Indian womens hockey team
-
మన ఆటలో వేగం పెరగాలి
న్యూఢిల్లీ: అరంగేట్ర మ్యాచ్లోనే అనూహ్య గోల్తో అదరగొట్టిన భారత మహిళల హాకీ జట్టు యువ ఫార్వర్డ్ సాక్షి రాణా... అంతర్జాతీయ స్థాయిలో నిలకడ కొనసాగించేందుకు ఆటలో వేగం పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. ఇటీవల అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్ సందర్భంగా స్పెయిన్తో మ్యాచ్ ద్వారా 17 ఏళ్ల సాక్షి రాణా సీనియర్ స్థాయిలో అరంగేట్రం చేసింది. భువనేశ్వర్ వేదికగా ప్రపంచ ఏడో ర్యాంకర్ స్పెయిన్తో జరిగిన పోరులో సాక్షి తన ఆటతీరుతో ఆకట్టుకుంది. ఆ మ్యాచ్లో భారత్ 3–4 గోల్స్ తేడాతో స్పెయిన్ చేతిలో ఓడినప్పటికీ... సాక్షి మాత్రం చక్కటి ‘ఫీల్డ్ గోల్’తో తనదైన ముద్ర వేసింది. జూనియర్ స్థాయిలో చక్కటి ప్రదర్శనతో సీనియర్ జట్టుకు ఎంపికైన సాక్షి రాణా... మొదటి మ్యాచ్లోనే గోల్ చేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పింది. ‘సీనియర్ జట్టు తరఫున అరంగేట్రం చేసేందుకు చాన్నాళ్లుగా ఎదురుచూశా.తొలి మ్యాచ్లో సీనియర్ ప్లేయర్లు ఎంతగానో సహకరించారు. అంతర్జాతీయ స్థాయిలో మొదటి పోరును ఆస్వాదించమని సూచించారు. దీంతో ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడగలిగా’ అని సాక్షి వెల్లడించింది. స్పెయిన్తో మ్యాచ్లో ప్రత్యర్థి ప్లేయర్ల నుంచి సర్కిల్లో బంతి చేజిక్కించుకున్న సాక్షి దానిని గోల్గా మలిచింది. ‘తొలి మ్యాచ్లోనే గోల్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా. దాని కోసం తీవ్రంగా శ్రమించా. మ్యాచ్ సమయంలో నా చేతికి బంతి దొరికినప్పుడు చుట్టుపక్కల ఎవరూ లేరని గమనించా. అదే అదునుగా షాట్ కొట్టా. దీంతో ఒక్కసారిగా అందరూ అరవడం ప్రారంభించారు. అప్పుడుగోల్ కొట్టానని అర్థమైంది’ అని సాక్షి చెప్పింది. ఎఫ్ఐహెచ్ ప్రొ హాకీ లీగ్లో భాగంగా స్పెయిన్, జర్మనీ జట్లపై ఆడిన సాక్షి... విదేశీ ప్లేయర్లతో పోటీపడాలంటే ఆటలో మరింత వేగం పెంపొందించుకోవాలని సాక్షి అభిప్రాయపడింది. ‘అంతర్జాతీయ స్థాయి లో రాణించాలంటే మరింత వేగం, చురుకుదనం పెంచుకోవాలని అర్థమైంది. ఫార్వర్డ్గా అది నాకు మరింత కీలకం. అందుకే ఇప్పుడు దానిపై దృష్టి సారించా. ప్రొ హాకీ లీగ్కు స్టాండ్బై ప్లేయర్గా ఎంపికయ్యా. చీఫ్ కోచ్ హరేంద్ర సింగ్ తొలి మ్యాచ్ ఆడుతున్నావు అని చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది. నిన్ను మాత్రమే జట్టుకు ఎంపిక చేయలేదు... నీ ఆటను కూడా సెలెక్ట్ చేశాం... మైదానంలో విజృంభించు అని కోచ్ వెన్నుతట్టారు.దీంతో ఆత్మవిశ్వాసంతో ఆడగలిగాను’ అని సాక్షి చెప్పింది. గతేడాది జూనియర్ ఆసియా కప్లో పసిడి పతకం గెలిచిన భారత జట్టులో సభ్యురాలైన సాక్షి... ఈ ఏడాది చిలీ వేదికగా జరగనున్న జూనియర్ ప్రపంచకప్లో యువ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనుంది. -
నెదర్లాండ్స్కు భారత్ షాక్
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్ భారత అంచె పోటీలను భారత మహిళల, పురుషుల జట్లు విజయంతో ముగించాయి. మంగళవారం జరిగిన మ్యాచ్ల్లో సలీమా టెటె సారథ్యంలోని భారత మహిళల జట్టు ‘షూటౌట్’లో 2–1 గోల్స్ తేడాతో ప్రస్తుత ప్రపంచ చాంపియన్, ఒలింపిక్ చాంపియన్, ప్రపంచ నంబర్వన్ నెదర్లాండ్స్ జట్టు ను బోల్తా కొట్టించగా... హర్మన్ప్రీత్ సింగ్ కెప్టెన్సీలోని భారత పురుషుల జట్టు 2–1 గోల్స్ తేడాతో ఇంగ్లండ్ జట్టుపై గెలిచింది. నెదర్లాండ్స్ మహిళల జట్టుతో జరిగిన మ్యాచ్లో రెండు క్వార్టర్లు ముగిసేసరికి భారత జట్టు 0–2తో వెనుకబడింది. ఆ తర్వాత ఎనిమిది నిమిషాల వ్యవధిలో టీమిండియా రెండు గోల్స్ చేసి స్కోరును 2–2తో సమం చేసింది. భారత్ తరఫున దీపిక (35వ నిమిషంలో), బల్జీత్ కౌర్ (43వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. నెదర్లాండ్స్ జట్టుకు పియెన్ సాండర్స్ (17వ నిమిషంలో), వాన్డెర్ ఫే (28వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. నిర్ణీత సమయం ముగిశాక రెండు జట్లు సమంగా నిలువడంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ నిర్వహించారు. ‘షూటౌట్’లో భారత గోల్కీపర్ సవితా పూనియా అడ్డుగోడలా నిలబడి నలుగురు నెదర్లాండ్స్ క్రీడాకారిణుల షాట్లను నిలువరించింది. నెదర్లాండ్స్ తరఫున మరీన్ వీన్ మాత్రమే సఫలమైంది. భారత్ తరఫున దీపిక, ముంతాజ్ సఫలమవ్వగా... బ్యూటీ డుంగ్డుంగ్, బల్జీత్ కౌర్ విఫలమయ్యారు. నెదర్లాండ్స్ ఐదో షాట్ తర్వాత భారత విజయం ఖరారు కావడంతో టీమిండియా ఐదో షాట్ను తీసుకోలేదు. ఇంగ్లండ్ తో పోరులో భారత జట్టుకు హర్మన్ప్రీత్ (26వ, 32వ నిమిషంలో) రెండు గోల్స్ అందించాడు. -
భళా భారత్
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్లో భారత పురుషుల జట్టు విజయ పరంపర కొనసాగుతోంది. శనివారం జరిగిన పోరులో టీమిండియా 4–0 గోల్స్ తేడాతో ఐర్లాండ్ జట్టుపై విజయం సాధించింది. శుక్రవారం 3–1 గోల్స్ తేడాతో ఐర్లాండ్ను ఓడించిన భారత్... వరుసగా రెండో మ్యాచ్లోనూ ఆధిపత్యం కనబర్చింది. భారత్ తరఫున నీలమ్ సంజీప్ (14వ నిమిషంలో), మన్దీప్ సింగ్ (24వ నిమిషంలో), అభిõÙక్ (28వ నిమిషంలో), శంషేర్ సింగ్ (34వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. మ్యాచ్ ఆరంభంలో చక్కటి ఆటతీరు కనబర్చిన ఐర్లాండ్ 9వ నిమిషంలో దక్కిన పెనాల్టీ కార్నర్ అవకాశాన్ని సది్వనియోగం చేసుకోలేకపోయింది. ఇక అక్కడి నుంచి భారత్ జోరు ప్రారంభమైంది. వరుస విరామాల్లో గోల్స్ కొట్టిన భారత్ ఆధిక్యం అంతకంతకూ పెంచుకుంటూ పోయింది. నీలమ్ 14వ నిమిషంలో ఫీల్డ్గోల్తో భారత్ ఖాతా తెరవగా... ఆ తర్వాత మన్దీప్, అభిõÙక్, శంషేర్ తలా ఒక గోల్ కొట్టారు. మ్యాచ్లో భారత్కు మరిన్ని పెనాల్టీ కార్నర్ అవకాశాలు లభించినా... రెగ్యులర్ కెప్టెన్, స్టార్ డ్రాగ్ఫ్లికర్ హర్మన్ప్రీత్ సింగ్ విశ్రాంతి తీసుకోవడంతో మన అధిక్యం మరింత పెరగలేదు. చివరి క్వార్టర్లో ప్రత్యర్థి ప్లేయర్లు మన రక్షణ పంక్తిని దాటి ముందుకు సాగలేకపోయారు. తదుపరి మ్యాచ్లో సోమవారం ఇంగ్లండ్తో భారత్ తలపడుతుంది. దీపిక గోల్తో భారత్ గెలుపు మరో వైపు మహిళల విభాగంలో భారత జట్టు శనివారం 1–0 గోల్స్ తేడాతో జర్మనీపై విజయం సాధించింది. శుక్రవారం తొలి పోరులో 0–4 గోల్స్ తేడాతో జర్మనీ చేతిలో ఓడిన భారత్... రెండో మ్యాచ్లో దానికి బదులు తీర్చుకుంది. భారత్ తరఫున స్టార్ డ్రాగ్ఫ్లికర్ దీపిక (12వ నిమిషంలో) ఏకైక గోల్ చేసింది. పెనాల్టీ కార్నర్ను సమర్థవంతంగా ప్రత్యర్థి గోల్పోస్ట్లోకి పంపి జట్టుకు ఆధిక్యాన్ని అందించింది. ఆ తర్వాత ఇరు జట్లు ఎంత ప్రయత్నించినా మరో గోల్ సాధ్య పడలేదు. ఫలితంగా భారత్ విజయం సాధించింది. తదుపరి మ్యాచ్లో నెదర్లాండ్స్తో భారత అమ్మాయిల జట్టు మ్యాచ్ ఆడుతుంది. -
వందన పునరాగమనం
న్యూఢిల్లీ: వచ్చే నెలలో స్వదేశంలో జరిగే అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) మహిళల ప్రొ లీగ్లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 24 మంది సభ్యులతో కూడిన ఈ బృందానికి సలీమా టెటె నాయకత్వం వహిస్తుంది. నవ్నీత్ కౌర్ వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తుంది. వెటరన్ స్ట్రయికర్ వందన కటారియా జాతీయ జట్టులోకి పునరాగమనం చేసింది. గత ఏడాది జరిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీకి గాయం కారణంగా దూరమైన వందన ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్ సంతరించుకోవడంతో ఆమెను ఎంపిక చేశారు. ఉత్తరప్రదేశ్కు చెందిన 32 ఏళ్ల వందన భారత్ తరఫున 317 మ్యాచ్లు ఆడి 158 గోల్స్ సాధించింది. 2016 రియో ఒలింపిక్స్, 2020 టోక్యో ఒలింపిక్స్లో భారత్కు ప్రాతినిధ్యం వహించింది. 2022 బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్లో కాంస్య పతకం నెగ్గిన టీమిండియాలోనూ వందన సభ్యురాలిగా ఉంది. 2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లో కాంస్యం... 2018 జకార్తా ఆసియా క్రీడల్లో రజతం... 2022 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన భారత జట్టులోనూ వందన భాగస్వామిగా ఉంది. 2021లో ‘అర్జున అవార్డు’ సొంతం చేసుకున్న వందనకు 2022లో కేంద్రం నుంచి ‘పద్మశ్రీ’ కూడా వరించింది. వందనతోపాటు డిఫెండర్లు నిక్కీ ప్రధాన్, జ్యోతి ఛత్రి, బల్జీత్ కౌర్, ముంతాజ్ ఖాన్, రుతుజాలకు కూడా జాతీయ జట్టులో స్థానం లభించింది. ఫిబ్రవరి 15 నుంచి 25 వరకు భువనేశ్వర్లో జరిగే భారత అంచె ప్రొ లీగ్లో భారత్తోపాటు జర్మనీ, స్పెయిన్, నెదర్లాండ్స్, ఇంగ్లండ్ జట్లు పోటీపడతాయి. భారత జట్టు తమ మ్యాచ్లను ఫిబ్రవరి 15, 16వ తేదీల్లో ఇంగ్లండ్తో... 18, 19వ తేదీల్లో స్పెయిన్తో... 21, 22వ తేదీల్లో జర్మనీతో... 24, 25వ తేదీల్లో నెదర్లాండ్స్తో తలపడుతుంది. భారత మహిళల హాకీ జట్టు సవిత పూనియా, బిచ్చూ దేవి ఖరిబం (గోల్కీపర్లు), సుశీలా చాను, నిక్కీ ప్రధాన్, ఉదిత, జ్యోతి, ఇషికా చౌధరీ, జ్యోతి ఛత్రి (డిఫెండర్లు). వైష్ణవి విఠల్ ఫాల్కే, నేహా, మనీషా చౌహాన్, సలీమా టెటె (కెప్టెన్), సునెలితా టొప్పో, లాల్రెమ్సియామి, బల్జీత్ కౌర్, షర్మిలా దేవి (మిడ్ ఫీల్డర్లు), నవ్నీత్ కౌర్ (వైస్ కెప్టెన్), ముంతాజ్ ఖాన్, ప్రీతి దూబే, రుతుజా పిసాల్, బ్యూటీ డుంగ్డుంగ్, సంగీత కుమారి, దీపిక, వందన కటారియా. -
చైనాపై భారత్దే పైచేయి
మస్కట్: ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన పోరులో భారత మహిళల హాకీ జట్టు తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. వరుసగా రెండోసారి జూనియర్ ఆసియా కప్ చాంపియన్గా టీమిండియా నిలిచింది. మూడుసార్లు చాంపియన్ చైనా జట్టుతో ఆదివారం జరిగిన ఫైనల్లో జ్యోతి సింగ్ నాయకత్వంలోని భారత జట్టు ‘షూటౌట్’లో 3–2 గోల్స్ తేడాతో విజయం సాధించింది. అంతకుముందు నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. ఫలితంగా విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ నిర్వహించారు. ‘షూటౌట్’లో భారత్ తరఫున సాక్షి రాణా, ఇషిక, సునెలిత టొప్పో సఫలమయ్యారు. ముంతాజ్ ఖాన్, కనిక సివాచ్ విఫలమయ్యారు. చైనా తరఫున గువోటింగ్ హావో, లియు టాంగ్జీ సఫలంకాగా... వాంగ్ లిహాంగ్, లి జింగీ, దన్దన్ జువో విఫలమయ్యారు. ముగ్గురు చైనా ప్లేయర్ల షాట్లను భారత గోల్కీపర్ నిధి నిలువరించి టీమిండియా విజయంలో ముఖ్యపాత్ర పోషించింది. ఫైనల్ చేరుకునే క్రమంలో లీగ్ దశలో చైనా చేతిలో మాత్రమే ఓడిపోయిన భారత జట్టుకు టైటిల్ పోరులోనూ గట్టిపోటీ ఎదురైంది. తొలి 29 నిమిషాల వరకు రెండు జట్లు ఖాతా తెరువలేకపోయాయి. 30వ నిమిషంలో లభించిన పెనాల్టీ స్ట్రోక్ను చైనా జట్టు సద్వినియోగం చేసుకుంది. టాన్ జిన్జువాంగ్ గోల్ చేయడంతో మాజీ చాంపియన్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత 41వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్ను కనిక సివాచ్ గోల్గా మలచడంతో భారత్ స్కోరును 1–1తో సమం చేసింది. ఆ తర్వాత రెండు జట్లు మరో గోల్ చేయడానికియత్నించినా ఫలితం లేకపోయింది. -
సెమీఫైనల్లో భారత్
మస్కట్: డిఫెండింగ్ చాంపియన్ భారత మహిళల హాకీ జట్టు జూనియర్ ఆసియా కప్ టోర్నీలో సెమీఫైనల్స్కు చేరింది. తద్వారా జూనియర్ ప్రపంచకప్ టోర్నీకి కూడా అర్హత సంపాదించింది. ఆసియా టైటిల్ వేటలో భారత్ రెండు అడుగుల దూరంలో ఉంది. గురువారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో భారత్ 9–0 గోల్స్ తేడాతో థాయ్లాండ్పై ఏకపక్ష విజయం సాధించింది. భారత ఫార్వర్డ్ ప్లేయర్ దీపిక అద్భుతంగా రాణించింది. ఆమె నాలుగు (28వ, 31వ, 35వ, 55వ నిమిషాల్లో) గోల్స్ చేయగా, కనిక సివాచ్ (23వ, 25వ, 40వ నిమిషాల్లో) మూడు గోల్స్ అందించింది. మిగతా వారిలో సాక్షి రాణా (17వ నిమిషంలో), లాల్రిన్పుయి (27వ నిమిషంలో), గోల్స్ చేశారు. భారత్ తొలి అర్ధభాగం (రెండు క్వార్టర్లు) ముగిసేసరికే 5–0తో మ్యాచ్ను శాసించేస్థితిలో నిలిచింది. మూడు, నాలుగో క్వార్టర్లలో మరో నాలుగు గోల్స్ సాధించింది. మూడో క్వార్టర్ మొదలైన నిమిషాల వ్యవధిలోనే రెండు గోల్స్ చేయడం ద్వారా దీపిక, కాసేపటికే మూడో గోల్ సాధించిన కనిక ‘హ్యాట్రిక్స్’ నమోదు చేశారు. శనివారం జరిగే సెమీఫైనల్లో జపాన్తో భారత్; చైనాతో దక్షిణ కొరియా తలపడతాయి. -
టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో...
