Future group
-
కొనుగోలు చేసేవాళ్లే లేరా.. మూసివేత దిశగా బిగ్బజార్?
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఫ్యూచర్ రిటైల్ను (ఎఫ్ఆర్ఎల్) కొనుగోలు చేసేందుకు సరైన కొనుగోలుదారుపై రుణదాతలు ఒక నిర్ణయానికి రాలేకపోవడంతో సంస్థ మూసివేత దిశగా చర్యలు ప్రారంభం కానున్నాయి. సంస్థ లిక్విడేషన్ కోసం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ముంబై బెంచ్)లో పరిష్కార నిపుణుడు (ఆర్పీ) దరఖాస్తు సమర్పించినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు ఎఫ్ఆర్ఎల్ తెలియజేసింది. ఫ్యూచర్ గ్రూప్లో భాగమైన ఎఫ్ఆర్ఎల్కు రూ. 30,000 కోట్ల పైచిలుకు రుణభారం ఉంది. సంక్షోభ పరిస్థితుల్లో ఉన్న ఫ్యూచర్ గ్రూప్ కంపెనీలను రూ. 24,713 కోట్లకు కొనుగోలు చేసేందుకు 2020లో రిలయన్స్ రిటైల్ ప్రతిపాదించినప్పటికీ .. అమెజాన్తో న్యాయపరమైన వివాదాల కారణంగా రుణదాతలు దాన్ని తిరస్కరించారు. ఎఫ్ఆర్ఎల్పై 2022 జులై 20 నుంచి దివాలా ప్రక్రియ (సీఐఆర్పీ) కింద చర్యలు ప్రారంభమయ్యాయి. పరిష్కార చర్యలకు గడువును ఎన్సీఎల్టీ నాలుగు సార్లు పొడిగించినప్పటికీ తగిన పరిష్కారం లభించలేదు. చివరి సారిగా నిర్దేశిత గడువులోగా స్పేస్ మంత్ర రూ. 550 కోట్లకు బిడ్ వేసినప్పటికీ రుణదాతల కమిటీలో (సీవోసీ) దానికి తగినంత స్థాయిలో మద్దతు లభించలేదు. దీంతో ఎఫ్ఆర్ఎల్ లిక్విడేషన్ బాట పట్టనుంది. -
ఫ్యూచర్ ఫోరెన్సిక్ ఆడిట్పై కోర్టుకు బియానీ
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ఫ్యూచర్ రిటైల్ (ఎఫ్ఆర్ఎల్) ఫోరెన్సిక్ ఆడిట్ ప్రక్రియపై సంస్థ డైరెక్టర్ కిశోర్ బియానీ తాజాగా బోంబే హైకోర్టును ఆశ్రయించారు. బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బీడీవో ఇండియా ఆగస్టు 9న సమర్పించిన ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్టుతో పాటు మొత్తం ఆడిట్ ప్రక్రియను సవాలు చేస్తూ ఆయన రిట్ పిటీషన్ దాఖలు చేసినట్లు కంపెనీ తెలిపింది. వివరాల్లోకి వెడితే.. గతేడాది జూలై 20న ఎఫ్ఆర్ఎల్పై దివాలా చట్టం కింద చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రక్రియ సెప్టెంబర్ 15 నాటికి ముగియాలి. ఇందులో భాగంగా కంపెనీ ఖాతాలను ప్రధాన రుణదాత బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) తరఫున బీడీవో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించింది. దీనిపై తమ సమాధానాలు తెలపాల్సిందిగా కిషోర్ బియానీ, ఆయన సోదరుడు రాకేష్ బియానీకి బీవోఐ సూచించింది. -
కిశోర్ బియానీకి సెబీ జరిమానా
న్యూఢిల్లీ: సెబీ తాజాగా ఫ్యూచర్ గ్రూప్నకు చెందిన సంస్థలు, వ్యక్తులకు విడిగా రూ. 10 లక్షల చొప్పున జరిమానా విధించింది. వీటిని 45 రోజుల్లోగా చెల్లించాలంటూ ఆదేశించింది. కిశోర్ బియానీ, ఫ్యూచర్ కార్పొరేట్ రీసోర్సెస్(ఎఫ్సీఆర్ఎల్)సహా 14 సంస్థ లు, వ్యక్తులపై సెబీ జరిమానా విధించింది. ప్రాగ్జిస్ హోమ్ రిటైల్లో ఎఫ్సీఆర్ఎల్ వాటా పెరిగిన నేపథ్యంలో వాటాదారుల(పబ్లిక్)కు ఓపెన్ ఆఫర్ను ప్రకటించవలసి ఉంది. అయితే ప్రాగ్జిస్ హోమ్ రిటైల్ వాటాదారులకు ఓపెన్ ఆఫర్ను ప్రకటించకపోవడంతో సెబీ తాజా చర్యలకు ఉపక్రమించింది. తప్పనిసరిగా మార్పిడయ్యే 3,180 డిబెంచర్ల(సీసీడీలు)ను ఈక్విటీగా మార్చడంతో 2020 ఫిబ్రవరి 11కల్లా ప్రాగ్జిస్లో ఎఫ్సీఆర్ఎల్ వాటా 5.71 శాతం పెరిగింది. తద్వారా ప్రాగ్జిస్ ప్రమోటర్ సంస్థలలో ఒకటైన ఎఫ్సీఆర్ఎల్ వాటా 47.43% నుంచి 53.13 శాతానికి బలపడింది. అయితే ఎస్ఏఎస్టీ నిబంధనల ప్రకారం ఇప్పటివరకూ ఓపెన్ ఆఫర్ను ప్రకటించకపోవడంతో సంబంధిత 15 సంస్థలు, వ్యక్తులకు సెబీ జరిమానా విధించింది. -
ఫ్యూచర్ గ్రూప్ ఎవరిదో.. రేసులో రిలయన్స్, అదానీ సంస్థలు
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో ఉన్న ఫ్యూచర్ రిటైల్ను సొంతం చేసుకునేందుకు తీవ్ర పోటీ నెలకొంది. రేసులో రిలయన్స్, అదానీ, జిందాల్ తదితర పలు గ్రూప్లు, సంస్థలు పోటీపడుతున్నాయి. వెరసి కంపెనీ ఆస్తుల కొనుగోలుకి ఆసక్తిని వ్యక్తం చేస్తూ(ఈవోఐ) 49 బిడ్స్ దాఖలయ్యాయి. ప్రస్తుతం దివాలా పరిష్కార ప్రక్రియలో భాగమైన ఫ్యూచర్ రిటైల్ ఆస్తులను ఐదు క్లస్టర్స్గా విడదీశాక రుణదాతలు ఈవోఐ బిడ్స్కు ఆహ్వానం పలికిన సంగతి తెలిసిందే. -
'కెఫె కాఫీ డే' కు మరో ఎదురు దెబ్బ..కొండంత అప్పును మంచులా కరిగించేసింది..కానీ!
బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల నుంచి తీసుకున్న రుణాల చెల్లింపుల్లో ప్రయివేట్ రంగ కంపెనీలు కాఫీ డే ఎంటర్ప్రైజెస్ విఫలమైంది.సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికం(క్యూ2)లో దాదాపు రూ. 466 కోట్లమేర అసలు, వడ్డీ చెల్లింపుల్లో విఫలమైనట్లు కేఫె కాఫీ డే సంస్థ తెలిపింది. వీటిలో ఎన్సీడీలు, ఎన్సీఆర్పీఎస్ తదితర అన్లిస్టెడ్ రుణ సెక్యూరిటీలున్నట్లు పేర్కొంది. అయితే భర్త వీజీ సిద్ధార్థ మరణంతో కొండలా పేరుకు పోయినా అప్పును మాళవిక హెగ్డే మంచులా కరిగించేశారు.కెఫే కాఫీ డే సామ్రాజ్యాన్ని పునర్ నిర్మించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ తరుణంలో కెఫె కాఫీ డే ఆర్ధిక వ్యవహారాలు బిజినెస్ వరల్డ్లో హాట్ టాపిగ్గా మారాయి. ఎందుకంటే? మాళవిక హెగ్డే మాళవిక హెగ్డే అనే పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. కెఫే కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ సతీమణిగా, కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎస్ఎం కృష్ణ కూతురిగా మాత్రమే మాళవిక హెగ్డే సుపరిచితం. ఇది అంత గతం. ఇప్పుడు తన గురించి తెలిసిన వాళ్లు మాత్రం ఇక నుంచి ఆమెను ఎప్పటికీ మరిచిపోరు. ఇంకా చెప్పాలంటే.. భర్త మరణంతో వెలుగులోకి 2019 జులైలో కెఫే కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు సిద్ధార్థ హఠాన్మరణం ప్రపంచ వ్యాపార వర్గాల్లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మంగళూరులోని ఓ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే సిద్ధార్థ ఈ నిర్ణయం తీసుకున్నారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఆయన మరణం తర్వాత ఆయన భార్య మాళవిక హెగ్డే ఆ కంపెనీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. కొండంత అప్పును మంచులా కరిగించేసింది కేఫె కాఫీ డే సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో అప్పుల్లో ఉన్న కంపెనీని మళ్లీ తిరిగి నిలబెట్టేందుకు, అప్పులను తగ్గించుకునేందుకు తాను కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. కేవలం మాటలు మాత్రమే చెప్పలేదు చేసి చూపించారు. కెఫె కాఫీ డే సీఈవో పదవి చేపట్టిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకోవడంతో కంపెనీ అప్పులను సగానికి(రూ.7,200 కోట్ల నుంచి రూ.3,100 కోట్లుకు) తగ్గించేశారు. కెఫే కాఫీ డే సామ్రాజ్యాన్ని పునర్ నిర్మించే పనిలో నిమగ్నమయ్యారు. చదవండి👉 ముగ్గురు పిల్లలకు..చాలా తెలివిగా ముఖేష్ అంబానీ వీలునామా! -
ఫ్యూచర్కు ఎదురు దెబ్బ.. ఈసారి లైఫ్ స్టయిల్ ఫ్యాషన్స్ రూపంలో
న్యూఢిల్లీ: ఫ్యూచర్ గ్రూపు కంపెనీ అయిన ఫ్యూచర్ లైఫ్ స్టయిల్ ఫ్యాషన్స్ జూన్ త్రైమాసికానికి రూ.1,880 కోట్ల భారీ నష్టాన్ని నమోదు చేసింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో సంస్థ నష్టం కేలం రూ.149 కోట్లుగానే ఉంది. కార్యకలాపాల ద్వారా ఆదాయం రూ.831కోట్ల నుంచి రూ.607 కోట్లకు తగ్గింది. వ్యయాలు రూ.1,438 కోట్లకు పెరిగాయి. విక్రయాలు తగ్గడం, రుణాల ఖర్చులు, ఆస్తుల విలువ తగ్గిపోవడం, కొన్ని రకాల కేటాయింపులు భారీ నష్టాలకు కారణమని సంస్థ తెలిపింది. ఈ సంస్థ నిర్వహణలోని 34 సెంట్రల్ స్టోర్లు, 78 బ్రాండ్ ఫ్యాక్టరీ దుకాణాలు మూతపడినట్టు ప్రకటించింది. -
'తప్పంతా మీదే' ఫ్యూచర్పై అమెజాన్ ఆగ్రహం!
న్యూఢిల్లీ: రుణ సవాళ్లు ఎదుర్కొంటున్న ఫ్యూచర్ రిటైల్ స్వతంత్ర డైరెక్టర్లు తమ చట్టబద్ధ బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైనట్లు ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ తాజాగా ఆరోపించింది. ఇది దేశంలోని కార్పొరేట్ పాలనకుగల బాధ్యత, పారదర్శకత, నిజాయితీలపై పలు ప్రశ్నలకు తావిస్తున్నదని వ్యాఖ్యానించింది. కంపెనీ స్వతంత్ర డైరెక్టర్కు రాసిన లేఖలో అమెజాన్ పలు అభ్యంతరాలు లేవనెత్తింది. లాజిస్టిక్స్, వేర్హౌసింగ్ బిజినెస్ను రిలయన్స్కు బదిలీ చేసేందుకు ప్రయత్నించడంలో ఫ్యూచర్ గ్రూప్ న్యాయపరమైన ఆదేశాల ఉల్లంఘనకు తెరతీసిందంటూ ఆరోపించింది. 2020 ఆగస్ట్లో ఫ్యూచర్ గ్రూప్ రిలయన్స్ రిటైల్ వెంచర్స్తో రూ. 24,713 కోట్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా రిటైల్, హోల్సేల్, లాజిస్టిక్స్, వేర్హౌసింగ్ విభాగాలతో కలిపి 19 కంపెనీలను విక్రయించేందుకు డీల్ కుదుర్చుకుంది. అయితే ఈ ఒప్పందానికి విరుద్ధంగా అమెజాన్ సింగపూర్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ను ఆశ్రయించింది. అంతేకాకుండా అమెజాన్, ఫ్యూచర్ గ్రూప్ వివాదం సుప్రీం కోర్టు, ఢిల్లీ హైకోర్టు, ఎన్సీఎల్టీ తదితరాలచెంతకు చేరడంతో సెక్యూర్డ్ రుణదాతలు డీల్కు వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో ఒప్పందానికి చెక్ పడింది. -
వడ్డీలు కట్టలేక చేతులెత్తేసిన ‘ఫ్యూచర్’!
న్యూఢిల్లీ: రుణ భారంతో సవాళ్లు ఎదుర్కొంటున్న ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ తాజాగా రూ. 6.07 కోట్ల వడ్డీ చెల్లింపుల్లో విఫలమైంది. కంపెనీ గతంలో జారీ చేసిన మార్పిడిరహిత డిబెంచర్ల(ఎన్సీడీలు)పై ఈ నెల 20కల్లా వడ్డీ చెల్లించవలసి ఉన్నట్లు తెలియజేసింది. అయితే ప్రతికూల పరిస్థితులతో వీటిపై వడ్డీ చెల్లించలేకపోయినట్లు వెల్లడించింది. గత కొన్ని నెలలుగా కిశోర్ బియానీ గ్రూప్ కంపెనీ పలు చెల్లింపుల్లో డిఫాల్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా రూ. 120 కోట్ల విలువైన సెక్యూరిటీలపై వడ్డీ చెల్లింపుల్లో డిఫాల్ట్ అయ్యింది. ఈ సెక్యూర్డ్ డిబెంచర్లను వార్షికంగా 10.15 శాతం కూపన్ రేటుతో జారీ చేసింది. కాగా.. ఈ నెల మొదట్లోనూ రూ. 29 కోట్ల విలువైన ఎన్సీడీలపై రూ. 1.41 కోట్ల వడ్డీ చెల్లింపుల్లో కంపెనీ విఫలంకావడం గమనార్హం! -
ఫ్యూచర్కు మరో ఎదురు దెబ్బ.. ఈసారి వడ్డీ రూపంలో
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో చిక్కుకున్న ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ (ఎఫ్ఈఎల్) తాజాగా రూ. 23 కోట్ల నాన్–కన్వర్టబుల్ డిబెంచర్లకు సంబంధించి రూ. 1.06 కోట్ల వడ్డీని చెల్లించడంలో విఫలమైనట్లు తెలిపింది. మే 17న దీన్ని చెల్లించాల్సినట్లు పేర్కొంది గత మూడు నెలల్లో ఫ్యూచర్ గ్రూప్ పలు చెల్లింపుల్లో డిఫాల్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. మార్చి 31 నాటికి బ్యాంకులకు రూ. 2,836 కోట్ల చెల్లింపులో కూడా విఫలమైనట్లు ఎఫ్ఈఎల్ గత నెల స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. ఫ్యూచర్ గ్రూప్లోని 19 సంస్థలను రూ. 24,713 కోట్లకు కొనుగోలు చేయడానికి రిలయన్స్ రిటైల్ ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ వివిధ కారణాల వల్ల ఆ డీల్ సాకారం కాలేదు. -
అప్పుల ఊబి, వాటల విక్రయం..ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్కు వేల కోట్లు!
న్యూఢిల్లీ: రుణ ఊబిలో ఉన్న ఫ్యూచర్ గ్రూపు కంపెనీ ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ దివాలా ప్రక్రియ బారిన పడకుండా చర్యల మార్గం పట్టింది. ఫ్యూచర్ జనరాలి ఇన్సూరెన్స్ కంపెనీల్లో తనకున్న వాటాలను విక్రయించడం ద్వారా రూ.3,000 కోట్లను సమకూర్చుకోనుంది. ఈ నిధులతో రుణభారం తగ్గించుకోవాలన్నది కంపెనీ వ్యూహం. ఫ్యూచర్ జనరాలి ఇండియా ఇన్సూరెన్స్ అన్నది ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్, జనరాలి భాగస్వామ్య సంస్థ. ఇది సాధారణ బీమా సంస్థ. ఇందులో తనకున్న వాటాలో 25 శాతాన్ని భాగస్వామి జనరాలికి రూ.1,266 కోట్లను విక్రయించినట్టు గత వారమే ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ ప్రకటించింది. ఈ లావాదేవీ తర్వాత కూడా ఫ్యూచర్ జనరాలిలో ఫ్యూచర్ ఎంటర్ ప్రైజెస్కు 24.91 శాతం వాటా మిగిలే ఉంది. వచ్చే 30–40 రోజుల్లో మిగిలిన 25 శాతం వాటా విక్రయంతో రూ.1,250 కోట్లు లభిస్తాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇక ఫ్యూచర్ జనరాలి లైఫ్ ఇన్సూరెన్స్లో ఉన్న 33.3 శాతం వాటాను సైతం విక్రయించనుంది. దీని ద్వారా మరో రూ.400 కోట్ల వరకు రానున్నాయి. ఈ మూడు లావాదేవీలతో మొత్తం రూ.2,950 కోట్ల వరకు సమకూరతాయి. ఈ ఏడాది మార్చి 31 నాటికి చెల్లించాల్సిన రూ. 2,911 కోట్ల రుణాల విషయంలో ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ డిఫాల్ట్ అయింది. దీనికి అదనంగా 30 రోజుల సమీక్ష కాలంలోనూ చెల్లించలేకపోయింది. -
Future Group: 'ఫ్యూచర్'కు మంచి ఫ్యూచర్ ఉంది!
న్యూఢిల్లీ: రుణ భారంతో సవాళ్లు ఎదుర్కొంటున్న ఫ్యూచర్ గ్రూప్ తిరిగి నిలదొక్కుకోవడంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గ్రూప్ కంపెనీలు ఫ్యూచర్ లైఫ్స్టైల్ ఫ్యాషన్స్, సప్లై చైన్ సొల్యూషన్స్, కన్జూమర్ అండ్ ఎంటర్ప్రైజెస్ తిరిగి పట్టాలెక్కేందుకు వీలున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఫ్యూచర్ గ్రూప్తో రిలయన్స్ రిటైల్ కుదుర్చుకున్న రూ. 24,713 కోట్ల ఒప్పందాన్ని సెక్యూర్డ్ రుణదాతలు తిరస్కరించిన నేపథ్యంలో తాజా అంచనాలకు ప్రాధాన్యత ఏర్పడింది. గ్రూప్లోని ప్రధాన కంపెనీ ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్(ఎఫ్ఆర్ఎల్) దాదాపు రూ. 18,000 కోట్ల రుణ భారాన్ని కలిగి ఉంది. దివాలా చట్ట చర్యలను ఎదుర్కోబోతున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. అయితే ఇతర కంపెనీలు ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్(ఎఫ్ఈఎల్), ఫ్యూచర్ లైఫ్స్టైల్ ఫ్యాషన్స్(ఎఫ్ఎల్ఈఎల్), ఫ్యూచ ర్ సప్లై చైన్ సొల్యూషన్స్(ఎఫ్ఎస్సీఎస్ఎల్), ఫ్యూచర్ కన్జూమర్ (ఎఫ్సీఎల్) తమ సొంత ఆస్తుల పునర్వ్యవస్థీకరణ ద్వారా పునరుజ్జీవనం పొందే వీలున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. పునరుత్తేజం ఇలా సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఎఫ్ఈఎల్కు రూ. 5,000 కోట్ల రుణభారముంది. ఫ్యూచర్ జనరాలి ఇండియా ఇన్సూరెన్స్ బిజినెస్లో వాటాను విక్రయిస్తోంది. రూ. 3,000 కోట్లవరకూ లభించనున్నాయి. దీంతో రుణ భారం భారీగా తగ్గనుంది. ఇక కర్ణాటకలోని తుమ్కూర్లో 110 ఎకరాల ఫుడ్ పార్క్ను ఎఫ్ఎంసీజీ కంపెనీ ఎఫ్సీఎల్ కలిగి ఉంది. ఇది కంపెనీ పునరి్నర్మాణానికి వినియోగపడనుంది. దేశవ్యాప్తంగా ఎఫ్ఎస్సీఎస్ఎల్కు వేర్హౌస్లున్నాయి. నాగ్పూర్లో అత్యంత భారీ, ఆధునిక ఆటోమేటెడ్ పంపిణీ కేంద్రాన్ని కలి గి ఉంది. ఇవన్నీ కంపెనీకి అండగా నిలవనున్నా యి. అయితే ఈ అంశాలపై స్పందించేందుకు ఫ్యూ చర్ గ్రూప్ ప్రతినిధి నిరాకరించడం గమనార్హం! సోమవారం ట్రేడింగ్లో ఫ్యూచర్ గ్రూప్లోని పలు కంపెనీల షేర్లు 20–5% మధ్య పతనమయ్యాయి. -
ఫ్యూచర్తో రిలయన్స్ డీల్ క్యాన్సిల్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్
ముంబై: ఈ వారం స్టాక్ మార్కెట్ నష్టాలతో ఆరంభమైంది. యూస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచవచ్చనే అంచనాలు నెలకొనడంతో ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ సూచీలు బలహీనంగా కదలాడాయి. వాటి ప్రభావం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీసింది. దీంతో ఈ రోజు ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గు చూపారు. దీంతో ఐటీ, మెటల్, ఎఫ్ఎంసీజీ కంపెనీ షేర్లు భారీగా నష్టపోయాయి. ఏడాదికి పైగా కొనసాగుతున్న రియలన్స్, ఫ్యూచర్, అమెజాన్ వివాదం ముగింపుకు వచ్చింది. అమెజాన్ అభ్యంతరాల నేపథ్యంలో ఫ్యూచర్ గ్రూపును కొనుగోలు చేయాలనే నిర్ణయం నుంచి రిలయన్స్ వెనకడుగు వేసింది. దీంతో రూ.24, 713 కోట్ల రూపాయల భారీ డీల్ క్యాన్సిల్ అయ్యింది. ఈ నిర్ణయం వెడివన వెంటనే ఫ్యూచర్ షేర్లు దారుణంగా నష్టపోయాయి. ఒక్క రోజు వ్యవధిలోనే 20 శాతానికి పైగా ఫ్యూచర్ షేరు పతనమైంది. ఇటీవల కాలంలో దారుణంగా పతనమైన పేటీఎంను వెనక్కి నెట్టింది ఫ్యూచర్. మరోవైపు రిలయన్స్ షేరు ధర కూడా 2.4 శాతం మేర నష్టపోయింది. ఈరోజు ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ ఇంచుమించు 400 పాయింట్ల నష్టంతో 56,757 పాయింట్ల వద్ద మొదలైంది. ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేదు. స్మాల్, మిడ్, బ్లూచిప్ ఇలా అన్ని కేటగిరీల్లో నష్టాలు వచ్చాయి. మార్కెట్ ముగిసే సమయానికి 617 పాయింట్లు నష్టపోయి 56,579 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 218 పాయింట్లు నష్టపోయి 16,953 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది. చదవండి: నెగ్గిన అమెజాన్ పంతం..! రూ. 24 వేల కోట్ల డీల్ను రద్దు చేసుకున్న రిలయన్స్..! -
నెగ్గిన అమెజాన్ పంతం..! రూ. 24 వేల కోట్ల డీల్ను రద్దు చేసుకున్న రిలయన్స్..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిలయన్స్– ఫ్యూచర్ గ్రూప్ మధ్య 21 నెలల క్రితం కుదిరిన ఒప్పందానికి తెరపడింది. ఫ్యూచర్ గ్రూప్లో భాగమైన ఫ్యూచర్ రిటైల్, ఇతర లిస్టెడ్ కంపెనీలకు చెందిన సెక్యూర్డ్ క్రెడిటార్స్ ఈ డీల్కు వ్యతిరేకంగా ఓటు వేయడం తెలిసిందే. దీంతో ఒప్పందం అమలు అసాధ్యమని రిలయన్స్ ఇండస్ట్రీస్ శనివారం స్పష్టం చేసింది. కిశోర్ బియానీ ప్రమోట్ చేస్తున్న ఫ్యూచర్ గ్రూప్నకు చెందిన రిటైల్, హోల్సేల్, లాజిస్టిక్స్, గిడ్డంగుల వ్యాపారాల్లోని 19 కంపెనీలను కొనుగోలు చేసేందుకు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ రూ.24,713 కోట్ల విలువైన ఒప్పందం చేసుకుంది. కానీ ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ ఈ డీల్ను వ్యతిరేకించింది. ఫ్యూచర్ రిటైల్కు చెందిన ఫ్యూచర్ కూపన్స్లో 49 శాతం వాటాను రూ.1,500 కోట్లకు అమెజాన్ కొనుగోలు చేసింది. రిలయన్స్–ఫ్యూచర్ గ్రూప్ డీల్ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించింది. చదవండి: జొమాటో సంచలన నిర్ణయం..వాటిపై పూర్తి నిషేధం..! -
రిలయన్స్ ఇలాంటి రహాస్య పనులు తగవు.. పబ్లిక్ నోటీస్ జారీ చేసిన అమెజాన్
Amazon Issued Public Notice On Reliance Deal: రెండేళ్లుగా నలుగుతున్న ఫ్యూచర్ అమెజాన్ రిలయన్స్ డీల్ వివాదం మరో మలుపు తీసుకుంది. రేపోమాపు ముగింపుకు వస్తుందని అంతా భావిస్తుండగా అమెజాన్ ట్విస్ట్ ఇచ్చింది. తమ అభ్యంతరాలను పరిష్కరించకుండా ముందుకు సాగితే కుదరదంటూ అమెజాన్ బహిరంగంగా తేల్చి చెప్పింది. బిగ్బజార్, ఫాంటాలూన్స్ పేరుతో భారీ రిటైల్ నెట్వర్క్ను కిశోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూపు నెలకొల్పింది. ఈ క్రమంలో ఫ్యూచర్ గ్రూపులో పెట్టుబడులు పెట్టి మైనర్ వాటాలను అమెజాన్ కొనుగోలు చేసింది. అయితే అమెజాన్ నిర్ణయాలను పరిగణలోకి తీసుకోకుండా ఫ్యూచర్ గ్రూపు మొత్తాన్ని రిలయన్స్కి 3.4 బిలియన్ డాలర్లకు అమ్మేస్తూ డీల్ చేసుకున్నారు. తమ అభిప్రాయానలు పరిగణలోకి తీసుకోకుండా ఫ్యూచర్ను రిలయన్స్ ఎలా టేకోవర్ చేస్తుందంటూ అమెజాన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అప్పటి నుంచి ఈ కేసు కోర్టు విచారిస్తోంది. అయితే ఫ్యూచర్ ఆధీనంలో దేశవ్యాప్తంగా విస్తరించిన రిటైల్ స్టోర్లను క్రమంగా తన ఆధీనంలోకి తెచ్చుకుంటోంది రిలయన్స్ సంస్థ. ఫ్యూచర్ గ్రూపు స్టోర్లను రీబ్రాండ్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా ఇటీవల వార్తలు కూడా వచ్చాయి. చదవండి: రిలయన్స్ ఆధీనంలోకి ఫ్యూచర్ రిటైల్ స్టోర్స్ వివాదం సుప్రీం కోర్టు పరిధిలో ఉండగా ఫ్యూచర్, రిలయన్స్ను రహ్యసంగా ఒప్పందాలు చేసుకుంటున్నాయంటూ అమెజాన్ పబ్లిక్ నోటీస్ పేరుతో ప్రకటన జారీ చేసింది. కోర్టు విచారణలో ఉండగా చట్ట విరుద్ధంగా రహస్య పద్దతుల్లో ఫ్యూచర్, రిలయన్స్ డీల్ చేస్తున్నాయంటూ ఆరోపణలు గుప్పించింది. వ్యాపార దిగ్గజ కంపెనీల మధ్య పోరు కావడంతో ఫ్యూచర్ వివాదం దేశవ్యాప్తంగా చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది. కాగా అమెజాన్ ఇచ్చిన పబ్లిక్ నోటీస్పై రియలన్స్, ఫ్యూచర్ గ్రూపుల నుంచి ఇంకా స్పందన రాలేదు. చదవండి: ఫ్యూచర్కు షాక్! లీగల్ నోటీసులు పంపిన రిలయన్స్! -
ఫ్యూచర్కు షాక్! లీగల్ నోటీసులు పంపిన రిలయన్స్!
