god father
-
చిరంజీవితో ఛాన్స్ వచ్చిందని మాకు హ్యాండిచ్చాడు: డైరెక్టర్
కోలీవుడ్ టాప్స్టార్ ప్రశాంత్ చాలా గ్యాప్ తరువాత కథానాయకుడిగా నటించిన చిత్రం అందగన్. తాజాగా తమిళ్లో విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. బాలీవుడ్ హిట్ సినిమా అంధాధున్ చిత్రానికి రీమేక్గా తెరకెక్కిన విషయం తెలిసింది. ఇందులో నటి సిమ్రాన్, ప్రియా ఆనంద్, కార్తీక్, యోగిబాబు, సముద్రఖని, ఊర్వశీ,కేఎస్.రవికుమార్, వనితా విజయ్కుమార్ నటించారు.ఈ చిత్రాన్ని స్టార్ మూవీస్ పతాకంపై శాంతి త్యాగరాజన్ నిర్మించగా, త్యాగరాజన్ దర్శకత్వం వహించారు. సినిమాకు మంచి టాక్ రావడంతో ఈ చిత్ర థ్యాంక్స్ గివింగ్ సమావేశాన్ని చైన్నెలో మేకర్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో చిత్ర దర్శకుడు త్యాగరాజన్ మాట్లాడుతూ అందగన్ చిత్రాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లిన మీడియా మిత్రులకు ధన్యవాదాలన్నారు. పాజిటివ్ రివ్యూలే చిత్ర విజయానికి కారణం అన్నారు. ఈ చిత్రానికి ప్రశాంత్ కథానాయకుడు అయినా , అన్ని పాత్రలకు ప్రాముఖ్యత ఇచ్చామన్నారు. ఈ చిత్రానికి ముందుగా మోహన్రాజాను దర్శకుడిగా ఎంపిక చేశామని, మూడు నెలలు చర్చలు జరిగిన తరువాత ఆయన తెలుగులో చిరంజీవితో చిత్రం చేసే అవకాశం రావడంతో వెళ్లిపోయారన్నారు. దీంతో తానే దర్శకత్వం బాధ్యతలను చేపట్టినట్లు చెప్పారు. చిరంజీవి లాంటి పెద్ద హీరోతో ఛాన్స్ వస్తే ఎవరూ వదులుకోలేరని, దీంతో ఆ విషయాన్ని తాము అర్థం చేసుకున్నామని ఆయన అన్నారు. మోహన్రాజా-చిరంజీవి కాంబినేషన్లో గాడ్ఫాదర్ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇదే వేదికపై హీరో ప్రశాంత్ పెళ్లి టాపిక్ కూడా వచ్చింది. అందుకు బదులిచ్చిన త్యాగరాజన్ అందగన్ చిత్రం మంచి హిట్ అయ్యిందని, ఇక సినిమా విషయాలను పక్కన పెట్టి ప్రశాంత్ పెళ్లి పైనే పూర్తిగా దృష్టి పెట్టనున్నట్లు, త్వరలోనే మంచి అమ్మయితో ప్రశాంత్ పెళ్లి ఉంటుందని చెప్పారు. కాగా నటుడు ప్రశాంత్ మాట్లాడుతూ అందగన్ చిత్ర విజయానికి ప్రధాన కారణం దర్శకుడు త్యాగరాజన్, నటీనటులని పేర్కొన్నారు. ఈ చిత్రం తనకు కమ్ బ్యాక్ అనీ, ఇకపై చాలా చిత్రాలు చేస్తానని ఆయన అన్నారు. తొలి ముద్దు, జోడి, జీన్స్ వంటి చిత్రాలతో ప్రశాంత్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. -
Year End 2022: మాస్ స్టెప్పులతో ఊపేసిన స్టార్స్
సినిమా సక్సెస్లో పాటలు కీలక పాత్రలు పోషిస్తాయి. కంటెంట్ మాత్రమే కాదు పాటలతో, స్టెప్పులతోనూ విజయం సాధించిన చిత్రాలెన్నో ఉన్నాయి. అందుకే దర్శక-నిర్మాతలు స్క్రిప్ట్పైనే కాకుండా పాటలు, డాన్స్పై కూడా దృష్టి పెడుతున్నారు. ప్రేక్షకున్ని మరింత అలరించేందుకు డైరెక్టర్లు స్పెషల్ సాంగ్స్, హీరోహీరోయిన్లతో మాస్ స్టెప్పులు వేయించి ప్రయోగాలు చేస్తున్నారు. అలా ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని చిత్రాలు థియేటర్లో పెద్దగా రాణించకపోయిన సాంగ్స్ రికార్టు సృష్టించాయి. అలాగే కంటెంట్తో పాటు పాటల, డాన్స్ పరంగా కూడా మరిన్ని చిత్రాలు సోషల్ మీడియాను ఊపేశాయి. అలా గతేడాది పుష్ప, ఆర్ఆర్ఆర్ సినిమాలు కంటెంట్తోనే కాదు పాటలు కూడా ఎంతగా అలరించాయో ప్రత్యేకంగా చెప్పన్కర్లేదు. ఈ సాంగ్స్తో పాటు సిగ్నేచర్ స్టెప్పులు ఆడియాన్స్ని బాగా ఆకట్టుకున్నాయి. అలాగే ఈ ఏడాది వచ్చిన పలు సినిమా పాటలే కాదు, సిగ్నేచర్ స్టెప్స్కి కూడా విపరీతమైన ఆదరణ దక్కింది. మరి అవేంటో ఇక్కడ ఓ లుక్కెయండి! ‘డీజే టిల్లు’ ఈ ఏడాది ఫిబ్రవరిలో చిన్న చిత్రంగా విడుదలై హ్యూజ్ హిట్ అందుకున్న సినిమా డీజే టిల్లు. సిద్ధు జొన్నలగడ్డ టైటిల్ రోల్లో నటించిన ఈ చిత్రం ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా ఆడియెన్స్ను అలరించింది. ముఖ్యంగా ఇందులో టైటిల్ సాంగ్కు వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. డీజే టిల్లు అంటూ థియేటర్లో, యూట్యూబ్లో రిసౌండ్ చేసింది ఈ పాట. పాటే కాదు ఇందులో సిగ్నేచర్ స్టెప్కు కూడా ప్రతి ఆడియన్స్ ఫిదా అయ్యాడు. సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ స్టెప్ను అనుసరిస్తూ కాలు కదిపిన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. ‘మ.. మ.. మహేశా’ అంటూ మాస్ రికార్డు సూపర్ స్టార్ మహేశ్బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. మే 12న థియేటర్స్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రం విజయంలో పాటలు కూడా కీలకపాత్ర పోషించాయనడంలో అతిశయోక్తి లేదు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలన్ని సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఇందులో ‘మ.. మ.. మహేశా’, ‘ఎవ్రీ పెన్ని’ సాంగ్స్ రికార్డు క్రియేట్ చేశాయి. అత్యధిక వ్యూస్తో యూట్యూబ్ ట్రెండింగ్లో నిలిచాయి ఈ రెండు పాటలు. మ.. మ.. మహేశా అంటూ మహేశ్, కీర్తిలు వేసిన మాస్ స్టెప్కు థియేటర్లో ఈళలు మోగాయి. ఎవ్రీ పెన్ని అంటూ మహేశ్ వేసిన క్లాస్ డాన్స్కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ‘ది వారియర్’ బుల్లెట్ రామ్ పోతినేని, కృతిశెట్టి జంటగా నటించి చిత్రం ది వారియర్. ఈ ఏడాది జూలై 14న విడుదలైన ఈ చిత్రం పెద్దగా ఆశించిన విజయం అందుకోలేకపోయింది. కానీ ఇందులోని బుల్లెట్, విజిల్ పాటలు శ్రోతలను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా బుల్లెట్ సాంగ్కు సోషల్ మీడియా సెన్సేషన్ అయ్యింది. ‘కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ది బుల్లెటు..’ అంటూ సాగే ఈ పాట యూట్యూబ్ను షేక్ చేసింది. వ్యూస్ పరంగా కూడా రికార్డు క్రియేట్ చేసింది. ఈ పాట మొత్తంగా 100 మిలియన్ పైనే వ్యూస్ రాబట్టింది. అంతేకాదా బుల్లెట్ బండి సిగ్నేచర్ స్టెప్ కూడా బాగా పాపులర్ అయ్యింది. రారా.. రక్కమ్మా (విక్రాంత్ రోణ) రారా.. రక్కమ్మా పాటల చేసిన సందడి అంతా ఇంత కాదు. ఇప్పటికీ ఏ ఈవెంట్స్, ఫంక్షన్స్కు వెళ్లిన ఈ పాట మోగాల్సిందే. కన్నడ నటుడు సుదీప్, బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కలిసి కాలు కదిపిన ఈ పాట విపరీతమైన క్రేజ్ను సంపాదించుకుంది. ముఖ్యంగా ఈ సిగ్నేచర్ స్టేప్ను అనుసరించిన ప్రేక్షకులకు లేరనడంలో సందేహం లేదు. పెద్దవాళ్ల నుంచి చిన్నవాళ్లు వరకు ఈ స్టెప్కు వీణ వాయిస్తు నడుం ఊపారు. యూట్యూబ్లో సైతం ఈ పాట మిలియన్ల వ్యూస్తో రికార్డు సృష్టించింది. బీస్ట్ అరబిక్ కతు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రధానపాత్రలో నటించిన చిత్రం బీస్ట్. ఈ మూవీ నుంచి వచ్చిన అరబిక్ కుతు' (హలమితి హబీబో) సాంగ్ యూట్యూబ్లో రికార్డు క్రియేట్ చేసింది. సుమారు 260 మిలియన్లకుపైగా వ్యూస్ సన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వ్యూస్ రాబట్టిన రెండో పాటగా అరబిక్ కుతు నిలిచింది. ఇక పాట సిగ్నేచర్ స్టేప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాధారణ ప్రజలు నుంచి సినీ సెలబ్రెటీల వరకు ఎందరో అరబిక్ కుతుకు కాలు కదిపారు. ఇప్పటికీ ఈ స్టెప్ను అనుసరిస్తూ సోషల్ మీడియాలో వందల సంఖ్యలో రీల్స్ దర్శనిమిస్తున్నాయి. తార్ మార్ టక్కర్ మార్(గాడ్ ఫాదర్) మెగాస్టార్ చిరంజీవి, సత్యాదేవ్, నయనతార ప్రధాన పాత్రల్లో నటించని చిత్రం గాడ్ ఫాదర్. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇందులో కీ రోల్ పోషించారు. ఇక చిరు-సల్మాన్ కాంబినేషన్లో వచ్చిన ‘తార్ మార్ టక్కర్ మార్’ పాట ఎంతటి క్రేజ్ సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా కొరియోగ్రఫీ చేసిన ఈ పాట బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా చిరు, సల్మాన్ తార్ మార్ టక్కర్ మార్ అంటూ స్టైలిష్గా వేసిన ఈ స్టెప్ థియేటర్లో ఈలలు వేయించింది. రారా.. రెడ్డి (మాచర్ల నియోజకవర్గం) అలాగే మాచర్ల నియోజకవర్గంలో నితిన్, అంజలి కలిసి వేసిన రారా రెడ్డి పాటలకు మంచి హిట్ అందుకుంది. ఇందులోని అంజలి, నితిన్ వేసిన మాస్ స్టెప్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి ఆచార్యలోని భళా భళా బంజారా, కమల్ హాసన్ విక్రమ్ మూవీలోని మత్తు మత్తుగా పాటలకు బాగా ఆకట్టుకున్నాయి. వీటితో ఇంకేన్నో పాటలు సిగ్నేచర్ స్టెప్తో రికార్డులు క్రియేట్ చేసి ఉర్రుతలూగించాయి. -
అలాంటి కథలు చిరంజీవికి సెట్ కావు.. కానీ: పరుచూరి గోపాలకృష్ణ
మెగాస్టార్ చిరంజీవి నటించిన మూవీ గాడ్ ఫాదర్. మలయాళ మూవీ లూసీఫర్ రీమేక్గా తెరకెక్కిన ఈ చిత్రం ఊహించని స్థాయిలో రెస్పాన్స్ సొంతం చేసుకుంది. దసరా సందర్భంగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన గాడ్ ఫాదర్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. మలయాళ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సత్యదేవ్, నయనతార, సల్మాన్ ఖాన్లు కీ రోల్ పోషించారు. తాజాగా చిరంజీవి సినిమా గాడ్ఫాదర్పై ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ రివ్యూ చెప్పారు. సినిమాలో ఇంకొన్ని మార్పులు చేసి ఉంటే ఇంకాస్త బాగుండేదని ఆయన అన్నారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. 'తెలుగులోనే ఈ సినిమా బాగుందని చెబుతా. పేరుకు మలయాళ రీమేక్ చిత్రమైనా తెలుగు రాజకీయాన్ని ఈ చిత్రంలో పరిచయం చేశారు. చిరంజీవి బాడీ లాంగ్వేజ్ను దృష్టిలో ఉంచుకుని మాత్రమే నేను చెబుతున్నా. ఈ సినిమాలో కథ చాలా స్లో పేస్లో వెళ్లింది. మెగాస్టార్కు స్లో కథనం అనేది సరిపోదు. ఇంకా మార్పులు చేయాల్సింది. స్లో పేస్తో పాటు చిరు బాడీ లాంగ్వేజ్కు తగిన క్యారెక్టర్ కాదు. కానీ ఈ విషయంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. చిరంజీవి డ్యాన్స్, పాట లేని సినిమా కాస్త ఇబ్బంది అనిపించింది. షఫీ పాత్రలో సునీల్ ఉండి ఉంటే ఇంకా బెటర్గా ఉండేదేమో అనిపించింది.' అని అన్నారు. సల్మాన్ పాత్రపై ఆయన ఏమన్నారంటే.. పరుచూరి మాట్లాడూతూ.. 'ఈ సినిమాకు సల్మాన్ ఖాన్ ఒకరకంగా ప్లస్. మరో రకంగా మైనస్. ఎందుకంటే మెగాస్టార్ నడుస్తుంటే సల్మాన్ ఫైట్ చేయడం ఫ్యాన్స్కు బాధ కలిగించింది. ఆచార్య మాదిరిగా చరణ్ లేదా పవన్ కల్యాణ్ను తీసుకుంటే మరోలా ఉండేదేమో. డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఇంకా మరిన్ని డైలాగ్స్ ఉంటే బాగుండేది. 'రాజకీయానికి దూరంగా ఉన్నాను. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు' డైలాగ్ లాగా ఇంకా ఉండి ఉంటే ఇంకా బాగా రెస్పాన్స్ వచ్చి ఉండేది.' అని అన్నారు. -
ఓటీటీకి వచ్చేసిన గాడ్ ఫాదర్, అక్కడ అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్. మలయాళ మూవీ లూసీఫర్ రీమేక్గా తెరకెక్కిన ఈ చిత్రం ఊహించని స్థాయిలో రెస్పాన్స్ సొంతం చేసుకుంది. దసరా సందర్భంగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన గాడ్ ఫాదర్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. మలయాళ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సత్యదేవ్, నయనతార, సల్మాన్ ఖాన్లు కీ రోల్ పోషించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది. కాగా ఈ మూవీ డిజిటల్ రైట్స్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. చదవండి: ముదురుతున్న వారసుడు మూవీ వివాదం, మండిపడుతున్న తమిళ్ దర్శక-నిర్మాతలు నవంబర్ 19న ఈ మూవీ రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే నెట్ఫ్లిక్స్ అధికారిక ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీని ఓటీటీలో అందుబాటులోకి తెచ్చింది నెట్ఫ్లిక్స్. శుక్రవారం అర్థరాత్రి నుంచి గాడ్ ఫాదర్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. కాగా, ఈ చిత్రాన్ని సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్పై నిర్మాత ఆర్.బీ చౌదరి నిర్మించగా తమన్ సంగీతం అందించాడు. దర్శకుడు పూరి జగన్నాధ్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. చదవండి: బేబీ బంప్ ఫొటోలు షేర్ షాకిచ్చిన హీరోయిన్, ఫొటోలు వైరల్ -
ఈ వారంలో థియేటర్లు, ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలివే
సినీ ప్రేక్షకులకు ఈ వారం మరింత వినోదం అందనుంది. మిమ్మల్ని అలరించేందుకు ప్రతి వారంలాగే కొత్త కొత్త చిత్రాలు సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ వారం ఓటీటీలో అగ్రహీరోల చిత్రాలు వచ్చేస్తున్నాయి. ఈ వారం థియేటర్లతో పాటు ఓటీటీకి రానున్న చిత్రాల వివరాలేంటో ఓ లుక్కేద్దాం పదండి. భయపెట్టేందుకు సిద్ధమైన 'మసూద'..!: సీనియర్ నటి సంగీత, తిరువీర్, సాయికిరణ్ ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'మసూద'. హారర్ డ్రామా నేపథ్యంలో దర్శకుడు రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ‘మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విజయవంతమైన బ్లాక్బస్టర్ల తర్వాత స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ తన మూడో చిత్రంగా ‘మసూద’ను ప్రకటించింది. ఈ చిత్రం ఈనెల 18న థియేటర్లలో విడుదల కానుంది. మాస్ కథతో వస్తున్న‘గాలోడు’ సుధీర్, గెహ్నా సిప్పి జంటగా నటించిన చిత్రం ‘గాలోడు’. రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకుడు. ప్రకృతి సమర్పణలో సంస్కృతి ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఉత్కంఠభరిత కథతో..: ఎన్.రావన్రెడ్డి, శ్రీనిఖిత, అలంకృత షా, రవీంద్ర బొమ్మకంటి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'అలిపిరికి అల్లంత దూరంలో'. ఈ చిత్రానికి ఫణి కల్యాణ్ సంగీతమందిస్తున్నారు. రెడ్డి రాజేంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రమేశ్ దబ్బుగొట్టు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 18న థియేటర్లలో రిలీజ్ కానుంది. విలేజ్ బ్యాక్డ్రాప్ ప్రేమ కథ: శ్రీ ధనలక్ష్మీ మూవీస్ పతాకంపై బీసు చందర్ గౌడ్ నిర్మిస్తున్న ప్రేమ కథాచిత్రం ‘సీతారామపురంలో ఒక ప్రేమ జంట’. ఎం. వినయ్ బాబు దర్శకత్వంలో రణధీర్, నందినీ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 18న అత్యధిక థియేటర్లలో విడుదలకు సిద్దమవుతోంది. హిందీలో దృశ్యం-2..: అజయ్ దేవగణ్, శ్రియా శరన్, టబు ప్రధాన పాత్రల్లో హిందీలో తెరకెక్కుతున్న చిత్రం 'దృశ్యం-2'. మలయాళంలో సూపర్ హిట్ మూవీ దృశ్యానికి సీక్వెల్గా వస్తోంది. ఇప్పటికే తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రానికి అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించగా ఈనెల 18న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/వెబ్సిరీస్లివే మెగాస్టార్ ‘గాడ్ఫాదర్’: మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్. మలయాళ మూవీ లూసీఫర్ రీమేక్గా తెరకెక్కిన ఈ చిత్రం ఊహించని స్థాయిలో రెస్పాన్స్ సొంతం చేసుకుంది. దసరా సందర్భంగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన గాడ్ ఫాదర్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈనెల 19 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. రాజ్తరుణ్ 'పెళ్లి సందడి': రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన వెబ్సిరీస్ అహ నా పెళ్లంట. ఏబీసీడీకి దర్శకత్వం వహించిన సంజీవరెడ్డి ఈ వెబ్సిరీస్కు దర్శకత్వం వహించగా, రాహుల్ తమడ, సాయిదీప్ రెడ్డి బొర్రా నిర్మించారు. రొమాంటిక్ కామెడీ జోనర్లో తెరకెక్కిన ఈ వెబ్సిరీస్ నవంబర్ 17న జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీకి కార్తి థ్రిల్లర్ మూవీ: కార్తీ హీరోగా, రాశీ ఖన్నా, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం సర్దార్. వాటర్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించాడు. అక్టోబర్ 21న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈనెల 18 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. మరికొన్ని హాలీవుడ్ చిత్రాలు /వెబ్సిరీస్లు నెట్ఫ్లిక్స్ ది వండర్ (హాలీవుడ్) నవంబరు 16 1899 (హాలీవుడ్) నవంబరు 17 రిటర్న్ టు క్రిస్మస్ క్రీక్ (హాలీవుడ్) నవంబరు 17 ఇలైట్ (హాలీవుడ్) నవంబరు 18 స్లంబర్ల్యాండ్( హాలీవుడ్) నవంబరు 18 అమెజాన్ ప్రైమ్ వీడియో హాస్టల్డేజ్ సీజన్-3 (వెబ్సిరీస్-హిందీ) నవంబరు 16 ది సెక్స్లైవ్స్ ఆఫ్ కాలేజ్గర్ల్స్ (వెబ్సిరీస్) నవంబరు 18 డిస్నీ+హాట్స్టార్ ఇరవతం (తమిళ్/తెలుగు) నవంబరు 17 సీతారామం (తమిళ్) నవంబరు 18 సోనీ లివ్ అనల్ మీలే పని తులి (తమిళ్) నవంబరు 18 వండర్ ఉమెన్ (తెలుగు) నవంబరు 18 -
‘గాడ్ ఫాదర్’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది! ఆ రోజు నుంచే స్ట్రీమింగ్?