బెంగళూరు: జూనియర్ ఆసియా కప్ టైటిల్ నిలబెట్టుకునేందుకు భారత మహిళల హాకీ జట్టు మంగళవారం ఒమన్కు బయల్దేరింది. ఒమన్ రాజధాని మస్కట్లో ఈ నెల 7 నుంచి 15 వరకు ఆసియా టోర్నీ జరుగుతుంది. ఇందులో రాణించి టైటిల్ నిలబెట్టుకోవడంతో పాటు వచ్చే ఏడాది జూనియర్ ప్రపంచకప్కు అర్హత సాధించాలనే లక్ష్యంతో భారత అమ్మాయిల జట్టు సన్నద్ధమై వెళ్లింది. మస్కట్ టోర్నీలో స్వర్ణ, రజత, కాంస్య పతక విజేతలు (టాప్–3 జట్లు) శాంటియాగో (చిలీ)లో జరిగే ప్రపంచకప్కు అర్హత సాధిస్తారు. ఆసియా కప్ ఈవెంట్లో భారత్ పూల్ ‘ఎ’లో ఉంది. ఈ పూల్లో భారత్తో పాటు చైనా, మలేసియా, థాయ్లాండ్, బంగ్లాదేశ్ జట్లున్నాయి. పూల్ ‘బి’లో దక్షిణ కొరియా, జపాన్, చైనీస్ తైపీ, హాంకాంగ్, శ్రీలంకలు పోటీపడతాయి. జ్యోతి సింగ్ నేతృత్వంలోని భారత జట్టులో పలువురు ప్రతిభావంతులు నిలకడగా రాణిస్తున్నారు. వైష్ణవి విఠల్ ఫాల్క, సునేలిత టొప్పొ, ముంతాజ్ ఖాన్, దీపిక, బ్యూటీ డుంగ్డుంగ్లకు సీనియర్లతో కలిసి ఆడిన అనుభవం ఉంది. ఈ జట్టుకు భారత మాజీ కెప్టెన్ తుషార్ ఖండ్కేర్ కోచ్గా వ్యవహరిస్తున్నారు. ఒమన్కు బయలుదేరే ముందు మీడియాతో కెపె్టన్ జ్యోతి సింగ్ మాట్లాడుతూ జట్టు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైందని, కొన్ని నెలలుగా జట్టు సన్నాహాల్లో చెమటోడ్చుతుందని తెలిపింది. అక్కడే ఉన్న పురుషుల జట్టు నాకౌట్కు చేరడం ఆనందంగా ఉందని, మేం కూడా వారిలాగే రాణిస్తామని ఆశాభావం వ్యక్తం చేసింది. -
Asian Champions Trophy 2024: ఎదురులేని భారత్
రాజ్గిర్ (బిహార్): మరోసారి సాధికారిక ఆటతీరుతో అలరించిన భారత మహిళల హాకీ జట్టు సొంతగడ్డపై జరుగుతున్న ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో ఐదోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ 2–0 గోల్స్ తేడాతో 2018 జకార్తా ఆసియా క్రీడల విజేత జపాన్ జట్టును ఓడించింది. భారత్ తరఫున వైస్ కెప్టెన్ నవ్నీత్ కౌర్ (48వ నిమిషంలో), లాల్రెమ్సియామి (56వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. సలీమా టెటె నాయకత్వంలో ఈ టోర్నీలో ఆడుతున్న భారత జట్టుకిది వరుసగా ఆరో విజయం కావడం విశేషం. లీగ్ దశలో ఆడిన ఐదు మ్యాచ్ల్లో నెగ్గిన టీమిండియా నాకౌట్ మ్యాచ్లోనూ గెలుపొందింది. నేడు జరిగే ఫైనల్లో పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత, ప్రస్తుత ఆసియా క్రీడల చాంపియన్ చైనా జట్టుతో భారత్ తలపడుతుంది. తొలి సెమీఫైనల్లో చైనా 3–1తో మలేసియాపై గెలిచింది. లీగ్ దశలో భారత జట్టు 3–0తో చైనాపై గెలిచింది. అదే ఫలితాన్ని నేడూ పునరావృతం చేస్తే భారత జట్టు మూడోసారి ఆసియా చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను సొంతం చేసుకుంటుంది. అంతేకాకుండా దక్షిణ కొరియా (2010, 2011లలో) జట్టు తర్వాత వరుసగా రెండుసార్లు ఈ టైటిల్ను నెగ్గిన జట్టుగా భారత్ గుర్తింపు పొందుతుంది. గతంలో భారత జట్టు 2016, 2023లలో విజేతగా నిలిచింది. 2013, 2018లలో రన్నరప్ ట్రోఫీ సాధించింది. జపాన్తో జరిగిన సెమీఫైనల్లో భారత్ పూర్తి ఆధిపత్యం చలాయించింది. మ్యాచ్ మొత్తంలో భారత జట్టుకు 12 పెనాల్టీ కార్నర్లు లభించగా... ఒక్కదానిని కూడా టీమిండియా సద్వినియోగం చేసుకోలేకపోయింది. లేదంటే భారత గెలుపు ఆధిక్యం భారీగా ఉండేది. మరోవైపు జపాన్ కేవలం ఒక్క పెనాల్టీ కార్నర్కే పరిమితమైంది. -
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్
రాజ్గిర్ (బిహార్): భారత మహిళల హాకీ జట్టు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన సెమీస్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, జపాన్పై 2-0 గోల్స్ తేడాతో గెలుపొందింది. భారత్ తరఫున వైస్ కెప్టెన్ నవ్నీత్ కౌర్ 48వ నిమిషంలో పెనాల్టీ స్ట్రోక్ను గోల్గా మలిచింది. అనంతరం లాల్రెమ్సియామి 56వ నిమిషంలో మరో గోల్ చేసింది. రేపు జరుగబోయే ఫైనల్లో భారత్ చైనాతో తలపడనుంది. ఈ టోర్నీలో అజేయంగా నిలిచిన భారత్ లీగ్ దశలో చైనాను ఓడించింది. చైనా తొలి సెమీఫైనల్లో మలేసియాపై 3-1 గోల్స్ తేడాతో గెలుపొందింది.మూడు, నాలుగు స్థానాల కోసం జరిగే మ్యాచ్లో మలేసియా, జపాన్ తలపడతాయి. ఐదు, ఆరు స్థానాల కోసం జరిగిన మ్యాచ్లో కొరియా థాయ్లాండ్ను 3-0 గోల్స్ తేడాతో ఓడించి, ఐదో స్థానాన్ని దక్కించుకుంది. -
ఫైనల్ బెర్త్ లక్ష్యంగా..
రాజ్గిర్ (బిహార్): లీగ్ దశలో ఆడిన ఐదు మ్యాచ్ల్లోనూ గెలిచి అజేయంగా నిలిచిన భారత మహిళల హాకీ జట్టు కీలక సమరానికి సమాయత్తమైంది. ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో నేడు మాజీ చాంపియన్ జపాన్తో డిఫెండింగ్ చాంపియన్ భారత్ సెమీఫైనల్లో తలపడనుంది. ఇప్పటి వరకు సాధించిన ఫలితాలతో సంబంధం లేకుండా ఈ నాకౌట్ మ్యాచ్లో గెలిచిన జట్టు టైటిల్ పోరుకు అర్హత సాధిస్తుంది. మరో సెమీఫైనల్లో పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత చైనాతో మలేసియా పోటీపడుతుంది. సొంతగడ్డపై జరుగుతున్న ఈ టోర్నీలో భారత జట్టు ఆద్యంతం ఆధిపత్యం చలాయించింది. లీగ్ దశలో భారత్ మొత్తం 26 గోల్స్ సాధించి ప్రత్యర్థి జట్లకు కేవలం 2 గోల్స్ మాత్రమే సమర్పించుకుంది. ‘డ్రాగ్ ఫ్లికర్’ దీపిక ఏకంగా 10 గోల్స్తో అదరగొట్టింది. సంగీత కుమారి నాలుగు గోల్స్... ప్రీతి దూబే మూడు గోల్స్ చేశారు. లాల్రెమ్సియామి, మనీషా చౌహాన్, నవ్నీత్ కౌర్ రెండు గోల్స్ చొప్పున సాధించారు. ఉదిత, కెప్టెన్ సలీమా టెటె, బ్యూటీ డుంగ్డుంగ్ ఒక్కో గోల్ చేశారు. మరోవైపు జపాన్ జట్టు ఓవరాల్గా 6 గోల్స్ మాత్రమే చేసింది. ఈ నేపథ్యంలో భారత్ తమ సహజశైలిలో ఆడితే వరుసగా ఆరో విజయంతో ఐదోసారి ఈ టోరీ్నలో టైటిల్ పోరుకు చేరుకుంటుంది. ఇప్పటి వరకు ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఏడుసార్లు జరగ్గా.. భారత జట్టు రెండుసార్లు చాంపియన్గా (2016, 2023) నిలిచి, మరో రెండుసార్లు (2013, 2018) రన్నరప్తో సరిపెట్టుకుంది. జపాన్ జట్టు మూడుసార్లు (2010, 2013, 2023) ఫైనల్కు చేరుకొని ఒకసారి (2010లో) విజేతగా నిలిచి, రెండుసార్లు తుది పోరులో ఓడిపోయింది. ‘మా జట్టు బలాలు ఏంటో, బలహీనతలు ఏంటో సభ్యులందరికీ తెలుసు. మా బలాన్ని మరింత పెంచుకొని, భవిష్యత్ టోర్నీల్లో మెరుగైన ప్రదర్శన చేసేందుకు ఈ టోర్నీని వినియోగించు కుంటున్నాం. ఇప్పటి వరకైతే భారత జట్టు అద్భుతంగా ఆడింది. అయితే నాకౌట్ మ్యాచ్ అయినా సెమీఫైనల్లో జపాన్ను తక్కువ అంచనా వేయకూడదు’ అని భారత జట్టు హెడ్ కోచ్ హరేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. -
చైనానూ చుట్టేసి...
రాజ్గిర్ (బిహార్): సొంతగడ్డపై భారత మహిళల హాకీ జట్టు తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఆసియా చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో వరుసగా నాలుగో విజయం నమోదు చేసింది. పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత చైనా జట్టుతో శనివారం జరిగిన నాలుగో రౌండ్ లీగ్ మ్యాచ్లో భారత జట్టు 3–0 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున సంగీత కుమారి (32వ నిమిషంలో), కెప్టెన్ సలీమా టెటె (37వ నిమిషంలో), దీపిక (60వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. మ్యాచ్ మొత్తంలో భారత జట్టుకు ఐదు పెనాల్టీ కార్నర్లు లభించాయి. ఇందులో చివరిదైన ఐదో పెనాల్టీ కార్నర్ను దీపిక గోల్గా మలిచింది. తమకు లభించిన ఏకైక పెనాల్టీ కార్నర్ను చైనా జట్టు వృథా చేసుకుంది. ఈ మ్యాచ్లో భారత జట్టుకు ఆరంభంలో గట్టిపోటీ లభించింది. తొలి రెండు క్వార్టర్లు ముగిసేసరికి ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. మూడో క్వార్టర్లో భారత క్రీడాకారిణులు ఒక్కసారిగా విజృంభించి ఐదు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ సాధించారు. చివరి నిమిషంలో దీపిక గోల్తో భారత్ విజయం సంపూర్ణమైంది. ఇతర నాలుగో రౌండ్ లీగ్ మ్యాచ్ల్లో జపాన్ 2–1తో మలేసియాపై, కొరియా 4–0తో థాయ్లాండ్పై గెలిచాయి. ఆరు జట్ల మధ్య లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచి 12 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. మూడు మ్యాచ్ల్లో నెగ్గిన చైనా జట్టు 9 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండు జట్లకు ఇప్పటికే సెమీఫైనల్ బెర్త్లు ఖరారయ్యాయి. లీగ్లో టాప్ ర్యాంక్ అధికారికంగా ఖరారు కావాలంటే నేడు జపాన్తో జరిగే చివరిదైన ఐదో రౌండ్ లీగ్ మ్యాచ్ను (సాయంత్రం గం. 4:45 నుంచి) భారత జట్టు ‘డ్రా’ చేసుకుంటే చాలు. ఇప్పటి వరకు ఈ టోర్నీలో భారత జట్టు 23 గోల్స్ చేసి 2 గోల్స్ మాత్రమే సమర్పించుకుంది. మరోవైపు చైనా జట్టు 22 గోల్స్ చేసి, 4 గోల్స్ను ప్రత్యర్థి జట్లకు కోల్పోయింది. నేడు జరిగే ఇతర చివరి రౌండ్ లీగ్ మ్యాచ్ల్లో థాయ్లాండ్తో మలేసియా (మధ్యాహ్నం గం. 12:15 నుంచి), దక్షిణ కొరియా జట్టుతో చైనా (మధ్యాహ్నం గం. 2:30 నుంచి) తలపడతాయి. -
సొంతగడ్డపై భారత్కు పరీక్ష
రాజ్గిర్ (బిహార్): పారిస్ ఒలింపిక్స్కు అర్హత పొందకపోవడం... ఆ తర్వాత ప్రొ హాకీ లీగ్లోనూ ఆడిన 16 మ్యాచ్ల్లో కేవలం రెండింటిలో విజయం సాధించడం... వెరసి ఈ ఏడాది భారత మహిళల హాకీ జట్టుకు ఏదీ కలసి రాలేదు. ఈ నేపథ్యంలో సొంతగడ్డపై వరుసగా రెండోసారి జరుగుతున్న ఆసియా మహిళల హాకీ చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు ప్రదర్శనపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. హెడ్ కోచ్ హరేంద్ర సింగ్ పర్యవేక్షణలో సలీమా టెటె సారథ్యంలో భారత బృందం ఈ టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.సోమవారం జరిగే తొలి లీగ్ మ్యాచ్లో మలేసియాతో భారత్ తలపడుతుంది. సాయంత్రం 4 గంటల 45 నిమిషాలకు ఈ మ్యాచ్ మొదలవుతుంది. గత ఏడాది రాంచీలో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో భారత జట్టు విజేతగా నిలిచింది. ఈసారీ టైటిల్ నిలబెట్టుకోవాలంటే టీమిండియా అన్ని రంగాల్లో సమష్టిగా రాణించాల్సి ఉంటుంది. పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత చైనా, జపాన్, దక్షిణ కొరియా, థాయ్లాండ్ జట్లు కూడా ఈ టోర్నీలో ఆడుతున్నాయి. తొలి రోజు జరిగే ఇతర మ్యాచ్ల్లో జపాన్తో దక్షిణ కొరియా (మధ్యాహ్నం గం. 12:15 నుంచి), చైనాతో థాయ్లాండ్ (మధ్యాహ్నం గం. 2:30 నుంచి) తలపడతాయి. సోమవారం మలేసియాతో మ్యాచ్ తర్వాత భారత జట్టు తమ తదుపరి మ్యాచ్ల్లో కొరియా (12న)తో, థాయ్లాండ్ (14న)తో, చైనా (16న)తో, జపాన్ (17న)తో ఆడుతుంది. లీగ్ దశ ముగిశాక టాప్–4లో నిలిచిన నాలుగు జట్లు సెమీఫైనల్స్ చేరుకుంటాయి. సెమీఫైనల్స్ 19న, ఫైనల్ 20న జరుగుతాయి. -
భారత మహిళల హాకీ జట్టు కొత్త కెప్టెన్ గా సలీమా... వైస్ కెప్టెన్గా నవ్నీత్
ఈ నెలలో బెల్జియం, ఇంగ్లండ్లలో జరిగే మహిళల ప్రొ హాకీ లీగ్లో బరిలోకి దిగే భారత జట్టును ప్రకటించారు. ఇన్నాళ్లూ కెప్టెన్ గా వ్యవహరించిన గోల్కీపర్ సవితా పూనియాను సారథ్య బాధ్యతల నుంచి తప్పించారు. సవిత స్థానంలో కొత్త కెపె్టన్గా జార్ఖండ్కు చెందిన 22 ఏళ్ల సలీమా టెటెను నియమించారు. కొత్త వైస్ కెప్టెన్గా ఫార్వర్డ్ నవ్నీత్ కౌర్ను ఎంపిక చేశారు. చీఫ్ కోచ్గా హరేంద్ర సింగ్ వ్యవహరిస్తారు. భారత హాకీ జట్టు: సలీమా టెటె (కెపె్టన్), నవ్నీత్ కౌర్ (వైస్ కెపె్టన్), సవితా పూనియా, బిచ్చూదేవి (గోల్కీపర్లు), నిక్కీ ప్రధాన్, ఉదిత, ఇషిక, మోనిక, జ్యోతి ఛత్రి, మహిమ, వైష్ణవి ఫాల్కే, నేహా, జ్యోతి, బల్జీత్ కౌర్, మనీషా చౌహాన్, లాల్రెమ్సియామి, ముంతాజ్ ఖాన్, సంగీత, దీపిక, షర్మిలా దేవి, ప్రీతి దూబే, వందన కటారియా, సునెలితా టొప్పో, దీపిక సోరెంగ్. -
మహిళల హాకీ మనోవేదన!