న్యూఢిల్లీ: దేశీ రిటైల్ మార్కెట్పై ఆధిపత్యం కోసం దిగ్గజ కంపెనీల మధ్య సాగుతున్న పోరు ఆసక్తికర మలుపులు తీసుకుంటోంది. తాజాగా ఫ్యూచర్ రిటైల్కు చెందిన 950 స్టోర్స్కి సంబంధించిన సబ్–లీజును రద్దు చేయాలని రిలయన్స్ రిటైల్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఫ్యూచర్ రిటైల్కు నోటీసులు జారీ చేసింది. రుణభారంతో కుంగుతున్న ఫ్యూచర్ గ్రూప్ సంస్థలు గురువారం ఈ వివరాలను స్టాక్ ఎక్ఛేంజీలకు తెలియజేశాయి. వీటిలో 835 ఫ్యూచర్ రిటైల్ స్టోర్స్ ఉండగా, 112 ఫ్యూచర్ లైఫ్స్టయిల్ స్టోర్స్ ఉన్నాయని వివరించింది. ‘రిలయన్స్ సంస్థల నుంచి సబ్–లీజుకు తీసుకున్న ప్రాపర్టీలకు సంబంధించి రద్దు నోటీసులు అందాయి. వీటిలో 342 భారీ ఫార్మాట్ స్టోర్స్ (బిగ్ బజార్, ఫ్యాషన్ఎట్బిగ్బజార్ మొదలైనవి), 493 చిన్న ఫార్మాట్ స్టోర్స్ (ఈజీడే, హెరిటేజ్ స్టోర్స్ వంటివి) ఉన్నాయి‘ అని ఫ్యూచర్ రిటైల్ పేర్కొంది. మరోవైపు, 34 ’సెంట్రల్’ స్టోర్లు, 78 ’బ్రాండ్ ఫ్యాక్టరీ’ అవుట్లెట్ల సబ్–లీజు రద్దు నోటీసులు తమకు వచ్చినట్లు ఫ్యూచర్ లైఫ్స్టైల్ ఫ్యాషన్స్ వివరించింది. కంపెనీ రిటైల్ ఆదాయాల్లో వీటి వాటా దాదాపు 55–65 శాతం వరకూ ఉంటుందని పేర్కొంది. యథాతథ స్థితిని కొనసాగించేందుకు, వివిధ వాటాదారుల ప్రయోజనాలను కాపాడేందుకు రిలయన్స్ గ్రూప్తో చర్చలు జరుపుతున్నట్లు ఫ్యూచర్ గ్రూప్లోని రెండు సంస్థలూ తెలిపాయి. గత నెలలోనే టేకోవర్.. ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన ఫ్యూచర్ గ్రూప్ తన రిటైల్ వ్యాపార కార్యకలాపాలను .. రూ. 24,713 కోట్ల మొత్తానికి రిలయన్స్కు విక్రయించేందుకు 2020 ఆగస్టులో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఫ్యూచర్ కూపన్స్ సంస్థలో స్వల్ప వాటాల వల్ల, పరోక్షంగా రిటైల్ విభాగాల్లోను వాటాదారుగా మారిన ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఈ డీల్ను అడ్డుకుంటోంది. దీనిపై ప్రస్తుతం అమెజాన్, ఫ్యూచర్ గ్రూప్ మధ్య న్యాయ వివాదం నడుస్తోంది. ఇక, ఫ్యూచర్ గ్రూప్నకు 1,700 పైచిలుకు అవుట్లెట్స్ ఉన్నాయి. ఆర్థిక కష్టాల కారణంగా లీజు అద్దెలను కొన్నాళ్లుగా ఫ్యూచర్ గ్రూప్ చెల్లించలేకపోతోంది. ఇవన్నీ మూతబడే పరిస్థితి నెలకొనడంతో వీటిలో కొన్ని స్టోర్స్ లీజును రిలయన్స్ తన అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్)కు బదలాయించుకుని, వాటిని ఫ్యూచర్కు సబ్–లీజుకు ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుత సరఫరాదారులకు సైతం ఫ్యూచర్ చెల్లింపులు జరపలేకపోతుండటంతో ఆయా స్టోర్స్కు అవసరమైన ఉత్పత్తులను కూడా రిలయన్స్ జియోమార్ట్ సరఫరా చేస్తోంది. దీంతో సదరు స్టోర్స్లో అధిక భాగం ఉత్పత్తులు రిలయన్స్వే ఉన్నాయి. సబ్–లీజు బాకీలను ఫ్యూచర్ గ్రూప్ సంస్థలు కట్టలేకపోవడం వల్ల రిలయన్స్ ఆ అవుట్లెట్స్ను స్వాధీనం చేసుకుని, రీబ్రాండింగ్ చేసే పనిలో ఉంది. ఇందులో భాగంగానే సబ్–లీజులను రద్దు చేసి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
తేలని వివాదం.. బిగ్బజార్ని స్వాధీనం చేసుకోనున్న రిలయన్స్
దేశంలోనే అతి పెద్ద వివాస్పద డీల్స్లో ఒకటిగా నిలిచింది ఫ్యూచర్ గ్రూప్ అమ్మకం. ఫ్యూచర్ గ్రూపులో అమెజాన్ పెట్టుబడులు ఉండగా.. దాన్ని రిలయన్స్ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించింది. ఈ నిర్ణయం వివాస్పదం కావడంతో ఢిల్లీ హైకోర్టు, సుప్రీం కోర్టు, సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్లలో ఈ కేసుపై విచారణ కొనసాగుతున్నాయి. రిలయన్స్ సంస్థ 2.3 బిలియన్ డాలర్లకు ఫ్యూచర్ కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. అమెజాన్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ డీల్ మధ్యలో ఆగిపోయింది. ఈ వివాదం తలెత్తె సమయానికి దేశవ్యాప్తంగా ఫ్యూచర్ గ్రూప్కి 1700 అవుట్లెట్స్ ఉన్నాయి. సుదీర్ఘ విచారణ జరిగినా కేసు ఓ కొలిక్కి రాలేదు. ఇంతలో ఫ్యూచర్ గ్రూప్ ఆధీనంలో ఉన్న అవుట్లెట్స్ లీజు అగ్రిమెంట్లు ముగుస్తున్నాయి. తమకు లీజు బకాయిలు చెల్లించాలంటూ భవనాల యజమానుల నుంచి ఒత్తిడి వస్తోంది. అంతేకాదు రెండేళ్లుగా ఫ్యూచర్ ఆధీనంలో ఉన్న బిగ్బజార్ తదితర అవుట్లెట్ల వ్యాపారం మందగించింది. ఉద్యోగుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. కోర్టులో వివాదం నడుస్తున్నప్పటికీ ఫ్యూచర్ ఆధీనంలోని 1700 అవుట్లెట్లలో ఓ 200 అవుట్లెట్లను రిలయన్స్ స్వాధీనం చేసుకునే ఆలోచనలో ఉంది. వాటిని పాత పేరుతో లేదా రిలయన్స్ బ్రాండ్ కిందకు తీసుకువచ్చి వ్యాపారం పునరుద్ధరించే లక్ష్యంతో ఉంది. ఇప్పటికే ఎంపిక చేసిన రిటైల్ అవుట్లెట్లలో పని చేస్తున్న ఉద్యోగులకు సమాచారం అందించారు. అయితే ప్రస్తుత వ్యహారంపై రిలయన్స్, ఫ్యూచర్, అమెజాన్లు అధికారికంగా స్పందించలేదు. తాజా అప్డేట్స్ను ముందుగా రాయిటర్స్ ప్రచురించగా ఆ తర్వాత జాతీయ మీడియాలో ఇది హాట్టాపిక్గా మారింది. మరోవైపు ఫ్యూచర్ వివాదానికి సంబంధించి 2022 మార్చిలో న్యాయస్థానాల్లో మరోసారి విచారణ జరగనుంది. -
బీమా నుంచి ఫ్యూచర్ గ్రూప్ ఔట్!
న్యూఢిల్లీ: రుణ భారంతో సతమతమవుతున్న రిటైల్ రంగ దిగ్గజం ఫ్యూచర్ గ్రూప్ తాజాగా బీమా రంగం నుంచి బయటపడే యోచనలో ఉన్నట్లు తెలియజేసింది. సమయానుగుణంగా భాగస్వామ్య సంస్థ(జేవీ) ఫ్యూచర్ జనరాలి ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో తమకు గల వాటాను విక్రయించాలని భావిస్తోంది. ఈ జేవీలో ప్రస్తుతం ఫ్యూచర్ గ్రూప్నకు 49.91 శాతం వాటా ఉంది. దీనిలో 25 శాతం వాటాను జేవీలో మరో భాగస్వామి నెదర్లాండ్స్కు చెందిన జనరాలి పార్టిసిపేషన్స్కు విక్రయించనున్నట్లు ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ పేర్కొంది. దాదాపు రూ. 1,253 కోట్ల విలువలో నగదు రూపేణా వాటాను విక్రయించనున్నట్లు తెలియజేసింది. -
ఫ్యూచర్ వివాదంపై ఎన్సీఎల్ఏటీకి అమెజాన్
న్యూఢిల్లీ: ఫిన్ టెక్ సంస్థ ’గ్రో’లో తాజాగా ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఇన్వెస్ట్ చేయడంతో పాటు సలహాదారుగా కూడా చేరారు. గ్రో సహ వ్యవస్థాపకుడు, సీఈవో లలిత్ కేస్రి ఈ విషయం తెలిపారు. అయితే, సత్య ఎంత ఇన్వెస్ట్ చేసినదీ మాత్రం వెల్లడించలేదు. స్టాక్స్, ఫండ్స్ మొదలైన వాటిల్లో పెట్టుబడులు పెట్టేందుకు తోడ్పడే గ్రో 2017లో కార్యకలాపాలు ప్రారంభించింది. గతేడాది అక్టోబర్లో 1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్తో 251 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1,885 కోట్లు) సమీకరించింది. తాజా విడతలో అల్కియోన్, లోన్ పైన్ క్యాపిటల్, స్టెడ్ఫాస్ట్ సహా ప్రస్తుత ఇన్వెస్టర్లయిన సెకోయా క్యాపిటల్, రిబిట్ క్యాపిటల్, వైసీ కంటిన్యుటీ, టైగర్ గ్లోబల్, ప్రొపెల్ వెంచర్ మొదలైనవి కూడా పెట్టుబడులు పెట్టాయి. చదవండి: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వర్సెస్ అమెజాన్.. కోర్టుకు చేరిన పంచాయితీ -
ఈడీని కోర్టుకు లాగిన అమెజాన్!
Amazon Files Writ Petition Against ED In Delhi HC: విదేశీ మారకద్రవ్య ఉల్లంఘనలకు సంబంధించి ఈడీ దర్యాప్తు పరిధిపై వివరణ కోరుతూ అమెజాన్ ఢిల్లీ హైకోర్టులో బుధవారం ఒక రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఫ్యూచర్ గ్రూప్తో ఒప్పందం విషయంలో ‘విదేశీ మారకద్రవ్య ఉల్లంఘనలు జరిగాయని’ అమెజాన్పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అంతర్జాతీయ దిగ్గజ ఈ– రిటైలర్ ఈ రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఫ్యూచర్ గ్రూప్తో డీల్కు సంబంధించి అమెజాన్కు గత నెల్లో ఈడీ నుంచి సమన్లు కూడా అందాయి. ఈ విషయాన్ని గత నెల్లో అమెజాన్ స్వయంగా వెల్లడించింది. రిట్ దాఖలుకు సంబంధించి అందుతున్న సమాచారం ప్రకారం తన విచారణా పరిధిని మించి ఈడీ వ్యవహరిస్తోందన్నది అమెజాన్ ఆరోపణ. ఫ్యూచర్–అమెజాన్ లావాదేవీలతో సంబంధం లేని లేదా వాటి గురించి అవగాహన లేని తన ఎగ్జిక్యూటివ్లకు వ్యక్తిగతంగా సాక్ష్యమివ్వడానికి ఈడీ సమన్లు చేయడం వెనుక ఉన్న హేతుబద్ధతను రిట్ పిటిషన్లో అమెజాన్ ప్రశ్నించింది. కాగా, ఈ రిట్పై అడిగిన ప్రశ్నలకు అమెజాన్ నుంచి ఎటువంటి ప్రతి స్పందనా లభించలేదు. అమెజాన్–ఫ్యూచర్ గ్రూప్ మధ్య ప్రస్తుతం రూ.24,500 కోట్ల రిలయన్స్ రిటైల్ (ఫ్యూచర్ గ్రూప్ ఆ సంస్థలో చేసుకున్న) ఒప్పందపై న్యాయపోరాటం జరుగుతున్న సంగతి తెలిసిందే. -
అమెజాన్కు భారీ షాక్ ఇచ్చిన సీసీఐ
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్కు సీసీఐ భారీ షాక్ ఇచ్చింది. అమెజాన్, ఫ్యూచర్ కూపన్స్ ప్రైవేట్ లిమిటెడ్(ఎఫ్సిపిఎల్) మధ్య కుదిరిన ఒప్పందాన్ని 2019లో ఆమోదించిన కాంపీటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ), ఇప్పుడు ఆ ఒప్పందాన్ని నిలిపివేసింది. ఎఫ్సిపిఎల్ తో జరిగిన రూ.1400 కోట్ల ఒప్పందానికి అమెజాన్ ఆమోదం కోరుతూ కీలక సమాచారాన్ని దాచిపెట్టినట్లు ఆరోపిస్తూ సీసీఐ అమెజాన్ కు 60 రోజుల నోటీసు జారీ చేసింది. అప్పటి వరకు ఈ డీల్ నిలుపుదల చేస్తున్నట్లు స్పష్టంచేసింది. అలాగే, అమెజాన్కు రూ.202 కోట్లు జరిమానా కూడా విధించింది. ఎఫ్సిపిఎల్ అనేది ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్(ఎఫ్ఆర్ఎల్) ప్రమోటర్ ఎంటిటీ. 2019లో అమెజాన్-ఎఫ్సిపిఎల్ ఒప్పందం వాస్తవ ఉద్దేశ్యాన్ని వెల్లడించడంలో విఫలం చెందడం అనేది కాంపిటీషన్ చట్టంలో రెగ్యులేషన్ 5 సెక్షన్ 6, సబ్ సెక్షన్ (2) & కాంబినేషన్ రెగ్యులేషన్స్ సబ్ రెగ్యులేషన్స్(4), (5) ఉల్లంఘనలకు సమానమని సీసీఐ తన ఉత్తర్వుల్లో సూచించింది. అమెజాన్ ప్రతినిధి ఒకరు ఈ విషయంపై మాట్లాడుతూ.. "మేము కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదించిన ఉత్తర్వులను సమీక్షిస్తున్నాము, తదుపరి చర్యలకు సంబంధించి తగిన సమయంలో వెల్లడిస్తాము" అని చెప్పారు. "చట్టం సెక్షన్ 6(2) కింద అమెజాన్-ఎఫ్సిపిఎల్ ఒప్పందం వాస్తవ ఉద్దేశ్యాన్ని తెలియజేయడంలో విఫలమైనందుకు చట్టంలోని సెక్షన్ 43ఎ కింద కమిషన్ జరిమానా విధించడానికి అవకాశం ఉంది. జరిమానా అనేది మొత్తం టర్నోవర్ లేదా ఆస్తులలో ఒక శాతం వరకు ఉండే అవకాశం ఉంది. పైన పేర్కొన్న కారణాల వల్ల కమిషన్ అమెజాన్పై రెండు వందల కోట్ల రూపాయల జరిమానా విధిస్తుంది" అని సీసీఐ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఫ్యూచర్ గ్రూప్ విషయంలో న్యాయపోరాటం సాగిస్తున్న వేళ సీసీఐ నిర్ణయం అమెజాన్ను ఇరకాటంలో పెట్టింది. ఫ్యూచర్ గ్రూప్కు చెందిన ఫ్యూచర్ కూపన్స్ లిమిటెడ్లో 2019లో అమెజాన్ 200 మిలియన్ డాలర్ల మేర(49 శాతం) పెట్టుబడులు పెట్టింది. ఫ్యూచర్ కూపన్స్కు 7.3 శాతం మేర ఫ్యూచర్ రిటైల్లో వాటా ఉంది. దీంతో మూడేళ్ల నుంచి 10 ఏళ్లలోపు ఫ్యూచర్ రిటైల్ను కొనుగోలు చేసే హక్కు అమెజాన్కు దఖలు పడింది. (చదవండి: అమెరికా బాట పట్టిన బైజూస్.. రూ.30వేల కోట్ల నిధుల సమీకరణ) -
అమెజాన్, ఫ్యూచర్ గ్రూప్ అధికారులకు ఈడీ సమన్లు
న్యూఢిల్లీ: ఫ్యూచర్ గ్రూప్లో అమెజాన్ ఇండియా పెట్టుబడుల విషయంలో విదేశీ మారక చట్టం (ఫెమా) నిబంధనల ఉల్లంఘన జరిగిందన్న ఆరోపణలపై ఇరు కంపెనీల అధికారులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. నిర్దిష్ట పత్రాలతో పాటు విచారణకు హాజరు కావాలంటూ అమెజాన్ ఇండియా కంట్రీ హెడ్ అమిత్ అగర్వాల్ సహా సీనియర్ అధికారులకు సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈడీ సమన్లను పరిశీలిస్తున్నామని, తగు విధంగా స్పందిస్తామని అమెజాన్ ప్రతినిధి తెలిపారు. ఫ్యూచర్ గ్రూప్ సంస్థలో అమెజాన్కు పెట్టుబడులు ఉన్న సంగతి తెలిసిందే. దీని ఊతంతో .. దేశీ దిగ్గజం రిలయన్స్కి ‘ఫ్యూచర్ రిటైల్’ సంస్థను విక్రయించనివ్వకుండా అడ్డుపడుతుండటంపై ఫ్యూచర్ గ్రూప్, అమెజాన్ల మధ్య వివాదం నడుస్తోంది. ఫ్యూచర్ గ్రూప్లోని అన్లిస్టెడ్ కంపెనీలో పెట్టుబడుల ద్వారా ఫ్యూచర్ రిటైల్పై అజమాయిషీ చలాయించేందుకు అమెజాన్ ప్రయత్నిస్తుండటాన్ని .. ఫెమా, విదేశీ పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనల ఉల్లంఘ నగా భావించాల్సి వస్తుందంటూ ఇటీవల ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. మరోవైపు, ఈ–కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటివి నిర్దిష్ట మల్టీ–బ్రాండ్ రిటైల్ వ్యాపారాలు సాగిస్తుండటంపై తగు చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర వాణిజ్య శాఖ ఇటీవలే ఈడీకి సూచించింది. ఈ నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజా సమన్లు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చదవండి: ఫ్యూచర్ రిటైల్లో ఆర్థిక అవకతవకలు -
ఫ్యూచర్గ్రూపు, అమెజాన్ వివాదంలో మరో మలుపు!
న్యూఢిల్లీ: కిషోర్ బియానీకి చెందిన ఫ్యూచర్గ్రూపుతో సయోధ్యకు అమెజాన్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. అమెజాన్కు వ్యతిరేకంగా ఫెమా ఉల్లంఘనలపై సీసీఐ వద్ద ఫ్యూచర్ గ్రూపు కేసు దాఖలు చేసింది. అమెజాన్లో పెట్టుబడులకు ఆమోదం తీసుకునే విషయంలో సీసీఐ వద్ద వాస్తవాలను తప్పుదోవ పట్టించడం ద్వారా ఫెమా నిబంధనలను ఉల్లంఘించినట్టు ఫ్యూచర్ గ్రూపు ఆరోపిస్తోంది. ఈకేసును వెనక్కి తీసుకోవాలని ఫ్యూచర్ గ్రూపును అమెజాన్ కోరినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. పెట్టుబడులకు సంబంధించి తమ మధ్య వివాదానానికి ముగింపు విషయమై ఇరు వర్గాలు చర్చించినట్టు కూడా ఆ వర్గాలు తెలిపాయి. ఫ్యూచర్ గ్రూపు తన రిటైల్, హోల్సేల్, లాజిస్టిక్స్ వ్యాపారాలను రిలయన్స్కు విక్రయించేందుకు గతేడాది ఒప్పందం చేసుకోవడం తెలిసిందే. ఫ్యూచర్ రిటైల్లో పెట్టుబడులు కలిగిన అమెజాన్ ఈ డీల్ను వ్యతిరేకిస్తూ కోర్టులను ఆశ్రయించడంతో ఇది నిలిచిపోయింది. అమెజాన్ పక్కకు తప్పుకుంటే చెల్లించాల్సిన పరిహారంపైనా చర్చించినట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి. కానీ, ఈ విషయాన్ని తప్పుదోవపట్టించేదిగా, కల్పితంగా అమెజాన్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఫ్యూచర్ రిటైల్కు సాయం చేసేందుకు అమెజాన్ ఇప్పటికీ సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. చదవండి: అమెజాన్ అభ్యంతరాలు సరికాదు.. మరోసారి సుప్రీం కోర్టును కోరిన ఎఫ్ఆర్ఎల్ -
వాటాదారుల ఆమోదం కోరనున్న ఫ్యూచర్ గ్రూపు
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్తో చేసుకున్న ఒప్పందానికి వాటాదారుల ఆమోదాన్ని ఫ్యూచర్ గ్రూపు సంస్థలు కోరనున్నాయి. ఈ మేరకు నవంబర్ 10, 11 తేదీల్లో వాటాదారులు, రుణదాతల సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టుగా ఫ్యూచర్ గ్రూపు కంపెనీలు తమ వాటాదారులకు సమాచారం ఇచ్చాయి. వీడియో కాన్ఫరెన్స్/ఆడియో, వీడియో విధానంలో ఈ సమావేశాలను నిర్వహించనున్నట్టు తెలిపాయి. అదే విధంగా ఉన్నచోట నుంచే ఈఓటు వేసే ఏర్పాటు కూడా చేసినట్టు పేర్కొన్నాయి. ఫ్యూచర్ గ్రూపు కంపెనీలన్నింటినీ ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్లో విలీనం చేసి.. తదుపరి ఫ్యూచర్ రిటైల్, హోల్సేల్, లాజిస్టిక్స్ ఆస్తులను రిలయన్స్ ఇండస్ట్రీస్కు గుంపగుత్తగా విక్రయించాలన్నది ఫ్యూచర్ గ్రూపు ప్రణాళిక. ఇందుకు గాను రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.24,713 కోట్లు చెల్లించనుంది. ఈ మొత్తం ఫ్యూచర్ గ్రూపు రుణదాతలకు దక్కనుంది. -
ఫ్యూచర్తో రిలయన్స్ ఒప్పందం గడువు పెంపు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, సింగపూర్ ఆర్ర్బిట్రేషన్ ట్రిబ్యునల్లో న్యాయ పోరాటం కొనసాగుతున్న నేపథ్యంలో ఫ్యూచర్ గ్రూప్తో రూ.24,713 కోట్ల ఒప్పంద పక్రియ పూర్తికి గడువును (లాంగ్ స్టాప్ డేట్) రిలయన్స్ ఇండస్ట్రీస్ రిటైల్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్) మరోసారి పొడిగించింది. ఇప్పటి వరకూ 2021 సెపె్టంబర్ 30తో గడువు పూర్తికాగా, దీనిని 2022 మార్చి వరకూ ఆర్ఆర్వీఎల్ పొడిగించినట్లు ఫ్యూచర్ రిటైల్ పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం ఒక రెగ్యులేటరీ ఫైలింగ్ సమర్పించింది. సుదీర్ఘ న్యాయ వివాదం రిలయన్స్కు ఫ్యూచర్ గ్రూప్ల ఆస్తుల విక్రయానికి సంబంధించి రూ.24,713 కోట్ల ఒప్పందం వివాదం ప్రస్తుతం సింగపూర్ అర్ర్బిటేషన్, సుప్రీంకోర్టు న్యాయపరిధిలో ఉన్న సంగతి తెలిసిందే. ఫ్యూచర్ కూపన్స్లో వాటాదారైన అమెజాన్కు.. ఎఫ్ఆర్ఎల్లో కూడా కొన్ని వాటాలు ఉన్నాయి. అప్పటి ఒప్పందం ప్రకారం ఎఫ్ఆర్ఎల్ను కొనుగోలు చేసే హక్కులు కూడా దఖలు పడ్డాయన్నది అమెజాన్ వాదన. మరోవైపు, 2020 ఆగస్టులో తమ రిటైల్ తదితర వ్యాపారాలను రిలయన్స్ రిటైల్కు విక్రయించేలా ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందం ప్రకటించింది. దీన్ని వ్యతిరేకిస్తూ అమెజాన్ ఫ్యూచర్ గ్రూప్నకు లీగల్ నోటీసులు పంపింది. అటుపైన సింగపూర్లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ను ఆశ్రయించింది. అక్కడ ఆ సంస్థకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. అవి భారత్లో చెల్లుబాటు కావంటూ ఫ్యూచర్ గ్రూప్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు సింగిల్ జడ్జి అమెజాన్కు అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వగా.. వాటిపై డివిజనల్ బెంచ్ స్టే విధించింది. ఈ పరిణామాలను సవాలు చేస్తూ అమెజాన్.. సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇక్కడ అమెజాన్కు అనుకూలంగా రూలింగ్ వచి్చంది. ఆర్ర్బిట్రేషన్ ట్రిబ్యునల్ అవార్డు భారత్ చట్టాల ప్రకారం చెల్లుబాటు అవుతుందని ఇటీవలే ఒక రూలింగ్ ఇచి్చంది. పూర్తి వివాదం అంశంలో ఇంకా తుది తీర్పు వెలువడాల్సి ఉంది. దేశంలో లక్ష కోట్ల రిటైల్ వ్యాపారాన్ని సొంతం చేసుకోవాలన్నదే ఆయా సంస్థల న్యాయపోరాటం ప్రధాన ధ్యేయమన్న విమర్శలు ఉన్నాయి. ఈజీఎం నిర్వహణకు ఫ్యూచర్కు వెసులుబాటు... మరోవైపు ఈ ఒప్పందానికి ఆమోదం కోసం వాటాదారులు, రుణదాతల అసాధారణ సమావేశం (ఈజీఎం) నిర్వహించడానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఇటీవల కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్కు అనుమతి ఇచి్చంది. సంబంధిత వర్గాల కథనం ప్రకారం ఒకవేళ ఫ్యూచర్ జరిపే ఈజీఎం గ్రూప్ సంస్థల విక్రయానికి ఆమోదముద్ర వేసినప్పటికీ, సంబంధిత స్కీమ్కు ఎన్సీఎల్టీ తుది ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుందని ట్రిబ్యునల్ బెంచ్ స్పష్టం చేసింది. ఈ దశలో తన అభ్యంతరాలను అమెజాన్ ఎన్సీఎల్టీ ముందు ఉంచవచ్చని అభిప్రాయపడింది. అందువల్ల ఇప్పుడు ఫ్యూచర్ నిర్వహించే సమావేశం సరికాదనడం తప్పని ఎన్సీఎల్టీ పేర్కొంది. దీనివల్ల తక్షణం అమెజాన్కు జరిగే న్యాయపరమైన నష్టం ఏదీ లేదని స్పష్టం చేసింది. ఫ్యూచర్ గ్రూప్ కంపెనీల విలీన పథకాన్ని ఆమోదిస్తూ, తుది ఉత్తర్వుఇవ్వవద్దని మాత్రమే సుప్రీంకోర్టు తనను ఆదేశించినట్లు వివరించింది. ఫ్యూచర్ ఈజీఎంను నిర్వహించి పథకానికి ముందుగానే ఆమోదముద్ర పొందినట్లయితే, ‘తరువాత ఆర్ర్బిట్రేషన్ పక్రియలో విజయం సాధిస్తే’ రిలయన్స్తో ఒప్పందం ప్రక్రియ పూర్తికి ఐదారు నెలల సమయం ఆదా అవుతుందనీ వివరించింది. -
రిలయన్స్తో ఒప్పందంపై ఫ్యూచర్కు ఊరట!
న్యూఢిల్లీ: రిలయన్స్ రిటైల్ లిమిటెడ్కు తన గ్రూప్ సంస్థల విక్రయానికి సంబంధించి కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్కు ఊరట లభించింది. ఈ ఒప్పందానికి ఆమోదం కోసం వాటాదారులు, రుణదాతల అసాధారణ సమావేశం (ఈజీఎం) నిర్వహించడానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) మంగళవారం కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్కు అనుమతి ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించారు. ఫ్యూచర్ గ్రూప్ కంపెనీల విలీన పథకాన్ని వ్యతిరేకిస్తూ ఇ–కామర్స్ దిగ్గజం అమెజాన్ దాఖలు చేసిన పిటిషన్ను సుచిత్ర కనుపర్తి, చంద్రభన్సింగ్ లతో కూడిన ఇరువురు సభ్యుల ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ తోసిపుచ్చినట్లు సమాచారం.అయితే ఈ వార్తలపై పంపిన ఈమెయిల్స్కు అటు అమెజాన్కానీ, ఇటు ఫ్యూచర్కానీ సమాధానం ఇవ్వలేదు. అమెజాన్కు తక్షణం నష్టం లేదు సంబంధిత వర్గాల కథనం ప్రకారం ఒకవేళ ఫ్యూచర్ జరిపే ఈజీఎం గ్రూప్ సంస్థల విక్రయానికి ఆమోదముద్ర వేసినప్పటికీ, సంబంధిత స్కీమ్కు ఎన్సీఎల్టీ తుది ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుందని ట్రిబ్యునల్ బెంచ్ స్పష్టం చేసింది. ఈ దశలో తన అభ్యంతరాలను అమెజాన్ ఎన్సీఎల్టీ ముందు ఉంచవచ్చని అభిప్రాయపడింది. అందువల్ల ఇప్పుడు ఫ్యూచర్ నిర్వహించే సమావేశం సరికాదనడం తప్పని ఎన్సీఎల్టీ పేర్కొంది. దీనివల్ల తక్షణం అమెజాన్కు జరిగే న్యాయపరమైన నష్టం ఏదీ లేదని స్పష్టం చేసింది. ఫ్యూచర్ గ్రూప్ కంపెనీల విలీన పథకాన్ని ఆమోదిస్తూ, తుది ఉత్తర్వుఇవ్వవద్దని మాత్రమే సుప్రీంకోర్టు తనను ఆదేశించినట్లు వివరించింది. ఫ్యూచర్ ఈజీఎంను నిర్వహించి పథకానికి ముందుగానే ఆమోదముద్ర పొందితే, ‘తరువాత ఆర్ర్బిట్రేషన్ పక్రియలో విజయం సాదిస్తే’ రిలయన్స్తో ఒప్పందం ప్రక్రియ పూర్తికి ఐదారు నెలల సమయం ఆదా అవుతుందనీ వివరించింది. సుదీర్ఘ న్యాయ వివాదం రిలయన్స్కు ఫ్యూచర్ గ్రూప్ల ఆస్తుల విక్రయానికి సంబంధించి రూ.24,713 కోట్ల ఒప్పందం వివాదం ప్రస్తుతం సింగపూర్ అర్ర్బిటేషన్, సుప్రీంకోర్టు న్యాయపరిధిలో ఉన్న సంగతి తెలిసిందే. ఫ్యూచర్ కూపన్స్లో వాటాదారైన అమెజాన్కు.. ఎఫ్ఆర్ఎల్లో కూడా కొన్ని వాటాలు ఉన్నాయి. ఒప్పందం ప్రకారం ఎఫ్ఆర్ఎల్ను కొనుగోలు చేసే హక్కులు కూడా దఖలు పడ్డాయన్నది అమెజాన్ వాదన. మరోవైపు, 2020 ఆగస్టులో తమ రిటైల్ తదితర వ్యాపారాలను రిలయన్స్ రిటైల్కు విక్రయించేలా ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందం ప్రకటించింది. దీన్ని వ్యతిరేకిస్తూ అమెజాన్ ఫ్యూచర్ గ్రూప్నకు లీగల్ నోటీసులు పంపింది. అటుపైన సింగపూర్లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ను ఆశ్రయించింది. అక్కడ ఆ సంస్థకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. అవి భారత్లో చెల్లుబాటు కావంటూ ఫ్యూచర్ గ్రూప్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు సింగిల్ జడ్జి అమెజాన్కు అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వగా.. వాటిపై డివిజనల్ బెంచ్ స్టే విధించింది. ఈ పరిణామాలను సవాలు చేస్తూ అమెజాన్.. సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇక్కడ అమెజాన్కు అనుకూలంగా రూలింగ్ వచ్చింది. దేశంలో లక్ష కోట్ల రిటైల్ వ్యాపారాన్ని సొంతం చేసుకోవాలన్నదే ఆయా సంస్థల న్యాయపోరాటం ప్రధాన ధ్యేయమన్న విమర్శలు ఉన్నాయి. చదవండి: అమెజాన్ అభ్యంతరాలు సరికాదు.. మరోసారి సుప్రీం కోర్టును కోరిన ఎఫ్ఆర్ఎల్ -
అమెజాన్ అభ్యంతరాలు సరికాదు.. మరోసారి సుప్రీంను కోరిన ఎఫ్ఆర్ఎల్
ఆస్తులు అమ్ముకునేందుకు ఫ్యూచర్ గ్రూప్ అధినేత కిశోర్ బియానీ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందుకు అడ్డంకిగా ఉన్న చట్టపరమైన చిక్కులు తొలగించుకునేందుకు వరుసగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగా మరోసారి దేశంలోని అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. డీల్కు అనుమతి ఇవ్వండి ఫ్యూచర్, రిలయన్స్ గ్రూపుల మధ్య కుదిరిన రూ. 24,731 కోట్ల డీల్ అమలయ్యేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ సుప్రీం కోర్టును ఫ్యూచర్ గ్రూపు మరోసారి ఆశ్రయించింది. ఈ ఒప్పందం ఆలస్యం అవడం వల్ల సంస్థలో పని చేసే 35 వేల మంది ఉద్యోగులు రోడ్డున పడతారని పేర్కొంది. అంతేకాకుండా బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతుందని తెలిపింది. గతంలో ఇలాంటి కేసుల్లో వచ్చిన తీర్పులను ఉదహరిస్తూ తమ డీల్పై అమెజాన్ లేవనెత్తుతున్న అభ్యంతరాలను కొట్టి వేయాలని ఫ్యూచర్ గ్రూప్ కోరింది. మొత్తం ఆరు వేల పేజీలతో పిటీషన్ దాఖలు చేసింది. ఈ కేసును అత్యవసరంగా విచారణకు తీసుకోవాలని కోరింది. వివాదానికి నేపథ్యం ఇది ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ (ఎఫ్ఆర్ఎల్) అమెజాన్కి వాటాలు ఉన్నాయి. దీని ప్రకారం ఎఫ్ఆర్ఎల్ను కొనుగోలు చేసే హక్కులు కూడా అమెజాన్కి దఖలు పడ్డాయి. అయితే అమెజాన్ని సంప్రదించకుండా తమ రిటైల్ తదితర వ్యాపారాలను రిలయన్స్ రిటైల్కు విక్రయించేలా ఒప్పందం చేసుకున్నట్టు 2020 ఆగస్టులో ఫ్యూచర్ గ్రూప్ ప్రకటించింది. దీన్ని వ్యతిరేకిస్తూ అమెజాన్ ఫ్యూచర్ గ్రూప్నకు లీగల్ నోటీసులు పంపింది. అటుపైన సింగపూర్లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ను ఆశ్రయించింది. అక్కడ ఆ సంస్థకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. అవి భారత్లో చెల్లుబాటు కావంటూ ఫ్యూచర్ గ్రూప్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు సింగిల్ జడ్జి అమెజాన్కు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది. ఇటీవల సుప్రీం కోర్టు సైతం ఢిల్లీ కోర్టు తీర్పును సమర్థించింది. చదవండి : Elon Musk: ‘బెజోస్ దావాలు వేయడానికే తప్పుకున్నాడేమో! హహహా..’ -
సుప్రీం కోర్టులో రిలయన్స్కి చుక్కెదురు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో రిలయన్స్కు చుక్కెదురైంది. ఫ్యూచర్ రిటైల్ విషయంలో అమెజాన్కు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. గతంలో ఫ్యూచర్, రిలయన్స్ రిటైల్ గ్రూపుల మధ్య రూ 24,713 కోట్ల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాన్ని అమెజాన్ సవాల్ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత రిలయన్స్ ఫ్యూచర్ డీల్ ఒప్పందాన్ని నిలిపేస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ఈ వివాదానికి సంబంధించి సింగపూర్ ఎమర్జెన్సీ ఆర్బిట్రేటర్ ఇచ్చిన తీర్పు అమలు చేయాలని ఆదేశించింది. -
అమెజాన్-ఫ్యూచర్-రిలయన్స్ కేసు! విచారణ వాయిదా ఎందుకంటే..
