ్యాహ్నం 12 గంటలకు బెంగాలీ మార్కెట్లో వాల్ రైటింగ్ క్యాంపెయిన్ను జేపీ నడ్డా ప్రారంభించనున్నారు. కాగా, లోక్సభలో రెండు సీట్లతో ప్రస్థానం ప్రారంభించి అత్యధికంగా 303 సీట్లతో కేంద్ర ప్రభుత్వాన్ని స్థాపించింది బీజేపీ. ఆర్ఎస్ఎస్ హిందూ జాతీయ వాదం ఎజెండాతో తొలుత జన్సంఘ్గా ప్రస్థానం ప్రారంభించింది. దేశంలో ఎమెర్జెన్నీ అనంతరం 1980, ఏప్రిల్ 6వ తేదీన బీజేపీగా రూపాంతరం చెందింది. -
ఊరూరా సందడే సందడి
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు, నేతలు పండగలా నిర్వహించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి, శ్రద్ధాంజలి ఘటించి.. వైఎస్సార్సీపీ జెండాలనూ ఊరూరా ఆవిష్కరించారు. భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించి.. పార్టీ కార్యాలయాల్లో భారీ కేక్లు కట్ చేశారు. నిరుపేదలకు దుస్తులు పంపిణీ చేసి.. అన్నదానం చేశారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలు, వైఎస్సార్సీపీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దివంగత వైఎస్సార్ ఆశయ సాధనే లక్ష్యంగా.. ప్రజాభ్యుదయమే ధ్యేయంగా 2011 మార్చి 12న వైఎస్సార్సీపీని సీఎం వైఎస్ జగన్ స్థాపించిన విషయం తెలిసిందే. ఈ ప్రస్థానంలో 12 ఏళ్లు పూర్తి చేసుకుని ఆదివారం 13వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సేవాకార్యక్రమాలు నిర్వహించారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు జోగి రమేష్, మేరుగు నాగార్జున, పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకుడు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి, మహిళా విభాగం అధ్యక్షురాలు పోతుల సునీత తదితరులు పాల్గొన్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, నేతలు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మూడున్నరేళ్లుగా రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ సాగిస్తున్న సంక్షేమాభివృద్ధి పాలనను గుర్తుచేస్తూ యువకులు జై జగన్ నినాదాలు చేశారు. ♦విశాఖపట్నం జిల్లా మద్దిలపాలెం కార్యాలయంలో పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మహానేత వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ♦ అనంతపురం జిల్లా కేంద్రంలో ఆ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. తిరుపతిలోని తన నివాసంలో మంత్రి పెద్దిరెడ్డి పార్టీ జెండాను ఎగురవేశారు. నగరి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మంత్రి ఆర్కే రోజా కేక్ కట్ చేశారు. తిరుపతిలో ఎంపీ గురుమూర్తి జెండా ఎగురవేశారు. ఒంగోలులో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, యర్రగొండపాలెంలో మంత్రి ఆదిమూలపు సురేష్ కేక్ కట్ చేశారు. ♦గుంటూరులో పార్టీ కార్యాలయం వద్ద జెండాను ఆవిష్కరించి, కేక్ను కట్చేశారు. 500 మీటర్ల వైఎస్సార్సీపీ జెండాతో ర్యాలీ నిర్వహించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవాన్ని నేతలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్, కృష్ణాజిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ పతాకం రెపరెపలాడింది. ♦ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తణుకులో మంత్రి కారుమూరి, ఏలూరులో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని వేడుకల్లో పాల్గొన్నారు. ♦ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన వేడుకల్లో మంత్రి వేణు, హోంమంత్రి తానేటి వనిత, ఎంపీ భరత్రామ్ పాల్గొన్నారు. ♦ విజయనగరంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, సాలూరులో ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర పార్టీ జెండాను ఎగురవేశారు. -
ప్రజాస్వామ్యంలో వైఎస్సార్సీపీ ఓ రోల్ మోడల్: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆవిర్బావ దినోత్వవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వైఎస్సార్సీపీ పార్టీ జెండాను ఎగురవేసి నేతలు వేడుకలు జరుపుకుంటున్నారు. ఇక, తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్బంగా సజ్జల మాట్లాడుతూ.. 12 ఏళ్లుగా సీఎం వైఎస్ జగన్ ఆదర్శవంతంగా పార్టీని నడుపుతున్నారు. నిరంతరం ప్రజల్లో ఉన్న నాయకుడు వైఎస్ జగన్. అవినీతి లేకుండా ప్రజలకు పారదర్శక పాలన అందిస్తున్నారు. విద్య, వైద్య రంగాల్లో దేశంలోనే ఆదర్శంగా నిలిచేలా సంస్కరణ తీసుకొచ్చారు. దేశ చరిత్రలోనే ఎవరూ చేయని రీతిలో ఉద్యోగాల భర్తీ చేశారు. సచివాలయ వ్యవస్థతో పరిపాలన స్వరూపాన్ని మార్చేశారు. అధికారాన్ని బాధ్యతగా భావించి సీఎం జగన్ పాలన కొనసాగిస్తున్నారు. మహిళలకు, బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు రిజర్వేషన్లను తీసుకువచ్చిన పార్టీ మరొకటి లేదు. ప్రజలకు జవాబుదారీగా ప్రభుత్వం నడుస్తోంది. ప్రజాస్వామ్యంలో వైఎస్సార్సీపీ ఓ రోల్ మోడల్. వైఎస్సార్సీపీకి ఎప్పటికీ ఓటమి ఉండదు. ఎంత మంది కుట్రలు చేసినా పార్టీని ఏమీ చేయలేరు అని కామెంట్స్ చేశారు. ఇక, పార్టీ ఆవిర్బావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి జోగి రమేష్, మేరుగ నాగార్జున.. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, లేళ్ల అప్పిరెడ్డి, లక్ష్మీ పార్వతి, పోతుల సునీత, ఇతర నేతలు పాల్గొన్నారు. -
‘నిరంతరం ప్రజల్లో ఉన్న నాయకుడు సీఎం జగన్’
Updates.. ►విజయవాడ భవానిపురం ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం వద్ద పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని జండా ఎగరవేసి కేక్ కటింగ్ నిర్వహించిన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, దుర్గగుడి పాలకొండ మండల చైర్మన్ కరటం రాంబాబు పార్టీ నాయకులు డివిజన్ కార్పొరేటర్లు తదితరులు ► నెల్లూరు పార్టీ ఆఫీసులో వైఎస్సార్సీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి మాట్లాడుతూ.. సీఎం జగన్ ఎంతో కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని అన్నారు. ► వైవీ సుబ్బారెడ్డి.. 12 ఏళ్ల ప్రస్థానంలో వైఎస్సార్సీపీ ప్రయాణం ఓ చరిత్ర. వైఎస్సార్ మరణంతో కుంగిపోయిన 570 కుటుంబాలను ఆదుకోవాలని తపనపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కేసులు పెట్టినా భయపడకుండా ప్రజల కోసం పాటుపడ్డారు. రెండేళ్లలో 67 మంది ఎమ్మెల్యేలు 9 మంది ఎంపీలను గెలుపించుకున్న నాయకుడు సీఎం జగన్. టీడీపీ ప్రలోభాలు, బెదిరింపులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినప్పడు మళ్లీ మెజార్టీతో వస్తానని చెప్పి గెలిచిన నాయకుడు సీఎం జగన్. గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం, అంబేడ్కర్ సామాజిక న్యాయం ఏపీలో ముఖ్యమంత్రి జగన్ అమలు చేసి చూపించారు. ► ఎంపీ విజయ సాయిరెడ్డి.. మహానేత అమలు చేసిన పథకాల బాటలో సాగాలన్న దృఢ సంకల్పంతో సీఎం వైఎస్ జగన్ వైయస్సార్ కాంగ్రెస్పార్టీని స్థాపించి నేటికి 13 సంవత్సరాలు. లక్ష్యాన్ని చేరుకోవటమే కాకుండా, అంతకు మించి ఆయన మరో నాలుగు అడుగులు ముందుకు వేయటమే కనిపిస్తోంది. మహానేత అమలు చేసిన పథకాల బాటలో సాగాలన్న దృఢ సంకల్పంతో జగన్గారు వైయస్సార్ కాంగ్రెస్పార్టీని స్థాపించి నేటికి 13 సంవత్సరాలు! లక్ష్యాన్ని చేరుకోవటమే కాకుండా, అంతకు మించి ఆయన మరో నాలుగు అడుగులు ముందుకు వేయటమే కనిపిస్తోంది! 1/5 — Vijayasai Reddy V (@VSReddy_MP) March 12, 2023 ఇది గ్రామ స్వరాజ్యం నుంచి జిల్లాల పునర్విభజన వరకు పరిపాలన సంస్కరణలు చేసిన నాయకుడి పార్టీ. ఇది ప్రాంతాలకు న్యాయం కోసం వికేంద్రీకరణను సిద్ధాంతంగా ఆచరిస్తున్న పార్టీ. ఇది తెలుగునాట మరో పారిశ్రామిక విప్లవానికి నాందీపలుకుతున్న దార్శనికుడి పార్టీ. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావించి 98.5 శాతం వాగ్దానాన్ని అమలు చేసిన నాయకుడి పార్టీ. నేడు ఈ పార్టీ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, ఓసీ నిరుపేదల పార్టీ! ఈ పార్టీ సామాజిక న్యాయానికి, మహిళా–విద్యా–రాజకీయ–ఆర్థిక సాధికారతలకు దేశంలోనే చుక్కాని! 2/5 — Vijayasai Reddy V (@VSReddy_MP) March 12, 2023 ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వానికి అర్థం.. మారిన గ్రామం, మారుతున్న సామాజిక చిత్రం, రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికీ అండ. ఆయన నేటి తరానికి ఆలంబన, భావితరానికి భరోసా. ఇది గ్రామ స్వరాజ్యం నుంచి జిల్లాల పునర్విభజన వరకు పరిపాలన సంస్కరణలు చేసిన నాయకుడి పార్టీ! ఇది ప్రాంతాలకు న్యాయం కోసం వికేంద్రీకరణను సిద్ధాంతంగా ఆచరిస్తున్న పార్టీ. ఇది తెలుగునాట మరో పారిశ్రామిక విప్లవానికి నాందీపలుకుతున్న దార్శనికుడి పార్టీ! 4/5 — Vijayasai Reddy V (@VSReddy_MP) March 12, 2023 ► వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండా ఎగురవేసిన సజ్జల. ► సజ్జల మాట్లాడుతూ.. 12 ఏళ్లుగా సీఎం వైఎస్ జగన్ ఆదర్శవంతంగా పార్టీని నడుపుతున్నారు. నిరంతరం ప్రజల్లో ఉన్న నాయకుడు వైఎస్ జగన్. విద్య, వైద్య రంగాల్లో దేశంలోనే ఆదర్శంగా నిలిచేలా సంస్కరణ తీసుకొచ్చారు. దేశ చరిత్రలోనే ఎవరూ చేయని రీతిలో ఉద్యోగాల భర్తీ చేశారు. సచివాలయ వ్యవస్థతో పరిపాలన స్వరూపాన్ని మార్చేశారు. అధికారాన్ని బాధ్యతగా భావించి సీఎం జగన్ పాలన కొనసాగిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో వైఎస్సార్సీపీ ఓ రోల్ మోడల్. వైఎస్సార్సీపీకి ఎప్పటికీ ఓటమి ఉండదు. ఎంత మంది కుట్రలు చేసినా పార్టీని ఏమీ చేయలేరు. ►వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఆవిర్బావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి జోగి రమేష్, మేరుగ నాగార్జున.. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, లేళ్ల అప్పిరెడ్డి, లక్ష్మీ పార్వతి, పోతుల సునీత, ఇతర నేతలు. సాక్షి, తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12 వసంతాలు పూర్తి చేసుకుని మార్చి 12వ తేదీన 13వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ జెండాలు ఎగురవేయాలని, దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు రంగులు వేసి పూలమాలలతో అలంకరించి, పలు సేవా కార్యక్రమాలతో పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ కేంద్ర కార్యాలయం పిలుపునిచ్చింది. పలు సేవా కార్యక్రమాలతో వేడుకలు ఘనంగా నిర్వహించాలని సూచించింది. ► అలాగే, వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని శాసనసభ్యులు, నియోజకవర్గ సమన్వయకర్తలు ఘనంగా నిర్వహించాలని కేంద్ర కార్యాలయం తెలిపింది. ఇక, తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ పండుగను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ ముఖ్య నేతలు హాజరుకానున్నారు. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ఎన్నో సవాళ్లను అధిగమించి, సంపూర్ణ ప్రజా బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం విధితమే. అధికారంలోకి వచ్చాక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన దాదాపు అన్ని హామీలు అమలు చేయడమే కాక, చెప్పని వాటితో పాటు, అనేక సంక్షేమ – అభివృద్ధి కార్యక్రమాల అమలు ద్వారా ప్రజారంజక పరిపాలన సాగిస్తోంది. -
శాంతిభద్రతల కోసం బీజేపీని తిరస్కరించాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మతవిద్వేషాల వ్యాప్తికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని, శాంతిభద్రతలు వెల్లివిరియాలంటే కమలనాథులను తిరస్కరించాలని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రజలకు పిలుపునిచ్చారు. కేవలం మతోన్మాదాన్ని రెచ్చగొట్టి అధికారంలో రావాలని పగటికలలు కంటోందని దుయ్యబట్టారు. గురువారం హైదరాబాద్ దారుస్సలాం మైదానంలో జరిగిన ఏఐఎంఐఎం ఆవిర్భావ దినోత్సవాల్లో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి, అనంతరం బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని, బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే ఇక్కడే జీడీపీ ఎక్కువని పేర్కొన్నారు. రాష్ట్రంలో మతకల్లోలాలు లేవని, శాంతి, అభివృద్ధి రెండూ ఉన్నాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతి, రాజ్యాంగం కావాలో లేక బుల్డోజర్ కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు గంట మోగినట్లేనని, పార్టీ బాధ్యులు ఎన్నికలకు సంసిద్ధం కావాలని అసదుద్దీన్ పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో రాజస్తాన్, కర్ణాటకలో ఏఐఎంఐఎం పోటీ చేస్తుందని ప్రకటించారు. గ్యాస్ సిలిండర్కు నమస్కారం పెట్టండి వచ్చే ఎన్నికల్లో ఓటు వేసే ముందు మహిళలు తమ ఇళ్లలోని గ్యాస్ సిలిండర్లకు నమస్కారం పెట్టి వెళ్లాలని ఒవైసీ విజ్ఞప్తి చేశారు. వంటగ్యాస్ సిలిండర్ల ధరలను మరోసారి పెంచిన మోదీ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. ఖదీర్ఖాన్ కుటుంబాన్ని తమ పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఒవైసీ ప్రకటించారు. భారతదేశానికి చాయ్వాలా, చౌకీదార్ అవసరం లేదని, దేశ సరిహద్దులను రక్షించగల బలమైన ప్రధాని అవసరమని ఏఐఎంఐఎం శాసన పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అహ్మద్ పాషా ఖాద్రీ, అహ్మద్ పాషా ఖాద్రీ, జాఫర్ హుస్సేన్ మేరాజ్, కౌసర్ మోహియుద్దీన్, అహ్మద్ బలాలా, మోజంఖాన్, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా ఎన్ఐఆర్డీపీఆర్ 64వ వ్యవస్థాపక దినోత్సవం
ఏజీవర్సిటీ: రాజేంద్రనగర్లోని జాతీయ గ్రామీణాభివృద్ధి పంచాయతీ రాజ్ సంస్థ 64వ వ్యవస్థాపక దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హజరై మాట్లాడారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. పంచాయతీ రాజ్ సంస్థలను బలోపేతం చేయడం సమగ్రాభివృద్ధికి చాలా అవసరమన్నారు. గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలతో పోటీపడుతున్నాయన్నారు. విద్య, ఆరోగ్యం వంటి అనేక రంగాలలో భారతదేశం బెంచ్మార్క్లను సాధించిందన్నారు. ఉపాంత రంగాలకు చెందిన ప్రజలకోసం ఎన్ఐఆర్డీపీఆర్ జాతీయ స్థా యి మేళాలను నిర్వహించడం ద్వారా దేశవ్యా ప్తంగా కళాకారులను ప్రొత్సహిస్తుందన్నారు. -
Singareni: బొగ్గు ఉత్పత్తిలో వీరే కీలకం..