సొంతగడ్డపై అర్హత టోర్నీ... 8 జట్లలో టాప్–3లో నిలిస్తే సరిపోయే సులువైన ఫార్మాట్... ప్రత్యర్థి బలహీనమైన జపాన్... ఆ టీమ్పై గత ఐదు మ్యాచ్లలో వరుసగా గెలిచిన రికార్డు... క్వాలిఫయింగ్ మ్యాచ్లో 9 పెనాల్టీ కార్నర్ అవకాశాలు ... కానీ ఒక్క దానినీ గోల్గా మలచలేని వైఫల్యం... వెరసి వరుసగా మూడోసారి ఒలింపిక్స్కు అర్హత సాధించే అవకాశాన్ని భారత మహిళల హాకీ జట్టు కోల్పోయింది... గత టోక్యో ఒలింపిక్స్లో స్ఫూర్తిదాయక ప్రదర్శనతో నాలుగో స్థానంలో నిలిచి ఆశలు రేపిన జట్టు ఈసారి పారిస్ ఒలింపిక్స్కు అర్హత కాలేకపోయింది. రాంచీ: భారత మహిళల హాకీ జట్టు పారిస్ ఒలింపిక్స్ అవకాశాలు గల్లంతయ్యాయి. క్వాలిఫయింగ్ టోర్నీలో కనీసం మూడో స్థానంలో నిలిస్తేనే ఒలింపిక్స్కు అర్హత సాధించే అవకాశం ఉండగా, భారత్ దానిని కోల్పోయింది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో జపాన్ చేతిలో 0–1 గోల్ తేడాతో ఓటమి పాలైంది. జపాన్ తరఫున 6వ నిమిషంలో కానా ఉరాటా పెనాల్టీ కార్నర్ ద్వారా గోల్ సాధించింది. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా మన జట్టు స్కోరును సమం చేయలేకపోయింది. శుక్రవారం జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో జర్మనీ 2–0తో అమెరికాను ఓడించింది. టాప్–3లో నిలువడం ద్వారా జర్మనీ, అమెరికా, జపాన్ జట్లు పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించాయి. సమష్టి వైఫల్యం... జపాన్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడింది. రెండో నిమిషంలోనే గోల్ చేసేందుకు చేరువగా వచ్చినా భారత కీపర్ సవిత అడ్డుకోగలిగింది. అయితే మరో నాలుగు నిమిషాల వ్యవధిలోనే జపాన్కు రెండు పెనాల్టీ కార్నర్ అవకాశాలు వచ్చాయి. మొదటిసారి విఫలమైనా... రెండో సారి సవిత అడ్డంకిని దాటడంలో జపాన్ సఫలమైంది. ఆ తర్వాతి నుంచి జపాన్ తమ ఏకైక గోల్ను నిలబెట్టుకునేందుకు డిఫెన్స్పై బాగా దృష్టి పెట్టింది. దీనిని ఛేదించేందుకు భారత ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఈ క్రమంలో వరుసగా పెనాల్టి లను మన జట్టు వృథా చేసుకుంది. 12వ నిమిషంలో మోనిక అందించిన పాస్తో లాల్రెమిసియామి చేసిన ప్రయత్నంలో బంతి గోల్పోస్ట్పైనుంచి వెళ్లిపోయింది. రెండో క్వార్టర్లో రెండు పెనాల్టీ అవకాశాలను దీపిక గోల్గా మలచలేకపోయింది. ఆపై ఒత్తిడిని లోనైన ప్లేయర్లు పాస్లు ఇవ్వడం మానేసి ఆశ్చర్యకరంగా 30 గజాల సర్కిల్ నుంచే బంతిని బలంగా బాదే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వచ్చిన పెనాల్టి లను ఉదిత వృథా చేసింది. చివరి 11 నిమిషాల్లో కూడా భారత్కు 3 పెనాల్టీలు దక్కగా ఈసారి కూడా దీపిక, ఉదిత చేతులెత్తేశారు. ఆట ముగియడానికి కొద్దిసేపు ముందు జపాన్ పటిష్ట డిఫెన్స్ను ఛేదించి సలీమా టెటె గోల్పోస్ట్ వైపు దూసుకుపోయినా... ఆమె కొట్టిన షాట్ పోస్ట్కు దూరంగా వెళ్లిపోయింది. పని చేయని వ్యూహాలు... టోక్యో ఒలింపిక్స్లో భారత జట్టు అసిస్టెంట్ కోచ్గా పని చేసిన నెదర్లాండ్స్ మాజీ ప్లేయర్ జేన్కే స్కాప్మన్ ఇప్పుడు టీమ్ హెడ్ కోచ్గా ఉంది. సీనియర్లను పక్కన పెట్టి చాలా వరకు యువ క్రీడాకారిణులతోనే ఫలితాలు రాబట్టేందుకు ఆమె చేసిన ప్రయత్నం ఫలితమివ్వలేదు. రెగ్యులర్ డ్రాగ్ఫ్లికర్ ఒక్కరూ లేకుండా ఫార్వర్డ్లను పెనాల్టీ గోల్ కోసం నమ్ముకోవడం పెద్ద తప్పు. ఈ టోర్నీలో జర్మనీ మినహా ర్యాంకింగ్పరంగా మిగతా జట్లన్నీ భారత్కంటే బలహీనమైనవే. మనల్ని ఓడించిన జపాన్ జట్టుకు భారత మాజీ ఆటగాడు జూడ్ మెనెజెస్ హెడ్ కోచ్ కావడం విశేషం. -
Womens Hockey Olympic Qualifier: గెలిచి నిలిచిన భారత్
రాంచీ: పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించే అవకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో భారత మహిళల హాకీ జట్టు సత్తా చాటుకుంది. ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా న్యూజిలాండ్ జట్టుతో జరిగిన గ్రూప్ ‘బి’ రెండో లీగ్ మ్యాచ్లో భారత్ 3–1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. భారత్ తరఫున సంగీత కుమారి (1వ ని.లో), ఉదిత (12వ ని.లో), డుంగ్డుంగ్ బ్యూటీ (14వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. న్యూజిలాండ్ జట్టుకు మేగన్ హల్ (9వ ని.లో) ఏకైక గోల్ను అందించింది. మరో మ్యాచ్లో అమెరికా 2–0తో ఇటలీ జట్టును ఓడించింది. ప్రస్తుతం అమెరికా 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... భారత్, న్యూజిలాండ్ 3 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. మంగళవారం జరిగే చివరి రౌండ్ లీగ్ మ్యాచ్ల్లో అమెరికాతో న్యూజిలాండ్; ఇటలీతో భారత్ తలపడతాయి. -
పరాజయంతో మొదలుపెట్టిన భారత్.. ఆరు అవకాశాలు లభించినా..!
రాంచీ: మహిళల హాకీ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీని భారత జట్టు ఓటమితో మొదలు పెట్టింది. శనివారం జరిగిన తమ తొలి మ్యాచ్లో భారత్ 0–1 తేడాతో అమెరికా చేతిలో పరాజయంపాలైంది. అమెరికా తరఫున 16వ నిమిషంలో తామెర్ అబిగైల్ ఏకైక గోల్ నమోదు చేసింది. తొలి క్వార్టర్ హోరాహోరీ సాగి ఒక్క గోల్ కూడా నమోదు కాకపోగా, రెండో క్వార్టర్ ఆరంభంలోనే యూఎస్ ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత భారత మహిళలు ఎన్ని ప్రయత్నాలు చేసినా స్కోరును సమం చేయలేకపోయారు. దురదృష్టవశాత్తూ ఆరు పెనాల్టీ అవకాశాలు వచ్చినా... ఒక్కదానిని కూడా గోల్గా మలచలేక భారత్ వృథా చేసుకుంది. నేడు జరిగే తమ తర్వాతి మ్యాచ్లో న్యూజిలాండ్తో భారత్ తలపడుతుంది. -
జాతీయ హాకీ శిక్షణ శిబిరానికి ఆంధ్ర అమ్మాయి
వచ్చే నెలలో స్పెయిన్లో జరిగే ఐదు దేశాల హాకీ టోర్నమెంట్కు సన్నాహాల్లో భాగంగా హాకీ ఇండియా (హెచ్ఐ) ఈనెల 22 నుంచి డిసెంబర్ 10 వరకు బెంగళూరులో జాతీయ శిక్షణ శిబిరం నిర్వహించనుంది. 34 మందితో కూడిన బృందంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన గోల్కీపర్ ఇతిమరపు రజని కూడా చోటు దక్కించుకుంది. ఐదు దేశాల హాకీ టోర్నీలో భారత్తోపాటు ఐర్లాండ్, జర్మనీ, బెల్జియం, స్పెయిన్ జట్లు బరిలో ఉన్నాయి. ఈ టోర్నీ తర్వాత భారత్ జనవరిలో స్వదేశంలో జరిగే పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీలో పోటీపడుతుంది. -
Paris 2024 Olympics: పారిస్ ఒలింపిక్స్ హాకీ క్వాలిఫయింగ్ టోర్నీ: భారత్కు కఠిన సవాలు
వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్ క్రీడలకు అర్హత సాధించేందుకు భారత మహిళల హాకీ జట్టు శ్రమించాల్సి ఉంటుంది. జనవరి 13 నుంచి 19 వరకు రాంచీలో జరిగే ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోరీ్న–1కు సంబంధించిన వివరాలను అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) సోమవారం విడుదల చేసింది. ప్రపంచ ఆరో ర్యాంకర్ భారత్తోపాటు ఈ టోరీ్నలో ప్రపంచ ఐదో ర్యాంకర్ జర్మనీ, న్యూజిలాండ్ (9), జపాన్ (11), చిలీ (14), అమెరికా (15), ఇటలీ (19), చెక్ రిపబ్లిక్ (25) జట్లు బరిలో ఉన్నాయి. ఈ టోర్నీలో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు నెగ్గిన మూడు జట్లు పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధిస్తాయి. జనవరి 13 నుంచి 20 వరకు స్పెయిన్లోని వాలెన్సియాలో ఎనిమిది జట్ల (బెల్జియం, కెనడా, బ్రిటన్, ఐర్లాండ్, మలేసియా, దక్షిణ కొరియా, స్పెయిన్, ఉక్రెయిన్) మధ్య క్వాలిఫయింగ్–2 టోర్నీ జరుగుతుంది. ఈ టోర్నీ ద్వారా మరో మూడు జట్లు పారిస్ ఒలింపిక్స్కు అర్హత పొందుతాయి. -
అజేయ భారత్.. జపాన్పై గెలుపు
రాంచీలో జరుగుతున్న మహిళల హాకీ ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు మరో విజయాన్ని అందుకుంది. టోర్నీలో ఇది భారత్కు వరుసగా నాలుగో గెలుపు కావడం విశేషం. మంగళవారం హోరాహోరీగా జరిగిన పోరులో భారత్ 2–1 గోల్స్ తేడాతో జపాన్ను ఓడించింది. భారత్ తరఫున నవనీత్ కౌర్ 31వ నిమిషంలో ఫీల్డ్ గోల్ సాధించగా...47వ నిమిషంలో సంగీత కుమారి పెనాల్టీని గోల్గా మలచింది. జపాన్కు లభించిన పెనాల్టీని సద్వినియోగం చేసుకుంటూ 37వ నిమిషంలో ఉరాటా కానా గోల్ నమోదు చేసింది. భారత సీనియర్ ప్లేయర్ వందన కటారియాకు ఇది 300వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. ఈ సందర్భంగా హాకీ ఇండియా ఆమెను ఘనంగా సన్మానించింది. టోర్నీలో థాయిలాండ్, మలేసియా, చైనా, జపాన్లను ఓడించి భారత్ నేడు జరిగే మ్యాచ్లో కొరియాతో తలపడుతుంది. -
లెక్క సరిచేసిన భారత్.. చైనాపై ప్రతీకార విజయం
రాంచీ: ఆసియా మహిళల హాకీ చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు వరుసగా మూడో విజయంతో ‘హ్యాట్రిక్’ సాధించింది. చైనా జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత్ 2–1 గోల్స్ తేడాతో నెగ్గింది. భారత్ తరఫున దీపిక (15వ ని.లో), సలీమా టెటె (26వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. చైనా జట్టుకు జాంగ్ జియాకి (41వ ని.లో) ఒక గోల్ అందించింది. ఈ గెలుపుతో ఇటీవల హాంగ్జౌ ఆసియా క్రీడల్లో చైనా జట్టు చేతిలో సెమీఫైనల్లో ఎదురైన ఓటమికి భారత్ బదులు తీర్చుకుంది. -
ఇంగ్లండ్తో భారత్ మ్యాచ్ ‘డ్రా’
బార్సిలోనా: స్పెయిన్ హాకీ సమాఖ్య శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న నాలుగు దేశాల అంతర్జాతీయ హాకీ టోర్నీని భారత మహిళల జట్టు ‘డ్రా’తో ప్రారంభించింది. ఇంగ్లండ్ జట్టుతో బుధవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్ను భారత్ 1–1తో ‘డ్రా’గా ముగించింది. ఇంగ్లండ్ తరఫున హోలీ హంట్ ఏడో నిమిషంలో గోల్ చేయగా... భారత జట్టుకు లాల్రెమ్సియామి 41వ నిమిషంలో గోల్ సాధించి స్కోరును సమం చేసింది. చివరి క్వార్టర్లో రెండు జట్లకు రెండు చొప్పున పెనాల్టీ కార్నర్లు లభించినా ఫలితం లేకపోయింది. మరోవైపు ఇదే టోర్నీలో పోటీపడుతున్న భారత పురుషుల జట్టు తొలి మ్యాచ్లో స్పెయిన్ జట్టు చేతిలో 1–2తో ఓడిపోగా... నెదర్లాండ్స్ జట్టుతో జరిగిన రెండో మ్యాచ్ను 1–1తో ‘డ్రా’ చేసుకుంది. -
ఫైనల్లో టీమిండియా సంచలన విజయం.. టైటిల్ సొంతం