Amazon-Future-Reliance Case ఫ్యూచర్–రిలయన్స్ ఒప్పందంపై అమెజాన్ దాఖలు చేసిన అప్పీళ్లను సుప్రీంకోర్టు ఈ నెల 20న విచారించనుంది. న్యూఢిల్లీ: ఫ్యూచర్–రిలయన్స్-అమెజాన్ కేసు విచారణ వాయిదా పడింది. న్యాయమూర్తులు ఆర్ఎఫ్ నారీమన్, కేఎం జోసెఫ్, బీఆర్ గవాయ్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందుకు గురువారం ఈ వివాదం విచారణకు వచ్చింది. అయితే ఇదే కేసుపై జూలై 12న నుంచీ సింగపూర్ ట్రిబ్యునల్ విచారణ జరపనుందని, ఈ పరిస్థితుల్లో వారం పాటు కేసు విచారణను వాయిదా వేయాలని ధర్మాసనానికి ఫ్యూచర్స్ తరఫు సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వే విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఈ విషయంలో తనకూ అభ్యంతరం ఏదీ లేదని అమెరికా ఈ కామర్స్ దిగ్గజం– అమెజాన్ తరఫు సీనియర్ న్యాయవాది గోపాల సుబ్రమణియన్ కూడా పేర్కొనడంతో కేసు తదుపరి విచారణను 20కి వాయిదావేస్తూ బెంచ్ నిర్ణయం తీసుకుంది. వివాదంలో రూ.24,713 కోట్ల డీల్.. రిలయన్స్కు ఫ్యూచర్ రిటైల్ తన రిటైల్ అండ్ హోల్సేల్, లాజిస్టిక్స్ బిజినెస్ను విక్రయిస్తూ 2020లో కుదుర్చుకున్న రూ.24,713 కోట్ల డీల్పై అమెజాన్ న్యాయపోరాటం చేస్తోంది. ఫ్యూచర్ అన్లిస్టెడ్ సంస్థల్లో ఒకటైన ఫ్యూచర్స్ కూపన్స్ లిమిటెడ్లో (బీఎస్ఈ లిస్టెడ్ ఫ్యూచర్ రిటైల్లో ఫ్యూచర్స్ కూపన్స్ లిమిటెడ్కు కన్వెర్టబుల్ వారెంట్స్ ద్వారా 7.3 శాతం వాటా ఉంది) 49 శాతం వాటా కొనుగోలుకు 2019 ఆగస్టులో ఫ్యూచర్స్ లిమిటెడ్తో చేసుకున్న ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ, ఫ్యూచర్ కూపన్స్ డీల్ కుదుర్చుకున్నప్పుడే మూడు నుంచి పదేళ్ల వ్యవధిలో ఫ్యూచర్ రిటైల్ను కూడా కొనుగోలు చేసేందుకు తమకు హక్కులు దఖలు పడ్డాయని అమెజాన్ పేర్కొంది. అయితే ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు డివిజనల్ బెంచ్ నుంచి అమెజాన్కు వ్యతిరేక రూలింగ్స్ వచ్చాయి. వీటిపై సుప్రీంకోర్టును అమెజాన్ ఆశ్రయించి ‘స్టే’ తెచ్చుకుంది. ఇదే కేసు సింగపూర్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ (ఎస్ఐఏసీ) కూడా విచారించనుంది. -
బిగ్ బజార్ బంపర్ ఆఫర్: రూ. 1500 షాపింగ్ చేస్తే రూ. 1000 క్యాష్ బ్యాక్
ఈ కరోనా మహమ్మారి కాలంలో ఆదాయం లేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఫ్యూచర్ గ్రూపునకు చెందిన రిటైల్ చైన్ బిగ్ బజార్ గుడ్ న్యూస్ తెలిపింది. తన వినియోగదారుల కోసం బిగ్ బజార్ 2021 మే 22 నుంచి మే 31 వరకు 'బిలీవ్ ఇట్ ఆర్ నాట్' ఆఫర్ను ప్రారంభించింది. ఈ ఆఫర్ కింద రూ.1500ల షాపింగ్ చేసిన వారికి రూ.1000 వరకు క్యాష్ బ్యాక్ అందించనున్నట్లు పేర్కొంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి అనేక రాష్ట్రాలు పాక్షిక లాక్డౌన్ / పూర్తి లాక్డౌన్ విధించినందున బిగ్ బజార్ వినియోగదారులు బిగ్ బజార్ ఆన్లైన్ యాప్లో లేదా బిగ్బజార్లోని స్టోర్ షాపులో షాపింగ్ చేయడం ద్వారా ఈ ఆఫర్ను పొందగలరు. బిగ్ బజార్ ఆన్లైన్ యాప్ ద్వారా కొనుగోలు చేసిన వాటిపై కూడా రూ.1000 క్యాష్బ్యాక్, బుక్ చేసిన 2 గంటలలో హోమ్ డెలివరీ చేయనున్నట్లు తెలిపింది. "ఇంటి నుంచి షాపింగ్ చేయవచ్చు లేదా కరోనా మార్గదర్శకాల ప్రకారం వారు తమ సమీప దుకాణాన్ని సందర్శించవచ్చు" అని ఫ్యూచర్ గ్రూప్ గ్రూప్ సీఎమ్ఓ, డిజిటల్, మార్కెటింగ్, ఈ-కామర్స్ పవన్ సర్దా అన్నారు. దేశవ్యాప్తంగా 150కి పైగా నగరాల్లో స్టోర్స్ కలిగి ఉన్న బిగ్ బజార్ ఫ్యూచర్ గ్రూప్ చెందింది. ఇంటరాక్టివ్ డిజిటల్ స్క్రీన్లు, సిట్-డౌన్ చెక్ అవుట్స్, స్మార్ట్ కస్టమర్ సర్వీస్ వంటి ఆవిష్కరణలతో ఉన్నతమైన షాపింగ్ అనుభవాలను బిగ్ బజార్ అందిస్తుంది. చదవండి: ప్రతి నెల పది వేల పెన్షన్ పొందాలంటే.. -
సుప్రీంకు అమెజాన్–ఫ్యూచర్ వివాదం
న్యూఢిల్లీ: అమెజాన్–ఫ్యూచర్స్–రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్య నలుగుతున్న రూ. 24,713 కోట్ల ఒప్పంద వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. దీనిపై ఢిల్లీ హైకోర్టులో జరుగుతున్న ప్రొసీడింగ్స్పై జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్, బీఆర్ గవాయ్, హృషికేష్ రాయ్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం స్టే ఇచ్చింది. తదుపరి విచారణను మే 4వ తేదీకి వాయిదా వేసింది. ఈ వివాదంలో అన్ని అంశాలను పరిశీలించడం జరుగుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. కేసు వివరాలు క్లుప్తంగా చూస్తే, ఫ్యూచర్ గ్రూప్లో భాగమైన ఫ్యూచర్ కూపన్స్లో అమెజాన్ కొంత వాటా కొనుగోలు చేసింది. ఎఫ్సీపీఎల్కు ఫ్యూచర్ రిటైల్లో వాటాలు ఉన్నందున.. అమెజాన్ కూడా పరోక్షంగా అందులోనూ (ఫ్యూచర్ రిటైల్) స్వల్ప వాటాదారుగా మారింది. ఇక కరోనా వైరస్ పరిణామాలతో నిధులపరంగా తీవ్ర సంక్షోభం ఎదురవడంతో ఫ్యూచర్ రిటైల్ వ్యాపారాన్ని దాదాపు రూ. 24,713 కోట్లకు రిలయన్స్ ఇండస్ట్రీస్కి విక్రయించేందుకు ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఈ డీల్.. తమతో కుదుర్చుకున్న ఒప్పంద నిబంధనలకు విరుద్ధమంటూ అమెజాన్ సింగపూర్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించగా.. దానికి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. వీటి అమలు కోసం అమెజాన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. సింగిల్ జడ్జి బెంచ్, అమెజాన్కు అనుకూలంగా రూలింగ్ ఇచ్చింది. దీనిపై ఢిల్లీ హైకోర్టు డివిజినల్ బెంచ్ను ఫ్యూచర్ ఆశ్రయించింది. సింగిల్ జడ్జి బెంచ్ రూలింగ్పై స్టే తెచ్చుకుంది. దీనిపై సుప్రీంను అమెజాన్ ఆశ్రయించింది. తాజా సుప్రీం రూలింగ్తో వివాద పరిష్కార ప్రక్రియ తుది దశకు చేరుకుంది. -
గడప గడపకి జియో మార్ట్ సేవలు
ఇప్పటికే 200 నగరాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న జియో మార్ట్ సంస్థ .. కిరాణా దుకాణాదారులను డెలివరీ వ్యవస్థ ఆఖరు దశలోనూ(లాస్ట్ మైల్ డెలివరీ – ఎల్ఎండీ) భాగస్వాములుగా చేసుకోవడంపై దృష్టి పెడుతోంది. ఇందుకోసం ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ వ్యాపార విభాగాన్ని (ప్రస్తుతం కొనుగోలు ప్రయత్నాల్లో ఉంది) ఉపయోగించుకోవచ్చని భావిస్తోంది. తద్వారా దేశీయంగా సంఘటిత రిటైల్ రంగంలో 17 శాతం వాటాను దక్కించుకుంటే.. తయారీ సంస్థలతో మరింతగా బేరమాడి ఇంకా తక్కువ రేటుకే ఉత్పత్తులను కొనుగోలు చేయొచ్చని యోచిస్తోంది. జియో మార్ట్.. పీవోఎస్ మెషీన్లతో పాటు నిల్వలు, వర్కింగ్ క్యాపిటల్ నిర్వహణ, రుణ సదుపాయాలు మొదలైనవి కూడా కలిపిస్తోంది. వాట్సాప్తో జట్టు కట్టడంతో ఈ లావాదేవీలన్నీ మరింత సులభతరంగా నిర్వహించేందుకు వీలు పడనుంది. అటు అమెజాన్ కూడా ఈ తరహా వ్యూహాన్ని మరో రకంగా అమలు చేస్తోంది. ఎల్ఎండీ కోసం ’ఐ హ్యావ్ స్పేస్’ అనే ప్రోగ్రాం నిర్వహిస్తోంది. సుమారు 28,000 చిన్న రిటైలర్లు ఇందులో భాగంగా ఉన్నారు. తమ స్టోర్స్కి 2-4 కి.మీ. పరిధిలో ఉత్పత్తులను అందిస్తున్నారు. దీనితో సదరు స్టోర్స్కి నెలకు రూ.12,000 నుంచి రూ.15,000 దాకా అదనపు ఆదాయం కూడా లభిస్తోందని అమెజాన్ వర్గాలు తెలిపాయి. చదవండి: సరికొత్త రికార్డుకు చేరువలో టీసీఎస్! -
ఫ్యూచర్ డీల్పై సుప్రీం కోర్టుకు అమెజాన్
న్యూఢిల్లీ: ఫ్యూచర్ గ్రూప్–రిలయన్స్ డీల్ వివాదంపై ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ ఒప్పందానికి సంబంధించిన స్టేను ఎత్తివేస్తూ ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ మార్చి 22న ఇచ్చిన ఆదేశాలను సవాలు చేసింది. ఈ వివాదంపై తాము గతంలో వేసిన పిటిషన్ మీద తుది ఉత్తర్వులు వచ్చేదాకా డివిజన్ బెంచ్ ఆదేశాలపై స్టే విధించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. వివరాల్లోకి వెడితే .. కరోనా వైరస్పరమైన ప్రతికూల పరిణామాలతో సంక్షోభంలో చిక్కుకున్న ఫ్యూచర్ గ్రూప్ తమ ఫ్యూచర్ రిటైల్ సంస్థ (ఎఫ్ఆర్ఎల్) వ్యాపారాలను రిలయన్స్ రిటైల్ వెంచర్స్కి (ఆర్ఆర్వీఎల్) విక్రయించేందుకు గతేడాది ఆగస్టులో డీల్ కుదుర్చుకుంది. దీని విలువ సుమారు రూ. 24,713 కోట్లు. అయితే, అప్పటికే ఫ్యూచర్ గ్రూప్లో భాగమైన ఫ్యూచర్ కూపన్స్లో అమెజాన్ వాటాలు కొనుగోలు చేసింది. ఫ్యూచర్ కూపన్స్ సంస్థ ఎఫ్ఆర్ఎల్లో వాటాదారు కావడంతో పరోక్షంగా అమెజాన్కు కూడా స్వల్ప వాటాలు లభించాయి. ఈలోగా రిలయన్స్తో ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకోవడం నిబంధనలకు విరుద్ధమంటూ న్యాయస్థానాలను ఆశ్రయించింది. ఈ క్రమంలో రిలయన్స్కు ఫ్యూచర్ గ్రూప్ అసెట్స్ విక్రయించకుండా స్టే విధిస్తూ మార్చి 18న ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఇచ్చారు. అయితే, మార్చి 22న డివిజనల్ బెంచ్ వీటిని పక్కన పెట్టింది. ప్రస్తుతం దీనిపైనే అమెజాన్ మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించింది. -
రిలయన్స్-ఫ్యూచర్ డీల్పై సుప్రీంకు అమెజాన్
ముంబై: ముకేశ్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ రిటైల్లో ఫ్యూచర్స్ రిటైల్ గ్రూప్ విలీన ప్రక్రియను కొనసాగించేందుకు కిశోర్ బియానీకి అనుమతి ఇస్తూ ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ గ్లోబల్ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సుప్రీం కోర్టుకు వెళ్లింది. అమెజాన్ తన పిటిషన్ లో హైకోర్టు 22 మార్చి డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వును "చట్టవిరుద్ధం" అన్యాయమని పేర్కొంది. రూ.24,713 కోట్లకు రిలయన్స్ రిటైల్లో ఫ్యూచర్ గ్రూప్ విలీనానికి రెండు సంస్థల మధ్య అవగాహన ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఫ్యూచర్ గ్రూప్లో భాగమైన ఫ్యూచర్ కూపన్స్(ఎఫ్సీపీఎల్)లో అమెజాన్ కొంత వాటా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఎఫ్సీపీఎల్కు ఫ్యూచర్ రిటైల్లో వాటాలు ఉన్నందున.. అమెజాన్ కూడా పరోక్షంగా అందులోను స్వల్ప వాటాదారుగా మారింది. ఇక కరోనా వైరస్ పరిణామాలతో నిధులపరంగా తీవ్ర సంక్షోభం ఎదురవడంతో ఫ్యూచర్ రిటైల్ వ్యాపారాన్ని దాదాపు రూ.24,713 కోట్లకు రిలయన్స్ ఇండస్ట్రీస్కి (ఆర్ఐఎల్) విక్రయించేందుకు ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది. డీల్కు అనుమతుల కోసం ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. అయితే, ఈ డీల్ తమతో కుదుర్చుకున్న ఒప్పంద నిబంధనలకు విరుద్ధమంటూ అమెజాన్ సింగపూర్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించగా దానికి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. వీటి అమలు కోసం అమెజాన్ ఢిల్లీ హైకోర్టు తలుపు తట్టగా, యథాతథ స్థితి కొనసాగించాలంటూ సింగిల్ జడ్జి ఆదేశాలు ఇచ్చారు. వీటిని సవాలు చేస్తూ ఎఫ్ఆర్ఎల్ ఢిల్లీ హైకోర్టు డివిజనల్ బెంచ్ని ఆశ్రయించింది. చదవండి: జియో ఫైబర్ యూజర్లకు బంపర్ ఆఫర్! -
‘ఫ్యూచర్’ డీల్కు గడువు పెంపు
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ తాజాగా ఫ్యూచర్ గ్రూప్తో కుదుర్చుకున్న డీల్ను పూర్తిచేసేందుకు వీలుగా గడువును పొడిగించింది. గతేడాది ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ ఆస్తులు, హోల్సేల్ బిజినెస్ల కొనుగోలుకి కుదుర్చుకున్న ఒప్పందం గడువు 2021 మార్చి31తో ముగియనుడంటంతో.. సెప్టెంబర్ 30వరకూ పొడిగించింది. ‘లాంగ్ స్టాప్ డేట్’లో భాగంగా ఆరు నెలల పాటు గడువును పొడిగించినట్లు రిలయన్స్ రిటైల్ పేర్కొంది. కిశోర్ బియానీ గ్రూప్నకు చెందిన రిటైల్, హోల్సేల్ బిజినెస్ల కొనుగోలుకి 2020 ఆగస్ట్లో రూ. 24,713 కోట్లకు ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. విలీనాలు, కొనుగోళ్ల విషయంలో కంపెనీలు ఒప్పందాలను పూర్తిచేసుకునేందుకు వీలుగా లాంగ్ స్టాప్ను వినియోగిస్తుంటాయని విశ్లేషకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా.. తమతో కుదుర్చుకున్న కాంట్రాక్టును ఉల్లంఘించిందంటూ ఈ డీల్ విషయంలో ఫ్యూచర్ గ్రూప్నకు వ్యతిరేకంగా ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ సింగపూర్ ఆర్బిట్రేషన్ను ఆశ్రయించిన విషయం విదితమే. రిలయన్స్ రిటైల్, ఫ్యూచర్ గ్రూప్ డీలపై ఇప్పటికే సీసీఐ, సెబీ క్లియరెన్స్ ఇచ్చినప్పటికీ.. అమెజాన్ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీం కోర్టులో పెండింగ్లో ఉంది. ప్రత్యేక యూనిట్గా ఓటూసీ.. ఆయిల్ టు కెమికల్స్(ఓటూసీ) బిజినెస్ను ప్రత్యేక యూనిట్గా విడదీసేందుకు రుణదాతలు, వాటాదారులు అనుమతించినట్లు రిలయన్స్ తాజాగా పేర్కొంది. జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) మార్గదర్శకాల ప్రకారం ఈ అంశంపై రుణదాతలు, వాటాదారుల సమా వేశాన్ని నిర్వహించింది. ఇందుకు అనుకూలంగా సెక్యూర్డ్ క్రెడిటార్లు, రుణదాతలు, వాటాదారుల నుంచి ఎలక్ట్రానిక్ పద్ధతిలో దాదాపు 100% ఓటింగ్ నమోదైనట్లు ఎక్సే్ఛంజీలకు ఆర్ఐఎల్ తెలిపింది. ఈ సమావేశాలకు సుప్రీం కోర్టు రిటైర్డ్ జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ అధ్యక్షత వహించినట్లు పేర్కొంది. రిఫైనింగ్, ఇంధన మార్కెటింగ్, పెట్రోకెమ్ బిజినెస్లను ఓటూసీగా విడదీసేందుకు ఫిబ్రవరిలో ఆర్ఐఎల్ ప్రణాళికలు వేయడం తెలిసిందే. స్వతంత్రంగా ఏర్పాటయ్యే ఈ యూనిట్కు మాతృసంస్థ 25 బిలియన్ డాలర్ల రుణాన్ని సమకూర్చనున్నట్లు ప్రకటించింది. అలాగే సౌదీ అరామ్కో తదితర గ్లోబల్ ఇన్వెస్టర్లకు వాటాలు విక్రయించనున్నట్లు ఆర్ఐఎల్ తెలియజేసింది. -
రిలయన్స్-ఫ్యూచర్ గ్రూప్ డీల్ గడువు పొడగింపు
రిలయన్స్ ఇండస్ట్రీస్ రిటైల్ విభాగమైన రిలయన్స్ రిటైల్ వెంచర్స్, కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్తో చేసుకున్నకొనుగోలు ఒప్పందం గడువు ముగిసిపోవడంతో, ఇప్పుడు రిలయన్స్ రిటైల్ ఆ గడువును మరో ఆరు నెలలు పొడిగించింది. గతంలో చేసుకున్న ఒప్పందం గడువు మార్చి 31, 2021 నాటికి ముగిసిపోయింది. తాజాగా కొనుగోలు ఒప్పందం గడువు సెప్టెంబరు 30, 2021కి మార్చినట్లు రిలయన్స్ ప్రకటించింది. ఫ్యూచర్ గ్రూప్కు చెందిన రిటైల్, హోల్సేల్, లాజిస్టిక్స్, వేర్హౌసింగ్ వ్యాపారాలను కొనుగోలు చేసేందుకు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ గత ఏడాది కొనుగోలు ఒప్పందం చేసుకుంది. ఈ కొనుగోలు ఒప్పందం విలువ రూ.24,713 కోట్లు. ఫ్యూచర్ గ్రూప్లో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కు వాటాలున్నాయి. అయితే, రిలయన్స్ రిటైల్ వెంచర్స్, ఫ్యూచర్ గ్రూప్తో చేసుకున్న ఒప్పందాన్ని వ్యతిరేకిస్తుంది. ప్రస్తుతం ఈ ఒప్పందం చట్టపరమైన అడ్డంకులను ఎదుర్కొంటోంది. ఈ-కామర్స్ దిగ్గజం దాఖలు చేసిన పిటిషన్ కోర్టులో పెండింగ్లో ఉంది. 2020 ఆగస్టు 29న ప్రకటించిన ఫ్యూచర్-రిలయన్స్ ఒప్పందం, సిసిఐ, సెబీ, బోర్సెస్ వంటి రెగ్యులేటర్ల నుంచి ఇప్పటికే క్లియరెన్స్ పొందింది. ఈ ఒప్పంద ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు అడ్డంకులు ఏర్పడటంతో రిలయన్స్ గడువును పొడిగించాల్సి వచ్చింది. చదవండి: మార్చిలో రికార్డు స్థాయిలో ఎగుమతులు రెడ్మీ రికార్డు: రెండు వారాల్లోనే రూ.500 కోట్లు -
కిషోర్ బియానీకి ఊరట
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్కు రిటైల్, హోల్సేల్ వ్యాపారం అమ్మకానికి సంబంధించి రూ.24,713 కోట్ల ఒప్పందంపై ముందుకు వెళ్లకుండా ఫ్యూచర్ రిటైల్ (ఎఫ్ఆర్ఎల్)ను తీవ్ర స్థాయిలో నిరోధిస్తూ 2021 మార్చి 18న జేఆర్ మిథా నేతృత్వంలోని ఢిల్లీ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన 134 పేజీల తీర్పుపై డివిజనల్ బెంచ్ సోమవారం తదుపరి విచారణ వరకూ స్టే విధించింది. ఫ్యూచర్ రిటైల్ దాఖలు చేసిన అప్పీల్ను చీఫ్ జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ జస్మీత్ సింగ్లతో కూడిన ధర్మాసనం అనుమతిస్తూ, ఈ కేసులో ప్రతివాదైన గ్లోబల్ ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్కు నోటీసులు జారీ చేసింది. మార్చి 18న సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలు అన్నింటిపై స్టే విధించాలన్న ఫ్యూచర్ గ్రూప్ తరఫు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలను హైకోర్టు అనుమతించింది. ఈ కేసులో సింగిల్ జడ్జి గత మధ్యంతర ఉత్తర్వులపై డివిజనల్ బెంచ్ స్టే విధించడం, అనంతరం కేసును సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు కూడా వెళ్లడం వంటి అంశాల నేపథ్యంలో కేసులో మార్చి 18న సింగిల్ జడ్జి తుది తీర్పు ఎలా ఇస్తారని సాల్వే వాదించారు. ఆయా వాదనలతో ఏకీభవించిన హైకోర్డు డివిజనల్ బెం చ్, సింగిల్ జడ్జి తీర్పుపై స్టే విధించి తదుపరి కేసు విచారణను ఏప్రిల్ 30వ తేదీకి వాయిదా వేసింది. చదవండి: (రూ.24,713 కోట్ల ఒప్పందం.. ఫ్యూచర్ గ్రూప్ మరో అడుగు) న్యాయపోరాటం ఇదీ... ఫ్యూచర్ గ్రూప్లో భాగమైన ఫ్యూచర్ కూపన్స్ (ఎఫ్సీపీఎల్)లో అమెజాన్ కొంత వాటా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఎఫ్సీపీఎల్కు ఫ్యూచర్ రిటైల్లో వాటాలు ఉన్నందున.. అమెజాన్ కూడా పరోక్షంగా అందులోను స్వల్ప వాటాదారుగా మారింది. ఇక కరోనా వైరస్ పరిణామాలతో నిధులపరంగా తీవ్ర సంక్షోభం ఎదురవడంతో ఫ్యూచర్ రిటైల్ వ్యాపారాన్ని దాదాపు రూ. 24,713 కోట్లకు రిలయన్స్ ఇండస్ట్రీస్కి (ఆర్ఐఎల్) విక్రయించేందుకు ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది. డీల్కు అనుమతుల కోసం ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. అయితే, ఈ డీల్.. తమతో కుదుర్చుకున్న ఒప్పంద నిబంధనలకు విరుద్ధమంటూ అమెజాన్ సింగపూర్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించగా.. దానికి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. వీటి అమలు కోసం అమెజాన్ .. ఢిల్లీ హైకోర్టు తలుపు తట్టగా, యథాతథ స్థితి కొనసాగించాలంటూ సింగిల్ జడ్జి ఆదేశాలు ఇచ్చారు. వీటిని సవాలు చేస్తూ ఎఫ్ఆర్ఎల్.. ఢిల్లీ హైకోర్టు డివిజనల్ బెంచ్ని ఆశ్రయించింది. అమెజాన్తో ఎఫ్సీపీఎల్ ఒప్పంద నిబంధనలు, ఆర్ఐఎల్–ఎఫ్ఆర్ఎల్ ఒప్పంద నిబంధనలు వేరువేరని, డీల్ విషయంలో ముందుకెళ్లొచ్చంటూ సింగిల్ జడ్జి ఆదేశాలపై స్టే విధిస్తూ డివిజనల్ బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది. వీటిపైనే అమెజాన్ .. సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ లోపునే ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ఫ్యూచర్ గ్రూప్ను కట్టడిచేస్తూ, 2021 మార్చి 18న కీలక ఆదేశాలు ఇచ్చింది. గ్రూప్ కంపెనీల్లో వాటాల విక్రయానికి సంబంధించి అమెజాన్ విబేధాలకు సంబంధించి సింగపూర్ ఎమర్జన్సీ ఆర్బిట్రేషన్ (ఈఏ) 2020 అక్టోబర్ 25న ఇచ్చిన ఉత్తర్వులను ఫ్యూచర్ గ్రూప్ కావాలనే నిర్లక్ష్యం చేసినట్లు స్పష్టమవుతోందని 134 పేజీల తీర్పులో ఏకసభ్య ధర్మాసనం పేర్కొంది. ఫ్యూచర్ గ్రూప్ ఈ కేసుకు సంబంధించి లేవనెత్తిన అభ్యంతరాలన్నింటినీ తోసిపుచ్చుతూ ఫ్చూచ్ గ్రూప్ ఆ సంస్థ డైరెక్టర్లపై రూ. 20 లక్షల ‘కాస్ట్’ను విధించింది. ఢిల్లీ కేటగిరీలో సీనియర్ సిటిజన్లు, పేదలకు వ్యాక్సినేషన్ వినియోగించే విధంగా రెండు వారాల్లో రూ. 20 లక్షల కాస్ట్ మొత్తాన్ని ప్రధానమంత్రి సహాయక నిధిలో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఏప్రిల్ 28వ తేదీన ఈ కేసు విషయంలో స్వయంగా హాజరుకావలని ప్రమోటర్ బియానీ, ఇతర డైరెక్టర్లను ఆదేశించింది. వారి ఆస్తుల జప్తునకూ ఆదేశాలు జారీచేసింది. వారి ఆస్తుల వివరాలను నెల రోజుల్లో అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని స్పష్టం చేసింది. సింగపూర్ ట్రిబ్యునల్ ఉత్తర్వులను పట్టించుకోనందుకు మూడు నెలలు తక్కువకాకుండా జైలు శిక్ష ఎందుకు విధించరాదని ప్రశ్నిస్తూ, సమాధానానికి రెండు వారాల గడువిచ్చింది. కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 28వ తేదీకి వాయిదా వేసింది. -
రూ.24,713 కోట్ల ఒప్పందం.. ఫ్యూచర్ గ్రూప్ మరో అడుగు
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్కు తన రిటైల్, హోల్సేల్ వ్యాపారం అమ్మకానికి సంబంధించి రూ.24,713 కోట్ల ఒప్పందంపై గ్లోబల్ ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్తో కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ రిటైల్ న్యాయపోరాటం కొనసాగుతోంది. ఈ ఒప్పందంపై ముందుకు వెళ్లకుండా తనను తీవ్రస్థాయిలో నియంత్రిస్తూ, గురువారం నాడు (2021 మార్చి 18) జేఆర్ మిథా నేతృత్వంలోని ఢిల్లీ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన 134 పేజీల తీర్పును డివిజనల్ బెంచ్ వద్ద అప్పీల్ చేసినట్లు ఫ్యూచర్ రిటైల్ ఒక రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. డివిజనల్ బెంచ్ క్రితం మధ్యంతర స్టే ఉత్తర్వులు వెకేట్ కాలేదు... ఫ్యూచర్ రిటైల్ శుక్రవారం నాడు ఒక కీలక ప్రకటన చేస్తూ, ఈ కేసుకు సంబంధించి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ముందు జరుగుతున్న విచారణపై సింగిల్ జడ్జి తీర్పు ఎటువంటి ప్రభావాన్ని చూపబోదని స్పష్టం చేసింది. రిలయన్స్తో ఫ్యూచర్ రిటైల్ గ్రూప్ ఒప్పంద అమలు విషయంలో ఎన్సీఎల్టీ ఇప్పటికే తన ఉత్తర్వులను రిజర్వ్ చేసిన విషయాన్ని ఆ ప్రకటనలో ఫ్యూచర్ ప్రస్తావించింది. ఈ అంశానికి సంబంధించి 2021 ఫిబ్రవరి 22న సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ను ఫ్యూచర్స్ ఈ సందర్భంగా ప్రస్తావించింది. రిలయన్స్తో ఫ్యూచర్స్ ఒప్పందంపై ఎన్సీఎల్టీ ప్రొసీడింగ్స్ యధావిధిగా కొనసాగవచ్చని, అయితే తుది ఉత్తర్వులు మాత్రం ఇవ్వడానికి లేదని 2021 ఫిబ్రవరి 22న సుప్రీంకోర్టు తన రూలింగ్లో స్పష్టం చేసిన విషయాన్ని కిషోర్ బియానీ నేతృత్వంలోని సంస్థ ప్రస్తావించింది. అదే విధంగా సింగిల్ జడ్జి ఇప్పుడు ఇచ్చిన తీర్పులో కొన్ని, కీలక ప్రధాన అంశాలు 2021 ఫిబ్రవరి 2వ తేదీన ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో (ఒప్పందంపై ముందుకు వెళ్లవద్దని ఫ్యూచర్ను ఆదేశిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు) కూడా ఉన్నాయని ఫూచర్స్ ప్రస్తావిస్తూ, దీనిపై తాము వేసిన అప్పీల్కు చీఫ్ జస్టిస్ డీఎన్ పాటిల్, జస్టిస్ జ్యోతి సింగ్లతో కూడిన డివిజనల్ బెంచ్ 2021 ఫిబ్రవరి 8న సానుకూలమైన రూలింగ్ ఇస్తూ, సిం గిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసింది. దీనిపై అమెజాన్ సుప్రీంకోర్టుకు వెళ్లినప్పటికీ, సింగిల్ జడ్జి (2021 ఫిబ్రవరి 2న ఇచ్చిన) మధ్యంతర ఉత్తర్వులపై డివిజనల్ బెంచ్ ఇచ్చిన స్టే ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం ‘వెకేట్’ చేయలేదన్నది కీలకమని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు డివిజనల్ బెంచ్ ‘స్టే’ ఆదేశాలు ఇప్పటికీ అమల్లోనే ఉన్నట్లు భావించాలని తమకు న్యాయ నిపుణులు సూచనలు ఇస్తున్నట్లు తెలిపింది. వివరాలు ఇలా..: ఫ్యూచర్ గ్రూప్లో భాగమైన ఫ్యూచర్ కూపన్స్ (ఎఫ్సీపీఎల్)లో అమెజాన్ కొంత వాటా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఎఫ్సీపీఎల్కు ఫ్యూచర్ రిటైల్లో వాటాలు ఉన్నందున.. అమెజాన్ కూడా పరోక్షంగా అందులోను స్వల్ప వాటాదారుగా మారింది. ఇక కరోనా వైరస్ పరిణామాలతో నిధులపరంగా తీవ్ర సంక్షోభం ఎదురవడంతో ఫ్యూచర్ రిటైల్ వ్యాపారాన్ని దాదాపు రూ. 24,713 కోట్లకు రిలయన్స్ ఇండస్ట్రీస్కి (ఆర్ఐఎల్) విక్రయించేందుకు ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది. డీల్కు అనుమతుల కోసం ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. అయితే, ఈ డీల్.. తమతో కుదుర్చుకున్న ఒప్పంద నిబంధనలకు విరుద్ధమంటూ అమెజాన్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించగా.. దానికి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. వీటి అమలు కోసం అమెజాన్ .. ఢిల్లీ హైకోర్టు తలుపు తట్టగా, యథాతథ స్థితి కొనసాగించాలంటూ సింగిల్ జడ్జి ఆదేశాలు ఇచ్చారు. వీటిని సవాలు చేస్తూ ఎఫ్ఆర్ఎల్.. ఢిల్లీ హైకోర్టు డివిజనల్ బెంచ్ని ఆశ్రయించింది. అమెజాన్తో ఎఫ్సీపీఎల్ ఒప్పంద నిబంధనలు, ఆర్ఐఎల్–ఎఫ్ఆర్ఎల్ ఒప్పంద నిబంధనలు వేరువేరని, డీల్ విషయంలో ముందుకెళ్లొచ్చంటూ సింగిల్ జడ్జి ఆదేశాలపై స్టే విధిస్తూ డివిజనల్ బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది. వీటిపైనే అమెజాన్ .. సుప్రీంను ఆశ్రయించింది. ఈ లోపు ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ఫ్యూచర్ గ్రూప్ను కట్టడిచేస్తూ, 2021 మార్చి 18న కీలక ఆదేశాలు ఇచ్చింది. -
