-
పాక్ పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా సౌతాఫ్రికా దిగ్గజం
పాకిస్తాన్ పరిమిత ఓవర్ల (వన్డే, టీ20) క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా సౌతాఫ్రికా దిగ్గజ ఆటగాడు గ్యారీ కిర్స్టెన్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డు అధికారికంగా వెల్లడించింది. పాక్ టెస్ట్ జట్టుకు ఆసీస్ మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ హెడ్ కోచ్గా వ్యవహరిస్తాడని పీసీబీ ప్రకటించింది. మూడు ఫార్మాట్లలో అసిస్టెంట్ కోచ్గా మాజీ ఆల్రౌండర్ (పాక్) ఉంటాడని పేర్కొంది. మే 22 నుంచి ప్రారంభమయ్యే ఇంగ్లండ్ టీ20 సిరీస్తో కిర్స్టెన్ పాక్ కోచింగ్ బాధ్యతలు చేపడతాడని తెలుస్తుంది. ఇంగ్లండ్ సిరీస్లో పాక్ నాలుగు టీ20లు ఆడుతుంది. అక్కడి నుంచి పాక్ జట్టు నేరుగా వరల్డ్కప్ వేదిక అయిన యూఎస్ఏకు బయల్దేరుతుంది. pic.twitter.com/nGMEvkPW70— Pakistan Cricket (@TheRealPCB) April 28, 2024 కాగా, 2023 వన్డే వరల్డ్కప్ తర్వాతి నుంచి పాక్ జట్టుకు రెగ్యులర్ హెడ్ కోచ్ లేడు. ఆ వరల్డ్కప్లో పాక్ జట్టు పేలవ ప్రదర్శన నేపథ్యంలో పీసీబీ అప్పటి ప్రధాన కోచ్ గ్రాంట్ బ్రాడ్బర్న్, టీమ్ డైరెక్టర్ మిక్కీ ఆర్థర్, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్, బ్యాటింగ్ కోచ్ ఆండ్రూ పుట్టిక్లను తొలగించింది. ఈ మెగా ఈవెంట్ తర్వాత పాక్ ప్రీమియర్ బ్యాటర్ బాబర్ అజామ్ కూడా కెప్టెన్సీ నుండి తొలగించబడ్డాడు. వైట్ బాల్ కెప్టెన్గా షాహీన్ షా ఆఫ్రిది, టెస్ట్ జట్టు కెప్టెన్గా షాన్ మసూద్ ఎంపికయ్యారు. అయితే ఇటీవలి పరిణామాల నేపథ్యంలో పీసీబీ తిరిగి బాబర్ ఆజమ్ను పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్గా నియమించింది.కిర్స్టెన్ విషయానికొస్తే.. రిటైర్మెంట్ అనంతరం ఫుల్టైమ్ కోచ్గా సెటిల్ అయిన కిర్స్టెన్ దేశ విదేశాల్లో చాలా జట్లకు కోచ్గా పని చేశాడు. కిర్స్టెన్ టీమిండియా 2011 వన్డే వరల్డ్కప్ గెలిచినప్పుడు హెడ్ కోచ్గా ఉన్నాడు. ఈ సౌతాఫ్రికా మాజీ ఆల్రౌండర్ ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్గా పని చేస్తున్నాడు. 56 ఏళ్ల కిర్స్టెన్ సౌతాఫ్రికా తరఫున101 టెస్ట్లు, 185 వన్డేలు ఆడి 14000 పైచిలుకు పరుగులు చేశాడు. కిర్స్టెన్ గతంలో సొంత జట్టుకు కూడా కోచ్గా పని చేశాడు. -
నెదర్లాండ్ జట్టు సలహాదారుడిగా టీమిండియా మాజీ కోచ్
టీ20 ప్రపంచకప్-2022కు ముందు నెదర్లాండ్ క్రికెట్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు సలహాదారులుగా టీమిండియా మాజీ కోచ్, దక్షిణాఫ్రికా దిగ్గజం గ్యారీ కిర్స్టన్, ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ డేన్ క్రిస్టియన్ను నెదర్లాండ్ క్రికెట్ నియమించింది. కాగా నెదర్లాండ్స్ ఆటగాళ్ళు ఆస్ట్రేలియాకు వెళ్లేముందు కేప్ టౌన్లోని గ్యారీ కిర్స్టన్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందారు. ఈ క్రమంలో మళ్లీ అతడు జట్టుతో సలహారుడిగా జతకట్టనున్నాడు. అదే విధంగా ఆడిలైడ్లో నెదార్లాండ్ ట్రైనింగ్ క్యాంప్లో జట్టుతో క్రిస్టియన్ కలవనున్నాడు. వీరిద్దరూ నెదర్లాండ్ హెడ్ కోచ్ ర్యాన్ కూక్తో కలిసి పనిచేయనున్నారు. "టీ20 ప్రపంచకప్ కోసం మా జట్టు కోచింగ్ స్టాప్లో గ్యారీ కిర్స్టన్, డాన్ క్రిస్టియన్ చేరడం మాకు చాలా సంతోషంగా ఉంది. వారి అనుభవంతో జట్టును విజయ పథంలో నడిపిస్తారని ఆశిస్తున్నాను" అని నెదర్లాండ్ క్రికెట్ బోర్డు హై పెర్ఫార్మెన్స్ మేనేజర్ రోలాండ్ లెఫెబ్రే పేర్కొన్నారు. కాగా కిర్స్టన్ 2011లో వన్డే వరల్డ్కప్ సొంతం చేసుకున్న భారత జట్టు హెడ్ కోచ్గా కిర్స్టన్ పనిచేశాడు. ఇక నెదర్లాండ్ ఈ మెగా ఈవెంట్లో తొలుత క్వాలిఫియర్ మ్యాచ్లు ఆడనుంది. డచ్ జట్టు తమ తొలి మ్యాచ్లో ఆక్టోబర్16న యూఏఈతో తలపడనుంది. చదవండి: R Ashwin Vs Ramiz Raja: పీసీబీ చైర్మన్ రమీజ్ రాజాకు అశ్విన్ దిమ్మతిరిగే కౌంటర్ -
IPL 2022: ఐపీఎల్ అత్యుత్తమ కోచ్లలో తనూ ఒకడు! ఎందుకంటే!
IPL 2022- Gujarat Titans: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్ హెడ్కోచ్ ఆశిష్ నెహ్రాపై ఆ జట్టు మెంటార్ గ్యారీ కిర్స్టన్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతడు ఏ పనిచేసినా మనసు పెట్టి అంకితభావంతో పూర్తి చేస్తాడని కితాబిచ్చాడు. నెహ్రాతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్న కిర్స్టన్.. ఐపీఎల్లోని బెస్ట్ కోచ్లలో అతడూ ఒకడంటూ ఆకాశానికెత్తాడు. ఆశిష్ నెహ్రా మార్గదర్శనంలోని కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్-2022లో అదరగొట్టిన సంగతి తెలిసిందే. అరంగేట్ర సీజన్లోనే లీగ్ దశలో టాపర్గా నిలిచి.. ఆపై రాజస్తాన్ రాయల్స్తో జరిగిన ఫైనల్లోనూ సత్తా చాటింది. క్యాష్ రిచ్ లీగ్లో ఎంట్రీ ఇచ్చిన తొలి ఎడిషన్లోనే ట్రోఫీని ముద్దాడి మధుర జ్ఞాపకంగా మిగుల్చుకుంది. గుజరాత్ టైటిల్ గెలవడంలో గ్యారీ కిర్స్టన్, నెహ్రాదే కీలక పాత్ర అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐసీసీ వరల్డ్కప్-2011 సమయంలో టీమిండియా కోచ్గా ఉన్న కిర్స్టన్, అప్పటి భారత జట్టులో సభ్యుడైన ఆశిష్ నెహ్రా 2018లో ఆర్సీబీ కోచింగ్ సిబ్బందిలో భాగమయ్యారు. ఆ తర్వాత ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్ హెడ్కోచ్గా నెహ్రా బాధ్యతలు స్వీకరిస్తే.. మెంటార్గా కిర్స్టన్ సేవలు అందించాడు. ఈ నేపథ్యంలో గ్యారీ కిర్స్టన్ క్రిక్బజ్తో మాట్లాడుతూ.. ‘‘ఆశిష్ నాకు ప్రాణ స్నేహితుడు. మా ఇద్దరిది సుదీర్ఘ ప్రయాణం. ఆటను అర్థం చేసుకోవడంలో.. అత్యంత ప్రొఫెషనల్గా వ్యవహరించడంలో తనకు తానే సాటి. తను మనసు పెట్టి పని చేస్తాడు. కోచ్గా కూడా అంతే! ఎల్లప్పుడూ తన జట్టులోని ఆటగాళ్ల గురించి, వాళ్లకు మెలకువలు నేర్పడం గురించే ఆలోచిస్తూ ఉంటాడు. తను ఎప్పుడూ లో ప్రొఫైల్లోనే ఉంటాడు. అందరి దృష్టిలో పడాలనుకోవడం తనకు పెద్దగా ఇష్టం ఉండదు. అత్యంత నేర్పరులుగా వ్యవహరించే ఐపీఎల్ అత్యుత్తమ కోచ్లలో ఆశిష్ నెహ్రా కూడా ఒకడు’’ అని నెహ్రాపై ప్రశంసల వర్షం కురిపించాడు. చదవండి 👇 IPL 2023: ఏడు కోట్లా! అంత సీన్ లేదు! సిరాజ్ను వదిలేస్తే.. చీప్గానే కొనుక్కోవచ్చు! వైభవంగా టీమిండియా క్రికెటర్ పెళ్లి.. ఫోటోలు వైరల్ Kal ki yeh yaadgar shaam, aap ke pyaar aur support ke naam 🥰😁 Jald lautenge, tab tak khayal rakhna Amdavad 💙#SeasonOfFirsts #AavaDe pic.twitter.com/IMgH0izYAL — Gujarat Titans (@gujarat_titans) May 31, 2022 -