జపాన్లో జరిగిన మహిళల జూనియర్ ఆసియా కప్ హాకీ ఫైనల్లో సంచలనం నమోదైంది. అండర్ డాగ్స్గా బరిలోకి దిగిన భారత అమ్మాయిలు ఫోర్ టైమ్ ఛాంపియన్స్ దక్షిణ కొరియాకు షాకిచ్చారు. తుది పోరులో టీమిండియా.. 2-1 గోల్స్ తేడాతో సౌత్ కొరియాను ఖంగుతినిపించి, తొలిసారి ఆసియా కప్ టైటిల్ను సొంతం చేసుకుంది. The winning moments ✨️ Here a glimpse of the winning moments after the victory in the Final of Women's Junior Asia Cup 2023.#HockeyIndia #IndiaKaGame #AsiaCup2023 pic.twitter.com/ZJSwVI80iH — Hockey India (@TheHockeyIndia) June 11, 2023 అన్నూ 22వ నిమిషంలో గోల్ చేసి భారత్కు ఆధిక్యం అందించగా.. ఆతర్వాత సౌత్ కొరియా తరఫున 25వ నిమిషంలో పార్క్ సియో ఇయోన్ గోల్ చేసి స్కోర్ను సమం చేసింది. అనంతరం రెండో అర్ధభాగం 41వ నిమిషంలో నీలమ్ డ్రాగ్ ఫ్లిక్ ద్వారా గోల్ చేసి మరోసారి భారత్కు ఆధిక్యం అందించింది. దీని తర్వాత సౌత్ కొరియా విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ, భారత అమ్మాయిలు అద్భుతమైన డిఫెన్స్తో వారిని అడ్డుకున్నారు. 🇮🇳 2-1 🇰🇷 Our girls create HISTORY💥 India defeats 4-time champions South Korea in an intriguing final to lift its first-ever Women's Junior Hockey Asia Cup title!#Hockey 🏑| #AsiaCup2023 pic.twitter.com/bSpdo2VB5N — The Bridge (@the_bridge_in) June 11, 2023 రెండో అర్ధభాగం చివరి నిమిషం వరకు మ్యాచ్ రసవత్తరంగా సాగింది. అయినా సౌత్ కొరియా అమ్మాయిలకు ఫలితం దక్కలేదు. దీంతో జూనియర్ విభాగంలో భారత్ అమ్మాయిలు తొలిసారి ఆసియా ఛాంపియన్లుగా అవతరించారు. డబ్ల్యూటీసీ 2023 ఫైనల్లో భారత క్రికెట్ జట్టు ఓడిపోవడంతో దిగాలుగా ఉన్న అభిమానులకు ఈ విజయం ఊరటనిచ్చింది. భారత మహిళల జూనియర్ హాకీ టీమ్పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: టీమిండియాకు ఘోర పరాభవం.. కనీస ప్రతిఘటన కూడా లేకుండా చేతులెత్తేసారు..! -
నేషన్స్ కప్ బరిలో భారత హాకీ జట్టు
అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) నేషన్స్ కప్లో భారత మహిళల జట్టు తమ తొలి పోరులో కెనడాను ఢీకొంటుంది. వచ్చే ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ సీజన్కు క్వాలిఫయింగ్ టోర్నీ అయిన ఈ టోర్నీ స్పెయిన్లో డిసెంబర్ 11 నుంచి 17 వరకు జరుగుతుంది. పూల్ ‘బి’లో కెనడా, జపాన్, దక్షిణాఫ్రికాలతో భారత్ తలపడుతుంది. పూల్ ‘ఎ’లో ఆతిథ్యస్పెయిన్తో పాటు కొరియా, ఇటలీ, ఐర్లాండ్ ఉన్నాయి. చదవండి: మెద్వెదెవ్కు చుక్కెదురు -
16 ఏళ్ల తర్వాత మహిళల హాకీలో పతకం, అంబరాన్ని అంటిన సంబురాలు.. వైరల్ వీడియో
గోల్కీపర్, కెప్టెన్ సవిత పూనియా అన్నీ తానై అడ్డుగోడలా నిలబడటంతో... 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత మహిళల హాకీ జట్టు కామన్వెల్త్ గేమ్స్లో కాంస్య పతకం సాధించింది. చివరి క్షణాల్లో చేసిన పొరపాటు వల్ల షూటౌట్ దాకా వెళ్లిన భారత్... కెప్టెన్ సవిత చురుకైన ప్రదర్శన వల్లే ‘షూటౌట్’లో 2–1తో న్యూజిలాండ్పై గెలిచి మూడో స్థానంలో నిలిచింది. Watch | Indian women's hockey team celebrates their victory in the Bronze medal match in #CommonwealthGames2022 @Media_SAI@YASMinistry | @TheHockeyIndia#CWG2022 | #Cheer4India pic.twitter.com/MWGvsDsruM— DD News (@DDNewslive) August 7, 2022 ఆట 29వ నిమిషంలో సలీమా టెటె చేసి గోల్తో 1–0తో ఆఖరి దాకా ఆధిక్యంలో నిలిచిన భారత్... ఇంకొన్ని క్షణాల్లో మ్యాచ్ గెలిచేందుకు సిద్ధమైపోయింది. 30 సెకన్లలో మ్యాచ్ ముగుస్తుందనగా... కివీస్కు పెనాల్టీ కార్నర్ లభించగా ఒలీవియా మెర్రీ (60వ ని.) దాన్ని గోల్గా మలిచింది. 1–1తో సమంకాగా, షూటౌట్ అనివార్యమైంది. భారత బృందంలో తొలి షాట్లో సంగీత గురి తప్పగా... రెండు, మూడు షాట్లలో సోనిక, నవనీత్ స్కోరు చేశారు. నాలుగో షాట్లో నేహా విఫలమైంది. న్యూజిలాండ్ జట్టులో తొలి షాట్ను మేగన్ హల్ మాత్రమే గోల్పోస్ట్లోకి తరలించగా... మిగతా నాలుగు షాట్లను రాల్ఫ్ హోప్, రోజ్ టైనన్, కేటీ డోర్, ఒలీవియా షనన్ల షాట్లను సవిత అడ్డుకుంది. కామన్వెల్త్ గేమ్స్ మహిళల హాకీలో భారత్కిది మూడో పతకం. 2002 గేమ్స్లో స్వర్ణం నెగ్గిన టీమిండియా 2006లో రజతం సాధించింది. -
పట్టు వదలని భారత మహిళా హాకీ జట్టు.. సెమీస్లో రిఫరీ దెబ్బకొట్టినా కాంస్యం సొంతం
CWG 2022: బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పతకాల వేటలో దూసుకుపోతుంది. తొమ్మిదో రోజు వరకు మొత్తం 40 పతాకలు (13 స్వర్ణాలు, 11 రజతాలు, 16 కాంస్యాలు) సాధించిన భారత్.. పదో రోజు ఆరంభంలోనే రెండు స్వర్ణాలు, మరో కాంస్యం సాధించి పతకాల సంఖ్యను 43కు పెంచుకుంది. మహిళల బాక్సింగ్ 48 కేజీల మినిమమ్ వెయిట్ విభాగంలో నీతూ గంగాస్, పురుషుల బాక్సింగ్ 51 కేజీల విభాగంలో అమిత్ పంగాల్ పసిడి పంచ్ విసరగా.. మహిళల హాకీలో భారత్ కాంస్యం చేజిక్కించుకుంది. సెమీస్లో (ఆస్ట్రేలియా) అంపైర్ తప్పిదం కారణంగా స్వర్ణం లేదా రజతం గెలిచే అవకాశాన్ని తృటిలో కోల్పోయిన భారత మహిళా హాకీ జట్టు.. కాంస్య పతక పోరులో అసమాన పోరాట పటిమ కనబర్చి పెనాల్టీ షూటౌట్లో న్యూజిలాండ్పై 2-1తేడాతో విజయం సాధించి కాంస్యం సొంతం చేసుకుంది. మ్యాచ్ కొద్ది సెకెన్లలో (18 సెకెన్లలో) ముగుస్తుందనగా న్యూజిలాండ్ గోల్ చేసి 1-1తో స్కోర్ను సమం చేయడంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. పెనాల్టీ షూటౌట్లో భారత్ తరఫున సోనికా, నవ్నీత్ కౌర్ గోల్స్ సాధించగా.. కివీస్ తరఫున మెగాన్ హల్ మాత్రమే గోల్ చేయగలిగింది. చదవండి: Commonwealth Games 2022: ‘కాలం’ కలిసి రాలేదు -
ఆట ఏదైనా ఒక్కటే.. అంపైర్ల చీటింగ్ మాత్రం మారదు
కామన్వెల్త్ గేమ్స్లో భారత మహిళల హాకీ జట్టు శుక్రవారం ఆస్ట్రేలియా మహిళలతో జరిగిన సెమీఫైనల్లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. పెనాల్టీ షూటౌట్లో భాగంగా ఆసీస్ చేతిలో భారత్ 3-0తో పరాజయం చవిచూసింది. అయితే పెనాల్టీ షూటౌట్ ప్రారంభానికి జరిగిన ఒక చిన్న తప్పిదం భారత మహిళలను ఓటమి వైపు నడిపించింది. విషయంలోకి వెళితే.. మ్యాచ్ ముగిసే సమయానికి ఇరుజట్లు 1-1తో సమంగా నిలిచాయి. దీంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. ఆస్ట్రేలియా డిపెండర్ అంబ్రోషియా మలోనే షూటౌట్కు సిద్దమైంది. ఆమె షాట్ ఆడగా.. భారత గోల్కీపర్ సవితా అడ్డుకుంది. అలా ఆసీస్ ఒక పెనాల్టీ వృథా చేసుకుందని మనం సంతోషించేలోపే అంపైర్ మధ్యలో దూరింది. సారీ.. షూటౌట్ క్లాక్ టైంలో తప్పిదం ఉందని.. మళ్లీ ప్రారంభించాలని చెప్పింది. అప్పటికే షూటౌట్ చేయడానికి వచ్చిన భారత క్రీడాకారిణికి విషయం చెప్పి అక్కడి నుంచి పంపించేసి మల్లీ అంబ్రోషియాను పిలిచింది. తొలిసారి మిస్ అయిన అంబ్రోషియా ఈసారి మాత్రం గురి తప్పలేదు. ఆ తర్వాత ఆస్ట్రేలియా వరుసగా మూడు గోల్స్ కొట్టగా.. భారత్ మాత్రంఒక్క గోల్ చేయలేకపోయింది. అలా భారత మహిళల హాకీ జట్టు ఫైనల్ చేరడంలో విఫలమైంది. అయితే పెనాల్టీ షూటౌట్ సమయంలో అంపైర్ విధానంపై అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆడుతున్నది ఒక సెమీఫైనల్ మ్యాచ్ అని మరిచిపోయి.. క్లాక్టైం మిస్టేక్ అని చెప్పడం సిల్లీగా ఉందని.. అంపైర్ కావాలనే ఇలా చేసిందేమో అంటూ కామెంట్స్ చేశారు. ఇదే విషయమే టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ కూడా అంపైర్ తీరుపై ఘాటుగా స్పందించాడు. ''ఆస్ట్రేలియాకు పెనాల్టీ మిస్ కాగానే అంపైర్ పరిగెత్తుకొచ్చి.. సారీ క్లాక్ ఇంకా స్టార్ట్ చెయ్యలేదు.. మళ్లీ ఆరంభిద్దామా అని సింపుల్గా చెప్పేసింది. అంపైర్లు ఇలా ఎందుకుంటారో అర్థం కావడం లేదు. క్రికెట్.. హాకీ ఇలా ఏదైనా ఒక్కటే.. అంపైర్లు తమకుండే సూపర్ పవర్తో ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటారు. ఇలాంటివి క్రికెట్లో బాగా జరిగేవి.. అందుకే మేం హాకీలోకి కూడా త్వరలోనే ఎంటరవుతాం.. అమ్మాయిలు.. ఓడిపోయారు పర్లేదు.. మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది.'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. మరోవైపు భారత్- ఆస్ట్రేలియా వుమెన్స్ మధ్య జరిగిన సెమీస్ మ్యాచ్పై విమర్శలు పెరగడంతో అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ కూడా స్పందించింది. ''కామన్వెల్త్ గేమ్స్లో భారత్- ఆస్ట్రేలియా సెమీఫైనల్లో షూటౌట్ చిన్న తప్పిదం వల్ల క్లాక్ సెట్ చేయకముందే ప్రారంభమయింది. అందుకే మళ్లీ ప్రారంభించాం. ఈ తప్పిదానికి మేం క్షమించమని కోరుతున్నాం. ఇలాంటివి జరగకుండా జాగ్రత్తపడతాం.'' అని కామెంట్ చేసింది. కాగా సెమీస్లో ఓడినప్పటికి భారత మహిళల హాకీ జట్టుకు కాంస్య పతక పోరుకు సిద్ధమవనుంది. మరో సెమీఫైనల్లో ఇంగ్లండ్ న్యూజిలాండ్పై 2-0 తేడాతో విజయం సాధించి ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. ఇక కాంస్య పతక పోరులో భాగంగా ఆదివారం భారత్, న్యూజిలాండ్ మహిళల జట్లు పోటీ పడనున్నాయి. Penalty miss hua Australia se and the Umpire says, Sorry Clock start nahi hua. Such biasedness used to happen in cricket as well earlier till we became a superpower, Hockey mein bhi hum jald banenge and all clocks will start on time. Proud of our girls 🇮🇳pic.twitter.com/mqxJfX0RDq — Virender Sehwag (@virendersehwag) August 6, 2022 My heart goes out to the Indian women’s hockey team who fought like bravehearts against Australia. No shame in losing in penalties to the Aussies. Our ladies gave everything on the pitch. As fans, we cannot expect more. Really proud of the this team. 🇮🇳🏑❤️ — Viren Rasquinha (@virenrasquinha) August 5, 2022 చదవండి: 'నా సుత్తిని అవలీలగా ఎత్తేస్తుందేమో'.. మీరాబాయిపై 'థోర్' ప్రశంసలు -
పతకం దిశగా దూసుకుపోతున్న భారత అమ్మాయిలు
కామన్వెల్త్ క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు పతకం దిశగా దూసుకుపోతుంది. క్వార్టర్ ఫైనల్లో భారత అమ్మాయిలు కెనడాపై 3-2 తేడాతో విజయం సాధించి సెమీస్లో అడుగుపెట్టారు. ఈ విజయంతో భారత్ ఆరు పాయింట్లతో గ్రూప్-ఏలో రెండో స్థానంలో నిలిచింది. భారత్ గ్రూప్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్ల్లో మూడింట విజయం సాధించింది. తొలి మ్యాచ్లో ఘనాపై 5-0 తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించిన భారత్.. ఆతర్వాతి మ్యాచ్లో వేల్స్పై 3-1 తేడాతో గెలుపొందింది. అయితే ఇంగ్లండ్తో తదుపరి జరిగిన మ్యాచ్లో 1-3 తేడాతో ఓటమిపాలవ్వడంతో భారత జైత్రయాత్రకు బ్రేక్ పడింది. అనంతరం కెనడాతో మ్యాచ్లో పుంజుకున్న భారత అమ్మాయిలు.. అద్భుతంగా రాణించి సెమీస్ బెర్తు ఖరారు చేసుకున్నారు. సలీమా టెటె, నవనీత్ కౌర్, లాల్రెమ్సియామి తలో గోల్ సాధించారు. ఈ విజయంతో భారత్.. కెనడాతో సమానంగా ఆరు పాయింట్లు సాధించినప్పటికీ, ఎక్కువ గోల్స్ చేసిన కారణంగా కెనడా గ్రూప్-ఏలో అగ్ర జట్టు హోదాలో సెమీస్లో అడుగుపెట్టింది. ఇదిలా ఉంటే, ఆరో రోజు లవ్ప్రీత్ సింగ్ కాంస్యం సాధించడంతో భారత్ పతకాల సంఖ్య 14కు చేరింది. మరో 3 పతకాలు భారత జాబితాలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాయి. తదుపరి మ్యాచ్ల్లో భారత అథ్లెట్లు ఓడినప్పటికీ కనీసం ఓ రజతం, రెండు కాంస్య పతకాలు భారత్ ఖాతాలో చేరనున్నాయి. మహిళల జూడో 78 కేజీల విభాగంలో ఫైనల్కు చేరిన తులికా మాన్ సిల్వర్ మెడల్పై కర్చీఫ్ వేయగా.. పురుషుల బాక్సింగ్ 57 కేజీల విభాగంలో హుసముద్దీన్ ముహమ్మద్ కనీసం కాంస్యం, మహిళల 45-48 కేజీల విభాగంలో నీతు మరో కాంస్యాన్ని ఖరారు చేశారు. చదవండి: CWG 2022: మరో మూడు పతకాలు ఖాయం చేసిన భారత అథ్లెట్లు -