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్. మలయాళ మూవీ లూసీఫర్ రీమేక్గా తెరకెక్కిన ఈ చిత్రం ఊహించని స్థాయిలో రెస్పాన్స్ సొంతం చేసుకుంది. దసరా సందర్భంగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన గాడ్ ఫాదర్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. మలయాళ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సత్యదేవ్, నయనతార, సల్మాన్ ఖాన్లు కీ రోల్ పోషించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. చదవండి: ఓటీటీకి వచ్చేసిన ది ఘోస్ట్ మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే.. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ భారీ ధరకు గాడ్ ఫాదర్ ఓటీటీ రైట్స్ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే ఈ మూవీని అందుబాటులోకి తెచ్చేందుకు నెట్ఫ్లిక్స్ సన్నాహాలు చేస్తోందట. అంతేకాదు ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ కూడా లాక్ చేసినట్లుగా తెలుస్తోంది. నవంబర్ 19 నుంచి గాడ్ ఫాదర్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందట. -
సల్మాన్ ఖాన్కు భద్రత మరింత పెంపు.. ఆ బెదిరింపులే కారణం..!
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్కు పోలీసుల భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. తాజాగా ఆయనకు వై+ కేటగిరీలో ముంబై పోలీసులు భద్రత కల్పించారు. గతంలో సల్మాన్ ఖాన్కు ప్రముఖ పంజాబీ సింగర్ సిద్ధూ మూసే వాలా హత్య కేసులో ప్రధాన నిందితుడైన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు లేఖ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో సల్మాన్ భద్రతను మరింత పటిష్ఠం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. (చదవండి: జెనీలియా మూవీపై దర్శకుడు సంచలన ఆరోపణలు.. !) సిద్ధూ మూసేవాలా హత్య కేసులో లారెన్స్ బిష్ణోయ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కృష్ణజింకల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సల్మాన్ఖాన్ని హత్య చేస్తానంటూ 2018లో కోర్టు ఆవరణలోనే ఈ గ్యాంగ్స్టర్ ప్రకటించాడు. గతంలో సల్మాన్ హత్యకు కుట్ర పన్నారని వార్తలు కూడా వచ్చాయి. సింగర్ సిద్ధూ హత్య తర్వాత కొందరు దుండగులు సల్మాన్ ఖాన్తోపాటు ఆయన తండ్రి సలీం ఖాన్ను చంపేస్తామని లేఖ ద్వారా బెదిరించారు. లేఖను సీరియస్గా తీసుకున్న ముంబై పోలీసులు ఆయనకు భద్రతను మరింత పెంచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు సల్మాన్ ఇంటి వద్ద అదనపు సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు. -
గాడ్ఫాదర్ హిట్.. కానీ ఆ చిత్రం కంటే వెనుకంజలో ఉందా?
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ఫాదర్' థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే ఈ సినిమా మలయాళంలో వచ్చిన లూసిఫర్కు రీమేక్గా వచ్చిన విషయం తెలిసిందే. దసరా కానుకగా ఈనెల 5న ప్రపంచవ్యాప్తంగా బిగ్ స్క్రీన్పై విడుదలైంది. మోహన్ రాజా తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్రలో నటించారు. మొదటి వారంలోనే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. సౌత్ భాషలతో పాటు హిందీలో కూడా రిలీజైన గాడ్ ఫాదర్ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్ల విషయంలో మాత్రం కాస్త వెనకబడినట్లే కనిపించింది. మలయాళంలో విడుదలైన లూసిఫర్తో పోల్చితే చాలా వ్యత్యాసం కనిపించింది. (చదవండి: గాడ్ఫాదర్ ఫస్ట్డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే) కేవలం మలయాళంలో మాత్రమే విడుదలైన లూసిఫర్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.160 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. అయితే మెగాస్టార్ నటించిన గాడ్ఫాదర్ మూవీ అన్ని భాషల్లో చూసినా రూ.100 కోట్లు మాత్రమే దాటింది. అంటే లూసిఫర్తో పోలిస్తే కలెక్షన్ల పరంగా వెనుకంజలో ఉంది. గాడ్ఫాదర్ రిలీజైనప్పటి నుంచి మోహన్ లాల్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేశారు. దానికి కారణం సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న మెగాస్టార్ లూసిఫర్లో కొన్ని సీన్లు సరిచేస్తూ గాడ్ ఫాదర్ తీశామని మాట్లాడారు. అన్నట్లు గానే ఈ చిత్రానికి హిట్ టాక్ వచ్చినా కలెక్షన్లలో మాత్రం లూసిఫర్ను దాటలేకపోయింది. ఈ సినిమాలో సత్యదేవ్, స్టార్ హీరోయిన్ నయనతార, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించారు. ఈ చిత్రాన్ని ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి ఎస్ఎస్ తమన్ సంగీతమందించారు. -
‘జ్యోతిలక్ష్మి’ టైంలో పూరీకి ఆ విషయం తెలియకుండా మేనేజ్ చేశా: సత్యదేవ్
విభిన్న పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో సత్యదేవ్. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన సత్యదేవ్ తనదైన నటన స్కిల్స్తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ హీరోగా ఎదిగిన సత్యదేవ్ ఇటీవల గాడ్ఫాదర్ మంచి హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో ఆయన చేసిన జయదేవ్ పాత్రకి మంచి స్పందన వచ్చింది. గాడ్ఫాదర్ బ్లాక్బస్టర్ హిట్ అయిన నేపథ్యంలో ఆయన రీసెంట్గా ఓ యూట్యూబ్చానల్తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా తన కెరీర్ గురించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. చదవండి: విడాకులు రద్దు? కొత్త ఇంటికి మారనున్న ధనుశ్-ఐశ్వర్యలు! ఇదిలా ఉంటే సత్యదేవ్ సాఫ్ట్వేర్ జాబ్ వదులుకుని మరి ఇండస్ట్రీకి వచ్చిన సంగతి తెలిసిందే. కెరీర్ ప్రారంభంలో ఆయన జాబ్ చేస్తూ మరోవైపు సినిమాల్లో నటించాడు. ఇక సాఫ్ట్వేర్ జాబ్ను పూర్తిగా వదిలేసి సినిమాల వైపే మొగ్గు చూపాడు. తాజాగా ఈ విషయంపై ఆయన స్పందించాడు. ‘అందరు నేను సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి సినిమాల్లోకి వచ్చానంటున్నారు. అది నిజం కాదు. సినిమాల్లోకి రావడం కోసమే నేను ఉద్యోగం చేశాను. ఎందుకంటే అవకాశాలు వచ్చి నిలదొక్కునేంత వరకు డబ్బులు కావాలి కదా. డబ్బు కోసమే నేను జాబ్ చేశా. బ్లఫ్ మాస్టర్ సినిమా వరకూ జాబ్ చేస్తూనే షూటింగ్లో పాల్గోన్నాను’ అని చెప్పుకొచ్చాడు. చదవండి: మోహన్ లాల్కు షాక్, అక్కడ ‘మాన్స్టర్’పై నిషేధం అనంతరం ‘షూటింగ్ కోసం నైట్ షిఫ్ట్లు చేశాను. ఉదయం షూటింగ్, నైట్ ఉద్యోగం చేస్తూ వచ్చాను. జ్యోతిలక్ష్మి సినిమాకి గ్యాప్ లేకుండా 39 రోజులు పని చేశాను. ఈ మూవీ చేసేటప్పుడు నేను సినిమాల్లో చేస్తున్నట్టు ఆఫీసులో తెలియదు. జాబ్ చేస్తున్నాననే విషయం డైరెక్టర్ పూరీ గారికి తెలియదు. జాబ్ టెన్షన్ షూటింగ్లో, సినిమా టెన్షన్ ఆఫీసుల కనిపించకుండ మేనేజ్ చేశా. ‘ఘాజీ’, ‘మనవూరి రామాయణం’, ‘బ్లఫ్ మాస్టర్’ చిత్రాలు అలాగే పూర్తి చేశాను’ అని చెప్పాడు. ఈ సందర్భంగా చిరంజీవిగారితో చేయాలనేది తన కల అని, ఆయనతో కలిసి నటించాలనే తన డ్రీమ్ను చాలా ఏళ్లుగా భద్రపరుచుకుంటూ వచ్చానన్నాడు సత్యదేవ్. -
చాలా పెద్ద రెమ్యునరేషన్ నాది కాదని వదిలేశాను : చిరంజీవి
‘‘ప్రేక్షకుల అభిరుచి మారుతూ వస్తోంది. బలమైన కథనం ఉంటే పాటలు, ఫైట్లు లేకపోయినా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మార్పుకి తగ్గట్టుగానే ‘గాడ్ ఫాదర్’ సినిమా తీశాం. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తుండటం మంచి సంకేతంగా భావిస్తున్నాను. ఈ సినిమా హిట్ మరిన్ని వైవిధ్యమైన కథలు, పాత్రలు చేయాలనే ఉత్సాహాన్ని ఇచ్చింది’’ అని హీరో చిరంజీవి అన్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రూపొందిన చిత్రం ‘గాడ్ ఫాదర్’. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలైంది. ఈ సందర్భంగా చిరంజీవి విలేకరులతో చెప్పిన విశేషాలు. ► ఇన్నేళ్ల మీ కెరీర్లో ఎన్నో హిట్స్, బ్లాక్ బస్టర్స్ని చూశారు. ‘గాడ్ ఫాదర్’ విజయం ఎంత ప్రత్యేకమైనది? నా కెరీర్లో హిట్స్, ఫ్లాప్స్ చూశాను. హిట్కి పొంగిపోయి, ఫ్లాప్కి కుంగిపోయే దశను నేను ఎప్పుడో దాటేశాను. సినిమా అనేది సమిష్టి కృషి.. అందుకే ఒక విజయం నాది అనుకోను. నా గత చిత్రం (‘ఆచార్య’) ప్రేక్షకులను నిరాశ పరిచింది.. అయితే ఆ మూవీకి నేను చేయాల్సిన ధర్మం చేశాను.. దాన్ని చెప్పుకుంటే చిన్నదైపోతుంది. చాలా పెద్ద మొత్తాన్ని (పారితోషికం) నాది కాదని వదిలేశాను.. అలాగే రామ్చరణ్ కూడా ఇచ్చేశాడు. నేను వదులుకున్నది బయ్యర్లని కాపాడుతుందనే సంతృప్తి దక్కింది. ఇప్పుడు ‘గాడ్ ఫాదర్’ హిట్ కూడా నాది అనుకోను.. యూనిట్ అందరిదీ. ► మలయాళ హిట్ మూవీ ‘లసిఫర్’కి రీమేక్గా ‘గాడ్ ఫాదర్’ చేయాలనే ఆలోచన ఎవరిది? ‘లూసిఫర్’లో చిన్న చిన్నమార్పులు చేస్తే ఈ కథ నాకు కరెక్ట్గా సెట్ అవుతుందని రామ్చరణ్కి దర్శకుడు సుకుమార్ చెప్పాడు. చరణ్ నాతో ఆ మాట అనగానే ఆ సినిమా రెండోసారి చూశాను. సుకుమార్ ఐడియా ఇచ్చాడు కానీ తర్వాత అందుబాటులో లేడు (నవ్వుతూ). ఆ తర్వాత ఒకరిద్దరు దర్శకులతో చర్చలు జరిపాం. మోహన్రాజా పేరును చరణ్ చెప్పగానే నమ్మకం కలిగింది. రచయిత సత్యానంద్తో కలిసి టీమ్ అంతా చక్కని మార్పులు చేసి, ‘గాడ్ ఫాదర్’ని అద్భుతంగా మలిచారు. ఈ సినిమా చూసి నాగార్జున, వెంకటేష్, కొందరు దర్శకులు, మిత్రులు అభినందనలు తెలిపారు. ► ‘గాడ్ ఫాదర్’లో పాటలు, డ్యాన్స్లు లేవు.. మీ ఫ్యాన్స్ నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? ఇది చాలా పవర్ఫుల్ సబ్జెక్ట్. పాటలు, డ్యాన్స్లు లేవని ఎక్కడా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ రాలేదు. సినిమా చూసినప్పుడు పాటలు లేవనే ఫీలింగ్ కలగకుండా నేపథ్య సంగీతంతో తమన్ ప్రాణం పోశాడు. ఈ సినిమాకి ‘గాడ్ ఫాదర్’ టైటిల్ సూచించింది కూడా తమనే. ► ఈ మూవీలో సత్యదేవ్, పూరి జగన్నాథ్, సర్వదమన్ బెనర్జీ పాత్రలు మీ ఎంపికేనా? ఇందులో సీఎం పాత్రకి సర్వదమన్ బెనర్జీ అయితే బావుంటుందనుకున్నాం. చాలా కాలంగా నటనకు దూరంగా ఉన్న ఆయన మా కోరిక మేరకు నటించారు.. ఆ పాత్రకి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలో నాకు, పూరి జగన్నాథ్కి మధ్య కాంబినేషన్ సీన్ ముందు అనుకోలేదు.. అయితే తను కావాలని అడగడంతో జైల్లో మా ఇద్దరి మధ్య వచ్చే సీన్ పెట్టాం. సత్యదేవ్ కూడా అందరూ వావ్ అనేలా తన పాత్ర చేశాడు. నయనతార చాలా అద్భుతంగా చేసింది. సల్మాన్ ఖాన్ ఆలోచన మోహన్ రాజాదే. అయితే సల్మాన్తో రామ్ చరణ్ మాట్లాడటంతో నాపై ప్రేమతో ఒప్పుకున్నారు. ► ఓ వైపు సినిమాలు, మరోవైపు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ఇండస్ట్రీ పెద్దగా ఉన్నారు. ఇన్ని బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తున్నారు? ప్రేక్షకులు, ఇండస్ట్రీ నన్నెంతగానో ఆదరించింది. వారు ఇచ్చిన ప్రేమ, అభిమానంతోనే ఈ స్థాయిలో ఉన్నాను కాబట్టి వారి పట్ల ఎప్పుడూ కృతజ్ఞతతోనే ఉంటాను. ఆ కృతజ్ఞతని మాటల రూపంలో కాకుండా చేతల రూపంలో తీర్చుకోవాలని ఇన్ని బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. ► ఎందరో సీనియర్ దర్శకులతో పని చేశారు. ఇప్పుడు యంగ్ డైరెక్టర్స్తో పని చేయడం ఎలా ఉంది? గతంలో కంటే ఇప్పుడు సమాచారం అన్నది అపరిమితంగా దొరుకుతోంది. యువ దర్శకులు కొత్త విషయాలని చాలా చక్కగా నేర్చుకుంటున్నారు.. దాన్ని చూపించడానికి వారికి పుష్కలమైన అవకాశాలున్నాయి. నా ఇమేజ్, వారు కొత్తగా చూపించే విధానం బాగుంటుందని నమ్ముతాను.. అందుకే యువ దర్శకులతో ప్రయాణించడానికి ఎక్కువ ఇష్టపడతాను. ► ‘సైరా’ మీ కలల ప్రాజెక్ట్ అన్నారు.. అలాంటి పాత్రలు ఇంకా ఏవైనా చేయాలని ఉందా? అలా ఏమీ లేదు. ‘సైరా’ సంతృప్తినిచ్చింది. బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్లో చేస్తున్న సినిమాలో నా నుండి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే కమర్షియల్ అంశాలు ఉంటాయి. అలాగే ‘బోళా శంకర్’లోనూ మంచి వినోదం ఉంటుంది. మీరు, పవన్ కల్యాణ్ కలసి నటించే అవకాశం ఉందా? తమ్ముడితో సినిమా చేయాలనే ఉత్సాహం నాకు, అన్నయ్యతో చేయాలని తనకీ ఉంది. ఇద్దరు స్టార్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా నిర్మించే ట్రెండ్ ఇప్పుడు తెలుగులో ఉంది. మంచి కథ కుదిరినప్పుడు తప్పకుండా చేస్తాం. ► సల్మాన్ మీ చిత్రంలో స్పెషల్ రోల్ చేశారు. వేరే భాషల్లో మీరు స్పెషల్ రోల్ చేస్తారా? కథ, పాత్ర నచ్చితే తప్పకుండా చేస్తాను. అందరూ చేయాలని కోరుకుంటాను. భాష, ప్రాంతీయ బేధాలు లేకుండా ఇండియన్ సినిమా అనే పేరు రావాలనేది నా కోరిక. ‘బాహుబలి, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్’ త్రాలతో సౌత్, నార్త్ అనే హద్దులు చెరిగిపోయాయని భావిస్తాను.. ఇది మంచి పరిణామం. ► కొందరు దర్శకులు సెట్స్లో డైలాగులు రాస్తున్నారని ఆ మధ్య అన్నారు? తప్పనిసరి పరిస్థితుల్లో సెట్స్లో డైలాగ్లు మార్చడంలో తప్పు లేదు. కానీ, ప్రీ ప్రొడక్షన్కి ఎక్కువ టైమ్ తీసుకుని, బౌండెడ్ స్క్రిప్్టతో సెట్స్కి వెళితే సమయం, డబ్బు వృథా కావు. ఆ ఆలోచనతో ఆ మాట అంటే, కొందరు వేరేలా ఆపాదించుకున్నారు. ‘గాడ్ ఫాదర్’ ప్రీ ప్రొడక్షన్ వర్క్ని మోహన్ రాజా అద్భుతంగా చేశారు. దానివల్ల సెట్స్లో ఆలస్యం కాకుండా టైమ్, డబ్బు కలిసొస్తాయి. ► చాలా సందర్భాల్లో మీరే ఒక అడుగు వెనక్కి తగ్గినట్లు కనిపిస్తారు.. ఎందుకిలా? నిజాలు నిలకడగా తేలుతాయనే మాటని నమ్ముతాను. ఇది నమ్మాను కాబట్టే.. నన్ను ఎద్దేవా చేసినవారే మళ్లీ వారి తప్పుని తెలుసుకొని నా దగ్గరికి వచ్చినప్పుడు ప్రేమగా దగ్గరకి తీసుకుంటాను. నాకు తెలిసిన ఫిలాసఫీ ఇది. ఇక్కడ ఉన్నన్ని రోజులు బ్యాంకు బ్యాలెన్స్ ఎంత పెంచుకున్నామన్నది ముఖ్యం కాదు.. ఎంతమంది మనసులకు దగ్గరయ్యానన్నదే నాకు ముఖ్యం. ‘ప్రజారాజ్యం’ పార్టీ ఉండి ఉంటే రెండు తెలుగు రాష్ట్రాలో ఏదో ఒకదానికే పరిమితం అయ్యేవాణ్ణి. ఒక నటుడిగా రెండు రాష్ట్రాల ప్రజలు నన్ను బాగా ఆదరిస్తున్నారు.. అందుకు సంతోషంగా ఉంది. -
సినిమాలతో సంబంధం లేకుండా మనమంతా కలుసుకోవాలి
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'గాడ్ ఫాదర్' విజయవంతంగా ప్రదర్శితమౌతున్న సందర్భంగా తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (టి.ఎఫ్.జె.ఎ.) కార్యవర్గ సభ్యులు, టీవీ ఛానెల్స్ ప్రతినిధులు గురువారం ఆయనను నివాసంలో కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో తేనీటి విందులో పాల్గొన్న చిరంజీవి తన చిత్రాలను గురించి సవివరంగా ముచ్చటించారు. 'ఆచార్య' మూవీ తదనానంతర పరిణామాలను మనసు విప్పి చెప్పారు. అలానే 'గాడ్ ఫాదర్' సక్సెస్ తర్వాత తనను కలిసి హర్షాన్ని వ్యక్తం చేస్తున్న వారిని కలుసుకోవడం తన కర్తవ్యంగా భావించానని అన్నారు. 'ఆచార్య' పరాజయానికి తాను కృంగిపోలేదని, ఇప్పుడు 'గాడ్ ఫాదర్' విజయానికి పొంగి పోవడం లేదని, అలాంటి స్థితప్రజ్ఞతను సాధించానని చెప్పారు. 'లూసిఫర్'ను తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుందనే ఆలోచన దర్శకుడు సుకుమార్, రామ్ చరణ్లో బలంగా కలిగించాడని, అతనికి దర్శకత్వం వహించే తీరిక లేకపోవడంతో వేరెవరితో అయినా ఆ ప్రాజెక్ట్ ను ప్రారంభించమని సలహా ఇచ్చాడని అన్నారు. ఒకానొక సమయంలో ఆ చిత్రం రీమేక్ ఆలోచన విరమించుకున్నానని, అయితే రామ్ చరణ్, ఎన్వీ ప్రసాద్ ఈ ప్రాజెక్ట్ కు దర్శకుడు మోహన రాజా ను ఎంపిక చేయడంతో మళ్లీ పట్టాలు ఎక్కిందని, అతని బృందం 'లూసిఫర్' మూవీని తన ఇమేజ్ కు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసిందని, అది వర్కౌట్ అయ్యిందని చిరంజీవి అన్నారు. ఈ సినిమా సాధించిన విజయంతో తెలుగు రచయితలూ తన కోసం వైవిధ్యమైన కథలు చేస్తారనే నమ్మకం కలిగిందని, కరోనా సమయంలో ప్రేక్షకులలో వచ్చిన మార్పు కారణంగానే తానూ 'లూసిఫర్' లాంటి విభిన్న చిత్రాన్ని ధైర్యంతో చేశానని చిరంజీవి చెప్పారు. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన సత్యదేవ్ ను చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. అలానే ప్రస్తుతం సెట్స్ పై ఉన్న దర్శకుడు బాబీ 'వాల్తేరు వీరయ్య', మెహర్ రమేశ్ 'భోళా శంకర్' చిత్రాల విశేషాలనూ చిరంజీవి అసోసియేషన్ ప్రతినిధులకు తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తో తనకున్న చిరకాల అనుబంధాన్ని చిరంజీవి మరోసారి గుర్తు చేసుకున్నారు. ఫిల్మ్ జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న కార్యవర్గ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. హెల్త్ కార్డుల పంపిణీ సమయంలో అందరినీ కలుసుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని, మళ్ళీ ఇప్పుడు ఈ సందర్భంగా కలవడం సంతోషంగా ఉందని అన్నారు. 'గాడ్ ఫాదర్' లాంటి విజయవంతమైన చిత్రాలు మరిన్ని చేయాలని, ఆ రకంగా తామంతా మళ్ళీ మళ్ళీ కలిసే ఆస్కారం ఏర్పడుతుందని టి.ఎఫ్.జె.ఎ. అధ్యక్ష కార్యదర్శులు వి. లక్ష్మీ నారాయణ, వై. జె. రాంబాబు తెలిపారు. అయితే... సినిమాలతో సంబంధం లేకుండానే తనను కలుసుకోవాలని తాను కోరుకుంటానని, ఇలాంటి ఆత్మీయ కలయికతో తనకు గూస్ బంబ్స్ వస్తాయని చిరంజీవి బదులిచ్చారు. చదవండి: గాడ్ ఫాదర్ సినిమాపై అల్లు అర్జున్ రివ్యూ నన్ను ఎద్దేవా చేసేవారిని ప్రేమతో దగ్గరకు తీసుకుంటా -
బన్నీ ఫోన్ చేసి నాతో 21 నిమిషాలు మాట్లాడారు..