గుజరాత్ టైటాన్స్ విజయంలో అజ్ఞాతవ్యక్తి; మాటల్లేవు.. అంతా చేతల్లోనే
క్రికెట్లో ఒక జట్టు మేజర్ కప్ గెలిచిదంటే ముందుగా పేరొచ్చేది జట్టు కెప్టెన్కే. ఎందుకంటే కెప్టెన్ ప్రత్యక్షంగా కనిపిస్తాడు కాబట్టి. ఒక కెప్టెన్గా కర్త, కర్మ, క్రియ అన్నీ తానై జట్టును ముందుండి నడిపించి చాంపియన్గా నిలపడం అతని లక్ష్యం. కానీ కెప్టెన్ పేరు ప్రత్యక్షంగా కనిపిస్తే.. తెరవెనుక కనిపించని హీరో మరొకరు ఉంటారు. అతనే టీమ్ కోచ్. జట్టులో ఎవరు సరిగా ఆడుతున్నారు.. ఎవరు బలహీనంగా ఉన్నారు.. బాధ్యతగా ఎవరు ఆడుతున్నారు.. ఒక ఆటగాడి వల్ల జట్టుకు ఎంత ఉపయోగం అనేది కోచ్ దగ్గరుండి పర్యవేక్షిస్తాడు. ప్రత్యక్షంగా కెప్టెన్కు ఎంత పేరు వస్తుందో.. కోచ్కు కూడా అంతే ఉంటుంది. అయితే అది తెర వెనుక మాత్రమే అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. తాజాగా ఐపీఎల్ 2022 సీజన్లో గుజరాత్ టైటాన్స్ చాంపియన్గా నిలిచింది. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా అన్నీ తానై నడిపించిన హార్దిక్ పాండ్యాను మెచ్చుకోవడానికి ముందు మరొక అజ్ఞాతవ్యక్తిని తప్పక పొగడాల్సిందే. గుజరాత్ టైటాన్స్ మెంటార్స్గా టీమిండియా మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రా, దక్షిణాఫ్రికా దిగ్గజం గ్యారీ కిర్స్టెన్ ఉన్న సంగతి తెలిసిందే. ఆశిష్ నెహ్రా గురించి పక్కనబెడితే కిర్స్టెన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిందే. PC: IPL Twitter ఎప్పుడైతే గ్యారీ కిర్స్టెన్ గుజరాత్ టైటాన్స్కు మెంటార్గా వచ్చాడో.. ఆ జట్టు అప్పుడే సగం విజయం సాధించినట్లయింది. ఎందుకంటే కిర్స్టెన్ ఎంత గొప్ప కోచ్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2011 వన్డే వరల్డ్కప్ టీమిండియా గెలవడంలో కోచ్ కిర్స్టెన్ పాత్ర కీలకం. నాయకుడిగా ధోని జట్టును ముందుండి నడిపిస్తే.. తెరవెనుక కోచ్ పాత్రలో కిర్స్టెన్ విలువైన సలహాలు ఇచ్చి టీమిండియాను 28 ఏళ్ల తర్వాత జగజ్జేతగా నిలిపాడు. అలాంటి వ్యక్తి.. గుజరాత్ టైటాన్స్కు మెంటార్గా రావడం.. అతని సలహాలు కెప్టెన్ పాండ్యా తప్పకుండా పాటించడం జట్టుకు మేలు చేశాయి. PC: IPL Twitter ఐపీఎల్ 2022లో ''మ్యాచ్ కిల్లర్''గా మారినడేవిడ్ మిల్లర్ ఆరంభ మ్యాచ్ల్లో పెద్దగా రాణించింది లేదు. అయినప్పటికి హార్దిక్ అతన్ని జట్టులో కొనసాగించడంపై మాస్టర్ ప్లాన్ కిర్స్టెన్దే. కట్చేస్తే మిల్లర్ ఫైనల్లోనూ చెలరేగి గుజరాత్ టైటాన్స్కు కప్ అందించాడు. అంతేకాదు లీగ్ ఆరంభానికి ముందు పాండ్యాపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. అంతకముందు జరిగిన టి20 ప్రపంచకప్లో దారుణ ప్రదర్శనతో జట్టుకు దూరమయ్యాడు. ఆ సమయంలో గుజరాత్కు కెప్టెన్గా రావడం.. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించేలా కిర్స్టెన్ పాండ్యాను ప్రోత్సహించడం జరిగిపోయాయి. మాటలు ఎక్కువగా మాట్లాడకుండా ఎక్కువ చేతల్లోనే పనిని చూపించే వ్యక్తి కిర్స్టెన్.. ఒక రకంగా గుజరాత్ టైటాన్స్ విజయం సాధించడంలో తన పాత్ర కూడా ఉంటుంది. చదవండి: 'అవమానాలు తట్టుకుని నా భర్త విజయం సాధించాడు.. అందుకే' Hardik Pandya-Ravi Shastri: ఇద్దరి బంధం ఎంతో ప్రత్యేకం.. అపూర్వ కలయిక -
గుజరాత్ టైటాన్స్కు భారీ షాక్.. కోచ్ పదవి నుంచి తప్పుకోనున్న కిర్స్టన్..!
Gary Kirsten To Step Down As Gujarat Titans Coach: ఐపీఎల్ 2022 సీజన్ ద్వారా క్యాష్ రిచ్ లీగ్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ లీగ్ మొదటి దశ మ్యాచ్లు ముగిసే సమయానికి వరుస విజయాలతో (7 మ్యాచ్ల్లో 6 విజయాలు) దూసుకుపోతూ, పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఏమాత్రం అంచనాలు లేకుండా సీజన్ బరిలోకి దిగిన ఆ జట్టును బ్యాటింగ్ కోచ్, మెంటార్ గ్యారీ కిర్స్టన్ అద్భుతమైన వ్యూహా రచనలతో సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నాడు. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, ఇతర ఆటగాళ్లను సమన్వయం చేసుకుని గుజరాత్ టైటాన్స్ను టైటిల్ వేటలో ముందువరుసలో ఉంచాడు. కాగా, తాజాగా మారిన సమీకరణల కారణంగా అతను గుజరాత్ టైటాన్స్ను షాకివ్వనున్నాడని తెలుస్తోంది. అతనికి ఇంగ్లండ్ ప్రధాన కోచ్ పదవి ఆఫర్ రావడంతో త్వరలోనే గుజరాత్ టైటాన్స్ కోచింగ్, మెంటార్ బాధ్యతలకు గుడ్బై చెప్పనున్నాడని సమాచారం. ఐపీఎల్ 2022 సీజన్తో అతను గుజరాత్తో బంధం తెంచుకోనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇంగ్లండ్ హెడ్ కోచ్గా అతని పేరు అధికారికంగా వెలువడితే కిర్స్టన్ ఆ జట్టుతో కలవాల్సి ఉంటుంది. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుతో ఒప్పందం మేరకు అతడు ఇంగ్లండ్ కోచ్గా ఉండగా మరే జట్టుకు పనిచేసే అవకాశం ఉండదు. దీంతో కిర్స్టన్ త్వరలోనే ఐపీఎల్ను వీడతాడన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఈసీబీ కిర్స్టన్ను హెడ్ కోచ్గా అధికారికంగా ప్రకటించినప్పటికీ, అతను ఐపీఎల్ తర్వాతే ఆ జట్టుతో కలుస్తాడు. ఎందుకంటే, ఐపీఎల్ 2022 సీజన్ మే 29తో ముగియనుండగా, ఇంగ్లండ్ జట్టు జూన్ 2 నుంచి స్వదేశంలో న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ ఆడనుంది. కాగా, కిర్స్టన్ మార్గదర్శకత్వంలోనే టీమిండియా 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన విషయం తెలిసిందే. చదవండి: ఆ మ్యాచ్ చూస్తూ రిమోట్లు, బాటిళ్లు పగులగొట్టా: రికీ పాంటింగ్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్గా అతడే.. హెడ్కోచ్గా గ్యారీ కిర్స్టన్!