అదరగొట్టిన భారత మహిళల హాకీ జట్టు.. వరుసగా రెండో విజయం
కామన్వెల్త్ గేమ్స్లో భారత మహిళల హాకీ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. పూల్-ఏలో భాగంగా వేల్స్తో జరిగిన మ్యాచ్లో భారత్ మహిళల జట్టు 3-1 తేడాతో ఘన విజయం అందుకుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ శనివారం అర్థరాత్రి జరిగింది. ఈ విజయంతో భారత మహిళల జట్టు ఆరు పాయింట్లతో పూల్-ఏలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. భారత్ తరపున వందనా కటారియా(ఆట 26, 48వ నిమిషం), గుర్జీత్ కౌర్(ఆట 28వ నిమిషం)లో గోల్స్ చేయగా.. వేల్స్ తరపున గ్జెన్నా హ్యూజెస్(ఆట 45వ నిమిషం) గోల్ చేసింది. ఇక భారత్ తమ తర్వాతి మ్యాచ్ ఆగస్టు 2న ఇంగ్లండ్తో ఆడనుంది. ఇక టోక్యో ఒలింపిక్స్లో మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నప్పటికి భారత మహిళల జట్టు నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకం చేజార్చుకుంది. కానీ ఈసారి ఎలాగైనా పతకం సాధించాలనే దృడ సంకల్పంతో ఉంది. మరోవైపు ఎలాగైనా స్వర్ణం సాధించాలని బరిలోకి దిగన భారత పురుషుల హాకీ జట్టు ఇవాళ ఘనాతో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. టోక్యో ఒలింపిక్స్లో భారత పురుషుల జట్టు కాంస్యం గెలిచిన సంగతి తెలిసిందే. GOAL! And the avalanche of goals continues with #TeamIndia's third goal. IND 3:1 WAL #IndiaKaGame #HockeyIndia #B2022 #Birmingham2022 @CMO_Odisha @sports_odisha @IndiaSports @Media_SAI — Hockey India (@TheHockeyIndia) July 30, 2022 -
ఎట్టకేలకు ఒక విజయం.. ప్రపంచకప్లో భారత్ బోణీ
థెరస (స్పెయిన్): మహిళల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో భారత జట్టు ఎట్టకేలకు ఒక విజయాన్ని సాధించింది. ఇప్పటికే పతకం రేసుకు దూరమైన అమ్మాయిల జట్టు వర్గీకరణ మ్యాచ్లో షూటౌట్లో కెనడాను కంగుతినిపించింది. 9 నుంచి 16 స్థానాల కోసం మంగళవారం జరిగిన ఈ మ్యాచ్లో సవిత పూనియా సేన షూటౌట్లో 3–2తో విజయం సాధించింది. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్లో నిర్ణీత సమయం ముగిసే సమయానికి ఇరు జట్లు 1–1తో సమ ఉజ్జీలుగా నిలిచాయి. కెప్టెన్ సవిత గోల్పోస్ట్ వద్ద అడ్డుగోడగా మారి షూటౌట్లో భారత్ను గెలిపించింది. షూటౌట్ సహా మ్యాచ్ మొత్తమ్మీద ఆమె ఏకంగా ఆరు గోల్స్ను చాకచక్యంగా అడ్డుకుంది. మ్యాచ్ ఫలితాన్ని తేల్చిన షూటౌట్లో భారత్ తరఫున నవ్నీత్ కౌర్, సోనిక, నేహా గోల్స్ సాధించారు. 11వ నిమిషంలోనే మ్యాడిలైన్ సికో కెనడా తరఫున ఖాతా తెరిచింది. ఆ తర్వాత పలు పెనాల్టీ కార్నర్ అవకాశాలు వచ్చినా భారత రక్షణ పంక్తి సమర్థంగా అడ్డుకుంది. అయితే రెండు క్వార్టర్లు ముగిసినా గోల్ చేయడంలో వెనుకబడిపోయిన భారత అమ్మాయిలపై ఒత్తిడి పెరిగింది. మూడో క్వార్టర్లో స్కోరును సమం చేసేందుకు సువర్ణావకాశం వచ్చింది. కానీ నవ్జ్యోత్ కౌర్ కొట్టిన షాట్ గోల్పోస్ట్ బార్ను తాకుతూ బయటికి వెళ్లిపోయింది. మరోవైపు కెనడా ఫార్వర్డ్ లైన్ దాడులను కొనసాగించింది. ఈ క్రమంలో ప్రత్యర్థి జట్టుకు మరో పెనాల్టీ కార్నర్ లభించగా, సవిత అసాధారణ డైవింగ్తో వారి ప్రయత్నాన్ని విఫలం చేసింది. ఎట్టకేలకు భారత అమ్మాయిలు ఆఖరి క్వార్టర్లో అది కూడా మ్యాచ్ ముగిసే సమయంలో కెనడా గెలుపుదిశను మార్చేశారు. 58వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ను గోల్పోస్ట్ దిశగా గుర్జీత్ కౌర్ కొట్టిన షాట్ రీబౌండ్ కాగా సలిమా టేటే సమయస్ఫూర్తితో గోల్గా మలిచింది. దీంతో స్కోరు 1–1తో సమమై షూటౌట్కు దారితీసింది. బుధవారం 9 నుంచి 12 స్థానాల కోసం జరిగే పోరులో భారత్... జపాన్తో తలపడుతుంది. -
ప్రపంచకప్ బరిలో నుంచి టీమిండియా ఔట్
భారీ అంచనాల నడుమ ప్రపంచకప్ బరిలోకి దిగిన భారత మహిళల హాకీ జట్టుకు మరోసారి నిరాశే ఎదురైంది. ఆతిధ్య స్పెయిన్తో జరిగిన కీలక మ్యాచ్లో సవిత పూనియా నేతృత్వంలోని టీమిండియా 0-1 తేడాతో పరాజయంపాలైంది. ఫలితంగా కనీసం క్వార్టర్స్కు కూడా చేరకుండానే మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్లో భారత అమ్మాయిలు చివరి నిమిషం వరకు పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ] Full-time ESP 1-0 IND 📲 - Watch the games LIVE on https://t.co/igjqkvzwmV in 🇨🇦🇰🇷🇨🇳🇯🇵🇿🇦#HWC2022 #HockeyEquals #ESPvIND pic.twitter.com/SrxzXOiU3J — International Hockey Federation (@FIH_Hockey) July 10, 2022 మ్యాచ్ మరికాసేపట్లో ముగుస్తుందనగా.. మార్తా సేగు గోల్ చేసి స్పెయిన్ను గెలిపించింది. ఈ విజయంతో స్పెయిన్.. న్యూజిలాండ్, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, ఇంగ్లండ్ జట్లతో పాటు క్వార్టర్స్కు అర్హత సాధించింది. క్వార్టర్స్ మ్యాచ్లు రేపటి (మంగళవారం) నుంచి ప్రారంభమవుతాయి. జులై 16, 17 తేదీల్లో సెమీస్.. 18న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. చదవండి: Shooting World Cup: ఎయిర్ రైఫిల్ ఈవెంట్ ఫైనల్లో అర్జున్, పార్థ్ -
Hockey World Cup 2022: భారత్ను ఆదుకున్న వందన కటారియా
ప్రపంచకప్ మహిళల హాకీ టోర్నీలో భారత జట్టు వరుసగా రెండో లీగ్ మ్యాచ్ను ‘డ్రా’గా ముగించింది. నెదర్లాండ్స్లో చైనా జట్టుతో మంగళవారం జరిగిన పూల్ ‘బి’ లీగ్ మ్యాచ్ను భారత్ 1–1తో ‘డ్రా’ చేసుకుంది. చైనా తరఫున జియాలి జెంగ్ (26వ నిమిషంలో) గోల్ చేయగా... 45వ నిమిషంలో వందన కటారియా గోల్తో భారత్ స్కోరును సమం చేసింది. -
రెండో విజయంతో క్వార్టర్స్లోకి భారత్
పాట్చెఫ్స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా): ప్రపంచకప్ జూనియర్ మహిళల హాకీ టోర్నమెంట్లో భారత జట్టు రెండో విజయం నమోదు చేసింది. జర్మనీ జట్టుతో ఆదివారం జరిగిన పూల్ ‘డి’ లీగ్ మ్యాచ్లో భారత్ 2–1 గోల్స్ తేడాతో గెలిచి క్వార్టర్ ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. భారత్ తరఫున లాల్రెమ్సియామి (2వ ని.లో), ముంతాజ్ ఖాన్ (25వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. మంగళవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్లో మలేసియాతో భారత్ తలపడుతుంది. -
భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్గా సవిత
న్యూఢిల్లీ: భారత హాకీ రెగ్యులర్ కెప్టెన్ రాణి రాంపాల్ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) మహిళల ప్రొ లీగ్లో స్పెయిన్తో జరిగే పోటీలకూ దూరమైంది. దీంతో సీనియర్ గోల్కీపర్ సవితకే జట్టు పగ్గాలు అప్పగించారు. సొంతగడ్డపై జరిగే లీగ్ పోరులో సవిత నేతృత్వంలోని భారత మహిళల జట్టు స్పెయిన్ను ఎదుర్కొంటుంది. ఈ నెల 26, 27 తేదీల్లో భువనేశ్వర్లో ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్లు జరుగనున్నాయి. మహిళల హాకీ జట్టు: సవిత (కెప్టెన్), దీప్గ్రేస్ ఎక్కా, గుర్జీత్ కౌర్, నిక్కీ ప్రధాన్, ఉదిత, ఇషిక చౌదరి, రజని, బిచుదేవి, నిషా, సలిమా టేటే, సుశీలా చాను, జ్యోతి, మోనిక, నేహా, నవ్జ్యోత్ కౌర్, నమిత టొప్పొ, వందన కటారియా, షర్మిలా, నవ్నీత్ కౌర్, లాల్రెమ్సియామి, సంగీత, రాజ్విందర్ కౌర్. స్టాండ్బైలు: రష్మిత, అక్షత, సోనిక, మరియాన, ఐశ్వర్య. -
ఏపీ హాకీ ప్లేయర్ రజనికి ప్రోత్సహకాలు
-
హాకీ క్రీడాకారిణి రజనికి ప్రోత్సాహకాలు ప్రకటించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: టోక్యో ఒలింపిక్స్లో పాల్గొన్న హాకీ క్రీడాకారిణి ఇ.రజనికి సీఎం వైఎస్ జగన్ పలు ప్రోత్సాహకాలు ప్రకటించారు. రూ.25 లక్షల నగదుతోపాటు ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ను రజని, ఆమె తల్లిదండ్రులు మంగళవారం కలిశారు. రజనిని సీఎం జగన్ సత్కరించి జ్ఞాపిక బహూకరించారు. గత ప్రభుత్వంలో రజనికి ప్రకటించిన పెండింగ్ బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. తిరుపతిలో వెయ్యి గజాల నివాస స్థలం, నెలకు రూ.40 వేల ఇన్సెంటివ్ ఇవ్వాలని ఆదేశాలిచ్చారు. (చదవండి: దివ్యాంగుల జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపికైన వైఎస్సార్ జిల్లా కుర్రాడు) రాష్ట్రంలో నూతన క్రీడా పాలసీ ఒలింపిక్స్ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్రంలో నూతన క్రీడా పాలసీని తీసుకురానున్నట్టు పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్) తెలిపారు. పాఠశాల దశ నుంచే ఒత్తిడి లేని విద్యనందిస్తూ క్రీడల్లోనూ విద్యార్థులను ప్రోత్సహించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. హాకీ క్రీడాకారిణి ఇ.రజినిని రాష్ట్ర సచివాలయంలో బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఒలింపిక్స్ హాకీ జట్టులో దక్షిణ భారతదేశం నుంచి పొల్గొన్న ఏకైక క్రీడాకారిణి రజని అని కొనియాడారు. రజనికి సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన ప్రోత్సాహకాలతోపాటు గత ప్రభుత్వాలు ప్రకటించి విస్మరించిన రూ.67.50 లక్షల నగదు ప్రోత్సాహకాలను సైతం విడుదల చేయనున్నట్టు చెప్పారు. క్రీడాకారిణి రజిని మాట్లాడుతూ.. 44 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో భారత మహిళా హాకీ జట్టు ప్రదర్శన అందరినీ ఆకట్టుకుందన్నారు. తమ జట్టు పతకానికి కేవలం ఒక అడుగు దూరంలోనే నిలిచిందని, త్వరలో జరగబోయే ఏషియన్, కామన్వెల్త్ గేమ్స్కు సన్నద్ధమవుతున్నాని చెప్పారు. హాకీలో మరింతగా రాణించేందుకు ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, రాష్ట్ర పర్యాటక, క్రీడల శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్ భార్గవ్, శాప్ ఎండీ ఎన్.ప్రభాకర్రెడ్డి, రజని తల్లిదండ్రులు పాల్గొన్నారు. 110 అంతర్జాతీయ మ్యాచ్లు.. 6 పతకాలు రజని స్వగ్రామం చిత్తూరు జిల్లా యనమలవారిపల్లె. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఒలింపిక్స్ హాకీలో పాల్గొన్న ఏకైక క్రీడాకారిణిగా ఆమె ప్రత్యేక గుర్తింపు పొందారు. 2016లో రియో ఒలింపిక్స్తో పాటు టోక్యో ఒలింపిక్స్–2020లో కూడా ఆమె పాల్గొన్నారు. 110 అంతర్జాతీయ హకీ మ్యాచ్లు ఆడి సత్తా చాటుకున్నారు. 2010 ఏషియన్ చాంపియన్ ట్రోఫీలో కాంస్యం, 2013 మలేషియాలో జరిగిన ఆసియా కప్లో కాంస్యం, అదే ఏడాది జపాన్లో జరిగిన ఏషియన్ చాంపియన్ ట్రోఫీలో రజతం, 2016 సింగపూర్లో జరిగిన ఏషియన్ చాంపియన్ ట్రోఫీ, 2017 జపాన్లో జరిగిన ఆసియా కప్లో బంగారు పతకాలు, 2018 జకార్తాలో జరిగిన ఏషియన్ గేమ్స్లో రజత పతకాలు సాధించింది. -
Tokyo Olympics: నాలుగులోనూ వెలుగు