-
గాడ్ ఫాదర్ సినిమా చూసి అల్లు అర్జున్ ఏమన్నాడంటే?
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన గాడ్ఫాదర్ మూవీ సూపర్ డూపర్ హిట్ సాధించింది. నయనతార, సల్మాన్ ఖాన్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం ప్రధాన బలంగా మారింది. ఊహించినదానికంటే ఎక్కువే కలెక్షన్స్ వచ్చాయని నిర్మాతలు సైతం సంతోషంగా ఉన్నారు. తాజాగా గాడ్ ఫాదర్ డైరెక్టర్ మోహన్ రాజా సినిమా సక్సెస్ను మీడియాతో పంచుకున్నారు. పలువురు సెలబ్రిటీలు ఫోన్ చేసి మరీ అభినందిస్తున్నారని తెలిపాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'నాకు మొదట రామ్చరణ్ ఫోన్ చేశాడు. అంతేకాక ఉదయం ఆరు గంటలకే నా దగ్గరకు వచ్చి అరగంటసేపు మాట్లాడారు. ఇది చాలు నాకనిపించింది. అల్లు అర్జున్ నాతో 21 నిమిషాలు మాట్లాడారు. పిచ్చెక్కించేశారు, సినిమా లడ్డూలా ఉందన్నారు. సాయిధరమ్ తేజ్ అయితే ఏకంగా ఆఫీస్కే వచ్చేసి అభినందించారు' అని చెప్పుకొచ్చాడు మోహన్ రాజా. చదవండి: గరికపాటి వివాదంపై స్పందించిన చిరంజీవి సినిమా ఛాన్స్ అని ఇంటికి పిలిచి..: నటి -
గరికపాటి వివాదంపై స్పందించిన చిరంజీవి
అలయ్ బలయ్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవిపై ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు అగ్గి రాజేసిన విషయం తెలిసిందే! 'చిరు ఫొటో సెషన్ ఆపకపోతే కార్యక్రమం నుంచి వెళ్లిపోతా'నని గరికపాటి చిరును బెదిరించడం సరి కాదంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. తాజాగా ఈ వివాదంపై చిరంజీవి స్పందించాడు. గరికపాటి పెద్దాయన అని, ఆయన చేసిన వ్యాఖ్యలపై చర్చించుకోవాల్సిన అవసరం లేదని చెప్పడంతో ఈ వివాదానికి ముగింపు పలికినట్లైంది. గాడ్ ఫాదర్ సక్సెస్లో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చిరంజీవి మాట్లాడుతూ.. మొన్న వచ్చిన ఆచార్య ఫ్లాప్ అయింది. అందుకని నేను బాధతో కుంగిపోలేదు. బయ్యర్లను కాపాడాలని నేను, రామ్చరణ్ మా పారితోషికంలో ఎక్కువ మొత్తాన్ని నిర్మాతలకు తిరిగి ఇచ్చేశాం. గాడ్ఫాదర్ సినిమా విషయానికి వస్తే.. లూసిఫర్ సినిమాలో చిన్న చిన్న మార్పులు చేస్తే నాకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని సుకుమార్.. చరణ్కు చెప్పాడట. ఐడియా ఇచ్చాడు కానీ తర్వాత అందుబాటులో ఉండలేదు. ఒక రోజు చరణ్ బాబు దర్శకుడు మోహన్ రాజా పేరు చెప్పాడు. తని వరువన్ను అద్భుతంగా తీసిన ఆయన లూసిఫర్ రీమేక్కు న్యాయం చేస్తాడనే సంపూర్ణ నమ్మకం కలిగింది. నిజానికి రీమేక్ సినిమాలు చేయడం ఒక సవాల్. కానీ ప్రేక్షకుల ఆదరణ వల్ల ఘరానా మొగుడు, ఠాగూర్.. ఇప్పుడు గాడ్ ఫాదర్ గొప్ప విజయాలు అందుకున్నాయి. సల్మాన్ ఖాన్.. గాడ్ ఫాదర్ చేసినట్లే నాకూ వేరే ఇండస్ట్రీ నుంచి పిలుపు వస్తే తప్పకుండా చేస్తాను. ఎలాంటి భాషా, ప్రాంతీయ బేధాలు లేకుండా 'ఇండియన్ సినిమా' అనే పేరు రావాలని నా కోరిక. ఇకపోతే నేను చాలా విషయాల్లో తగ్గితే తప్పేంటని అనుకుంటాను. ఇక్కడ తగ్గటం అంటే సంయమనం పాటించడం. నిజం నిలకడగా తెలుస్తుందనే మాటను నమ్మినవాడిని నేను. నన్ను ఎద్దేవా చేసినవారే మళ్లీ వారి తప్పు తెలుసుకుని నా దగ్గరకు వస్తే వారిని ప్రేమగా దగ్గరకు తీసుకోవడమే నాకు తెలిసిన ఫిలాసఫీ' అని చెప్పుకొచ్చాడు చిరంజీవి. చదవండి: సినిమా ఛాన్స్ అని నడుము చూపించమన్నాడు: నటి నయన్ సరోగసీపై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం -
చిరు, సల్మాన్ల తార్మార్.. ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో మోహన్ రాజా తెరకెక్కించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'గాడ్ ఫాదర్'.దసరా సందర్భంగా అక్టోబర్ 5న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. టాలీవుడ్తో పాటు బాలీవుడ్లోనూ ఈ మూవీ మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో కనిపించి సందడి చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి స్టెప్పులేసిన ‘తార్మార్ తక్కర్మార్’(Thaar Maar Thakkar Maar) సాంగ్ ప్రేక్షక్షకులను ఉర్రూతలూగించింది. చిరు, సల్మాన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సాంగ్ ఫుల్ వీడియో ఇప్పుడు వచ్చేసింది. ఈ మాస్ సాంగ్కి అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా, శ్రేయా ఘోషల్ అద్భుతంగా ఆలపించారు . తమన్ సంగీతం అందించారు. -
ఊహించినదానికంటే ఎక్కువ కలెక్షన్స్: గాడ్ ఫాదర్ నిర్మాత
ఇద్దరు మెగాస్టార్లు చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలిసి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ 'గాడ్ ఫాదర్'. మోహన్ రాజా దర్శకత్వం వహించగా తమన్ సంగీతం అందించారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్లపై ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మించారు. అక్టోబర్ 5న దసరా కానుకగా విడుదలైన గాడ్ ఫాదర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో నిర్మాత ఎన్వీ ప్రసాద్ ''గాడ్ ఫాదర్'' విలేఖరుల సమావేశంలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 'గాడ్ ఫాదర్కు అన్ని చోట్ల అద్భుతమైన కలెక్షన్స్ వున్నాయి. సినిమాను ఎవరికీ అమ్మలేదు. మేమే సొంతంగా విడుదల చేశాం. కలెక్షన్స్ మేము ఊహించినదాని కంటే అద్భుతంగా వున్నాయి. తెలుగు రాష్ట్రాలలో 60 కోట్ల షేర్ వచ్చింది. మా బ్యానర్కు మైల్ స్టోన్ సినిమా. లూసిఫర్ను అందరూ చూశారు. ఆ సినిమాను రీమేక్ చేయడం ఒక సాహసం. అలాంటి సినిమాని మార్పులు చేసి విజయం సాధించడం మామూలు విషయం కాదు. హిందీలో మొదటి వారం పదికోట్లు రెవెన్యూ కలెక్ట్ చేయడం చిన్న విషయం కాదు. తమిళనాడులో పోన్నియిన్ సెల్వన్ అద్భుతంగా ఆడుతోంది. వారి కల్చర్ మూవీకి గౌరవం ఇచ్చి అక్కడ గాడ్ ఫాదర్ రిలీజ్ను ఆపుకున్నాం. అక్టోబర్ 14న గాడ్ ఫాదర్ను తమిళనాడులో గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నాం. రామ్ చరణ్ ఆలోచన వల్లే ఈ సినిమా మొదలైయింది. విడుదల తర్వాత ఆయన ఆనందం మాటల్లో చెప్పలేం. చరణ్ తన సొంత సినిమా కంటే ఎక్కువ ఆనందపడ్డారు. గాడ్ ఫాదర్ లాంటి విజయం ఇండస్ట్రీకి అవసరం. ఇలాంటి విజయాలు వచ్చినప్పుడే ఎగ్జిబిటర్ వ్యవస్థ వుంటుంది. ఎగ్జిబిటర్స్ అందరికి కూడా ఒక పండగలాంటి సినిమా గాడ్ ఫాదర్' అని చెప్పుకొచ్చాడు ఎన్వీ ప్రసాద్. చదవండి: నిన్ను చంపేస్తా.. నటుడి భార్యకు నటి వార్నింగ్ పంజాబీ నటితో సింగర్ డేటింగ్ -
డైరెక్టర్ పూరీకి ఏమైంది? చిరు పిలిచినా ఎందుకు రాలేదు?
ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్’ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. మోహన్ రాజాగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్ 5న విడుదలై.. సూపర్ హిట్ టాక్తో దూసుకెళ్తోంది. వంద కోట్ల క్లబ్ని కూడా దాటేసింది. సినిమా విడుదలైన మూడు రోజులకే సక్సెస్ మీట్ని ఏర్పాటు చేసింది చిత్ర బృందం. ఈ వేడుకకి సినిమా కోసం పని చేసిన టెక్నిషియన్స్తో పాటు నటీనటులందరూ వచ్చారు. కానీ కీలక పాత్ర పోషించిన పూరీ జగన్నాథ్ మాత్రం కనిపించలేదు. దీంతో పూరీకి ఏమైంది? చిరు సినిమా సక్సెస్ మీట్కి ఎందుకు రాలేదు? అసలు సక్సెస్ మీట్కి చిరంజీవి ఆహ్వానించారా? లేదా? అనేది టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. అసలు విషయం ఏంటంటే.. మెగాస్టార్ చిరంజీవి ఆహ్వానించినప్పటికీ.. సక్సెస్ మీట్కి పూరీ రాలేనని చెప్పారట. (చదవండి: సమంత మళ్లీ ప్రేమలో పడిందా..?) పూరీ ప్రస్తుతం గోవాలో తన తర్వాతి సినిమా స్క్రిప్ట్ వర్క్లో బిజీగా ఉన్నాడు. భారీ అంచనాలు పెట్టుకున్న ‘లైగర్’ డిజాస్టర్ కావడంతో.. విజయ్ దేవరకొండ ప్లాన్ చేసిన ‘జనగనమణ’ మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పటికిప్పుడు పూరీతో సినిమా చేయడానికి నిర్మాతలు ఎవరూ ముందుకు రావడం లేదు. హీరోలు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారట. ఇలాంటి సమయంలో బయటకు రావడానికి పూరీ ఇష్టపడడం లేదట. అందుకే మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఫోన్ చేసి సక్సెస్ మీట్కి ఆహ్వానించినా.. సున్నితంగా తిరస్కరించారట. గాడ్ ఫాదర్లో పూరీ జగన్నాథ్ పోషించిన జర్నలిస్ట్ పాత్ర అదిరిపోయింది. సక్సెస్ మీట్లో కూడా చిరంజీవి పూరీని పొగిడేశాడు. కానీ పూరీ, చిరు ఒకే స్టేజ్ మీద కనిపించి ఉంటే బాగుండేది అంటున్నారు ఆయన అభిమానులు. -
‘గాడ్ఫాదర్’పై సూపర్ స్టార్ రజనీ రివ్యూ.. ఏమన్నారంటే
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. దసరా సందర్భంగా అక్టోబర్ 5న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. టాలీవుడ్తో పాటు బాలీవుడ్లోనూ ఈ మూవీ మంచి వసూళ్లను రాబడుతోంది. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా గాడ్ఫాదర్ చూసిన సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాను బాగా ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది. గాడ్ఫాదర్ చూసి రజనీకాంత్ తన రివ్యూ ఇచ్చారని, ఇది తనకు బెస్ట్ మూమెంట్ అంటూ డైరెక్టర్ మోహన్ రాజా ఆనందం వ్యక్తం చేశాడు. చదవండి: తల్లిదండ్రులైన మరుసటి రోజే నయన్ దంపతులకు షాక్! ఈ మేరకు మోహన్ రాజా ట్వీట్ చేస్తూ.. ‘సూపర్ స్టార్ ‘గాడ్ఫాదర్’ సినిమా చూశారు. ఈ మూవీ చాలా చాలా బాగుంది అన్నారు. ప్రత్యేకంగా తెలుగు వెర్షన్ కోసం చేసిన అనుసరణలు అద్భుతంగా ఉన్నాయని ఆయన కొనియాడారు. ధన్యవాదాలు తైలవా(రజనీకాంత్) సార్, నా జీవితంలోని అత్యుత్తమ క్షణాలలో ఇది ఒకటి’ అంటూ మురిసిపోయాడు. కాగా డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కించిన ఈ మూవీలో నయనతార, సత్యదేవ్, సల్మాన్ ఖాన్ కీలకపాత్రల్లో నటించారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు గాడ్ ఫాదర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లు పైగా వసూలు చేసినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. Superstar watched #Godfather 😇 Excellent!! very nice!! very interesting!!! are few of the remarks in his detailed appreciation on the adaptions made for the Telugu version. Thank u so much Thalaiva @rajinikanth sir, one of the best moments of life.. means a lotttt 🙏 pic.twitter.com/AFdT7oOoBe — Mohan Raja (@jayam_mohanraja) October 10, 2022 -
గాడ్ ఫాదర్ గ్రాండ్ సక్సెస్.. మూవీ టీమ్ స్పెషల్ చిట్ చాట్
-
గాడ్ ఫాదర్ విజయానికి అదే కారణం: నయనతార
దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదలైన చిరంజీవి గాడ్ఫాదర్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో దూసుకెళ్తోంది. అభిమానుల నుంచి విపరీతమైన స్పందన రావడంతో చిత్రబృందం సక్సెస్ మీట్ కూడా నిర్వహించింది. ఈ సినిమా విజయం పట్ల ప్రధానపాత్రలో నటించిన కోలీవుడ్ భామ నయనతార తాజాగా స్పందించింది. ఇంత గొప్ప విజయాన్ని అందించిన అభిమానులకు కృతజ్ఞతలు చెబుతూ సోషల్ మీడియాలో ఓ నోట్ విడుదల చేసింది. నయనతార నోట్లో రాస్తూ.. 'గాడ్ ఫాదర్ సినిమాను బ్లాక్బస్టర్గా నిలిపినందుకు సినీ ప్రేమికులు, నా అభిమానులందరికీ ధన్యవాదాలు. ఈ విజయానికి కారణం అద్భుతమైన చిత్రబృందమే. మెగాస్టార్ చిరంజీవితో మరోసారి స్క్రీన్ను పంచుకోవడం ఆనందంగా ఉంది. ఆయన గొప్ప నటుడే కాదు గొప్ప వ్యక్తి కూడా. నాపై నమ్మకం ఉంచి మరో అవకాశమిచ్చిన దర్శకుడు మోహన్ రాజాకు కృతజ్ఞతలు. సల్మాన్ ఖాన్ను ప్రేక్షకులు ఎందుకు ఇష్టపడతారో ఈ సినిమా ద్వారా తెలిసింది. ఈ చిత్రం భారీ విజయం సాధించినందుకు ఆయనకు ధన్యవాదాలు'. అంటూ రాసుకొచ్చింది. మలయాళంలో మోహన్లాల్ చిత్రం లూసిఫర్ తెలుగు రీమేక్ గాడ్ ఫాదర్. ఈ సినిమాలో సత్యదేవ్, డైరెక్టర్ పూరీ జగన్నాధ్, గంగవ్వ, సునీల్, బ్రహ్మాజీ, కీలక పాత్రల్లో నటించారు. HUMONGOUS BLOCKBUSTER #GodFather pic.twitter.com/FC1eiPBsnT — Nayanthara✨ (@NayantharaU) October 9, 2022 -
గాడ్ ఫాదర్ సినిమా టాక్ పై మెగాస్టార్ ఆసక్తికర కామెంట్స్
-
బాక్సాఫీస్ షేక్ చేస్తున్న గాడ్ ఫాదర్.. మూడు రోజుల్లోనే రూ.100 కోట్లు
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. బాలీవుడ్ సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం పలు రికార్డులను తిరగరాస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. (చదవండి: బాలీవుడ్లో ‘గాడ్ ఫాదర్’ హవా.. 600 స్క్రీన్స్ పెంపు) గతంలో మెగాస్టార్ ఖైదీ నెం.150 మాత్రమే రూ.164 కోట్లతో ఆయన కెరీర్లో బెస్ట్గా నిలిచిందన్నారు. త్వరలోనే గాడ్ఫాదర్ ఈ రికార్డును అధిగమించనుందని ట్వీట్ చేశారు. గతంలో విడుదలైన ఆచార్య వసూళ్లను అధిగమించింది. గాడ్ ఫాదర్ 2019లో వచ్చిన మలయాళ చిత్రం లూసిఫర్కి తెలుగు రీమేక్. మోహన్ రాజా దర్శకత్వం వహించిన గాడ్ ఫాదర్ చిత్రంలో నయనతార, సత్యదేవ్ నటించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. #GodFather ENTERS ₹100 cr club at the WW Box Office. — Manobala Vijayabalan (@ManobalaV) October 8, 2022 -
సల్మాన్ ఖాన్ కు ప్రత్యేకంగా థాంక్స్ చెప్పిన మెగాస్టార్
-
బాలీవుడ్ లో దుమ్ములేపుతున్న గాడ్ ఫాదర్ కలెక్షన్స్
-
రెండు రోజుల్లో గాడ్ ఫాదర్ కలెక్షన్స్ ఎంతంటే..