Ben Stokes: వరుస పరాజయాల నేపథ్యంలో విమర్శలు వెల్లువెత్తిన తరుణంలో ఇంగ్లండ్ కెప్టెన్సీకి జో రూట్ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ మొదలు వెస్టిండీస్ పర్యటనలో ఓటమి అనంతరం అతడిపై వేటు వేయాలని డిమాండ్లు వినిపించాయి. ఈ క్రమంలో అతడు స్వయంగా తానే కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. ఈ క్రమంలో స్టార్ ఆల్రౌండర్, వైస్ కెప్టెన్ బెన్స్టోక్స్ ఈ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు నూతన మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీతో సమావేశం అనంతరం టెస్టు కెప్టెన్సీ తీసుకునేందుకు స్టోక్స్ అంగీకరించినట్లు సమాచారం. ఇక ఈ నియామకానికి సంబంధించి పేపర్ వర్క్ పూర్తైన అనంతరం అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది. టెలిగ్రాఫ్ కథనం ప్రకారం.. రాబ్ కీ గురువారం మీడియా సమావేశం నిర్వహించి ఈ విషయాన్ని వెల్లడించనున్నాడు. ఇదిలా ఉండగా.. దక్షిణాఫ్రికా దిగ్గజం గ్యారీ కిర్స్టన్ను లేదంటే ఆస్ట్రేలియా మాజీ కోచ్ సైమన్ కటిచ్ను ఇంగ్లండ్ హెడ్కోచ్గా నియమించే యోచనలో రాబ్ కీ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా మానసిక ఆందోళనల కారణంగా కొన్నాళ్లపాటు జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. యాషెస్ సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇచ్చిన అతడు.. వెస్టిండీస్తో సిరీస్లో అదరగొట్టాడు. విండీస్తో రెండో టెస్టు సందర్భంగా.. టెస్టుల్లో 5 వేల పరుగులు పూర్తి చేసుకోవడంతో పాటుగా 150కి పైగా వికెట్లు పడగొట్టిన ఐదో ఆల్రౌండర్గా చరిత్రకెక్కాడు. చదవండి👉🏾Sanju Samson: సంజూ బాగానే ఆడుతున్నాడు.. కానీ టీమిండియాలో చోటు దక్కడం కష్టమే! -
IPL 2022: అహ్మదాబాద్ హెడ్ కోచ్గా టీమిండియా మాజీ పేసర్..!
Ashish Nehra: ఐపీఎల్ 2022 ద్వారా క్యాష్ రిచ్ లీగ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్న అహ్మదాబాద్ ఫ్రాంఛైజీ.. జట్టు హెడ్ కోచ్, సహాయక సిబ్బంది విషయంలో ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. జట్టు హెడ్ కోచ్గా టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రాని, మెంటార్గా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్స్టన్ను ఎంచుకున్నట్టు సమాచారం. ఈ ఇద్దరి ఎంపిక లాంఛనమేనని ఫ్రాంఛైజీ వర్గాలు ద్వారా తెలుస్తోంది. మరోవైపు కోచ్, సహాయక సిబ్బందిని ఎంచుకునే విషయంలో మరో అరంగేట్రం జట్టు లక్నో ఓ రెండు అడుగులు ముందే ఉంది. ఆ జట్టు తమ ఫ్రాంఛైజీ హెడ్ కోచ్గా జింబాబ్వే మాజీ ఆటగాడు ఆండీ ఫ్లవర్ను, మెంటర్గా టీమిండియా మాజీ ఓపెనర్, ప్రస్తుతం ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ను ఎంపిక చేసుకుంది. కాగా, లక్నో జట్టును ఆర్పీఎస్జీ గోయెంకా గ్రూప్ గ్రూప్ రూ.7090 కోట్లకు కొనుగోలు చేస్తే, అహ్మదాబాద్ ఫ్రాంఛైజీని సీవీసీ క్యాపిటల్ రూ.5625 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఐపీఎల్లో ఈ రెండు జట్లు చేరడంతో మొత్తం ఐపీఎల్ జట్ల సంఖ్య 8కి చేరింది. చదవండి: కుంబ్లే సరసన శార్దూల్.. అరుదైన ఘనత సాధించిన బౌలర్గా రికార్డు -
ఇంగ్లండ్ కోచ్గా గ్యారీ కిర్స్టన్!
యాషెస్ సిరీస్లో ఇంగ్లండ్ ఘోరమైన ప్రదర్శన కనబరుస్తుంది. ఇప్పటికే వరుసగా మూడు టెస్ట్ల్లో ఓడిపోయి సిరీస్ను కోల్పోయింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ జట్టు కోచ్ సిల్వర్ వుడ్, కెప్టెన్ జో రూట్పైన తీవ్రస్ధాయిలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ ఓటమికు బాధ్యతగా వారి పదవులకు రాజీనామా చేయాలని ఇంగ్లండ్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ గ్యారీ కిర్స్టన్ ఇంగ్లండ్ టెస్ట్ కోచ్గా బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తిని కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. 2011 వన్డే ప్రపంచకప్ గెలచిన భారత జట్టుకు కిర్స్టన్ కోచ్గా వ్యవహరించాడు. తర్వాత టీమిండియా కోచ్ బాధ్యతలు నుంచి తప్పుకున్నకిర్స్టన్.. 2011 నుంచి 2013 వరకు దక్షిణాఫ్రికా జట్టుకు కోచ్గా ఉన్నాడు. కాగా కోచ్గా కిర్స్టన్ అద్భుతమైన రికార్డులను కలిగిఉన్నాడు. "ఇంగ్లండ్ టెస్ట్ కోచ్గా బాధ్యతలు స్వీకరించేందుకు నేను ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటాను. ఎందుకంటే ఇది గొప్ప గౌరవం. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటికే నేను రెండు సార్లు ఈ బాధ్యతలను చేపట్టాను. అయితే ప్రస్తుతం అన్ని ఫార్మాట్ల్లో కోచ్గా పని చేయాలని నేను అనుకోవడం లేదు. అన్ని ఫార్మాట్లుకు ఒకే కోచ్ కాకుండా, వేర్వేరుగా ఉండేటట్లు అంతర్జాతీయ క్రికెట్ బోర్డులు నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇంగ్లండ్ జట్టుకు వన్డే, టెస్ట్ ఫార్మాట్ల్లో కోచ్గా పని చేయాలి అని ఉంది. కానీ ఇప్పటికే వన్డేల్లో ఇంగ్లండ్ అధ్బుతంగా రాణిస్తుంది. వన్డేల్లో ఇంగ్లండ్ అత్యత్తుమైన జట్టు. ఇంగ్లండ్ వన్డే కోచింగ్ స్టాఫ్ అద్భుతమైనది. ఒకే వేళ కోచ్గా బాధ్యతలు అవకాశం వస్తే గొప్ప గౌరవంగా భావిస్తాను" అని కిర్స్టన్ పేర్కొన్నాడు. చదవండి: IND Vs SA: భారత్తో ఓటమి.. దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం! -
అహ్మదాబాద్ హెడ్ కోచ్గా గ్యారీ కిర్స్టెన్.. బౌలింగ్ కోచ్గా ఆశిష్ నెహ్రా!
ఐపీఎల్-2022లో రెండు కొత్త జట్లు రానున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ కొత్త ప్రాంఛైజీగా అవతరించిన అహ్మదాబాద్ కోచ్గా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు గ్యారీ కిర్స్టెన్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఈ మేరకు ఆ ఫ్రాంచైజీ ప్రతినిధులు ఇప్పటికే కిర్స్టెన్ తో సమావేశమైనట్టు సమాచారం. కాగా 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కిర్స్టెన్ కోచ్గా బాధ్యతలు నిర్వహించాడు. 2011 ప్రపంచకప్ అనంతరం టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత అతడు దక్షిణాఫ్రికా కోచ్ గా నియమితుడయ్యాడు. అయితే ఐపీఎల్లో కోచ్గా అతడికి ఇదేం తొలిసారి కాదు. అంతకుముందు ఆర్సీబీ జట్టుకు హెడ్ కోచ్ గా కిర్స్టెన్ పనిచేశాడు. అదే విధంగా జట్టు బౌలింగ్ కోచ్గా భారత మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రాతో అహ్మదాబాద్ ప్రతినిధులు సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఐపీఎల్లో సన్రైజర్స్ జట్టు బౌలింగ్ కోచ్గా గతంలో ఆశిష్ నెహ్రా వ్యవహరించాడు. కాగా అంతకుముందు భారత మాజీ కోచ్ రవిశాస్త్రి అహ్మదాబాద్ కోచ్గా రానున్నడని వార్తలు వినిపించాయి. చదవండి: 'పుష్ప' ట్రాన్స్లో టీమిండియా ఆల్రౌండర్.. 'తగ్గేదే లే' -
Gary Kirsten: పాకిస్తాన్ హెడ్ కోచ్గా.. టీమిండియా మాజీ కోచ్!