సింగరేణి(కొత్తగూడెం): దక్షిణ భారతదేశానికి తలమానికంగా విరాజిల్లుతున్న సింగరేణి సంస్థ ఆవిర్భవించి నేటికి 134 సంవత్సరాలు కావస్తోంది. ప్రారంభంలో బొగ్గు తవ్వకానికే పరిమితమైన సింగరేణి.. క్రమంగా తెలంగాణ సహా ఏడు రాష్ట్రాల్లో విద్యుత్, సిమెంట్, పేపర్తో పాటు మరెన్నో పరిశ్రమలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా పాటు తోడ్పాటునందిస్తోంది. లక్షలాది మంది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తోంది. సింగరేణి ఖాళీ స్థలాల్లో 300 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసి రోజుకు 10 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేసి ప్రభుత్వ గ్రిడ్కు అందిస్తూ ఏడాదికి రూ.120 కోట్లు ఆర్జిస్తోంది. అంతేకాక అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ తన వంతు పాత్ర పోషిస్తోంది. నూతన టెక్నాలజీతో ఉత్పత్తి.. 1889లో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించిన సింగరేణి సుమారు 59 సంవత్సరాల పాటు మ్యాన్ పవర్ ద్వారా బొగ్గు ఉత్పత్తి చేసింది. ఆ తర్వాత 1948లో జాయ్ లోడర్ షటిల్ కార్ను, 1950లో క్యాప్ ల్యాంప్లు, 1951లో ఎలక్ట్రికల్ కోల్ డ్రిల్స్, 1953లో ఎలక్ట్రిక్ క్యాప్ ల్యాంప్స్, 1954లో ప్లేమ్ ప్రూఫ్ ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్లను వినియోగిస్తూ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచింది. 1975లో ఓపెన్కాస్ట్ గనులు, 1961లో రెస్క్యూ టీమ్ల ఏర్పాటు, 1979లో సైడ్ డిశ్చార్జ్ లోడర్, 1981లో లోడ్ హ్యాండ్ డంపర్స్ 1983లో లాంగ్ వాల్మైనింగ్, 1986లో వాకింగ్ డ్రాగ్లైన్, 1989లో ఫ్రెంచ్ బ్లాస్టింగ్ గ్యాలరీ మెథడ్ ఏర్పాటు చేసుకుంది. గనుల్లో కార్మికుల నడకను తగ్గించేందుకు 1990లో మ్యాన్ రైడింగ్ చైర్ లిఫ్టింగ్ పద్ధతిని కొత్తగూడెం ఏరియాలోని వీకె–7షాఫ్ట్లో ఏర్పాటు చేసింది. 1994లో ఇన్పుట్ క్రషింగ్ కన్వేయర్ యంత్రాలను ప్రవేశ పెట్టింది. ఇలా అనేక రకాల నూతన టెక్నాలజీని వినియోగించి కార్మికులకు రక్షణతో పాటు అధిక బొగ్గు ఉత్పత్తికి అడుగులు వేసింది. బొగ్గు ఉత్పత్తిలో వీరే కీలకం.. ►ఫేస్ వర్కర్లు: బొగ్గు తీసే ప్రదేశంలో వీరు కీలక పాత్ర పోషిస్తారు. ఇందులో ఆపరేటర్లు, కోల్ కట్టర్లు, సపోర్ట్మెన్లు ఉంటారు. ► లైన్మెన్లు: ఉత్పత్తిలో ప్రధానమైన ఎస్డీఎల్, సీఎమ్మార్ యంత్రాలు నడిచేందుకు వీలుగా ట్రాక్లు వేయడం వీరి ప్రధాన విధి. ► కన్వేయర్ ఆపరేటర్లు: బొగ్గును బయటికి తీసేందుకు అవసరమైన బెల్ట్ను నడుపుతారు. ► పంప్ ఆపరేటర్లు: బొగ్గుతీసే క్రమంలో భూమి పొరల నుంచి వచ్చే నీటిని ఎప్పటికప్పుడు బయటకు పంపిస్తారు. ► ఫిట్టర్లు: పని చేస్తున్న క్రమంలో మోటార్లు, యంత్రాలు మరమ్మతులకు గురైతే తక్షణమే రిపేర్ చేసి, పని ఆగకుండా చూస్తారు. ► ఎలక్ట్రీషియన్లు: గనుల్లో 24 గంటలూ విద్యుత్ అంతరాయం లేకుండా చూడడం వీరి ప్రధాన విధి. పంపులకు, మోటార్లకు నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తుండాలి. ► టెండాల్స్: బరువైన యంత్రాల విడి భాగాలను గనిలోకి చేర్చి, వాటిని బిగించే సమయంలో ఫిట్టర్లకు సహాయపడుతుంటారు. ► హాలర్ డ్రైవర్లు: బొగ్గు ఉత్పత్తికి, గనిలోని యంత్ర విభాగాలకు అంతరాయం కలగకుండా చూస్తుంటారు. ► జనరల్ మజ్దూర్లు: టెక్నికల్ సిబ్బంది ఎవరైనా విధులకు హాజరు కాకుంటే వారి స్థానంలో పనిచేసే వారికి వీరు తోడుగా ఉంటూ సహకరిస్తుంటారు. ► ఎలక్ట్రికల్, మైనింగ్ సూపర్వైజర్లు: గనిలో ఉత్పత్తికి సంబంధించిన పనులకు కార్మికులను పురమాయించడం, రక్షణ నిబంధనలను కార్మికులకు వివరిస్తూ, ఉత్పత్తికి అవసరమైన మెటీరియల అందిస్తుంటారు. వీరిని జూనియర్ అధికారులు అంటారు. ► సూపర్వైజర్లు, ఎలక్ట్రిక్ మెకానిక్లు: గనిలో ఎలక్ట్రికల్, యంత్రాలను నిత్యం పర్యవేక్షిస్తుంటారు. పని సమయంలో అవి ఆగకుండా చూడాల్సిన బాధ్యత వీరిదే. ► మైనింగ్ సర్దార్, ఓవర్మెన్లు: బొగ్గు పొరల్లో డ్రిల్లింగ్ వేసి, వాటిలో పేలుడు పదార్థాలతో బ్లాస్టింగ్ చేస్తేనే బొగ్గు వస్తుంది. ఆ తరువాత రూఫ్ సురక్షితంగా ఉందా లేదా అని పరిశీలించే బాధ్యత వీరిదే. అక్కడ పనిచేసే కార్మికులకు సైతం వీరే విధులు కేటాయిస్తుంటారు. ► అసిస్టెంట్ మేనేజర్లు: గనిలో అవసరమైన పనులను పర్యవేక్షించేవారు. ► ఇంజనీర్లు: యంత్రాల పర్యవేక్షణ, పనితీరు, రక్షణ చర్యలు, పనుల పర్యవేక్షణ, పనులకు సంబంధించిన రిపోర్టును ఉన్నతాధికారులకు అందించేవారు. ► రక్షణాధికారి : గనుల్లో కార్మికులు, ఉద్యోగుల రక్షణ వీరి విధి. ఎవరికైనా ప్రమాదం జరిగితే తక్షణమే వారికి అవసరమైన సహాయక చర్యలు చేపడతారు. ► వెంటిలేషన్ ఆఫీసర్: గనుల్లో గాలి, వెలుతురు, తాగునీటి సదుపాయం ఏర్పాటు చేయడం, ప్రమాదాలు జరుగకుండా చూడడం వీరి బాధ్యత. ► సర్వేయర్: గనిని ప్రణాళిక ప్రకారం నడిపించి, బొగ్గు నిక్షేపాల గుర్తింపు, వాటిని ఏవిధంగా తీస్తే కంపెనీకి ఉపయోగకరంగా ఉంటుందో గమనించి అధికారులకు వివరించడం, కార్మికులకు పనులు పురమాయించడం వీరి విధి. ► ఆన్ షెట్టర్: గనిలోకి కార్మికులు, అధికారులను సిస్టమ్ ప్రకారం లోనికి పంపే యంత్రాన్ని(కేజీ) ఆపరేట్ చేస్తుంటారు. ► వైండింగ్ ఇంజన్ ఆపరేటర్: గనిలో అత్యంత ముఖ్యమైన వారు వైండింగ్ ఇంజన్ ఆపరేటర్లు. కేజీ గనిలోకి వెళ్లాలన్నా.. లోనికి వెళ్లిన కేజీ బయటకు రావాలన్నా వీరే కీలకం. ► గని మేనేజర్: గని మొత్తం ఈ అధికారి ఆధీనంలో ఉంటుంది. గనికి కావాల్సిన ప్రతి మెటీరియల్ను ఏరియా స్టోర్స్ నుంచి తెప్పించడం, వాటి కేటాయింపు బాధ్యతలను పర్యవేక్షించడం, కార్మికులకు విధులు కేటాయించడంతో పాటు గని పర్యవేక్షణంతా ఈ అధికారిదే. గుండెకాయలా కార్పొరేట్ సింగరేణి సంస్థకు కార్పొరేట్ కార్యాలయం గుండెకాయలా పనిచేస్తోంది. ఇందులో ప్రధానంగా ఐదుగురు డైరెక్టర్లు, 53 మంది జీఎంలు విధులు నిర్వహిస్తుంటారు. సింగరేణి వ్యాప్తంగా ఉన్న గనులు, డిపార్ట్మెంట్లను మానిటరింగ్ చేస్తుంటారు. మొత్తంగా చూస్తే సంస్థలో 43 వేల మంది కార్మికులు, 2,400 మంది అధికారులు పని చేస్తున్నారు. మరో 10 లక్షల కుటుంబాలకు ఈ సంస్థ పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. (క్లిక్ చేయండి: అక్షరదీపాలు.. నల్లసూరీళ్లు) -
హకీంపేటలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ 30వ వార్షికోత్సవం (ఫోటోలు)
-
వ్యాపార వైవిధ్యంపై ఎల్ఐసీ దృష్టి
న్యూఢిల్లీ: జీవిత బీమా రంగంలోని దిగ్గజ సంస్థ ఎల్ఐసీ సెప్టెంబర్ 1వ తేదీకి 66 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, తన వ్యాపార వైవిధ్యంపై దృష్టి సారించింది. నాన్ పార్టిసిపేటింగ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తుల విభాగంలో మార్కెట్ వాటాను పెంచుకోవాలని అనుకుంటున్నట్టు సంస్థ చైర్మన్ ఎంఆర్ కుమార్ వెల్లడించారు. జీవిత బీమా రంగంలో ఎల్ఐసీకి సుమారు 65 శాతం మార్కెట్ వాటా ఉన్న విషయం తెలిసిందే. 17 ఇండివిడ్యువల్ పార్టిసిపేటింగ్ బీమా ప్లాన్లు 17 ఇండివిడ్యువల్ (వ్యక్తుల విభాగంలో) నాన్పార్టిసిపేటింగ్ ఉత్పత్తులు, 11 గ్రూపు ప్లాన్లను ఎల్ఐసీ ఆఫర్ చేస్తోంది. నాన్ పార్టిసిపేటరీ ప్లాన్లలో బోనస్లు రావు. పాలసీదారు మరణించిన సందర్భాల్లోనే పరిహారాన్నిచ్చే అచ్చమైన టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను నాన్ పార్టిసిపేటరీ ప్లాన్లుగా చెబుతారు. తమ ఏజెంట్లు ఇక ముందూ ఉత్పత్తుల పంపిణీకి మూలస్తంభాలుగా కొనసాగుతారని కుమార్ తెలిపారు. ఇండివిడ్యువల్ బీమా ఉత్పత్తుల వ్యాపారంలో 95 శాతం ప్రీమియం తమకు ఏజెన్సీల ద్వారానే వస్తున్నట్టు చెప్పారు. ఎల్ఐసీకి దేశవ్యాప్తంగా 13.3 లక్షల ఏజెన్సీలు ఉండడం గమనార్హం. బ్యాంకు అష్యూరెన్స్ (బ్యాంకుల ద్వారా) రూపంలో తమకు వస్తున్న వ్యాపారం కేవలం 3 శాతంగానే ఉంటుందని కుమార్ తెలిపారు. ‘‘జీవితావసరాలకు బీమా కావాలన్న అవగాహన గరిష్ట స్థాయికి చేరింది. కస్టమర్ల మారుతున్న అవసరాలకు తగ్గట్టు కొత్త విభాగాల్లోకి ప్రవేవిస్తాం’’అని వెల్లడించారు. నాన్ పార్టిసిపేటరీ ప్లాన్లను మరిన్ని తీసుకురావడం ద్వారా తాము అనుసరించే దూకుడైన వైవిధ్య విధానం తగిన ఫలితాలను ఇస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. బ్యాంక్ అష్యూరెన్స్ను మరింత చురుగ్గా మారుస్తామన్నారు. -
Vishva Hindu Parishad: ధార్మిక సేవా అక్షౌహిణి!
విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) .... ఈ పేరు ఇటీవల కాలంలో ప్రపంచ దేశాల ప్రజల నోళ్లలో నానుతున్న ధార్మిక పదం! అయోధ్య రామ జన్మభూమి కేసు సుప్రీం కోర్టులో విజయం సాధించిన 2019 నవంబర్ 9 నుంచి మొన్నటి రామమందిర నిర్మాణ భూమిపూజ (ఆగస్టు 5, 2020) నాటికి అన్ని వర్గాల్లో చర్చకు మూలమైంది విశ్వహిందూ పరిషత్. 1964లో శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభ పర్వదినాన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) రెండవ చీఫ్ మాధవ సదాశివ గోల్వాల్కర్ (గురూజీ) నేతృత్వంలో విశ్వహిందూ పరిషత్ పురుడు పోసుకుంది. ముంబై మహానగరంలోని సాందీపని ఆశ్రమం వేదికగా సంస్థకు అంకురార్పణ జరిగింది. మొట్టమొదట స్వామి చిన్మయానంద సరస్వతి అధ్యక్షులుగా వీహెచ్పీ కార్యక్షేత్రంలోకి అడుగుపెట్టింది. అనేకమైన సంఘర్షణలు, ఆందోళనలు, నిర్మాణాత్మక కార్యక్రమాలతో వీహెచ్పీ దినదినాభివృద్ధి చెందుతూ వచ్చింది. ఆర్ఎస్ఎస్కు అనుబంధంగా ఉంటూ ధార్మిక, సామాజిక, సేవా రంగాల్లో కార్యకలాపాలు విస్తరించింది. దాదాపు 17 ప్రధాన విభాగాల్లో హిందూ జీవన విధానంపై ప్రపంచానికి అవగాహన కల్పిస్తూ నిస్వార్థ కృషి సల్పు తున్నది. 1983లో వీహెచ్పీ ప్రతిష్ఠాత్మకంగా ‘ఏకాత్మకం యజ్ఞం’ నిర్వ హించింది. 1983 నవంబర్ 16 నుంచి డిసెంబర్ 16 వరకూ సామాజిక సమరసతా భావం నింపేందుకు... అంటరానివారు, దళితులు అనే భావన విడనాడి ‘సకల హైందవ జాతి ఒక్కటే’ అని చాటి చెప్పింది. సామాజిక దురాచారాలను రూపుమాపేందుకు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేక కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో నిర్వహిస్తోంది. ఏకాత్మక యజ్ఞం, అయోధ్య రామమందిర ఉద్యమ నిర్వహణలో విజయం సాధించి హిందువులకు ఆత్మవిశ్వాసం భరోసాను కల్పించింది. మతం మార్చుకున్న హిందువులను తిరిగి హిందూ మతంలోకి రప్పించే ‘ఘర్ వాపసీ’ ఉద్యమాన్నీ నిర్వహిస్తోంది. (క్లిక్: ప్రణాళికాబద్ధంగా దూరం చేస్తున్నారు!) – పగుడాకుల బాలస్వామి, వీహెచ్పీ తెలంగాణ ప్రచార సహ ప్రముఖ్ (వీహెచ్పీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా) -
ఆత్మనిర్భర్ భారత్కు ఐఐసీటీ సాయం
సాక్షి, హైదరాబాద్: దేశం ఆత్మనిర్భరత సాధించే విషయంలో హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) గణనీయమైన సాయం చేస్తోందని డీఆర్డీవో చైర్మన్, రక్షణ శాఖ కార్యదర్శి డాక్టర్ జి.సతీశ్రెడ్డి తెలిపారు. కోవిడ్ టీకాలకు అవసరమైన కీలక రసాయనాలు మొదలుకొని అనేక ఇతర అంశాల్లోనూ విదేశాలపై ఆధారపడాల్సిన అవసరాన్ని ఐఐసీటీ తప్పించిందని ఆయన అన్నారు. ఐఐసీటీ 79వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఏర్పాటైన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సతీశ్రెడ్డి దేశం ఆత్మనిర్భరత సాధించాల్సిన అవసరాన్ని... అందుకు చేస్తున్న ప్రయత్నాలను సోదాహరణంగా వివరించారు. ప్రభుత్వం ప్రకటించక ముందు కూడా ఐఐసీటీ పలు అంశాల్లో రక్షణ శాఖ అవసరాలను తీర్చిందని ఆయన గుర్తుచేశారు. నావిగేషనల్ వ్యవస్థల్లో కీలకమైన సెన్సర్ల విషయంలో దేశం స్వావలంబన సాధించడం ఐఐసీటీ ఘనతేనని కొనియాడారు. ప్రస్తుతం అత్యాధునిక బ్యాటరీలు, ఎలక్ట్రోడ్లు, ఎలక్ట్రోలైట్ల విషయంలోనూ ఇరు సంస్థలు కలసికట్టుగా పనిచేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. కోవిడ్కు ముందు దేశంలో ఏడాదికి 47 వేల పీపీఈ కిట్లు మాత్రమే తయారయ్యేవని.. ఆ తరువాత కేవలం నెల వ్యవధిలోనే ఇది రోజుకు 6 లక్షలకు పెరిగిందని చెప్పారు. వెంటిలేటర్లు, ఆక్సిజన్ తయారీ విషయాల్లోనూ ఇదే జరిగిందని, అనేక సృజనాత్మక ఆవిష్కరణల కారణంగా దేశం వాటిని సొంతంగా తయారు చేసుకోవడంతోపాటు ఉత్పత్తి చౌకగా జరిగేలా కూడా చేశామని వివరించారు. డిజైన్తో మొదలుపెట్టి... ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం సాకారం కావాలంటే దేశానికి అవసరమైనవన్నీ ఇక్కడే తయారు కావాలని డాక్టర్ జి.సతీశ్రెడ్డి అభిప్రాయపడ్డారు. వివిధ ఉత్పత్తుల డిజైనింగ్ మొదలుకొని అభివృద్ధి వరకు అవసరాలకు తగ్గట్టుగా భారీ మోతాదుల్లో వాటిని తయారు చేయగలగడం, ఆధునీకరణకు కావాల్సిన సాధన సంపత్తిని సమకూర్చుకోవడం కూడా ఆత్మనిర్భర భారత్లో భాగమని స్పష్టం చేశారు. అతితక్కువ ఖర్చు, మెరుగైన నాణ్యత కూడా అవసరమన్నారు. అదే సమయంలో దేశం కోసం తయారయ్యేవి ప్రపంచం మొత్తమ్మీద అమ్ముడుపోయేలా ఉండాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ ఆత్మనిర్భర భారత్ కార్యక్రమం కారణంగా ఇప్పుడు దేశంలోని యువత రాకెట్లకు అవసరమైన ప్రొపల్షన్ టెక్నాలజీలు, గ్రహగతులపై పరిశోధనలు చేస్తున్నాయని... స్టార్టప్ కంపెనీలిప్పుడు దేశంలో ఓ సరికొత్త విప్లవాన్ని సృష్టిస్తున్నాయని ప్రశంసించారు. సృజనాత్మక ఆలోచనలకు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల కింద అన్ని రకాల మద్దతు లభిస్తోందన్నారు. కార్యక్రమంలో ఐఐసీటీ డైరెక్టర్ డి.శ్రీనివాసరెడ్డి, మాజీ డైరెక్టర్లకు ఏవీ రామారావు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఐఐసీటీలో ప్రతిభ కనపరిచిన సిబ్బంది, శాస్త్రవేత్తలకు మాజీ డైరెక్టర్, కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ కార్యదర్శి డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ అవార్డులు అందజేశారు. -
Kakani Govardhan Reddy: ఏపీ వైపు దేశం చూపు..