-
ఆయనతో తొలి హిట్ సాధించా!
‘‘గాడ్ ఫాదర్’ ప్రీమియర్ తర్వాత చిరంజీవిగారు ప్రేమగా హత్తుకున్నారు.. సినిమా రిలీజ్ తర్వాత ఆయన ప్రశంసించడం మర్చిపోలేను. దర్శకుడు శంకర్గారు, సంగీతదర్శకులు మణిశర్మ, కోటిగార్లు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పారు. చాలామంది మెగా ఫ్యాన్స్ ఫోన్ చేసి, భావోద్వేగంగా మాట్లాడటం హ్యాపీ’’ అని సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ అన్నారు. చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గాడ్ ఫాదర్’. సల్మాన్ ఖాన్, నయన తార, సత్యదేవ్ కీలక పాత్రలు చేశారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలైంది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ – ‘‘నేను తొలిసారి పని చేసిన హీరోలందరి సినిమాలు హిట్టయ్యాయి. ఇప్పుడు చిరంజీవిగారితో చేసిన తొలి సినిమా ‘గాడ్ ఫాదర్’ హిట్ అయి, నా సెంటిమెంట్నిæకొనసాగించింది. నా ఆరేళ్ల వయసులో మా అమ్మగారితో కలిసి కోటిగారి రికార్డింగ్ స్టూడియోకి వెళ్లాను. ‘అందం హిందోళం..’ పాట రికార్డింగ్ జరుగుతోంది. ఆ పాట విని చిరంజీవిగారికి ఫ్యాన్ అయ్యాను. అప్పటి నుండి ఇంట్లో ఎప్పుడూ చిరంజీవిగారి పాటలే వాయిస్తూ ఉండేవాణ్ణి. చిరంజీవిగారు మహా వృక్షం. ఒక ఫ్యాన్గా నేను ‘గాడ్ ఫాదర్’ సినిమా చేశాను. ఆయన సినిమాకి మ్యూజిక్ చేయడం తేలికైన విషయం కాదు. పైగా మ్యూజిక్కి స్కోప్ లేని సినిమాలో మ్యూజికల్గా హై తీసుకురావడం చాలెంజ్. లండన్లోని అబేయ్ రోడ్ స్టూడియోలో రికార్డ్ చేసిన తొలి భారతీయ చిత్రం ‘గాడ్ ఫాదర్’. మనం ఓ కమర్షియల్ సినిమా చేద్దామని చిరంజీవిగారిని అడిగితే, చేద్దామన్నారు’’ అన్నారు. -
గాడ్ఫాదర్ ఫస్ట్డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే
చిరంజీవి-మోహన్ రాజా కాంబినేషన్లో రూపొందిన లేటెస్ట్ మూవీ 'గాడ్ ఫాదర్'. దసరా సందర్భంగా బుధవారం(అక్టోబర్ 5న) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి షో నుంచే హిట్ తెచ్చుకుంది. దీంతో తొలి రోజు ఈ మూవీ భారీగా వసూళ్లు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం తొలి రోజు రూ. 38 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు చేసినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో 20.9 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం. గాడ్ ఫాదర్ వసూళ్లు ఎలా ఉన్నాయంటే.. నైజాం: రూ. 3.25 కోట్లు ఉత్తరాంధ్ర: రూ. 1.25 కోట్లు సీడెడ్: రూ.3.05 కోట్లు నెల్లూరు: రూ.57 లక్షలు గుంటూరు: రూ.1.75 కోట్లు కృష్ణా జిల్లా: రూ.73 లక్షలు తూర్పు గోదావరి: రూ.1.60 కోట్లు పశ్చిమ గోదావరి: రూ.80 లక్షలు ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఏపీలో 6.70 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే.. 'గాడ్ ఫాదర్' సినిమాకు మొదటి రోజు 13 కోట్ల రూపాయల షేర్ వచ్చినట్లు సమాచారం. -
అందుకే గాడ్ఫాదర్ ప్రమోషన్స్కి దూరంగా ఉన్నా: అనసూయ
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాడ్ఫాదర్. మలయాళ సూపర్ హిట్ లూసిఫర్కు రీమేక్గా తెరకెక్కిన ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించారు. దసరా బరిలో దిగిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్లను వసూళు చేస్తోంది. పొలిటికల్ థ్రిల్లర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో యాంకర్ అనసూయ కూడా ఓ కీలక పాత్రలో నటించింది. ఈ క్రమంలోనే ఆమె నటనను ప్రశంసిస్తూ ఓ నెటిజన్.. గాడ్ఫాదర్ మూవీలో మీ రోల్ నాకెంతో నచ్చింది. ఇంత మంచి రోల్ చేసినప్పటికీ మీరెందుకు ప్రమోషన్స్లో ఎక్కడా కనిపించలేదు అని ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన అనసూయ.. మీరు ఇది నమ్మాలి. ఒకే సమయంలో చాలా షూటింగుల్లో పాల్గొంటున్నాను. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసమే నేనెంతో కష్టపడుతున్నా అంటూ చెప్పుకొచ్చింది. కాగా అనసూయ రియాక్షన్పై సోషల్ మీడియాలో పలు రకాలుగా స్పందిస్తున్నారు. నిజంగానే షూటింగ్స్లో బిజీగా ఉందేమో అని కొందరంటే, కనీసం ఒక్క ట్వీట్ కూడా చేయడానికి ఆమెకు టైం లేదా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. Thank you andi! Meeru nammali.. chala shoots okesari jarugutunnai.. I am working hard to entertain y’all 😛🫣 https://t.co/uev9WrKQQX — Anasuya Bharadwaj (@anusuyakhasba) October 5, 2022 -
'ఆ ఇమేజ్ నాది అనుకుంటే అమాయకత్వం, మూర్ఖత్వమే'
‘‘స్టార్ ఇమేజ్ ఉన్నప్పటికీ నేను నిరాడంబరంగా ఉంటానని ఇండస్ట్రీ వాసులు అంటున్నారు. కానీ ఓ శిల్పం బాగుందంటే అది ఆ శిల్పం గొప్పదనం కాదు.. ఆ శిల్పం చెక్కినవారిది.. మోసినవారిది.. గుర్తించినవారిది. అలాగే నా ఇమేజ్ కూడా నాది కాదు. నాకు అవకాశాలు కల్పించిన దర్శక–నిర్మాతలు, సహకరించిన నటీనటులు, ఆదరించిన ప్రేక్షకులు, అభిమానులది. నా ఇమేజ్ నాది అనుకుంటే అది నా అమాయకత్వం, మూర్ఖత్వమే అవుతుంది’’ అని చిరంజీవి అన్నారు. చిరంజీవి హీరోగా మోహన్రాజా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గాడ్ ఫాదర్’. మలయాళ ‘లూసీఫర్’కు తెలుగు రీమేక్గా ‘గాడ్ ఫాదర్’ రూపొందింది. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్.బి. చౌదరి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలైంది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన ప్రీ రిలీజ్ ప్రెస్మీట్లో చిరంజీవి మాట్లాడుతూ – ‘‘రొటీన్గా పాటలు, హీరోయిన్, ఫైట్స్... ఇవి లేకుండా వైవిధ్యమైన సినిమాలు చేయాలని ఆలోచిస్తున్నప్పుడు రామ్చరణ్ ‘లూసీఫర్’ గురించి చెప్పాడు. తెలుగు డబ్బింగ్ వెర్షన్ ‘లూసీఫర్’ చూశాను. ఎక్కడో వెలితి.. అసంతృప్తి. సత్యానంద్గారు, మోహన్ రాజా చెప్పిన మార్పులతో ఈ కథను తెలుగు ప్రేక్షకులకు చెప్పాలనుకున్నాం. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఫైట్స్, హీరోయిన్, పాటలు అనే ఆలోచనలు రాకుండా కథ, అందులోని నా క్యారెక్టర్తోనే ప్రేక్షకులు ట్రావెల్ అవుతారు. ఫైట్స్, రొమాన్స్, యాక్షన్ వంటి అంశాలను కట్ చేసినా కథలోని సోల్కు కనెక్ట్ అయితే ఆ సినిమా భవిష్యత్ దాదాపు తెలిసిపోతుంది. ‘గాడ్ఫాదర్’ చిత్రం విజయం సాధిస్తుంది. మోహన్రాజా బాగా తెరకెక్కించాడు. సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్, పూరి జగన్నాథ్ బాగా నటించారు. తమన్ మ్యూజిక్ అదిరిపోతుంది. ఆర్బీ చౌదరిగారు లెజండరీ ప్రొడ్యూసర్. ఆయన నిర్మాణసంస్థ వంద సినిమాల మైలురాయికి దగ్గరపడుతోంది. వందో సినిమాలో నన్ను చేయమన్నట్లుగా అడిగారు. మంచి కథ కుదరితే చేస్తాను. నిర్మాత ఎన్వీ ప్రసాద్గారు మా ఫ్యామిలీ మెంబర్. ‘గాడ్ ఫాదర్’పై ప్రేక్షకుల అభిమానం, ప్రేమ ఉండాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. రీమేక్ అనగానే ఎందుకు తక్కువ భావనతో చూస్తారో నాకు అర్థం కావడం లేదు. రీమేక్ అనేది ఓ చాలెంజ్. నేను చేసిన రీమేక్ మూవీస్ కూడా మాతృకల కంటే ఎక్కువ కలెక్షన్స్ సాధించాయి. యాక్టర్గా నాకు పేరు తీసుకువచ్చాయి. పోలికలు పెట్టినా సరే నేను నిలబడగలను అని నా హిస్టరీ చెబుతుంది. ఆ ఆత్మవిశ్వాసం నాలో ఉంది. రాజకీయాల నుంచి తిరిగి ఇండస్ట్రీకి వస్తున్నప్పుడు గతంలో అభిమానులు, ప్రేక్షకులు నాపై చూపించిన ప్రేమ అలానే ఉంటుందా? అనే సందేహం నాకు కలిగింది. కానీ నా ‘ఖైదీ నంబరు 150’ సినిమా ఫంక్షన్కు భారీగా వచ్చిన అభిమానులు, ప్రేక్షకులను చూసి ఆ అనుమానం తీరిపోయింది. వారి ప్రేమకు ధన్యవాదాలు. ‘గాడ్ ఫాదర్’ కంప్లీట్ పొలిటికల్ అండ్ ఫ్యామిలీ ఫిల్మ్. ఈ సినిమాలోని డైలాగ్స్ సమకాలీన రాజకీయాలను ఉద్దేశిస్తూ కానీ, విమర్శిస్తూ కానీ చెప్పినవి కావు. మాతృక (మలయాళ ‘లూసీఫర్’)లో ఉన్న కథ ఆధారంగానే ‘గాడ్ ఫాదర్’లో డైలాగ్స్ ఉన్నాయి. ఆ డైలాగ్లు విని ఎవరైనా భుజాలు తడుముకుంటే నేనేం చేయలేను. దర్శకుడు మోహన్ రాజా మాట్లాడుతూ – ‘‘ఈ రోజు మనం పాన్ ఇండియా సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ ఆంధ్ర సినిమా మ్యాప్ దేశానికి చూపించిన వ్యక్తి చిరంజీవి. 1992–2000 సమయాల్లో ఎక్కువ పారితోషికం తీసుకుంది, మార్కెట్ క్రియేట్ చేసింది చిరంజీవిగారే’’ అన్నారు. ‘‘చిరంజీవిగారితో సినిమా చేయాలన్న నా ఆకాంక్ష ‘గాడ్ ఫాదర్’తో నెరవేరింది. ఇందుకు కారణమైన రామ్చరణ్కు ధన్యవాదాలు’’ అన్నారు ఎన్వీ ప్రసాద్. ‘‘చిరంజీవిగారు–చరణ్ల వల్లే సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో నటించారు. ‘గాడ్ ఫాదర్’ చిత్రం విజయం సాధిస్తుంది’’ అన్నారు నిర్మాత ఆర్బీ చౌదరి. రచయిత సత్యానంద్, మాటల రచయిత లక్ష్మీభూపాల్, గేయరచయితలు రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్, నటుడు బ్రహ్మాజీ, ‘గెటప్’ శీను, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
మెగాస్టార్ ట్వీట్ వైరల్.. ఫుల్ జోష్లో ఫ్యాన్స్
దసరా కానుకగా చిరంజీవి ప్రధానపాత్రలో నటించిన ‘గాడ్ఫాదర్’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఇవాళ చిత్రబృందం ఓ ప్రెస్మీట్లో సినిమాలోని పొలిటికల్ డైలాగ్స్పై చిరు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ప్రమోషన్లలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి చేసిన ఓ ట్వీట్ వైరలవుతోంది. 'కింగ్ అయినా.. కింగ్ మేకర్ అయినా.. క్రియేట్ చేసేది బ్రహ్మ.. ఈ బ్రహ్మ' అంటూ వాయిస్తో పోస్ట్ చేశారు మెగాస్టార్. సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొనగా.. చిరు వాయిస్తో డైలాగ్ మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. రేపు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గాడ్ ఫాదర్ అలరించనుంది. మోహన్రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్కు జోడిగా నయనతార నటిస్తోంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్కి తెలుగు రీమేక్గా ఈ చిత్రం తెరకెక్కించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతమందించగా.. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. pic.twitter.com/TS3cfWI3bA — Chiranjeevi Konidela (@KChiruTweets) October 4, 2022 -
పవన్ కల్యాణ్ జనసేనకు మద్దతుపై చిరంజీవి ఆసక్తికర కామెంట్స్
జనసేన అధినేత పవన్ కల్యాణ్కు మద్దతుపై మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో తాను జనసేనకు మద్దతు ఇస్తానో లేదో కాలమే నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు చిరంజీవి. అదే సమయంలో పవన్ కల్యాణ్ స్థాయిని ప్రజలే నిర్ణయిస్తారని చిరంజీవి పేర్కొన్నారు. (చదవండి: ‘గాడ్ ఫాదర్’ టైటిల్ సాంగ్ రిలీజ్.. ఇంకెందుకు ఆలస్యం వినేయండి..!) చిరంజీవి మాట్లాడుతూ..'నేను రాజకీయాల నుంచి తప్పుకుని సైలెంట్గా ఉన్నా. ప్రస్తుత రాజకీయాలపై నేను ఎలాంటి సెటైర్లు వేయలేదు. కేవలం సినిమాలో ఉన్న డైలాగులు మాత్రమే చెప్పా. పవన్ కల్యాణ్ జనసేనకు మద్దతు ఇస్తానో లేదో చెప్పలేను. నేను తప్పుకుంటనే పవన్కు లాభం చేకూరుతుందేమో' అని అన్నారు. దసరా కానుకగా గాడ్ ఫాదర్ ఆక్టోబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది. -
‘లూసిఫర్’లో లేనిది గాడ్ ఫాదర్లో ఉంది!
‘‘మలయాళ ‘లూసిఫర్’ కి నేను పెద్ద అభిమానిని. ఆ సినిమాని గొప్పగా ప్రేమించి ఇంకా గొప్పగా తీసిన సినిమా ‘గాడ్ ఫాదర్’ అని డైరెక్టర్ మోహన్ రాజా అన్నారు. చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గాడ్ఫాదర్’. సల్మాన్ ఖాన్ , నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలు చేశారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా రేపు (బుధవారం) విడుదల అవుతోంది. ఈ సందర్భంగా మోహన్ రాజా పంచుకున్న విశేషాలు. ⇔ నేను పుట్టింది తమిళనాడులో అయినా దర్శకుడిగా జన్మనిచ్చింది తెలుగు చిత్రపరిశ్రమ. మా నాన్నగారు (ఎడిటర్ మోహన్) వేసిన బాటలో నేను, తమ్ముడు (‘జయం’ రవి) ప్రయాణిస్తున్నాం. తెలుగులో 10 ఏళ్లలో 9 వరుస హిట్లు అందుకున్నారు నాన్నగారు. రవిని హీరోగా చేసేందుకు తమిళ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయ్యాం. ⇔ నా తొలి తెలుగు చిత్రం ‘హనుమాన్ జంక్షన్’ విడుదలై 21 ఏళ్లు అయింది. ఇన్నేళ్ల తర్వాత తెలుగులో ‘గాడ్ ఫాదర్’ చేయడం గర్వంగా ఉంది. ఇన్నేళ్లు తెలుగుకి దూరంగా ఉన్నాననే భావన కలగ లేదు.. ఎందుకంటే ఆరు తెలుగు సినిమాలను వరుసగా తమిళ్లో రీమేక్ చేశా. ⇔ ఎన్వీ ప్రసాద్గారు నాకు చిన్నప్పటి నుండి తెలుసు. నన్ను మళ్లీ తెలుగులోకి రమ్మని పిలిచేవారు. ఒకసారి మహేశ్బాబు దగ్గరికి కూడా తీసుకెళ్లారు. ‘తని వరువన్’ (ధృవ) నుండి రామ్ చరణ్తో పరిచయం. ‘ధృవ –2’ గురించి చర్చలు జరుపుతున్న సమయంలో ‘లూసిఫర్’ రీమేక్ ప్రస్తావన వచ్చింది. ఈ సినిమాకి దర్శకుడిగా నా పేరుని ఎన్వీ ప్రసాద్గారు సూచించడంతో చిరంజీవిగారు, చరణ్లు ఓకే అన్నారు. ‘లూసిఫర్’ లో నాకు దొరికిన ఒక కొత్త కోణం చిరంజీవిగారికి చాలా నచ్చింది. ⇔ ‘లూసిఫర్’లో లేని ఒక కోణం ‘గాడ్ఫాదర్’లో ఉంటుంది. కథని అలాగే ఉంచి ఫ్రెష్ స్క్రీన్ ప్లే చేశాను. ఇందులోని పది పాత్రలు చాలా సర్ప్రైజింగ్గా ఉంటాయి. ‘గాడ్ఫాదర్’ చిరంజీవిగారి ఇమేజ్కి తగ్గ కథ. ఈ కథకి సరిపడే ఇమేజ్ ఉన్న హీరోలు ఇండియాలో ఓ ముగ్గురు మాత్రమే ఉంటారు. ⇔ ‘లూసిఫర్’లో పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన పాత్రలో సల్మాన్ఖాన్గారు బాగుంటుందనే ఆలోచన నాదే. రామ్చరణ్ అడగ్గానే చిరంజీవిగారిపై ఉన్న ప్రేమతో ఈ మూవీ ఒప్పుకున్న సల్మాన్కి థ్యాంక్స్. చిరంజీవి, సల్మాన్ ఖాన్లాంటి మెగాస్టార్లని డైరెక్ట్ చేయడం చాలా ఒత్తిడిగా ఉంటుంది.. అయితే చిరంజీవిగారు ఇచ్చిన ప్రోత్సాహం మర్చిపోలేను. ⇔ చిరంజీవిగారితో మా నాన్నగారు ‘హిట్లర్’ అనే హిట్ మూవీ నిర్మించారు. నేను ‘గాడ్ఫాదర్’ అనే హిట్ ఇవ్వబోతుండటం హ్యాపీ. మలయాళంలో ‘లూసిఫర్ 2’ మొదలైంది. ప్రస్తుతం నా దృష్టి ‘గాడ్ ఫాదర్’ పైనే ఉంది. అయితే ఈ సినిమా సీక్వెల్కి మంచి కంటెంట్ ఉంది. -
‘గాడ్ ఫాదర్’ టైటిల్ సాంగ్ రిలీజ్.. ఇంకెందుకు ఆలస్యం వినేయండి..!