This Former Cricketer To Replace Misbah-ul-Haq: టీ20 వరల్డ్కప్-2021 టోర్నీలో పాకిస్తాన్ జట్టు అదరగొడుతోంది. టీమిండియా, న్యూజిలాండ్ వంటి మేటి జట్లపై వరుస విజయాలు సాధించి సెమీస్కు చేరువవుతోంది. తద్వారా క్రీడా విశ్లేషకులు ప్రశంసలు అందుకుంటోంది. అయితే, ఈ ఈవెంట్ ఆరంభానికి ముందు పాకిస్తాన్ క్రికెట్లో భారీ మార్పులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. హెడ్ కోచ్ మిస్బా ఉల్ హక్ సహా బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్ తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మెగా ఈవెంట్ ఆరంభానికి ముందు ఈ మేరకు నిర్ణయం తీసుకోవడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సందిగ్దంలో పడింది. సక్లెయిన్ ముస్తాక్ను తాత్కాలిక హెడ్కోచ్గా నియమించింది. అయితే... విదేశీ కోచ్కు ఈ బాధ్యతలు అప్పజెప్పాలని పీసీబీ చైర్మన్ రమీజ్ రాజా భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, టీమిండియాకు హెడ్ కోచ్గా సేవలు అందించిన గ్యారీ కిర్స్టన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మిస్బా స్థానాన్ని కిర్స్టన్తో భర్తీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక అతడితో పాటు సైమన్ కటిచ్(ఆస్ట్రేలియా), పీటర్ మూర్స్(ఇంగ్లండ్) పేర్లు కూడా తెరమీదకు వచ్చాయి. మూడేళ్లపాటు గ్యారీ కిర్స్టన్ 2008-2011 మధ్య కాలంలో టీమిండియా ప్రధాన శిక్షకుడిగా వ్యవహరించాడు. అతడి నిర్దేశనంలో.. ఎంఎస్ ధోని సారథ్యంలో భారత జట్టు 2011 వన్డే వరల్డ్కప్ గెలిచింది. మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత జగజ్జేతగా నిలిచింది. ఇక కిర్స్టన్ కోచ్గా ఉన్నపుడే టీమిండియా టెస్టు ఫార్మాట్లోనూ నంబర్ 1 ర్యాంకుకు చేరుకుంది. క్రికెటర్గా కిర్స్టన్ గణాంకాలు దక్షిణాఫ్రికా తరఫున గ్యారీ కిర్స్టన్.. 185 వన్డేలు, 101 టెస్టులు ఆడాడు. టెస్టుల్లో 7289, వన్డేల్లో 6798 పరుగులు చేశాడు. 2004లో ప్రొటిస్ జట్టు తరఫున చివరి మ్యాచ్ ఆడాడు. చదవండి: T20 World Cup 2021: నెట్స్లో శ్రమిస్తున్న పాండ్యా.. శార్దూల్, భువీతో కలిసి బౌలింగ్ చేస్తూ.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); T20 World Cup 2021: అలా అయితేనే టీమిండియా సెమీస్కు.. లేదంటే.. -
కొడితే సిక్సే.. సింగిల్స్ అసలు తీయరేమో
వాషింగ్టన్: జెంటిల్మెన్ గేమ్ క్రికెట్లో సింగిల్స్ను తిరస్కరించే రోజులు మరెంతో దూరంలో లేవని టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్యానించారు. కొడితే సిక్సే కొట్టాలని బ్యాట్స్మెన్లు ఫిక్స్ అయ్యే రోజులు వస్తాయని, సింగిల్స్కు కాలం చెల్లే రోజులు దగ్గరలో ఉన్నాయని అభిప్రాయపడ్డారు. బ్యాట్కు బంతికి మధ్య జరిగే పోటీని గణాంకాలు నడిపించనున్నాయని జోస్యం చెప్పాడు. ఆటగాళ్ల ఎంపిక, వ్యూహరచనలను గణాంకాలు ఎంతగానో ప్రభావితం చేస్తాయని, బేస్బాల్ తరహాలో క్రికెట్లో సైతం గణాంకాలే కీలమని ఆయన పేర్కొన్నాడు. క్రికెట్లో గణాంకాలపై నిర్వహించిన సదస్సులో ద్రవిడ్తో పాటు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ గ్యారీ కిర్స్టన్, ఇంగ్లండ్ మహిళల జట్టు మాజీ క్రీడాకారిణి ఇషా గుహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ద్రవిడ్ మాట్లాడుతూ.. ఆటగాళ్ల సాధన దగ్గర నుండి ఫిట్నెస్, బౌండరీలు, సిక్సర్లు లాంటి మరెన్నో అంశాల్లో డేటా చాలా ఉపయోగపడుతుందని వివరించాడు. బాస్కెట్ బాల్లోని 3 పాయింట్ రెవల్యూషన్ తరహాలోనే క్రికెట్లో కూడా డేటా ప్రయోజనాలుంటాయని స్పష్టం చేశారు. టీ20ల్లో ప్రతి బంతికీ ప్రాముఖ్యత ఉంటుందని, కొత్త కుర్రాళ్లు మెరుగైన సాంకేతికతను వినియోగించుకొని ప్రత్యర్థి బలాబలాలను విశ్లేషించుకొని మరీ ప్రతిదాడి చేస్తున్నారని, ఇందుకు వారు డేటాను బాగా వినియోగించుకుంటున్నారని ఇషా గుహ తెలిపారు. క్రీడల్లో సందిగ్ధం నెలకొనప్పుడు డేటా ఎలా ఉపయోగపడుతోందో అన్న అంశాన్ని గ్యారీ కిర్స్టెన్ వివరించారు. చదవండి: ద్రవిడ్ను ఇంత కోపంగా ఎప్పుడూ చూడలేదు.. -
‘ధోనితో కలిసి పనిచేయడం గొప్ప గౌరవం’
న్యూఢిల్లీ: భారత మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోని అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన సందర్భంగా అతని సహచరులు, మిత్రులు, శ్రేయాభిలాషుల నుంచి అభినందనలు, ఉద్వేగపూరిత సందేశాలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. తాజాగా భారత మాజీ కోచ్ గ్యారీ కిర్స్టెన్ మిస్టర్ కూల్తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. తను పని చేసిన గొప్ప నాయకుల్లో ధోని ఒకడని కిర్స్టెన్ కితాబిచ్చాడు. గ్యారీ హెడ్ కోచ్గా ఉన్న సమయంలోనే భారత్ 28 ఏళ్ల తర్వాత 2011లో మరోసారి ప్రపంచకప్ను గెలుపొందింది. ధోనితో కలిసి పని చేయడం తనకు దక్కిన గొప్ప గౌరవమని కిర్స్టెన్ వ్యాఖ్యానించాడు. ‘ ధోని నా వైపు ఉంటే నేను యుద్ధానికి కూడా సిద్ధం అని గతంలో ఎప్పుడూ అనేవాడిని. ఇది అతనిపై నాకున్న నమ్మకాన్ని తెలియజేస్తుంది. అతనో గొప్ప నాయకుడు. భారత క్రికెట్ జట్టుతో నాకు మధుర స్మృతుల్ని అందించిన ధోని నీకు ధన్యవాదాలు’ అని కిర్స్టెన్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నాడు. 52 ఏళ్ల కిర్స్టెన్ 2008–2011 మధ్య కాలంలో భారత్కు హెడ్ కోచ్గా వ్యవహరించాడు. -
‘2007లోనే రిటైర్మెంట్కు సచిన్ ప్లాన్’
ముంబై : మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 2013లో రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రపంచకప్ కలను సాకారం చేసుకొని, వంద సెంచరీలతో పాటు మరెన్నో రికార్డులను, ఘనతలను తన ఖాతాలో వేసుకొని సగర్వంగా ఆట నుంచి తప్పుకున్నాడు. అయితే ప్రపంచకప్ కల, పలు ఘనతలు అందుకోకముందే 2007లోనే సచిన్ రిటైర్మెంట్ తీసుకోవాలని భావించాడట. ఈ విషయాన్ని భారత క్రికెట్ జట్టుకు విజయవంతమైన కోచ్గా సేవలందించిన గ్యారీ కిర్స్టన్ వెల్లడించాడు. (టెండూల్కర్ డ్రైవ్... కోహ్లి క్రెసెంట్) ‘నేను టీమిండియా కోచ్గా బాధ్యతలు చేపట్టే సమయానికి సచిన్ రిటైర్మెంట్ ఆలోచనల్లో ఉన్నారు. నచ్చని స్థానాల్లో బ్యాటింగ్కు దిగడంపై అతడు చాలా అసంతృప్తి, అసహనం వ్యక్తం చేసేవానే. అయితే సచిన్తో పాటు ద్రవిడ్, లక్ష్మణ్లు కూడా ఎవరు ఏ స్థానంలో బ్యాటింగ్కు దిగుతారో క్రీజులోకి వెళ్లేవరకు తెలియదు. ముఖ్యంగా ఆ సమయంలో సచిన్ ఆటను ఎంజాయ్ చేయలేకపోయాడు. దీంతో ఆటను వదిలేయాలనుకున్నాడు. (ఏడు నిమిషాల్లోనే పూర్తయింది...) అయితే నేను కోచ్గా బాధ్యతలు చేపట్టాక అతను ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాలనుకున్నాడో ఆ స్థానంలోనే ఆడే ఆవకాశం ఇచ్చాను. ఆటగాళ్లకు పూర్తి స్వేచ్చనిచ్చాను. నేను కోచ్గా బాధ్యతలు చేపట్టిన మూడేళ్ల వ్యవధిలోనే సచిన్ ఏకంగా 18 శతకాలు సాధించాడు. అయితే నేను గొప్ప కోచింగ్ ఇచ్చానని అనడం లేదు. ఆటగాళ్లకు పూర్తి స్వేచ్చా వాతవరణాన్ని కల్పించా’ అని కిర్స్టన్ పేర్కొన్నాడు. ఇక కిర్స్టన్ కోచింగ్లోనే టీమిండియా టెస్టుల్లో నంబర్ వన్ స్థానాన్ని, వన్డే ప్రపంచకప్-2011ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. -
ఏడు నిమిషాల్లోనే...