హైకోర్టు షాక్ : ఫ్యూచర్ గ్రూపు షేర్లు ఢమాల్
సాక్షి,ముంబై: కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్కు ఢిల్లీ హైకోర్టు షాక్ తగిలింది. రిలయన్స్ రీటైల్తో ఫ్యూచర్ గ్రూప్ కిషోర్ బియానీ డీల్కు బ్రేక్ పడిన నేపథ్యంలో శుక్రవారం స్టాక్ మార్కెట్లో ఫ్యూచర్ గ్రూపు షేర్లలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. ముఖ్యంగా ఫ్యూచర్ రిటైల్ రికార్డు స్థాయి పతనాన్ని నమోదు చేసింది. దాదాపు 11 శాతం కుప్పకూలి లోయర్ సర్క్యూట్ అయింది. అంతేకాదు తాజా పరిణామంతో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 3,029 కోట్లకు పడిపోయింది. (రిలయన్స్ డీల్కు బ్రేక్ : బియానీకి భారీ ఎదురుదెబ్బ) ఫ్యూచర్ రిటైల్ మాత్రమే కాదు, అనేక ఇతర ఫ్యూచర్ గ్రూప్ కంపెనీల షేర్లు కూడా పతనమయ్యాయి. ఫ్యూచర్ కన్స్యూమర్ లిమిటెడ్ షేర్లు స్టాక్ మార్కెట్లో 9.15 శాతం పడిపోగా, ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ 8.95 శాతం క్షీణించింది. ఫ్యూచర్ లైఫ్స్టైల్ ఫ్యాషన్స్ లిమిటెడ్ షేర్లు కూడా దాదాపు 10 శాతం, ఫ్యూచర్ సప్లై చైన్ సొల్యూషన్స్ షేర్లు 4.99 శాతం తగ్గాయి. గడువులోగా అన్ని రెగ్యులేటరీ ఆమోదాలను పొందడంలో ఫ్యూచర్ రిటైల్ విఫలమైతే, రిలయన్స్ ఈ ఒప్పందానికి దూరంగా ఉండే అవకాశం ఉందని కూడా మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ప్రభావితమైంది. కాగా ఫ్యూచర్ రిటైల్ రూ .24,713 కోట్ల ఒప్పందానికి వ్యతిరేకంగా సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ (సియాక్) జారీ చేసిన ఎమర్జెన్సీ అవార్డు (ఇఎ) ఉత్తర్వును ఢిల్లీ హైకోర్టు గురువారం రద్దు చేసింది. కంపెనీ ఉద్దేశపూర్వంగానే ఉత్తర్వులను నిర్లక్క్ష్యం చేసిందని పేర్కొన్న కోర్టు, బియానీతో ఇతర ప్రముఖుల ఆస్తుల ఎటాచ్మెంట్కు ఆదేశించిన సంగతి తెలిసిందే. -
రిలయన్స్ డీల్కు బ్రేక్ : బియానీకి భారీ ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: అమెజాన్తో న్యాయపోరాటంలో ఫ్యూచర్ గ్రూప్నకు తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. రిలయన్స్ రిటైల్తో రూ.24,713 కోట్ల ఒప్పందం విషయంలో ముందుకు వెళ్లవద్దని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. గ్రూప్ కంపెనీల్లో వాటాల విక్రయానికి సంబంధించి అమెజాన్ విబేధాలకు సంబంధించి సింగపూర్ ఎమర్జన్సీ ఆర్బిట్రేషన్ (ఈఏ) 2020 అక్టోబర్ 25న ఇచ్చిన ఉత్తర్వులను ఫ్యూచర్ గ్రూప్ కావాలనే నిర్లక్ష్యం చేసినట్లు స్పష్టమవుతోందని 134 పేజీల తీర్పులో న్యాయస్థానం పేర్కొంది.(మాల్యా, మోదీ, మెహెల్కు నిర్మలాజీ షాక్) కిశోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్ సింగపూర్ ఆర్బిట్రేటర్ ఆదేశాన్ని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిందని, ఈ ఒప్పందంపై తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆదేశించినట్లు జస్టిస్ జెఆర్ మిధా ధర్మాసనం పేర్కొంది. ఫ్యూచర్ గ్రూపుకు సంబంధించిన బియానీ, ఇతరుల ఆస్తులను అటాచ్ చేయాలని కోర్టు ఆదేశించింది. ఫ్యూచర్ గ్రూప్ ఈ కేసుకు సంబంధించి లేవనెత్తిన అభ్యంతరాలన్నింటినీ తోసిపుచ్చుతూ ఫ్యూచర్ గ్రూప్ సంస్థ డైరెక్టర్లపై రూ. 20 లక్షల ‘కాస్ట్’ను విధించింది. ఢిల్లీ కేటగిరీలో సీనియర్ సిటిజన్లు, పేదలకు వ్యాక్సినేషన్ వినియోగించే విధంగా రెండు వారాల్లో రూ. 20 లక్షల కాస్ట్ మొత్తాన్ని ప్రధానమంత్రి సహాయక నిధిలో డిపాజిట్ చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఏప్రిల్ 28వ తేదీన ఈ కేసు విషయంలో స్వయంగా హాజరుకావలని ప్రమోటర్ బియానీ, ఇతర డైరెక్టర్లను ఆదేశించింది. వారి ఆస్తుల జప్తునకూ ఆదేశాలు జారీచేసింది. వారి ఆస్తుల వివరాలను నెల రోజుల్లో అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని స్పష్టం చేసింది. సింగపూర్ ట్రిబ్యునల్ ఉత్తర్వులను పట్టించుకోనందుకు మూడు నెలలు తక్కువకాకుండా జైలులో ఎందుకు ఉంచకోడదని ప్రశి్నస్తూ, సమాధానానికి రెండు వారాల గడువిచి్చంది. కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 28వ తేదీకి వాయిదా వేసింది. -
అమెజాన్కు ఊరట: సుప్రీం కీలక ఉత్తర్వులు
సాక్షి, న్యూఢిల్లీ: అమెజాన్, ఫ్యూచర్ గ్రూపు వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రిలయన్స్ రిటైల్తో రూ.24,713 కోట్ల ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ (ఎఫ్ఆర్ఎల్) డీల్కు మరోసారి బ్రేక్ పడింది. ఈ ఒప్పందానికి సంబంధించి "యథాతథ స్థితిని" కొనసాగించాలన్న ఢిల్లీ హైకోర్టు ఆదేశానికి వ్యతిరేకంగా ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ చేసిన విజ్ఞప్తిపై సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. ఈ తీర్పుపై స్టే విధిస్తూ సోమవారం ఉత్తర్వులిచ్చింది. జస్టిస్ ఆర్ఎఫ్ నారిమాన్, బీఆర్ గవైలతో కూడిన ధర్మాసనం ఫ్యూచర్ రిటైల్, గ్రూపు అధినేత కిషోర్ బియానీ, ఇతరులకు నోటీసులు జారీ చేసింది. రానున్న మూడు వారాల్లో దీనిపై సమాధానం చెప్పాలని కోరింది. అలాగే ఈ వివాదంలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సిఎల్టి) విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఆర్ఐఎల్తో ఒప్పందం విషయంలో యథాతథ స్థితిని పాటించాలని ఫ్యూచర్ గ్రూప్ ఆదేశిస్తూ ఢిల్లీ హైకోర్టు సింగిల్ బెంచ్ 2021 పిబ్రవరి 2న ఉత్తర్వులిచ్చింది. దీనిపై అమెజాన్ సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీం తాజా ఆదేశాలతో రిలయన్స్ రీటైల్తో ఒప్పందానికి సంబంధించి ఫ్యూచర్ గ్రూపునకు తాజాగా మరో ఎదురు దెబ్బ గిలింది. -
ఆ డీల్ అమెజాన్కు ముందే తెలుసు!
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్తో తాము చేసుకున్న రూ.24,713 కోట్ల ఒప్పందం విషయం తమకు తెలియదని అమెజాన్ పేర్కొనడం సరికాదని ఫ్యూచర్ గ్రూప్ చేస్తున్న వాదనలను బలపరుస్తూ తాజాగా ఒక డాక్యుమెంట్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఒప్పందం విషయం అమెజాన్కు ముందే తెలుసని ఈ డాక్యుమెంట్ స్పష్టంచేస్తోంది. రిలయన్స్–ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందం విషయంలో తనకు పరిహారంగా రూ.40 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.290.41 కోట్లు) చెల్లించాలని కూడా అమెజాన్ డిమాండ్ చేసిందని డాక్యుమెంట్ ద్వారా వెల్లడైంది. . కిషోర్ బియానీ నేతృత్వంలోని సంస్థ అత్యవసర ఆర్ర్బిట్రేటర్– ఎస్ఐఏసీ (సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్ర్బిట్రేషన్ సెంటర్)కు ఈ మేరకు గత ఏడాది అక్టోబర్లో సమర్పించిన ఒక డాక్యుమెంట్ తాజాగా వెలుగుచూసింది. ‘‘2020 ఆగస్టులో 3వ ప్రతివాది (కిషోర్ బియానీ), 8వ ప్రతివాది (రాకేష్ బియానీ) అమెజాన్ తరఫున అభిజిత్ ముజుందార్ మధ్య రెండు ఫోన్ కాల్స్ చోటుచేసుకున్నాయి. ఫ్యూచర్–రిలయన్స్ డీల్కు ప్రతిగా 40 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని అభిజిత్ ముజుందార్ అడిగారు’’ అని 2020 అక్టోబర్ 12వ తేదీ డాక్యుమెంట్ పేర్కొంది. ఆగస్టులో ఈ ఫోన్ సంభాషణ జరిగితే నెల తర్వాత అక్టోబర్లో అమెజాన్ ఆర్ర్బిట్రేషన్ పక్రియను ప్రారంభించినట్లు తెలిపింది. కాగా, ఈ అంశంపై వివరణకు పంపిన ఈ–మెయిల్ సందేశాలకు అమెజాన్ ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. తన రిటైల్ అండ్ హోల్సేల్, లాజిస్టిక్స్ బిజినెస్ను రిలయన్స్ రిటైల్కు రూ.24,713 కోట్లకు విక్రయిస్తున్నట్లు ఫ్యూచర్స్ గ్రూప్ 2020 ఆగస్టు 29న ప్రకటించింది. ఇది ఎంతమాత్రం తగదని 2020 అక్టోబర్లో అమెజాన్ ఎస్ఐఏసీని ఆశ్రయించింది. ఫ్యూచర్ అన్లిస్టెడ్ సంస్థల్లో ఒకటైన ఫ్యూచర్స్ కూపన్స్ లిమిటెడ్లో (బీఎస్ఈ లిస్టెడ్ ఫ్యూచర్ రిటైల్లో ఫ్యూచర్స్ కూపన్స్ లిమిటెడ్కు కన్వెర్టబుల్ వారెంట్స్ ద్వారా 7.3 శాతం వాటా ఉంది) 49 శాతం వాటా కొనుగోలుకు 2019 ఆగస్టులో ఫ్యూచర్స్ లిమిటెడ్తో చేసుకున్న ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ, ఫ్యూచర్ కూపన్స్తో డీల్ కుదుర్చుకున్నప్పుడే .. మూడు నుంచి పదేళ్ల వ్యవధిలో ఎఫ్ఆర్ఎల్ను కూడా కొనుగోలు చేసేందుకు తమకు హక్కులు దఖలు పడ్డాయని అమెజాన్ పేర్కొంది. ఈ ఒప్పందంపై 90 రోజుల పాటు స్టే విధిస్తూ ఆర్బిట్రేషన్ ప్యానెల్ అక్టోబర్ 26వ తేదీ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం నుంచి ఫిబ్రవరి 8వ తేదీ వరకూ రెండు సంస్థల మధ్య సుదీర్థ న్యాయ పోరాటం జరుగుతోంది. చివరకు రెండు సంస్థల మధ్య న్యాయ పోరాటం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు రూలింగ్ కీలకం కానుంది. అమెజాన్ను ‘సుప్రీం’లో ఎదుర్కొంటాం ఫ్యూచర్ గ్రూప్ ప్రకటన రిలయన్స్ ఇండస్ట్రీస్తో తాము చేసుకున్న రూ. 24,713 కోట్ల ఒప్పందం విషయంలో అమెజాన్పై సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తామని ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ (ఎఫ్ఆర్ఎల్) పేర్కొంది. స్టాక్ ఎక్స్చేంజీలకు సమర్పించిన ఒక రెగ్యులేటరీ ఫైలింగ్లో ఫ్యూచర్ రిటైల్ ఈ విషయాన్ని తెలిపింది. లక్ష కోట్ల రిటైల్ బిజినెస్ లక్ష్యం...! నిపుణుల విశ్లేషణ ప్రకారం చూస్తే, దేశవ్యాప్తంగా సుమారు 12,000 పైచిలుకు స్టోర్స్తో రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్ఆర్వీఎల్) అత్యంత వేగంగా రిటైల్ రంగంలో విస్తరిస్తోంది. దాదాపు 1 లక్ష కోట్ల డాలర్ల పైగా విలువ చేసే దేశీయ రిటైల్ వ్యాపార విభాగంలో వృద్ధి కోసం గత ఏడాది సెప్టెంబర్ మొదలుకుని ఇప్పటిదాకా దాదాపు రూ. 37,710 కోట్ల మేర పెట్టుబడులు సమీకరించింది. ఒకవేళ ఎఫ్ఆర్ఎల్ డీల్ కుదిరిన పక్షంలో దేశవ్యాప్తంగా ఆర్ఆర్వీఎల్ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోనుంది. ఇది అమెజాన్కు గట్టి పోటీని ఇస్తుంది. ఎఫ్ఆర్ఎల్ ప్రస్తుతం గ్రోసరీ చైన్ బిగ్బజార్సహా దేశ వ్యాప్తంగా 1,500కుపైగా స్టోర్లను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఒప్పందాన్ని అమెజాన్ వ్యతిరేకిస్తోంది. -
సుప్రీంకోర్టును ఆశ్రయించిన అమెజాన్!
న్యూఢిల్లీ: ఫ్యూచర్–రిలయన్స్ ఒప్పందం విషయంలో ఢిల్లీ హైకోర్టు డివిజనల్ బెంచ్ ఇచ్చిన రూలింగ్పై ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే ఫ్యూచర్ లేదా అమెజాన్లు ఈ విషయంలో పంపిన ఈ–మెయిల్ ప్రశ్నలకు స్పందించలేదు. కేసు వివరాల్లోకి వెళితే, ఫ్యూచర్ గ్రూప్లో కీలకమైన ఫ్యూచర్ రిటైల్ (ఎఫ్ఆర్ఎల్)లో ఫ్యూచర్ కూపన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎఫ్సీపీఎల్)కు 7.3 శాతం వాటాలు ఉన్నాయి. అమెజాన్ గతేడాది ఆగస్టులో ఈ ఫ్యూచర్ కూపన్స్లో 49 శాతం వాటాలు కొనుగోలు చేసింది. ఫ్యూచర్ కూపన్స్తో డీల్ కుదుర్చుకున్నప్పుడే .. మూడు నుంచి పదేళ్ల వ్యవధిలో ఎఫ్ఆర్ఎల్ను కూడా కొనుగోలు చేసేందుకు తమకు హక్కులు దఖలు పడ్డాయని అమెజాన్ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఫ్యూచర్ రిటైల్ వ్యాపారాలను రిలయన్స్తో విక్రయించడం సరికాదని పేర్కొంటూ, ఇందుకు సంబంధించి రూ.24,713 కోట్ల ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్– రిలయన్స్ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ వివాదంలో తదుపరి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని సింగపూర్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ (ఎస్ఐఏసీ) ఇచ్చిన ఉత్తర్వుల అమలుకు ఫ్యూచర్ రిటైల్ను ఆదేశించాలని డిమాండ్ చేస్తోంది. ఈ అంశంపై జరిగిన విచారణలో భాగంగా... జనవరి 21వ తేదీన ఫ్యూచర్–రిలయన్స్ డీల్కు సెబీ, సీసీఐ, స్టాక్ ఎక్సే్చంజీల షరతులతో కూడిన అనుమతులిచ్చాయి. వీటి ప్రకారం.. ఈ ఒప్పందానికి ఫ్యూచర్ గ్రూప్ ఇటు షేర్హోల్డర్లతో పాటు అటు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) అనుమతులు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. దీనితో జనవరి 26న ఫ్యూచర్ ఎన్సీఎల్టీ, ముంబై బెంచ్నీ ఆశ్రయించింది. ప్రస్తుతం న్యాయస్థానాల్లో కొనసాగుతున్న వివాదాలపై తుది తీర్పులకు లోబడి తమ అనుమతులు వర్తిస్తాయని స్టాక్ ఎక్సే్చంజీలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో అమెజాన్ జనవరి 25న ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారంలో సీఈఓ కిషోర్ బియానీసహా ఫ్యూచర్ గ్రూప్ వ్యవస్థాపకులందరినీ అరెస్ట్ చేసేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టును ఆశ్రయించింది. ఈ విక్రయ ప్రక్రియ అమలుకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ, అలాగే స్టాక్ ఎక్సే్చంజీలు అనుమతి ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎస్ఐఏసీ ఆదేశాలను గ్రూప్ సీఈఓ కిషోర్ బియానీసహా ఫ్యూచర్ కూపన్స్, ఫ్యూచర్ రిటైల్, ప్రమోటర్లు తదితర ప్రతివాదులు ఉద్దేశపూర్వకంగా పట్టించుకోవడంలేదనీ అమెజాన్ తాజా పిటిషన్లో ఆరోపించింది. న్యాయం, చట్టం అమలు, ఆర్బిట్రల్ ప్రక్రియ, బాధ్యతల పట్ల వారికి ఎంత గౌరవం ఉందో దీనిని బట్టి అర్థం అవుతోందని పేర్కొంది. ఈ పిటిషన్ను నాలుగురోజులు విచారించిన ఢిల్లీ హైకోర్టు సింగిల్ బెంచ్ 2021 పిబ్రవరి 2న రూలింగ్ ఇస్తూ, ఆర్ఐఎల్తో ఒప్పందం విషయంలో యథాతథ స్థితిని పాటించాలని ఫ్యూచర్ గ్రూప్ను ఆదేశించింది. ఈ వ్యవహారంలో ఫ్యూచర్ దాఖలు చేసిన అప్పీల్ను విచారించిన డివిజనల్ బెంచ్ ఈ నెల 8వ తేదీన ఫ్యూచర్కు అనుకూలంగా రూలింగ్ ఇచ్చింది. దీనిపై తాజాగా అమెజాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. -
రిలయన్స్ జోరుకు ఢిల్లీ హైకోర్టు బ్రేక్
న్యూఢిల్లీ: రిలయన్స్ రిటైల్తో రూ.24,718 కోట్ల ఒప్పందం విషయంలో యథాతథ పరిస్థితిని కొనసాగించాలని ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ (ఎఫ్ఆర్ఎల్)ను ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఆదేశించింది. తన రిటైల్ ఆస్తులను రిలయన్స్ సంస్థకు అమ్మాలనుకుంటున్న ఫ్యూచర్ గ్రూప్ ప్రయత్నాలకు ఢిల్లీ హైకోర్టు బ్రేకులు వేసింది. అమెజాన్ హక్కుల పరిరక్షణకు తక్షణ మధ్యతర ఉత్తర్వులు ఇవ్వాలన్న ఆ సంస్థ వాదనలతో కోర్టు సంతృప్తి చెందుతున్నట్లు జస్టిస్ జేఆర్ మిద్రా పేర్కొన్నారు. “ఎఫ్ఆర్ఎల్సహా ఇతర ప్రతివాదులు అందరూ మంగళవారం సాయంత్రం 4.49 గంటల నుంచి తదుపరి ఉత్తర్వులు వెలువరించేంత వరకూ యథాతథ స్థితిని కొనసాగించాలని ఉత్తర్వులు ఇస్తున్నాం” అని జడ్జి రూలింగ్ ఇచ్చారు.(చదవండి: అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ సంచలన నిర్ణయం) వరుసగా నాలుగురోజుల నుంచీ ఈ అంశంపై హైకోర్టు విచారణ జరుపుతోంది. ప్యూచర్ రిటైల్ వ్యాపారాలను రిలయన్స్తో విక్రయించడం సరికాదంటున్న అమెజాన్, ఇంతక్రితమే ఇందుకు సంబంధించి తమ తొలి కొనుగోలు హక్కులకు వీలు కలిగిస్తున్న ఒప్పందాన్ని ప్రస్తావిస్తోంది. తదుపరి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని సింగపూర్. ఆర్బిట్రల్ ఉత్తర్వుల అమలుకు ప్యూచర్ రిటైల్ను ఆదేశించాలని అమెజాన్ దాఖలు చేసిన ప్రధాన పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేసింది. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై అమెజాన్ హర్షం వ్యక్తం చేసింది. అయితే చట్టబద్దంగా తదుపరి ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై అధ్యయనం చేస్తున్నట్లు ఫ్యూచర్ రిటైల్ వెల్లడం. -
గందరగోళం సృష్టిస్తోంది..
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్తో డీల్ విషయంలో మోకాలడ్డుతున్న అమెరికా ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్పై ఫ్యూచర్ గ్రూప్ ప్రమోటర్ కిషోర్ బియానీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకు అక్కరకు రాని వ్యవహారంలో తలదూరుస్తూ అమెజాన్ గందరగోళం సృష్టిస్తోందని ఆరోపించారు. ఈ మేరకు ఫ్యూచర్ గ్రూప్ ఉద్యోగులకు లేఖ రాశారు. అమెజాన్తో వివాదం విషయంలో ఉద్యోగులకు భరోసా కల్పించేందుకు బియానీ ప్రయత్నం చేశారు. ‘అలెగ్జాండర్ యావత్ ప్రపంచాన్ని గెలిచినా.. భారత్లో విఫలమయ్యాడని చరిత్ర చెబుతోంది. భారతీయ వినియోగదారులకు అందిస్తున్న సేవలు, మీ అండతో దేశ ప్రయోజనాలు కాపాడేందుకు కట్టుబడి ఉన్నాం. ప్రాథమిక హక్కులను కాపాడుకునేందుకు పోరాటం కొనసాగిస్తాం‘ అని ఆయన పేర్కొన్నారు. ఫ్యూచర్ గ్రూప్ చట్టబద్ధంగానే ముందుకు సాగుతోందని .. స్టాక్ ఎక్సే్చంజీలు, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి కూడా డీల్కు అనుమతులు పొందిందని పేర్కొన్నారు. లిటిగేషన్లతో వేధిస్తోంది ..అమెజాన్ ఒక ప్రణాళిక ప్రకారం మీడియాలో దుష్ప్రచారం సాగిస్తోందని, తప్పుదోవ పట్టించే సమాచారాన్ని లీక్ చేస్తోందని కిషోర్ బియానీ ఆరోపించారు. ఫ్యూచర్ రిటైల్, డైరెక్టర్ల బోర్డు, రుణదాతలతో పాటు తనతో పాటు తండ్రి, పిల్లలు, కుటుంబసభ్యులను కూడా విడిచి పెట్టడం లేదని పేర్కొన్నారు. కరోనా వైరస్పరమైన ఆర్థిక సంక్షోభం కారణంగా రిలయన్స్ గ్రూప్తో నిర్మాణాత్మక డీల్ కుదుర్చుకోవడం మినహా మరో గత్యంతరం లేకుండా పోయిందని ఆయన పేర్కొన్నారు. ఫ్యూచర్ గ్రూప్లోని అన్లిస్టేడ్ సంస్థ ఫ్యూచర్ కూపన్స్లో 49 శాతం వాటాలు కొనుగోలు చేసేందుకు 2019 ఆగస్టులో అమెజాన్ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఫ్యూచర్ కూపన్స్కి వాటాలు ఉన్న ఫ్యూచర్ రిటైల్ సంస్థలో కొన్నేళ్ల తర్వాత అమెజాన్ కూడా వాటాలు కొనుగోలు చేయొచ్చు. అయితే, కరోనా దెబ్బతో రిటైల్ను రిలయన్స్కు సుమారు రూ. 24,713 కోట్లకు విక్రయించాలని ఫ్యూచర్ గ్రూప్ నిర్ణయించుకోవడంతో వివాదం వచ్చి పడింది. ఈ డీల్ను వ్యతిరేకిస్తూ అమెజాన్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించగా .. దానికి అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు వచ్చాయి. మరోవైపు, ఫ్యూచర్ గ్రూప్.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. నియంత్రణ సంస్థలు దీనిపై నిర్ణయం తీసుకోవాలంటూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో.. ఒప్పంద ఉల్లంఘనకు గాను బియానీని అరెస్ట్ చేయడంతో పాటు ఆస్తులను కూడా జప్తు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో అమెజాన్ పిటిషన్ దాఖలు చేసింది. -
అమెజాన్ : కిషోర్ బియానీ కీలక వ్యాఖ్యలు
సాక్షి,ముంబై: కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూపు 3.4 బిలియన్ డాలర్ల రిలయన్స్ రీటైల్ డీల్ ఒప్పందానికి వ్యతిరేకంగా అమెజాన్ అలుపెరుగని పోరాటం చేస్తోంది. మరోవైపు ఈ ఒప్పందం అమలును అడ్డుకునేందుకు అమెజాన్ ప్రయత్నాలను ఎద్దేవా చేస్తూ ఫ్యూచర్ గ్రూపు సీఈఓ కిషోర్ బియానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ భూమిని ఆక్రమించాలన్న అలెగ్జాండర్ ది గ్రేట్ క్రూరమైన కోరికలాంటిదే అమెజాన్ ప్రయస కూడా అని అభివర్ణించారు. ప్రపంచంలో చాలా భాగాన్ని జయించిన గ్రీకు వీరుడు ఇండియాలో తోక ముడిచాడనేది చరిత్ర చెబుతోందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. (బియానీని అరెస్ట్ చేయండి!) రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)కు రిటైల్ ఆస్తుల విక్రయం నిబంధనలకు విరుద్ధమని వాదిస్తున్న అమెరికా ఆన్లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్, ఫ్యూచర్ గ్రూప్ సీఈఓ కిషోర్ బియానీసహా వ్యవస్థాపకులందరినీ అరెస్ట్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బియానీ తాజా వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు భారతీయ కస్టమర్లపై ఆధిపత్యం కోసం అమెజాన్ చేస్తున్న కార్పొరేట్ యుద్ధంగా ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఉద్యోగులకు ఒక అంతర్గత లేఖ రాశారు. రిలయన్స్ రీటైల్ ఒప్పందానికి సంబంధించి అన్ని నిబంధనలను పాటించామని, రెగ్యులేటరీ ఇటీవలి ఆమోదమే ఇందుకు నిదర్శనమన్నారు. 1,700 దుకాణాలు, వేలాది మంది ఉద్యోగుల మనుగడకు ఈ ఒప్పందం కీలకమని తెలిపారు. అయితే దీనిపై వ్యాఖ్యానించడానికి అమెజాన్ నిరాకరించింది. (అమెజాన్కు ఎలాంటి పరిహారం చెల్లించం : కిశోర్ బియానీ) -
బియానీని అరెస్ట్ చేయండి!