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో మోహన్ రాజా తెరకెక్కించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'గాడ్ ఫాదర్'. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ సాంగ్ విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీకి ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ మెగాస్టార్ ఫ్యాన్స్లో భారీ అంచనాలు పెంచేశాయి. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. (చదవండి: 'గాడ్ఫాదర్' హిందీ ట్రైలర్ రిలీజ్.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర కామెంట్స్) ఈ సందర్భంగా తాజాగా టైటిల్ సాంగ్ను అభిమానులతో పంచుకుంది చిత్ర బృందం. చిరు పాత్రకు అద్దం పట్టే టైటిల్ సాంగ్ను రామజోగయ్యశాస్త్రి రాశారు. తమన్ పవర్ఫుల్ సంగీతం అందించారు. సల్మాన్ఖాన్, నయనతార, సత్యదేవ్, పూరీ జగన్నాథ్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. మలయాళంలో సూపర్ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్గా గాడ్ ఫాదర్ ప్రేక్షకుల ముందుకొస్తోంది. -
‘గాడ్ ఫాదర్’లో రామ్ చరణ్.. సల్మాన్ ఖాన్ ఏమన్నారంటే?
మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం గాడ్ ఫాదర్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. దసరా కానుకగా అక్టోబరు 5న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా ఈ చిత్రంలో రామ్ చరణ్ నటించారని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తెలిపారు. ఇటీవల ముంబైలో జరిగిన హిందీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో ఈ విషయాన్ని వెల్లడించారు. సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ 'ఈ మూవీలో రామ్ చరణ్ అతిథి పాత్ర పోషించారు. తెరపై చూసేందుకు తామూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఒకే ఫ్రేమ్లో కలిసి నటించాలని ఉందని రామ్ చరణ్ చెప్పారు. అతను జోక్ చేస్తున్నాడేమో అనుకుని, దీని గురించి రేపు మాట్లాడదాం అని చెప్పా. మరుసటి రోజే చరణ్ తన క్యాస్ట్యూమ్స్ తీసుకుని సెట్కి వచ్చేశాడు' అని అన్నారు. ఈ ఏడాది వచ్చిన ‘ఆచార్య’లో చిరు, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో నయనతార, సత్యదేవ్, పూరీ జగన్నాథ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. -
అలా అయితే రూ.3000 కోట్లు వసూలు చెయ్యొచ్చు: సల్మాన్
‘‘హిందీలో ‘ప్రతిబం«ధ్’ (1990), ‘ఆజ్ కా గూండారాజ్’ (1992), ‘ది జెంటిల్ మేన్’ (1994) వంటి సినిమాలు చేశాను. ఆ తర్వాత తెలుగు సినిమాలతో బిజీ అయి, హిందీ సినిమాలకు దూరంగా ఉన్నాను. ప్రాంతీయ, జాతీయ సినిమాలు అనే తేడాలు పోవాలి. ఏ సినిమా అయినా ఇండియన్ సినిమాయే అనే రోజులు రావాలని కోరుకుంటున్నాను’’ అని చిరంజీవి అన్నారు. చిరంజీవి హీరోగా మోహన్రాజా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గాడ్ఫాదర్’. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న విడుదల నుంది. శనివారం ముంబైలో జరిగిన ఈ సినిమా హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాలో నటించినందుకు నిర్మాతలు సల్మాన్కు పారితోషికం ఇవ్వాలనుకున్నప్పుడు ‘చిరంజీవిగారు, రామ్చరణ్లపై నాకు ఉన్న ప్రేమను ఈ చెక్తో వెలకడతారా?’’అని తిరస్కరించారు. ‘గాడ్ఫాదర్’ పార్టు 2 ఉండొచ్చు’’ అన్నారు. సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ – ‘‘గాడ్ఫాదర్’లో ఓ చిన్న రోల్ అన్నారు. చిరంజీవిగారు మీ వెనకాల నిలబడతారు అనగానే ఓకే అన్నాను. ‘గాడ్ఫాదర్’ తెలుగులో నా తొలి సినిమా. కొందరు హాలీవుడ్కు వెళ్లా లనుకుంటారు. నేను దక్షిణాదికి వెళ్లాలను కుంటున్నాను. నేను మల్టీస్టారర్ మూవీస్ చేయడానికి రెడీ. ఎందు కంటే మేం సోలో హీరోగా చేస్తే ఆ సినిమా మూడు వందల కోట్లు సాధిస్తోంది. అదే స్టార్స్ కలిసి చేస్తే మూడువేల కోట్లు కూడా సాధించే చాన్స్ ఉంది’’ అన్నారు. -
'గాడ్ఫాదర్' హిందీ మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
'గాడ్ఫాదర్' హిందీ ట్రైలర్ రిలీజ్.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర కామెంట్స్
చిరంజీవి కథానాయకుడిగా నటించిన చిత్రం 'గాడ్ఫాదర్'. మోహన్రాజా దర్శకత్వంలో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ఈ సినిమాను తెరకెక్కించారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ కీలక పాత్ర పోషించారు. తాజాగా ముంబైలో నిర్వహించిన ఈవెంట్లో హిందీ ట్రైలర్ను గ్రాండ్గా రిలీజ్ చేశారు. మలయాళంలో సూపర్ హిట్ మూవీ 'లూసిఫర్' రీమేక్ ఈ చిత్రం. అక్టోబర్ 5న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అభిమానులను పలకరించనుంది. ఈ కార్యక్రమానికి చిరంజీవితో పాటు, సల్మాన్, సత్యదేవ్, మోహన్రాజా, నిర్మాతలు ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. 'గాడ్ ఫాదర్'లో ఒక బలమైన పాత్ర వుంది. ఆ పాత్రని సల్మాన్ భాయ్ చేస్తే బాగుంటుందని భావించాం. మేము కోరగానే నేను చేస్తాను' అని మాపై ఎంతో ప్రేమ చూపించారు సల్మాన్ భాయ్. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని చెప్పడానికి తొలిమెట్టు ఆయనే. సల్మాన్తో కలిసి ఈ సినిమాని చాలా జోష్ ఫుల్ జోష్గా చేశాను.' అని అన్నారు. సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ ..'చిరంజీవి పేరు చెప్పగానే మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పాను. సినిమాల పట్ల ఆయనకున్న ప్రేమే దీనికి కారణం. ఆయనతో నటించడం మంచి అనుభవం. ఇందులో చాలా కొత్త పాత్ర చేశాను. మల్టీస్టారర్లు చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటా. గాడ్ ఫాదర్ నా తొలి తెలుగు సినిమా. ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తుంది' అని అన్నారు. (చదవండి: గాడ్ ఫాదర్ ట్రైలర్ రిలీజ్.. గూస్బంప్స్ తెప్పిస్తున్న పవర్పుల్ డైలాగ్స్) సత్యదేవ్ మాట్లాడుతూ.. 'ఇద్దరు మెగాస్టార్ల ముందు మాట్లాడటం గొప్ప అనుభూతి. అన్నయ్యపై ప్రేమతో నటుడిని అయ్యాను. అన్నయ్యే ఈ సినిమా కోసం నన్ను ఎంపిక చేశారు. ఈ అవకాశం వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించా. మోహన్ రాజా సినిమాని చాలా కూల్గా డీల్ చేశారు. సినిమా అద్భుతంగా వచ్చింది' అని అన్నారు. దర్శకుడు మోహన్ రాజా మాట్లాడుతూ.. 'ఇద్దరు మెగాస్టార్లను డైరెక్ట్ చేయడమనే నా కల నెరవేరింది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. సినిమాను అందరూ తప్పకుండా థియేటర్లలో చూడాలి' అని కోరారు. -
రాజమౌళి డైరెక్షన్లో నటించను: చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్. అక్టోరబ్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో మూవీ ప్రమోషన్స్తో ఫుల్ బిజీగా ఉన్నారు ఆయన. ఈ నేపథ్యంలో ఓ బాలీవుడ్ మీడియాతో ముచ్చటించిన చిరంజీవి డైరెక్టర్ రాజమౌళిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తనకు రాజమౌళి డైరెక్షన్లో నటించాలనే కోరిక లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో యాంకర్ ఎందుకు అని ప్రశ్నించగా.. ‘రాజమౌళి చాలా గొప్ప దర్శకుడు. భారతీయ సినిమా ఖ్యాతిని ఆయన ప్రపంచానికి తెలిపారు. ప్రతి విషయాన్ని ఆయన ఎంతో లోతుగా చూస్తారు. ఆయన కోరుకునే ఔట్పుట్ని ఓ నటుడిగా నేను ఇవ్వగలనో లేదో తెలియదు’ అని అన్నారు. చదవండి: పుట్టినరోజుకి ముందు అవార్డు అందుకున్నాను: నటి ఆశా పారేఖ్ ఆ తర్వాత ‘రాజమౌళి ఓ సినిమాకు ఎంత టైం తీసుకుంటాడో మీకు తెలిసిందే. ఒక్కో సినిమాతో ఆయన 3 నుంచి 5 ఏళ్లు ప్రయాణిస్తారు. కానీ, నేను ఒకేసారి నాలుగు సినిమాలు చేస్తున్నా. అందుకే ఆయనతో పనిచేయాలని, పాన్ ఇండియా నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలనే ఆశ లేదు’ అని చిరు నవ్వుతూ అన్నారు. అనంతరం ఓ సినిమాకు దర్శకత్వం వహిచాలని ఉంది అని తన మనసులో మాట బయటపెట్టారు. చివరిగా తన తనయుడు, హీరో రామ్ చరణ్ తన నట ప్రతిభకు కొనసాగింపు అని చిరు ఈసందర్భంగా పేర్కొన్నారు. కాగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నయన్ తార, సత్యదేవ్లు కీలక పాత్రల్లో నటించారు. ఇక బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్ర పోషించారు. -
ఇదొక శుభపరిణామంగా భావిస్తున్నా: చిరంజీవి
సాక్షి, అనంతపురం: మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్, నయనతార నటించిన చిత్రం ‘గాడ్ ఫాదర్’. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్గుడ్ ఫిలింస్ బ్యానర్స్పై రామ్చరణ్, ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మించారు. చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను అనంతపురం ఆర్ట్స్ కళాశాల మైదానంలో బుధవారం సాయంత్రం నుంచి నిర్వహించారు. ఈ వేడుకకు చిరంజీవి హాజరయ్యారు. తొలుత డ్యాన్సులు, పాటలు అభిమానుల కేరింతలు, కేకలతో ఆర్ట్స్ కళాశాల మైదానం హోరెత్తింది. సంగీత దర్శకుడు తమన్ నేతృత్వంలో శ్రీరామచంద్ర, కృష్ణ వంటి గాయకులు పాటలతో హుషారెత్తించారు. అనంతరం చిరంజీవి ప్రసంగిస్తున్న సమయంలోనే వర్షం కురిసింది. అయినా అభిమానులు ఉన్నచోటు నుంచి కదలలేదు. వర్షంలోనే చిరంజీవి మాట్లాడుతూ భారీ చిత్రాలతో పాటు చిన్న సినిమాలనూ ఆదరించినపుడే చిత్ర పరిశ్రమ పచ్చగా ఉంటుందని పేర్కొన్నారు. తానెప్పుడు రాయలసీమకు వచ్చినా వర్షం పడుతోందని, ఇదొక శుభపరిణామంగా భావిస్తున్నానని చెప్పారు. ఇదిలా ఉండగా పరిమితికి మించి గ్రౌండ్లోకి అభిమానులు రావడంతో తొక్కిసలాట, తోపులాట జరిగింది. అదుపు చేయడానికి పోలీసులు కష్టపడాల్సి వచ్చింది. 👉 (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: (ఐశ్వర్యారాయ్ అందానికి వశమైన శరత్కుమార్) -
గాడ్ ఫాదర్ ట్రైలర్ రిలీజ్.. గూస్బంప్స్ తెప్పిస్తున్న పవర్పుల్ డైలాగ్స్
మెగాస్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన 'గాడ్ ఫాదర్' ట్రైలర్ వచ్చేసింది. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే ట్రైలర్ సందడి చేస్తోంది. 'మంచోళ్లు అందరూ మంచోళ్లు కాదు.. చాలా డ్రామాలు జరుగుతున్నాయి వెనక.. అన్ని రంగులు మారతాయి' అన్న డైలాగ్తో ట్రైలర్ ప్రారంభమైంది. ఈ ట్రైలర్లో చిరంజీవి యాక్షన్, పవర్ఫుల్ డైలాగ్స్ ఫ్యాన్స్కు గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. కీలక పాత్రలో నటించిన సల్మాన్ యాక్షన్ కూడా అదిరింది. తమన్ అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమాలో నయనతార, సల్మాన్ఖాన్, సత్యదేవ్, సముద్రఖని, బ్రహ్మాజీ, సునీల్ కీలక పాత్రలు పోషించారు. అయితే ఇంకెందుకు ఆలస్యం ‘గాడ్ ఫాదర్’ ట్రైలర్ మీరూ చూసేయండి. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్కి తెలుగు రీమేక్ ఈ చిత్రం. అనంతపురంలో భారీస్థాయిలో జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో గాడ్ ఫాదర్ ట్రైలర్ను ఆవిష్కరించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, లిరికల్ సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. దసరా కానుకగా అక్టోబర్ 5న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. (చదవండి: గాడ్ ఫాదర్ మరో సాంగ్ అవుట్.. అభిమానులకు గూస్బంప్స్ ఖాయం) -
చిరంజీవి, సల్మాన్లకు భారీ కటౌట్స్
-
గాడ్ ఫాదర్ మరో సాంగ్ అవుట్.. అభిమానులకు గూస్బంప్స్ ఖాయం
మోహన్రాజా దర్శకత్వంలో చిరంజీవి, సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'గాడ్ఫాదర్'. ఈ చిత్రంలో మెగాస్టార్కు జోడిగా నయనతార నటించింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్కి తెలుగు రీమేక్. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి లిరికల్ వీడియో సాంగ్ను విడుదల చేసింది చిత్రబృందం. 'నజబజ జజర.. గజగజ వణికించే గజరాజు అడిగోరా' అంటూ సాగే సాంగ్తో అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు షురూ అయ్యాయి. దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలో ఈ సినిమా సందడి చేయనుంది. -
‘గాడ్ ఫాదర్’లో పూరి రోల్ ఇదే.. అసలు విషయం బయటపెట్టిన చిరు
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన చిత్రం గాడ్ఫాదర్. దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. ఇందులో చిరు పొలిటికల్ లీడర్గా కనిపించనున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్ హిట్ ఫిలిం లూసిఫర్కు రీమేక్గా రూపొందిన ఈ సినిమాలో బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ కీ రోల్ పోషిస్తుండగా నయనతార, సత్యదేవ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చదవండి: జూ. ఎన్టీఆర్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. ‘ఆది’ రీరిలీజ్! ఎప్పుడంటే.. ఇంకా విడుదలకు కొద్ది రోజులే ఉండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ జోరు పెంచింది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన చిరు ఈ మూవీ నుంచి మరో ఆసక్తికర అప్డేట్ ఇచ్చాడు. ఈ సందర్భంగా గాడ్ ఫాదర్లో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ నటిస్తున్నారన్న వార్తలపై స్పందించారు. ఇందులో పూరీ జర్నలిస్ట్గా కనిపిస్తాడని అన్నారు. ‘‘మా సినిమాలో ఒక యూట్యూబర్ పాత్ర ఉంది. సంఘటనలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ.. స్టోరీ నరేటర్గా చేయాలి. ఈ రోల్ కోసం ఎవరా? అని డైరెక్టర్ ఆలోచిస్తున్న క్రమంలో పూరిని తీసుకుంటే ఎలా ఉంటుందని మోహన్ రాజాకు చెప్పాను. చదవండి: క్రేజీ అప్డేట్.. ఆ రోజు నుంచే ‘పుష్ప-2’ రెగ్యులర్ షూటింగ్! దీంతో వెంటనే ఆశ్చర్యంగా చూస్తూ.. ‘ఆయన నటిస్తారా? అయితే మీరే ఆయనను అడగండి’ అన్నాడు. వెంటనే నేను ఫోన్ తీసుకుని పూరికి ఇలా అని చెప్పగానే.. ‘చస్తే చేయను’ అన్నాడు. ‘మీ ముందు నేను నటించడమేంటి సార్.. నావల్ల కాదు’ అన్నాడు. కానీ నేనే పట్టుబట్టి ఒప్పించాను. షూటింగ్ లోకేషన్స్ వస్తు కూడా చాలా వణికిపోయాడు. కానీ తన పాత్రలో చాలా అద్భుతంగా నటించాడు. తెర ఆయనను చూసి ఓ డైరెక్టర్లో ఇంత గొప్ప నటుడు ఉన్నాడా! అని మీరంత ఆశ్చర్యపోతారు’ అంటూ చెప్పుకొచ్చారు చిరంజీవి. -
గాడ్ ఫాదర్ పొలిటికల్ డైలాగ్ పై చిరంజీవి రియాక్షన్
-
చిరంజీవి 'గాడ్ ఫాదర్' ప్రీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎక్కడంటే..