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు పురోగతిలో కోచ్గా గ్యారీ కిర్స్టెన్ పోషించిన పాత్ర ఎంతో ప్రత్యేకం. టెస్టుల్లో టీమిండియా నంబర్వన్ స్థానానికి చేరుకోవడంతో పాటు 2011 వన్డే ప్రపంచకప్ చాంపియన్గా నిలవడం కిర్స్టెన్ హయాంలోనే జరిగింది. తాను కోచ్గా ఎంపిక కావడానికి సంబంధించి ఒక ఆసక్తికర అంశాన్ని అతను ఇటీవల పంచుకున్నాడు. కోచింగ్పై తనకు ఆసక్తి గానీ, అనుభవం గానీ లేవని... అసలు తనంతట తానుగా ఆ పదవి కోసం దరఖాస్తు కూడా చేసుకోలేదని కిర్స్టెన్ అన్నాడు. ‘భారత జట్టుకు శిక్షణ ఇవ్వగలవా అంటూ కోచింగ్ సెలక్షన్ కమిటీ సభ్యుడైన సునీల్ గావస్కర్నుంచి నాకు మెయిల్ వచ్చింది. ఏదో ఆకాశరామన్న ఉత్తరం అనుకొని పట్టించుకోలేదు. ఇంటర్వ్యూకు హాజరు కాగలవా అంటూ మళ్లీ అలాంటి మెయిల్ వస్తే నా భార్యకు చూపించాను. ఆమె కూడా నమ్మలేదు. పొరపాటున నాకు వచ్చిందేమోనని భావించింది. ఎందుకంటే నాకు అప్పటికీ ఎలాంటి కోచింగ్ అనుభవం లేదు’ అని కిర్స్టెన్ చెప్పాడు. చివరకు నిజమని నిర్ధారించుకొని ఇంటర్వ్యూకు వెళ్లాక జట్టు కెప్టెన్ అనిల్ కుంబ్లే కలిశాడని... తాను కోచ్ ఇంటర్వ్యూ కోసం వచ్చానని చెబితే కుంబ్లే పగలబడి నవ్వాడని గ్యారీ గుర్తు చేసుకున్నాడు. మొత్తంగా 7 నిమిషాల్లోనే తన ఇంటర్వ్యూ పూర్తయిందని, అప్పటికప్పుడు కోచ్ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చినట్లు ఈ దక్షిణాఫ్రికా మాజీ ఓపెనర్ వెల్లడించాడు. ‘ఇంటర్వ్యూ ప్యానెల్లో ఉన్న రవిశాస్త్రి కఠినమైన ప్రశ్న అడిగాడు. భారత జట్టును ఓడించేందుకు మీ దక్షిణాఫ్రికా జట్టు ఏం చేసేదని అతను ప్రశ్నించాడు. నాకు తెలుసు అది చెప్పడం అంత సులువు కాదని. అయితే పూర్తిగా వ్యూహాల గురించి మాట్లాడకుండా మూడు నిమిషాల్లో దానిని వారికి అర్థమయ్యేలా వివరించగలిగాను. భారత జట్టు భవిష్యత్తు గురించి మీ వద్ద ఏదైనా ప్రణాళిక ఉందా అని బోర్డు కార్యదర్శి ప్రశ్నించగా...నన్ను ఎవరూ అడగలేదని, సిద్ధమై రాలేదని చెప్పాను. అయినా సరే ఎంపిక కాగలిగాను’ అని కిర్స్టెన్ వివరించాడు. చాపెల్ పేరుతో కాంట్రాక్ట్... ఈ సమయంలో మరో ఆసక్తికర అంశం చోటు చేసుకుంది. తనను ఎంపిక చేస్తూ కాంట్రాక్ట్ ఇచ్చాక కోచ్ స్థానంలో పేరు చూసుకుంటే గ్యారీ కిర్స్టెన్కు బదులుగా గ్రెగ్ చాపెల్ (అంతకు ముందు కోచ్) పేరు రాసి ఉంది. దాంతో మీరు తప్పు లెటర్ ఇచ్చారంటూ కార్యదర్శికే వెనక్కి ఇచ్చేశాను. ఆయన పెన్తో చాపెల్ పేరు కొట్టేసి తన పేరు రాసిచ్చారని కిర్స్టెన్ నవ్వుతూ చెప్పాడు. -
ధోనికి ఆ హక్కు ఉంది
న్యూఢిల్లీ: గత రెండు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసిన అంశం మహేంద్రసింగ్ ధోని రిటైర్మెంట్. అయితే ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ధోనికి ఎప్పుడు రిటైర్ కావాలో ఒకరు చెప్పాల్సిన పని లేదని భారత మాజీ కోచ్ గ్యారీ కిర్స్టెన్ ఘాటుగా వ్యాఖ్యానించాడు. ‘ఆటకు తాను అనుకున్నప్పుడే రిటైర్మెంట్ ఇచ్చే హక్కు ధోనికి ఉంది. అతను సాధించిన ఘనతలతో ఆ స్థాయికి చేరుకున్నాడు రిటైరయ్యే సమయం వచ్చిందంటూ అతనికి ఎవరూ చెప్పాల్సిన పని లేదు. అతనో అద్భుతమైన క్రికెటర్. ధోని మేధస్సు, శాంతం, శక్తి, అథ్లెటిక్స్ నైపుణ్యం, వేగం అతన్ని అందరిలో ప్రత్యేకంగా నిలుపుతాయి. ఆధునిక యుగం దిగ్గజ క్రీడాకారుల్లో ధోని ఒకరు’ అని కిర్స్టెన్ ధోనికి కితాబిచ్చాడు. -
గ్యారీ కిర్స్టన్కు మళ్లీ నిరాశే
లండన్: ఇటీవల భారత క్రికెట్ ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసుకుని భంగపడ్డ మాజీ కోచ్, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ గ్యారీ కిర్స్టన్కు మరోసారి నిరాశే ఎదురైంది. ఇంగ్లండ్ క్రికెట్ ప్రధాన కోచ్ పదవి కోసం కిర్స్టన్ దరఖాస్తు చేసుకున్నప్పటికీ అక్కడ కూడా చుక్కెదురైంది. తాజాగా ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా క్రిస్ సిల్వర్వుడ్ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంగ్లండ్ తుది జాబితాలో కిర్స్టన్ పేరున్నప్పటికీ సిల్వర్వుడ్ను నియమించడానికి ఈసీబీ మొగ్గుచూపింది. ఇంటర్యూలో కిర్స్టన్ కంటే సిల్వర్వుడ్ చెప్పిన సమాధానాలకే అధిక ప్రాముఖ్యత ఇచ్చిన ఈసీబీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. భారత్, దక్షిణాఫ్రికా జట్లకు హెడ్ కోచ్గా పనిచేసిన అనుభవం ఉన్న కిర్స్టన్.. ఈసీబీ రేసులో ముందందజలో నిలిచినా చివరకు మాత్రం ప్రతికూల ఫలితమే వచ్చింది. స్వదేశీ క్రికెటర్ కావడమే సిల్వర్వుడ్కు నియమాకానికి ప్రధాన కారణం. ఇప్పటివరకూ ఇంగ్లండ్కు కోచ్గా పని చేసిన ట్రావెర్ బెయిలీస్ పదవీ కాలం ఇటీవల ముగిసిన నేపథ్యంలో ఈసీబీ.. కోచ్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ క్రమంలోనే కిర్స్టన్ కూడా దరఖాస్తు చేసుకున్నాడు. పలువురు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు కిర్స్టన్ నియమానికే ఓటేసినా, ఆ దేశ క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సమక్షంలోనే ఈసీబీ సెలక్షన్ ప్యానల్ మాత్రం సిల్వర్వుడ్ పేరును ఖరారు చేసింది. 2017-18 సీజన్లో భాగంగా యాషెస్ సిరీస్కు 44 ఏళ్ల సిల్వర్వుడ్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్గా సేవలందించడం కూడా అతని నియమానికి దోహదం చేసింది. ఇంగ్లండ్ ప్రధాన కోచ్కు దరఖాస్తు చేసుకున్న వారిలో కిర్స్టన్తో పాటు అలెక్ స్టువార్ట్, గ్రాహమ్ ఫోర్డ్లు ఉన్నారు. -
మైక్ హెసన్కు కీలక పదవి