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్)కు ఫ్యూచర్ గ్రూప్ తన రిటైల్ ఆస్తుల విక్రయ ప్రక్రియపై అమెరికా ఆన్లైన్ రిటైల్ దిగ్గజం– అమెజాన్ సోమవారం కీలక అడుగు వేసింది. ఈ వ్యవహారంలో సీఈఓ కిషోర్ బియానీసహా ఫ్యూచర్ గ్రూప్ వ్యవస్థాపకులందరినీ అరెస్ట్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. స్థిర, చర ఆస్తులుసహా బియానీ కుటుంబ సభ్యుల ఆస్తులన్నింటినీ వెల్లడించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. వాటిని జప్తు చేయాలని విజ్ఞప్తి చేసింది. బియానీ, ఆయన కుమార్తె అష్ని, వ్యవస్థాపక కుటుంబంలోని ఏడుగురు సభ్యులు, అలాగే కంపెనీ సెక్రటరీసహా ముగ్గురు ఇతర అధికారులను ‘‘అదుపు’’లోకి తీసుకోవాలని కోరింది. ఫ్యూచర్ గ్రూప్ సంస్థల డైరెక్టర్లను అరెస్ట్ చేసేలా ఆదేశాలు ఇవ్వమని అభ్యర్థించింది. న్యాయ వ్యవస్థలపై గౌరవం లేదు! రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) కు ఫ్యూచర్ గ్రూప్ తన రిటైల్ ఆస్తుల విక్రయ ప్రక్రియను వెంటనే నిలుపుచేయాలని కూడా అమెరికా ఆన్లైన్ రిటైల్ దిగ్గజం– అమెజాన్ హైకోర్టును కోరింది. ఈ విక్రయ ప్రక్రియ అమలుకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ, అలాగే స్టాక్ ఎక్సే్చంజీలు అనుమతి ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయా అంశాలకు సంబంధించి తనకు అనుకూలంగా సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ (ఎస్ఐఏసీ) ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించింది. ఎమర్జెన్సీ ఆర్బిట్రేటర్ (ఈఏ) ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను భారతీయ చట్టాల (ఆర్బిట్రేషన్ అండ్ కన్సీలియేషన్ యాక్ట్ అలాగే కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ ఆర్డర్ 39 రూర్ 2ఏ) ప్రకారం అమలు చేయవచ్చని, తద్వారా తన ప్రయోజనాలు కాపాడాలని తన తాజా పిటిషన్లో అమెజాన్ పేర్కొంది. ఫ్యూచర్–రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ఒప్పందానికి సెబీ, స్టాక్ ఎక్సేంజీలు అనుమతి ఇచ్చిన కేవలం కొద్ది రోజులకే అమెజాన్ ఈ విషయంలో తాజా అడుగులు వేయడం గమనార్హం. భారత్లో రెగ్యులేటరీ సంస్థ ఇచ్చిన ఎటువంటి ఆదేశాలూ ప్రతివాది ఫ్యూచర్ గ్రూప్ అమలు పరచలేకుండా తగిన ‘‘ఇంజెన్షన్’’ ఉత్తర్వులు ఇవ్వాలని తన పిటిషన్లో అమెజాన్ కోరడం గమనార్హం. లేదంటే అమెజాన్ గతేడాది ఆగస్టులో ఫ్యూచర్ కూపన్స్లో కొనుగోలు చేసిన 49 శాతం వాటాల ప్రయోజనాలు పొందలేదని స్పష్టం చేసింది. నిజానికి ఎస్ఐఏసీ ఇచ్చిన మధ్యంతర ఆదేశాలు జనవరి 23 వరకే అమల్లో ఉంటాయి. ఈ ఉత్తర్వులను పొడిగించాల్సి ఉంది. అయితే ఎస్ఐఏసీ మధ్యంతర ఆదేశాల పునఃపరిశీలన లేదా సవరణ, సడలింపు, ఎత్తివేతలకు సంబంధించి ఎవ్వరూ (వివాదంలోని ఏ పార్టీ) తదుపరి పిటిషన్ వేయనందున ఆర్బిట్రేషన్ ఉత్తర్వుల గడువు సాంకేతికంగా ఆటోమేటిక్(దానికదే)గా పెరుగుతుందని తన పిటిషన్లో అమెజాన్ పేర్కొనడం గమనార్హం. ఎస్ఐఏసీ ఆదేశాలను గ్రూప్ సీఈఓ కిషోర్ బియానీసహా ఫ్యూచర్ కూపన్స్, ఫ్యూచర్ రిటైల్, ప్రమోటర్లు తదితర ప్రతివాదులు ఉద్దేశపూర్వకంగా పట్టించుకోవడంలేదనీ అమెజాన్ తాజా పిటిషన్లో ఆరోపించింది. కనీసం ఈఏ ఆదేశాలను సవాలు చేయడం లేదని పేర్కొంది. న్యాయం, చట్టం అమలు, ఆర్బిట్రల్ ప్రక్రియ, బాధ్యతల పట్ల వారికి ఎంత గౌరవం ఉందో దీనిని బట్టి అర్థం అవుతోందని పేర్కొంది. కొనుగోలు హక్కు మాకే: అమెజాన్ ► ఫ్యూచర్ గ్రూప్లో కీలకమైన ఫ్యూచర్ రిటైల్ (ఎఫ్ఆర్ఎల్)లో ఫ్యూచర్ కూపన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎఫ్సీపీఎల్)కు 7.3 శాతం వాటాలు ఉన్నాయి. అమెజాన్ గతేడాది ఆగస్టులో ఈ ఫ్యూచర్ కూపన్స్లో 49 శాతం వాటాలు కొనుగోలు చేసింది. తద్వారా అమెజాన్కు కూడా ఎఫ్ఆర్ఎల్లో సాంకేతికంగా వాటాలు సంక్రమించినట్లయింది. ఫ్యూచర్ కూపన్స్తో డీల్ కుదుర్చుకున్నప్పుడే .. మూడు నుంచి పదేళ్ల వ్యవధిలో ఎఫ్ఆర్ఎల్ను కూడా కొనుగోలు చేసేందుకు తమకు హక్కులు దఖలు పడ్డాయని అమెజాన్ చెబుతోంది. ► ఇటీవలి కరోనా ప్రేరిత సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఫ్యూచర్ రిటైల్కు చెందిన రిటైల్, హోల్సేల్, లాజిస్టిక్స్ తదితర వ్యాపారాలను రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్) విక్రయిస్తున్నట్లు గతేడాది ఆగస్టు 29న ఫ్యూచర్ గ్రూప్ ప్రకటించింది. ఈ డీల్ విలువ దాదాపు రూ. 24,713 కోట్లు. ∙ఈ నేపథ్యంలోనే ఈ ఒప్పందాన్ని అమెజాన్ వ్యతిరేకిస్తోంది. న్యాయపోరాటంలో ఇప్పుడు అమెజాన్ (తాజాగా ఢిల్లీ హైకోర్టు పిటిషన్తో) కొత్త అడుగు వేసినట్లయ్యింది. ► ఎన్బీఎఫ్సీ సంస్థ కేన్ ఫిన్ హోమ్స్ ఈ ఏడాది(2020–21) మూడో త్రైమాసికంలో రూ. 132 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది 24 శాతం వృద్ధికాగా.. గతేడాది క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో రూ. 107 కోట్ల లాభం నమోదైంది. -
డీల్ ఓకే : అమెజాన్కు ఎదురుదెబ్బ
సాక్షి, ముంబై: ఫ్యూచర్ గ్రూపు, అమెజాన్ మధ్య వివాదంలో అమెజాన్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కిశోర్ బియానీ యాజమాన్యంలోని ఫ్యూచర్ గ్రూప్, ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్ డీల్కు అమెజాన్ లేవనెత్తిన అభ్యంతరాలు ఉన్నప్పటికీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) తాజాగా ఆమోద ముద్ర వేసింది. అయితే అమెజాన్ అభ్యంతరాలపై వివరణ కోరింది. (అమెజాన్కు ఎలాంటి పరిహారం చెల్లించం : కిశోర్ బియానీ) అలాగే కీలక ఒప్పందాల సమయంలో ఎలాంటి వివాదం ఉన్నా ముందుగా తనతో పాటు,షేర్ హోల్డర్స్ కు కూడా సమాచారం అందించాలని సెబీ తెలిపింది. ఎన్సీఎల్టీ దృష్టికి తీసుకురావాలని కూడా స్పష్టం చేసింది. అలాగే ఈ ఒప్పందంలో భాగంగా యాజమాన్యం మార్పునకు సంబంధించి న్యాయపరంగా చిక్కులు లేకుండా రూట్ మ్యాప్ సమాచారాన్ని కూడా అందించాలని సెబీ ఆదేశించింది. ఆగస్టు 29, 2020న రిలయన్స్ రిటైల్, ఫ్యూచర్ గ్రూప్ వాటాలను రూ.24713 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. ఈ డీల్కు గత ఏడాది నవంబరులోనే సీసీఐ అంగీకారం లభించగా, తాజాగా సెబీ కూడా ఆమోద్రముద్ర వేసింది. కాగా,ఈ ఒప్పందంపై అమెజాన్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సింగపూర్ అంతర్జాతీయ కోర్టును ఆశ్రయించింది. ఫ్యూచర్ లోని కూపన్ విభాగంలో అమెజాన్ సంస్థకు 49 శాతం వాటా ఉన్న నేపథ్యంలో తమకు సమాచారం ఇవ్వకుండానే ఎలా విక్రయిస్తారని ప్రశ్నించింది. దీనికి తమకు నష్టపరిహారం కావాలని డిమాండ్ చేస్తోంది. అయితే నిబంధనల ప్రకారమే ఈ డీల్ ఉందని, అమెజాన్కు పరిహారం చెల్లించే ప్రశ్నేలేదని ఫ్యూచర్ గ్రూపు తెగేసి చెప్పింది. అమెజాన్ ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటోందని వాదిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు రిలయన్స్, ఫ్యూచర్ డీల్కు సెబీ గ్రీన్ సిగ్నల్ లభించన నేపథ్యంలో గురువారం నాటి మార్కెట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 2.46 శాతం లాభంతో రూ. 2105 వద్ద కొనసాగుతోంది. -
అమెజాన్కు ఎలాంటి పరిహారం చెల్లించం : కిశోర్ బియానీ
సాక్షి, న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్తో (ఆర్ఐఎల్) రిటైల్ ఆస్తుల విక్రయానికి కుదుర్చుకున్న ఒప్పందం సెబీ ఆమోదం లభిస్తే రెండు నెలల్లోపే పూర్తవుతుందన్న ఆశాభావాన్ని ఫ్యూచర్ గ్రూపు అధినేత కిశోర్ బియానీ వ్యక్తం చేశారు. ఫ్యూచర్ గ్రూపు పరిధిలో ఉన్న అన్ని రకాల రిటైల్, లాజిస్టిక్స్ ఆస్తుల విక్రయానికి ఆయన గతేడాది ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటికే ఫ్యూచర్ రిటైల్లో పరోక్షంగా 5 శాతం వాటా కలిగిన అమెజాన్ దీన్ని వ్యతిరేకిస్తూ సింగపూర్ ఆర్బిట్రేషన్కు వెళ్లడంతో డీల్కు అవరోధాలు ఏర్పడ్డాయి. ఈ అంశంలో కాంట్రాక్టు ఉల్లంఘన జరగనందున ఎటువంటి పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని ఫ్యూచర్ గ్రూప్ అమెజాన్కు స్పష్టం చేసింది. ఈ వివాదంపై బియానీ తన అంతరంగాన్ని ఓ వార్తా సంస్థతో పంచుకున్నారు. ‘‘ఒక్కసారి సెబీ ఆమోదం లభిస్తే ఎన్సీఎల్టీ, వాటాదారుల ఆమోదం తీసుకుంటాము. ఇందుకు 45-60 రోజులు పట్టొచ్చు. జనవరి చివర్లో ఆర్బిట్రేషన్ మొదలవుతుంది. డీల్, ఆర్బిట్రేషన్ ప్రక్రియ సమాంతరంగా కొనసాగుతాయి. ముకేశ్ అంబానీ ఆధ్వర్యంలోని గ్రూపుతో చేసుకున్న డీల్.. ఫ్యూచర్ గ్రూపు పరిధిలోని ఒకసంస్థ(ఫ్యూచర్ కూపన్స్)లో అమెజాన్కు ఉన్న వాటాకు సంబంధించినది కాదు’’అని కిశోర్ బియానీ వివరించారు. లాక్డాన్ కారణంగా తమ ఫ్యూచర్ రిటైల్ వ్యాపారం తీవ్ర ఇబ్బందుల్లోకి వెళ్లి, రుణ భారం భారీగా పెరిగిపోవడంతో సాయం కోసం అమెజాన్ను ఎన్నో సందర్భాలు సంప్రదించినా ఫలితం దక్కలేదని స్పష్టం చేశారు. ‘‘కోవిడ్, లాక్డౌన్ ఆరంభం నుంచి అమెజాన్తో అదే పనిగా సంప్రదింపుల్లోనే ఉన్నాము. ఈ విషయమై వారికి అవగాహన లేకపోవడం అన్న ప్రశ్నే లేదు. షేర్ల ధరలు పడిపోవడంతో తనఖాలో ఉంచిన షేర్ల విక్రయం విషయమై గతేడాది మార్చిలో అమెజాన్కు లేఖ కూడా రాయడం జరిగింది’’ అని బియానీ వివరించారు. అయినా, చూద్దాంలేనన్న స్పందన అమెజాన్ నుంచి వ్యక్తమైనట్టు చెప్పారు. (జెఫ్ బెజోస్ టాప్ : మరో రికార్డు) వాస్తవం కాదు..: అమెజాన్ ‘‘ఫ్యూచర్ రిటైల్కు ఎటువంటి సాయాన్ని ఆఫర్ చేయలేదనడం నిజం కాదు. ఒకవైపు భాగస్వాములతో పలు అవకాశాల పట్ల చర్చిస్తూనే..మరోవైపు ఫ్యూచర్ గ్రూపు ప్రమోటర్లతోనూ సంప్రదింపులు కొనసాగించాము. టర్మ్ షీట్పై సంతకం కూడా చేశాము’’ అంటూ అమెజాన్ అధికార ప్రతినిధి స్పందించారు. కాగా ముకేశ్ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్తో 24,000 కోట్ల రూపాయల డీల్ తరువాత ఫ్యూచర్ గ్రూప్, అమెజాన్ మధ్య వివాదం నెలకొంది. ఆర్ఐఎల్తో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా తమ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని,ఇందుకు తమకునష్టపరిహారం చెల్లించాల్సి ఉందని అమెజాన్ అంతర్జాతీయ కోర్టును ఆశ్రయించింది. -
అమెజాన్ ఏమాత్రం సహాయం చేయలేదు..
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్కు ఫ్యూచర్ రిటైల్లో వాటాల విక్రయ వివాదానికి సంబంధించి ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్, ఫ్యూచర్ గ్రూప్ మధ్య వివాదం కొనసాగుతోంది. తాజాగా వాటాదారైన అమెజాన్పై ఫ్యూచర్ మరిన్ని ఆరోపణలు గుప్పించింది. కరోనా వైరస్ కట్టడి కోసం లాక్డౌన్ అమలైన సమయంలో తాము తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ .. అమెజాన్ పైపై మాటలు చెప్పడం తప్ప ఏమాత్రం సహాయం అందించలేదని ఆరోపించింది. మార్చి నుంచి ఆగస్టు మధ్య కాలంలో అమెజాన్ వ్యవహరించిన తీరు ఏమాత్రం సమంజసమైనదిగా లేదని పేర్కొంది. ఫ్యూచర్ గ్రూప్ ప్రమోటర్లు.. డిసెంబర్ 31న ఈ మేరకు అమెజాన్కు లేఖ రాశారు. వాటాల విక్రయం కోసం రిలయన్స్తో తాము చర్చలు జరుపుతున్నామని తెలిసినప్పటికీ అమెజాన్ నిర్మాణాత్మకమైన ప్రతిపాదనేదీ తీసుకురాకుండా.. ఆ తర్వాత మోకాలడ్డే ప్రయత్నం చేయడం సరికాదని ఫ్యూచర్ గ్రూప్ ఆక్షేపించింది. తోసిపుచ్చిన అమెజాన్: మరోవైపు, ఫ్యూచర్ ఆరోపణలను అమెజాన్ తోసిపుచ్చింది. ఫ్యూచర్ రిటైల్కు తాము సహాయం చేసేందుకు ప్రయత్నించలేదన్న ఆరోపణలు సరికాదని వ్యాఖ్యానించింది. ఫ్యూచర్ గ్రూప్లో భాగమైన ఎఫ్సీపీఎల్కు లిస్టెడ్ సంస్థ ఫ్యూచర్ రిటైల్లో (ఎఫ్ఆర్ఎల్) వాటాలు ఉన్నాయి. గతేడాది ఎఫ్సీపీఎల్లో వాటాలు కొనుగోలు చేయడం వల్ల ఎఫ్ఆర్ఎల్లో అమెజాన్కు స్వల్ప వాటాలు దఖలు పడ్డాయి. -
2020: పసిడి, కుబేరులు, మార్కెట్లు!
హైదరాబాద్, సాక్షి: ఈ కేలండర్ ఏడాది(2020) ఏడాదిలో ప్రపంచ దేశాలను కోవిడ్-19 వణికించినప్పటికీ పారిశ్రామిక రంగలో దేశీయంగా పలు సానుకూల పవనాలు వీచాయి. ఓవైపు ప్రపంచ కుబేరుడు ముకేశ్ అంబానీతోపాటు.. దేశీ బిలియనీర్ల సంపద సైతం పెరుగుతూ వచ్చింది. కరోనా వైరస్ కేసులు విస్తరిస్తుండటంతో మార్చిలో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు సైతం 70 శాతం ర్యాలీ చేశాయి. సరికొత్త గరిష్టాలకు చేరాయి. ఇక మరోపక్క మార్కెట్లతో పోటీ పడుతూ పసిడి సైతం మెరుస్తూ వచ్చింది. దేశీ రిటైల్ పరిశ్రమలో పేరున్న కిశోర్ బియానీ గ్రూప్ ఆర్థికంగా సవాళ్లను ఎదుర్కోవడంతో ముకేశ్ అంబానీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్కు రిటైల్ బిజినెస్లను విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అయితే డీల్ను తాత్కాలికంగా నిలిపివేయమంటూ సింగపూర్ ఆర్బిట్రేషన్ కోర్టు నుంచి అమెజాన్ మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకుంది. కాగా.. జనవరి నుంచి చూస్తే మార్కెట్లు 14 శాతం బలపడ్డాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 47,354కు చేరగా.. నిఫ్టీ 13,873 వద్ద ముగిసింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలు కావడం విశేషం! ఇతర వివరాలు చూద్దాం.. (2021లో బంగారం ధర ఎంత పెరగనుంది..?!) దేశీ కుబేరులు కరోనా వైరస్ కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగించినప్పటికీ ఈ ఏడాది దేశీ కుబేరుల సంపద 50 శాతం బలపడింది. తొలితరం పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ వ్యక్తిగత సంపద 21.1 బిలియన్ డాలర్లు పెరిగింది. వెరసి 32.4 బిలియన్ డాలర్లను తాకింది. ఇక 2020లో ఆర్ఐఎల్ అధినేత ముకేశ్ అంబానీ సంపద సైతం 18.1 బిలియన్ డాలర్ల వృద్ధితో 76.7 బిలియన్ డాలర్లయ్యింది. వ్యాక్సిన్ల కంపెనీ సీరమ్ ఇన్స్టిట్యూట్ చీఫ్ సైరస్ పూనావాలా సంపదకు 6.91 బిలియన్ డాలర్లు జమకావడంతో 15.6 బిలియన్ డాలర్లకు వ్యక్తిగత సంపద ఎగసింది. ఐటీ దిగ్గజాలు హెచ్సీఎల్ టెక్నాలజీస్ చీఫ్ శివనాడార్, విప్రో అధినేత ప్రేమ్జీ సంపద సంయుక్తంగా 12 బిలియన్ డాలర్లమేర పెరిగింది. దీంతో శివనాడార్ సంపద 22 బిలియన్ డాలర్లను తాకగా.. ప్రేమ్జీ వెల్త్ 23.6 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ బాటలో డీమార్ట్ స్టోర్ల అధినేత రాధాకిషన్ దమానీ సంపద సైతం 4.71 బిలియన్ డాలర్లు బలపడి 14.4 బిలియన్ డాలర్లయ్యింది. ఇదేవిధంగా హెల్త్కేర్ దిగ్గజం సన్ ఫార్మా చీఫ్ దిలీప్ సంఘ్వీ సంపద 2.23 బిలియన్ డాలర్లు పుంజుకుని 9.69 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ముకేశ్ అంబానీ దేశీ పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ సరికొత్త రికార్డు సాధించారు. జులైకల్లా వ్యక్తిగత సంపద 77.4 బిలియన్ డాలర్లను తాకింది. దీంతో ప్రపంచంలోనే అపర కుబేరుల్లో 5వ ర్యాంకుకు చేరుకున్నారు. తద్వారా సంపదలో ఫేస్బుక్ అధినేత జుకర్బర్గ్(86 బిలియన్ డాలర్లు) సమీపంలో ముకేశ్ నిలిచారు. ముకేశ్ గ్రూప్లోని డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు లాభపడటం ఇందుకు సహకరించింది. సాధారణంగా టాప్-5 ప్రపంచ కుబేరుల్లో అమెరికన్లు, తదుపరి యూరోపియన్లు, ఒక మెక్సికన్ చోటు సాధిస్తూ వచ్చే సంగతి తెలిసిందే. ఈ ట్రెండ్కు ముకేశ్ చెక్ పెట్టినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా.. ప్రస్తుతం ముకేశ్ సంపదను 76.5 బిలియన్ డాలర్లుగా బ్లూమ్బెర్గ్ తెలియజేసింది. జియో, రిలయన్స్ రిటైల్ ఈ ఏడాది ముకేశ్ అంబానీ గ్రూప్లోని ప్రధాన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు భారీ ర్యాలీ చేసింది. ఇందుకు డిజిటల్ అనుబంధ విభాగం జియో ప్లాట్ఫామ్స్లో 33 శాతం వాటా విక్రయం ద్వారా 1.5 లక్షల కోట్లను సమకూర్చుకోవడం సహకరించింది. దీంతోపాటు.. రైట్స్ ఇష్యూ ద్వారా రూ. 53,000 కోట్లు సమీకరించడంతో రుణరహిత కంపెనీగా ఆర్ఐఎల్ నిలిచింది. అంతేకాకుండా మరో అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్లోనూ 10 శాతం వాటా విక్రయం ద్వారా రూ. 47,000 కోట్లకుపైగా సమకూర్చుకుంది. జియో ప్లాట్ఫామ్స్లో ఫేస్బుక్, గూగుల్, సిల్వర్లేక్ తదితరాలు ఇన్వెస్ట్చేయడం విశేషం! పసిడి కోవిడ్-19 భయాలతో ఈ ఏడాది మధ్యలో న్యూయార్క్ కామెక్స్లో ఔన్స్(31.1 గ్రాములు) 2,067 డాలర్ల వద్ద గరిష్టానికి చేరింది. ఈ బాటలో దేశీయంగానూ ఆగస్ట్లో పసిడి 10 గ్రాములు ఎంసీఎక్స్లో రూ. 57,100కు ఎగసింది. ఇది దేశీ బులియన్ చరిత్రలోనే అత్యధికంకాగా.. తదుపరి ఆర్థిక వ్యవస్థలు రికవరీ బాట పట్టడం, వ్యాక్సిన్లపై ఆశలు కారణంగా పసిడి వెనకడుగు వేస్తూ వచ్చింది. ప్రస్తుతం కామెక్స్లో పసిడి 1,890 డాలర్లకు చేరింది. ఇక ఎంసీఎక్స్లోనూ రూ. 50,300కు దిగింది. అయినప్పటికీ 2020లో పసిడి 35 శాతంపైగా ర్యాలీ చేయడం గమనార్హం! వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వివరాల ప్రకారం 2019లో పసిడి 1,393 డాలర్ల సమీపంలో నిలిచింది. దేశీయంగా రూ. 38,200 స్థాయిలో ముగిసింది. రూ. 24,713 కోట్ల డీల్ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)కు రిటైల్ బిజినెస్లను విక్రయించేందుకు ఫ్యూచర్ రిటైల్ డీల్ కుదుర్చుకుంది. తద్వారా రిటైల్, హోల్సేల్ బిజినెస్లతోపాటు.. లాజిస్టిక్స్, వేర్హౌసింగ్ విభాగాలను ఆర్ఐఎల్ 3.4 బిలియన్ డాలర్ల(రూ. 24,713 కోట్ల)కు సొంతం చేసుకోనుంది. సూపర్ మార్కెట్ చైన్ బిగ్బజార్సహా.. ఫుడ్హాల్, క్లాతింగ్ చైన్ బ్రాండ్ ఫ్యాక్టరీలను ఫ్యూచర్ గ్రూప్ నిర్వహిస్తోంది. అయితే ఈ డీల్ కుదర్చుకోవడంలో ఫ్యూచర్ గ్రూప్ నిబంధనలు ఉల్లంఘించిందంటూ అమెజాన్ గ్రూప్ సింగపూర్ ఆర్బిట్రేటర్ కోర్టును ఆశ్రయించింది. దీంతో తాత్కాలికంగా డీల్ను నిలిపివేయమంటూ సింగపూర్ ఆర్బిట్రేటర్ అక్టోబర్లో ఫ్యూచర్ గ్రూప్ను ఆదేశించింది. గతేడాది ఫ్యూచర్ గ్రూప్లోని అన్లిస్టెడ్ కంపెనీలలో 49 శాతం వాటాను యూఎస్ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ కొనుగోలు చేసింది. తద్వారా గ్రూప్లోని ప్రధాన లిస్టెడ్ కంపెనీ ఫ్యూచర్ రిటైల్లో వాటా కొనుగోలుకి తమకు హక్కు ఉన్నదంటూ వాదిస్తోంది. -
ఫ్యూచర్ గ్రూప్ త్రిశంకు స్వర్గం వీడేదెప్పుడో?
ముంబై, సాక్షి: ఫ్యూచర్ గ్రూప్తో ఒప్పందం కారణంగా కార్పొరేట్ దిగ్గజాలు అమెజాన్ గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్య ఇటీవల తలెత్తిన వివాదాలపై పలువురు ఆసక్తి చూపుతున్నారు. ట్రిలియన్ డాలర్ల(సుమారు రూ. 74 లక్షల కోట్లు) విలువైన దేశీ కన్జూమర్ మార్కెట్ కొద్ది నెలలుగా పలు కార్పొరేట్ దిగ్గజాలను ఆకట్టుకుంటోంది. ఇందుకు అనుగుణంగా రిటైల్ రంగ గ్లోబల్ దిగ్గజం వాల్మార్ట్.. ఇప్పటికే ఫ్లిప్కార్ట్ను సొంతం చేసుకోవడం ద్వారా కార్యకలాపాలు విస్తరిస్తోంది. మరోపక్క ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ సైతం పలు విభాగాలలో అమ్మకాలు పెంచుకుంటోంది. ఇక దేశీయంగా రిలయన్స్ రిటైల్ ద్వారా మార్కెట్లో విస్తరించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ సైతం వేగంగా అడుగులు వేస్తూ వస్తోంది. ఈ బాటలోనే ఆర్థికంగా దెబ్బతిన్న ఫ్యూచర్ గ్రూప్తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సీసీఐ ఓకే కిశోర్ బియానీ కంపెనీ ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ ఆస్తుల విక్రయానికి ముకేశ్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్తో రూ. 24,713 కోట్లకు ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. తద్వారా ఫ్యూచర్ గ్రూప్నకు చెందిన రిటైల్, హోల్సేల్, లాజిస్టిక్స్ బిజినెస్లను ఆర్ఐఎల్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్కు విక్రయించనుంది. అయితే ఇందుకు అమెజాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. డీల్ కుదుర్చుకోవడంలో ఫ్యూచర్ గ్రూప్ నిబంధనలను అతిక్రమించినట్లు ఆరోపించింది. సింగపూర్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కోర్టులో ఫిర్యాదు చేయడం ద్వారా ఒప్పందాన్ని నిలిపివేయమంటూ స్టే తెచ్చుకుంది. కాగా.. అమెజాన్కు వ్యతిరేకంగా ఫ్యూచర్ రిటైల్ సైతం ఈ నెల 7న ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. మరోవైపు గత వారం దేశీయంగా కాంపిటీషన్ కమిషన్(సీసీఐ).. రిలయన్స్- ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందానికి గ్రీన్సిగ్నల్ ఇవ్వడం గమనార్హం! డీల్ అత్యవసరం అమ్మకాలు మందగించడం, తీవ్రతర పోటీ, రుణ భారం వంటి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న ఫ్యూచర్ గ్రూప్ కోవిడ్-19 కారణంగా మరిన్ని సమస్యలలో చిక్కుకుంది. చెల్లింపుల సమస్యలు తలెత్తడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్తో డీల్ కుదుర్చుకుంది. అయితే గతేడాది ఫ్యూచర్ గ్రూప్లోని అన్లిస్టెడ్ కంపెనీలలో 49 శాతం వాటాను యూఎస్ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ కొనుగోలు చేసింది. తద్వారా గ్రూప్లోని ప్రధాన లిస్టెడ్ కంపెనీ ఫ్యూచర్ రిటైల్లో వాటా కొనుగోలుకి తమకు హక్కు ఉన్నదంటూ వాదిస్తోంది. అయితే నిబంధనలకు అనుగుణంగానే ఆర్ఐఎల్తో డీల్ కుదుర్చుకున్నట్లు ఫ్యూచర్ గ్రూప్ వాదిస్తోంది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందం నేపథ్యంలో కార్పొరేట్ దిగ్గజాలు అమెజాన్, ఆర్ఐఎల్ మధ్య వివాదం తలెత్తడంతో ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. రెండు కంపెనీల అధిపతులు జెఫ్ బెజోస్, ముకేశ్ అంబానీ ప్రపంచ సంపన్నులు కావడంతో అంతర్జాతీయంగా కార్పొరేట్ వర్గాలు దృష్టిసారించినట్లు చెబుతున్నారు. కాగా.. ఆర్ఐఎల్తో డీల్ విఫలమైతే దివాళా పరిస్థితికి చేరనున్నట్లు ఫ్యూచర్ గ్రూప్ ప్రతినిధులు పేర్కొనడంతో వివాద పరిష్కారానికి ప్రాధాన్యత పెరిగినట్లు తెలియజేశారు. తద్వారా పలువురు ఉపాధి కోల్పోయే ప్రమాదముందని అభిప్రాయపడ్డారు. ఫ్యూచర్ రిటైల్ తరఫున ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే స్పందిస్తూ.. అమెజాన్ 21వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీవలే ప్రవరిస్తున్నట్లు ఢిల్లీ హైకోర్టుకు తెలియజేశారు. చేస్తే మాతోనే బిజినెస్ చేయాలి. లేదంటే మూసివేయాల్సిందే అంటున్నట్లు వ్యవహరిస్తున్నదని విన్నవించారు. ఫ్యూచర్ రిటైల్లో అమెజాన్కు పెట్టుబడులు లేవని చెప్పారు. అయితే రిటైల్ ఆస్తుల కొనుగోలుకి రిలయన్స్ ఇండస్ట్రీస్ సన్నద్దంగా ఉన్నదని తెలియజేశారు. అమెరికన్ బిగ్బ్రదర్ వంటి కంపెనీ దేశీ బిజినెస్ డీల్స్ను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఉన్నదని వ్యాఖ్యానించారు. కాగా.. అమెజాన్.. అమెరికన్ బిగ్ బ్రదర్ లేదా ఈస్ట్ఇండియా కంపెనీ కాదని దీనికి సమాధానంగా అమెజాన్ తరఫున వాదిస్తున్న మాజీ అటార్నీ జనరల్ గోపాల్ సుబ్రమణ్యం కోర్టుకు తెలియజేశారు. నిజానికి ఫ్యూచర్ గ్రూప్లో ఇన్వెస్టర్గా ఆర్థికంగా ఆదుకునేందుకే అమెజాన్ చూసినట్లు పేర్కొన్నారు. దేశీయంగా అమెజాన్ 6.5 బిలియన్ డాలర్లు వెచ్చించడం ద్వారా వేలకొద్దీ ఉద్యోగాల కల్పనను చేసినట్లు ఈ సందర్భంగా కోర్టుకు తెలియజేశారు. కాగా.. దివాళా పరిస్థితుల నుంచి ఫ్యూచర్ గ్రూప్ను రక్షించాలంటే వీలైనంత త్వరగా డీల్కు అనుమతి లభించవలసి ఉన్నట్లు రిలయన్స్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. -
సీసీఐ ఓకే: ఆర్ఐఎల్, ఫ్యూచర్ షేర్లు గెలాప్
ముంబై, సాక్షి: రిటైల్ బిజినెస్ల విక్రయానికి రిలయన్స్ ఇండస్ట్రీస్తో కుదుర్చుకున్న ఒప్పందానికి కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో ఫ్యూచర్ గ్రూప్ కౌంటర్లకు ఒక్కసారిగా డిమాండ్ పుట్టింది. ఈ బాటలో రిలయన్స్ రిటైల్ ద్వారా ఫ్యూచర్ గ్రూప్ ఆస్తుల కొనుగోలుకి డీల్ కుదుర్చుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ కౌంటర్లన్నీ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. అప్పర్ సర్క్యూట్స్ ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఫ్యూచర్ గ్రూప్లోని పలు లిస్టెడ్ కంపెనీల షేర్లు అప్పర్ అనుమతించినమేర అప్పర్ సర్య్యూట్లను తాకాయి. కొనుగోలుదారులు అధికంకాగా.. అమ్మేవాళ్లు కరువుకావడంతో ఫ్యూచర్ రిటైల్ షేరు 10 శాతం జంప్చేసింది. రూ. 79 ఎగువన ఫ్రీజయ్యింది. ఫ్యూచర్ లైఫ్స్టైల్ ఫ్యాషన్స్ సైతం 10 శాతం లాభపడి రూ. 90.5 వద్ద నిలిచింది. ఈ బాటలో ఫ్యూచర్ సప్లై చైన్ సొల్యూషన్స్ 5 శాతం పురోగమించి రూ. 103 సమీపంలో ఫ్రీజయ్యింది. ఇదే విధంగా ఫ్యూచర్ కన్జూమర్ 5 శాతం పెరిగి రూ. 8.25 వద్ద, ఫ్యూచర్ ఎంటర్ప్రైజ్ 5 శాతం పుంజుకుని రూ. 10.40 వద్ద ఫ్రీజయ్యాయి. ఇక డైవర్సిఫైడ్ దిగ్గజం ఆర్ఐఎల్ షేరు 3.2 శాతం బలపడి రూ. 1,959 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1,970 వరకూ ఎగసింది. కాగా.. ఆర్ఐఎల్తో ఫ్యూచర్ గ్రూప్ కుదుర్చుకున్న ఒప్పందానికి ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. డీల్ను నిలిపివేయమంటూ భాగంగా సింగపూర్ ఆర్బిట్రేషన్ కోర్టులో ఫిర్యాదు చేసింది. తద్వారా తాత్కాలిక ఉత్తర్వులను సైతం పొందింది. ఫ్యూచర్ గ్రూప్నకు చెందిన రిటైల్, హోల్సేల్, లాజిస్టిక్స్ తదితర బిజినెస్ల కొనుగోలుకి రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 24,713 కోట్లకు ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. -
ఫ్యూచర్ గ్రూప్ ఫ్యూచర్.. కత్తిమీద సాము!