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం 'గాడ్ ఫాదర్'. మలయాళ సూపర్ హిట్ పొలిటికల్ డ్రామా ‘లూసిఫర్’రీమేక్గా వస్తున్న ఈ సినిమాలో చిరు పొలిటికల్ లీడర్గా కనిపించనున్నారు. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషించారు. చిరంజీవి అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా అక్టోబర్5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ జోరు పెంచిన మూవీ టీం తాజాగా ప్రీరిలీజ్ ఈవెంట్కు డేట్ ఫిక్స్ చేస్తూ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. అనంతపురంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈనెల 28న సాయంత్రం 6గంటలకు ఈ ఈవెంట్ గ్రాండ్లా లాంఛ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో సత్యదేవ్, సముద్రఖని ముఖ్య పాత్రలు పోషించారు. Gear up for the MEGA Spectacle 🔥#GodFather GRAND PRE RELEASE EVENT ON 28th SEP from 6 PM at Ananthapur ❤️🔥#GodFatherOnOct5th Megastar @KChiruTweets @BeingSalmanKhan @jayam_mohanraja #Nayanthara @ActorSatyaDev @MusicThaman @LakshmiBhupal @ProducerNVP @saregamasouth pic.twitter.com/QfBS2Sf4Hb — Konidela Pro Company (@KonidelaPro) September 25, 2022 -
చిరంజీవి 'గాడ్ఫాదర్' సెన్సార్ పూర్తి.. డైరెక్టర్ ట్వీట్ వైరల్
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అక్టోబర్ 5న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్లో భాగంగా ఇటీవలె మేకర్స్ తార్ మార్ టక్కర్ మార్ అనే సాంగ్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన డైరెక్టర్ మోహన్ రాజా మరో అప్డేట్ను వదిలారు. ఈ సినిమా సెన్సార్ను పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది అని తెలిపారు. అంతేకాకుండా సెన్సార్ సభ్యుల నుంచి ఈ సినిమాకు మంచి స్పందన వచ్చిందని తెలిపారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేయనుందన్నది చూడాల్సి ఉంది. It’s a Clean U/A with an amazing appreciation from the Censor authorities Waiting for the audience blessing on #GodFatherOnOct5th — Mohan Raja (@jayam_mohanraja) September 23, 2022 -
GodFather: తార్ మార్ టక్కర్ మార్ ఫుల్ సాంగ్ .. చిరు, సల్మాన్ల స్టెప్పులు అదుర్స్
మెగాస్టార్ చిరంజీవి, సల్మాన్ఖాన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘గాడ్ ఫాదర్’ తొలి పాట వచ్చేసింది. ‘తార్ మార్ టక్కర్ మార్’ అంటూ సాగే ఈ పాటకి చిరంజీవి, సల్మాన్ఖాన్ అదిరిపోయే స్టెప్పులేశారు. ప్రభుదేవా కొరియోగ్రఫీ చేసిన ఈ పాట చిరంజీవి తన ముఖం మీద చేయి వేసుకుని స్టైలిష్ ఎంట్రీ ఇస్తే.. సల్మాన్ గోళ్లు కొరుకుతూ ప్రవేశించాడు. అనంతరం వీరిద్దరు యూత్ని ఉర్రూతలూగించేలా స్టెప్పులేసి అలరించారు. ఈ మాస్ సాంగ్కి అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా, శ్రేయా ఘోషల్ అద్భుతంగా ఆలపించారు . తమన్ సంగీతం అందించారు. ఇక గాడ్ఫాదర్ విషయానికొస్తే.. మలయాళ బ్లాక్బస్టర్ ‘లూసీఫర్’కు తెలుగు రీమేక్ ఇది. మోహన్రాజా దర్శకత్వం వహిస్తున్నారు. సల్మాన్ఖాన్, నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పొలిటికల్ యాక్షన్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాని రామ్ చరణ్, ఎన్. వి. ప్రసాద్, ఆర్. బి. చౌదరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దసరా కానుక గాఅక్టోబరు 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘గాడ్ ఫాదర్’లో నయన్ రోల్ ఇదే.. ఆసక్తిగా ఫస్ట్లుక్ పోస్టర్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘గాడ్ఫాదర్’. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ మూవీ నుంచి మేకర్స్ తరచూ ఏదోక అప్డేట్ వదులుతూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇటీవల చిరు బర్త్డే సందర్భంగా విడుదలైన సినిమా టీజర్కు మంచి స్పందన వచ్చింది. ఇక ఇప్పటికే విడుదలై ఫస్ట్లుక్ పోస్టర్లకు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈసినిమాలో సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార కీ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: బాలీవుడ్ లవ్బర్డ్స్ పెళ్లి ఏర్పాట్లు షురూ? సౌత్ ముంబైలో రాయల్ వెడ్డింగ్! తాజాగా ఈ సినిమాలోని నయన్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా నయన్ రోల్ను కూడా పరిచయం చేసింది మూవీ యూనిట్. ఇందులో ఆమె సత్యప్రియ జయదేవ్గా కనిపించనుంది. ఈ పోస్టర్లో నయన్ సీరియస్గా టైపింగ్ చేస్తూ కనిపిస్తున్న నయన్ లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తిని నింపుతుంది. దీంతో గాడ్ ఫాదర్ ఆమె రోల్ కీలకంగా ఉండనుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో నయనతార, చిరు చెల్లెలిగా నటిస్తుందనే విషయం తెలిసిందే. -
మళ్లీ అడ్డంగా దొరికిపోయిన తమన్.. ట్రోలింగ్తో ఆడేసుకుంటున్నారు
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గాడ్ఫాదర్. నిన్న(సోమవారం)చిరంజీవి బర్త్డే సందర్భంగా ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా మ్యూజిక్పై ట్రోలింగ్ నడుస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా బీజీఎమ్ అచ్చం వరుణ్ తేజ్ గని టైటిల్ సాంగ్లా ఉందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. తీరు మార్చుకోకుండా మక్కీకి మక్కీ దించేశాడంటూ తమన్ను తెగ ట్రోల్ చేస్తున్నారు. మెగాస్టార్ సినిమాకు కూడా ఇలా కాపీ కొడతావా అంటూ నెటిజన్లు తమన్పై మండిపుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలను నెట్టింట వైరల్ చేస్తూ తమన్ తీరును ఎండగడుతున్నారు. కాగా గని సినిమాకు కూడా మ్యూజిక్ ఇచ్చింది తమనే కావడం విశేషం. Super @MusicThaman 👏 pic.twitter.com/AJeoHAyGDl — ʌınɐʎ (@CooIestVinaay) August 21, 2022 #GodFatherTeaser lone dorikipoyav ga ra #Thaman 🙄 pic.twitter.com/ND61touLV5 — ❄sesh💥 (@syam__SVS) August 21, 2022 -
మెగా ఫ్యాన్స్.. చిరంజీవి గాడ్ ఫాదర్ టీజర్ వచ్చేసింది!
మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్న గాడ్ఫాదర్ టీజర్ రానే వచ్చింది. '20 ఏళ్లు ఎక్కడికెళ్లాడో ఎవరికీ తెలీదు. సడన్గా తిరగొచ్చిన ఆరేళ్లలో జనాలలో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు' అన్న డైలాగ్తో టీజర్ మొదలైంది. ఇక్కడికీ ఎవరు వచ్చినా, రాకపోయినా నేను పట్టించుకోను. కానీ అతడు మాత్రం రాకూడదు అంటూ నయనతారను చూపించారు. వెయిట్ ఫర్ మై కమాండ్ బ్రదర్ అంటూ సల్మాన్కు గైడెన్స్ ఇస్తున్నాడు మెగాస్టార్. చివర్లో సల్మాన్, చిరు ఇద్దరూ కలిసి ఫైట్ సీన్లో కనిపించారు. ఈ సీన్కు థియేటర్లలో విజిల్స్ పడటం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి టీజర్తోనే ప్రేక్షకుల కడుపు నింపేశాడు డైరెక్టర్. పనిలో పనిగా ఈ సినిమా అక్టోబర్ 5న రిలీజవుతున్నట్లు ప్రకటించారు. ఇక మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాను కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సల్మాన్ ఖాన్, నయనతార, పూరి జగన్నాథ్, సత్యదేవ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. చదవండి: సమంత సెకండ్ హ్యాండ్, చీప్ క్యారెక్టర్ అన్నాడు, తట్టుకోలేకపోయా -
‘గాడ్ ఫాదర్’లో నన్ను కాదని సల్మాన్ను ఎందుకు తీసుకున్నారు’ చిరును ప్రశ్నించిన ఆమిర్
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ జోడిగా నటించిన చిత్రం 'లాల్సింగ్ చద్దా'. హాలీవుడ్ మూవీ 'ఫారెస్ట్ గంప్'కు రీమేక్గా వస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ గుడ్ బాయ్ నాగ చైతన్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది. అలాగే ఈ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నారు. ఈ మూవీ తెలుగు ట్రైలర్ను ఆదివారం చిరంజీవి లాంచ్ చేశారు. చదవండి: కదలలేని స్థితిలో కైకాల, బెడ్పైనే కేక్ కట్ చేయించిన చిరు.. ఫొటోలు వైరల్ ఈ సందర్భంగా తెలుగు డైరెక్టర్లపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇదిలా ఉంటే ‘గాడ్ ఫాదర్’ మూవీలో తనని కాకుండా సల్మాన్ ఖాన్ను తీసుకోవడంపై చిరును ప్రశ్నించిన విషయాన్ని ఆమిర్ ఈ సందర్భందగా గుర్తు చేసుకున్నాడు. అయితే గతంలో చిరంజీవి తనని తెలుగు సినిమాల్లో నటించాలని ఉందా? అడిగినట్లు చెప్పారని, అయితే దానికి తాను ‘మీ సినిమాలో నటించాలని ఉంది’ అని చెప్పడంతో తప్పకుండా అవకాశం ఇస్తానని చిరంజీవి చెప్పారన్నారు. చదవండి: ‘కత్రినా నా భార్య’ అంటూ వీడియోలు, ఫొటోలు.. నిందితుడి అరెస్ట్ కానీ ‘గాఢ్ ఫాదర్’ చిత్రంలో సల్మాన్ ఖాన్ను తీసుకున్నామని చిరంజీవి తనకు తర్వాత ఫోన్ చేసి చెప్పగా.. దానికి తాను ‘నన్ను కాకుండా సల్మాన్ను ఎందుకు తీసుకున్నారు’ అని అడిగినట్టు చెప్పారు. అందుకు చిరంజీవి... ఇది హృదయం, బుద్ధిబలానికి సంబంధించిన పాత్ర కాదని, కండబలానికి ప్రాముఖ్యత ఉన్న పాత్ర కావడంతో సల్మాన్ను ఎంపిక చేసుకున్నామని చిరు వివరించారని ఆమిర్ చెప్పుకొచ్చారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
'గాడ్ ఫాదర్' షూటింగ్.. చిరంజీవి, సల్మాన్ ఫొటో లీక్
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన చేతిలో గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాల్తేరు వీరయ్య (ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రాలు ఉన్నాయి. జులై 4న 'గాడ్ ఫాదర్' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్తో పాటు చిన్నిపాటి వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియో నెట్టింట దూసుకుపోయింది. తాజాగా ఈ మూవీ నుంచి ఓ ఫొటో లీక్ అయింది. ఇందులో సల్మాన్ ఖాన్ (Salman Khan), చిరంజీవి కనిపిస్తున్నారు. ఈ సీన్ చూస్తుంటే ఇది క్లైమాక్స్ పోర్షన్లా అనిపిస్తుంది. విలన్ను చంపేందుకు వెళ్లేటప్పుడు చిరంజీవికి సల్లూ భాయ్ బాడీగార్డ్లా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చదవండి: భర్త న్యూడ్ ఫొటోలు తీసిన హీరో భార్య.. వైరల్ మిస్ ఇండియా సినీ శెట్టికి ఇష్టమైన తెలుగు హీరో అతడే.. కాగా 'హనుమాన్ జంక్షన్' ఫేమ్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న'గాడ్ ఫాదర్'లో నయన తార, సల్మాన్ ఖాన్ వంటి స్టార్లు నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ మూవీలో నయన తార భర్తగా సత్యదేవ్ నటిస్తున్నాడని టాక్. మలయాళం చిత్రం 'లూసీఫర్'కు రీమేక్ వచ్చిన ఈ మూవీలో అనేక మార్పులు చేసినట్లు సమాచారం. -
చిరంజీవి పేరు మార్చుకున్నారా ? అసలు కారణం ఇదే !
Megastar Chiranjeevi: ప్రస్తుతం చిరంజీవి వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన చేతిలో గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాల్తేరు వీరయ్య (ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రాలు ఉన్నాయి. సోమవారం (జులై 4) 'గాడ్ ఫాదర్' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్తో పాటు చిన్నిపాటి వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే తాజాగా చిరంజీవి పేరు మార్చుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సోమవారం విడుదలైన 'గాడ్ ఫాదర్' ఫస్ట్ లుక్ గ్లింప్స్లో చిరంజీవి పేరు ఇంగ్లీషు లెటర్స్లో అదనంగా 'E' అనే అక్షరం దర్శనమిచ్చింది. దీంతో చిరు MEGASTAR CHIRANJEEVIకి బదులుగా MEGASTAR CHIRANJEEEVI అని మార్చుకున్నట్లు పుకార్లు రచ్చ చేశాయి. అంతేకాకుండా ఈ పేరు మార్పు వెనకాల న్యూమరాలజిస్టుల సలహా ఉందని, అందుకే చిరంజీవి పేరు మార్చుకున్నట్లు నెట్టింట వార్తలు హల్చల్ చేశాయి. అయితే ఈ వార్తలను చిరంజీవి సన్నిహితులు, గాడ్ ఫాదర్ చిత్రబృందం ఖండిస్తున్నారు. చదవండి: మిస్ ఇండియా కిరీటం.. 21 ఏళ్ల అందం సొంతం గాడ్ ఫాదర్ మూవీ యూనిట్ ఎడిటింగ్ చేసేటప్పుడు జరిగిన తప్పు మాత్రమే అని, చిరంజీవి ఎలాంటి పేరు మార్చుకులేదని చెబుతున్నారు. ఎడిటింగ్ తప్పిదం వల్లే అదనంగా ఇంకో E అక్షరం యాడ్ అయిందే తప్ప న్యూమరాలజిస్ట్ల సలహా అస్సలు తీసుకోలేదని తెలిపారు. అలాగే మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటామని చిత్రబృందం పేర్కొంది. అయితే ఈ వార్తపై చిరంజీవి క్లారిటీ ఇస్తే బాగుంటుందని మెగా అభిమానులు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. చదవండి: కేన్సర్తో పోరాటం.. అంతలోనే కరోనా.. 30 ఏళ్లకే స్టార్ నటుడు మృతి -
గాడ్ ఫాదర్ లుక్లో అదరగొట్టేసిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి గాడ్ఫాదర్ రాకకు రంగం సిద్ధమైంది. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సోమవారం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్తో పాటు చిన్నపాటి వీడియో రిలీజ్ చేశారు. పోస్టర్లో చిరు నళ్ల కద్దాలు పెట్టుకుని, చేతికి వాచీతో, జేబులో పెన్నుతో ఏదో సుదీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు కనిపించాడు. ఇక వీడియోలో రోడ్డుకు ఇరువైపులా జనం జెండాలు పట్టుకుని నిలబడగా మధ్యలో ఓ కారు వచ్చి ఆగింది. అందులో నుంచి చిరు దిగి స్టైలిష్గా నడుచుకుంటూ లోనికి వెళ్లాడు. ఆయన నడకకు తగ్గట్టు తమన్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. చిరంజీవికి ఇది 153వ చిత్రం కాగా ఇందులో సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. చదవండి: పిల్లల్ని కనడం గురించి సద్గురును అడిగిన ఉపాసన, ఆయన సమాధానమేంటంటే? పద్మశ్రీ గ్రహీత, ప్రముఖ దర్శకుడు కన్నుమూత -
చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీలో ప్రభుదేవా..
Prabhu Deva Choreography In Chiranjeevi Godfather Movie: కొరటాల శివ డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం ఏప్రిల్ 29న విడుదలై థియేటర్లలో సందడి చేస్తోంది. చిరంజీవి చేతిలో ప్రస్తుతం భోళా శంకర్, గాడ్ ఫాదర్, మెగా 154 చిత్రాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న గాడ్ ఫాదర్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. మంగళవారం (మే 3) రంజాన్ పర్వదినం సందర్భంగా ఈ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ కలిసి స్టెప్పులేయనున్నారని మ్యూజిక్ డైరక్టర్ తమన్ ఇదివరకే తెలిపాడు. దీనికి సంబంధించిన తాజా అప్డేట్ను ప్రకటించాడు తమన్. చిరు-సల్మాన్ కలిసి డ్యాన్స్ చేయనున్న సాంగ్ను ఇండియన్ మైఖేల్ డ్యాన్సర్గా పేరొందిన ప్రభుదేవా కొరియోగ్రఫీ అందించనున్నారు. ఇదివరకు అనేక చిరంజీవి చిత్రాలకు ప్రభుదేవా కొరియోగ్రఫీ అందించిన విషయం తెలిసిందే. ఇక చిరంజీవి-సల్మాన్ ఖాన్ కలిసి చిందేయడం, దీనికి తమన్ సంగీతం అందించడంతోపాటు ప్రభుదేవా కొరియోగ్రఫీ యాడ్ కావడంతో ఈ సాంగ్ ఏ రేంజ్లో ఉంటుందో అని అభిమానులు ఊహించుకుంటున్నారు. ఈ పాట సిల్వర్ స్క్రీన్పై ఎలాంటి మేజిక్ చేస్తుందో చూడాలి. చదవండి: సీనియర్ నటి రాధిక సినిమాలో హీరోగా చిరంజీవి.. టాలీవుడ్లో బెస్ట్ డ్యాన్సర్స్ వాళ్లే: చిరంజీవి Yayyyy !! ❤️ THIS IS NEWS 🎬🧨💞 @PDdancing Will Be Choreographing An Atom Bombing Swinging Song For Our Boss @KChiruTweets and @BeingSalmanKhan Gaaru What A High Seriously @jayam_mohanraja Our Mighty #GodfatherMusic #Godfather This is GONNA LIT 🔥 THE Screens For Sure 😍 pic.twitter.com/H618OaI9b6 — thaman S (@MusicThaman) May 3, 2022 -
అలా చేస్తే ‘గాడ్ ఫాదర్’ నుంచి తప్పుకుంటా: చిరుకు సల్మాన్ కండిషన్!