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఫ్రాంచైజీల్లో ఒకటైన కింగ్స్ పంజాబ్ ప్రధాన కోచ్ పదవికి ఇటీవల గుడ్ బై చెప్పిన మైక్ హెసన్.. ఇక నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కి సేవలందించనున్నాడు. వచ్చే ఐపీఎల్కు సంబంధించి ముందుగానే ప్రక్షాళన చేపట్టిన ఆర్సీబీ.. మైక్ హెసన్ను డైరక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్గా ఎంపిక చేసింది. టీమిండియా ప్రధాన కోచ్ పదవి కోసం పోటీపడ్డ హెసన్కు నిరాశ ఎదురైన సంగతి తెలిసిందే. మరోసారి రవిశాస్త్రినే కోచ్గా కొనసాగించేందుకు మొగ్గుచూపడంతో హెసన్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. మరొకవైపు బంగ్లాదేశ్ ప్రధాన కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసినా అక్కడ కూడా హెసన్కు చుక్కెదురైంది. కాగా, ఇప్పటివరకూ ఐపీఎల్ టైటిల్ సాధించలేకపోయిన ఆర్సీబీ.. హెసన్పై భారీ ఆశలు పెట్టుకుని తమ క్రికెట్ ఆపరేషన్స్ డైరక్టర్గా నియమించింది. అదే సమయంలో ఆర్సీబీ ప్రధాన కోచ్గా ఆసీస్కు చెందిన సైమన్ కాటిచ్ను ఎంపిక చేసింది. గతంలో కోల్కతా నైట్రైడర్స్కు అసిస్టెంట్ కోచ్గా పనిచేసిన కాటిచ్ను ఆర్సీబీ హెడ్ కోచ్గా నియమించుకుంది. టీ20 ఫార్మాట్లో అనేక జట్లతో పని చేసిన అనుభవం ఉన్న కాటిచ్కే పెద్ద పీట వేస్తూ నిర్ణయం తీసుకుంది. దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ గ్యారీ కిర్స్టన్ స్థానంలో కాటిచ్ను ఎంపిక చేస్తూ ఆర్సీబీ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. -
క్రీడల్లో ఫలితం గురించి ఆలోచించొద్దు
సాక్షి, హైదరాబాద్: క్రీడాకారులు ఫలితం గురించి ఆలోచించకుండా బరిలో దిగినప్పుడు మాత్రమే పూర్తిస్థాయి ప్రతిభ కనబరచగలుగుతారని భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ గ్యారీ కిర్స్టెన్ అన్నారు. ఆయన సెయింట్ మేరీస్ గ్రూప్నకు చెందిన స్కోలా మారియా ఇంటర్నేషనల్ స్కూల్ను సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో, యువ క్రీడాకారులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తాము ఎంచుకున్న క్రీడను ప్రేమించాలని అన్నారు. గట్టిగా కృషిచేస్తూ ఆటను ఆస్వాదిస్తేనే సుదీర్ఘ కాలం మెరుగైన ఫలితాలు పొందవచ్చని సూచించారు. 40 ఏళ్ల పాటు క్రికెటే తన జీవితంగా మారిపోయిందంటూ వరల్డ్ కప్ గెలిచిన భారత క్రికెట్ జట్టుకు కోచ్గా వ్యవహరించిన కిర్స్టన్ గుర్తు చేసుకున్నారు. క్రీడాకారులకు గెలుపు మాత్రమే ప్రయాణం కాకూడద న్న ఆయన విద్యార్థి సమగ్రాభివృద్ధి సాధించే లా ఉపాధ్యాయులు సహకరించాలని వ్యాఖ్యా నించారు. ఏ విషయంలోనూ తల్లిదండ్రులు పిల్లల్ని ఒత్తిడి చేయవద్దని సూచించారు. -
అమ్మాయిల ‘గురు’ రామన్
ముంబై:భారత మహిళల క్రికెట్ జట్టు కోచ్గా మాజీ ఓపెనర్ డబ్ల్యూవీ రామన్ను క్రికెట్ పరిపాలక కమిటీ (సీఓఏ) నియమించింది. పురుషుల కోచ్గా భారత్కు వన్డే ప్రపంచకప్ అందించిన గ్యారీ కిర్స్టెన్ను కాదని రామన్ను కోచ్గా నియమించినట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాంతా రామస్వామిలతో కూడిన అడ్హక్ కమిటీ తొలి ప్రాధాన్యంగా కిర్స్టెన్ను ఎంపిక చేసింది. తర్వాతి స్థానాల్లో రామన్, వెంకటేశ్ ప్రసాద్లతో వున్న తుది జాబితాను కమిటీ గురువారం సీఓఏకు అందజేసింది. అందులో మహిళా కోచ్ కల్పన వెంకటాచర్ను సహాయ కోచ్గా తీసుకోవాలని సూచించింది. కిర్స్టెన్ ఐపీఎల్లో ప్రస్తుతం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు కోచ్గా ఉన్నారు. పరస్పర విరుద్ధ ప్రయోజనాల రీత్యా ఆయన ఫ్రాంచైజీకి రాజీనామా చేయాల్సివుంటుంది. కానీ కిర్స్టెన్ అందుకు సమ్మతించకపోవడంతో సీఓఏ ఆయన్ని పక్కనబెట్టింది. అయితే ఈ ప్రక్రియ వివాదాస్పదమైంది. కోచ్లను నియమించే అధికారం లేని సీఓఏ తమ పరిధిని అతిక్రమిస్తుందని దీన్ని బోర్డు ఆమోదించే అవకాశం లేదని కోశాధికారి అనిరుధ్ చౌదరి తెలిపారు. ఆయనే ఎందుకంటే... మహిళా జట్టుకు బ్యాటింగ్ కోచ్ అవసరముందని బీసీసీఐ భావించింది. దీంతో బ్యాటింగ్ కోచ్నే హెడ్ కోచ్గా నియమించాలనుకోవడంతో భారత మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్కు అవకాశం దక్కలేదు. వూర్కేరి వెంకట్ రామన్ భారత మాజీ ఓపెనర్. 1992–93 సీజన్లో దక్షిణాఫ్రికా గడ్డపై సెంచరీ చేసిన తొలి భారత బ్యాట్స్మన్గా ఆయనకు రికార్డుంది. జాతీయ జట్టు తరఫున 11 టెస్టులు, 27 వన్డేలాడిన 53 ఏళ్ల రామన్ ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో బ్యాటింగ్ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. పైగా కోచ్గా పనిచేసిన అనుభవం కూడా రామన్కు ఉంది. గతంలో తమిళనాడు, బెంగాల్ రంజీ జట్లతో పాటు... భారత అండర్–19 జట్టుకూ కోచ్గా పనిచేశారు. ఇవన్నీ ఆయన ఎంపికకు అనుకూలించాయి. 28 మంది దరఖాస్తు చేస్తే... వన్డే కెప్టెన్, సీనియర్ బ్యాట్స్మన్ మిథాలీ రాజ్తో విభేదాల కారణంగా తాత్కాలిక కోచ్ రమేశ్ పొవార్ పదవీ కాలాన్ని పొడిగించలేదు. దీంతో కొత్త కోచ్ నియామక ప్రక్రియను బోర్డు మొదలు పెట్టింది. దరఖాస్తులను ఆహ్వానించగా 28 మంది ఆసక్తి కనబరిచారు. ఇందులోంచి 10 మందిని కపిల్ కమిటీ ఇంటర్వ్యూకు పిలిచింది. పై ముగ్గురితో పాటు గిబ్స్, రమేశ్ పొవార్, మస్కరెనస్, బ్రాడ్ హగ్, ట్రెంట్ జాన్స్టన్, మనోజ్ ప్రభాకర్, మహిళా కోచ్ కల్పన వెంకటాచర్లను కపిల్ బృందం ఇంటర్వ్యూ చేసింది. ఇందులో ముగ్గురిని మాత్రమే నేరుగా ఇంటర్వ్యూ చేయగా, ఫోన్లో, స్కైప్ వీడియా చాట్ ద్వారా మిగతా వారు అందుబాటులోకి వచ్చారు. బయటపడ్డ లుకలుకలు కోచ్ నియామక ప్రక్రియపై బోర్డు, పరిపాలక కమిటీ (సీఓఏ)లోని అభిప్రాయబేధాలు మళ్లీ తెరమీదికొచ్చాయి. పొవార్నే మళ్లీ కోచ్ను చేయాలంటూ సీఓఏ సభ్యురాలైన డయానా ఎడుల్జీ పట్టుబట్టారు. బాహాటంగానే మద్దతు పలికారు. సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ మాత్రం ఆమె పంతాన్ని నెగ్గనివ్వలేదు. ఇప్పుడు అంతా పూర్తయ్యాక కూడా ఎడుల్జీ, బోర్డు కోశాధికారి అనిరుధ్ చౌదరితో కలిసి వినోద్ రాయ్ తీరును తప్పుబట్టారు. కోశాధికారి అనిరుధ్ వచ్చే నెల 17వ తేదీన జరిగే కోర్టు విచారణ వరకైన ఈ ఎంపిక ప్రక్రియను ఆపాలని కోరారు. ఇలాగే ముందుకెళ్తే కోచ్ నియామకానికి బోర్డు ఆమోదం తెలపదని స్పష్టం చేశారు. కివీస్ టూర్కు జట్ల ఎంపిక నేడు న్యూజిలాండ్ పర్యటించే భారత వన్డే, టి20 జట్లను శుక్రవారం ఎంపిక చేయనున్నారు. ఢిల్లీలో జరిగే ఈ సెలక్షన్ సమావేశానికి వన్డే సారథి మిథాలీరాజ్ హాజరు కానుంది. ఆసీస్లో మహిళల బిగ్బాష్ లీగ్ ఆడుతున్న టి20 కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ స్కైప్ వీడియోలో అందుబాటులో ఉండనుంది. కివీస్లో భారత మహిళల జట్టు మూడు వన్డేలు, మూడు టి20లు ఆడనుంది. -
ఆ ఒక్కరు ఎవరో?