ముంబై: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)కు రిటైల్ బిజినెస్ల విక్రయం ప్రస్తుతానికి డోలాయమానంలో పడటంతో ఫ్యూచర్ గ్రూప్ దిక్కుతోచని పరిస్థితికి చేరినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. రిటైల్ బిజినెస్లను ఆర్ఐఎల్కు విక్రయించేందుకు ఫ్యూచర్ గ్రూప్ 3.4 బిలియన్ డాలర్లకు ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ డీల్ కుదర్చుకోవడంలో ఫ్యూచర్ గ్రూప్ నిబంధనలు ఉల్లంఘించిందంటూ అమెజాన్ గ్రూప్ సింగపూర్ ఆర్బిట్రేటర్ కోర్టును ఆశ్రయించింది. దీంతో తాత్కాలికంగా డీల్ను నిలిపివేయమంటూ సింగపూర్ ఆర్బిట్రేటర్ అక్టోబర్లో ఫ్యూచర్ గ్రూప్ను ఆదేశించిన విషయం విదితమే. చదవండి: (చిన్న షేర్ల దన్ను- స్మాల్ క్యాప్ రికార్డ్) ఏం జరిగిందంటే.. గతేడాది ఫ్యూచర్ గ్రూప్లోని అన్లిస్టెడ్ కంపెనీలలో 49 శాతం వాటాను యూఎస్ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ కొనుగోలు చేసింది. తద్వారా గ్రూప్లోని ప్రధాన లిస్టెడ్ కంపెనీ ఫ్యూచర్ రిటైల్లో వాటా కొనుగోలుకి తమకు హక్కు ఉన్నదంటూ వాదిస్తోంది. అయితే నిబంధనలకు అనుగుణంగానే ఆర్ఐఎల్తో డీల్ కుదుర్చుకున్నట్లు ఫ్యూచర్ గ్రూప్ వాదిస్తోంది. రుణభారంతో సవాళ్లు ఎదుర్కొంటున్న ఫ్యూచర్ గ్రూప్ మార్చిలో లాక్డవున్ల విధింపు నేపథ్యంలో ఆర్థికంగా మరింత ఇబ్బందుల్లో చిక్కుకుంది. దీంతో రిటైల్ ఆస్తుల విక్రయానికి ఆర్ఐఎల్తో డీల్ కుదుర్చుకుంది. చదవండి: (ఐషర్ మోటార్స్- ఐబీ రియల్టీ.. హైజంప్) ఆకర్షణీయ మార్కెట్ దేశీయంగా ట్రిలియన్ డాలర్ల విలువైన కన్జూమర్ రిటైల్ మార్కెట్లో పాగా వేసేందుకు ఇప్పటికే అమెజాన్, ఆర్ఐఎల్, వాల్మార్ట్(ఫ్లిప్కార్ట్) తదితర దిగ్గజాలు పావులు కదుపుతున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ బిజినెస్ కొనుగోలుకి రిలయన్స్ గ్రూప్ ఆసక్తి చూపింది. తద్వారా రిలయన్స్ రిటైల్ బిజినెస్కు బూస్ట్ లభించే వీలుంటుందని భావించింది. అయితే దేశీ రిటైల్ మార్కెట్లో భారీ వాటాపై కన్నేసిన అమెజాన్ గ్రూప్.. ఈ డీల్ నిబంధనలకు విరుద్ధమంటూ ఫ్యూచర్ గ్రూప్నకు వ్యతిరేకంగా సింగపూర్ ఆర్బిట్రేషన్ కోర్టుకు ఫిర్యాదు చేసింది. తద్వారా అక్టోబర్ 25న డీల్ను తాత్కాలికంగా నిలిపివేయమంటూ ఆర్బిట్రేటర్ కోర్టు నుంచి ఎమర్జెన్సీ ఆదేశాలను సాధించింది. ఈ అంశంపై దేశీయంగా కాంపిటీషన్ కమిషన్ను సైతం ఆశ్రయించింది. నిజానికి అమెజాన్ మే నెలలో ఫ్యూచర్ గ్రూప్లో మరింత వాటా కొనుగోలుకి ఆసక్తి చూపి విఫలమైనట్లు వార్తలు వెలువడ్డాయి. డీల్పై ఆశలు అమెజాన్తో తలెత్తిన న్యాయవివాదాలను స్థానిక చట్టాల ద్వారా పరిష్కరించుకునే యోచనలో ఉన్నట్లు ఫ్యూచర్ గ్రూప్ ఇప్పటికే పేర్కొంది. ఆర్ఐఎల్ సైతం వీలైనంత త్వరగా ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ ఆస్తుల కొనుగోలును చేపట్టే వీలున్నట్లు సంకేతాలిచ్చింది. అమెజాన్తో అన్లిస్టెడ్ గ్రూప్ సంస్థల కాంట్రాక్టుకు రిటైల్ ఆస్తుల విక్రయానికి సంబంధంలేదంటూ ఫ్యూచర్ గ్రూప్ న్యాయనిపుణులు వాదిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రెండు సంస్థలూ ఫ్యూచర్ గ్రూప్లో భాగమేనని, ఒకే యాజమాన్య నిర్వహణలో ఉన్నాయని అమెజాన్ న్యాయనిపుణులు పేర్కొంటున్నట్లు సంబంధితవర్గాలు తెలియజేశాయి. కాగా.. ఆర్ఐఎల్తో డీల్ విఫలమైతే ఫ్యూచర్ గ్రూప్నకు చెల్లింపుల సమస్యలు ఎదురుకాగలవని, పలువురు ఉపాధి కోల్పోయే ప్రమాదమున్నదని మరికొంతమంది నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది మొదట్లోనే ఫ్యూచర్ గ్రూప్ రుణ చెల్లింపుల సమస్యలు ఎదుర్కొన్నట్లు ప్రస్తావిస్తున్నారు. కోవిడ్-19 ప్రభావం, ప్రత్యర్ధుల నుంచి తీవ్ర పోటీ తదితర ప్రతికూలతలతో అమ్మకాలు పడిపోగా.. వరుసగా రెండు త్రైమాసికాలలో ఫ్యూచర్ గ్రూప్ భారీ నష్టాలను నమోదు చేసింది. దీంతో గ్రూప్లోని షేర్లు 80 శాతం వరకూ పతనమయ్యాయి. కాగా.. నేడు ఫ్యూచర్ రిటైల్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసిక(జులై- సెప్టెంబర్) ఫలితాలను ప్రకటించనుండటం గమనార్హం! -
ఫ్యూచర్ గ్రూప్ స్టాక్స్- అమెజాన్ షాక్
డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)తో కుదుర్చుకున్న డీల్ను ప్రస్తుతానికి నిలిపివేయవలసిందిగా ఫ్యూచర్ గ్రూప్ను సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్(ఎస్ఐఏసీ) ఆదేశించడంతో ఈ గ్రూప్లోని షేర్లు అమ్మకాల ఒత్తిడిలో పడ్డాయి. దాదాపు ఫ్యూచర్ గ్రూప్ షేర్లన్నీ 5 శాతం లోయర్ సర్క్యూట్ను తాకాయి. పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు సైతం 2 శాతం వెనకడుగుతో రూ. 2,072 దిగువన ట్రేడవుతోంది. ఒక దశలో రూ. 2,065 వరకూ క్షీణించింది. పతన బాటలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఫ్యూచర్ సప్లై చైన్ సొల్యూషన్స్ 5 శాతం డౌన్ సర్క్యూట్ను తాకి రూ. 91 వద్ద నిలవగా.. ఫ్యూచర్ రిటైల్ తొలుత 9 శాతం పతనమై రూ. 71.20 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరింది.ప్రస్తుతం 2.6 శాతం నీరసించి రూ. 76 దిగువన ట్రేడవుతోంది. ఈ బాటలో ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ 5 శాతం కోల్పోయి రూ. 9.50 వద్ద, ఫ్యూచర్ మార్కెట్ నెట్వర్క్స్ 5 శాతం పతనమై రూ. 15.20 వద్ద ఫ్రీజయ్యాయి. ఇదే విధంగా ఫ్యూచర్ కన్జూమర్ 5 శాతం క్షీణించి రూ. 7.50 వద్ద నిలిచింది. న్యాయ సలహా.. ఎస్ఐఏసీ ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను పరిశీలిస్తున్నామని, వీటిపై న్యాయసలహాలను తీసుకోనున్నట్లు కిశోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూప్ తాజాగా పేర్కొంది. రిటైల్ ఆస్తుల విక్రయానికి ముకేశ్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్తో రూ. 24,713 కోట్లకు ఫ్యూచర్ గ్రూప్.. డీల్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా అమెజాన్ దాఖలు చేసిన పిటిషన్పై ఎస్ఐఏసీ సానుకూలంగా స్పందించింది. ఒప్పందాన్ని నిలిపివేయమంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఫ్యూచర్ గ్రూప్ ఇంతక్రితం తమతో కుదుర్చుకున్న ఒప్పందానికి ఈ డీల్ విరుద్ధమైనదంటూ అమెజాన్ ఎస్ఐఏసీకి నివేదించింది. -
అమెజాన్కు భారీ ఊరట : రిలయన్స్ డీల్కు బ్రేక్
సాక్షి, న్యూఢిల్లీ : ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్కు భారీ ఊరట లభించింది. బిలియనీర్ ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్) తాజాగా కిషోర్ బియానీ ప్రమోటింగ్ కంపెనీ ఫ్యూచర్ గ్రూప్ కొనుగోలు డీల్కు బ్రేక్ పడింది. ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా అమెజాన్ దాఖలు చేసుకున్నఅభ్యర్థనపై సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ (ఎస్ఐఏసీ) సానుకూలంగా స్పందించింది. ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా అమెజాన్కు తాత్కాలిక ఊరట లభించింది. తాజా పరిణామంతో ఫ్యూచర్ గ్రూపు కొనుగోలుకు ప్రయత్నించిన ఆర్ఆర్వీఎల్ కంపెనీకి చుక్కెదురైంది. ఒప్పందాన్ని నిలిపివేస్తూ ఎస్ఐఏసీ మధ్యంతర ఆదేశాలిచ్చింది. ఆర్ఆర్వీఎల్, ఫ్యూచర్ గ్రూప్నకు చెందిన రిటైల్, హోల్సేల్ వ్యాపారాలతోపాటు, లాజిస్టిక్స్, వేర్హౌజింగ్ విభాగాల కొనుగోలుకు 24,713 కోట్లు రూపాయల ఒప్పందం చేసుకుంది. అయితే ఫ్యూచర్ గ్రూప్ తమతో కుదుర్చుకున్న ఒప్పందానికి ఈ డీల్ విరుద్ధమైనదంటూ అమెజాన్ వ్యతిరేకించింది. దీనికి సంబంధించి ఫ్యూచర్ గ్రూప్లో భాగమైన ఫ్యూచర్ కూపన్స్కు లీగల్ నోటీసులు పంపించింది. ఈ డీల్ను నిలుపుదల చేయాలని కోరింది. దీనిపై సింగపూర్ కేంద్రంగా ఉన్న సింగిల్-జడ్జ్ ఆర్బిట్రేషన్ ప్యానెల్ సానుకూలంగా స్పందించింది. ముఖ్యంగా గతేడాది ఆగస్టులో ఫ్యూచర్స్ కూపన్స్లో 49 శాతం వాటాలను ప్రమోటర్ల నుంచి కొనుగోలు చేసింది అమెజాన్ అప్పట్లో ఫ్యూచర్ రిటైల్ సంస్థలో ఫ్యూచర్ కూపన్స్కు 7.3 శాతం వాటాలు ఉండేవి. ఒప్పంద నిబంధనల ప్రకారం మూడేళ్ల తర్వాత నుంచి పదేళ్ల లోపున ప్రమోటర్కు చెందిన వాటాలను పూర్తిగా లేదా పాక్షికంగా కొనుగోలు చేసేందుకు అమెజాన్కు అధికారం ఉంది. ఈ నేపథ్యంలో రిలయన్స్ ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందాన్ని నిలిపివేయాలని కోరుతూ అమోజాన్ కోర్టును ఆశ్రయించింది. మరోవైపు ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించు కోవాలని ఫ్యూచర్ గ్రూప్ భావిస్తున్నట్లు సమాచారం. రిలయన్స్ రీటైల్ స్పందన మరోవైపు ఈ పరిణామంపై రిలయన్స్ రీటైల్ అధికారికంగా స్పందించింది. దేశీయ చట్టాలకనుగుణంగానే, ఫ్యూచర్ గ్రూపునకు, ఆర్ఆర్వీఎల్ డీల్ ఉందని ఒక ప్రకటనలో తెలిపింది. సాధ్యమైనంత తొందరగా ఈ ఒప్పందాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నట్టు స్పష్టం చేసింది. -
వివాదంలో రిలయన్స్ - ఫ్యూచర్స్ డీల్
సాక్షి, న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ట్రీస్కు ఫ్యూచర్ గ్రూప్ అసెట్ల విక్రయ అంశం వివాదానికి దారి తీసింది. ఫ్యూచర్ గ్రూప్ తమతో కుదుర్చుకున్న ఒప్పందానికి ఈ డీల్ విరుద్ధమైనదంటూ అమెరికన్ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ (సియాక్)ను ఆశ్రయించింది. నిబంధనల ఉల్లంఘనకు గాను ఫ్యూచర్ గ్రూప్లో భాగమైన ఫ్యూచర్ కూపన్స్కు లీగల్ నోటీసులు పంపింది. ‘కాంట్రాక్టు ప్రకారం మా హక్కులు కాపాడుకునేందుకు చర్యలు తీసుకున్నాం. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున వివరాలను వెల్లడించలేం’ అని అమెజాన్ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు, ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్లు ఫ్యూచర్ గ్రూప్ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి అసెట్స్ విక్రయానికి సంబంధించి ఇతర వ్యాపార సంస్థలతో పాటు అమెజాన్కు కూడా ఫ్యూచర్ గ్రూప్ ఆఫర్ ఇచ్చిందని, అది తిరస్కరించిన తర్వాతే రిలయన్స్తో ఒప్పందం కుదుర్చుకుందని పేర్కొన్నాయి. పైగా ఎఫ్డీఐ నిబంధనలు, ఫ్యూచర్ గ్రూప్లో తదుపరి పెట్టుబడులు పెట్టే హక్కులు మూడేళ్ల తర్వాతే అమెజాన్కు దఖలు పడనుండటం కూడా ఫ్యూచర్ సంస్థల్లో ఆ కంపెనీ ఇన్వెస్ట్మెంట్కు ప్రతిబంధకాలని వివరించాయి. వివరాల్లోకి వెడితే.. అమెజాన్ డాట్కామ్ గతేడాది ఆగస్టులో ఫ్యూచర్స్ కూపన్స్లో 49 శాతం వాటాలను ప్రమోటర్ల నుంచి కొనుగోలు చేసింది. అప్పట్లో ఫ్యూచర్ రిటైల్ సంస్థలో ఫ్యూచర్ కూపన్స్కు 7.3 శాతం వాటాలు ఉండేవి. ఒప్పంద నిబంధనల ప్రకారం మూడేళ్ల తర్వాత నుంచి పదేళ్ల లోపున ప్రమోటర్కు చెందిన వాటాలను పూర్తిగా లేదా పాక్షికంగా కొనుగోలు చేసేందుకు అమెజాన్కు అధికారాలు లభిస్తాయి. మరోవైపు, తన రిటైల్, హోల్సేల్, లాజిస్టిక్స్, వేర్హౌసింగ్ విభాగాలను రిలయన్స్కి విక్రయించేందుకు ఫ్యూచర్ గ్రూప్ ఈ ఏడాది ఆగస్టులో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి ఇంకా నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు రావాల్సి ఉంది. ఈ డీల్ విలువ దాదాపు రూ. 24,713 కోట్లు. రిలయన్స్ గ్రూప్లో భాగమైన రిలయన్స్ రిటైల్ కేవలం నాలుగు వారాల వ్యవధిలోనే రూ. 37,700 కోట్ల పెట్టుబడులు సమీకరించి దూసుకెడుతున్న తరుణంలో ఫ్యూచర్-అమెజాన్ మధ్య వివాదం ప్రాధాన్యం సంతరించుకుంది. -
ఫ్యూచర్ గ్రూప్ షేర్లకు ఆర్ఐఎల్ జోష్
దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)తో డీల్ కుదుర్చుకున్న నేపథ్యంలో ఫ్యూచర్ గ్రూప్ కౌంటర్లకు ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో 20-5 శాతం మధ్య జంప్చేశాయి. లడఖ్ తూర్పు ప్రాంతంలో సరిహద్దు వద్ద చైనా బలగాలతో తిరిగి సైనిక వివాదాలు తలెత్తినట్లు వెలువడిన వార్తలు మార్కెట్లను ఒక్కసారిగా దెబ్బతీశాయి. అయినప్పటికీ ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ బిజినెస్.. డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్లో చేరనుండటంతో ఈ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. గత కొంత కాలంగా ఈ డీల్పై అంచనాలతో ఫ్యూచర్ గ్రూప్ షేర్లలో ర్యాలీ కొనసాగుతున్న విషయం విదితమే. షేర్ల జోరు ఆర్ఐఎల్తో డీల్ నేపథ్యంలో అమ్మకందారులు కరువుకావడంతో ప్రస్తుతం ఫ్యూచర్ గ్రూప్ లిస్టెడ్ కంపెనీలన్నీ అప్పర్ సర్క్యూట్లను తాకాయి. ఎన్ఎస్ఈలో ఫ్యూచర్ రిటైల్ 20 శాతం దూసుకెళ్లి రూ. 162కు చేరగా.. ఫ్యూచర్ లైఫ్స్టైల్ ఫ్యాషన్స్ 5 శాతం జంప్చేసి రూ. 153ను చేరింది. ఇతర కౌంటర్లలో ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ 5 శాతం ఎగసి రూ. 21 వద్ద, ఫ్యూచర్ సప్లై చైన్ సొల్యూషన్స్ 5 శాతం బలపడి రూ. 159 వద్ద ట్రేడవుతున్నాయి. ఈ బాటలో ఫ్యూచర్ మార్కెట్ నెట్వర్క్స్ 5 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకి రూ. 28 వద్ద ఫ్రీజయ్యింది. ఇక ఫ్యూచర్ కన్జూమర్ 5 శాతం పుంజుకుని రూ. 12 వద్ద కదులుతోంది. రూ. 24,713 కోట్లు వారాంతాన కుదర్చుకున్న డీల్లో భాగంగా ఫ్యూచర్ రిటైల్కు చెందిన రిటైల్, హోల్సేల్ బిజినెస్లతోపాటు.. లాజిస్టిక్స్, వేర్హౌసింగ్ విభాగాలను ఆర్ఐఎల్ రూ. 24,713 కోట్లకు సొంతం చేసుకోనుంది. సూపర్ మార్కెట్ చైన్ బిగ్బజార్సహా.. ఫుడ్హాల్, క్లాతింగ్ చైన్ బ్రాండ్ ఫ్యాక్టరీలను ఫ్యూచర్ గ్రూప్ నిర్వహిస్తోంది. వివిధ విభాగాల నిర్వహణకు ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్, ఫ్యూచర్ రిటైల్, ఫ్యూచర్ కన్జూమర్, ఫ్యూచర్ లైఫ్స్టైల్ ఫ్యాషన్స్, ఫ్యూచర్ సప్లైచైన్ సొల్యూషన్స్ను కిశోర్ బియానీ ఫ్యూచర్ గ్రూప్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. -
రిలయన్స్ చేతికి ‘ఫ్యూచర్’ రిటైల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యాపార దిగ్గజం ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో బ్లాక్బస్టర్ డీల్కు తెరలేపింది. సంస్థ అనుబంధ కంపెనీ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్) తాజాగా కిషోర్ బియానీ ప్రమోట్ చేస్తున్న ఫ్యూచర్ గ్రూప్నకు చెందిన రిటైల్, హోల్సేల్ వ్యాపారాలతోపాటు, లాజిస్టిక్స్, వేర్హౌజింగ్ విభాగాలను కొనుగోలు చేయనున్నట్టు శనివారం ప్రకటించింది. ఈ డీల్ విలువ రూ.24,713 కోట్లు. ఫ్యూచర్ గ్రూప్లో భాగమైన 1,800లకుపైగా బిగ్బజార్, ఎఫ్బీబీ, ఈజీడే, సెంట్రల్, ఫుడ్హాల్ స్టోర్లు దేశవ్యాప్తంగా 420లకు పైచిలుకు నగరాల్లో విస్తరించాయి. వీటిని వినియోగించుకునేందుకు రిలయన్స్కు మార్గం లభించింది. రిలయన్స్ రిటైల్ వ్యాపారాల విస్తరణ వేగంగా జరిగేందుకు, పోటీ కంపెనీలకు ధీటుగా ఈ–కామర్స్ రంగంలో పట్టు సాధించేందుకు ఈ లావాదేవీ దోహదం చేయనుంది. ఇక డీల్లో భాగంగా రిటైల్, హోల్సేల్ వ్యాపారాలు ఆర్ఆర్వీఎల్కు చెందిన రిలయన్స్ రిటైల్ అండ్ ఫ్యాషన్ లైఫ్స్టైల్ లిమిటెడ్కు బదిలీ అవుతాయి. అలాగే లాజిస్టిక్స్, వేర్హౌజింగ్ విభాగాలు ఆర్ఆర్వీఎల్కు బదిలీ చేస్తారు. ఫ్యూచర్ గ్రూప్నకు చెందిన పేరొందిన ఫార్మాట్స్, బ్రాండ్స్కు ఒక వేదిక ఇవ్వడం ఆనందంగా ఉందని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ డైరెక్టర్ ఇషా అంబానీ ఈ సందర్భంగా తెలిపారు. కోవిడ్, ఆర్థిక పరిస్థితుల మూలంగా తలెత్తిన సవాళ్లకు.. పునర్వ్యవస్థీకరణ, తాజా లావాదేవీ ఫలితంగా సంస్థకు సంపూర్ణ పరిష్కారం లభిస్తుందని ఫ్యూచర్ గ్రూప్ సీఈవో కిషోర్ బియానీ వ్యాఖ్యానించారు -
రిలయన్స్ సామ్రాజ్యంలోకి ఫ్యూచర్ గ్రూప్..
ముంబై: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తన వ్యూహలతో రిలయన్స్ ఇండస్ట్రీస్ను ప్రపంచ వ్యాప్త దిగ్గజ కంపెనీగా తీర్చిదిద్దాడు. తాజాగా ప్యూచర్ గ్రూప్ను కొనుగోలు చేసినట్లు శనివారం రిలయన్స్ ప్రకటించింది. కాగా ప్యూచర్ గ్రూప్కు చెందిన వేర్హౌస్, హోల్సేల్, లాజిస్టిక్, రిటైల్ బిజినెస్ తదితర విభాగాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ సొంతం చేసుకుంది. అయితే ప్యూచర్ గ్రూప్ను కొనుగోలు చేయడానికి డీల్ విలువ రూ.24,713 కోట్లు కుదుర్చుకున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. అయితే ఫ్యూచర్ గ్రూప్ విభాగాలైన ఫాషన్ లైఫ్ స్టైల్ తదితర బ్రాండ్స్ రిలయెన్స్ రిటైల్ వెంచర్లోకి రానున్నాయి. కాగా భారీ స్థాయిలో వ్యాపారాన్ని విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నామని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ డైరక్టర్ ఇషా అంబానీ తెలిపింది. తాజా కొనుగోలుతో దాదాపుగా 1800 రిటైల్స్ స్టోర్స్ రిలయన్స్ స్వంతం కానున్నాయి. మరోవైపు రిలయన్స్ కొనుగోలు చేసిన ఫ్యూచర్ గ్రూప్ బిగ్ బజార్, ఈజీ డే, ఎఫ్బీబీ, సెంట్రల్, ఫుడ్ హాల్స్ లాంటి ఫార్మాట్లను దేశవ్యాప్తంగా 420 పట్టణాల్లో నిర్వహిస్తుందని ఇషా అంబానీ పేర్కొంది. -
ముకేశ్ చేతికి ఫ్యూచర్ గ్రూప్ రిటైలింగ్!
కిశోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూప్ శనివారం బోర్డు సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో రిటైల్ బిజినెస్ను బిలియనీర్ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్కు విక్రయించే ప్రతిపాదనను పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్తో నగదు రూపేణా డీల్ కుదుర్చుకోనున్నట్లు పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. డీల్ విలువ రూ. 30,000 కోట్లవరకూ ఉండొచ్చని అంచనా వేస్తున్నాయి. ఇతర వివరాలు చూద్దాం.. ఒకే సంస్థగా.. రుణ భారంతో కొద్ది రోజులుగా సవాళ్లు ఎదుర్కొంటున్న ఫ్యూచర్ గ్రూప్ ఇటీవల రిలయన్స్ ఇండస్ట్రీస్తో చర్చలు నిర్వహిస్తున్న విషయం విదితమే. తద్వారా రిటైల్ బిజినెస్ను ముకేశ్ అంబానీ గ్రూప్ దిగ్గజం ఆర్ఐఎల్కు విక్రయించనున్నట్లు తెలుస్తోంది. డీల్పై అంచనాలు ఎలా ఉన్నాయంటే.. తొలుత గ్రోసరీ, దుస్తులు, సప్లై చైన్, కన్జూమర్ బిజినెస్లతో కూడిన ఐదు లిస్టెడ్ కంపెనీలు ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్లో విలీనం కానున్నాయి. ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ ప్రస్తుతం గ్రూప్నకు చెందిన రిటైల్ బ్యాకెండ్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వెరసి ఫ్యూచర్ రిటైల్, లైఫ్స్టైల్, సప్లై చైన్, మార్కెట్స్ కంపెనీలు ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్లో విలీనంకానున్నట్లు అంచనా. విలీనం తదుపరి మొత్తం రిటైల్ ఆస్తులను ఒకే యూనిట్గా ఆర్ఐఎల్కు విక్రయించనుంది. చెల్లింపులు ఇలా! పరిశ్రమవర్గాల అంచనా ప్రకారం రిలయన్స్ తొలుత రూ. 13,000 కోట్లను ఫ్యూచర్ గ్రూప్ రుణ చెల్లింపులకు కేటాయించనుంది. మరో రూ. 7,000 కోట్లను భూయజమానులు, వెండార్స్కు చెల్లించనుంది. మరో రూ. 7,000 కోట్లవరకూ ప్రమోటర్ గ్రూప్నకు విడుదల చేసే అవకాశముంది. తదుపరి దశలో రూ. 3,000 కోట్లు వెచ్చించడం ద్వారా ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్లో 16 శాతం వరకూ వాటాను సొంతం చేసుకోనుంది. ఫ్యూచర్ కన్జూమర్కు చెందిన ఎఫ్ఎంసీజీ ప్రొడక్టులు, టెక్స్టైల్ మిల్స్, బీమా విభాగాలను ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ కలిగి ఉండవచ్చని అంచనా. ఫుడ్, ఫ్యాషన్ సరఫరాలకు వీలుగా ఆర్ఐఎల్తో దీర్ఘకాలిక ఒప్పందాన్ని ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ కుదుర్చుకోనుంది. ఈ వివరాలపై రెండు కంపెనీలూ స్పందించేందుకు నిరాకరించినట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. షేర్ల జోరు బోర్డు సమావేశం నేపథ్యంలో ప్రస్తుతం ఫ్యూచర్ గ్రూప్ లిస్టెడ్ కంపెనీలన్నీ లాభాలతో పరుగు తీస్తున్నాయి. ఎన్ఎస్ఈలో ఫ్యూచర్ రిటైల్ 4.3 శాతం జంప్చేసి రూ. 136కు చేరగా.. ఫ్యూచర్ లైఫ్స్టైల్ ఫ్యాషన్స్ 4.7 శాతం ఎగసి రూ. 145ను అధిగమించింది. ఇతర కౌంటర్లలో ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ 2 శాతం ఎగసి రూ. 19.6 వద్ద, ఫ్యూచర్ సప్లై చైన్ సొల్యూషన్స్ 2 శాతం బలపడి రూ. 151 వద్ద ట్రేడవుతున్నాయి. ఈ బాటలో ఫ్యూచర్ మార్కెట్ నెట్వర్క్స్ 5 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకి రూ. 26.65 వద్ద ఫ్రీజయ్యింది. ఇక ఫ్యూచర్ కన్జూమర్ 2 శాతం పుంజుకుని రూ. 11.15 వద్ద కదులుతోంది. -
‘బ్రాండ్’ మోత తగ్గిపోయింది
ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ నుంచి ‘వివో’ తప్పుకోవడంలో భారత్–చైనా సంబంధాలు కీలక పాత్ర పోషించాయనేది బయటకు కనిపిస్తోంది. అయితే ఒకవేళ అది కారణం కాకుండా ఉంటే... ప్రస్తుత కరోనా సంక్షోభంలో ఏడాదికి ‘వివో’ రూ. 440 కోట్లు చెల్లించేదా లేక దానిని తగ్గించమని బీసీసీఐని కోరేదా అనేది కూడా చర్చనీయాంశం. ఎందుకంటే రూ. 222 కోట్లు మాత్రమే ఇచ్చి డ్రీమ్ ఎలెవన్ ఇప్పుడు ఐపీఎల్తో జత కట్టడం చూస్తే ఆర్థికపరంగా పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. ఇది టైటిల్ స్పాన్సర్షిప్కే పరిమితం కాలేదని ఫ్రాంచైజీలు కూడా తక్కువ మొత్తాలకే హక్కులు ఇస్తున్నట్లు కూడా తెలుస్తోంది. –సాక్షి క్రీడా విభాగం ఢిల్లీ క్యాపిటల్స్ (గతంలో ఢిల్లీ డేర్డెవిల్స్) జట్టుకు 2015 నుంచి జపాన్కు చెందిన ప్రఖ్యాత ఎయిర్ కండిషనర్ కంపెనీ ‘డైకిన్’ స్పాన్సర్గా ఉంటూ వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా ఢిల్లీ జట్టుతో తమ అనుబంధం కొనసాగుతుందని వారు ప్రకటించారు. ఇంతలో కరోనా వచ్చి ప్రపంచాన్ని కుమ్మేసింది. గత వారం ‘డైకిన్’ తాము ఐపీఎల్ టీమ్ స్పాన్సర్షిప్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ప్రిన్సిపల్ స్పాన్సర్గా ‘డైకిన్’ చాలా తక్కువ మొత్తం ఇవ్వజూపిందని, దానికి ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం అంగీకరించలేదని తెలిసింది. సొంత కంపెనీ పేరుతోనే... ‘డైకిన్’ తప్పుకున్న తర్వాత ఇంత తక్కువ వ్యవధిలో మరో స్పాన్సర్ను ఢిల్లీ క్యాపిటల్స్ వెతుక్కునే ప్రయత్నం చేయలేదు. పైగా ఇతర కంపెనీలు కూడా చాలా తక్కువ మొత్తాలనే ఆఫర్ చేశాయనేది మార్కెట్ వర్గాల సమాచారం. దాంతో ఈ టీమ్ యజమానుల్లో ఒకరైన ‘జిందాల్ గ్రూప్’ తమ జేఎస్డబ్ల్యూ పేరుతోనే ఢిల్లీ టీమ్ జెర్సీ ముందు భాగంలో కనిపించేలా ప్రిన్సిపల్ స్పాన్సర్గా ఉండేందుకు సిద్ధమైంది. జీఎంఆర్ గ్రూప్ ఈ టీమ్కు మరో యజమాని. స్పాన్సర్లకు భారీ డిస్కౌంట్లు ఇచ్చి ఆకట్టుకోవడం తమకు కష్టంగా మారిందని, దానికంటే తమ కంపెనీకే ప్రచారం వచ్చేలా సిద్ధపడటం మంచిదని భావించినట్లు జిందాల్ గ్రూప్ ఎండీ పార్థ్ జిందాల్ వెల్లడించారు. క్యాపిటల్స్ సహ యజమానుల మధ్య ఎలాంటి ఒప్పందం కుదిరిందో, బయటి స్పాన్సర్ తరహాలోనే జేఎస్డబ్ల్యూ కూడా కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుందో ఎవరికీ తెలియని అంతర్గత వ్యవహారం కానీ... ఒక ఐపీఎల్ టీమ్కు స్పాన్సర్ చేయడంలో కంపెనీలు వెనకడుగు వేయడం మాత్రం అనూహ్యమే. తప్పనిసరి పరిస్థితుల్లోనే... లీగ్లో పాల్గొంటున్న జట్లకు ఐపీఎల్ కాకుండా సాధారణంగా ఇతర వ్యాపార వ్యవహారాలు దాదాపు అందరికీ ఉంటాయి. అయినా సరే లీగ్ సమయంలో ప్రతీ జట్టు తమ బ్రాండ్ను ప్రమోట్ చేసుకోవాలని ప్రయత్నించదు. భారీ మొత్తానికి ప్రిన్సిపల్, ఇతర స్పాన్సర్షిప్ హక్కులు అమ్మి లీగ్లో ఖర్చు పెట్టాల్సిన డబ్బును లీగ్ ద్వారానే సంపాదించే ప్రయత్నం చేస్తుంది. ‘ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఒక్క ఐపీఎల్ సీజన్లో కూడా తమ సొంత బ్రాండ్ను ప్రధాన స్పాన్సర్గా ప్రదర్శించలేదు. చివరకు ‘జియో’ వచ్చిన సమయంలో కూడా సహ భాగస్వామిగా ఇతర జట్లకు ఉన్నారే తప్ప తమ టీమ్కు మాత్రం దానిని వాడుకోలేదు. తమ టీమ్ విలువను చూపించి స్పాన్సర్లను ఆకర్షించిన విషయం మరచిపోవద్దు. అదే నిజమైన వ్యాపార వ్యూహం. కాబట్టి స్పాన్సర్షిప్కు కంపెనీలు వెనక్కి తగ్గడం, సొంత బ్రాండ్ను పెట్టుకోవాల్సి రావడం అంటే అది వైఫల్యం కిందనే లెక్క’ అని ప్రకటనల రంగ నిపుణుడొకరు వ్యాఖ్యానించారు. అదీ కారణం... కరోనా సమయంలో ఆర్థికపరమైన ఇబ్బందులతో పాటు వారు ఆశించే విధంగా తగినంత ప్రచారం ఈసారి దక్కే అవకాశం లేకపోవడం కూడా ముందుకు రాకపోవడానికి కారణమైంది. దేశ రాజధాని కేంద్రంగా ఉన్న జట్టుకు మంచి ప్రచారం లభించడం ఖాయం. జట్టు వరుసగా విఫలమవుతున్నా (ఐపీఎల్లో ఒక్కసారి కూడా ఫైనల్ చేరని జట్టు ఢిల్లీ ఒక్కటే) ఢిల్లీకి స్పాన్సర్ల కొదవ లేకపోవడానికి అదే కారణం. సాధారణంగా టీమ్ స్పాన్సర్ పేరు స్టేడియం అంతగా ప్రదర్శితమవుతుంది. లీగ్ సమయంలో కనీసం 2–3 ప్రచార కార్యక్రమాలు జరుగుతాయి. పెద్ద ఆటగాళ్లు వస్తారు. అభిమానులతో ముచ్చటించే కార్యక్రమాలూ ఎలాగూ ఉంటాయి. స్పాన్సర్ పేరు ఉండే మర్కండైజ్ ద్వారా అదనపు ఆదాయం వస్తుంది. కరోనా కారణంగా యూఏఈకి తరలి పోవడంతో వీటన్నింటిపై ప్రభావం పడింది. అక్కడ ప్రేక్షకులను అనుమతిస్తారా లేదా అనేదానిపై ఇంకా స్పష్టత లేదు కానీ జనం లేకపోతే బ్రాండ్లపై ఎవరి కనీస దృష్టి కూడా పడదు. టీవీలో మ్యాచ్ల ప్రసారం వల్ల నేరుగా టీమ్ స్పాన్సర్లకు పెద్దగా లాభం ఉండదు. ఇప్పుడు ఐపీఎల్ సెంట్రల్ పూల్ స్పాన్సర్షిప్ నుంచి ప్రముఖ సంస్థ ‘ఫ్యూచర్ గ్రూప్’ కూడా తప్పుకుంది. బిగ్ బజార్, ఫుడ్ బజార్ తదితర బ్రాండింగ్లు ఉన్న ఈ సంస్థ ప్రస్తుత పరిస్థితుల్లో ఒక ఐపీఎల్ సీజన్కు రూ. 40 కోట్లు చెల్లించడం భారంగా భావిస్తోంది. ప్రచారం కోసం అంత మొత్తం పెట్టడం అనవసరమని ఫ్యూచర్ గ్రూప్ నిర్ణయించుకుంది. బయటకు వివరంగా చెప్పకపోయినా ప్రతీ ఫ్రాంచైజీ కూడా గతంతో పోలిస్తే తక్కువ మొత్తాలకే స్పాన్సర్షిప్ హక్కులు ఇచ్చినట్లు తెలుస్తోంది. తాము డిమాండ్ చేసే స్థితిలో లేమని, ఎవరూ ముందుకు రాలేదని అనిపించుకోవడం కన్నా ఏదో ఒక సంస్థతో జట్టు కట్టడమే మేలని వారు భావించినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ‘ఇప్పుడు ఐపీఎల్ జరగడమే గొప్ప. మేం అస్సలు లాభ నష్టాల గురించి ఆలోచించడం లేదు. ప్రపంచం అంతా ఎలాంటి పరిస్థితి ఉందో మనకు తెలుసు. రూపాయి లాభం రాకున్నా వచ్చే ఆదాయం ఖర్చులకు సరిపోతే చాలు’ అని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చైర్మన్ సంజీవ్ సురివాలా చెప్పడం మొత్తం ఐపీఎల్ పరిస్థితిని చూపిస్తోంది. వారు చెప్పినట్లు ఇవన్నీ అధిగమించి లీగ్లో విజయంపైనే టీమ్లు దృష్టి పెడతాయనేది వాస్తవం. -
ఫ్యూచర్ లైఫ్స్టైల్- రిటైల్.. పతనం
గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో కిశోర్ బియానీ గ్రూప్ కంపెనీ ఫ్యూచర్ లైఫ్స్టైల్ ఫ్యాషన్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఈ ప్రభావంతో గ్రూప్లోని మరో కీలక కంపెనీ ఫ్యూచర్ రిటైల్ కౌంటర్ సైతం అమ్మకాలతో డీలాపడింది. వివరాలు చూద్దాం.. డౌన్ డౌన్ ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఫ్యూచర్ లైఫ్స్టైల్ ఫ్యాషన్ షేరు 5 శాతం లోయర్ సర్క్యూట్ను తాకింది. రూ. 5.75 కోల్పోయి రూ. 109 వద్ద ఫ్రీజయ్యింది. ఈ బాటలో కొనుగోలుదారులు కరువుకావడంతో ఫ్యూచర్ రిటైల్ షేరు సైతం 5 శాతం డౌన్ సర్క్యూట్లో ఫ్రీజయ్యింది. రూ. 5.50 నష్టంతో రూ. 105 దిగువన నిలిచింది. క్యూ4 వీక్ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ఫ్యూచర్ లైఫ్స్టైల్ రూ. 149 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2018-19) క్యూ4లో రూ. 75 కోట్ల నికర లాభం ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం 4.5 శాతం పెరిగి రూ. 1443 కోట్లకు చేరింది. -
ముకేశ్ చేతికి ఫ్యూచర్ రిటైల్!