On That Condition Salman Doing Godfather: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరస ప్రాజెక్ట్స్ను లైన్లో పెడుతున్నారు. ఆచార్య షూటింగ్ను పూర్తి చేసుకున్న ఆయన ఇటీవల గాడ్ ఫాదర్ షూటింగ్ మొదలు పెట్టారు. ఇక ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో కనిపించున్నాడు. ఇక సల్మాన్తో షూటింగ్ నేపథ్యంలో ఇటీవల చిరంజీవి, గాడ్ ఫాదర్ టీం ముంబై వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ చిరంజీవి-సల్మాన్లపై యాక్షన్ సీన్సోతో పాటు పాటన చిత్రీకరిస్తున్నారని సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీ కోసం సల్మాన్, చిరుకు ఓ కండిషన్ పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: Mohan Babu: ఎన్నో రకాలుగా మోసపోయాను, వారెవరు నాకు ఉపయోగపడలేదు.. ఈ మూవీలో సల్మాన్ పాత్రపై చర్చలు జరుగుతున్న సమయంలో చిరు-భాయిజాన్ మధ్య ఓ ఆసక్తికర సంభాషణ చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.అయితే గాడ్ ఫాదర్ కోసం రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటారని సల్మాన్ను దర్శక-నిర్మాతలు అడగ్గా.. ఒక్క పైసా వద్దని చెప్పాడట. ఇదే విషయాన్ని మేకర్స్ చిరు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ప్రత్యేకంగా దీంతో సల్మాన్ను అడిగారట. దీనికి అతడు అసలు తనకు ఎలాంటి పారితోషకం వద్దని, మీతో నటించడమే అత్యంత గౌరవంగా భావిస్తున్నానని చెప్పాడట. అయినా తీసుకోవాలని చిరు పట్టుబట్టడంతో.. ఈ విషయంలో తనని బలవంతం చేస్తే మూవీ నుంచి తప్పుకుంటానని హెచ్చరించాడట. అలా సల్మాన్ ఖాన్ ఒక్కపైసా తీసుకోకుండానే గాడ్ ఫాదర్కు వర్క్ చేస్తున్నాడట. చదవండి: ఈ అమ్మను విడిచి ఎలా వెళ్లాలనిపించింది: సురేఖ వాణి భావోద్వేగం అంతేగాక ఈ షూటింగ్ షెడ్యూల్ అయిపోయే వరకు సల్మాన్ ముంబైలోని తన ఫాం హౌజ్లో చిరు, గాడ్ ఫాదర్ టీం అతిథ్యం ఇస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం విధితమే. కాగా సల్మాన్ స్నేహానికి ఎంతో విలువ ఇస్తారనే విషయం తెలిసిందే. తనకు ఇష్టమైన వారి కోసం సల్మాన్ ఏమైనా చెస్తాడు. అంతేకాదు సాయం చేయడంలో కూడా ఆయన ముందుంటాడు. ఇక బీ-టౌన్లో సల్మాన్, షారుక్ ఖాన్ మధ్య మంచి సన్నిహితం ఉంది. అందుకే షారుక్ పఠాన్ సినిమాలో కూడా కామియో రోల్ చేసిన సల్మాన్ నయా పైసా తీసుకోలేదట. ఇది తెలిసి ఆయన ఫ్యాన్స్, తెలుగు ప్రేక్షకులు భాయిజాన్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. -
ది గాడ్ ఫాదర్@50
-
చిరంజీవి 'గాడ్ఫాదర్'లో సల్మాన్ ఖాన్.. ట్వీట్ వైరల్
తెలుగు సినిమాలో మరో సంచలనానికి తెరలేచింది. ఇద్దరు అగ్రనటులు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు.'గాడ్ఫాదర్' మూవీ దీనికి వేదిక కానుంది. మోహన్రాజా దర్శకత్వంలో చిరంజీవి గాడ్ఫాదర్ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్ హిట్ లూసిఫర్కి రీమేక్గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో నయనతార హీరోయిన్గా నటిస్తుంది. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'మీ రాక ప్రతి ఒక్కరినీ ఉత్తేజపరిచింది. ఉత్సాహాన్ని నెక్ట్స్ లెవల్కి తీసుకెళ్లింది. మీతో స్క్రీన్ని పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీ ప్రజెన్స్ ప్రేక్షకులకు అద్భుతమైన కిక్ని ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు' అంటూ సల్మాన్కి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు చిరు. ప్రస్తుతం వీరిద్దరి ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ఈ సినిమాలో సల్మాన్ సరికొత్త గెటప్లో కనిపించనున్నట్లు తెలుస్తుంది. Welcome aboard #Godfather , Bhai @BeingSalmanKhan ! Your entry has energized everyone & the excitement has gone to next level. Sharing screen with you is an absolute joy. Your presence will no doubt give that magical #KICK to the audience.@jayam_mohanraja @AlwaysRamCharan pic.twitter.com/kMT59x1ZZq — Chiranjeevi Konidela (@KChiruTweets) March 16, 2022 -
షూటింగ్ కంప్లీట్ చేసుకున్న నయనతార
Chiranjeevi and Nayanthara's film: ‘గాడ్ ఫాదర్’ టీమ్ ఫుల్ జోష్తో ‘అప్ అప్ ర్యాప్ అప్’ అంటోంది. ఎందుకింత జోష్ అంటే అనుకున్నట్లుగా ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ను ర్యాప్ అప్ (ముగింపు) చేశారు. చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ పతాకాలపై కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘గాడ్ ఫాదర్’. కొన్ని రోజులుగా హైదరాబాద్లో జరుగుతున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ ముగిసింది. ఈ షెడ్యూల్ పూర్తయిన సందర్భంగా దర్శకుడు మోహన్ రాజా, హీరోయిన్ నయనతార ఫోటోను షేర్ చేసింది చిత్రబృందం. ‘‘పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి పవర్ఫుల్ రోల్లో కనిపిస్తారు. నయనతార పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: నీరవ్ షా, ఆర్ట్: సురేష్ సెల్వరాఘవన్. -
చిరంజీవి సినిమాలో సల్మాన్ ఖాన్.. ఫిబ్రవరిలో షూటింగ్
Chiranjeevi Movie Shooting With Salman Khan: బాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నేరుగా ఓ తెలుగు చిత్రం చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘గాడ్ ఫాదర్’లో సల్మాన్ కీలక పాత్ర చేయనున్నారు. మోహన్ లాల్ నటించిన మలయాళ మూవీ ‘లూసీఫర్’కి రీమేక్గా ‘గాడ్ ఫాదర్’ను తెరకెక్కిస్తున్నారు. ఈ ‘లూసీఫర్’లో పృథ్వీరాజ్ చేసిన కీలక పాత్రను తెలుగులో సల్మాన్ చేయనున్నట్లు సమాచారం. ‘అంతిమ్’ ప్రమోషన్స్లో భాగంగా ఇటీవల హైదరాబాద్కు వచ్చిన ఈ హీరో ‘గాడ్ఫాదర్’లో నటించనున్నట్లు స్పష్టం చేశారు కూడా. ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్లోకి ఎంట్రీ ఇస్తారట సల్మాన్ ఖాన్. చిరంజీవితో పాటు విక్టరీ వెంకటేష్తో కూడా సినిమా చేయనున్నట్లు ప్రకటించాడు సల్లూ భాయ్. అయితే ఈ సినిమాపై ఇంకా స్పష్టత రాలేదు. స్నేహానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే బాలీవుడ్ భాయిజాన్ లెక్కలేనన్నిసార్లు ఇతర హీరోల సినిమాల్లో గెస్ట్ అప్పీరెయన్స్ ఇచ్చాడు. ప్రస్తుతం బాలీవుడ్ బాద్షా షారుఖ్ నటిస్తున్న 'పఠాన్'లోనూ, అలాగే మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ కొత్త చిత్రం 'లాల్ సింగ్ చద్దా'లోనూ అతిథి పాత్రలో అలరించనున్నాడు. ఇదీ చదవండి: 'ఆర్ఆర్ఆర్'పై బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ప్రశంసలు.. -
చిరు స్పీడ్ మాములుగా లేదుగా.. 2022లో బిగ్గెస్ట్ మెగా ఫెస్టివల్!
ఒకప్పుడు మూడు షిఫ్టులు పని చేసి ఏడాదికి ఎన్ని సినిమాలు విడుదలైతే అన్ని సినిమాలు విడుదల చేసిన ఘన చరిత్ర మెగాస్టార్ చిరంజీవి సొంతం. ఇప్పుడు ఈ సీన్ ను మరోసారి రిపీట్ చేయాలనుకుంటున్నారు మెగాస్టార్. 2022లో వీలైతే నాలుగు చిత్రాలు విడుదల చేయాలనుకుంటున్నారట. ఫిబ్రవరిలో కొరటాల దర్శకత్వం వహించిన ‘ఆచార్య’ రిలీజ్ కానుంది. అలాగే సమ్మర్ లో ‘గాడ్ ఫాదర్’ విడుదలకు ముస్తాబవుతోంది. అదే స్పీడ్ లో భోళాశంకర్, బాబి దర్శకత్వంలో తెరకెక్కే చిత్రాన్ని కూడా విడుదల చేయనున్నారట. చేతిలో ఉన్న నాలుగు చిత్రాలు కాకుండా మరో రెండు సినిమాలు త్వరలో అనౌన్స్ చేసేందుకు చిరు రెడీ అవుతున్నారు. డీవీవీ దానయ్య నిర్మాణంలో యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల మేకింగ్ లో ఒక మూవీ, అలాగే యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో మారుతి దర్శకత్వంలో మరో చిత్రం చేయబోతున్నారట చిరు.ఇదే స్పీడ్ లో మరో నిర్మాణ సంస్థకు డేట్స్ లాక్ చేశారని టాక్. దర్శకుడి పేరు ఖరారు అవ్వగానే ఆ ప్రాజెక్ట్ కూడా లాక్ అవుతుందట. మొత్తంగా 2022 నుంచి మళ్లీ మెగా సందడి మొదలు కాబోతోంది. మెగా స్టార్ ఇదే స్పీడ్ కొనసాగిస్తే, ఏడాదికి మూడు లేదా నాలుగు చిత్రాలు విడుదలయ్యే అవకాశం ఉంది. -
గాడ్ ఫాదర్ కోసం నయనతార షాకింగ్ రెమ్యునరేషన్!
Nayanthara Shcoking Remuneration For Chiranjeevi Godfather Movie: లేడీ సూపర్స్టార్ నయనతార ప్రస్తుతం టాలీవుడ్లో గాడ్ ఫాదర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో చిరంజీవి సరసన నటించనుంది. ఇటీవలె నయన్ బర్త్డే సందర్భంగా మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమా కోసం నయనతార తీసుకుంటున్న రెమ్యునరేషన్పై ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రేజీ ప్రాజెక్టు కోసం నయన్ సుమారు రూ.4 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటుందట. పారితోషికం విషయంలో ఎప్పుడూ వార్తల్లో నిలిచే నయనతార మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్గా మారిపోయింది. భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినా నయన్కి ఉన్న క్రేజ్ను బట్టి ఆమె అడిగినంత ఇచ్చేస్తున్నారు మేకర్స్. ఇక సైరా నరసింహారెడ్డి తర్వాత చిరంజీవితో నయనతారకు ఇది రెండో సినిమా. సూపర్ గుడ్ ఫిల్మ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో కుష్బూ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. -
మెగాస్టార్తో స్టెప్పులేయనున్న సల్మాన్ఖాన్
Salman KhanChiranjeevi Dance Number In God Farther: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’లో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించనున్నారనే వార్త కొన్నాళ్లుగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. అలాగే హాలీవుడ్ స్టార్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ ఓ పాట పాడతారనే వార్త కూడా వచ్చింది. సల్మాన్ నటించనున్న వార్త నిజమేనని ఈ చిత్ర సంగీతదర్శకుడు తమన్ పేర్కొన్నారు. అలాగే బ్రిట్నీ పాడతారా? లేదా అనే విషయం గురించి కూడా స్పష్టం చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమన్ మాట్లాడుతూ – ‘‘చిరంజీవి సార్, సల్మాన్ సార్ కలసి డ్యాన్స్ చేయడం అనేది నిజంగా మాకు పెద్ద విషయం. అందుకే ఈ పాట స్థాయి కూడా పెద్దగా ఉండాలి. ఓ పెద్ద ఆర్టిస్ట్ (సింగర్, ఆర్టిస్ట్) కూడా ఉంటే బాగుంటుందనుకుంటున్నాం. కొన్ని ప్రముఖ ఆడియో కంపెనీలతో మాట్లాడుతున్నాం. వాళ్లు అంతర్జాతీయ స్థాయి ఆడియో కంపెనీలతో మాట్లాడాలి. ఎందుకంటే విదేశీ ఆర్టిస్ట్లకు ఈ ఆడియో కంపెనీలతో మంచి అనుబంధం ఉంటుంది.. ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటారు. బ్రిట్నీని సంప్రదించే ముందు పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. ఆమెతో తెలుగు పాట పాడించాలా? లేక ఇంగ్లిష్ ట్రాక్ పాడించాలా? అనేది ఇంకా నిర్ణయించుకోలేదు’’ అన్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న ‘గాడ్ ఫాదర్’ మలయాళ ‘లూసిఫర్’కి రీమేక్ అనే విషయం తెలిసిందే. -
‘గాడ్ ఫాదర్’లో తన రోల్ చెప్పెసిన గంగవ్వ, ఏకంగా చిరుకు..
‘మై విలెజ్ షో’ అనే యూట్యూబ్ ఛానల్తో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న గంగవ్వ ఆ తర్వాత బిగ్బాస్లో పాల్గొనే చాన్స్ కొట్టెసింది. బిగ్బాస్తో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఆమె ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా అయిపోయింది. ఇటీవల సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ‘లవ్స్టోరీ’ చిత్రంలో కనిపించిన గంగవ్వ.. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కూడా నటించే అవకాశం కొట్టేసిన సంగతి తెలిసిందే. ‘లవ్స్టోరీ’ మాదిరిగా ఓ చిన్న పాత్ర చేస్తుందని అందరూ భావించారు. ఈ క్రమంలో ఆమె రోల్కు సంబంధించిన అప్డేట్ బయటకు వచ్చింది. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలోకి వచ్చే సినిమాలివే ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో చిరంజీవికి గంగవ్వ తల్లిగా నటిస్తుందట. ఈ విషయాన్ని స్వయంగా గంగవ్వ వెల్లడించింది. లవ్స్టోరీ మ్యాజికల్ బ్లాక్బస్టర్ సక్సెస్ మీట్లో భాగంగా మూవీ టీం ఓ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చింది. దీనికి డైరెక్టర్ శేఖర్ కమ్ముల, హీరో నాగచైతన్యలతో పాటు గంగవ్వ కూడా పాల్గొంది. ఈ క్రమంలో తాను చిరంజీవి మూవీ షూటింగ్ కోసం ఊటీ వెళ్లానని, ఇందులో చిరుకు అమ్మగా నటిస్తున్నానంటూ చెప్పుకొచ్చింది. దీంతో అతి తక్కువ కాలంతో గంగవ్వ ఏకంగా మెగాస్టార్కు తల్లిగా నటించడం విశేషమని, గంగవ్వ చాలా లక్కీ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: Akkineni Nagarjuna: ‘నేను చూసిన నాగార్జుననే పేరు మార్చి శీనుగా చూపించా’ కాగా ఈ సినిమాలో చిరుకు సోదరిగా కీర్తి సురేశ్ నటిస్తన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిరు ఆచార్య, గాడఫాదర్ షూటింగ్లతో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య మేవీ దాదాపు పూర్తయినప్పటికి పలు సన్నివేశాలు, పాటలు మిగిలి ఉండటంతో వాటి చిత్రకరణ జరుగుతోంది. దీనితో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా శరవేగంగా జరుపుకుంటోంది. దీంతో ఇటీవల లూసిఫర్ రీమేక్ ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ను కూడా మొదలు పెట్టాడు చిరు. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ మూవీ నుంచి ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. -
గాడ్ ఫాదర్: రంగంలోకి దిగిన చిరంజీవి
Chiranjeevi Resumes Godfather Shoot In Ooty: మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'గాడ్ ఫాదర్'. మలయాళీ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ తెలుగు రీమేక్ ఇది. తాజాగా ఈ మూవీ షూటింగ్ ఊటీలో ప్రారంభం అయ్యింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిల్మ్స్ పేర్కొంది. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక సూపర్ గుడ్ ఫిల్మ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీలో కుష్బూ కీలక పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. గాడ్ ఫాదర్: ఊటీలో షూటింగ్ చదవండి : 'మా' ఎన్నికలు : ప్యానెల్ సభ్యులను ప్రకటించనున్న మంచు విష్ణు 'లైగర్' టీంకు సడెన్ సర్ప్రైజ్ ఇచ్చిన బాలయ్య -
చిరంజీవి సినిమాలో ప్రజా గాయకుడు గద్దర్!
మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’చేస్తున్న చిరు.. ఆ తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్లో నటించబోతున్నాడు. మలయాళీ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ తెలుగు రీమేక్ ఇది. ఇందులో ప్రజా గాయకుడు గద్దర్ ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. (చదవండి: ఒక్క ట్వీట్తో రూమర్స్కు చెక్ పెట్టిన సమంత!) ఈ మేరకు దర్శక, నిర్మాతలు గద్దర్ని సంప్రదించారని, పాత్ర నచ్చడంతో ఆయన ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. రాబోయే షెడ్యూల్లో గద్దర్ పార్ట్ షూటింగ్ ఫినిష్ చేయనున్నారని సమాచారం. వైజాగ్ జైలులో చిత్రీకరించే సన్నివేశాల్లో గద్దర్ పాల్గొననున్నారట. ఆయనతో పాటు కోలీవుడ్, బాలీవుడ్ నుంచి స్టార్ నటీనటులను ఈ సినిమాలో నటించబోతున్నట్లు తెలుసోస్తోంది. -
చిరు ‘గాడ్ ఫాదర్’కు సల్మాన్ గ్రీన్ సిగ్నల్, డేట్స్ కూడా ఫిక్స్!