ముంబై: డబ్బుకు డబ్బు, పేరుకు పేరు, ప్రచారానికి ప్రచారం వస్తుండటంతో భారత మహిళల క్రికెట్ జట్టు కోచ్ పదవి ఇప్పుడొక హాట్ కేక్లా మారిపోయింది. ఒకప్పుడు హడావుడే లేకుండా, చాలా సాదాసీదాగా సాగిపోయి, ఎవరిని ఎంపిక చేశారో మీడియాలో వస్తేగాని తెలియనంతగా సాగిన ప్రక్రియ... నేడు స్వదేశీయులతో పాటు దిగ్గజాలనదగ్గ విదేశీ మాజీ కోచ్లు కూడా పోటీ పడే స్థాయికి వచ్చింది. పదుల సంఖ్యలో వచ్చిన దరఖాస్తులను పది మందికి కుదించి, కమిటీ ఏర్పాటు చేసి వారిలో ఒకరిని ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసే దశకు చేరింది. దరఖాస్తులు 28... మహిళల క్రికెట్ జట్టు కొత్త కోచ్ ఎవరో తేల్చే బాధ్యతను దిగ్గజ ఆల్రౌండర్ కపిల్దేవ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల అడ్హక్ కమిటీ చేతుల్లో పెట్టారు. మాజీ క్రికెటర్లు అన్షుమన్ గైక్వాడ్, శాంతా రంగస్వామి ఈ కమిటీలోని ఇతర సభ్యులు. రెండేళ్ల కాల వ్యవధి ఉండే ఈ పదవికి మొత్తం 28 దరఖాస్తులు రాగా 10 మందిని (గ్యారీ కిర్స్టెన్, హెర్షల్ గిబ్స్, ట్రెంట్ జాన్స్టన్, మార్క్ కోల్స్, దిమిత్రి మస్కరెనాస్, బ్రాడ్ హగ్తో పాటు తాజా మాజీ కోచ్ రమేశ్ పొవార్, భారత మాజీ క్రికెటర్లు మనోజ్ ప్రభాకర్, డబ్ల్యూవీ రామన్, వెంకటేశ్ ప్రసాద్) షార్ట్లిస్ట్ చేశారు. కపిల్ కమిటీ వీరికి గురువారం ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. రాయ్ అలా.. ఎడుల్జీ ఇలా.. మరోవైపు కోచ్ ఎంపికపై సుప్రీంకోర్టు నియమిత క్రికెట్ పాలకుల కమిటీ (సీవోఏ) సభ్యులు వినోద్ రాయ్, డయానా ఎడుల్జీ పూర్తి భిన్నాభిప్రాయాలతో ఉన్నారు. కొత్తగా దరఖాస్తులు ఆహ్వానించాలని రాయ్... బీసీసీఐని ఆదేశించగా, పొవార్ను వచ్చే నెలలో ప్రారంభం కానున్న న్యూజిలాండ్ పర్యటన వరకైనా కొనసాగించాలని ఎడుల్జీ కోరుతున్నారు. ఎవరి అవకాశం ఎంత? రమేశ్ పొవార్: తాత్కాలిక ప్రాతిపదికపై ఇటీవలి ప్రపంచ కప్ వరకు ఇతడు బాధ్యతలు నిర్వర్తించాడు. గత నెల 30తో ఒప్పందం పూర్తయింది. ప్రపంచకప్ సెమీస్లో సీనియర్ బ్యాటర్ మిథాలీరాజ్ను ఆడించకపోవడంతో తీవ్రంగా వివాదాస్పదుడయ్యాడు. కోచ్ వ్యవహార శైలిపై మిథాలీ నేరుగా ధ్వజమెత్తింది. మొదట రేసులో లేకున్నా టి20 కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన కోరడంతో మళ్లీ పోటీలో నిలిచానంటున్నాడు. ఎడుల్జీ మద్దతు కూడా ఉంది. అయితే... ఇంత జరిగాక, ఆటగాడిగానూ గొప్ప రికార్డులు లేని పొవార్ను మళ్లీ ఎంపిక చేస్తారా? అన్నది సందేహమే. గ్యారీ కిర్స్టెన్: గొప్ప బ్యాట్స్మన్, అంతేస్థాయిలో కోచ్గానూ ఫలితాలు రాబట్టాడు. భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రపంచకప్ సాధించడంలో కిర్స్టెన్ పాత్ర అందరికీ తెలిసిందే. స్నేహభావంతో ఉంటూనే ఆటగాళ్ల నుంచి ఫలితాలను రాబట్టుకోగల నేర్పరి. ప్రొఫెషనల్గా చెప్పాలంటే ఈ దశలో మహిళల జట్టుకు కావాల్సిన కోచ్. వెంకటేశ్ ప్రసాద్: టీమిండియా మాజీ పేసర్. మన జాతీయ, అండర్–19 జట్లతో పాటు బంగ్లాదేశ్, ఐపీఎల్లోనూ కోచ్గా వ్యవహరించిన అనుభవం ఉంది. నెమ్మదస్తుడు. అయితే, కోచ్గా గొప్ప ఫలితాలు రాబట్టిన రికార్డు లేదు. 2009లో పురుషుల జట్టు బౌలింగ్ కోచ్గా ఉన్న వెంకటేశ్ ప్రసాద్ను బీసీసీఐ అర్ధంతరంగా తొలగించింది. అయితే, వివాదాలకు దూరంగా ఉండే స్వదేశీ కోచ్ కావాలనుకుంటే మొగ్గు ఇతడివైపే ఉంటుంది. మనోజ్ ప్రభాకర్: కపిల్దేవ్తో ఒకప్పుడు కొత్త బంతిని పంచుకున్న భారత మాజీ ఆల్ రౌండర్. తర్వాత కపిల్తో తీవ్ర విభేదాలు తలెత్తాయి. మ్యాచ్ ఫిక్సింగ్లో నిషేధానికి గురయ్యాడు. రెండేళ్ల క్రితం భారత్లో టి20 ప్రపంచకప్ ఆడిన అఫ్గానిస్తాన్ కోచ్ ప్రభాకరే. ఢిల్లీ రంజీ జట్టు బౌలింగ్ కోచ్గా, రాజస్తాన్ హెడ్ కోచ్గా పనిచేశాడు. వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా గతంలో ఢిల్లీ ఇతడికి ఉద్వాసన పలికింది. గిబ్స్: మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతాల్లో తీవ్ర వివాదాస్పదుడు. బ్యాట్స్మన్ అయినప్పటికీ కోచ్గా రికార్డేమీ లేదు. ఆటలోలాగే ప్రవర్తనలోనూ దూకుడైన గిబ్స్ను మహిళల జట్టు శిక్షకుడిగా నియమించడం అంటే... కొత్త రకం వివాదాలను కోరి తెచ్చుకోవడమే. డబ్ల్యూవీ రామన్: టీమిండియా మాజీ ఓపెనర్. ఆటగాడిగా కంటే కోచ్గానే ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు. భారత అండర్–19తో పాటు బెంగాల్, తమిళనాడు రంజీ జట్లకు, ఐపీఎల్లో కోల్కతా, పంజాబ్ జట్లకు శిక్షకుడిగా వ్యవహరించాడు. క్రికెట్పై విశేష పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. ఇంటర్వ్యూలో మెప్పించగలిగితే అవకాశం ఉండొచ్చు. -
కిర్స్టెన్ మళ్లీ వస్తున్నాడా?