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల దేశం మొత్తం ఏపీ వైపు చూస్తోందని వ్యవసాయ శాఖమంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి అన్నారు. కేంద్రంతో సహా పలు రాష్ట్రాలు ఏపీని మోడల్గా తీసుకుని విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో తీసుకొచ్చిన సంస్కరణలు, విప్లవాత్మక మార్పులు అందిపుచ్చుకునేందుకు ముందుకొస్తున్నాయన్నారు. సీఎం వైఎస్ జగన్ ఆలోచనలు కార్యరూపం దాల్చేందుకు నాబార్డు అందిస్తోన్న చేయూత ప్రశంసనీయమన్నారు. ఇదేబాటలో మిగిలిన బ్యాంకులన్నీ సహకరించాలని కోరారు. విజయవాడలో సోమవారం జరిగిన నాబార్డు 41వ వ్యవస్థాపక దినోత్సవంలో మంత్రి కాకాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. 2021–22 సీజన్లో ఏపీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల కోసం రూ.39,708 కోట్ల రుణాలు నాబార్డు అందించడం నిజంగా అభినందనీయమన్నారు. నోటిఫై చేసిన ప్రతి పంటకు, ప్రతి రైతుకు పీఎంఎఫ్బీవై వర్తింపజేయాలని సూచిస్తే పట్టించుకోకుండా.. వెబ్ల్యాండ్ ఆధారంగా అమలు చేస్తామని కేంద్రం చెప్పడంతోనే ఆ పథకం నుంచి వైదొలిగామన్నారు. నాబార్డు సహకారం వలనే 21 రోజుల్లో రైతులకు చెల్లింపులు చేయగలిగామని, మిగిలిన చెల్లింపుల కోసం సోమవారం మరో రూ.1,600 కోట్లు విడుదల చేయడం అభినందనీయమన్నారు. సహకార శాఖ రిజిస్ట్రార్ (ఆర్సీఎస్) అహ్మద్బాబు, ఆప్కాబ్ చైర్పర్సన్ మల్లెల ఝాన్సీరాణి, ఎస్బీఐ జీఏం ఓం.నారాయణ్ శర్మ తదితరులు మాట్లాడుతూ సంస్థాగత అభివృద్ధి, విధాన రూపకల్పనలో నాబార్డు కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. నాబార్డు సీజీఎం ఎం.ఆర్ గోపాల్ మాట్లాడుతూ రూ.4,500 కోట్లతో ప్రారంభమైన నాబార్డు నేడు రూ.7.6లక్షల కోట్ల టర్నోవర్కు చేరిందన్నారు. నాబార్డు జీఎంలు బి.ఉదయభాస్కర్, ఎన్ఎస్ మూర్తి, ఆప్కాబ్ ఎండీ ఎంఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: లక్షల కుటుంబాలకు న్యాయం జరగాలంటే.. మనం మళ్లీ రావాలి -
ABVP Foundation Day: దేశ పునర్నిర్మాణం కోసం...
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తొలినాళ్లలో... దేశంలో ఉన్న విద్యారంగ సమస్యల పరిష్కారం, సమాజ సేవ వంటి భావాలతో విశ్వవిద్యాలయాలు, కళాశాలలను కేంద్రాలుగా చేసుకుని కొందరు యువకులు తాము చదువుతున్న ప్రాంతం నుంచే పని మొదలుపెట్టారు. వీరి లక్ష్యాలలో దేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడటం, జాతీయ భావన కల్పనకై కృషిచేయడం అత్యున్నతమైనవి. ఈ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహించేందుకు అధికారికంగా 1949 జూలై 9న ‘అఖిల భారతీయ విద్యార్థి పరిషత్’ (ఏబీవీపీ) స్థాపితమైంది. అప్పటి నుండి నేటి వరకూ ‘విద్యా రంగం’ అంటే ఒకే కుటుంబం అనే భావనతో పనిచేసింది. కళాశాలల్లో మౌలిక వసతుల లేమి, ఫీజు రీయింబర్స్మెంట్తో సహా అనేక ఫీజులకు సంబంధించిన సమస్యలపై పోరాడింది. ఉపకార వేతనాల పెంపుదల, మెరుగైన హాస్టల్ వసతులు, గ్రామీణ ప్రాంతాలకు బస్ సౌకర్యం వంటి వాటి కోసం ఉద్యమాలు నిర్వహించింది. అంతేకాదు, ‘జాతీయత మా ఊపిరి – దేశభక్తి మా ప్రాణం’ అంటూ దేశంలో ఎక్కడ విచ్ఛిన్నకర సంఘటన జరిగినా అనుక్షణం స్పందిస్తూ దేశ రక్షణలో ఒక వాచ్ డాగ్ లాగా నిమగ్నమై ఉంది. కశ్మీర్లో వేర్పాటువాదుల ఎత్తుగడలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ దేశభక్తిని రగిలించడంలో ఈ సంస్థది మరపురాని పాత్ర. మొదట్లో కొద్దిమందితో ప్రారంభమైన ఏబీవీపీ యాత్ర ఎక్కడా ఆగలేదు. విద్యారంగ సమస్యలతో పాటు జాతీయ పునర్నిర్మాణమే లక్ష్యంగా ఏబీవీపీ పని చేస్తూ ఉంది. జాతీయ పునర్నిర్మాణం వ్యక్తి నిర్మాణం ద్వారానే సాధ్యమనేది ఏబీవీపీ నమ్మకం. జాతీయ పునర్నిర్మాణం అంటే చిట్టచివరి వ్యక్తికి కూడా గూడు, గుడ్డ, విద్య, వైద్యం వంటి ప్రాథమిక వసతులు అందించాలి. వ్యక్తిగత జీవన ప్రమాణాలు, సంస్కృతిని కాపాడుకుంటూనే ‘వసుధైక కుటుంబం’ అనే భావనతో పనిచేయడం ఈ సంస్థ ముఖ్య లక్ష్యం. ఈ ఏడు దశాబ్దాల ప్రయాణంలో విభిన్న వ్యవస్థలలో ఏబీవీపీ కార్యకర్తలు మంచి మార్పుల కోసం, సానుకూల దృక్పథంతో కృషిచేస్తూ వస్తున్నారు. – అంబాల కిరణ్, ఏబీవీపీ జాతీయ కార్యవర్గసభ్యుడు, వరంగల్ (జూలై 9న ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం) -
విద్యుత్ ఉత్పత్తిలో మేటిగా నిలిచి.. మహారత్న బిరుదు
పరవాడ(పెందుర్తి): అనకాపల్లి జిల్లా పరవాడ సమీపంలో 1997లో ఏర్పాటు చేసిన సింహాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఈ నెల 8న 26వ ఏటలో అడుగుపెట్టబోతుంది. పరవాడ సమీపంలో 3,283 ఎకరాల విస్తీర్ణంలో రూ.3,700 కోట్ల వ్యయంతో ప్లాంట్ను ఏర్పాటు చేశారు. ప్లాంట్ నిర్మాణ పనులు పూర్తి చేసుకుని 2007 నుంచి రెండు విడతలుగా రెండు వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి స్థాయికి చేరుకుంది. బొగ్గు ఆధారంగా నాణ్యమైన విద్యుత్ను ఉత్పత్తి చేస్తూ దేశంలోనే మేటిగా నిలిచి మహారత్న బిరుదును సార్థకం చేసుకున్న ఘనత సింహాద్రి ఎన్టీపీసీకే దక్కుతుంది. సంస్థ ఉత్పత్తి చేస్తున్న విద్యుత్ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలు సద్వినియోగం చేసుకొంటున్నాయి. నీటిపై తేలియాడే సోలార్ పవర్ ప్రాజెక్ట్కు 2020లో శ్రీకారం చుట్టింది. సింహాద్రి ఆధ్వర్యంలో స్థానిక రిజర్వాయర్పై రూ.110 కోట్ల వ్యయంతో 25 మెగావాట్ల తేలియాడే సోలార్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టి.. 2021 ఆగస్టు 21 నుంచి విద్యుదుత్పత్తి ప్రారంభించింది. సోలార్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి చేస్తున్న విద్యుత్ను సింహాద్రి ఎన్టీపీసీ తన సొంత అవసరాలకు వినియోగించుకుంటోంది. దీపాంజిలినగర్ టౌన్షిప్లో సముద్రిక అతిథి గృహం ప్రాంగణంలో గతేడాది 30న రూ.9కోట్ల వ్యయంతో హరిత హైడ్రోజన్తో విద్యుత్ను ఉత్పత్తి చేసే తొలి పైలట్ ప్రాజెక్ట్కు భూమి పూజ జరిగింది. 50 కిలోవాట్ల సామర్థ్యం గల స్టాండ్లోన్ ఫ్యూయల్ సెల్ ఆధారిత హరిత హైడ్రోజన్ మైక్రోగ్రిడ్ పైలట్ ప్రాజెక్ట్ నిర్మాణ పనులను బెంగళూరుకు చెందిన బ్లూమ్ ఎనర్జీ సంస్థకు అప్పగించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా సరఫరా కానున్న విద్యుత్ను సముద్రిక అతిథి గృహం అవసరాలకు వినియోగించాలని నిర్ణయించారు. త్వరలో పనులు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్లాంట్ ప్రారంభ సమయంలో ఏర్పాటు చేసిన రెండు కూలింగ్ టవర్ల కాల పరిమితి తీరిన నేపథ్యంలో వాటిని తొలగించి.. నూతనంగా మరో రెండు కూలింగ్ టవర్ల నిర్మాణానికి రెండేళ్ల కిందట సంస్థ శ్రీకారం చుట్టింది. వీటి నిర్మాణానికి రూ.186 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం కూలింగ్ టవర్ల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సింహాద్రిలో 2 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం 30 వేల మెట్రిక్ టన్నుల బొగ్గును వినియోగిస్తున్నారు. ఈ బొగ్గు నిల్వల ను ఒడిశాలోని తాల్చేరు నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. విద్యుత్ ఉత్పత్తి కోసం బొగ్గును మండించే క్రమంలో విడుదలవుతున్న కాలుష్యాన్ని నియంత్రించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. సంస్థలో 600 మంది శాశ్వత ఉద్యోగులు, రెండు వేలకు పైగా కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తూ నాణ్యమైన విద్యుదుత్పాదనకు తమ వంతు కృషి చేస్తున్నారు. బాలికా సాధికారతకు కృషి సింహాద్రి ఎన్టీపీసీ ఆధ్వర్యంలో బాలిక సాధికారత కోసం ఈ ఏడాది రూ.45 లక్షలు ఖర్చు చేశాం. నిర్వాసిత గ్రామాల నుంచి 125 మంది బాలికలను ఎంపిక చేసి వారికి దీపాంజిలినగర్ టౌన్షిప్లో ప్రత్యేక వసతి కల్పించి.. ఆరు వారాల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. వారిలో ఉత్సాహవంతులైన 10 మంది బాలికలను ఎంపిక చేసి టౌన్షిప్లోని బాలభారతి పబ్లిక్ పాఠశాలలో 6వ తరగతి నుంచి 10 తరగతి వరకు ఉచితంగా విద్యనందించేందుకు ఏర్పాట్లు చేశాం. నిర్వాసిత గ్రామాల్లో రహదారులు, తాగునీరు, వైద్యం, విద్య వంటి అభివృద్ధి పనులకు సీఎస్సార్ ద్వారా అత్యధిక నిధులను కేటాయిస్తున్నాం. భవిష్యత్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. – జి.సి.చౌక్సే, సీజీఎం, సింహాద్రి ఎన్టీపీసీ -
14న చికాగోలో ఓయూ ఫౌండేషన్ డే
సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని చికాగో నగరంలో ఈ నెల 14న ఉస్మానియా యూనివర్సిటీ ఫౌండేషన్ డే నిర్వహించనున్నట్లు అధికారులు ఆదివారం తెలిపారు. ఓయూ అలూమ్ని ఆఫ్ చికాగో ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి అమెరికా పర్యటనలో ఉన్న వీసీ ప్రొఫెసర్ రవీందర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు తెలిపారు. శనివారం ఉత్తర అమెరికా ఉస్మానియా అలూమ్ని బోస్టన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీసీ రవీందర్ పాల్గొని 21 అంశాలతో ఓయూలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించినట్లు అధికారులు విడుదల చేసి ప్రకటనలో పేర్కొన్నారు. (క్లిక్: పంచతత్వ పార్కు.. ఆకర్షణ, ఆరోగ్యం దీని ప్రత్యేకత) -
కరోనా ముప్పు తొలగలేదు
అహ్మదాబాద్: కరోనా వైరస్ పూర్తిగా అంతరించిపోయిందని అనుకోరాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రూపుమార్చుకుని మళ్లీ అది ఎప్పుడు విజృంభిస్తుందో ఎవరికీ తెలియదని చెప్పారు. మహమ్మారిపై జరిగే పోరాటంలో ఏమరుపాటు తగదని ప్రజలను ఆయన హెచ్చరించా రు. గుజరాత్లోని వంతలిలో ఉన్న ‘మా ఉమియా ధామ్’ఆలయ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధాని ఆదివారం వర్చువల్గా ప్రసంగించారు. దేశంలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఇప్పటి వరకు 185 కోట్ల టీకా డోసులు వేసినట్లు చెప్పారు. ప్రజల సహకారంతోనే ఇది సాధ్యమయిందన్నారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి ప్రకృతి సేద్యంతో భూమాతను కాపాడాలని ప్రధాని కోరారు. భూగర్భ నీటి మట్టాన్ని పెంచేందుకు, జల వనరులను కాపాడేందుకు జిల్లాకు 75 చొప్పున చెరు వులను తవ్వి, పరిరక్షించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పోషకాహార లోపం, అనీమియాతో బా ధపడే చిన్నారులు, మహిళల కోసం కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. చిన్నారుల ఆరోగ్యంగా ఉం టేనే, సమాజం, దేశం బాగుంటాయని చెప్పారు. బలమైన రైతులతో సుసంపన్న భారతం రైతులు బలంగా ఉంటేనే నవీన భారతం మరింత సంపన్నవంతమవుతుందని ప్రధాని మోదీ అన్నారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద దేశంలోని 11.3 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు రూ.1.82 లక్షల ఓట్లను నేరుగా బదిలీ చేసినట్లు ఆదివారం ఆయన ట్విట్టర్లో తెలిపారు. ప్రికాషన్ డోస్ షురూ న్యూఢిల్లీ: 18 ఏళ్లు పైబడ్డ వాళ్లకు కరోనా ప్రికాషన్ డోస్ టీకా పంపిణీ ఆదివారం దేశవ్యాప్తంగా మొదలైంది. రెండో డోస్ తీసుకుని 9 నెలలైన వారంతా ప్రైవేట్ సెంటర్లలో ప్రికాషన్ డోస్ తీసుకోవచ్చని కేంద్రం ప్రకటించడం తెలిసిందే. టీకా డోస్ ఖరీదుకు అదనంగా రూ.150 సేవా రుసుము కింద కేంద్రాలు తీసుకుంటాయని తెలిపింది. మొదటి రెండు డోసుల్లో వేసిన టీకానే ప్రికాషన్ డోస్గా ఇస్తారని కూడా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం తెలిపింది. అర్హులైన వారు కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టతనిచ్చింది. -
భారతీయ భాషలతోనే పరిపాలన
సాక్షి, హైదరాబాద్/నాంపల్లి: పరిపాలన భాషగా భారతీయ భాషలే ఉండాలని, మాతృ భాషే ఏ రాష్ట్రానికైనా పాలన భాష కావాలని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ప్రాంతీయ భాషల్లోనే జరగాలని ఆయన ఆకాంక్షించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 36వ వ్యవస్థాపక దినోత్సవం ఆదివారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు మాట్లాడుతూ వలస పాలకులు మన భాషపై ముందుగా దాడి చేశారని, వారి భాషలను బలవంతంగా మనపై రుద్దారన్నారు. భిన్న సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలను అర్థం చేసుకుని ఉమ్మడిగా జీవించడమే నిజమైన విద్యని పేర్కొన్నారు. ప్రపంచీకరణ ఎల్లలు చెరిపేసిన మనిషి తన గతాన్ని, పెరిగిన సంస్కృతి, సంప్రదాయాలను మరిచిపోకూడదన్నారు. ఆంగ్ల భాష మోజులో తెలుగును చులకన చేయొద్దని హితవు పలికారు. తనతో సహా దేశంలో అత్యున్నత స్థాయికి ఎదిగిన వారంతా తెలుగులోనే చదువుకున్నారని తెలిపారు. తెలుగు భాషాభివృద్ధికి దివంగత ముఖ్యమంత్రి ఎన్టీరామారావు చేసిన కృషిని శ్లాఘించారు. ఈ యజ్ఞాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని, మారుతున్న కాలానికి అనుగుణంగా తెలుగు భాషను ప్రతి ఒక్కరికీ చేరువ చేయాలని కోరారు. సాంకేతిక పదాలకు సమానమైన తెలుగు అర్థాలతో నిఘంటువు తీసుకురావాలన్నారు. కొత్త విద్యా విధానం ప్రాంతీయ భాషలోనే ఉన్నత విద్య చదివే అవకాశం కల్పిస్తోందన్నారు. అనంతరం తెలుగువాణి పత్రికను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, రాష్ట్ర మంత్రి మహ్మద్ అలీ, యూనివర్సిటీ వీసీ ఆచార్య కిషన్రావు తదితరులు పాల్గొన్నారు. పురస్కారాల ప్రదానం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 36వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యకు (2018వ సంవత్సరానికి), ప్రముఖ నృత్య కళాకారుడు కళాకృష్ణకు (2019వ సంవత్సరానికి) విశిష్ట పురస్కారాలను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రదానం చేశారు. ఏక్ భారత్–శ్రేష్ఠ భారత్ ఛాయా చిత్ర ప్రదర్శన కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో ఏర్పాటు చేసిన ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’(ఈబీఎస్బీ)పై నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఈబీఎస్బీ కింద జత చేసిన హరియాణా, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వివిధ ఆసక్తికరమైన అంశాలు, కళా రూపాలు, వంటకాలు, పండుగలు, స్మారక చిహ్నాలు, పర్యాటక ప్రదేశాలు, క్రీడల విశిష్టతను తెలియజేసేలా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఛాయాచిత్ర ప్రదర్శన ఈ నెల 12 నుంచి 14 వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. -
దేశ నిర్మాణంలో భారత విద్యార్థి పాత్ర
భారత్కు స్వాతంత్య్రం సిద్ధించిన తొలినాళ్లలో దేశంలోని విద్యార్థి యువకుల శక్తిని సంఘటిత పరిచేందుకు పురుడు పోసుకుంది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. వ్యక్తి నిర్మాణం ద్వారానే జాతీయ పునర్నిర్మాణం సాధ్యమని స్వామి వివేకానంద స్ఫూర్తితో అంచె లంచెలుగా విస్తరిస్తూ, 73 ఏళ్ళ సుదీర్ఘ ప్రస్థానంలో నేడు ప్రపంచంలోనే శక్తిమంతమైన విద్యార్థి సంస్థగా వెలుగొందుతోంది. దేశం పేరు భారత్ ఉంచాలన్న తొలి డిమాండ్, వందేమాతర గీతాన్ని జాతీయ గీతంగా గుర్తించా లనే రెండవ డిమాండ్ చేస్తూ, జ్ఞాన్, శీల్, ఏకతా అని నినదిస్తూ, కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు విరాజిల్లుతూ, పొరుగు దేశం నేపాల్లోనూ తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. దేశంలోని అనేక మంది కీలక రాజకీయ నాయకులు ఒక ప్పుడు ఏబీవీపీ కార్యకర్తలే అని గమనిస్తే, అది యువతలో నాయకత్వ లక్షణాలను నింపే కర్మా గారం అన డంలో ఎలాంటి సందేహం లేదు. దేశ వ్యాప్తంగా కళాశాల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు 4,500 నగరాలు, పట్టణాల్లో 33 లక్షల సభ్యత్వం కలిగివుండటంతో పాటు, ప్రపంచ దేశాల నుండి భారత్ వచ్చి చదువుకునే విద్యార్థుల కోసం డబ్ల్యూఓఎస్వై, సామాజిక స్పృహతో పని చేయడానికి ఎస్ఎఫ్డీ, ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులకై రాష్ట్రీయ కళామంచ్, కేంద్రీయ విద్యా సంస్థల్లో థింక్ ఇండియా... ఇలా ప్రజాస్వామ్య ప్రపం చంలోనే అతి పెద్ద విద్యార్థి సంస్థగా ఏబీవీపీ అవతరించింది. కశ్మీరీ విద్యార్థుల కోసం దేశవ్యాప్తంగా 1990 సెప్టెంబర్ 11న చేపట్టిన చలో కశ్మీర్ యువతను చైతన్యపరిచిన ఒక మహోద్యమం. అస్సాం చొరబాటు దారులకు వ్యతిరేకంగా అస్సాంను కాపా డండి, దేశాన్ని రక్షించండి అనే నినాదంతో 1983 అక్టోబర్ 2న గౌహతిలో భారీ ప్రదర్శన జరిపింది. బంగ్లాదేశ్ చొరబాటుదారులకు వ్యతిరేకంగా చలో చికెన్నెక్ పేరుతో 2008 డిసెంబర్ 17న బెంగాల్ సరిహద్దుల్లో 40 వేల మంది విద్యార్థులతో భారీ ఆందోళన నిర్వహించింది. భారతీయులను బానిస లుగా మార్చే మెకాలే విద్యా విధానాన్ని మార్చి జాతీయ విద్యా విధానం–2020 కార్యరూపం దాల్చేలా పోరాడింది. మహమ్మారి ఆపత్కాలంలో మేమున్నామంటూ పరిషత్ నిర్ణయంతో దేశవ్యాప్తంగా తరలిన కార్యకర్తల సేవాభావం వెలకట్టలేనిది. కరోనా సోకి దిక్కుతోచని స్థితిలో ఉన్న కుటుంబాలకు వైద్య సహాయం, భోజనాలు అందించడం, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం, ఉపాధి కోల్పోయిన పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువుల పంపిణీ, ఏడాదిన్నర నుండి తరగతి గది అభ్యసనానికి దూరమైన విద్యార్థులకు ఎక్కడికక్కడ పరిషత్ పాఠశాల పేరుతో ట్యూషన్స్ చెప్పడంలాంటి అనేక కార్య క్రమాలను ఏబీవీపీ చేపట్టింది. - ప్రవీణ్రెడ్డి రాష్ట్ర కార్యదర్శి, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, తెలంగాణ -