విశ్వ క్రీడల్లో వరుస పరాజయాలతో మొదలైన భారత మహిళల హాకీ జట్టు ఆట జేజేలతో ముగిసింది. అలా అని మన హాకీ జట్టేమీ పతకం గెలవలేదు. కానీ చరిత్ర సృష్టించింది... ఒలింపిక్స్లో తొలిసారి సెమీస్ బరిలో నిలిచి! మనసుల్ని గెలిచింది.... కాంస్యం కోసం పోరాడి! ఇక్కడా మళ్లీ భారత్ ఓడి ఉండవచ్చు. కానీ మరీ బాధపడాల్సిన పరాజయమైతే కాదు... పరాభవం అంతకన్నా కాదు... త్రుటిలో చేజారిన విజయం. పతకం రాకున్నా వేనోళ్లా ప్రశంసలు వస్తున్నాయన్నది నిజం... అడుగడుగునా అమ్మాయిల పోరాటం అద్వితీయం. అందుకే జాతి యావత్తు జేజేలు పలుకుతోంది. ఒలింపిక్స్లో మూడో ప్రయత్నంలోనే తమ అత్యుత్తమ ప్రదర్శనతో నాలుగో స్థానం సంపాదించిన భారత మహిళల జట్టు ప్రదర్శన కాంస్య పతకంలాంటిదేనని దేశం గర్వపడుతోంది. టోక్యో: చరిత్ర సృష్టించిన భారత మహిళల హాకీ జట్టు పోరాటం చివరికి నిరాశగా ముగిసింది. కానీ బంగారంలాంటి ప్రదర్శనతో కోట్ల మంది మనసుల్ని గెలిచింది. కాంస్యం చేజారిందనే బాధ ఉంది. అయితే కాంస్యం కూడా ‘వీరి మెడలో ఎందుకు పడలేదు’ అనుకునేలా మన జట్టు పోరాడింది. మూడో స్థానం కోసం శుక్రవారం జరిగిన మ్యాచ్లో భారత అమ్మాయిల జట్టు 3–4తో బ్రిటన్ చేతిలో పోరాడి ఓడింది. భారత్ తరఫున గుర్జీత్ సింగ్ (25వ, 26వ ని.లో) రెండు గోల్స్, వందన కటారియా (29వ ని.లో) ఒక గోల్ చేశారు. బ్రిటన్ జట్టుకు ఎలీనా (18వ ని.లో), సారా రాబర్ట్సన్ (24వ ని.లో), వెబ్ హోలీ పెర్న్ (35వ ని.లో), గ్రేస్ బాల్స్డన్ (48వ ని.లో) ఒక్కో గోల్ అందించారు. మనదే ఆధిపత్యం... తొలి క్వార్టర్లో బ్రిటన్ గోల్ కోసం చేసిన ప్రయత్నాలన్నీ భారత మహిళలు గట్టిగా బదులు చెప్పడంతో నిష్ఫలమయ్యాయి. ప్రత్యర్థి దాడుల్ని భారత డిఫెండర్లు సమర్థంగా అడ్డుకున్నారు. అక్కడి నుంచి గోల్పోస్ట్ను సమీపిస్తే సవిత ఊరుకోలేదు. రెండు పెనాల్టీ కార్నర్లను, మరో రెండు ఫీల్డ్ గోల్స్ను సవిత చాకచక్యంగా ఆపేసింది. దీం తో గోల్ లేకుండా ఈ క్వార్టర్ ముగిసింది. ఎట్టకేలకు రెండో క్వార్టర్లో బ్రిటన్ ప్లేయర్లు ఎలీనా రేయ ర్, సారా రాబర్ట్సన్ లక్ష్యాలు ఫలించాయి. కానీ ఈ ఆనందం మరో ఐదు నిమిషాలకే ఆవిరైంది. ఈ క్వార్టర్తో తొలి అర్ధభాగం ముగిసేసరికి భారత్ 3– 2తో పైచేయి సాధించింది. అది కూడా 5 నిమిషాల వ్యవధిలోనే భారత్ మూడు గోల్స్ సాధించింది. కలిసిరాని మూడో క్వార్టర్ అయితే మూడో క్వార్టర్లో హోలీ పియర్న్ వెబ్ గోల్ చేయడంతో స్కోరు 3–3 వద్ద సమమైంది. ఈ క్వార్టర్లో మనకు లభించిన 3 పెనాల్టీ కార్నర్లను గుర్జీత్ (రెండుసార్లు), దీప్ ఎక్కా గ్రేస్ గోల్గా మలచలేకపోవడం భారత్కు ప్రతికూలించింది. చివరి క్వార్టర్లో బ్రిటన్ పకడ్బందీగా కదంతొక్కడం... ఇదే సమయంలో ఉదిత ఎల్లో కార్డుతో, షర్మిలా గ్రీన్ కార్డ్తో కాసేపు ఆటకు దూరమవడం బ్రిటన్ పనిని సులువు చేసింది. 48వ నిమిషంలో దక్కిన పెనాల్టీ కార్నర్ను గ్రేస్ బాల్స్డన్ గోల్పోస్ట్పై గురిపెట్టడంతో భారత్ 3–4తో వెనుకబడింది. ఆ తర్వాత తుదికంటా అమ్మాయిలు పోరాడినా భారత్కు ఫలితం దక్కలేదు. రూ. అర కోటి నజరానా... కాంస్య పతక పోరులో పోరాడి ఓడిన భారత మహిళల హాకీ జట్టు సభ్యులకు భారీ నజరానాలే అందనున్నాయి. ఈ జట్టులో హరియాణాకు చెందిన 9 మంది క్రీడాకారిణులకు రూ. 50 లక్షల చొప్పున నగదు ప్రోత్సాహకం అందజేస్తామని ఆ రాష్ట్ర సీఎం మనోహర్లాల్ ఖట్టర్ తెలిపారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కూడా తమ ప్లేయర్లు సలిమా టేటే, నిక్కీ ప్రధాన్లకు రూ. 50 లక్షల నగదు పురస్కారం ఇస్తామని సీఎం వెల్లడించారు. ఇక చాలు...నే వెళ్తా కోచ్ జోర్డ్ మరీన్ రాజీనామా భారత మహిళల జట్టు చీఫ్ కోచ్ జోర్డ్ మరీన్ మ్యాచ్ ముగిసిన వెంటనే తన పదవికి రాజీనామా చేశారు. ‘కొనసాగే ఆలోచనలేవీ లేదు. ఇదే నా ఆఖరి మ్యాచ్. ఈ జట్టుతో నా ప్రయాణం సంతృప్తికరంగానే సాగింది. మూడున్నరేళ్లుగా కుటుంబానికి దూరంగా ఉన్న నేను ఇప్పుడు పూర్తిగా కుటుంబానికే అంకితమవ్వాలనుకుంటున్నాను’ అని వర్చువల్ మీడియా సమావేశంలో తెలిపారు. పొడిగింపు ఇస్తామన్నా కోచ్ నిరాకరించినట్లు తెలిసింది. మీరెవరూ ఏడవొద్దు ఫోన్లో ఓదార్చిన ప్రధాని మోదీ కాంస్యం చేజార్చుకున్న మహిళల హాకీ జట్టు పోరాటాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ఫోన్లో భారత జట్టు సభ్యులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా బాధను జీర్ణించుకోలేక విలపిస్తున్న అమ్మాయిల్ని వారించారు. ఏడిచే పని చేయలేదని జాతి యావత్ గర్వపడే పోరాటం చేశారని ప్రశంసించారు. ‘మీరంతా బాగా ఆడారు. మీ కృషికి పతకం దక్కలేదేమో కానీ కోట్ల మంది చిన్నారులకు మీ నుంచి ఎంతో ప్రేరణ దక్కింది. కోచ్, జట్టు సభ్యులందరికీ అభినందనలు’ అని ఫోన్లో మాట్లాడుతుండగానే అమ్మాయిలు ఏడ్చారు. ఇది గమనించిన ప్రధాని ‘ప్లీజ్ మీరెవరూ ఏడవొద్దు. మొత్తం దేశం మీ ప్రదర్శన పట్ల గర్విస్తోంది. మీ వల్లే మన జాతీయ క్రీడకు మళ్లీ పునరుత్తేజం వచ్చింది’ అని అన్నారు. -
'భారత మహిళల హాకీ జట్టుతో నా ప్రయాణం ముగిసింది'
టోక్యో: భారత మహిళల హాకీ ప్రధాన కోచ్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు జోర్డ్ మారిజైన్ స్పష్టం చేశాడు. టోక్యో ఒలింపిక్స్లో భాగంగా బ్రిటన్తో జరిగిన కాంస్య పతక పోరులో భారత్ ఓటమి అనంతరం మారిజైన్ ట్విటర్ వేదికగా ప్రకటించాడు. ''బ్రిటన్తో జరిగిన మ్యాచ్ నా చివరి అసైన్మెంట్. ఈరోజుతో భారత్ మహిళల హాకీ టీంతో నా ప్రయాణం ముగిసింది.ఇంతకాలం మాకు మద్దతిచ్చిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. మేం ఈరోజు ఒలింపిక్స్లో మెడల్ గెలవలేకపోవచ్చు.. కానీ అంతకంటే పెద్ద విజయాన్ని అందుకున్నాం. అదే అభిమానుల ప్రేమాభిమానాలు. ప్రాభవం కోల్పోతున్న స్థితి నుంచి పతకం కోసం పోరాడే స్థాయికి చేరుకున్నాం. ఒలింపిక్స్లో భారత మహిళల హాకీ జట్టు అందరి అంచనాలకు భిన్నంగా రాణించింది. వారి ఆటతీరుతో ఈరోజు లక్షలాది అమ్మాయిల మనసు గెలుచుకున్నాం'' అంటూ ఉద్వేగంతో ట్వీట్ చేశాడు. We did not win a medal, but I think we have won something bigger. We have made Indians proud again and we inspired millions of girls that dreams CAN come true as long as you work hard for it and believe it! Thanks for all the support! 🇮🇳 — Sjoerd Marijne (@SjoerdMarijne) August 6, 2021 కాగా నెదర్లాండ్స్కు చెందిన మారిజైన్ 2017 నుంచి భారత మహిళల హాకీ జట్టుకు కోచ్గా వ్యవహరిస్తున్నాడు. అతని పనితీరుపై ముగ్దులైన భారత హాకీ సంఘం మెన్స్ టీమ్కు కోచ్గా వ్యవహరించమని అడిగింది. 2018 కామన్వెల్త్ గేమ్స్ తర్వాత మళ్లీ టీమిండియా మహిళల హాకీ జట్టును మరింత మెరుగ్గా తయారు చేసే పనిలో పడ్డాడు. కరోనా విరామం అనంతరం.. 2019లో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్లో భాగంగా అమెరికాతో జరిగిన మ్యాచ్లో 6-5తో అద్భుత ప్రదర్శన చేసిన అమ్మాయిలు ఒలింపిక్స్కుఅర్హత సాధించారు. అయితే ఎలాంటి అంచనాలు లేకుండా టోక్యో బరిలో దిగి, ఆద్యంతం గట్టి పోటీనిచ్చిన రాణి రాంపాల్ సేనకు యావత్ భారతావని మద్దతుగా నిలిచింది. 41 ఏళ్ల తర్వాత తొలిసారి ఒలింపిక్ సెమీస్కు చేరి చరిత్ర సృష్టించింది. తాజాగా శుక్రవారం బ్రిటన్తో జరిగిన కాంస్య పతక పోరు మ్యాచ్లో 4-3 తేడాతో ఓటమి పాలైంది. హోరాహోరీగా సాగిన పోరులో పోరాట పటిమ ప్రదర్శించినప్పటికీ.. చివరి క్వార్టర్లో ఫలితం తారుమారుకావడంతో పతకం గెలవలేకపోయింది. కాంస్య పతక పోరులో భాగంగా మ్యాచ్ ఆరంభమైన కొద్ది నిమిషాల్లోనే రెండు గోల్స్ చేసి బ్రిటన్ గట్టి పోటీనివ్వగా.. పడిలేచిన కెరటంలా దూసుకుకొచ్చిన రాణి సేన రెండో క్వార్టర్ ముగిసే సరికి చివరి 5 నిమిషాల వ్యవధిలో మూడు గోల్స్ చేసి సత్తా చాటింది. భారత్ తరఫున గుర్జీత్ కౌర్ 2, వందనా కటారియా ఒక గోల్ చేశారు. -
Tokyo Olympics: ఓడిపోయారు.. కాంస్యం గెలిచినా చరిత్రే
టోక్యో: టోక్యో ఒలింపిక్స్లో భాగంగా అర్జెంటీనాతో జరిగిన మహిళల హాకీ సెమీఫైనల్లో భారత మహిళల జట్టు ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. అయితే మహిళల జట్టు సెమీస్లో ఓడిపోయినప్పటికి అభిమానుల మనసులు మాత్రం గెలుచుకుంది. దాదాపు 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో సెమీస్ చేరిన భారత మహిళల జట్టు ఫైనల్ చేరుతుందని అంతా భావించారు. అర్జెంటీనాతో జరిగిన సెమీస్లో ఆట ఆరంభంలోనే గుర్జీత్ కౌర్ గోల్ చేసి భారత్కు శుభారంభం అందించింది. అయితే ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. అర్జెంటీనా తరఫున కెప్టెన్ మారియా నోయెల్ 18, 36వ నిమిషంలో రెండు గోల్స్ చేసింది. తొలి క్వార్టర్లో 1-0 లీడ్లోకి దూసుకెళ్లిన టీమిండియా.. రెండు, మూడు క్వార్టర్లలో రెండు గోల్స్ ప్రత్యర్థికి ఇచ్చింది. ఇక నాలుగో క్వార్టర్లో రాణి రాంపాల్ టీమ్కు స్కోరు సమం చేసే అవకాశం రాలేదు. అయితే భారత్ జట్టు సెమీస్లో ఓడినప్పటికి రాణి రాంపాల్ సేనకు మరో సువర్ణావకాశం ఉంది. కాంస్య పతక పోరులో భాగంగా ఆగస్టు 6న బ్రిటన్తో జరగనున్న మ్యాచ్లో భారత్ గెలిస్తే గనుక అది కూడా ఒక చరిత్రే అవుతుంది. ఎందుకంటే ఒలింపిక్స్లో భారత మహిళల జట్టు ఇంతవరకు పతకం సాధించలేదు. ఒకవేళ కాంస్యం గెలిస్తే మాత్రం సరికొత్త చరిత్ర కానుంది. -
బాధపడొద్దు.. మీ ప్రదర్శన చూసి దేశం గర్విస్తోంది
ఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ల్లో అర్జెంటీనాతో జరిగిన మహిళల హాకీ సెమీఫైనల్లో భారత మహిళల జట్టు ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. తొలి రెండు క్వార్టర్లు మంచి ప్రదర్శనను కనబరిచిన భారత జట్టు మిగిలిన రెండు క్వార్టర్లలో ఒత్తిడికి గురైన భారత జట్టు అర్జెంటీనాకు 2-1 తేడాతో మ్యాచ్ను అప్పగించింది. అయితే ఒలింపిక్స్లో ఎటువంటి అంచనాలు లేకుండానే బరిలోకి దిగిన భారత మహిళల జట్టు సెమీస్లో ఓడిపోయినా యావత్ దేశం వారిపై ప్రశంసలు కురిపించింది. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ మ్యాచ్ అనంతరం భారత మహిళల హాకీ జట్టుతో ఫోన్లో మాట్లాడారు. మహిళల కెప్టెన్ రాణి రాంపాల్, కోచ్తో ప్రధాని ఫోన్లో సంభాషించారు. ఆటలో గెలుపోటములు సహజం. మీ ప్రదర్శనను చూసి దేశం గర్విస్తోంది. ఓటమితో నిరాశ చెందొద్దు. తర్వాతి మ్యాచ్పై దృష్టి పెట్టి గెలవండి. భారత్కు కాంస్య పతకాన్ని తీసుకురండి అని ఆకాంక్షించారు. కాగా కాంస్య పతక పోరులో భాగంగా భారత మహిళల జట్టు ఆగస్టు 6న బ్రిటన్తో తలపడనుంది. -
భారత మహిళల హాకీ జట్టు విజయం; ఐర్లాండ్ ఓడిపోతేనే
టోక్యో: ఒలింపిక్స్లో భాగంగా భారత మహిళల హాకీ జట్టు మరో విజయాన్ని నమోదు చేసింది. శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో భారత్ 4-3 తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్ ఆద్యంతం హోరాహోరీగా సాగడం విశేషం. తొలి రెండు క్వార్టర్లలో వందన కటరియా రెండు గోల్స్ చేయడంతో 2-1తో భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. అయితే మూడో క్వార్టర్లో మాత్రం కాస్త తడబడింది. దీంతో సౌతాఫ్రికా మూడో క్వార్టర్లో రెండు గోల్స్ నమోదు చేసి 3-3తో స్కోరును సమం చేసింది. కీలకమైన నాలుగో క్వార్టర్లో వందన కటారియా మరో గోల్తో మెరవడంతో భారత్ 4-3తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆట ముగిసేలోపూ భారత ఢిపెన్స్ టీమ్ సౌతాప్రికాను మరో గోల్ చేయకుండా నిలువరించడంతో విజయాన్ని అందుకుంది. కాగా భారత్ ఈ విజయంతో లీగ్ దశలో ఐదు మ్యాచ్ల్లో రెండు విజయాలు.. మూడు ఓటములతో కలిపి 6 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. భారత్ క్వార్టర్స్ చేరాలంటే ఐర్లాండ్- గ్రేట్ బ్రిటన్ల మధ్య జరగనున్న మ్యాచ్లో ఐర్లాండ్ ఓడిపోవాలి. అలా కాకుంటే మ్యాచ్ డ్రా అయినా భారత్ క్వార్టర్స్కు క్వాలిఫై అవుతుంది. ఒకవేళ ఐర్లాండ్ గెలిస్తే మాత్రం భారత మహిళల జట్టు ఇంటిముఖం పడుతుంది. -