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తమిళ రీమేక్ ‘లూసిఫర్’ మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఆదివారం చిరు బర్త్డే సందర్భంగా ఈ మూవీకి గాడ్ ఫాదర్ అనే టైటిల్ ఖారారు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇటీవల ఆచార్య షూటింగ్ను పూర్తి చేసుకున్న చిరు ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ను ప్రారంభించాడు. చదవండి: Nayantara: సత్యదేవ్కు భార్యగా నయనతార ఈ నేపథ్యంలో ఈ మూవీలో మిగతా తారగణం ఒక్కొరి పేర్లు బయటకు వస్తున్న నేపథ్యంలో బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ పేరు తెరపైకి వచ్చింది. సల్మాన్ ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు వినిపించగా దీనిపై క్లారిటీ లేదు. ఈ క్రమంలో సల్మాన్ గాడ్ ఫాదర్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ తాజా బజ్ ప్రకారం.. సల్మాన్ తన డెట్స్ సర్దుబాటు చేసి ‘గాడ్ ఫాదర్’ మూవీకి తన షెడ్యూల్ కెటాయించినట్లు కూడా తెలుస్తోంది. కాగా ఈ మూవీలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ చెందిన స్టార్ నటీనటులు కూడా భాగస్వామ్యం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ను మేకర్స్ సంప్రదించగా ఆయన వెంటనే ఓకే చెప్పాడట. చదవండి: మహానటి సావిత్రి చేతిలో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పటి స్టార్ హీరో తెలుసా! అయితే తెలుగులో నటించడానికి సల్మాన్ ఆసక్తిగా లేడని, ఈ నేపథ్యంలో గాడ్ ఫాదర్ ఆఫర్ను తిరస్కరించినట్లు మొదట్లో వార్తలు వచ్చాయి. అయితే అవన్ని పుకార్లనేనని, ఈ చిరంజీవి సినిమా ఆఫర్ అనగానే సల్మాన్ హ్యాపీగా ఫీల్ అయినట్లు ఆయన సన్నిహితులు నుంచి సమాచారం. కాగా తమిళంలో పృథ్విరాజ్ సుకుమారన్ పాత్రలో సల్మాన్ ఖాన్ నటించనున్నాడట. మరి దీనిపై స్పష్టత రావాలంటే అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాలి. అయితే ఇందులో చిరుకు సోదరిగా లేడి సూపర్స్టార్ నయనతార నటిస్తోంది. సత్యదేవ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీలో నయన్, సత్యదేవ్లు భార్యభర్తలుగా కనిపించనున్నారట. చదవండి: Allu Arjun: ‘పుష్ప’ కోసం బన్ని డెడికేషన్, మేకప్కు అంత సమయమా..! -
క్లైమాక్స్ మార్చుకున్న‘ది గాడ్ ఫాదర్’
ఫ్రాన్సిస్ ఫోర్డ్ కపోలా దర్శకత్వం వహించిన ‘ది గాడ్ ఫాదర్’ ఇంగ్లీష్ చిత్రానికి హాలివుడ్లో అప్పటికీ ఇప్పటికీ చెరిగిపోనీ ఓ ప్రత్యేక ముద్ర ఉన్న విషయం తెలిసిందే. ఇటాలియన్ మాఫియా గురించి ఆయన తీసిన ‘ది గాడ్ ఫాదర్’ సినిమా మూడు పార్ట్లను కూడా భారతీయ ప్రేక్షకులు ఎంతో ఆదరించారు. ఒక్క సినిమా స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది దర్శకులుగా సినిమా ప్రపంచానికి పరిచయం కాగా, మరెంతో మంది దర్శకులు అదే సినిమా స్ఫూర్తితో ఎన్నో సినిమాలు తీసి ప్రేక్షకుల మెప్పు పొందారనడంలో సందేహం లేదు. (చదవండి : మహాబలేశ్వరంలో ‘ఆర్ఆర్ఆర్’ సందడి) టాలీవుడ్, బాలీవుడ్ రంగాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సాధించిన రామ్ గోపాల్ వర్మ కూడా ‘ది గాడ్ ఫాదర్’ సిరీస్ సినిమాలను 300 సార్లు చూశానని చెప్పుకోవడమే కాకుండా వాటి స్ఫూర్తితో తాను పలు చిత్రాలను తీశానని ఒప్పుకున్నారు. 1990లో తీసిన ‘ది గాడ్ ఫాదర్ పార్ట్–3’ కి ఇప్పుడు కూడా ‘రాటెన్ టమాటోస్’ 68 శాతం రేటింగ్ ఇవ్వడం విశేషం. ఈ సినిమా ఇప్పుడు కొత్త రూపంలో మళ్లీ మన ముందుకు వస్తోంది. 81 ఏళ్ల ఫాన్సిస్ ఫోర్డ్ కపోలా ‘ది గాడ్ ఫాదర్ పార్ట్–3’ సినిమా బిగినింగ్ను కొద్దిగా మార్చి, క్లైమాక్స్ను పూర్తిగా మార్చివేసి ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు.ఇంకా ఎన్నో ఏళ్లు జీవించాల్సిన మైకేల్ కార్లియోన్ అర్ధాంతరంగా చనిపోయే చివరి పతాక సన్నివేశంలో మార్పులు చేశానని, ఇది నాటి తరం ప్రేక్షకులతోపాటు ఈ తరం ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని భావిస్తున్నట్లు దర్శకులు కపోలా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రం డిజిటల్, ఇతర రూపాల్లో డిసెంబర్ 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. -
షావోమియే ‘గాడ్ఫాదర్’
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా అతి చౌకైన స్మార్ట్ఫోన్లను విక్రయిస్తూ ప్రసిద్ధి చెందిన ‘షావోమి’ అనే చైనా కంపెనీ గురించి తెలియనివారు నేటి యువతరంలో ఉండకపోవచ్చు. నిజంగా ఈ కంపెనీని స్మార్ట్ఫోన్ల రంగంలో ‘ది గాడ్ ఫాదర్’గా అభివర్ణించవచ్చు. అందుకు ఓ అసలైన కారణం కూడా ఉంది. ప్రముఖ చైనా వ్యాపారవేత్త లీ జున్ స్వతంత్ర భావాలు కలిగిన చిత్రమైన వ్యక్తి. షావోమి కంపెనీ స్థాపించడానికి ముందు ఆయన కోట్లకొద్ది డాలర్లను కుమ్మరించి ‘కింగ్సాఫ్ట్’ లాంటి పలు కంపెనీలను స్థాపించారు. జోయో అనే ఈ కామర్స్ సంస్థను స్థాపించి దాన్ని అనతి కాలంలోనే దాన్ని అమెజాన్ చైనాకు అమ్మేశారు. ఆ తర్వాత ‘వైవై కార్పొరేషన్’ పేరిట గేమింగ్ ఫ్లాట్ఫామ్ను ఏర్పాటు చేశారు. ఆయన తన వ్యాపారాలన్నింటికీ స్వస్తి చెప్పి హఠాత్తుగా చైనా చిత్ర రంగంలోకి అడుగుపెట్టారు. ఒకనాడు హాలీవుడ్లో సంచలనం సృష్టించిన ‘ది గాడ్ ఫాదర్’ చిత్రాన్ని చైనా భాషలో రీమేక్ చేసి తాను స్వయంగా అందులో గాడ్ ఫాదర్ పాత్రను పోషించారు. ఆ తర్వాత 2010లో జీ జున్ సినిమా ప్రపంచం నుంచి మళ్లీ వ్యాపార ప్రపంచంలోకి అడుగు పెట్టారు. షావోమి సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉపయోగించి ‘ఆపరేటింగ్ సిస్టమ్’ను అభివృద్ధి చేశారు. గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు సాఫ్ట్వేర్ రంగంలో, ఆపిల్, శ్యామ్సంగ్, నోకియా, మైక్రోమాక్స్ కంపెనీలు హార్డ్వేర్ రంగంలో రాణిస్తుండగా.. షావోమి రెండు రంగాల్లో రాణించడం విశేషం. ఒకప్పుడు మెకిన్సేలో పనిచేసిన భారతీయుడు మను జైన్ షావోమిలో చేరి భారత్లో ఈ ఫోన్ల విక్రయానికి అధిపతిగా నియమితులయ్యారు. ఫ్లిప్కార్ట్ సహాయంతో ఆన్లైన్లో షావోమి ఫోన్ల అమ్మకాల్లో పెద్ద విప్లవాన్నే సృష్టించారు. -
బీరు బాధిస్తోందంటూ పిల్..
న్యూఢిల్లీ: మతసంబంధాలను కించపరిచిందంటూ 'గాడ్ ఫాదర్' పేరుతో విక్రయాలు జరుపుతున్న బీరును దేశ రాజధానిలో నిషేధించాలని ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది. ఈ మేరకు పిల్ వేసిన ఓ స్వచ్ఛంద సంస్థ, బీరుకు పెట్టిన పేరులో 'గాడ్' అనే పదం ఉందని, ఇది అన్ని మతాల ప్రజల భావోద్వేగాలను కించపరుస్తోందని పేర్కొంది. ఈ బీరు తయారీదారులు కావాలనే అన్ని వర్గాల ప్రజల మనోభవాలను దెబ్బతీసేలా ఆ పేరును పెట్టారని స్వచ్ఛంద సంస్థ 'జన్ చేతన మంచ్' అధ్యక్షుడు దేవిందర్ సింగ్ పిటిషన్ లో వివరించారు. ఈ కేసును ఫైల్ చేసిన లాయర్ ఏపీ సింగ్ పదాలు 'గాడ్', 'ఫాదర్'లకు మతాలలో ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు. 'గాడ్ ఫాదర్' పేరును తొలగిస్తూ తయారీ దారు జాతీయ న్యూస్ పేపర్ల ద్వారా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని పిటిషన్ లో కోరారు. కాగా, ఈ పిటిషన్ వచ్చేవారం వాదనలు జరగనున్నాయి. 'గాడ్ ఫాదర్' బీరు ఉత్తర భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. -
'గాడ్ఫాదర్'గా బాలయ్య..?
ఏ నటుడి జీవితంలో అయినా వందో సినిమాకు చాలా ప్రత్యేకత ఉంటుంది. ఈ తరం నటుల్లో వంద సినిమాలు పూర్తి చేయగలిగే హీరోలు అసలు కనిపించటం లేదు. అలాంటి అరుదైన మైలురాయికి అతి చేరువలో ఉన్న నటుడు నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం తన 99వ సినిమా చేస్తున్న బాలయ్య 100వ సినిమా గ్రాండ్గా ఉండేలా ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నాడు. బాలకృష్ణ ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో డిక్టేటర్ సినిమాలో నటిస్తున్నాడు. బాలయ్య మార్క్ మాస్ యాక్షన్తో పాటు ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా ఉన్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తరువాత బాలయ్య చేయబోయే 100వ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమా కోసం ఇప్పటినుంచే ఏర్పాట్లు చేస్తున్నారు చిత్రయూనిట్. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న బాలకృష్ణ వందో సినిమాను సక్సెస్ఫుల్ దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేయనున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు ఘనవిజయం సాధించటంతో మరోసారి అదే రిజల్ట్ రిపీట్ అవుతుందని భావిస్తున్నారు అభిమానులు. ఈ సినిమాకు గాడ్ఫాదర్ అనే పవర్ ఫుల్ టైటిల్ను ఫిక్స్ చేశారనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన ఇతర వివరాలను వెల్లడించనున్నారు. -
గాడ్ఫాదర్ అనుసృజన నా తలరాత కావచ్చును!
‘సంక్షిప్తం’గానే కావొచ్చు, క్షమించలేనన్ని అక్షర దోషాలతోనే కావొచ్చు, కానీ ప్రభావవంతంగానే ‘గాడ్ఫాదర్’ (మేరియో ఫ్యూజో) తెలుగులోకి వచ్చాడు. దాన్ని సాధ్యం చేసిన మూర్తి కె.వి.వి.ఎస్.తో ‘సాక్షి సాహిత్యం ప్రతినిధి’ జరిపిన చిరు సంభాషణ: ఈ గాడ్ఫాదర్ మీకు ఎప్పుడు పరిచయమయ్యాడు? ఇరవై ఏళ్ల కిందట! నాకు మొదటి నుంచి వివిధ రాష్ట్రాలకి ఒంటరిగా రైలు ప్రయాణాలు చేయడం అభిరుచి. రైల్వేస్టేషన్లో ఏదో ఒక నవల కొని ఆ ప్రయాణం అయ్యేలోపు చదివి, దాని గురించి డైరీలో ముఖ్యమైన విషయాలు రాసుకునేవాడిని. ఆ క్రమంలోనే గాడ్ఫాదర్ని కూడా చదివాను. చదివినప్పుడు అది కలిగించిన ప్రభావం? ఆ శైలీ, విషయమూ, పాత్రల్ని మలిచిన తీరూ విస్మయపరిచింది. నమ్మకద్రోహం, స్నేహశీలత, జంతువు వంటి పోరాట స్వభావం, ఇట్లా మనిషిలోని సకల కోణాల్ని అత్యంత ఉత్కంఠభరితంగా ఫ్యూజో చిత్రించాడు. కొన్ని సినిమాలకి సరిపడా ముడి సరుకు లభ్యమవుతుంది. మన దర్శకులు ఆ కోణంలో బాగానే వాడుకున్నారు. అసలు డాన్ అనే మాట మామూలుది కాదు. దాని వెనుక ఎంత బరువు ఉంటుంది అనేది నవల చదవకపోతే ఎప్పటికీ తెలియదు. చాలామంది బండకొట్టుడుగా ఒక దొంగల నాయకుడిగా భావిస్తారు. అనువాదం ఎందుకు చేయాలనిపించింది? ఒక ఆంగ్ల నవల ఆత్మని సాధ్యమైనంత ఎక్కువగా తెలుగులోకి వంపాలనిపించి! సమాజంలోని వివిధ ఆధిపత్య వర్గాలు నిరంతరం తమ సంపద, అధికారం కాపాడుకోవడానికి ఎలాంటి పద్ధతుల్ని అవలంబిస్తుంటారు, ఎలా ఇచ్చిపుచ్చుకునే వ్యూహాల్ని పాటిస్తుంటారు, ఇట్లా అనేక విషయాలు మనకి అవగతమవుతాయి. ఇవన్నీ మన సమాజంలోని కొన్ని కోణాల్ని స్పృశించినట్లు అనిపించినా ఆశ్చర్యం లేదు. నిజానికివన్నీ మనం తెలుసుకున్నవే కాని ఒక క్రమపద్ధతిలో ఒక మాస్టర్ స్టోరీ టెల్లర్ చెప్పే విధానం మైమరిపిస్తుంది. మనం గుప్పిటిలో పట్టి ఉంచిన కొన్ని విషయాల్ని బద్దలుగొట్టినట్లు చెబుతాడు ఫ్యూజో. ఈ అనువాదానికి మీరుగా అనుసరించిన పద్ధతి ఏమైనా ఉందా? కొన్ని ప్రభావవంతమైన వాక్యాల్ని, మాటల్ని ఆంగ్లంలోనే ఉంచేశాను. వాటిని ఆ భాషలో చదివితేనే మజా! దెబ్బ ఎక్కడ తగలాలో అక్కడ తగిలి అబ్బా అనిపిస్తుంది. మక్కీకి మక్కీగా ఏవో పదాల్ని తెలుగులో అక్కడ పెట్టవచ్చును. కాని ఆ కిక్ రాదు గాక రాదు. అయినా ఒక ఆంగ్ల అనువాదాన్ని ఎవరు చదవాలనుకుంటారు! ఎంతో ఒకంత ఆంగ్లంలోని రుచి తెలిసినవారే చదవాలనుకుంటారు. ఇది ఇంతవరకూ తెలుగులోకి ఎందుకు రాలేదనుకుంటున్నారు? ఎందుకు ఇంతకాలం ఎవరూ ఈ మాస్టర్ క్లాసిక్ని తెలుగులోకి తేలేదు అని యోచిస్తే నాకు తేలింది ఒకటే. డాన్ Vito Corleone D నవల్లో అన్నట్లు ‘ప్రతి మనిషికి ఒక తలరాత ఉంటుంది. దాన్నెవరూ మార్చలేరు’. బహుశా ఈ అనుసృజనని నేను చేయాలనేది నా తలరాత కావచ్చును! మూర్తి కె.వి.వి.ఎస్. ఫోన్: 7893541003 - మూర్తి కె.వి.వి.ఎస్. -
రిలేషణం: తేమగల రాయి... రామ్గోపాల్వర్మ
రామ్గోపాల్వర్మ... ఇండస్ట్రీలో న్యూ టాలెంట్కి ఆయన గాడ్ఫాదర్. ఈ గాడ్ఫాదర్కి రోల్మోడల్... ఆయన మేనమామ మురళీరాజు. నాకు సినిమాలు తప్ప సెంటిమెంట్లు లేవు అన్నట్టుగా ఉండే వర్మ రాతి మనిషా లేక ఆ రాతి కింద ఏమైనా తడిజాడలున్నాయా... మేనమామ మురళీరాజు మాటల్లో తెలుసుకుందాం! వర్మకు సినిమాల పట్ల ఆసక్తి కలిగించేలా చేసింది నేనే అన్నది కేవలం తను కల్పించిన ఒక భ్రమ మాత్రమే. కాలేజీలో ఉన్నప్పుడు తను గాడ్ఫాదర్ నవలలో పేరాలు, సినిమాలో సీన్స్ అనర్గళంగా చెప్పేవాడు. తరువాత చూస్తే, అందులో చాలావరకు తన ఇమాజినేషన్, ఆర్టిక్యులేషన్ ఉండేది. ప్రపంచ సినిమాలో వెయ్యి అత్యుత్తమ చిత్రాలుంటే, నేను తొమ్మిది వందల సినిమాలు చూశాను. తను మాత్రం వంద చూసుంటాడు. కానీ తను వంద సినిమాలు తీస్తే, నేను ఒక్కటి కూడా తీయలేకపోయాను. ఇక, మా బంధం గురించి చెప్పాలంటే, నేను ప్రేక్షకుణ్ని, వర్మ దర్శకుడు. అదే మా బంధం. మా మార్గాలు ఎక్కడ వేరవుతాయి అంటే, వర్మ థింకింగ్ వేరు. నా థింకింగ్ వేరు. నాది జ్ఞాన మార్గం. తనది క్రియా మార్గం. నాకు ఫ్లైట్లో ప్యాసింజర్గా వెళ్లడం ఇష్టం. తనకు పైలట్గా విమానం నడపడం ఇష్టం. రాము సూర్యుడు, నేను చంద్రుడు. తనకు స్వయం ప్రకాశకత్వం ఉంది, నాకు లేదు. రాముకి ఉన్నతమైన లక్షణాలున్నాయి. డబ్బు సంపాదించగానే తండ్రికి కారు కొనిచ్చాడు. తనకెలాంటి బంధాలూ లేవని రాము చెప్పేది అబద్ధం. నాలుగు ఫ్యామిలీస్ అతని మీద ఆధారపడి ఉన్నాయి. కనీసం వంద మందికి జీవితాధారాన్నిచ్చాడు. తనకు ఎమోషన్ లేదంటాడు కానీ తన తండ్రి చనిపోయిన కొన్నేళ్ల వరకూ వెక్కి వెక్కి ఏడ్చాడు. లోపల ఎమోషన్ లేకుంటే బయటకు దుఃఖం ఎలా వస్తుంది! రాము ఓ గ్రేట్మ్యాన్ అని ఊహ వచ్చాక, తను నా మేనల్లుడు అనుకోవడం మానేశాను. నిజం చెప్పాలంటే ఆయన నాకు మామ. నేను మేనల్లుణ్ని. తను ఎప్పటికప్పుడు నా క్షేమ సమాచారాల గురించి తెలుసుకుంటుంటాడు. నేను పెద్దగా ఎవరినీ కలవడానికి ఇష్టపడను. ఒక్క రామూని మాత్రం మళ్లీ మళ్లీ కలవడానికి ఇష్టపడతాను. బాంబేకి వెళ్లి ఫోన్ చేస్తే ఉదయం నుంచి రాత్రి రెండు గంటల వరకు సినిమాకు సంబంధించి అన్ని ప్రాసెస్లు దగ్గరుండి చూపిస్తాడు. నన్ను తను ఎంటర్టైన్ చేసినట్టు మరెవరూ చేయలేరు. వినోదం రూపంలో ఆతిథ్యం ఇవ్వగలిగే సంస్కారం ఉన్న పెద్దమనిషి ఆయన. తన దగ్గర ఎప్పటికప్పుడు ఏదో కొత్త విషయం నాకు కనిపిస్తూ ఉంటుంది. తనను చిన్నప్పటినుంచీ అబ్జర్వ్ చేస్తున్నాను. చిన్నప్పుడు తనకు కత్తి కాంతారావు అంటే ఇష్టం. వయసులో బ్రూస్లీ, తరువాత అమితాబ్ అంటే ఇష్టం. రాము దేవుడు ఉన్నాడు లేడు అని నమ్మడు. ఒకవేళ దేవుడు ఉన్నా అతనికి మన గురించి అక్కరలేదు. అలాంటప్పుడు అతని గురించి మనం ఎందుకు వర్రీ అవ్వాలి అంటాడు. అది ఒక విధంగా కరెక్టే. సూర్యుడిలా దేవుడు సాక్షి అంతే. నాది అద్వైతం. దేవుడిలో నేనున్నాను, నాలో దేవుడున్నాడు. తన సినిమాలకు సంబంధించి నా అబ్జర్వేషన్స్ చెబుతానే తప్ప అభిప్రాయాలు చెప్పను. అతను నన్నెప్పుడూ అడగలేదు. నేనెప్పుడూ చెప్పను. పోస్ట్ ప్రొడక్షన్లో సీన్స్ చూపించి అడుగుతాడు. నేను నా అభిప్రాయం చెబుతాను. అంతవరకే. దగ్గరివాళ్లు విమర్శిస్తే రాము తట్టుకోలేడు. ఈ మధ్య తన సినిమాలు సరిగ్గా ఎంటర్టైన్ చేయడం లేదు. ఫెలిని(ఇటలీ చిత్ర దర్శకుడు) ఒక దశలో ఆర్ట్ ఇజ్ మై ఎక్స్ప్రెషన్ అన్నట్టు వర్మ కూడా నా సినిమా నా ఇష్టం అంటాడు. రాము తనకై తన గురించి, తన ప్లెజర్ గురించి జీవిస్తాడు. అందుకే ఆగ్ తీశాడు. రామూని యాక్సెప్ట్ చేయవచ్చు. రిజెక్ట్ చేయవచ్చు. కానీ ఎవరికీ ద్వేషించడం అస్సలు కుదరదు. జీవితమనే ల్యాబొరేటరీలో చిన్న చిన్న చమత్కారాలు జరుగుతుంటాయి. అవి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. రాము అలాంటి చమత్కారమే. ఆయన ఒక మనిషి కాదు, ప్రాసెస్. జీవితం సంతోషంగా ఉండాలంటే ఐదు సూత్రాలు చెబుతారు. ఐహిక సుఖాలు 20 శాతం ఆనందాన్నిస్తాయి; మనకు నచ్చిన పనిచేస్తే, ఇరవై శాతం ఆనందం; సత్సంబంధాలు మెయింటెయిన్ చేస్తే ఇరవై శాతం; త్యాగబుద్ధి వలన ఇరవై శాతం; లక్ష్య సిద్ధి ఇరవై శాతం సంతోషం కలుగుతుంది. ఇవేవీ రామూకి తెలియకపోయినా తను ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. జీవితానికి పరమార్థం ఇతరులను ఇన్స్పైర్ చేయడం అని చెప్తారు. అలా చూస్తే, హిచ్కాక్లాగా రామూ కూడా చాలామందిని ఇన్స్పైర్ చేశాడు. రాము తన లక్ష్య సిద్ధికి గారడీ చేస్తాడు కానీ కుతంత్రాలు కాదు, ఇతరులకు హాని చేసే చర్చలు, ఈర్ష్య ద్వేషాలు లేని వ్యక్తి రాము. - కె.క్రాంతికుమార్రెడ్డి