Sate Bank Day: డిస్కౌంట్ ఆఫర్
సాక్షి, ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా తన కస్టమర్లకు మంచి ఆఫర్ ప్రకటించింది. టైటన్ వాచెస్ పై 20 శాతం తగ్గింపును ప్రకటించింది. పరిమిత కాల ఆఫర్గా తీసుకొచ్చిన ఈ తగ్గింపు ధరలు ఈ నెల 7 వ తేదీవరకు అందుబాటులో ఉంటాయి. తన యోనో యాప్ ద్వారా కాంటాక్ట్ లెస్ కొనుగోళ్లు చేయాలని కస్టమర్లకు పిలుపునిచ్చింది. కాగా ఎస్బీఐ నేడు ఫౌండేషన్ డే జరుపుకుంటోంది. ఈ సందర్భంగా తన అద్భుతమైన ప్రస్తానాన్ని గుర్తు చేసుకుంటూ ఒకవీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. అలాగే తమకు అండగా నిలిచిన వినియోగదారులకు శుభాకాంక్షలు తెలిపింది. దీంతోపాటు పీఎం కేర్స్ ఫండ్ కు 62.62 కోట్ల రూపాయల మొత్తాన్ని విరాళంగా ప్రకటించింది. (State Bank Day: హ్యపీ, ఇన్క్రెడిబుల్ జర్నీ) Get Flat 20% OFF* on all TITAN PAY watches through YONO. Make fast, contactless and secure transactions via Titan Pay. Download now: https://t.co/FpPOSnsD5V #StateBankDay #TitanPay #Titan #ContactlessPayment #TitanWatch #Watch #YONOSBI pic.twitter.com/gTDf05Ndqr — State Bank of India (@TheOfficialSBI) July 1, 2021 -
20 ఏళ్ల సంబురాలు: కేటీఆర్ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: రేపటితో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఆవిర్భవించి 20 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుందామంటే రాష్ట్రంలో కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తుండడంతో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కీలక ప్రకటన చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అందరూ జాగ్రత్తలు పాటిస్తూ పార్టీ జెండా ఎగురవేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కరోనా నేపద్యంలో పార్టీ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఆత్మగౌరవాన్ని చాటిన గులాబీ జెండాను ప్రతి జిల్లాలో, మండలాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు, కార్యకర్తలు జెండా ఆవిష్కరణ చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ‘సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించి, తెలంగాణను అభివృద్ధి పధంలో ముందుకు తీసుకెళ్తున్న టీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండాను ప్రతి ఇంటిపై ఎగరవేద్దాం.. మన ఆత్మగౌరవాన్ని మరో మారు చాటుదాం’ అని తెలిపారు. చదవండి: మా రాష్ట్రంలో లాక్డౌన్ పెట్టబోం చదవండి: ఎన్నికల సంఘం బీజేపీ గూటి చిలక రేపు మంగళవారం (ఏప్రిల్ - 27) టీఆర్ఎస్ పార్టీ 20వ వార్షికోత్సవం సందర్భంగా తెలంగాణను సాధించి ఆత్మగౌరవాన్ని చాటిన గులాబీ జెండాను ప్రతి జిల్లాలో, మండలాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు, కార్యకర్తలు జెండా ఆవిష్కరణ చేపట్టాలని... pic.twitter.com/Zd5XmK6qHX — TRS Party (@trspartyonline) April 26, 2021 -
వారంతా ఒకపూట భోజనాన్ని త్యాగం చేయండి: నడ్డా
సాక్షి,న్యూఢిల్లీ: కరోనా కట్టడికి ప్రధాని నరేంద్రమోదీ తీసుకుంటున్న చర్యలను అందరూ అభినందిస్తున్నారని భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా కొనియాడారు. ఈ విపత్కర పరిస్థితులను మోదీ ఎలా ఎదుర్కుంటారు అని ప్రపంచం మొత్తం ఆయన వైపు చూస్తోందని పేర్కొన్నారు. భారతీయ జనతాపార్టీ 40 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నడ్డా ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రతి బీజీపీ కార్యకర్త 40 మందిని కలిసి ఒక్కొక్కరు రూ. 100 చొప్పున పీఎం కేర్స్ ఫండ్కి ఇవ్వాల్సిందిగా అభ్యర్థించాలని కోరారు. ప్రజల కోసం పనిచేస్తున్న పోలీసులు, డాక్టర్లు, నర్స్లు, బ్యాంక్ ఉద్యోగులు, పోస్ట్మ్యాన్లకు మనమందరం కృతజ్ఞతలు తెలిపాలన్నారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సంఘీభావంగా ఒకపూట భోజనాన్నిత్యజించాలని నడ్డా పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ కూడా పార్టీ వ్యవస్థపక దినోత్సవం సందర్భంగా కార్యకర్తలకు ట్వీట్టర్ వేదిక తన సందేశాన్ని అందించారు. (కరోనాను తరిమికొడదాం: మోదీ పిలుపు) అదేవిధంగా బీజేపీ సీనియర్ నేత, రక్షణ శాఖ మంత్రి రాజ్నాధ్ సింగ్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. కేవలం 40 సంవత్సరాల్లోనే భారత ప్రజాస్వామ్య వ్యవస్థకి భారతీయ జనతా పార్టీ బలమైన స్తంభంలా మారిందని వ్యాఖ్యానించారు. ప్రజల నమ్మకాన్ని బీజేపీ చూరగొందని పేర్కొన్నారు. 1977లో విధించిన అత్యవసర పరిస్థితి తరువాత జరిగినలోక్సభ ఎన్నికలలో ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్పై ఐక్య పోరాటం చేయడానికి జనతా పార్టీతో విలీనం అయిన జనసంఘ్ పార్టీ నాయకులు 1980 లో ఏప్రిల్ 6 న బీజేపీని స్థాపించారు. చదవండి: దీపయజ్ఞం మన సంకల్పాన్ని చాటింది : మోదీ -
సంక్షేమ పాలన
-
వైఎస్సార్ సీపీ ప్రజల పక్షం: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ఎన్నో పోరాటలు చేసి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకుడిగా ఎదిగారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయనతో పాటు లక్ష్మీపార్వతి, ఎంవీఎస్ నాగిరెడ్డి కేక్ కట్ చేసి శుభాభినందనలు తెలిపారు. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. (పదో వసంతంలోకి వైఎస్సార్ సీపీ, సీఎం జగన్ ట్వీట్) ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న పథకాలను ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్నాయని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ప్రజల పక్షమని తెలిపారు. ప్రజలతో మమేకమైన రాజకీయాలే తమకు తెలుసునని పేర్కొన్నారు. అవినీతిరహిత సమాజం కోసం పాటు పడుతున్నామని చెప్పారు. చంద్రబాబు డ్రామాలు.. టీడీపీని డ్రామాల పార్టీగా సజ్జల రామకృష్ణారెడ్డి అభివర్ణించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలన్నదే చంద్రబాబు కుట్ర అని మండిపడ్డారు. బుద్ధా వెంకన్న, బోండా ఉమాలను మాచర్ల ఎందుకు వెళ్ళారని ఆయన ప్రశ్నించారు. టీడీపీ నేతలు కావాలనే గొడవలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. డీజీపీ ఆఫీస్ ముందు చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. గతంలో అంబటి, మస్తఫాను హత్య చేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారని ఆరోపించారు. గత టీడీపీ ప్రభుత్వం వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధించిందని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా సంయమనంతో వ్యవహరించామని పేర్కొన్నారు. ప్రజలు తిరస్కరించిన ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఇంకా బుద్ధి రాలేదని విమర్శించారు. (విశాఖలో వైఎస్సార్ సీపీ ఆవిర్భావ వేడుకలు) ఒక ఉద్యమంలా మొదలై.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్సార్సీపీ పార్టీ ఒక ఉద్యమంలా మొదలై అధికారంలోకి వచ్చిందని సజ్జల తెలిపారు. 2009లో మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి మరణంతో వందలాది గుండెలు ఆగిపోయాయన్నారు. వైఎస్సార్ మరణం తర్వాత రాష్ట్రంలో చీకటి అలుముకుందన్నారు. ఆయన మరణం తర్వాత ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చిందన్నారు. ఎన్నో లక్షల మంది పార్టీ ఆవిర్భావం తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలిసి అడుగులు వేశారని పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైఎస్ జగన్ 51 శాతం ఓట్లు సాధించారని తెలిపారు. అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని చెప్పారు. ఆరు నెలలోనే ఇచ్చిన హామీలను 80 శాతం నెరవేర్చారని పేర్కొన్నారు. ప్రతి పథకాన్ని పేదలకు చేరుస్తున్నారని వెల్లడించారు. ప్రజలు పెట్టుకున్న ఆశలకు మించి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. -
ఘనంగా వైఎస్సార్సీపీ ఆవిర్భావ వేడుకలు
సాక్షి, వైఎస్సార్ కడప : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఆవిర్భవించి గురువారానికి పది సంవత్సవరాలు అవుతోంది. ఈ సందర్భంగా అన్ని జిల్లాలలోని పార్టీ కార్యాలయాల్లో వేడకలు నిర్వహించారు. ఈ మేరకు నగరంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 10 వ ఆవిర్భావ వేడుకలు జరిపారు. పార్టీ జండాను ఎగురవేసిన నేతలు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి అంజాద్ బాషా, కడప పార్లమెంట్ అధ్యక్షుడు సురేష్ బాబు, ఎమ్మెల్యే రవీంద్రనాద్ రెడ్డి, నరెన్ రామంజుల రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. విజయవాడ : భవానిపురం బ్యాంకు సెంటర్లో వైఎస్సార్సీపీ పది వసంతాల వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జెండా ఆవిష్కరించి కేట్ కట్ చేశారు. ఈ క్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వం వర్దిల్లాలి అంటూ నినాదాలు హోరెత్తించారు. పశ్చిమ గోదావరి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉండి పార్టీ కార్యాలయంలో ఇంఛార్జి పీవీఎల్ నరసింహరాజు జండా ఎగురవేసి, కేకును కట్ చేశారు. ఈ వేడుకలో గులిపల్లి అచ్చారావు, రణస్తల మహంకాళి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ► పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా తణుకు పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వర రావు.. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి జండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అభిమానులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ► నరసాపురం వైఎస్సార్ పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు.. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలవేసి జెండా ఆవిష్కరించారు. తూర్పు గోదావరి : కాకినాడలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ పదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిపారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి పార్టీ జెండా ఎగురవేసి కేక్ కట్ చేశారు. ఈ వేడకల్లో నగర వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ఫ్రూటీ కుమార్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చంద్రకళా దీప్తీ,పెద్దిరెడ్డి రామలక్ష్మి, కార్పోరేర్లు సత్యనారాయణ, మీసాల ఉదయ కుమార్,సంగాడి నందం పాల్గొన్నారు. అనంతపురం : తాడిపత్రి వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ 10 వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ► కదిరి ఎమ్మెల్యే డా. సిద్ధారెడ్డి నివాసంలో వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రకాశం : దర్శిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మద్ధిశెట్టి వేణుగోపాల్ జెండా ఎగరేసి, కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గుంటూరు : వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుంటూరు నగర పార్టీ కార్యాలయంలో మంత్రి మోపిదేవి వెంకటరమణరావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాల గిరిధర్ హాజరయ్యారు. శ్రీకాకుళం : నగరంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జిల్లా పార్టీ అధ్యక్షురాలు కిల్లి కృపారాణి పార్టీ జండాను ఎగరవేసి, కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రంలో ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు, సీఈసీ మెంబర్ అందవరపు సూరిబాబు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎంవీ పద్మావతి, అందవరపు వరం పాల్గొన్నారు. ► నరసన్నపేట పార్టీ కార్యలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంత్రి ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు. ► టెక్కలి నియోజకవర్గ పరిధిలో నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంఛార్జి పేడాడ తిలక్ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఎగరేసి కేక్ కట్ చేసి కార్యకర్తల మధ్య ఘనంగా నిర్వహించారు విశాఖపట్నం : అనకాపల్లి లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా ఎంపీ వెంకట సత్యవతి.. పట్టణ కన్వీనర్ మందపాటి జానకిరామరాజు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. పార్లమెంటరీ పరిశీలకులు దాడి రత్నాకర్, రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్, డాక్టర్ కె విష్ణు మూర్తి, డాక్టర్ రామూర్తి, జాజుల రమేష్, రమణ అప్పారావు హాజరయ్యారు. -
విశాఖలో వైఎస్సార్ సీపీ ఆవిర్భావ వేడుకలు
సాక్షి, విశాఖపట్నం: ఎన్నో కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలబడ్డారని.. టీడీపీతో కాంగ్రెస్ కుమ్మక్కై ఇబ్బందులు పెట్టినా వెనకడుగు వేయకుండా ప్రజల అండతో ముందుకు సాగారని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.విశాఖ వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ వేడుకలను గురువారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో మంత్రి అవంతి శ్రీనివాసరావు, దాడి వీరభద్రరావు, నగర అధ్యక్షులు వంశీకృష్ణ, గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే లు ఎస్ ఏ రెహ్మాన్, చింతలపూడి వెంకటరామయ్య, తైనాల విజయ్ కుమార్, వెస్ట్ కన్వీనర్ మళ్ల విజయ ప్రసాద్, ప్రేమ్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాభినందనలు తెలిపారు. టీడీపీ కుట్రలను ఎదుర్కొని సీఎం జగన్ ప్రజల మన్ననలు పొందారని చెప్పారు. కార్యకర్తల కృషి వల్లే విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. పాదయాత్ర ద్వారా వైఎస్ జగన్ ప్రజల సమస్యలను తెలుసుకుని.. ప్రజల మన్ననలు పొంది అధికారంలోకి వచ్చామని తెలిపారు. (పదో వసంతంలోకి వైఎస్సార్ సీపీ, సీఎం జగన్ ట్వీట్) పేదల ప్రయోజనాలు కాపాడుతున్నాం.. ఆర్థిక ఇబ్బందులను అధిగమించి పేదల ప్రయోజనాలు కాపాడుతున్నామని విజయసాయిరెడ్డి తెలిపారు. వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా సీఎం వైఎస్ జగన్ ముందుకెళ్తున్నారన్నారు. 9 నెలల పాలనలో దేశంలో ఎక్కడా లేని విధంగా అద్భుత పథకాలు ప్రవేశపెట్టామన్నారు. అమ్మఒడి, పేదలకు ఇళ్ల పట్టాలు వంటి సంక్షేమ పథకాలు చేపట్టామని పేర్కొన్నారు. బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాలకు అండగా నిలిచామన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. అన్ని వర్గాలను విజయపథం వైపు నడిపిస్తున్నారని పేర్కొన్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే సదుద్దేశంతోనే సీఎం మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని.. ప్రజల ఆమోదంతో తీసుకున్న నిర్ణయాన్ని ఏ శక్తి ఆపలేదని ఆయన స్పష్టం చేశారు. (బెస్ట్ సీఎం వైఎస్ జగన్) వైఎస్సార్సీపీ అత్యంత శక్తివంతంగా అవతరించింది.. 151 సీట్లలో గెలిచి వైఎస్సార్సీపీ అత్యంత శక్తివంతమైన పార్టీగా అవతరించిందని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రతి విషయాన్ని రెఫరెండం అనడం సరికాదన్నారు. ‘‘విశాఖ సిటీలోనే పేదలకు లక్షా 52వేల ఇళ్ల స్థలాలు కేటాయించాం. గతంలో ఏ సర్కార్ చేయని పనులు మా ప్రభుత్వం చేస్తోంది. వైఎస్సార్సీపీ నైతిక విలువలను పాటిస్తుంది. మా పార్టీలోకి రావాలంటే పదవులకు రాజీనామా చేయాలని’ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ అరాచకం సృష్టిస్తోంది.. అవినీతికి, అనైతికతకు మారు పేరుగా చంద్రబాబును అభివర్ణించారు. టీడీపీ నేతలు రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలు దురుద్దేశంతోనే మాచర్ల వెళ్లారని.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. బుద్దా వెంకన్న, బోండా ఉమ గొడవలు సృష్టించడానికే వెళ్లారని ఆరోపించారు. జీవీఎంసీ ఎన్నికల్లో టీడీపీకి ఓటమి తప్పదని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. నేడు 48 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన మేయర్, డిప్యూటీ మేయర్, జడ్పీచైర్మన్,వైస్ చైర్మన్ పేర్లను ఎన్నికల అనంతరం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటిస్తారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. నేడు 48 స్థానాలకు జీవీఎంసీ అభ్యర్థులను ప్రకటిస్తామని.. మిగిలిన స్థానాలను రేపు(శుక్రవారం) ప్రకటిస్తామని తెలిపారు. ప్రజలు ఆనందంగా ఉండాలన్నదే లక్ష్యం: అవంతి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉండాలన్నదే వైఎస్సార్సీపీ లక్ష్యమని మంత్రి అవంతి శ్రీనివాసరావు పేర్కొన్నారు. వైఎస్ జగన్ వైఎస్సార్సీపీ పార్టీ పెట్టి ఉండకపోతే రాష్ట్రంలో బడుగు వర్గాలు అనాథలయ్యేవారన్నారు. రాజ్యసభకు బడుగు వర్గాలకు చెందిన ఇద్దరిని పంపించారని తెలిపారు. చంద్రబాబు.. వర్ల రామయ్యకి గెలిచేటప్పుడు టిక్కెట్ ఇవ్వకుండా ఓడిపోయేటప్పుడు టిక్కెట్ ఇచ్చారని అవంతి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. -