ముంబై: దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు గ్యారీ కిర్స్టెన్ మరోసారి టీమిండియా కోచ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఈ సారి పురుషుల జట్టుకు కాకుండా మహిళల జట్టుకు కోచ్ బాధ్యతలు నిర్వహించే అవకాశం ఉంది. భారత మహిళల జట్టుకు నూతన కోచ్ నియామకంలో భాగంగా గురువారం ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఇప్పుటికే కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న వారి నుంచి పది మందిని ఎంపిక చేశారు. ఎంపికైన వారిని బీసీసీఐ సెలక్షన్ ప్యానల్ ఇంటర్వ్యూ చేయనుంది. అందుబాటులో లేని వారు స్కైప్ ద్వారా కూడా ఇంటర్వ్యూలో పాల్గొనవచ్చని బీసీసీఐ తెలిపింది. (కోచ్గా పొవార్నే కొనసాగించండి: హర్మన్ లేఖ) ఇంటర్వ్యూ జాబితాలో టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్స్టెన్తోపాటు దక్షిణాఫ్రికా మాజీ ఓపెనర్ హెర్షల్ గిబ్స్, తాజా మాజీ కోచ్ రమేశ్ పొవార్, రామన్, వెంకటేశ్ ప్రసాద్, మనోజ్ ప్రభాకర్, ట్రెంట్ జాన్స్టన్, మార్క్ కోల్స్, బ్రాడ్ హాగ్, డిమిట్రి మస్కరెన్హాస్లు ఇంటర్వ్యూకు హాజరవనున్నారు. కోచ్ పదవి కోసం ఏర్పాటు చేసిన బీసీసీఐ సెలక్షన్ ప్యానల్లో టీమిండియా మాజీ ఆటగాళ్లు కపిల్ దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాంత రంగస్వామి సభ్యులుగా ఉన్నారు. (పొవార్ కోచింగ్ ముగిసింది...) మొదటి నుంచి టీమిండియాకు నూతన కోచ్ అవసరం లేదంటూ క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ)లో సభ్యురాలైన డియానా ఎడుల్జీ వాదిస్తున్నా.. చైర్మన్ వినోద్ రాయ్ మాత్రం పొవార్ కోచింగ్పై సుముఖత వ్యక్తం చేయటం లేదు. దీంతో భారత మహిళల క్రికెట్ నూతన కోచ్ నియామకం కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. (ఇది నా జీవితంలో చీకటి రోజు: మిథాలీ) కిర్స్టెన్కే అవకాశం? మహేంద్రసింగ్ ధోని సారథ్యంలోని టీమిండియా ప్రపంచకప్ గెలిచినప్పుడు గ్యారీ కిర్స్టెన్ ప్రధాన కోచ్గా ఉన్న విషయం తెలిసిందే. వివాదరహితుడిగా పేరొందడం, నైపుణ్యం, కోచింగ్లో అనుభవరీత్యా కోచ్ పదవి కిర్స్టెన్నే వరించే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక రమేశ్ పొవార్ దరఖాస్తు చేసుకున్నప్పటికీ అతడిని మరలా కోచ్గా నియమించే సాహసం బీసీసీఐ చేయకపోవచ్చు. అయితే టీ20 కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన మద్దతు ఉండటం పొవార్కు కలిసొచ్చే అంశం. సఫారీ మాజీ ఓపెనర్ హెర్షల్ గిబ్స్కు కూడా అవకాశాలు మెండుగానే ఉన్నాయి. స్వదేశీ కోచ్నే తీసుకోవాలనే ఆలోచనలో ఉంటే మాత్రం వెంకటేశ్ ప్రసాద్, మనోజ్ ప్రభాకర్ల మధ్య తీవ్ర పోటీ ఉండే అవకాశం ఉంది. (కోహ్లికైతే ఇలాగే చేస్తారా: గావస్కర్) -
ఆర్సీబీ కోచ్గా కిర్స్టెన్
బెంగళూరు: ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కోచ్గా గ్యారీ కిర్స్టెన్ను నియమించారు. హెడ్ కోచ్గా వ్యవహరించిన డానియెల్ వెటోరి స్థానంలో కిర్స్టెన్కు బాధ్యతలు అప్పగించారు. ప్లేయర్గా 2014లో జట్టులోకి వచ్చిన వెటోరి తదనంతరం హెడ్ కోచ్గా ఈ సీజన్ వరకు పని చేశారు. వెటోరి కోచ్గా ఉన్న సమయంలో ఆర్సీబీ పెద్దగా ప్రభావం చూపలేకపోగా, ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేకపోయింది. గ్యారీ శిక్షణలోనే భారత్ 2011లో వన్డే ప్రపంచకప్ గెలిచిన సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్లో ఢిల్లీ డేర్డెవిల్స్ కోచ్గా ఆయన పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. -
మీలో టాలెంట్ ఉందా..అయితే అప్లై చేయండి
ముంబాయి : మీలో టాలెంట్ దాగి ఉంటే అప్లై చేయండి. టీం ఇండియా మాజీ కోచ్ గ్యారీ కిరెస్టెన్ యువ క్రికెట్లర్లలో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఓ వినూత్న కార్యక్రమం రూపొందించాడు. ఈ నెల 23 నుంచి వచ్చే మే నెల 18వరకు టాలెంట్ స్కౌట్ కార్యక్రమం ప్రారంభించాడు. భారత్లోని 8 నగరాల నుంచి మంచి నైపుణ్యం ఉన్న ఆరుగురు క్రికెటర్లను ఎంపిక చేయనున్నాడు. టాప్లో నిలిచిన ఆరుగురు యువ క్రీడాకారులకు పూణెలో వీకెండ్ ట్రైనింగ్ ఇవ్వనున్నాడు. అలాగే టాప్లో నిలిచిన ముగ్గురు క్రీడాకారులకు ఒక్కొక్కరికి రూ. 2లక్షల స్కాలర్షిప్తో పాటు రెండు నెలల పాటు గ్యారీ కిర్స్టెన్ క్రికెట్లో ఉండేందుకు సౌకర్యం కల్పించనున్నారు. టాలెంట్ స్కౌట్ ఎంట్రీ ఫీజు రూ.1000. దీనిలో పాల్గొనేందుకు కేవలం టాలెంట్ మాత్రమే అర్హత. టాలెంట్ హంట్లో పాల్గొనేందుకు క్రీడాకారులు వారి పేరు, నగరం, కాంటాక్ట్ వివరాలు 9112295566 ఫోన్ నెంబర్కు వాట్సప్ చేయడమే. -
వెటోరీనే హెడ్ కోచ్.. మెంటర్గా కిర్స్టన్
బెంగళూరు: ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా బెంగళూరు రాయల్స్ చాలెంజర్స్ జట్టుకు బ్యాటింగ్ కోచ్గా, సలహాదారు(మెంటర్)గా గ్యారీ కిర్స్టన్ వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం బిగ్బాష్ లీగ్(బీబీఎల్)లో హాబర్ట్ హరికేన్స్ జట్టుకు గ్యారీ కోచ్గా వ్యవహరిస్తున్నాడు. గతంలో భారత జట్టుకు కోచ్గా వ్యహరించిన గ్యారీ.. మూడు ఐపీఎల్ సీజన్లలో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు సైతం కోచ్గా సేవలందించాడు. కాగా, ఈ సీజన్లో ఆర్సీబీకి బ్యాటింగ్ కోచ్గా, మెంటర్గా కిర్స్టన్ను ఎంపిక చేశారు. అయితే ఇక్కడ ఆర్సీబీ ప్రధాన కోచ్గా డానియల్ వెటోరీనే కొనసాగనున్నాడు. మరొకవైపు ఆర్సీబీ బౌలింగ్ కోచ్గా ఆశిష్ నెహ్రాను వ్యవహరించనున్నాడు. ఈనెల 27, 28వ తేదీన ఐపీఎల్ ఆటగాళ్ల కోసం బెంగళూరులో వేలం జరుగనుంది. ఆర్సీబీకి తిరిగి హెడ్ కోచ్గా ఎంపికైన వెటోరీ మాట్లాడుతూ.. గ్యారీ కిరస్టన్, ఆశిష్ నెహ్రాలతో కలిసి పని చేయడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. ఈ ఇద్దరి అనుభవం జట్టుకు మరింతగా కలిసి వస్తుందని వెటోరీ పేర్కొన్నాడు. -
ధోనీని తప్పిస్తే.. రిస్క్ చేసినట్టే
ముంబై: టీమిండియా వన్డే కెప్టెన్ పదవి నుంచి మహేంద్ర సింగ్ ధోనీని తప్పిస్తే నష్టం తప్పదని మాజీ కోచ్ గ్యారీ కిర్స్టెన్ అభిప్రాయపడ్డాడు. భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి వన్డే జట్టు పగ్గాలు కూడా అప్పగించాల్సిన సమయం వచ్చిందా అన్న మీడియా ప్రశ్నకు ఆయన స్పందించలేదు. గొప్ప నాయకులు ఎప్పడు వారి కెరీర్ చివరి వరకు గొప్ప ఫలితాలు సాధిస్తారని ధోనీని ఉద్దేశస్తూ కిర్స్టెన్ చెప్పాడు. వన్డే జట్టు కెప్టెన్గా ధోనీని తప్పించి, మరొకరికి కెప్టెన్సీ అప్పగిస్తే 2019లో ఇంగ్లండ్లో జరిగే ప్రపంచ కప్లో భారత విజయావకాశాలను చేజార్చుకోవచ్చని అభిప్రాయపడ్డాడు. వచ్చే ప్రపంచ కప్లో ధోనీ కెప్టెన్గా కొనసాగితే టీమిండియా విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పాడు. కాగా అప్పటివరకు ధోనీ కొనసాగుతాడో లేదో తనకు తెలియదని అన్నాడు. ధోనీ సామర్థ్యాన్ని సందేహించడం తప్పని, అతను గొప్ప ఆటగాడని కిర్స్టెన్ కితాబిచ్చాడు. 2011లో స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచ కప్లో గ్యారీ కిర్స్టెన్ శిక్షణలో ధోనీ సారథ్యంలోని టీమిండియా చాంపియన్గా నిలిచిన సంగతి తెలిసిందే.
Pagination
ఎంతో మంచి చేశాం.. ఇలాంటి ఫలితాన్ని ఊహించలేదు: వైఎస్ జగన్
కూటమి హవాను తట్టుకుని...
ఏపీలో ఎన్నికలు ఏం చెబుతున్నాయి?
9న చంద్రబాబు ప్రమాణస్వీకారం
అమేథీలో కిశోరీ లాల్ సంచలనం
నన్ను ఓడించాలని కుట్ర చేస్తే.. కేసీఆర్ అడ్రస్ గల్లంతైంది!
సీఎం పదవికి వైఎస్ జగన్ రాజీనామా
మాధవీలత ఓడిపోలేదు.. చిత్తుగా ఓడించిందెవరు?
ల్యాండ్ ఫర్ జాబ్ : లాలూ ప్రసాద్ యాదవ్కు మరో ఎదురు దెబ్బ
లోక్ సభ ఎన్నికల ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ రాహల్ గాంధీ: శశిథరూర్
T20 World Cup 2024: ఐర్లాండ్-కెనడా మ్యాచ్.. తుది జట్లు ఇవే..!
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం, వేదిక ఖరారు
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. క్రేజీ అప్డేట్ వచ్చేసింది!
ఈ హీరోయిన్ మనసు బంగారం.. మీరు కూడా ఒప్పుకోవాల్సిందే! (ఫోటోలు)
త్వరలో ఈపీఎఫ్ వడ్డీ.. మీ ఖాతాలో ఎంతుంది.. ఎంతొస్తుంది?
బీచ్లో బుజ్జి సందడి.. సెల్ఫీల కోసం ఎగబడ్డ ఫ్యాన్స్!
T20 World Cup 2024: పాక్ పేసర్పై బాల్ టాంపరింగ్ ఆరోపణలు
గూగుల్పై చిల్కూరు పూజారి రంగరాజన్ ఆగ్రహం
Advertisement