బిగ్బజార్ రిటైల్ స్టోర్లను నిర్వహించే ఫ్యూచర్ రిటైల్లో పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ వాటా కొనుగోలు చేయనున్నట్లు మార్కెట్లో అంచనాలు పెరిగాయి. కిశోర్ బియానీ గ్రూప్ కంపెనీ ఫ్యూచర్ రిటైల్.. బిగ్బజార్ బ్రాండ్ హైపర్ మార్కెట్లతోపాటు.. గ్రాసరీ చైన్ ఈజీడే క్లబ్ను సైతం నిర్వహిస్తోంది. బియానీ గ్రూప్ కంపెనీ ఫ్యూచర్ రిటైల్ లిక్విడిటీ ఒత్తిళ్ల కారణంగా గత వారం యూఎస్ డాలర్ బాండ్లపై వడ్డీ చెల్లింపులను మిస్ అయినట్లు తెలుస్తోంది. కంపెనీలో ప్రమోటర్లకు 42 శాతం వాటా ఉంది. కాగా.. జూన్ 30కల్లా ఫ్యూచర్ రిటైల్లో ప్రమోటర్లు తమ వాటాలో 75 శాతం వరకూ తనఖాలో ఉంచినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్యూచర్ రిటైల్లో వాటాను ముకేశ్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్కు విక్రయించే బాటలో చర్చలు జరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. గత కొద్ది రోజులుగా ఫ్యూచర్ రిటైల్ సంస్థలో ఆర్ఐఎల్ వాటా కొనుగోలు అంశంపై మార్కెట్లో అంచనాలు పెరిగినట్లు ఈ సందర్భంగా నిపుణులు పేర్కొంటున్నారు. ఈ వాటా విక్రయం తదుపరి గ్రూప్లోని ఎఫ్ఎంసీజీ బిజినెస్సహా మిగిలిన వివిధ విభాగాలను బియానీ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై ఫ్యూచర్ గ్రూప్, ఆర్ఐఎల్ ప్రతినిధులు స్పందించకపోవడం గమనార్హం! షేర్ల జోరు ఫ్యూచర్ రిటైల్లో వాటా కొనుగోలు చర్చలు తుది దశకు చేరుకున్నట్లు వెలువడుతున్న అంచనాల నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు మరోసారి జోరందుకుంది. గత కొద్ది రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న ఆర్ఐఎల్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో రూ. 2199 వరకూ ఎగసింది. ప్రస్తుతం 1.6 శాతం బలపడి రూ. 2181 వద్ద ట్రేడవుతోంది. ఇక మరోపక్క ఫ్యూచర్ రిటైల్ కౌంటర్ 5 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకింది. రూ. 100 వద్ద ఫ్రీజయ్యింది. కాగా.. రుణ భారం పెరగడంతో కిశోర్ బియానీ గ్రూప్.. గతంలో వ్యూహాత్మక ఇన్వెస్టర్కు కొంతమేర వాటాను విక్రయించడం ద్వారా నిధులను సమీకరించాలని ప్రణాళికలు వేసింది. కోవిడ్-19 కట్టడికి లాక్డవున్ల అమలు తదితర అంశాలు కంపెనీ లిక్విడిటీ సమస్యలను పెంచుతున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. కాగా.. ఏడాది కాలాన్ని పరిగణిస్తే.. ఫ్యూచర్ గ్రూప్లోని లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ 74 శాతం పతనమై రూ. 11,000 కోట్ల దిగువకు చేరినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే సమయంలో గ్రూప్ రుణభారం రూ. 12,000 కోట్లకు చేరినట్లు తెలియజేశారు. -
ఆర్ఐఎల్ కన్ను!- ఫ్యూచర్ గ్రూప్ అదిరే
వినియోగ రంగంలో సేవలందిస్తున్న ఫ్యూచర్ గ్రూప్పై డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ కన్నేసినట్లు వెలువడిన వార్తలు ఒక్కసారిగా గ్రూప్లోని కౌంటర్లన్నిటికీ జోష్నిచ్చాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ఫ్యూచర్ గ్రూప్లోని షేర్లన్నీ 5 శాతం చొప్పున జంప్చేశాయి. ఫ్యూచర్ గ్రూప్లోని కొన్ని యూనిట్లలో పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ కంపెనీ ఆర్ఐఎల్ వాటా కొనుగోలు చేసే సన్నాహాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో డీల్ కుదిరే వీలున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయని మీడియా పేర్కొంది. కాగా.. ఇటీవల నెల రోజులుగా ఫ్యూచర్ గ్రూప్ కౌంటర్లు ర్యాలీ బాటలో సాగుతుండటం గమనార్హమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. జోరుగా హుషారుగా ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఫ్యూచర్ గ్రూప్లోని పలు షేర్లు 5 శాతం అప్పర్ సర్క్యూట్లను తాకాయి. కొనుగోలుదారులు అధికంకాగా.. అమ్మేవాళ్లు కరవుకావడంతో ఫ్యూచర్ సప్లై చైన్ సొల్యూషన్స్ రూ. 170 సమీపంలో, ఫ్యూచర్ మార్కెట్ నెట్వర్క్స్ రూ. 31 వద్ద, ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ రూ. 16.55 వద్ద, ఈ కంపెనీ డీవీఆర్ రూ. 18.20 వద్ద, ఫ్యూచర్ రిటైల్ రూ. 142.4 వద్ద, ఫ్యూచర్ లైఫ్స్టైల్ ఫ్యాషన్స్ రూ. 150 సమీపంలో, ఫ్యూచర్ కన్జూమర్ రూ. 18.4 వద్ద ఫ్రీజయ్యాయి. ఈ షేర్లన్నీ 5 శాతం చొప్పున జంప్ చేయడం విశేషం! నెల రోజుల్లో గత నెల రోజుల్లో ఫ్యూచర్ కన్జూమర్ షేరు 141 శాతం దూసుకెళ్లగా.. ఫ్యూచర్ మార్కెట్ 104 శాతం, ఫ్యూచర్ రిటైల్ 94 శాతం, ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ 88 శాతం చొప్పున జంప్ చేశాయి. ఈ కాలంలో ఫ్యూచర్ లైఫ్స్టైల్ కౌంటర్ మాత్రం 7 శాతమే లాభపడింది. కాగా.. షేర్ల ర్యాలీకి మార్కెట్ శక్తులే కారణమని.. ఈ అంశంపై కంపెనీ తరఫున స్పందించబోమని ఫ్యూచర్ గ్రూప్ ప్రతినిధి ఒకరు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. -
ఫ్యూచర్ లైఫ్స్టైల్ ఫ్యాషన్స్లో బ్లాక్స్టోన్ భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: కిశోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూప్ కంపెనీ, ఫ్యూచర్ లైఫ్స్టైల్ ఫ్యాషన్స్ (ఎఫ్ఎల్ఎఫ్ఎల్)లో అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థ బ్లాక్స్టోన్ రూ.1,750 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఎఫ్ఎల్ఎఫ్ఎల్ హోల్డింగ్కంపెనీ రైకా కమర్షియల్ వెంచర్స్లో బ్లాక్స్టోన్ నిర్వహణలోని ఫండ్స్ ఈ మేరకు ఇన్వెస్ట్ చేశాయి. ఈ లావాదేవీలో భాగంగా ఎఫ్ఎల్ఎఫ్ఎల్లో 6 శాతం వాటా బ్లాక్స్టోన్ పరమైంది. కాగా ఈ ఇన్వెస్ట్మెంట్స్ కారణంగా రైకాలో ఉన్న ఏకైక ఆర్థిక భాగస్వామిగా బ్లాక్స్టోన్ నిలిచింది. ఈ నిధులను రైకా సంస్థకున్న రుణ భారాన్ని తగ్గించుకోవడానికి వినియోగిస్తారు. బ్లాక్స్టోన్కు తొలి ‘ఫ్యాషన్’ పెట్టుబడి.... ఫ్యూచర్ గ్రూప్నకు చెందిన సెంట్రల్, బ్రాండ్ ఫ్యాక్టరీ, ప్లానెట్ స్పోర్ట్స్ రిటైల్ చెయిన్స్ను ఫ్యూచర్ లైఫ్స్టైల్ ఫ్యాషన్స్ నిర్వహిస్తోంది. కాగా ఈ రంగంలో తమకు ఇది తొలి ఇన్వెస్ట్మెంట్ అని బ్లాక్స్టోన్ ఎమ్డీ లవ్ పారిఖ్ పేర్కొన్నారు. మరోవైపు తమ ఫ్యాషన్ వ్యాపారం నిలకడగా వృద్ధి సాధిస్తోందని ఫ్యూచర్ గ్రూప్ సీఈఓ కిశోర్ బియానీ చెప్పారు. ఎఫ్ఎల్ఎఫ్ఎల్ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి బ్లాక్స్టోన్ ఇన్వెస్ట్మెంట్స్ తోడ్పాటునందిస్తాయని వివరించారు. ఈ ఏడాది సెపె్టంబర్ నాటికి ఎఫ్ఎల్ఎఫ్ఎల్ కంపెనీ 48 సెంట్రల్ స్టోర్స్ను, 100 బ్రాండ్ ఫ్యాక్టరీ అవుట్లెట్లను, 201 ఎక్స్క్లూజివ్ బ్రాండ్ అవుట్లెట్స్ను నిర్వహిస్తోంది. లీ కూపర్, ఇండిగో నేషన్, జెలస్ 21 వంటి 30కు పైగా ఫ్యాషన్ బ్రాండ్స్ ఉత్పత్తులను విక్రయిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ రూ.5,377 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. బీఎస్ఈలో ఫ్యూచర్ లైఫ్స్టైల్ ఫ్యాషన్స్ కంపెనీ షేరు స్వల్ప లాభంతో రూ.395 వద్ద ముగిసింది. -
స్కెచర్స్ చేతికి 49% ఫ్యూచర్స్ వాటా
న్యూఢిల్లీ: స్కెచర్స్ ఇండియా జాయింట్ వెంచర్లో ఫ్యూచర్స్ గ్రూప్నకు ఉన్న 49% వాటాను మాతృ కంపెనీ స్కెచర్స్ యూఎస్ఏ కొనుగోలు చేసింది. ఈ కొనుగోలుకు సంబంధించిన ఆర్థిక వివరాలను ఇరు కంపెనీలు వెల్లడించలేదు. అయితే ఈ వాటా కొనుగోలు కోసం అమెరికాకు చెందిన స్కెచర్స్ కంపెనీ రూ.600 కోట్లు వెచ్చించిందని సమాచారం. దీంతో స్కెచర్స్ ఇండియా ఇక పూర్తిగా స్కెచర్స్ యూఎస్ఏ అనుబంధ సంస్థగా మారిపోయింది. మరింతగా వృద్ధి జోరు... ఇతర దేశాల్లో లాగానే ఆకర్షణీయమైన వృద్ధి అవకాశాలతో భారత్లోకి ప్రవేశించామని స్కెచర్స్ సీఎఫ్ఓ డేవిడ్ వీన్బర్గ్ చెప్పారు. జాయింట్ వెంచర్లో మైనారిటీ వాటాను కొనుగోలు చేశామన్నారు. ఈ కొనుగోలు స్కెచర్స్ ఇండియా వృద్ధి జోరును మరింతగా పెంచుతుందని స్కెచర్స్ సౌత్ ఏషియా సీఈఓ రాహుల్ విరా పేర్కొన్నారు. కార్యకలాపాల విస్తరణను మరింత వేగవంతం చేస్తుందని, భారత్లో మరింత మార్కెట్ వాటా కొనుగోలు కోసం పటిష్టమైన నెట్వర్క్ ఏర్పాటు చేయడానికి ఈ కొనుగోలు దోహదం చేస్తుందని వివరించారు. ఈ ఏడాది 80 నుంచి వంద కొత్త స్టోర్స్.... స్కెచర్స్ కంపెనీ ఫ్యూచర్ గ్రూప్తో జాయింట్ వెంచర్ ఏర్పాటు ద్వారా భారత్లో 2012లో ప్రవేశించింది. ప్రస్తుతం భారత్లో స్కెచర్స్ కంపెనీ 223 రిటైల్ స్టోర్స్ను నిర్వహిస్తోంది. వీటిల్లో 61 స్వంత స్టోర్స్ కాగా, మిగిలినవి థర్డ్ పార్టీ ఆధ్వర్యంలోనివి. ఈ ఏడాది కొత్తగా 80 నుంచి వంద స్టోర్స్ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. -
‘ఫ్యూచర్’ వ్యాపారం.. రూ. 40కే భోజనం!
పంజాబ్: ఆహారోత్పత్తుల వ్యాపారంలోకి ఫ్యూచర్ గ్రూప్ అడుగుపెడుతోంది. భోజనప్రియులకు సరసమైన ధరలకే నోరూరించే వంటకాలను అందించేందుకు సిద్ధమవుతున్నట్లు ఫ్యూచర్ గ్రూప్ వెల్లడించింది. సొంత వంటశాలలను ఏర్పాటు చేసి.. ఇక్కడ నుంచి రూ.40కే భోజనం, రూ.10కే రెండు సమోసాలను అందించే దిశగా నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ సీఈఓ కిషోర్ బీయానీ తెలియజేశారు. ఫ్యూచర్పే యాప్ ద్వారా కస్టమర్లకు ఆహారాన్ని అందిస్తామని వెల్లడించిన ఆయన.. హోటల్ ఏర్పాటు లేదని, కేవలం డోర్ డెలివరీలు మాత్రమే ఉంటాయని స్పష్టంచేశారు. ‘త«థాస్తు’ పేరిట యాప్లో ప్రత్యేక ప్లాట్ఫాం ఏర్పాటుచేయడం ద్వారా ఈ సేవలను ప్రారంభించనున్నామని తెలిపారు. తమ బ్రాండ్ బియ్యం, గోధుమ పిండి వినియోగం పెంచడంలో ఈ క్లౌడ్ కిచెన్ కాన్సెప్ట్ సహకరించనుందన్నారు. ‘ఇప్పటివరకు ఫ్యాషన్పైన దృష్టి సారించాం. ఇక నుంచి ఆహార వ్యాపారంపై ఫోకస్ పెంచుతున్నాం. దీర్ఘకాలంలో ఈ విభాగం ద్వారా 50–60 శాతం అమ్మకాలను అంచనావేస్తున్నాం’ అని వెల్లడించారు. -
‘చంద్రబాబుకు అంత దమ్ము, ధైర్యం లేవు’
సాక్షి, విజయవాడ : అధికారం కోసం ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడం ఏపీ చంద్రబాబుకే అలవాటేనని, ఎందుకంటే 46 ఉప ఎన్నికలకు సింగిల్గా వెళ్లి చిత్తుగా ఓడిపోయారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాంబు అన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకుని విజయం సాధించారని, కానీ ఇప్పుడు అవే పార్టీలు చంద్రబాబు తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా విజయవాడలో శుక్రవారం అంబటి మీడియాతో మాట్లాడారు. ‘కొత్త పొత్తుల కోసం ప్రస్తుతం చంద్రబాబు వెంపర్లాడుడుతున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఎక్కువగా ఏదో ఓ పార్టీతో పొత్తుతోనే విజయాలు సాధిస్తోంది. సింగిల్గా పోటీ చేసే దమ్ము, ధైర్యం లేని వ్యక్తి చంద్రబాబు. అందుకే 1999, 2004 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు.. 2009లో వామపక్షాలు, టీఆర్ఎస్తో, తిరిగి 2014 ఎన్నికల్లో బీజేపీతో మళ్లీ జత కట్టడం నిజం కాదా. అధికారం కోసం ఏ గడ్డి అయినా కరవడం చంద్రబాబుకు అలవాటే. దేశంలో ఏ పార్టీతోనూ చంద్రబాబు నిజాయితీగా పొత్తు పెట్టుకోలేదు. చంద్రబాబుతో కలిసే ఏ పార్టీ అయినా మసి అవ్వాల్సిందే. చంద్రబాబు తన అవినీతి మకిలిని పొత్తు పెట్టుకున్న పార్టీకి, నేతలకు అంటిస్తారు. చంద్రబాబు ఎంత గగ్గోలు పెట్టినా ఆయనతో ఎవరూ కలవరు. జూన్ 2 నుంచి 8 వరకు నవనిర్మాణ దీక్షలు చేస్తానని చంద్రబాబు చెబుతున్నారు. తన ప్రసంగాలతో ప్రజలకు సుత్తి కొట్టడం చంద్రబాబుకు ఆనవాయితీగా మారింది. నవ నిర్మాణ దీక్ష ఎందుకు? అసలు రాజధానిలో ఏం నిర్మించారు. మీరు సాధించిన అభివృద్ధి ఏంటి. ప్రజలను మభ్య పెట్టడానికే మీ నవ నిర్మాణ దీక్షలు. చంద్రబాబు నలబై ఏళ్ల రాజకీయ జీవితంలో అబద్దాలపై అబద్దాలు చెప్పడం మాత్రమే అలవాటు అయిందంటూ’ అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. అన్నీ అమ్ముకున్నారు ఇసుక, మట్టి, రాజధాని భూములను అమ్ముకున్నారు. ఫ్యూచర్ గ్రూప్, రిలయన్స్ కలిసి చౌక ధర దుకాణాలకు సరుకులు అందిస్తాయని ఏపీ ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఫ్యూచర్ గ్రూప్ చంద్రబాబుకు చెందిన హెరిటేజ్లో వాటాలు కలిగి వుంది. ఇంకా పాలన చేయడానికి చంద్రబాబుకు ఏడాది సమయం ఉంది. కనీసం ఇప్పుడయినా ప్రజల కోసం చంద్రబాబు పనిచేస్తే మంచిది. కులం పేరుతో అందరినీ విభజిస్తున్నారు. చివరకు దేవుడికి కూడా కులం ఆపాదిస్తారా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. -
‘ఫ్యూచర్’ లక్ష్యం 40 వేల కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిటైల్ రంగ దిగ్గజం ఫ్యూచర్ గ్రూప్ విస్తరణ ద్వారా 2018–19లో రూ.40,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరం రిటైల్ బిజినెస్ ద్వారా సంస్థ రూ.28,600 కోట్లు ఆర్జించింది. 2017–18లో రూ.30,000 కోట్లు అంచనా వేస్తున్నట్టు గ్రూప్ సీఈవో కిశోర్ బియానీ బుధవారం తెలిపారు. గోల్డెన్ హార్వెస్ట్ సోనమసూరి రైస్ను ఇక్కడ లాంఛనంగా ఆవిష్కరించిన అనంతరం సినీ నటుడు రానా దగ్గుబాటితో కలిసి మీడియాతో మాట్లాడారు. గ్రూప్ టర్నోవరులో హైదరాబాద్ మార్కెట్ 10% వాటా కైవసం చేసుకుందని చెప్పారు. ఫ్యాషన్, ఫుడ్ విషయంలో ఇక్కడ వినియోగం అధికంగా ఉంటుందని కొనియాడారు. గోల్డెన్ హార్వెస్ట్ సోనమసూరి రైస్ వాణిజ్య ప్రకటనను సురేష్ ప్రొడక్షన్స్, అన్నపూర్ణ స్టూడియోస్ చిత్రించాయి. చిన్న స్టోర్లతో విస్తరణ..: బిగ్ బజార్, సెంట్రల్, ఫుడ్ బజార్, హోమ్ టౌన్, ఫుడ్ హాల్, ఈ–జోన్, ప్లానెట్ స్పోర్ట్స్, బ్రాండ్ ఫ్యాక్టరీ వంటి బ్రాండ్లు ఫ్యూచర్ గ్రూప్ కింద ఉన్నాయి. దేశవ్యాప్తంగా అన్ని బ్రాండ్లలో 1,700లకుపైగా స్టోర్లను ఈ గ్రూప్ నిర్వహిస్తోంది. ఈజీడే, నీల్గిరి, హెరిటేజ్ ఫ్రెష్, కేబీ కన్వీనియెంట్లీ యువర్స్ బ్రాండ్లలో భారీ విస్తరణకు సంస్థ ప్రణాళిక సిద్ధం చేసింది. 2022 నాటికి 10,000 స్మాల్ ఫార్మాట్ స్టోర్లను ఏర్పాటు చేయాలన్నది కంపెనీ ఆలోచన. ఇక గోల్డెన్ హార్వెస్ట్ బ్రాండ్ ఒక్కటే రూ.1,200 కోట్ల వ్యాపారం చేస్తోంది. 2018–19లో ఈ బ్రాండ్ ద్వారా రూ.2,000 కోట్లు సమకూరతాయని బియానీ వెల్లడించారు. గోల్డెన్ హార్వెస్ట్ బ్రాండ్లో పిండి, పప్పులు, మసాలాలు, తృణధాన్యాలు, డ్రైఫ్రూట్స్, ఇతర ఆహార పదార్థాలను విక్రయిస్తోంది. తెలంగాణలో గార్మెంట్స్ యూనిట్! ఫ్యూచర్ గ్రూప్ తెలంగాణలో మెగా గార్మెంట్స్ యూనిట్ను ఏర్పాటు చేయనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఎక్కడ, ఎంత పెట్టుబడితో రానుంది అన్న విషయాలను అధికారికంగా కంపెనీ ప్రకటించలేదు. అయితే తెలంగాణలో యూనిట్ వచ్చే విషయాన్ని గ్రూప్ కంపెనీ ప్రతినిధి ఒకరు అనధికారికంగా ధ్రువీకరించారు. ఫ్యూచర్ గ్రూప్ పశ్చిమ బెంగాల్లో ఇటువంటి యూనిట్ను ఈ ఏడాదే నెలకొల్పుతోంది. వివిధ బ్రాండ్లలో ఏటా 35 కోట్ల యూనిట్ల దుస్తులను తాము విక్రయిస్తున్నట్టు కిశోర్ బియానీ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఈ స్థాయికి చేరడం ద్వారా ప్రపంచంలో టాప్–10 రిటైలర్గా నిలిచామన్నారు. బెంగాల్ తర్వాత గార్మెంట్స్ తయారీకి మరొక యూనిట్ స్థాపనకు పలు రాష్ట్రాలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఇందులో తెలంగాణ ఒకటని వివరించారు. -
స్టాక్స్ వ్యూ
ఎన్ఎండీసీ – కొనచ్చు బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ. 125 టార్గెట్ ధర: రూ.187 ఎందుకంటే: భారత్లో ఇనుప ఖనిజం ఉత్పత్తి చేసే అతి పెద్ద కంపెనీ ఇదే. చత్తీస్ఘడ్, కర్నాటకల్లో ఉన్న 4 గనుల ద్వారా ఏడాదికి 30–32 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజాన్ని ఉత్పత్తి చేస్తోంది. ఈ ప్రభుత్వ రంగ గనుల కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నా యి. ఈ క్యూ2లో పటిష్టమైన పనితీరును కనబరిచింది. ఇబిటా 56% (అంతకు ముందటి క్వార్టర్తో పోల్చితే 21%) వృద్ధితో రూ.1,280 కోట్లకు పెరిగింది. వ్యయాలు తక్కువగా ఉండడం, రియలైజేషన్ అంచనాల కంటే మించడం కలసివచ్చాయి. నికర లాభం 42% వృద్ధితో రూ.890 కోట్లకు పెరిగింది. అమ్మకాలు 4 శాతం(క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపాదికన 10%) వృద్ధితో 8.3 మిలియన్ టన్నులకు పెరిగాయి. ఉత్పత్తి 14 శాతం(అంతకు ముందటి క్వార్టర్తో పోల్చితే 16%) వృద్ధి చెంది 7.2 మిలియన్ టన్నులకు పెరిగింది. ఎగుమతులు 2% క్షీణించి 6.2%కి తగ్గాయి. శీతాకాల ఉత్పత్తి కోత కారణంగా చైనాలో డిమాండ్ తగ్గుతుందనే అందోళనతో అంతర్జాతీయంగా ఇనుప ఖనిజం ధరలు తగ్గాయి. ధరల ఒత్తిడి కారణంగా ఇటీవల కొన్ని నెలల్లో కంపెనీ ఇనుప ఖనిజం అమ్మకాలు కూడా తగ్గాయి. అమ్మకాల వృద్ధిని కొనసాగించాలంటే ఈ కంపెనీ ధరలను మరింతగా తగ్గించాల్సి ఉంటుంది. అదనపు మూలధన పెట్టుబడులు లేకుండానే ఈ కంపెనీ అదనంగా 20% సరఫరాలను అందించగలదు. ప్రస్తుతం 36 మిలియన్ టన్నులుగా ఉన్న వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని ఐదేళ్లలో 50 మిలియన్ టన్నులకు పెంచుకోవడానికి గాను రూ.15,500 కోట్లు పెట్టుబడులు పెడుతోంది. చత్తీస్ఘడ్లో ఏర్పాటు చేస్తోన్న స్టీల్ ప్లాంట్లో 49% వాటా విక్రయం కోసం ఇటీవలనే ఒక బ్యాంక్ను సలహా సంస్థగా నియమించుకుంది. ఈ వాటా కొనుగోలుకు టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీలు ఇప్పటికే తమ ఆసక్తిని వెల్లడించాయి. మూడేళ్లలో అమ్మకాలు 6% చక్రగతిన వృద్ధి చెందగలవని అంచనా. ప్యూచర్ రిటైల్ – కొనచ్చు బ్రోకరేజ్ సంస్థ: యాక్సిస్ డైరెక్ట్ ప్రస్తుత ధర: రూ. 504 టార్గెట్ ధర: రూ.680 ఎందుకంటే: ప్యూచర్ గ్రూప్కు చెందిన ఈ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. సేమ్ స్టోర్స్ సేల్స్(ఎస్ఎస్ఎస్జీ) 10 శాతం పెరగడంతో ఈ కంపెనీ మొత్తం అమ్మకాలు 20 శాతం వృద్ధి చెందాయి. నిర్వహణ పనితీరు బాగా ఉండటంతో ఇబిటా 65 శాతం వృద్ధి చెందింది. ఇక నికర లాభం దాదాపు రెట్టింపై రూ.150 కోట్లకు పెరిగింది. నికర లాభ మార్జిన్ 1.6 శాతం వృద్ధితో 3.4 శాతానికి ఎగసింది. వేగంగా వృద్ధి చెందుతున్న భారత్లో వ్యవస్థీకృత ఆధునిక రిటైల్ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఈ కంపెనీ తగిన స్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. బిగ్బజార్లో సేమ్ స్టోర్ సేల్స్ రెట్టింపు వృద్ధిని సాధిస్తున్నాయి. అధిక వృద్ధి ఫ్యాషన్ కేటగిరిలో ఎఫ్బీబీ(ఫ్యాషన్ ఎట్ బిగ్ బజార్) మార్కెట్ వాటా పెరుగుతోంది. హైపర్సిటీ స్టోర్స్ను కొనుగోలు చేయడం కంపెనీకి కలసివచ్చే అంశమే. ఈ కొనుగోలు కారణంగా కంపెనీకి 2 కోట్ల మంది కొత్త వినియోగదారులు లభించారు. ఈ కొనుగోలు ప్రయోజనాలు ఈ ఆర్థిక సంవత్సరం చివరి కల్లా కనిపించనున్నాయి. మరోవైపు చిన్న రిటైల్ స్టోర్స్ చెయిన్...ఈజీడే స్టోర్స్ను కూడా కంపెనీ చేజిక్కించుకుంది. ఈజీడే స్టోర్స్ సంఖ్యను కూడా విస్తృతంగా పెంచుతోంది. సాధారణ వినియోగదారుల కంటే 3 రెట్లకు పైగా కొనుగోళ్లు చేసే ఈజీడే సేవింగ్స్ క్లబ్ సభ్యుల సంఖ్య ఈ క్యూ2లో 25 శాతం వృద్ధితో 2.5 లక్షలకు పెరిగింది. ఈ క్యూ2లో ఏడు కొత్త నగరాలకు బిగ్బజార్ స్టోర్స్ను కంపెనీ విస్తరించింది. దీంతో మొత్తం 253 నగరాల్లో మొత్తం బిగ్బజార్ స్టోర్స్ సంఖ్య 914కు చేరింది. మూడేళ్లలో ఆదాయం 20 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించగలదని, ఇదే మూడేళ్లలో ఇబిటా మార్జిన్ 4.8 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. -