విశాఖలో వైఎస్సార్సీపీ ఆవిర్భావ వేడుకలు
-
త్వరలో రూ.20 నాణాలు
డబ్బులు చెట్లకు కాస్తాయా అని ఓ సామెత ఉంది... కానీ డబ్బులు ఇదిగో ఇక్కడ చెప్పుకునే టంకసాల నుంచే ఆవిర్భవిస్తాయి. నేడు(ఫిబ్రవరి 10) ‘భారత సురక్షిత ప్రచురణ-టంకసాల కార్పొరేషన్ లిమిటెడ్’(SPMCIL) ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా దాని విశేషాలు తెలుసుకుందాం.. పుట్టుక: భారత ప్రభుత్వ టంకసాల హైదరాబాద్లోని చర్లపల్లిలో ఉంది. మూడో నిజాం నవాబ్ సికిందర్ యా జారీ చేసిన ఉత్తర్వుల మేరకు 1803లో హైదరాబాద్లోని సుల్తాన్షాహి రాజసౌధంలో టంకసాల ఏర్పాటైంది. అయితే 1857లో తొలి స్వాతంత్ర్య పోరాటం అనంతరం హైదరాబాద్ వంటి ప్రతిష్టాత్మక సంస్థానాల్లో మినహా భారతదేశంలోని అన్ని టంకసాలలూ రద్దయ్యాయి. ఆ తర్వాత బ్రిటీష్ పాలకులు బాంబే, కలకత్తా నగరాల్లో తమ సొంత ప్రభుత్వ టంకసాలలు ఏర్పాటు చేశారు. అప్పట్లో ఆ టంకసాలలు యంత్రాలతో నాణాలను ముద్రిస్తుండగా, దేశంలోని ఇతర రాచరిక టంకసాలలు చేతి తయారీ నాణాలను విడుదల చేస్తుండేవి. ఈ నేపథ్యంలో 1893లో హైదరాబాద్లోని రాచరిక టంకసాలను సుల్తాన్ షాహి రాజసౌధం నుంచి దానికోసమే ప్రత్యేకంగా కేటాయించిన ‘దార్-ఉస్-షఫా’ సౌధంలోకి తరలించారు. అప్పటికి ఇక్కడ చేతితోనే నాణాలను తయారు చేస్తుండేవారు. ఇదంతా ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ పాలన కాలం నాటి సంగతి. అనంతరం ఈ ఆధునిక టంకసాలల వ్యవస్థాపక పితామహుడిగా ప్రసిద్ధికెక్కిన ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో ఆయన తోడ్పాటుతో ఈ టంకసాల అభివృద్ధి చెందింది. ‘చర్ఖీ’లుగా చలామణీ అయిన నాణాలు హైదరాబాద్ సంస్థానంలోని టంకసాలకు 1895లో తొలియంత్ర సదుపాయం సమకూరింది. దీనిపై మొట్టమొదట ముద్రించిన నాణాలను ‘చర్ఖీ’(చక్రపు యంత్రంపై రూపొందినవి)గా వ్యవహరించేవారు. ఆ తర్వాత టంకసాల సైఫాబాద్ ప్రాంతానికి తరలిపోగా, 1903 జూలై 13 నుంచి అక్కడ ఆధునిక యంత్రాలతో నాణాల ముద్రణ ప్రారంభమైంది. 1950లో సమాఖ్య ద్రవ్య ఏకీకరణ కింద ఇక్కడి టంకసాలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తన ఆధీనంలోకి తీసుకుంది. అయినప్పటికీ ముద్రణ కొనసాగింపులో భాగంగా 1950 దశకం మధ్యవరకు ఇక్కడ నిజాం పేరిట నాణాల ముద్రణ కొనసాగింది. చివరకు విజయవంతమైన ప్రభుత్వరంగ సంస్థల నమూనాకు నిదర్శనంగా నిలిచిన మినీరత్న సంస్థ ‘భారత సురక్షిత ప్రచురణ-టంకసాల కార్పొరేషన్ లిమిటెడ్’(SPMCIL)లో 2006 ఫిబ్రవరి 10న హైదరాబాద్ టంకసాల విలీనమైంది. నాణాల ముద్రణ సామర్థ్యాన్ని పెంచాల్సిన దృష్ట్యా మరోసారి (రూ.130 కోట్ల వ్యయంతో) టంకసాల తరలింపు అవసరమైంది. కాగా, 1985 నుంచి 2000 సంవత్సరం వరకు భారత నాణాల ముద్రణ బాధ్యతను 10 విదేశీ టంకసాలలను అప్పగించేవారు. వీటిలో 3 యునైటెడ్ కింగ్డమ్, 2 దక్షిణ కొరియా టంకసాలలు కాగా మిగిలినవి కెనడా, మెక్సికో, స్లొవేకియా, దక్షిణాఫ్రికా, రష్యా దేశాలకు చెందినవి. అయితే ‘మేక్ ఇన్ ఇండియా’ స్ఫూర్తితో నేడు మన దేశం నాణాల దిగుమతికి స్వస్తి చెప్పింది. అంతే కాదు.. హైదరాబాద్లోని భారత ప్రభుత్వ టంకసాల(IGMH) నుంచి అత్యాధునిక భద్రత లక్షణాలతో ముద్రించిన నాణాలను ఎగుమతి చేస్తోంది. వెబ్సైట్ ద్వారా కొనుగోలు నాణాల ఎగుమతి మాత్రమే కాక తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీ సాయి సంస్థాన్ ట్రస్ట్, హులిగమ్మ ఆలయం, శ్రీకాళహస్తి దేవస్థానం వంటి దేశంలోగల వివిధ ఆలయాల నుంచి వచ్చే బంగారు, వెండిని కరిగించి శుద్ధి చేసి బ్రిటీష్ ప్రమాణాల(బీఎస్)కు అనుగుణంగా కొత్తరూపం ఇచ్చే పనిలో హైదరాబాద్ టంకసాల నిమగ్నమైంది. అలాగే ఎగుమతి-దిగుమతి సుంకాల విభాగం స్వాధీనం చేసుకునే బంగారాన్ని కడ్డీలుగా మార్చడంలో సహకరిస్తోంది. దీంతోపాటు నాణాల సేకరణ అభిరుచి గల వారికోసం స్మారక నాణాలను తయారు చేస్తోంది. వీటిని సైఫాబాద్లోని టంకసాల అమ్మకపు విభాగంలో, spmcil వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. నాణ్యత, స్వచ్ఛతలలో విలువైన లోహ ఉత్పత్తుల తయారీలో IGMHకు తిరుగులేని విశ్వసనీయత ఉంది. ప్రస్తుతం దృష్టిలోపం గల వారికోసం 2019 పరంపరలో అత్యాధునిక నాణాలను IGMH ముద్రిస్తోంది. అలాగే త్వరలో రూ.20 నాణాలను కూడా విడుదల చేయబోతోంది. ఈ నేపథ్యంలో సంస్థ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అత్యాధునిక మౌలిక సదుపాయాలతో జాతికి మరింత విస్తృత సేవలు, ఉత్పత్తులను అందించేందుకు IGMH పునరంకితమవుతోంది. -
ఇది రెండో నోట్ల రద్దు..!
న్యూఢిల్లీ/గువాహటి/లక్నో: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తలపెట్టిన జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్), ఎన్నార్సీలు రెండో విడత నోట్లరద్దు వంటివని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఇవి అమలైతే నోట్లరద్దును మించిన దారుణ పరిస్థితులను దేశం మరోసారి ఎదుర్కోనుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ 135వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అస్సాం రాజధాని గువాహటిలో జరిగిన పార్టీ ర్యాలీలో, అంతకుముందు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్పీఆర్, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా అస్సాంలో జరిగిన హింసాత్మక ఘటనలు మునుపటి పరిస్థితులను గుర్తుకు తెస్తున్నాయంటూ రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. లక్నోలో జరిగిన వ్యవస్థాపక దినోత్సవంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె.. స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితోనే యావత్ దేశం మరోసారి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతోందని పేర్కొన్నారు. పార్టీ వ్యవస్థాపక దినాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాహుల్ పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ప్రధాని మన్మోహన్, సీనియర్ నేతలు ఏకే ఆంటోనీ, మోతీలాల్ ఓరా, ఆనంద్ శర్మ తదితరులు హాజరయ్యారు. ఎన్పీఆర్, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా ఇప్పటికే నిరసనలు సాగిస్తున్న పార్టీ, వ్యవస్థాపక దినం సందర్భంగా రాజ్యాంగాన్ని రక్షించండి–దేశాన్ని కాపాడండి(సేవ్ కాన్స్టిట్యూషన్– సేవ్ ఇండియా) అంటూ రాష్ట్ర రాజధానుల్లో ప్రదర్శనలు చేపట్టింది. భారత్కే తమ మొదటి ప్రాధాన్యమని 135వ వ్యవస్థాపక దినం సందర్భంగా కాంగ్రెస్ పేర్కొంది. ‘స్వాతంత్య్ర సాధనే లక్ష్యంగా అవతరించిన పార్టీ, దేశమే ప్రథమమనే ఆశయానికి కట్టుబడింది. 135 ఏళ్ల ఐక్యత, 135 ఏళ్ల న్యాయం, 135 ఏళ్ల సమానత్వం, 135 ఏళ్ల అహింస, 135 ఏళ్ల స్వాతంత్య్రం. నేడు మనం 135 ఏళ్ల భారత జాతీయ కాంగ్రెస్ ఉత్సవాలు జరుపుకుంటున్నాం’ అని శనివారం ట్విట్టర్లో పేర్కొంది. అస్సాం సంస్కృతిని నాశనం చేయనివ్వం అస్సాం సంస్కృతి, గుర్తింపులను నాశనం చేసేందుకు బీజేపీ, ఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలను కొనసాగనివ్వబోమని రాహుల్ స్పష్టం చేశారు. బీజేపీ అనుసరిస్తున్న విధానాల కారణంగా రాష్ట్రంలో మరోసారి హింసాత్మక వాతావరణ నెలకొనే అవకాశం ఉందన్నారు. ఈశాన్య రాష్ట్రాల గుర్తింపును, భాషలను అణచివేయడం అంటే వారిని బీజేపీ ఇంకా గుర్తించలేదని అర్థమన్నారు. తీవ్ర పోరాటాలతో ఇక్కడి ప్రజలు సాధించుకున్న అస్సాం ఒప్పందాన్ని యథాతథంగా అమలు చేసి, ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించాలని బీజేపీ ప్రభుత్వాన్ని ఆయన కోరారు. బీజేపీ ఉన్న ప్రతిచోటా ప్రజల మధ్య కలహాలు, హింస, విద్వేషం ఉంటాయన్నారు. నోట్లరద్దు, జీఎస్టీ అమలుతో మోదీ ప్రభుత్వం భరతమాతపై దాడి చేసిందని విమర్శించారు. ‘ప్రతి పేద వ్యక్తీ భారతీయ పౌరుడా కాదా అని నిరూపించుకోవడమే ఎన్నార్సీ, ఎన్పీఆర్ల ఉద్దేశం. ఈ తమాషా అంతా నోట్ల రద్దు రెండో విడత మాదిరిగా మారనుంది. నోట్ల రద్దు కంటే మించి దారుణ పరిస్థితులను ప్రజలు ఎదుర్కోనున్నారు’ అని రాహుల్ అన్నారు. అబద్ధాల కోరు అంటూ బీజేపీ తనపై చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. ‘దేశంలో డిటెన్షన్ సెంటర్లు(నిర్బంధ కేంద్రాలు) లేవంటూ ప్రధాని మోదీ చేసిన ప్రసంగం, దానికి జతచేసిన డిటెన్షన్ సెంటర్ ఫొటోతో నేను చేసిన ట్వీట్ను మీరు చూసే ఉంటారు. అబద్ధం చెప్పేది ఎవరో మీరే తేల్చండి’ అని ఆయన పేర్కొన్నారు. -
రోల్మోడల్గా ఎదగాలి
కవాడిగూడ: స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ కమిటీ దేశంలోనే రోల్మోడల్గా ఎదగాలని రాష్ట్ర గవర్నర్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ రాష్ట్ర ప్యాట్రన్ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ ఆకాంక్షించారు. దీనికిగానూ గైడ్స్కు తనవంతు సహకారం ఎప్పటికీ ఉంటుందని తెలిపారు. గురువారం దోమలగూడ గగన్ మహల్లోని ‘భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్’తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ ఫౌండేషన్ డే ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు హాజరైన గవర్నర్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు, గురువులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ సమాజం పట్ల బాధ్యతగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. తాను కూడా స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థినేనని గుర్తుచేశా రు. సమాజానికి ఏ విధంగా సహాయం చేయాలి, ఇతరుల పట్ల ఎలా ఉండాలో ఇక్కడే నేర్చుకున్నానని తెలిపారు. తాను విద్యార్థి దశలో ఉన్నప్పుడు గైడ్స్ శిక్షణ తీసుకున్నానని చెప్పారు. అనంతరం తెలంగాణ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ చీఫ్ కమిషనర్, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. రాష్ట్ర గవర్నర్ స్కౌట్స్ డ్రెస్లో రావడం సంతోషంగా ఉందన్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ స్కూల్లో అన్ని వసతులు ఉన్నాయని, ప్రస్తుతం ఇక్కడ 590 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు. గత రెండేళ్లుగా చేపడుతోన్న కార్యక్రమాలపై ఆమె నివేదిక సమర్పించారు. అనంతరం స్కౌట్స్ అండ్ గైడ్స్ పాఠశాల ప్రాంగణంలో గవర్నర్తో కలిసి ఆమె మొక్కలను నాటారు. పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా 8 మంది విద్యార్థులకు రాజ్యపురస్కారాలను అందించారు. కాగా, పీయర్స్ కన్స్ట్రక్షన్స్ ఎండీ అస్లాం బిన్ మహ్మద్ రూ.10 లక్షల విరాళం చెక్ను గవర్నర్కు అందజేశారు. కవిత కూడా రూ.5 లక్షలు అందించా రు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ, కోశాధికారి రాజగోపాల్, జాయింట్ సెక్రటరీ మంచాల వరలక్ష్మి, ఆర్గనైజింగ్ సెక్రటరీ పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యమ స్ఫూర్తి కలకాలం నిలవాలి: హరీశ్రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కలకాలం నిలవా లని మాజీ మంత్రి హరీశ్రావు ఆకాంక్షించారు. టీఆర్ఎస్ 18వ ఆవిర్భా వ దినోత్సవాన్ని పురస్కరించుకొని ట్విట్టర్లో శనివారం ఆయన సీఎం కేసీఆర్, పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యమ దీప్తి నిరంతరం వెలుగొందాలని పిలుపునిచ్చారు. -
ఆవిర్భావ ఉత్సవాలు భారీగా వద్దు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జనసమితి (టీజేఎస్) ఆవిర్భావ ఉత్సవాలను భారీగా నిర్వహించకుండా స్థానికంగా ఎక్కడికక్కడ పార్టీ జెండాలు ఎగురవేయాలని నాయకులు, కార్యకర్తలకు ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొ.కోదండరాం విజ్ఞప్తి చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్లో రాష్ట్రస్థాయిలో భారీ ప్లీనరీ నిర్వహించాలని పార్టీ నిర్ణయించిందని శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పార్టీ ఆవిర్భవించి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ నెల 29న ఆవిర్భావ ఉత్సవాలను నిర్వహించాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించినా.. రాష్ట్రంలో ఇంటర్ విద్య సంక్షోభం, విద్యార్థుల ఆత్మహత్యలు, విద్యార్థుల పోరాటాలు, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వాటిని భారీగా నిర్వహించవద్దని కోరారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరకపోగా రాష్ట్రాన్ని ఒక కుటుంబం గుత్తసొత్తుగా మార్చుకున్న నేపథ్యంలో ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చేందుకు టీజేఎస్ పార్టీ ఆవిర్భవించిందన్నారు. ఈ ఏడాది కాలంలో ప్రజా సమస్యలపై, ప్రధానంగా రైతాంగ సమస్యలపై టీజేఎస్ నిర్వహించిన పోరాటాలతో ప్రజలకు పార్టీ పట్ల నమ్మకం, విశ్వాసం పెరిగాయని కోదండరాం పేర్కొన్నారు. ఈ నెల 29న అఖిలపక్షం పిలుపు మేరకు ఇంటర్ బోర్డు ఎదుట నిర్వహించనున్న ధర్నాలో సంఘీభావం తెలియజేయాలని టీజేఎస్ అధికార ప్రతినిధి, మీడియా రాష్ట్ర కో ఆర్డినేటర్ వెదిరె యోగేశ్వర్రెడ్డి ఓ ప్రకటనలో కోరారు. కిషన్రెడ్డికి టీజేఎస్ నేతల పరామర్శ... బీజేపీ నేత కిషన్రెడ్డిని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, ఇతర నాయకులు పరామర్శించారు. శనివారం రంగారెడ్డి జిల్లాలోని కిషన్రెడ్డి స్వగ్రామం తిమ్మాపూర్లో ఆయనను కలిసి తమ సంతాపాన్ని తెలియచేశారు. -
కువైట్లో ఘనంగా వైఎస్సార్సీపీ 9వ ఆవిర్భావ వేడుకలు
కువైట్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 9వ ఆవిర్భావ వేడుకలు కువైట్లో ఘనంగా జరిగాయి. ఏనిమిది వసంతాలు పూర్తి చేసుకొని 9వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా మాలియా ప్రాంతములో వైఎస్సార్సీపీ కువైట్ కమిటీ ప్రధాన కోశాధికారి నాయని మహేశ్వర్ రెడ్డి, అధికార ప్రతినిధి ఆకుల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి వార్షికోత్సవ వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరైన గల్ఫ్, కువైట్ కన్వీనర్లు ఇలియాస్ బి.హెచ్, ముమ్మడి బాలిరెడ్డిలు మాట్లాడుతూ.. పార్టీ ఆవిర్భావం నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టీడీపీతో చేతులు కలిపి వైఎస్ జగన్పై అక్రమ కేసులు పెట్టి 16 నెలలు జైలుకు పంపినా అధైర్యపడకుండా ప్రజా సంక్షేమం కొరకు పోరాడుతున్నారని ప్రశంసించారు. 2014 ఎన్నికల తర్వాత వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను, లోక్ సభ సభ్యులను సంతలో పశువుల్లా కొనుగోలు చేసినా అదరకుండా, బెదరకుండా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నారన్నారు. కార్యనిర్వాహకులు మహేష్, ప్రభాకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన నుంచి ప్రజలను కాపాడాలంటే వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రి కావాలన్నారు. వైఎస్ జగన్ను సీఎం చేసే బాధ్యత ప్రవాసాంధ్రుల అందరిపై ఉందన్నారు. గల్ఫ్లో ఉన్న ప్రతి వైఎస్సార్ అభిమాని తమ నియోజకవర్గాలకు వెళ్లి పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. వీలు కాని వాళ్లు ఫోన్ ద్వారా తమ కుటుంబ సభ్యలకు చెప్పి ఓట్లు వేయించాలని కోరారు. ఈ కార్యక్రమములో కో కన్వీనర్లు గోవిందు నాగరాజు, యం.వి. నరసారెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు పి. రెహామన్ ఖాన్, లాలితరాజ్, సలహా దారులు నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, బీసీ ఇంచార్జ్ రమణ యాదవ్, మైనారిటీ ఇంచార్జ్ షేక్ గఫార్, ఎస్సీ, ఎస్టీ ఇంచార్జ్ బీఎన్ సింహా, మైనారిటీ సభ్యులు షా హుస్సేన్, మహాబూబ్ బాషా,సేవాదళ్ వైస్ ఇంచార్జ్ సుబ్బారెడ్డి, యువజన సభ్యులు రవిశంకర్, హరినాధ్ చౌదరి, జగన్ సైన్యం అధ్యక్షులు బాషా, కమిటీ సభ్యులు ఖాదురున్, ప్రభాకర్, సుధాకర్ నాయుడు, నూక శ్రీనువాసులు రెడ్డి, గజ్జల నరసారెడ్డి, సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రసారెడ్డి, సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వైఎస్సార్ సీపీ ఆవిర్భావ వేడుకలు