జాతీయ మహిళల హాకీ శిబిరానికి రజని
టోక్యో ఒలింపిక్స్ సన్నాహాల్లో భాగంగా ఏర్పాటు చేసిన జాతీయ మహిళల హాకీ శిక్షణ శిబిరానికి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇటిమరపు రజని ఎంపికైంది. చిత్తూరు జిల్లాకు చెందిన రజని 2009 నుంచి భారత సీనియర్ జట్టుకు రెండో గోల్కీపర్గా వ్యవహరిస్తోంది. 2014 ఆసియా క్రీడల్లో స్వర్ణం, 2018 ఆసియా క్రీడల్లో రజతం నెగ్గిన భారత జట్టులో రజని సభ్యురాలిగా ఉంది. జాతీయ శిబిరానికి ఎంపిక చేసిన మొత్తం 25 మంది క్రీడాకారిణులకు బెంగళూరులోని భారత స్పోర్ట్స్ అథారిటీలో శిబిరం నిర్వహిస్తారు., -
ఇంగ్లండ్తో హాకీ సిరీస్కు రజని
న్యూఢిల్లీ: భారత మహిళల హాకీ జట్టులో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇతిమరపు రజని తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఈనెల 27 నుంచి అక్టోబర్ 4 వరకు ఇంగ్లండ్లో ఇంగ్లండ్తో జరిగే ఐదు మ్యాచ్ల సిరీస్లో పాల్గొనే భారత మహిళల హాకీ జట్టును శుక్రవారం ప్రకటించారు. స్టార్ ఫార్వర్డ్ రాణి రాంపాల్ కెప్టెన్గా, గోల్కీపర్ సవిత వైస్ కెపె్టన్గా నియమితులయ్యారు. చిత్తూరు జిల్లాకు చెందిన రజని జట్టులో రెండో గోల్కీపర్గా వ్యవహరిస్తుంది. గాయం కారణంగా ఆటకు దూరమైన మిడ్ఫీల్డర్ నమిత టొప్పొ పునరాగమనం చేసింది. ఇటీవల టోక్యోలో జరిగిన ఒలింపిక్ టెస్టు ఈవెంట్ విజేతగా నిలిచిన భారత్ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. ముఖ్యంగా రాణి రాంపాల్, గుర్జీత్ కౌర్, నవ్నీత్ కౌర్లు అద్భుత ఫామ్లో ఉన్నారు. జట్టు వివరాలు: రాణి రాంపాల్ (కెపె్టన్), సవిత (వైస్ కెపె్టన్), ఇతిమరపు రజని, దీప్ గ్రేస్ ఎక్కా, గుర్జీత్ కౌర్, రీనా ఖోఖర్, సలీమా తెతె, సుశీలా చాను, నిక్కీ ప్రధాన్, మోనిక, నేహా గోయల్, లిలిమా మింజ్, నమిత, వందన, నవ్నీత్ కౌర్, నవ్జ్యోత్ కౌర్, షరి్మలా దేవి, లాల్రెమ్సియామి. -
అమ్మాయిలు శుభారంభం
హిరోషిమా: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) మహిళల సిరీస్ ఫైనల్స్ టోర్నమెంట్లో టైటిల్ ఫేవరెట్ భారత్ శుభారంభం చేసింది. శనివారం జరిగిన పూల్ ‘ఎ’ లీగ్ మ్యాచ్లో భారత్ 4–1 గోల్స్ తేడాతో ఉరుగ్వే జట్టును ఓడించింది. భారత్ తరఫున కెప్టెన్ రాణి రాంపాల్ (10వ నిమిషంలో), గుర్జీత్ కౌర్ (21వ నిమిషంలో), జ్యోతి (40వ నిమిషంలో), లాల్రెమ్సియామి (56వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. ఉరుగ్వే జట్టుకు వియానా తెరీసా (51వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించింది. ఆదివారం జరిగే తదుపరి మ్యాచ్లో పోలాండ్తో భారత్ ఆడుతుంది. రెండేళ్ల తర్వాత ఉరుగ్వేతోమ్యాచ్ ఆడిన భారత్ అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంది. మరోవైపు మొదటి క్వార్టర్లో ఉరుగ్వే జట్టు చురుగ్గా ఆడుతూ గోల్స్ చేసే అవకాశాలను సృష్టించినా భారత డిఫెన్స్ వాటిని సమర్ధవంతంగా అడ్డుకుంది. మూడో క్వార్టర్లో ఇరు జట్లు పలుమార్లు గురి తప్పాయి. ముఖ్యంగా ఉరుగ్వే రెండు పెనాల్టీ కార్నర్లను జారవిడచగా, భారత్ ఒక పెనాల్టీ కార్నర్ను గోల్గా మలచడంలో విఫలమైంది. తొలి రోజు జరిగిన ఇతర మ్యాచ్ల్లో చిలీ 7–0తో మెక్సికోపై, జపాన్ 2–1తో రష్యాపై, పోలాండ్ 6–1తో ఫిజీపై విజయం సాధించాయి. -
భారత మహిళలదే సిరీస్
జిన్చియోన్ (కొరియా): ఈ సీజన్లో భారత మహిళల హాకీ జట్టు తమ జోరు కొనసాగిస్తోంది. ఇటీవల స్పెయిన్, మలేసియా పర్యటనల్లో ఆకట్టుకున్న టీమిండియా దక్షిణ కొరియాతో సిరీస్లోనూ తమ ఆధిపత్యం చాటుకుంది. కొరియాతో బుధవారం జరిగిన రెండో మ్యాచ్లో భారత్ 2–1తో విజయం సాధించింది. మూడు మ్యాచ్ల సిరీస్ను ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 2–0తో సొంతం చేసుకుంది. తొలి మ్యాచ్లోనూ భారత్ 2–1తో గెలిచిన సంగతి తెలిసిందే. రెండో మ్యాచ్లో భారత్కు కొరియా నుంచి గట్టిపోటీ లభించింది. రెండు జట్లు దూకుడుగా ఆడటంతో తొలి క్వార్టర్లో పెనాల్టీ కార్నర్లు వచ్చాయి. అయితే ఇరు జట్లు ఈ అవకాశాలను వృథా చేసుకున్నాయి. అనంతరం 19వ నిమిషంలో లీ సెయుంగ్జు గోల్తో కొరియా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో క్వార్టర్లో భారత క్రీడాకారిణులు సమన్వయంతో ఆడుతూ కొరియాపై ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో 37వ నిమిషంలో కెప్టెన్ రాణి రాంపాల్ గోల్ చేసి స్కోరును 1–1తో సమం చేసింది. 50వ నిమిషంలో నవ్జ్యోత్ కౌర్ గోల్తో భారత ఆధిక్యం 2–1కి పెరిగింది. సిరీస్లోని చివరిదైన మూడో మ్యాచ్ శుక్రవారం జరుగుతుంది. -
భారత్ శుభారంభం
జించియోన్: దక్షిణ కొరియా పర్యటనలో భారత మహిళల హాకీ జట్టు శుభారంభం చేసింది. సోమవారం జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 2–1తో నెగ్గింది. ఈ మ్యాచ్లో భారత్ తరఫున లాల్రెమ్సియామి (20వ ని.), నవనీత్ కౌర్ (40వ ని.) చెరో గోల్ చేశారు. కొరియా తరఫున షిన్ హ్యెజియాంగ్ (48వ ని.) గోల్ సాధించింది. ఆతిథ్య కొరియాకు పదే పదే పెనాల్టీ కార్నర్ అవకాశాలు దక్కినా... భారత గోల్కీపర్ సవిత గోల్పోస్ట్ ముందు గోడలా నిలబడింది. ఐదు పీసీ లను, ఒక పెనాల్టీ స్ట్రోక్ను సమర్థంగా అడ్డుకుంది. రెండో మ్యాచ్ బుధవారం జరుగుతుంది. -
హాకీ ఫైనల్లో భారత మహిళలకు చుక్కెదురు!
జకార్త : సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఆసియా క్రీడల ఫైనల్ చేరిన భారత మహిళల హాకీ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం జపాన్తో జరిగిన ఫైనల్లో రాణి రాంపాల్ బృందం 1-2 తేడాతో ఓటమి పాలైంది. 2014 ఆసియా క్రీడల్లో కాంస్యంతో సరిపెట్టుకున్నభారత మహిళలు ఈసారి రజతంతో సరిపెట్టారు. తొలి అర్థభాగం వరకు ఇరు జట్ల స్కోర్ సమంగా ఉండగా రెండో అర్ధభాగంలో జపాన్ ఆధిక్యం సాధించి పసిడి సొంతం చేసుకుంది. జపాన్ మహిళలకు ఏషియాడ్లో ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. భారత్ తరపున నేహాగోయల్ గోల్ చేయగా.. జపాన్ తరపున మినామి, మొటామి గోల్స్ సాధించారు. స్వర్ణం నెగ్గి తద్వారా 2020 టోక్యో ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించాలనుకున్న భారత మహిళల ఆశలు గల్లంతయ్యాయి. భారత్ 36 ఏళ్ల క్రితం 1982 న్యూఢిల్లీ క్రీడల్లో స్వర్ణం నెగ్గింది. చివరగా 1998 బ్యాంకాక్ క్రీడల్లో ఫైనల్ చేరినా... అక్కడ కొరియా చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. పురుషుల జట్టు సెమీస్లో మలేషియాతో ఓడిన విషయం తెలిసిందే. కాంస్యం కోసం దాయదీ పాకిస్తాన్తో తలపడనుంది. శుక్రవారం భారత్కు మొత్తం ఒక రజతం నాలుగు కాంస్యాలతో ఐదు పతకాలు లభించాయి. దీంతో భారత్ పతకాల సంఖ్య 64 (13 స్వర్ణం, 22 రజతం, 29 కాంస్యం)కు చేరింది. -
భారత్(vs)జపాన్
సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఆసియా క్రీడల ఫైనల్ చేరిన భారత మహిళల హాకీ జట్టు నేడు జరుగనున్న తుదిపోరులో జపాన్తో తలపడనుంది. 2014 ఆసియా క్రీడల్లో కాంస్యంతో సరిపెట్టుకున్న భారత్ ఈసారి ఎలాగైనా స్వర్ణం నెగ్గి తద్వారా 2020 టోక్యో ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించాలనే పట్టుదలతో ఉంది. భారత్ 36 ఏళ్ల క్రితం 1982 న్యూఢిల్లీ క్రీడల్లో స్వర్ణం నెగ్గింది. చివరగా 1998 బ్యాంకాక్ క్రీడల్లో ఫైనల్ చేరినా... అక్కడ కొరియా చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. -
హాకీ ఫైనల్లో భారత మహిళలు
భారత మహిళల హాకీ జట్టు ఆసియా క్రీడల ఫైనల్కు దూసుకెళ్లింది. గ్రూప్ ‘బి’లో అజేయంగా అగ్రస్థానంతో సెమీస్ చేరిన రాణి రాంపాల్ బృందం బుధవారం జరిగిన సెమీస్లో 1–0తో చైనాను చిత్తు చేసింది. గత 20 ఏళ్లలో భారత మహిళల జట్టు ఆసియా క్రీడల ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. 1998లో చివరిసారి భారత్ ఫైనల్కు చేరి స్వర్ణం సాధించింది. భారత్ తరఫున గుర్జీత్ కౌర్ (52వ నిమిషంలో) ఏకైక గోల్ నమోదు చేసింది. శుక్రవారం జరిగే తుదిపోరులో జపాన్తో భారత్ తలపడనుంది. నేడు పురుషుల హాకీ సెమీఫైనల్ డిఫెండింగ్ చాంపియన్ భారత పురుషుల హాకీ జట్టు నేడు సెమీఫైనల్ బరిలో దిగనుంది. పూల్ ‘ఎ’లో అజేయంగా అగ్రస్థానంతో సెమీస్ చేరిన భారత్... పూల్ ‘బి’లో రెండో స్థానంలో నిలిచిన మలేసియాతో అమీతుమీ తేల్చుకోనుంది. టోర్నీ ఆరంభం నుంచి అటాకింగ్ గేమ్ ఆడుతున్న శ్రీజేశ్ సేన ఈ మ్యాచ్లోనూ అదే మంత్రంతో ఆడి తుదిపోరుకు అర్హత సాధించాలనే పట్టుదలతో ఉంది. హాకీ చరిత్రలో ఓ టోర్నీలో అత్యధిక గోల్స్(76) కొట్టిన ఘనతను భారత జట్టు ఈ మెగా ఈవెంట్లో సొంతం చేసుకుంది. -
విజయంతో ముగించారు
మాడ్రిడ్: కెప్టెన్ రాణి రాంపాల్, డిఫెండర్ గుర్జీత్ కౌర్ రాణించడంతో... స్పెయిన్తో ఐదు మ్యాచ్ల హాకీ సిరీస్ను భారత మహిళల జట్టు విజయంతో ముగించింది. చివరిదైన ఐదో మ్యాచ్లో భారత్ 4–1తో ఘనవిజయం సాధించి సిరీస్ను 2–2తో ‘డ్రా’ చేసుకుంది. రాణి రాంపాల్ 33వ, 37వ నిమిషాల్లో ఫీల్డ్ గోల్ చేసి భారత్కు తిరుగులేని ఆధిక్యాన్ని కట్టబెట్టింది. అనంతరం గుర్జీత్ కౌర్ (44వ ని., 50వ ని.) ఆరు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ సాధించింది. ఈ రెండింట్లోనూ రాణి కీలకపాత్ర పోషించింది. స్పెయిన్ తరఫున నమోదైన ఏకైక గోల్ను లోలా రియెరా ఆట 58వ నిమిషంలో చేసింది. ఆట మొదలైన ఐదు నిమిషాల్లోనే భారత క్రీడాకారిణులు రెండు పెనాల్టీ కార్నర్ అవకాశాలు పొందారు. అయితే స్పెయిన్ గోల్ కీపర్ మరియా రూయిజ్ వాటిని సమర్థంగా అడ్డుకుంది. కానీ అనంతరం భారత స్ట్రయికర్లు ప్రత్యర్థి గోల్పోస్ట్పై దాడులకు పదును పెట్టారు. రెండో క్వార్టర్ నుంచి భారత్ దాడులు ఫలితాన్నిచ్చాయి. -
సునీత లక్రాకు మహిళల హాకీ పగ్గాలు
న్యూఢిల్లీ: అనుభవజ్ఞురాలైన డిఫెండర్ సునీత లక్రాను భారత మహిళల హాకీ సారథిగా నియమించారు. ఆమె సారథ్యంలోని జట్టును ఆసియా చాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేశారు. ఈ నెల 13 నుంచి దక్షిణకొరియాలోని డాంగే నగరంలో ఈ టోర్నీ జరుగుతుంది. రెగ్యులర్ కెప్టెన్ రాణి రాంపాల్కు ఈ టోర్నీలో విశ్రాంతినిచ్చారు. గోల్కీపర్ సవితను వైస్ కెప్టెన్గా నియమించారు. రెండేళ్ల క్రితం జరిగిన ఆసియా చాంపియన్స్లో భారత్ ఫైనల్లో చైనాను ఓడించి టైటిల్ గెలిచింది. గతేడాది జరిగిన ఆసియా కప్లోనూ చైనాపై గెలిచి విజేతగా నిలిచింది. జట్టు: సునీత లక్రా (కెప్టెన్), దీపిక, దీప్గ్రేస్ ఏక్కా, గుర్జీత్ కౌర్, సుమన్ దేవి తౌడమ్, మోనిక, నమిత టొప్పొ, నిక్కి ప్రధాన్, నేహ గోయల్, లిలిమా మింజ్, నవజ్యోత్ కౌర్, ఉదిత, వందన కటారియా, లాల్రెంసియామి, నవనీత్ కౌర్, అనూప బార్ల, సవిత, స్వాతి. -