షాపులోకి వెళ్లాలంటే ఎంట్రీ ఫీ కట్టాలి
ముంబై : అశోక్ బియానీ ఫ్యూచర్ గ్రూప్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. మరే ఇతర రిటైలర్ అవలంభించని విధానాన్ని ఫ్యూచర్ గ్రూప్ సంస్థ ప్రవేశపెడుతోంది. ఈ ఏడాది ప్రమోషన్ క్యాంపెయిన్ నిర్వహించే ఐదు రోజుల్లో బ్రాండ్ ఫ్యాక్టరీ ప్రవేశానికి ప్రత్యేక ఫీజులు విధించనున్నట్టు పేర్కొంది. రూ.100-250 మధ్యలో ఈ ఫీజులు ఉండబోతున్నాయని తెలిపింది. నవంబర్ 22 నుంచి 26 వరకు బ్రాండ్ ఫ్యాక్టరీలో భారీ డిస్కౌంట్లతో ఆఫర్లు ప్రకటించింది. రూ.5000 విలువైన వస్తువులను రూ.2000కే ఇవ్వనుంది. ఉచిత వాణిజ్యం, గిఫ్ట్వోచర్లు, క్యాష్బ్యాక్ రూపంలో కంపెనీ ఈ నగదును తిరిగి అందించనుంది. ప్రవేశ ఫీజులను రిడీమ్ చేసుకొనే అవకాశం కూడా కల్పించింది. 'మేం డబ్బు తిరిగి చెల్లిస్తున్నాం కాబట్టి ప్రవేశ ఫీజులను వసూలు చేస్తున్నట్టు కాదు' అని సంస్థ సీఈవో కిశోర్ బియాని చెప్పారు. ఇది ఆన్లైన్లో ఫ్రీ బుకింగ్ వంటిదన్నారు. సీరియస్ కస్టమర్ల సౌలభ్యం కోసమే ప్రవేశ ఫీజులను విధిస్తున్నామని, వారికి ప్రత్యేకంగా సేవలు అందించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. గతేడాది ఆఫర్ల రోజుల్లో దేశవ్యాప్తంగా ఉన్న జనాలుబ్రాండ్ ఫ్యాక్టరీ స్టోర్లకు పోటెత్తారు. జనాలు భారీ ఎత్తున్న రావడంతో, వారందరికీ సేవలు అందించడం కష్టమైందని తెలిపారు. ఈ ఈవెంట్లో భాగంగా బ్రాండు ఫ్యాక్టరీ అవుట్లెట్లకు 12 లక్షల మంది వినియోగదారులు వస్తారని అంచనా. గతేడాది ఆందోళనకర పరిస్థితులు తలెత్తాయని, కస్టమర్లందరికీ సేవలందించడం కుదరలేదని బ్రాండ్ ఫ్యాక్టరీ బిజినెస్ హెడ్ సురేశ్ సాధ్వాని చెప్పారు. తమ నమ్మకమైన వినియోగదారులకు మంచి షాపింగ్ అనుభూతి కల్పించేందుకే ప్రవేశ ఫీజులను విధిస్తున్నామని తెలిపారు. ఐదు రోజుల షాపింగ్ ప్రీ-షాపింగ్ డేస్లో రూ.200 కోట్ల అమ్మకాలను చేధించాలని బ్రాండ్ ఫ్యాక్టరీ లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. -
ఫ్యూచర్ గ్రూప్ చేతికి ‘హెరిటేజ్’
-
ఫ్యూచర్ గ్రూప్ చేతికి ‘హెరిటేజ్’
హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ రిటైల్ను దేశీయ రిటైల్ దిగ్గజం ఫ్యూచర్ గ్రూప్ సొంతం చేసుకుంది. హెరిటేజ్ ఫుడ్స్కు చెందిన రిటైల్ డివిజన్ను ఫ్యూచర్ గ్రూప్ కొనుగోలు చేసింది. హెరిటేజ్ ఫుడ్స్ ఈ మేరకు 124 స్టోర్లను ఫ్యూచర్ గ్రూప్కు అప్పగించింది. ఇకపై హెరిటేజ్ స్టోర్లు ఫ్యూచర్ గ్రూప్లో భాగం కానున్నాయి. బదులుగా ఫ్యూచర్ గ్రూప్ సంస్థ...3.5 శాతం వాటాను హెరిటేజ్కు ఇవ్వనుంది. ఫ్యూచర్ గ్రూప్ సంస్థ ఇప్పటికే బిగ్ బజార్, ఈ-జోన్, షాపర్స్ స్టాప్ వంటి బ్రాండ్లతో రిటైల్ రంగంలో తనదైన ముద్ర సంపాదించుకుంది. బిగ్బజార్, ఫుడ్ బజార్ పేర్లతో దేశవ్యాప్తంగా 738 స్టోర్స్ను కలిగి వున్న కిషోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూపు వ్యాపార విస్తరణపై దృష్టిసారిస్తోంది. ఈ మధ్య కాలంలో ఫ్యూచర్ గ్రూపు బిగ్ ఆపిల్, నిలగిరీ, భారతీ రిటైల్ ఔట్లెట్లను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఒప్పందంపై సెప్టెంబర్లోనే వార్తలు వెలువడ్డాయి. -
మోర్ దుకాణాలపై ‘ఫ్యూచర్’ గ్రూప్ కన్ను
కొనుగోలుకు చర్చలు! న్యూఢిల్లీ : బిగ్బజార్, ఫ్యూచర్ బజార్, బ్రాండ్ ఫ్యాక్టరీ, హోమ్టౌన్ వంటి రిటైల్ దుకాణాలను నిర్వహించే ఫ్యూచర్ గ్రూపు... ‘మోర్’ పేరుతో మెగా మార్ట్లను నిర్వహిస్తున్న ఆదిత్య బిర్లా రిటైల్ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన చర్చలు కొనసాగుతున్నట్టు సమాచారం. ఆఫ్లైన్ గొలుసుకట్టు రిటైల్ దుకాణాల్లో ఫ్యూచర్ గ్రూపు అగ్రగామిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ విభాగంలో మరింతగా నిలదొక్కుకోవాలన్న వ్యూహాత్మక ఆలోచనలో భాగంగానే మోర్ను సొంతం చేసుకోవాలనుకుంటోంది. కొనుగోలు లేదా విలీనం ఈ రెండింటిలో ఆదిత్య బిర్లా గ్రూపు దేనికి అంగీకరించినా ఫ్యూచర్ గ్రూపు సమ్మతించే అవకాశం ఉందని ఈ వహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఒక ప్రముఖ మీడియా సంస్థ కథనాన్ని ప్రచురించింది. అయితే, ఇది పూర్తిగా ఊహాగానమేనని, అధికారికంగా వీటిని ఖండిస్తున్నట్టు ఫ్యూచర్గ్రూప్ ప్రతినిధి స్పష్టం చేశారు. అదే సమయంలో ఆదిత్య బిర్లా రిటైల్ లిమిటెడ్ దీనిపై స్పందించలేదు. ఫ్యూచర్ కొనుగోళ్ల క్రమం రిలయన్స్ రిటైల్ తర్వాత దేశంలో రెండో అతిపెద్ద రిటైల్ సంస్థ ఫ్యూచర్ గ్రూపు. బిగ్ యాపిల్, నీల్గిరి, భారతీ రిటైల్ వంటి పలు సంస్థలను ఇప్పటికే తన సొంతం చేసుకుంది. దేశవ్యాప్తంగా 200 పట్టణాల్లో 700 దుకాణాలను ఫ్యూచర్ గ్రూపు నిర్వహిస్తోంది. బిగ్బజార్డెరైక్ట్.కామ్, ఫ్యూచర్బజార్.కామ్ వంటి ఈకామర్స్ పోర్టళ్లు కూడా సంస్థ ఆధ్వర్యంలో ఉన్నాయి. ఫర్నిచర్ విక్రయించే ఈ కామర్స్ పోర్టల్ ఫ్యాబ్ఫర్నిష్.కామ్ను సైతం ఇటీవలే కొనుగోలు చేసింది. -
ఆన్ లైన్ లోకి ఫ్యూచర్ గ్రూప్!
♦ ఓమ్నీ చానల్ వ్యూహం.. ♦ మూడు నెలల్లో ఈ-జోన్తో ప్రారంభం ♦ ఆ తర్వాతే బిగ్ బజార్, షాపర్స్ స్టాప్లకు విస్తరణ ♦ ‘బ్రిక్స్ అండ్ క్లిక్’ సదస్సులో ఫ్యూచర్ గ్రూప్ జేఎండీ రాకేష్ బియానీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘బిగ్ బజార్, ఈ-జోన్, షాపర్స్ స్టాప్ వంటి బ్రాండ్లతో రిటైల్ రంగంలో తనదైన ముద్ర వేసిన దేశీ దిగ్గజం ఫ్యూచర్ గ్రూప్... త్వరలో ఆన్లైన్లోకి ప్రవేశిస్తోంది. దేశవ్యాప్తంగా 200కు పైగా స్టోర్లలో 1.7 కోట్ల చదరపుటడుగుల రిటైల్ స్పేస్ ఉన్న ఈ సంస్థ... ఓమ్నీ చానల్ పేరిట మూడు నెలల్లో ఆన్లైన్లోకి దిగుతున్నట్లు గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ రాకేష్ బియానీ చెప్పారు. మంగళవారమిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘‘మొదట ఫ్యూచర్ గ్రూప్నకు చెందిన ఈ-జోన్ (ఎలక్ట్రానిక్ ఉపకరణాలు) స్టోర్లలో ఈ సేవలను ప్రారంభిస్తాం. ఆ తర్వాత ప్లానెట్ స్పోర్ట్స్, బిగ్ బజార్, షాపర్స్ స్టాప్ స్టోర్లకూ విస్తరిస్తాం’’ అని చెప్పారు. ఓమ్నీ చానల్ ప్రత్యేకతను వివరిస్తూ ‘‘కస్టమర్లు మొబైల్, ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ స్టోర్ల ద్వారా దగ్గర్లోని ఏదైనా ఫ్యూచర్ గ్రూప్ స్టోర్లలో ఆర్డర్ ఇవ్వొచ్చు. ఇది రెండు రకాలుగానూ ఉంటుంది. అవసరమైతే ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి.. స్టోర్కు వెళ్లి ఉత్పత్తులను తీసుకోవచ్చు. లేదంటే స్టోర్కి వెళ్లి ఆర్డర్ ఇస్తే.. ఆయా ఉత్పత్తులను ఇంటికి కూడా డెలివరీ చేస్తాం. దీనివల్ల స్టోర్ల విక్రయాలకు ఆన్లైన్ విక్రయాలు జతకలుస్తాయి’’ అని బియానీ వివరించారు. ఓమ్నీ చానల్ షాప్, టెక్నాలజీ అభివృద్ధి కోసం హైబ్రిస్ సాఫ్ట్వేర్తో ఒప్పందం చేసుకున్నామన్నారు. ఓమ్నీ చానల్ విధానంతో 30% మేర స్టోర్ల ఆదాయం పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఫిక్కీ హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో ‘బ్రిక్స్ అండ్ క్లిక్స్’ పేరుతో ఆన్లైన్-ఆఫ్లైన్ రిటైల్ అంశంపై జరిగిన సదస్సులో బియానీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయనతో పాటు హీలియన్ వెంచర్ పార్ట్నర్ శ్రీకాంత్ సుందరరాజన్, యాక్టస్ అడ్వైజరీ ప్రై.లి. కో-ఫౌండర్, ఎండీ మనీష్ చద్దా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాకేష్ బియానీ మాట్లాడుతూ.. ఓమ్నీ చానల్ రిటైల్లో 40 వేల నుంచి 60 వేల ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఆఫ్లైన్లో ఎలాంటి ఆఫర్లు, డిస్కౌంట్లు ఉంటాయో ఆన్లైన్లోనూ అవే వర్తిస్తాయని తెలియజేశారు. ఐదేళ్లలో 300 పట్టణాలకు... ప్రస్తుతం దేశవ్యాప్తంగా 102 పట్టణాల్లో 200లకు పైగా స్టోర్లను నిర్వహిస్తున్నామని ఏటా 20-30 స్టోర్లను ప్రారంభిస్తామని రాకేష్ బియానీ చెప్పారు. .. ఐదేళ్లలో 300 పట్ణణాలకు విస్తరించాలనేది తమ లక్ష్యమన్నారు. ప్రస్తుతం ఫ్యూచర్ గ్రూప్ ద్వారా ఫ్యాషన్, ఫుడ్, హోమ్ మూడు విభాగాల్లో కలిపి మొత్తం 40 లక్షల మంది ఉపాధి పొందుతున్నారన్నారు. మరో 10 లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి ఉన్నట్లు చెప్పారు. ‘‘ఇపుడు మా గ్రూప్ కస్టమర్ల సంఖ్య 33 కోట్లు. మాకు హైదరాబాద్తో ఎనలేని అనుబంధం ఉంది. పంజగుట్టలో తొలి స్టోర్ను ప్రారంభించాక షాపర్స్ స్టాప్, బిగ్ బజార్, పాంటలూన్స్ ఇలా అన్ని స్టోర్ల ఆరంభానికీ తొలి వేదిక హైదరాబాదే’ అన్నారాయన. -
ఫ్యూచర్ గ్రూప్తో రాందేవ్ బాబా ఒప్పందం
న్యూఢిల్లీ: యోగా గురు బాబా రాందేవ్ ఆధ్వర్యంలోని ఆహార ఉత్పత్తుల సంస్థ పతంజలి ఆయుర్వేదిక్స్.. ప్రముఖ రిటైల్ వ్యాపార సంస్థ ఫ్యూచర్ గ్రూప్ తో కీలక వ్యాపార ఒప్పందం కుదుర్చుకుంది. పతంజలి సంస్థ తయారుచేసే ఉత్పత్తులను.. 240 నగరాల్లోని రిటైల్ అవుట్ లెట్లలో విక్రయించనున్నట్లు ఫ్యూచర్ గ్రూప్ ప్రతినిధులు వెల్లడించారు. వచ్చే 20 నెలల కాల వ్యవధిలో వెయ్యి కోట్ల రూపాయల వ్యాపారాన్ని జరుపనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు శుక్రవారం మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా రాందేవ్ మాట్లాడుతూ.. ఫ్యూచర్ లాంటి స్వదేశీ రిటైల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా తమ సంస్థకు రెట్టింపు గౌరవం దక్కుతుందని, తద్వారా ప్రపంచ శ్రేణి ఉత్పత్తుతులను తక్కువ ధరకే అందించే వీలుంటుందన్నారు. 20015- 16 ఆర్ధిక సంవత్సరం పూర్తయ్యేలోపు పతంజలి ఫుడ్స్ టర్నోవర్ రూ. 5 వేల కోట్లకు చేరుకుంటుందని రాందేవ్ చెప్పారు. మ్యాగీ నిషేధం తరువాత తమ సంస్థ రూపొందించిన దేశీ ఆటా నూడుల్స్ విక్రయాలను అక్టోబర్ 15 నుంచి ప్రారంభించనున్నట్లు, ఒక్కో ప్యాకెట్ ధర రూ. 25గా నిర్ధారించినట్లు వివరించారు. -
ఫ్యూచర్, భారతీ రిటైల్ వ్యాపారాల విలీనం
పూర్తిగా షేర్ల రూపంలో ఒప్పందం; విలువ రూ.750 కోట్లు ⇒ రూ.15,000 కోట్ల సంస్థగా ఆవిర్భావం... ⇒ కిశోర్ బియానీ చేతికే పగ్గాలు... న్యూఢిల్లీ: దేశీ రిటైల్ రంగంలో మరో కీలకమైన, భారీ విలీనానికి బాటలు పడ్డాయి. కిశోర్ బియానీ సారథ్యంలోని ఫ్యూచర్ గ్రూప్.. తమ రిటైల్ వ్యాపారాన్ని మొత్తం భారతీ గ్రూప్నకు చెందిన రిటైల్ బిజినెస్తో విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది. పూర్తిగా షేర్ల మార్పిడి రూపంలో జరగనున్నట్లు ఈ డీల్ విలువ రూ.750 కోట్లుగా అంచనా. అంతేకాదు విలీనం తర్వాత రూ.15,000 కోట్ల విలువైన టర్నోవర్తోపాటు దేశంలోనే అతిపెద్ద రిటైల్ నెట్వర్క్ సంస్థల్లో ఒకటిగా కూడా ఆవిర్భవించనుంది. మరోపక్క, విలీన సంస్థపై నియంత్రణ అంతా కిశోర్ బియానీకే దక్కనుంది. కాగా, ఆదిత్య బిర్లా గ్రూప్ తమ బ్రాండెడ్ అపారెల్ వ్యాపారాలన్నింటినీ విలీనం చేసి ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్గా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన మర్నాడే ఫ్యూచర్, భారతీ ఒప్పందం వెలువడటం గమనార్హం. డీల్ స్వరూపం ఇదీ... రెండంచెల్లో జరిగే ఈ ఒప్పందం ప్రకారం.. ఫ్యూచర్ గ్రూప్ తమ రిటైల్ వ్యాపారాన్ని విడదీసి భారతీ రిటైల్లో విలీనం చేస్తుంది. అదేవిధంగా భారతీ గ్రూప్ కూడా తమ రిటైల్ ఇన్ఫ్రా బిజినెన్ను విభజించి ఫ్యూచర్ రిటైల్లో కలిపేస్తుంది. ఈ విలీనం ద్వారా రెండు ప్రత్యేక కంపెనీలు(రిటైల్, ఇన్ఫ్రా) ఆవిర్భవిస్తాయని.. వీటి ఉమ్మడి టర్నోవర్ రూ.15,000 కోట్లుగా ఉంటుందని ఫ్యూచర్ గ్రూప్ సీఈఓ కిశోర్ బియానీ విలేకరులకు తెలిపారు. రెండు విలీన సంస్థల్లో భారతీ రిటైల్కు 15 శాతం చొప్పున వాటా లభిస్తుంది. ముందుగా రూ.500 కోట్ల విలువైన షేర్లను... కొంతకాలం తర్వాత షేర్లుగా మార్పిడి చేసుకునేందుకు వీలుండే రూ.250 కోట్ల విలువైన ఆప్షనల్లీ కన్వర్టబుల్ డిబెంచర్లు(ఓసీడీ) దక్కుతాయి. డీల్ ప్రకారం ఫ్యూచర్ రిటైల్ వాటాదారులకు ఒక్కో షేరుకి(రూ.2 ముఖవిలువ) భారతీ రిటైల్ నుంచి ఒక షేరు(1:1 నిష్పత్తి) కేటాయిస్తారు. ఇదేవిధంగా ఫ్యూచర్ రిటైల్ కూడా భారతీ రిటైల్ షేర్హోల్డర్లకు రూ.2 ముఖ విలువగల ఫుల్లీ పెయిడ్-అప్ ఈక్విటీ షేర్లను 1:1 నిష్పత్తిలో జారీ చేస్తుంది. భారతీ రిటైల్ జారీ చేసే షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టవుతాయి. ఇక ఫ్యూచర్ గ్రూప్ ప్రమోటర్లకు రెండు కొత్త సంస్థల్లో 46-47 శాతం చొప్పున వాటా లభిస్తుంది. ఉమ్మడి సంస్థకు మొత్తం 243 నగరాల్లో 570 స్టోర్లు ఉంటాయి. తాము రిటైల్ బిజినెస్ నుంచి వైదొలగడంలేదని.. ఈ వ్యూహాత్మక విలీనం ద్వారా మరింత వేగంగా వృద్ధి చెందాలన్నదే ఇరు కంపెనీల ప్రణాళిక అని భారతీ ఎంటర్ప్రైజెస్ వైస్ చైర్మన్ రాజన్ భారతీ మిట్టల్ చెప్పారు. ఇరు కంపెనీల వాటాదారులు, కస్టమర్లకు ఈ డీల్తో మరింత ప్రయోజనం లభిస్తుందన్నారు. కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) ఇతరత్రా నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి ఈ విలీన ఒప్పందం పూర్తవుతుంది. డీల్ నేపథ్యంలో సోమవారం బీఎస్ఈలో ఫ్యూచర్ రిటైల్ షేరు ధర 12 శాతంపైగా లాభపడి రూ.130 వద్ద స్థిరపడింది. ఒకానొకదశలో 18 శాతం ఎగసి రూ.137 గరిష్టాన్ని కూడా తాకింది. 2021కల్లా 4,000 చిన్న స్టోర్లు: బియానీ ఈ డీల్ తర్వాత కూడా భారతీ ఈజీడే చైన్ స్టోర్లు, తమ బిగ్బజార్ స్టోర్లు యథాతథంగా కార్యకలాపాలను కొనసాగిస్తాయని కిశోర్ బియానీ పేర్కొన్నారు. అయితే, 2021 నాటికి కొత్తగా 4,000 చిన్న స్థాయి రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేయాలన్నది తమ ప్రణాళిక అని ఆయన వెల్లడించారు. ఉత్తరాదిలో ఈజీడే పేరుతో, దక్షిణ-పశ్చిమ భారత్లో నీల్గిరీస్, కేబీ బ్రాండ్తో ఈ కొత్త సోర్టు తెరుస్తామని తెలిపారు. వాల్మార్ట్తో క్యాష్ అండ్ క్యారీ వ్యాపార భాగస్వామ్యం నుంచి బయటికొచ్చేశాక.. పూర్తిస్థాయిలో రిటైల్ వ్యాపారం కోసం భారతీ గ్రూప్ అన్వేషిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా(ప్రధానంగా ఉత్తరాదిన) భారతీ రిటైల్ 210 ఈజీడే స్టోర్స్ను నిర్వహిస్తోంది. ఇక ఫ్యూచర్ గ్రూప్ కూడా తమ ఫ్యాషన్ రిటైల్ చైన్ ప్యాంటలూన్స్లో మెజారిటీ వాటాను 2012లో ఆదిత్య బిర్లా గ్రూప్నకు విక్రయించిన తర్వాత వ్యాపారాన్ని స్థిరీకరించే పనిలోపడింది. ప్రస్తుతం బిగ్బజార్ పేరుతో హైపర్మార్కెట్లు, ఫుడ్బజార్ బ్రాండ్తో సూపర్మార్కెట్లతోపాటు వివిధ ఇతర రిటైల్ ఫార్మాట్లను ఫ్యూచర్ గ్రూప్ నిర్వహిస్తోంది. భారతీ రిటైల్కు ప్రస్తుతం రుణభారమేమీలేదు. ఇక కొత్తగా ఏర్పడే రిటైల్ సంస్థకు రూ.1,200 కోట్లు, ఇన్ఫ్రా సంస్థకు రూ.3,500 కోట్లు చొప్పున రుణ భారం ఉంటుంది. -
బిగ్ బజార్ భారీ విస్తరణ
* దేశవ్యాప్తంగా 2015లో 12 స్టోర్లు * తెలుగు రాష్ట్రాల్లో 4 ఏర్పాటు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిటైల్ రంగంలో ఉన్న ఫ్యూచర్ గ్రూప్ దేశవ్యాప్తంగా బిగ్ బజార్ స్టోర్లను విస్తరిస్తోంది. 2015లో కొత్తగా 12 ఔట్లెట్లను తెరుస్తోంది. వీటిలో తెలుగు రాష్ట్రాల్లో 4 స్టోర్లు రానున్నాయి. ఏప్రిల్కల్లా హైదరాబాద్ చందానగర్, రాజమండ్రిలో ఏర్పాటవుతున్నాయి. డిసెంబర్కల్లా హైదరాబాద్ టోలిచౌకి, గుంటూరు స్టోర్లు అందుబాటులోకి వస్తాయని ఫ్యూచర్ గ్రూప్ ఉన్నతాధికారి ఒకరు ముంబై నుంచి సాక్షి బిజినెస్ బ్యూరోకు ఫోన్లో తెలిపారు. స్టోర్లు 40-70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటాయని వెల్లడించారు. ఒక్కో స్టోర్ ఏర్పాటుకు రూ.12 కోట్ల దాకా వ్యయం అవుతుందని పేర్కొన్నారు. కస్టమర్లకు వినూత్న షాపింగ్ అనుభూతి కల్పించేందుకు స్టోర్ల డిజైనింగ్పై ప్రత్యేక దృష్టిసారించినట్టు తెలిపారు. 24 నుంచి సబ్ సే సస్తా..: ఈ నెల 24-26 వరకు ‘చవకైన 3 రోజులు’ పేరుతో భారీ డిస్కౌంట్లను బిగ్ బజార్ దేశవ్యాప్తంగా ఆఫర్ చేస్తోంది. వినియోగదారులు ఏ ఉత్పత్తులపట్ల మక్కువ చూపుతున్నారో అధ్యయనం చేసి అందుబాటులో ఉంచుతున్నట్టు బిగ్ బజార్ దక్షిణ ప్రాంత వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్ కుమార్ తెలిపారు. ఫ్యామిలీ సెంటర్ హెడ్ సిలాస్ పాల్, మార్కెటింగ్ మేనేజర్ రితేష్తో కలిసి గురువారమిక్కడ ఆఫర్లను ప్రకటించారు. ఏటా జనవరిలో భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తున్నట్టు చెప్పారు. గతేడాది సేల్లో 1 కోటి మంది కస్టమర్లు షాపింగ్ చేశారని పేర్కొన్నారు. -
ఫ్యూచర్ గ్రూప్ చేతికి నీలగిరీస్ స్టోర్లు
న్యూఢిల్లీ: దక్షిణాదిలో విస్తరించిన నీలగిరీస్ చైన్ స్టోర్లను ఫ్యూచర్ కన్సూమర్ ఎంటర్ప్రైజెస్ సొంతం చేసుకుంది. రిటైల్ రంగ దిగ్గజం ఫ్యూచర్ గ్రూప్నకు ఇది అనుబంధ సంస్థకాగా, ఇందుకు రూ. 300 కోట్లను వెచ్చించనుంది. ఈ విషయాన్ని ఫ్యూచర్ గ్రూప్ సీఈవో కిషోర్ బియానీ వెల్లడించారు. దేశవ్యాప్తంగా స్టోర్ల నెట్వర్క్ను విస్తరించే బాటలో నీలగిరీస్లో 100% వాటా కొనుగోలు మరో ముందడుగు వంటిదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దీంతో తక్కువ పెట్టుబడుల పద్ధతిలో ఫ్రాంచైజీల ద్వారా వ్యాపారాన్ని విస్తరించేందుకు వీలు చిక్కుతుందని తెలిపారు. తయారీలో మరింత నైపుణ్యం, కొత్త బ్రాండ్లు పరిచయం చేసేందుకు అవకాశముంటుందని తెలిపారు. దక్షిణాదిపై పట్టు నీలగిరీస్ను కొనుగోలు చేసేందుకు ఫ్యూచర్ గ్రూప్ ఏడాది కాలంగా ప్రయత్నిస్తోంది. ప్రధానంగా ఉత్తర, పశ్చిమ భారతంలో విస్తరించిన కంపెనీ దక్షిణాదిలోనూ పట్టుచిక్కించుకునేందుకు నీలగిరీస్ ఉపయోగపడనుంది. ఫ్రాంచైజీ విధానంలో 140 ఔట్లెట్లను నీలగిరీస్ నిర్వహిస్తోంది. దక్షిణాదికి చెందిన నాలుగు రాష్ట్రాలకు చెందిన పట్టణ ప్రాంతాలలో స్టోర్లను ఏర్పాటు చేసింది. డైరీ, బేకరీ, చాకొలెట్స్ తదితర ఆహార సంబంధ ఉత్పత్తుల బ్రాండ్లను కలిగి ఉంది. బెంగళూరులో తయారీ ప్లాంట్ ఉంది. -
హైదరాబాద్లో సెంట్రల్ 2వ స్టోర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫ్యూచర్ గ్రూప్నకు చెందిన లైఫ్ స్టైల్ రిటైల్ బ్రాండ్ సెంట్రల్.. హైదరాబాద్లో రెండవ స్టోర్ను శుక్రవారం ప్రారంభించింది. కూకట్పల్లిలోని ఫోరమ్ సుజనా మాల్లో లక్షకుపైగా చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది ఏర్పాటైంది. దుస్తులు, వాచీలు, సౌందర్య సాధనాలు, ఆభరణాలు, ఫ్యాషన్ యాక్సెసరీస్ వంటి 100కుపైగా విభాగాలకు చెందిన ఉత్పత్తులు సెంట్రల్లో లభిస్తాయి. 500పైగా బ్రాండ్లు ఇక్కడ కొలువుదీరాయని సెంట్రల్ సీఈవో విష్ణు ప్రసాద్ తెలిపారు. నైకి, ప్యూమా, స్కెచర్స్, జాక్ అండ్ జోన్స్, యూఎస్ పోలో, అర్మాణీ, లివైస్, డేవిడఫ్, వాన్ హ్యూసెన్, లూయీ ఫిలిప్, రెడ్ టేప్, ఫాస్ట్ట్రాక్ వంటి అంతర్జాతీయ, జాతీయ బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. సెంట్రల్ స్టోర్ల సంఖ్య దేశవ్యాప్తంగా 29కి చేరుకుంది.