-
రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వైఎస్సార్ సీపీ ఆవిర్భావ వేడుకలు
సాక్షి, అమరావతి : దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల సాధనే ధ్యేయంగా ఆవిర్భవించిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నేటితో ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకుని తొమ్మిదో వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. దీంతో వైఎస్సార్ సీపీ కార్యాలయాలన్ని పండగ వాతావరణాన్ని తలపించాయి. గుంటూరులో.. గుంటూరు జిల్లా రేపల్లెలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో నేతలు జెండా ఎగురవేశారు. వైఎస్సార్ సీపీ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తోందని.. రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని మోపిదేవి వెంకటరమణ కార్యకర్తలకు సూచించారు. చంద్రబాబు అనేక మోసపూరిత వాగ్ధానాలు, ప్రజలను తప్పు దోవ పట్టించే వ్యాఖ్యలు చేస్తారని.. ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలపై ఉందని మోపిదేవి వెంకటరమణ అన్నారు. శ్రీకాకుళంలో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శ్రీకాకుళం జిల్లాలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్ర కార్యాలయంలో పార్లమెంట్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు కిల్లి కృపారాణి పార్టీ జెండా ఎగురవేశారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఆయా నియోజకవర్గ సమన్వయకర్తలు పార్టీ జెండా ఎగురవేశారు. శ్రీకాకుళం లో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు, పార్లమెంట్ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ పాల్గొన్నారు. తొమ్మిదేళ్లలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ ప్రజలకు అత్యంత చేరువ అయిందని ప్రజా సమస్యల పరిష్కారాల కోసం జగన్ పోరాట పటిమను చూపించి విజయం సాధించారన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో.. తూర్పుగోదావరి జిల్లా తునిలో ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి రామా థియేటర్ సెంటర్ వరకు కార్యకర్తలు, నాయకులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం దాడిశెట్టి రాజా కేకే కట్ చేసి పార్టీ జెండా ఎగురవేశారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తేనే రాష్త్రంలో సంక్షేమ పాలన వస్తుందని దాడిశెట్టి రాజా అన్నారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ సీపీ మేనిఫెస్టోని ప్రతి ఇంటికి తీసుకువెళ్లాలన్నారు. ప్రకాశం జిల్లాలో.. ప్రకాశం జిల్లా కనిగిరిలో వైఎస్సార్ సీపీ ఇంచార్జ్ బుర్ర మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 9వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గత తొమ్మిదేళ్లుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేసిందని... పార్టీని బలోపేతం చేయడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సఫలీకృతమయ్యారన్నారు. జగన్ను సీఎం చేసుకుంటే ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతోందన్నారు. కర్నూలు జిల్లాలో.. కర్నూలు జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్, టీడీపీ పాలనను వ్యతిరేకించి ప్రజా సమస్యలపై పోరాటానికి వైఎస్ జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారని పార్టీ నేతలు అన్నారు. అవినీతి అరాచక పాలనను తరిమికొట్టాలంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంటరీ అధ్యక్షుడు బి వై రామయ్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్ రెడ్డి, ముఖ్య నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో.. వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పశ్చిమగోదావరి జిల్లాలో ఆ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. పాలకొల్లు గాంధీ బొమ్మ సెంటర్లో నియోకవర్గ సమన్వయకర్త గుణ్ణం నాగబాబు ఆధ్వర్యంలో పార్టీ జెండా ఎగురవేసిన అనంతరం... కేక్ కట్చేసి కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రమే అని నాయకులు అన్నారు. రాష్ట్రప్రజలకు తమ పార్టీపై పూర్తి విశ్వాసముందని ధీమా వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాలో.. గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పండుగ వాతావరణం నెలకొంది. తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో వైఎస్సార్ సీపీ రూపొందించిన సంక్షేమ పథకాల వివరాలను గ్రామ స్తాయిలోకి ప్రతి ఒక్కరికి చేరాలని పార్టీ నేత కోన రఘుపతి కార్యకర్తలకు సూచనలు చేశారు. వైఎస్సార్ కడప జిల్లాలో.. వైఎస్సార్ కడప జిల్లా రాయచోటిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 9వ వార్షికోత్సవ వేడుకలను ఆ పార్టీ నేతలు ఘనంగా జరుపుకున్నారు . రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి మదన్ మోహన్ రెడ్డితో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులు పార్టీ కార్యాలయంలో మహనేత వైఎస్సార్ చిత్రపటానికి, విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తేలుపుకున్నారు. ఎనిమిదేళ్లు ప్రజల పక్షాన నిలబడటంతో పాటు ప్రజా సంక్షేమం కోసం పాటు పడిన ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని నేతలు కొనియాడారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజాసమస్యలే తన ఎజెండా పనిచేస్తున్న పార్టీ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అభివర్ణించారు. విశాఖపట్నంలో.. విశాఖలో వైఎస్సార్ సీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ నేతలు జెండాను ఆవిష్కరించారు. నేతలు, కార్యకర్తలు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. రాష్ట్ర ప్రజలు రాజన్న పాలనను కోరుకుంటున్నారని త్వరలోనే వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తుందని నేతలు ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీకి వస్తున్న ప్రజాధరణను చూసి టీడీపీ వెన్నులో వణుకు పుడుతోందని నేతలన్నారు. అనకాపల్లిలో వైఎస్సార్సీపీ 9వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను నియోజకవర్గ సమన్వకర్త గుడివాడ అమర్నాథ్ ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేశారు. పార్టీ ఏర్పడిన నాటి నుంచి ప్రజల పక్షాన నిలబడి పోరాడుతూనే ఉందన్నారు. మరో నెల రోజుల్లో జరిగే ఎన్నికల్లో పార్టీ ఘనవిజయం సాధిస్తుందని అమర్నాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే జగన్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అమర్నాథ్ అన్నారు. ఈ సందర్భంగా వందలాది మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు. -
నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం మార్చి 12న రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఆ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ ఏర్పాటై మార్చి 12 నాటికి ఎనిమిదేళ్లు పూర్తి చేసుకొని, 9వ వసంతంలోకి అడుగుపెడుతోందని ఈ సందర్భంగా శ్రీకాంత్ పేర్కొన్నారు. దీన్ని పునస్కరించుకొని లోటస్పాండ్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఉదయం 10 గంటలకు పార్టీ జెండా ఆవిష్కరణ జరుగుతుందని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్లోని పార్టీ నేతలు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు తప్పక పాల్గొనా లని కోరారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహించాలని కోరారు. -
కేక్ కట్ చేసిన రాహుల్, మన్మోహన్ సింగ్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ 134వ అవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నాయి. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన వేడుకల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్లతో పాటు పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ జెండా ఎగురవేశారు. అలాగే మన్మోహన్ సింగ్తో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యుహాంపై నేతల మధ్య చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. గత కొంతకాలంగా వరుస అపజయాలతో డీలా పడిపోయిన కాంగ్రెస్లో ఇటీవల రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం కొత్త ఉత్తేజాన్ని నింపింది. స్వాతంత్ర్య ఉద్యమకాలంలో డిసెంబర్ 28 , 1885 రోజున భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. -
సంక్షేమంలో నం–1
సూపర్బజార్(కొత్తగూడెం): దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పరిశ్రమల కంటే సింగరేణి సంస్థ కార్మికులకు సంక్షేమ పథకాల అమలులో మొదటి స్థానంలో ఉందని సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.శ్రీధర్ అన్నారు. సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రకాశం స్టేడియంలో ఆదివారం జరిగిన ప్రధాన వేడుకల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉదయం విలేకరుల సమావేశంలో, రాత్రి జరిగిన వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ బొగ్గు రంగంలోనే కాకుండా విద్యుత్ ఉత్పత్తిలో కూడా సత్తా చాటుతోందని అన్నారు. జైపూర్లో ఇప్పటికే 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని, త్వరలో మరో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి రంగం సిద్ధమైందని చెప్పారు. సోలార్ విద్యుత్ వైపు కూడా దృష్టి సారించామని, రాబోయే కాలంలో 300 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. ముందుగా 130 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. రాష్ట్రంలోనే కాకుండా ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కూడా బొగ్గు గనుల ఏర్పాటుకు సింగరేణి చర్యలు చేపట్టిందని, 6 కొత్త బ్లాక్లను ఏర్పాటు చేయబోతోందని అన్నారు. ఇప్పటికే ఒడిశాలో నైనీ బ్లాక్ను చేపట్టినట్లు చెప్పారు. రాబోయే 5 సంవత్సరాల్లో మరో 12 గనుల ఏర్పాటుకు కార్యాచరణను సిద్ధం చేశామని చెప్పారు. త్వరలో 100 మిలియన్ టన్నుల ఉత్పత్తి దిశగా సింగరేణి సంస్థ ఎదగబోతోందని అన్నారు. రాబోయే 5 సంవత్సరాల్లో వార్షిక నికర ఆదాయాన్ని రూ.35 వేల కోట్ల లక్ష్యంగా నిర్దేశించుకుంటున్నట్లు వివరించారు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ధ సంస్థగా సింగరేణి సంస్థ విరాజిల్లుతోందని అన్నారు. బయ్యారం స్టీల్ప్లాంట్ విషయంలో కమిటీ వేశారని, భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సింగరేణి సంస్థ బయ్యారం స్టీల్ప్లాంట్ను చేపట్టే అవకాశాలున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయంలో స్పష్టంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. కార్మికుల సంక్షేమానికి తమ సంస్థ కట్టుబడి ఉందని, సొంత ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షలు వడ్డీలేని రుణాన్ని బ్యాంకుల ద్వారా ఇప్పించేందుకు చర్యలు చేపట్టిందని తెలిపారు. వీటికోసం ఇప్పటికే 3 వేల దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. సింగరేణి అధికారులకు సొంత ఇంటి నిర్మాణాల కోసం హైదరాబాద్లో స్థలాన్ని అన్వేషిస్తున్నట్లు తెలిపారు. సింగరేణి స్థలాల్లో ఉన్న కార్మికులకు క్రమబద్ధీకరణ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. భద్రాచలంరోడ్ – సత్తుపల్లి రైల్వేలైన్ నిర్మాణం కోసం 10 సంవత్సరాల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయని, 52 కిలోమీటర్ల రైల్వే మార్గానికి రూ. 710 కోట్ల ఖర్చవుతుందని, దీనిలో రూ.610 కోట్లు సింగరేణి ఇచ్చేలా ఒప్పందం కుదిరిందని తెలిపారు. దీనికోసం 13 గ్రామాలలో భూ సేకరణ జరుగుతోందని సీఎండీ వివరించారు. విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే సింగరేణికి 5వ స్థానం రావడం ఐక్య కృషికి నిదర్శనమని అన్నారు. దినదిన ప్రవర్థమానంగా సింగరేణి సంస్థ ఎదుగుతూ తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తోందన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో సింగరేణి కుటుంబమంతా భాగస్వామ్యం కావాలని శ్రీధర్ కోరారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబర్ నెలాఖరు వరకు గత ఏడాది చేసిన బొగ్గు ఉత్పత్తి కంటే 9 శాతం వృద్ధిరేటుతో 395 లక్షల టన్నుల మేర సాధించగలిగామని, 6 శాతం వృద్ధితో 430 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేశామని చెప్పారు. 3 శాతం వృద్ధితో గత 8 నెలల కాలంలో 247 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓబీని కూడా తీశామని ప్రకటించారు. సింగరేణీయులందరికీ సంస్థ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 2013 – 14 వార్షిక బొగ్గు ఉత్పత్తి నుంచి 2017–18 వార్షిక బొగ్గు ఉత్పత్తి వరకు 22.9 శాతం వృద్ధి రేటును సాధించగలిగామని వివరించారు. ప్రభుత్వం నియమించిన మెడికల్ బోర్డ్ ద్వారా ప్రతినెల బోర్డ్ నిర్వహించి కారుణ్య నియామకాలు చేపడుతున్నామని, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 25 మెడికల్ బోర్డ్లు నిర్వహించామని, 5,284 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో 3,419 మంది కార్మికులు వైద్యపరంగా అన్ఫిట్ అయ్యారని, వారి వారసులకు ఉద్యోగాలు కల్పిస్తామని వివరించారు. ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామని పేర్కొన్నారు. దశాబ్దాల చరిత్ర కలిగిన సింగరేణికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉందన్నారు. అంకితభావంతో పనిచేస్తూ యంత్రాలను పూర్తి పనిగంటలు వినియోగిస్తూ రక్షణ, నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ముందుకు వెళ్తే రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా నంబర్ ఒన్ పరిశ్రమగా నిలబడగలుగుతామని అన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ (ఈఅండ్ఎం) సలాకుల శంకర్, డైరెక్టర్ (ఆపరేషన్స్ అండ్ పా) ఎస్.చంద్రశేఖర్, డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్) బి.భాస్కర్రావు, డైరెక్టర్ (ఫైనాన్స్) ఎన్.బలరాం, వేడుకల కన్వీనర్ కె.బసవయ్య, జీఎం (పర్సనల్ రిక్రూట్మెంట్ సెల్) ఎ.ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. -
నవ్యాంధ్ర ప్రజలకు గవర్నర్ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి : నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో గడపాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పధకాలు రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రతి సంక్షేమ, అభివృద్ధి పథకాలు నిరుపేదలకు అందేలా చూడాలని, ప్రజల సంతోషమే ప్రభుత్వానికి విజయ సంకేతాలంటూ వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో సంక్షేమ ఫలాలు మరింత పారదర్శకంగా ప్రజలందికీ అందాలని ఆకాంక్షించారు. నవ్యాంధ్రప్రదేశ్ సాధన దిశగా ప్రభుత్వం విజయాలు సాధించాలని కొరుకుంటున్నట్లు వెల్లడించారు. -
కువైట్లో వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ వేడుకలు