‘కామన్వెల్త్’కు రజని
న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్లో పాల్గొనే భారత మహిళల హాకీ జట్టును బుధవారం ప్రకటించారు. స్టార్ స్ట్రయికర్ రాణి రాంపాల్ నేతృత్వంలో 18 మంది సభ్యుల జట్టును ఎంపిక చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి, గోల్ కీపర్ ఇతిమరపు రజనికి చోటు దక్కింది. ఈ జట్టుకు ప్రధాన గోల్ కీపర్ సవిత వైస్ కెప్టెన్గా వ్యవహరించనుంది. వచ్చే నెల 4 నుంచి ఆస్ట్రేలియాలోని గోల్డ్కోస్ట్లో ఈ ప్రతిష్టాత్మక క్రీడలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా జరిగే హాకీ ఈవెంట్లో భారత్... మలేసియా, వేల్స్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలతో కలిసి పూల్ ‘ఎ’లో ఉంది. ఏప్రిల్ 5న జరిగే తమ తొలి మ్యాచ్లో వేల్స్తో భారత్ తలపడుతుంది. -
భారత మహిళలకు రెండో గెలుపు
సియోల్: దక్షిణ కొరియా పర్యటనలో భారత మహిళల హాకీ జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ కొరియాతో మంగళవారం జరిగిన రెండో మ్యాచ్లో రాణి రాంపాల్ నేతృత్వంలోని భారత్ 3–2తో గెలిచింది. భారత్ తరఫున పూనమ్ రాణి (6వ నిమిషంలో), రాణి రాంపాల్ (27వ ని.లో), గుర్జీత్ కౌర్ (32వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. కొరియా జట్టుకు యురిమ్ లీ (10వ ని.లో), జంగ్జియున్ సియో (31వ ని.లో) ఒక్కో గోల్ అందించారు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 2–0తో ఆధిక్యంలో ఉంది. మూడో మ్యాచ్ గురువారం జరుగుతుంది. -
భారత మహిళలకు పరాజయం
డెన్ బోష్ (నెదర్లాండ్స్): తమ యూరోప్ పర్యటనలో భాగంగా ఆడిన మూడో మ్యాచ్లో భారత మహిళల హాకీ జట్టుకు ఘోర పరాజయం ఎదురైంది. శుక్రవారం లేడీస్ డెన్ బోష్ జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత్ 1–3 గోల్స్ తేడాతో ఓడింది. డిఫెండర్ నవ్దీప్ కౌర్ 47వ నిమిషంలో జట్టు తరఫున ఏకైక గోల్ చేసింది. మ్యాచ్ ఆరంభమైన పది నిమిషాలు భారత్ ఆధిపత్యం చూపింది. ఆ తర్వాత ప్రత్యర్థి జట్టు ఎదురుదాడికి దిగింది. 12వ నిమిషంలో తమకు లభించిన పెనాల్టీ కార్నర్ను సద్వినియోగం చేసుకుని లేడీస్ డెన్బోష్ జట్టు తొలి గోల్ సాధించింది. అదే జోరులో మరో రెండు గోల్స్ చేసి 3–0తో ముందంజ వేసింది. చివరి క్వార్టర్లో భారత్ బోణీ చేయగలిగింది. ఈనెల 18న బెల్జియం జూనియర్ పురుషుల జట్టుతో టీమిండియా చివరిదైన నాలుగో మ్యాచ్ ఆడనుంది. -
పోరాడి ఓడిన భారత మహిళలు
న్యూజిలాండ్దే హాకీ సిరీస్ ప్యూకేకొహే: న్యూజిలాండ్తో జరిగిన మూడో మ్యాచ్లో 2–3 గోల్స్ తేడాతో భారత మహిళల హాకీ జట్టు పోరాడి ఓడింది. దీంతో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ను 3–0తో కివీస్ కైవసం చేసుకుంది. గత మ్యాచ్లో 2–8 గోల్స్ తేడాతో చిత్తుగా ఓడిన భారత్ ఈ మ్యాచ్లో మాత్రం ఆకట్టుకుంది. పటిష్టమైన ప్రణాళికతో బరిలోకి దిగిన టీమిండియా సత్తాచాటింది. దీంతో తొలి క్వార్టర్లోనే భారత్ బోణీ కోట్టింది. తొమ్మిదో నిమిషంలో జట్టుకు లభించిన పెనాల్టీ కార్నర్ను దీప్గ్రేస్ ఎక్కా గోల్గా మలివడంతో 1–0తో భారత్ ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే రెండు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసిన ఆతిథ్యజట్టు 2–1తో తొలిక్వార్టర్ను ముగించింది. ముందుగా 13వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ను ఎల్లా గన్సన్ గోల్గా మలిచింది. అనంతరం దియాన్న రిచీ ఫీల్డ్ గోల్ చేయడంతో కివీస్ ఆధిక్యాన్ని దక్కించుకుంది. మరోవైపు స్కోరు సమంచేసేందుకు భారత్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ క్రమంలో 39వ నిమిషంలో షిలో గ్లోన్ గోల్ చేయడంతో 3–1తో కివీస్ తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే 59వ నిమిషంలో జట్టుకు లభించిన పెనాల్టీ కార్నర్ను మోనికా గోల్గా మలవడంతో కివీస్ ఆధిక్యాన్ని 3–2కు భారత్ తగ్గించింది. ఆట చివరి క్షణాల్లో గోల్కోసం భారత్ చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో కివీస్ విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య నాలుగో మ్యాచ్ రేపు (శుక్రవారం) జరుగనుంది. సునీతా లక్రా సెంచరీ భారత డిఫెండర్ సునీతా లక్రా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. బుధవారం కివీస్తో మ్యాచ్ ద్వారా 100 అంతర్జాతీయ మ్యాచ్ల్ని సునీత పూర్తి చేసుకుంది. 2009లో అరంగేట్రం చేసిన సునీతా ఎనిమిదేళ్ల కెరీర్లో భారత జట్టుకు వెన్నెముకలా మారింది. 17వ ఆసియా గేమ్స్, రియో ఒలింపిక్స్, ఆసియా చాంపియన్స్ ట్రోఫీల్లో జట్టు తరఫున కీలకపాత్ర పోషించింది. వంద మ్యాచ్ల్ని పూర్తి చేసుకున్న సునీతను హాకీ ఇండియా ప్రధాన కార్యదర్శి ముస్తాక్ అహ్మద్ అభినందించారు. తనో ప్రతిభాశాలీ అని, చాలా మ్యాచ్ల్లో అద్భుత ప్రదర్శన కనబర్చిందని ఆయన కొనియాడారు. -
భారత మహిళల హాకీ జట్టుకు నాలుగో విజయం
భోపాల్: భారత మహిళల హాకీ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. బెలారస్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో రాణి రాంపాల్ సేన వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. సోమవారం జరిగిన నాలుగో మ్యాచ్లో భారత్ 2–1 గోల్స్ తేడాతో బెలారస్ను ఓడించింది. ఆట ఆరంభమైన ఆరో నిమిషంలోనే రేణుకా యాదవ్ ఫీల్డ్ గోల్ చేయగా... మరో ఆరు నిమిషాలకు గుర్జీత్ కౌర్ (12వ ని.) పెనాల్టీ కార్నర్ను గోల్గా మలిచి ఆధిక్యాన్ని రెట్టింపు చేసింది. రెండో క్వార్టర్లో బెలారస్ తరఫున నస్టాసియా సైరయెజ్కా ఫీల్డ్ గోల్ సాధించింది. -
భారత మహిళలదే హాకీ సిరీస్
భోపాల్: వరుసగా మూడో విజయం సాధించిన భారత మహిళల హాకీ జట్టు బెలారస్తో జరుగుతోన్న ఐదు మ్యాచ్ల సిరీస్లో 3–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే సిరీస్ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన మూడో మ్యాచ్లో టీమిండియా 3–1తో గెలిచింది. రైటా బటురా 24వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ను గోల్గా మలిచి బెలారస్కు 1–0తో ఆధిక్యాన్ని అందించింది. అయితే భారత కెప్టెన్ రాణి రాంపాల్ 35వ, 39వ నిమిషాల్లో ఫీల్డ్ గోల్స్ చేసింది. దీంతో భారత్ 2–1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 42వ నిమిషంలో దీపిక మరో గోల్ చేసి భారత విజయాన్ని ఖాయం చేసింది. -
బెలారస్పై భారత్ ఘనవిజయం
భోపాల్: ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత మహిళా హాకీ జట్టు బెలారస్పై 5–1తో ఘనవిజ యం సాధించింది. మ్యాచ్లో నవజోత్ కౌర్ చేసిన రెండు గోల్స్తో భారత్ ఖాతా తెరిచింది. 11వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ని గోల్గా మలిచిన నవజోత్ ఆ వెంటనే 15వ నిమిషంలో చక్కని ఫీల్డ్ గోల్తో భారత్ను 2–0 ఆధిక్యంలోకి తీసుకువెళ్లింది. ఈ సమయంలో బెలారస్ ఆటగాళ్ల డిఫెన్స్ను ఛేదిస్తూ పూన మ్ బర్ల (29వ నిమిషం) మరో చక్కనిగోల్తో భారత స్కోర్ను మూడుకి పెంచింది. బెలారస్ క్రీడాకారిణి స్వెత్లానా బహుషివిచ్ (37వ నిమిషం) గోల్ చేసి ఆధిక్యాన్ని 3–1కి తగ్గించినా... చివర్లో ఎక్కా (57వ ని.), గుర్జిత్కౌర్ (60వ ని.)లు పెనాల్టీకార్నర్లతో భారత్కు ఘనమైన ముగింపునిచ్చారు. -
మళ్లీ ఓడిన భారత్
మార్లో (ఇంగ్లండ్): బ్రిటన్ పర్యటనను భారత మహిళల హాకీ జట్టు పరాజయంతో మొదలుపెట్టి పరాజయంతోనే ముగించింది. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్ను భారత్ 0-5తో కోల్పోయింది. సోమవారం జరిగిన చివరిదైన ఐదో మ్యాచ్లో టీమిండియా 0-7 గోల్స్ తేడాతో బ్రిటన్ చేతిలో దారుణంగా ఓడిపోయింది. బ్రిటన్ క్రీడాకారిణి షోనా మెక్ కాలిన్ మూడు గోల్స్తో రాణించగా... సుశన్నా టౌన్సెండ్, క్రిస్టా క్యులెన్, కేట్ వాల్ష్ , హెలెన్ వాల్ష్ ఒక్కో గోల్ చేశారు. ఈ సిరీస్ మొత్తంలో భారత జట్టు 3 గోల్స్చేసి 17 గోల్స్ను సమర్పించుకుంది. -
నెదర్లాండ్స్ గోల్స్ వర్షం
క్వార్టర్స్లో భారత్ మహిళల ఓటమి వరల్డ్ హాకీ లీగ్ సెమీఫైనల్స్ టోర్నీ యాంట్వార్ప్ : ప్రత్యర్థి ఎదురుదాడులను నిలువరించలేకపోయిన భారత మహిళల హాకీ జట్టు... వరల్డ్ హాకీ లీగ్ సెమీఫైనల్స్ టోర్నీలో సెమీస్ బెర్త్ను దూరం చేసుకుంది. మంగళవారం జరిగిన క్వార్టర్ఫైనల్లో ప్రపంచ చాంపియన్ నెదర్లాండ్స్ 7-0తో భారత్ను చిత్తు చేసి సెమీస్లోకి అడుగుపెట్టింది. వాన్ యాస్ నోమి (1వ ని.), వెల్టెన్ లిడ్వెజ్ (9, 48వ ని.), మస్నేర్ (16వ ని.), గ్లెనెల్లా జెర్గో (18వ ని.), మసక్కెర్ (26, 53వ ని.)లు డచ్కు గోల్స్ అందించారు. పక్కా ప్రణాళికతో ఆడిన డచ్ క్రీడాకారిణిలు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఫార్వర్స్, డిఫెండర్లు సమయోచితంగా స్పందించడంతో తొలి నిమిషంలోనే గోల్తో షాకిచ్చారు. పెనాల్టీ అవకాశాలను సృష్టించుకుంటూ తొలి క్వార్టర్లో 2-0 ఆధిక్యంలో నిలిచారు. రెండో క్వార్టర్స్లోనూ డచ్ ప్లేయర్లు భారత్కు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. స్వల్ప వ్యవధిలో మూడు గోల్స్ చేసి ఆధిక్యాన్ని 5-0కు పెంచారు. చివరి రెండు క్వార్టర్లలోనూ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించి మరో రెండు గోల్స్ సాధించారు. -
భారత్ మహిళల బోణీ
యాంట్వర్ప్ (బెల్జియం) : వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడిపోయిన భారత మహిళల హాకీ జట్టు మూడో మ్యాచ్లో తేరుకుంది. హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ టోర్నమెంట్లో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. పోలండ్ జట్టుతో బుధవారం జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్లో భారత్ 3-1 గోల్స్ తేడాతో గెలిచింది. ఈ విజయంతో భారత్కు క్వార్టర్ ఫైనల్ చేరే అవకాశాలు సజీవంగా నిలిచాయి. భారత్ తరఫున రాణి రాంపాల్ (20వ, 29వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... వందన కటారియా (53వ నిమిషంలో) ఒక గోల్ సాధించింది. పోలండ్కు మగ్దలీనా జగాజ్స్కా (50వ నిమిషంలో) ఏకైక గోల్ను అందించింది. ఈనెల 27న జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతుంది. పోలండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ తొలి క్షణం నుంచే దూకుడుగా ఆడింది. 16వ నిమిషంలో భారత్కు వెంటవెంటనే రెండు పెనాల్టీ కార్నర్లు లభించినా ఈసారి రాణి వీటిని లక్ష్యానికి చేర్చలేకపోయింది. అయితే 20వ నిమిషంలో దక్కిన పెనాల్టీ కార్నర్ను రాణి రాంపాల్ గోల్గా మలిచింది. అనంతరం 29వ నిమిషంలో కెప్టెన్ రాణి అందించిన పాస్ను రాణి రాంపాల్ చాకచక్యంతో గోల్ పోస్ట్లోనికి పంపించింది. చివరి క్వార్టర్లో వందన గోల్తో భారత్ విజయం ఖాయమైంది.