కువైట్ : వైయస్ఆర్ కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు కువైట్లో ఘనంగా జరిగాయి. ఏడు వసంతాలు పూర్తి చేసుకొని 8వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా మాలియా ప్రాంతము పవన్ రెస్టారెంట్లో వైఎస్ఆర్సీపీ కువైట్ యూత్ సభ్యులు అద్దాలూరి బాలకృష్ణా రెడ్డి గారి ఆధ్వర్యములో వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భముగా గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్, కో కన్వీనర్లు గోవిందు నాగరాజు, యం నరసా రెడ్డిలు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయ సాధన కోసం ఏర్పడిన పార్టీ వైయస్ఆర్సీపీ అని పేర్కొన్నారు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుల, మత, పేద, ధనిక వర్గాలు అనే భేదం ప్రభుత్వ పథకాలను అమలు చేశారని, ప్రతి ఒక్కరు ఏదో ఒక రూపంలో లబ్ధిపొందిన వారేనని అన్నారు. తిరిగి రాజన్న రాజ్యం రావాలంటే రాజన్న బిడ్డ, జననేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమ నిర్వాహకులు బాలకృష్ణా రెడ్డి మాట్లాడుతూ నల్ల కాలువలో ప్రజలకు ఇచ్చిన మాట కోసం, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పదవిని తృణపాయంగా వదులుకున్న గొప్ప నేత అని, వైఎస్ఆర్సీపీలో సభ్యుడిగా ఉన్నందుకు గర్వంగా ఉందన్నారు. గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు పి. రెహామన్ ఖాన్, ప్రధాన కోశాధికారి నాయని మహేష్ రెడ్డి మాట్లాడుతూ రెండు నాలుకల ధోరణితో పూటకో మాట మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న ముఖ్యమంత్రిని బుద్ధి చెప్పడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సరైన నాయకుడని అన్నారు. ప్రవాసాంధ్రులు పార్టీ అభ్యున్నతికి తమవంతు సహాయసహాకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమములో ఇతర గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు తెట్టు రఫీ, రవీంద్ర నాయుడు, అధికార ప్రతినిధి ఆకుల ప్రభాకర్ రెడ్డి, సలహా దారులు నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, బీసీ ఇన్చార్జ్లు కె రమణ యాదవ్, సోషల్ మీడియా ఇన్చార్జ్ గాలివీటి ప్రవీణ్ కుమార్ రెడ్డి, యూత్ ఇన్చార్జ్ మర్రి కళ్యాణ్, యస్సీ, ఎస్టీ ఇన్చార్జ్ బిఎన్ సింహా, మైనారిటీ విభాగం ఇన్చార్జ్ షేక్ గఫార్, సాంస్కృతిక విభాగం ఇన్చార్జ్ కె వాసుదేవరెడ్డి, సలహాదారులు అన్నాజీ, ఆబూతురాబ్, సభ్యులు షా హుస్సేన్, పిడుగు సుబ్బారెడ్డి, రావూరి రమణ, కె సుబ్బారెడ్డి, యు వెంకట రమణ రెడ్డి, షేక్ సబ్దర్, కె హారినాధ్ చౌదరి, గౌస్ బాషా, మహాబూబ్ బాషా, రెడ్డి సంఘం గౌరవ అధ్యక్షులు మన్నూరు చంద్రశేఖర్ రెడ్డి, ఉపాధ్యక్షులు పి సురేష్ రెడ్డి, జగన్ హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు జబీవుల్లా, ఉపాధ్యక్షులు నాసర్, జగన్ సైన్యం అధ్యక్షులు బాషా, అభిమానులు మల్లు శ్రీనివాసులు రెడ్డి, మన్నూరు సుబ్రహ్మణ్యం రెడ్డి, మల్లికార్జున రెడ్డి, సూరి రెడ్డి, రామారావులు పాల్గొన్నారు. -
7 ఏళ్ల ప్రస్థానం
-
‘ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని చరిత్ర సృష్టించాం’
-
‘ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని చరిత్ర సృష్టించాం’
సాక్షి, ప్రకాశం : గత ఏడేళ్లలో ఎన్నో ఆటుపోట్లను ఎదర్కొని చరిత్ర సృష్టించామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 8వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పద్మవ్యూహంలో అభిమన్యుడిలా జగన్ ఎన్నో సవాళ్లను అధిగమించారన్నారు. కాంగ్రెస్ను ఎదిరించి బయటికొచ్చాక జరిగిన కడప ఉప ఎన్నికల్లో ఐదు లక్షల పై చిలుకు భారీ మెజార్టీతో గెలిచారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై అక్రమ కేసులతో అన్యాయంగా జగన్కు జైలుకు పంపారన్నారు. ఆ తర్వాత పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాజీనామా చేయించి ధైర్యంగా ఉపఎన్నికలు ఎదుర్కొన్నారని తెలిపారు. ఆ ఉప ఎన్నికల్లో ప్రజలు తిరుగులేని మెజార్టీతో వైఎస్ఆర్సీపీ గెలిపించారన్నారు. విశ్వసనీయత, విలువలు, నిబద్ధతకు వైఎస్ జగన్ కట్టుబడ్డారని, చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజల కోసం ముందుకెళ్తున్నారని చెప్పారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున 67 మంది గెలిస్తే 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు కోట్లు పెట్టి కొనుగోలు చేశారని విమర్శించారు. ఎన్నికలెప్పుడొచ్చినా 150 సీట్లు.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.20 నుంచి 30 కోట్లు ఇవ్వడమే కాకుండా.. దేశంలో ఎక్కడా లేని విధంగా నలుగురిని మంత్రులను చేశారన్నారు. టీడీపీ దుర్మార్గ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అందుకే వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రను ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్ఆర్సీపీ కచ్చితంగా 150 కిపైగా సీట్లలో గెలుస్తుందన్నారు. ప్రజల నుంచి వస్తున్న ఆదరణే నిదర్శనమని సజ్జల పేర్కొన్నారు. -
వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ వేడుకల్లో జననేత
-
కేంద్ర కార్యాలయంలో ఘనంగా వైఎస్సార్ సీపీ ఆవిర్భావ వేడుకలు
-
కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
సాక్షి, ఒంగోలు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 8వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. కార్యకర్తలు నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ప్రకాశం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన సోమవారం ఉదయం ఈపురుపాలెంలో భారీ కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. రాజన్న రాజ్యాన్ని తిరిగి తెస్తా... ‘సరిగ్గా 8 ఏళ్ల క్రితం ఇదే రోజు విలువలతో కూడిన రాజకీయాలను అందించేందుకు.. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను నెరవేర్చేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పురుడు పోసుకుంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రజల హక్కుల సాధన కోసం అండగా నిలుస్తూ పోరాడుతూనే.. రాజన్న రాజ్యాన్ని తిరిగి తెస్తాం’ అని ఆయన ట్వీట్ చేశారు. This day, 8 years ago, YSRCP was formed to uphold the value based politics & promises of Dr. YSR. We commit to the people of Andhra Pradesh to ensure their rights, and bring back Rajanna's Rajyam. (1/2) — YS Jagan Mohan Reddy (@ysjagan) 12 March 2018 ఇక ఇంతకాలం పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలకు, తనకు అండగా నిలుస్తున్న ప్రజలకు వైఎస్ జగన్ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరో ట్వీట్ చేశారు. I thank our cadre for their affection and dedication towards the party & express my gratitude to the people of AP for their support. #YSRCPFoundationDay(2/2) pic.twitter.com/0yRsVx2TSD — YS Jagan Mohan Reddy (@ysjagan) 12 March 2018 అనతికాలంలోనే బలీయమైన శక్తిగా.. ప్రజల ఆకాంక్షల మేరకు ఒక చారిత్రక అవసరంగా 2010 మార్చి 12న ఆవిర్భవించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనతి కాలంలోనే బలీయమైన శక్తిగా ఎదిగింది. పార్టీని స్థాపించేటప్పుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ఆయన తల్లి వైయస్ విజయమ్మ ఒక్కరే తోడుగా నిలిచారు. పార్టీకి పెను సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ మొక్కవోని ధైర్యంతో వైయస్ జగన్ మరింత రాటుతేలారు. పార్టీకి దిశానిర్దేశం చేస్తూ ముందుకు నడుపుతున్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం వైయస్ జగన్ పోరాటం చేస్తూ రాష్ట్రానికి ఏకైక దిక్కుగా నిలిచారు. సేవా కార్యక్రమాలు.. రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలను చేపట్టబోతున్నాయి. పార్టీ కేంద్ర, రాష్ట్ర కార్యాలయాలు, అన్ని పార్లమెంట్ జిల్లా కేంద్రాల్లో, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లో పార్టీ జెండాను ఆవిష్కరించి, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. -
‘అండగా ఉన్న కార్యకర్తలకు పాదాభివందనం‘
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 8వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెలుగు రాష్ట్రాలు, ఇక్కడి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సీనియర్ నేత, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ ఆశయ సాధనకు వైఎస్సార్సీపీని స్థాపించడం జరిగిందని.. అందుకు అనుగుణంగా కృషి చేద్దామని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదాను ఎన్నికల తరువాత పాలకులు మర్చిపోయారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎమ్మెల్యే ఆర్కే రోజా మాట్లాడుతూ..ఏడేళ్లుగా పార్టీకి అండగా ఉన్న కార్యకర్తలకు పాదాభివందనమన్నారు. చిరంజీవి లాంటి వాళ్ళు పార్టీ పెట్టి నడపలేక చేతులు ఎత్తేశారని ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు. వైఎస్సార్సీపీని పురిటిలోనే తొక్కేయాలని ప్రయత్నాలు చేశారని తెలిపారు. రావడం లేటు కావొచ్చు కానీ.. 2019 లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం వైఎస్ జగన్ చేస్తున్న ప్రత్యేక హోదా పోరాటాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ వేడుకల్లో భూమన కరుణాకర్ రెడ్డి, లక్ష్మీ పార్వతి, వాసిరెడ్డి పద్మ, తదితరులతో పాటు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒంగోలు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కార్యకర్తలు నిర్వహించిన వేడుకల్లో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ప్రకాశం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన సోమవారం ఉదయం ఈపురుపాలెంలో భారీ కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. ‘సరిగ్గా 8 ఏళ్ల క్రితం ఇదే రోజు విలువలతో కూడిన రాజకీయాలను అందించేందుకు.. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను నెరవేర్చేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పురుడు పోసుకుంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రజల హక్కుల సాధన కోసం అండగా నిలుస్తూ పోరాడుతూనే.. రాజన్న రాజ్యాన్ని తిరిగి తెస్తాం’ అని ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. ఢిల్లీ : వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, వరప్రసాద్, మిధున్ రెడ్డి కార్యాలయంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. పార్టీకి బంగారు భవిష్యత్తు ఉంటుందని, పోరాట పటిమ కలిగిన వైఎస్ జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారని ఈ సందర్భంగా నేతలు కొనియాడారు. తూర్పు గోదావరి : జిల్లాలో ఘనంగా వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. రాజమండ్రిలో పార్టీ కో ఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు ఆధ్వర్యంలో, రాజోలులో కో ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో, పి.గన్నవరం నియోజకవర్గంలో కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. అనంతపురం: జిల్లాలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణులు వైఎస్సార్ సీపీ జెండా ఆవిష్కరించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మాజీ ఎంపీ అనంతవెంకట్రామిరెడ్డి, అనంతపురం సమన్వయకర్త నదీం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు రాగేపరశురాం, కృష్ణప్ప, అనంతపురం,హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్త బోయరంగయ్యలు తదితరలు ఈ వేడుకల్లో పాల్గాన్నారు. వైఎస్సార్ సీపీలో పనిచేయడం గర్వంగా ఉందని.. ప్రజల పక్షాన పోరాడుతున్న ఏకైక పార్టీ వైఎస్సార్ సీపీ అని అనంత వెంకట్రామి రెడ్డి తెలిపారు. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలను ధీటుగా ఎదుర్కొన్న నేత వైఎస్ జగన్ అని, ప్రత్యేక హోదా సాధించేవరకూ పోరాటాలు ఆపేది లేదని ఆయన స్పష్టం చేశారు. వైఎస్ఆర్ జిల్లా : పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన కార్యకర్తలు కేక్ కటింగ్ చేసి సంబరాలు చేసుకున్నారు. రాయచోటి కార్యాలయంలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ నసీబున్ ఖానం, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. వేంపల్లిలోని నాలుగు రోడ్ల కూడలిలో పార్టీ నేతలు జెండాను ఆవిష్కరించారు. విజయవాడ: పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డిలు వైఎస్సార్ విగ్రహానికి నివాళులు అర్పించి, జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమలో నేతలు పార్థసారధి, ఉదయభాను, మాల్లాది విష్ణు, జోగి రమేష్, తోట శ్రీనివాస్, వెల్లంపల్లిలతో పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ప్రజల పక్షాన ముందుండి పోరాడుతుందని పార్థసారథి తెలిపారు. జగన్ చేస్తున్న ఉద్యమాలు, కార్యక్రమాలు ఏ ఒక్కరూ చేయలేదని, ప్రజల కోసం నిరంతరం పాటుపడే వ్యక్తి జగన్ అని మరో నేత ఉదయభాను తెలిపారు. కర్నూలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ముఖ్య నేతలు పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో బి.వై.రామయ్య, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, కర్నూల్ అసెంబ్లీ ఇంచార్జ్ హాఫీజ్ ఖాన్, అన్నీ కులసంఘాలు నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశంలో విశ్వసనీయత, విలువల పునాదులపై ఏర్పడిన పార్టీ వైఎస్సార్ సీపీ అని బి.వై.రామయ్య పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని తెలిపారు. ప్రజాసంక్షేమం కోసం ప్రతిక్షణం పోరాడుతున్న ఒకే ఒక నాయకుడు జగన్ మోహన్ రెడ్డి మాత్రమే అని ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. ఆత్మకూరులో జరిగిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో శిల్ప చక్రపాణి రెడ్డి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విశాఖ: జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 8వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాడేరు మోద కొండమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏరియా ఆసుపత్రిలో రోగులకు రొట్టె, పాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. భీమిలి అసెంబ్లీ పరిధిలో వాడవాడలా వేడుకలు జరిపారు. పార్టీ నాయకులు అక్కరమాని వెంకటరావు అధ్వర్యంలో జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్, బైక్ ర్యాలీ నిర్వహించారు. పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్ రాయవరం మండలాల్లో ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిత్తూరు: జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగాయి. చంద్రగిరిలో పార్టీ కన్వీనర్ చిలకూరి యుగందర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. రామచంద్రాపురం మండలం సూరావారిపల్లిలో పార్టీ కన్వీనర్ బ్రహ్మనందరెడ్డి ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఎర్రవారిపాళెంలో పార్టీ కన్వీనర్ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. సంతపేటలోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి పురుషోత్తంరెడ్డి జెండా ఆవిష్కరించారు. మహబూబ్ నగర్: జిల్లా కేంద్రంలో వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు మరియమ్మ వైఎస్సార్ విగ్రహనికి పులమాల వేసి, పార్టీ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
'మోదీ తన హామీని నిలబెట్టుకోవాలి'
హైదరాబాద్: చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన చారిత్రక అవసరం ఉందని ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం పార్టీ కేంద్రకార్యాలయంలో పార్టీ జెండా ఎగురవేసిన ఆయన.. భారీగా హాజరైన కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో చేసిన చేసిన వాగ్ధానాలను మరచిపోయిన చంద్రబాబు.. అప్రజాస్వామిక పద్దతుల్లో ఇతర పార్టీల్లో గెలిచిన వారిని పార్టీలోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారని మేకపాటి రాజమోహన్రెడ్డి విమర్శించారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రధానమంత్రి అధ్యక్షతన గొప్ప విజయం సాధించారని ఆయన అభినందించారు. అయితే.. ప్రధానిపై కూడా ప్రజాస్వామ్య విలువల్ని కాపాడే బాధ్యత ఉందని, తిరుపతి వెంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రత్యేక హోదాపై చేసిన ప్రకటనను ప్రధాని నెరవేర్చాలని అన్నారు. 2019 ఎన్నికల్లో ప్రజాస్వామ్య పద్దతిలోనే చంద్రబాబును ఎదుర్కొదాం అని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. -
సేవాస్ఫూర్తి .. చైతన్యదీప్తి
జిల్లాలో విస్తరిస్తున్న జాతీయ సేవా పథకం 85 కళాశాలల్లో 165 యూనిట్లు, 16,500 మంది వలంటీర్లు నేడు ఎన్ఎస్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం రాయవరం: విద్యార్థి దశ నుంచే సేవా భావం, క్రమశిక్షణ, సమాజంపై అవగాహన కల్పించేందుకు జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్)ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తమ కళాశాలలతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలోను, ప్రజలను సమాజ సేవ పట్ల చైతన్యపర్చడంలోను ఎన్ఎస్ఎస్ వలంటీర్ల కృషి వెల కట్టలేనిది. సమాజంలో ఉన్నవారిని చైతన్యపర్చడంతో పాటు, సమాజ సేవను తమ సేవగా భావించే భావజాలం విద్యార్థి దశ నుంచే అలవాటు చేయడం ద్వారా దేశ భవిష్యత్తుకు పునాదులు వేసినట్లవుతుంది. ప్రతిఫలం ఆశించకుండా సేవా మార్గం పట్టేవారే ఎన్ఎస్ఎస్లో వలంటీర్లుగా చేరతారు. సమాజాభ్యుదయమే ధ్యేయంగా సేవలందిస్తున్న జాతీయ సేవా పథకం(ఎన్ఎస్ఎస్)ను 1969 సెప్టెంబరు 24న ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న ఎన్ఎస్ఎస్సౌ ‘సాక్షి’ కథనం. ఇంతింతై వటుడింతై అన్నట్టు.. జాతీయ సేవా పథకాన్ని 1969 సెప్టెంబరు 24న ఏర్పాటు చేశారు. జిల్లాలో ఈ పథకం రోజు రోజుకూ విస్తరిస్తోంది. ప్రారంభంలో జిల్లాలో 10 నుంచి 15 యూనిట్లు ఉండగా ప్రస్తుతం 25 జూనియర్ కళాశాలల్లో, 60 డిగ్రీ కళాశాలల్లో 165 యూనిట్లు ఉన్నాయి. మొత్తం 16,500 మంది విద్యార్థులు ఎన్ఎస్ఎస్లో వలంటీర్లుగా కొనసాగుతున్నారు. సేవా కార్యక్రమాలు ఇలా.. ఈ ఏడాది జాతీయ సేవా పథకం కార్యక్రమాలకు సుమారుగా రూ.1.30 కోట్ల బడ్జెట్ను ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రత్యేక శిబిరాల నిర్వహణకు రూ.22,500 చొప్పున కేటాయిస్తారు. 2015–16 సంవత్సరంలో 165 ప్రత్యేక సేవా శిబిరాలను నిర్వహించారు. దసరా, క్రిస్మస్, సంక్రాంతి సెలవుల్లో ప్రత్యేక శిబిరాల నిర్వహణకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రత్యేక శిబిరాలతో సామాజిక చైతన్యం.. కళాశాలలకు చెందిన ఎన్ఎస్ఎస్ యూనిట్లు ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుంటాయి. ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబాటు ఉన్న గ్రామాలను ఎంపిక చేస్తాయి. ఆయా గ్రామాల్లో వారం రోజులు పాటు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తారు. విద్యార్థులు(వలంటీర్లు) రోజూ ఏదో ఒక రూపంలో ప్రజలకు సేవలందిస్తారు. ఇంటింటికీ వెళ్లి పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తారు. మూఢ నమ్మకాలపై చైతన్యవంతం చేస్తారు. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యాన్ని వివరిస్తారు. తాగునీటి వనరులను ఆయా శాఖల అధికారులు, సిబ్బందితో కలిసి క్లోరినేషన్ చేస్తారు. వైద్య, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తారు. ప్రభుత్వ పథకాలు పొందడంపై అవగాహన కల్పిస్తారు. ఓటరుగా పేరు నమోదు చేసుకోవడం, ఓటు విలువ తెలియజేయడం, ఉన్నత లక్ష్యాలు, సమాజానికి మేలు చేసే వ్యక్తిని ప్రజాప్రతినిధిగా ఎంపిక చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేస్తారు. చదువు విలువను తెలియజేసి, అక్షరాస్యతను పెంపొందిస్తారు. యూనిట్ల బలోపేతమే లక్ష్యం.. జిల్లాలో ప్రస్తుతం ఉన్న 165 యూనిట్లను బలోపేతం చేయడమే లక్ష్యం. ప్రతి యూనిట్లో 100 మంది విద్యార్థులను చేర్చుకుంటున్నాం. ప్రత్యేక క్యాంపునకు 50 మందిని తీసుకువెళ్తాం. ఎన్ఎస్ఎస్లో చేరిన విద్యార్థుల్లో వ్యక్తిగత క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం పెంపొందుతాయి. ప్రస్తుత యువత రక్తదానానికి ప్రాధాన్యమిస్తున్నారు. ప్రజలకు సామాజిక విలువను తెలియజేస్తున్నారు. ప్రజా చైతన్యంతో పల్లెలు ప్రగతిబాట పడతాయి. – డాక్టర్ పి.వి.కృష్ణారావు, ఎస్ఎస్ఎస్ జిల్లా ప్రోగ్రామ్ అధికారి -
ఏకే 47 తో విద్యార్థులు.. ఇండోర్ లో కలకలం
భోపాల్: మధ్యప్రదేశ్ లో కాలేజ్ ఫంక్షన్ లో విద్యార్థులు ఏకే 47 గన్ తో డాన్స్ చేయడం కలకలం రేపుతోంది. ఇండోర్ లోని హోల్కర్ సైన్స్ కాలేజ్ 125 వ వార్షికోత్సవం సందర్భంగా కొందరు విద్యార్థులు ఏకే 47 ను పట్టుకొని డాన్సులు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకోగా, విద్యార్థులు పారిపోయారు. వీడియో ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నట్టు, కాలేజీ యాజమాన్యం పైనా చర్యలు తీసుకోనున్నట్టు పోలీసు అధికారి తెలిపారు. -
పోరుబాటలో ముందడుగు
వైఎస్సార్సీపీ ఐదేళ్ల ప్రస్థానం ఐదేళ్లుగా రాష్ట్ర ప్రజల గొంతుకగా నిలిచిన పార్టీ ఎన్ని కుట్రలు ఎదురైనా వెనుకంజ వేయకుండా పోరాటం రాజకీయ పెనుసవాళ్ల మధ్య వైఎస్ జగన్ ముందడుగు నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ, కన్నీళ్లు తుడుస్తూ భరోసా ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఇచ్చిన మాటకోసం ముందుకే... ప్రజల పక్షాన నిలిచి అలుపెరుగని పోరాటం చేస్తున్న వైఎస్సార్సీపీ సాక్షి, హైదరాబాద్ రాజకీయ పెనుసవాళ్ల మధ్య ఆత్మగౌరవ నినాదంతో ఆవిర్భవించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల ప్రస్థానాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుని అప్రతిహతంగా ముందడుగు వేస్తోంది. పార్టీ ప్రారంభించిన రోజునుంచీ ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా వెనుకంజ వేయకుండా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ రాష్ట్ర ప్రజల గొంతుకగా నిలిచింది. రాష్ట్ర విభజన నుంచి ప్రత్యేకహోదా వరకు ఏ సమస్య ఎదురైనా వైఎస్సార్సీపీ పోరాడింది, పోరాడుతోంది. అప్పట్లో ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానం, రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ కుమ్మక్కై తనపై కేసులు పెట్టినా, అణగదొక్కాలని ప్రయత్నించినా, ఆఖరుకు 16 నెలల పాటు జైలుపాలు చేసినా వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాట పంథాను వీడలేదు. రాష్ట్ర ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం సైనికుడిలా పోరాడారు. దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ, కోట్లాది మంది ప్రజలను నేరుగా కలుసుకుంటూ, వారి కష్టాలు విని కన్నీళ్లు తుడుస్తూ భరోసానిచ్చారు. అబద్ధపు హామీలివ్వకుండా, విలువలపై రాజీ పడకుండా రాజకీయాలు నడుపుతూ అందరికీ ఆదర్శంగా నిలిచారు. తొలి ప్రయత్నంలోనే 67 మంది ఎమ్మెల్యేలతో పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా నిలిపారు. సంక్షోభంలో ఆవిర్భావం.. ప్రజాప్రస్థానం పాదయాత్రతో 2004లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని సంక్షేమ రాజ్యంగా మార్చారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, సంతృప్త స్థాయిలో సామాజిక పింఛన్ల మంజూరు, బలహీన వర్గాల గృహ నిర్మాణం వంటి పథకాలతో దేశానికే ఆదర్శంగా నిలిచారు. 2009లో ఒంటిచేత్తో మరోసారి అధికారంలోకి తీసుకువచ్చిన కొద్దిరోజులకే సెప్టెంబర్ రెండో తేదీన నల్లమల అడవుల్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన హఠాన్మరణం పాలయ్యారు. తమ అభిమాన నేత మరణాన్ని తట్టుకోలేక రాష్ట్రవ్యాప్తంగా సుమారు 700 మందికి పైగా తనువు చాలించారు. తన తండ్రి కోసం తపించి మరణించిన వారి కుటుంబాలను ఓదార్చడానికి యాత్రను చేపడతానని జగన్ నల్లకాలువ సభలో ప్రకటించారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఓదార్పు యాత్రకు అంగీకరించలేదు. మరోవైపు వైఎస్ మరణం తరువాత ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన కె.రోశయ్య, ఆ తర్వాత నల్లారి కిరణ్కుమార్రెడ్డి సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేశారు. ఈ నేపథ్యంలో తన తండ్రి ఆశయాల సాధనకోసం రాజన్న రాజ్యాన్ని స్థాపించేందుకు జగన్ కాంగ్రెస్ పార్టీని వీడారు. ఇడుపులపాయలోని తన తండ్రి సమాధి వద్ద 2011, మార్చి 12వ తేదీన పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీని (వైఎస్సార్ కాంగ్రెస్) స్థాపించారు. అదే ఏడాది మే నెలలో జరిగిన ఉప ఎన్నికల్లో కడప లోక్సభా స్థానం నుంచి 5,45,672 ఓట్లు, పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి 81,373 ఓట్ల తిరుగులేని భారీ ఆధిక్యతలతో గెలుపొంది ఇద్దరూ చరిత్రను సృష్టించారు. ఆ తరువాత సీబీఐ ప్రత్యేక కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో వైఎస్ పేరును చేర్చడాన్ని తీవ్రంగా నిరసిస్తూ నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి రాజీనామా చేసి, ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో సుమారు మూడు లక్షల భారీ ఆధిక్యతతో గెలుపొందారు. అంతకుముందే కోవూరు ఉప ఎన్నికల్లో కూడా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి గెలుపొందారు. అలా వైఎస్సార్సీపీ బలం ఇద్దరు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలకు పెరిగింది. నల్లారి కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై నిరసన తెలుపుతూ అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన తీర్మానానికి జగన్ను బలపరుస్తున్న 17 మంది ఎమ్మెల్యేలు అనుకూలంగా ఓటు వేయడంతో వారందరినీ స్పీకర్ అనర్హులుగా ప్రకటించారు. ఒక పీఆర్పీ ఎమ్మెల్యే అంతకుముందే సమర్పించిన రాజీనామాను ఆమోదించారు. ఈ 18 స్థానాలకుజరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 15 చోట్ల తిరుగులేని విజయాన్ని సాధించి ఏపీ అసెంబ్లీలో తన బలాన్ని 17కు పెంచుకుంది. ఎన్ని కుట్రలెదురైనా... ఓదార్పుయాత్ర చేస్తానని నల్లకాలువ సభలో జగన్ ప్రకటించినప్పటి నుంచీ కక్షసాధింపు చర్యలు మొదలయ్యాయి. పశ్చిమగోదావరి, ఖమ్మం జిల్లాల్లో జరిపిన తొలివిడత ఓదార్పులో రాజన్న తనయుడికి లభించిన ఆదరణను కాంగ్రెస్ అధిష్టానం ఓర్వలేకపోయింది. ఓదార్పు యాత్రను తక్షణమే ఆపేయమని హుకుం జారీచేసింది. తండ్రికి ఇచ్చిన మాట కోసం ముందుకే వెళ్లాలని నిర్ణయించుకున్న జగన్ ఇచ్ఛాపురం నుంచి ఓదార్పు యాత్రను పునఃప్రారంభించారు. ఆ యాత్రలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులెవ్వరూ పాల్గొనవద్దని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించింది. పాల్గొన్నవారిని పార్టీనుంచి సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో జగన్ పోరాట పంథానే ఎంచుకున్నారు. తన తండ్రి అనుసరించిన సంక్షేమ బాటను అదే స్ఫూర్తితో కొనసాగించాలన్నా.. ఆయన ఆశయాలను సాధించాలన్నా కాంగ్రెస్ను అనివార్యంగా వీడాల్సిందేనని నిర్ణయించుకున్నారు. తన తల్లి వైఎస్ విజయమ్మతో కలిసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ ద్వారా తమకు సంక్రమించిన పులివెందుల ఎమ్మెల్యే, కడప ఎంపీ పదవులకు కూడా తల్లీ తనయులు రాజీనామా చేశారు. ఆ తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడంతో జగన్పై కుట్రలు ముమ్మరమయ్యాయి. వైఎస్సార్సీపీకి లభిస్తున్న ఈ ఆదరణను ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శంకర్రావు చేత జగన్ సంస్థలపై విచారణ జరిపించాలంటూ హైకోర్టుకు ఓ లేఖను రాయించింది. (సోనియాగాంధీ చెబితేనే తాను ఈ లేఖ రాశానని శంకర్రావు స్వయంగా ఒప్పుకున్నారు). ఈ లేఖను హైకోర్టు పిల్గా స్వీకరిస్తే అందులో టీడీపీ అగ్రనేతలు కొందరు కూడా ఇంప్లీడ్ అయ్యారు. ఆ తరువాత వరుసగా జగన్ ఇంటిపైనా, సాక్షి దినపత్రికపైనా, ఇతర సంస్థలపైనా సీబీఐ దాడులు చేసింది. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశంపార్టీతో కుమ్మక్కై సీబీఐతో దాడులు చేయించినా జగన్ తలవంచలేదు. ఉప ఎన్నికల ప్రచారపర్వంలో ఉన్న జగన్ను విచారణ నిమిత్తం పిలిపించిన సీబీఐ మూడు రోజుల తర్వాత మే 27న అరెస్టు చేసి 16 నెలలపాటు జైల్లో నిర్బంధించింది. అయినా జగన్ ఆత్మస్థైర్యాన్ని వీడలేదు. గౌరవాధ్యక్షురాలి హోదాలో విజయమ్మ పార్టీని పకడ్బందీగా నడిపారు. కాంగ్రెస్-టీడీపీ కుమ్మక్కు రాజకీయాలకు నిరసనగా జగన్ సోదరి షర్మిల ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ ఁమరో ప్రజా ప్రస్థానం* పేరుతో సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ఇదే సమయంలో రాష్ట్రాన్ని విభజించాలన్న ఏఐసీసీ నిర్ణయాన్ని నిరసిస్తూ షర్మిల సమైక్య శంఖారావం పేరుతో యాత్ర నిర్వహించారు. విభజనకు వ్యతిరేకంగా విజయమ్మ గుంటూరులో నిరవధిక నిరాహారదీక్ష చేశారు. ఆమె దీక్షను భగ్నం చేసిన తరువాత జగన్ చంచల్గూడ జైలులో దీక్షకు పూనుకున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో నిమ్స్లో చేర్చి ఆయన చేత బలవంతంగా దీక్షను విరమింపజేశారు. అనంతరం 2013, సెప్టెంబర్ 24న జైలునుంచి విడుదలైన పక్షం రోజులకే జగన్ తన ఇంటి ముందే సమైక్య దీక్షను చేశారు. చరిత్రాత్మకమైన రీతిలో హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో పార్టీ ఆధ్వర్యంలో 'సమైక్య శంఖారావం' సభను నిర్వహించారు. తనపై ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా, చివరకు జైలు పాలు చేసినా అదరక, బెదరక... ఆత్మగౌరవమే నినాదంగా, ఆత్మస్థైర్యమే ఆయుధంగా జగన్ ముందడుగు వేశారు. అలుపెరుగని పోరాటం.. వైఎస్సార్సీపీ 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరి పోరాటానికి దిగింది. విలువలున్న రాజకీయాలకు పెద్దపీట వేస్తూ, సాధ్యమయ్యే హామీలనే ఇస్తూ పార్టీ అధ్యక్షుడు జగన్ రాష్ట్రమంతటా అలుపెరుగకుండా ప్రచారం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అలివికాని హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టినా వైఎస్సార్సీపీ ప్రభంజనాన్ని ఆపలేకపోయారు. 1,27,71,323 ఓట్లతో 67 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని పార్టీ బలీయమైన శక్తిగా, ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన టీడీపీకి, వైఎస్సార్సీపీకి ఓట్ల మధ్య తేడా కేవలం ఐదు లక్షలే కావడం గమనార్హం. అనంతరం జరిగిన మున్సిపల్, పంచాయితీరాజ్ ఎన్నికల్లో కూడా వైఎస్సార్సీపీ గణనీయమైన సంఖ్యలో సీట్లను గెల్చుకుంది. రాష్ట్రంలో ఎక్కడ సమస్య ఉన్నా జగన్ అక్కడ ప్రజలకు అండగా నిలిచారు. రాజధాని పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవినీతి కార్యకలాపాలను ప్రజల సాక్షిగా ఎండగట్టారు. విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు, ప్రత్యేక హోదాను ఇవ్వాలంటూ గళం విప్పారు. 2014 ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని నిలదీశారు. రెండేళ్లుగా ప్రతిపక్ష నేత ప్రభంజనాన్ని, ప్రజల్లో జగన్కు పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక రాష్ట్రంలో చంద్రబాబు ఫిరాయింపుల పర్వానికి తెర తీశారు. ప్రజాబలమే పునాదిగా పార్టీని ప్రారంభించిన జగన్ ఏమాత్రం చలించకుండా మొక్కవోని విశ్వాసంతో ముందడుగు వేస్తున్నారు. మైలురాళ్లు 2009 సెప్టెంబర్ 2: హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖరరెడ్డి దుర్మరణం 2009 సెప్టెంబర్ 25: ఓదార్పు యాత్ర చేస్తానని నల్లకాలువలో వైఎస్ జగన్ ప్రకటన 2010 నవంబర్ 29: కాంగ్రెస్ పార్టీకి, పదవులకు జగన్, విజయమ్మ రాజీనామా 2011, మార్చి 12: ఇడుపులపాయలోని వైఎస్సార్ సమాధి వద్ద వైఎస్సార్సీపీ పతాకావిష్కరణ 2011 మే 13: కడప లోక్సభ, పులివెందుల అసెంబ్లీ స్థానాల్లో ఘనవిజయం 2011 జూలై 8: ఇడుపులపాయలో తొలి ప్లీనరీ 2011 జూలై12: ఆస్తులపై సీబీఐ విచారణకు ఆదేశం 2012 మే 27: వైఎస్ జగన్ అరెస్టు 2012 అక్టోబర్ 18: షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ 2013 ఆగస్టు 25: సమైక్య రాష్ట్రం కోసం జైలులో జగన్ దీక్ష 2013 సెప్టెంబర్ 24: జైలునుంచి జగన్ విడుదల 2013 అక్టోబర్ 5: ఇంటిముందే సమైక్య దీక్ష 2013 అక్టోబర్ 26: రాజధానిలో సమైక్య శంఖారావం 2014 మే 7: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు -
మీ రాష్ట్రం ధైర్య, సాహసికులను ఇచ్చింది
న్యూఢిల్లీ: మీ రాష్ట్రం ధైర్యం, సాహసం ఉన్నవాళ్లను దేశానికి ఇచ్చిందని ప్రధాని నరేంద్రమోదీ మహారాష్ట్రను కొనియాడారు. గుజరాత్, మహారాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన ఆ రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశాభివృద్ధిలో ఆ రెండు రాష్ట్రాల పాత్ర అద్వితీయమంటూ కొనియాడుతూ శుక్రవారం ట్వీట్ చేశారు. ఈ రెండు రాష్ట్రాలు కూడా 1960 మే 1న ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ మోదీ మహారాష్ట్రపై అధికంగా ప్రశంసలు గుప్పించారు. దేశాభివృద్ధికి మహారాష్ట్ర సేవల చాలా గొప్పవని అన్నారు. ఆ నేల ఈ దేశానికి గొప్పగొప్ప తత్వవేత్తలను, మత పెద్దలను, ధైర్యవంతులను, సాహసికులను అందించిందని చెప్పారు. దేశంలో మహారాష్ట్ర ప్రజలకు అత్యధికంగా కష్టపడేతత్వం ఉంటుందని చెప్పారు. మహారాష్ట్ర మరింత గొప్పగా అభివృద్ధి పదాన దూసుకెళ్లాలని తాను మనసారా ఎల్లప్పుడూ కోరుకుంటానని చెప్పారు. -
తూర్పులో ఘనంగా వైఎస్ఆర్ సీపీ ఆవిర్భావ వేడుకలు
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. జగ్గంపేట, రామచంద్రాపురం, కాకినాడ రూరల్ పరిధిలోని కార్యాలయాల్లో పార్టీ నేతలు జెండా ఎగురవేశారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో జ్యోతుల నవీన్, యనమదల మురళీ, లింగం రవితోపాటు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. -
‘ఓక్రిడ్జ్’లో ఫౌండేషన్ డే...