infrastructure development
-
7 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ.. 2.2 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడి
న్యూఢిల్లీ: భారతదేశం 2030 నాటికి 7 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందడానికి మౌలిక సదుపాయాల అభివృద్ధికి 2.2 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడి అవసరమని నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. ఇందుకు సంబంధించి ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి పలు సత్వర చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించింది. ఈ మేరకు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా, ‘ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్: రివైవింగ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్’ శీర్షికన ఒక నివేదికను విడుదల చేసింది. ‘‘2030 నాటికి భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) పరిమాణాన్ని 7 ట్రిలియన్ డాలర్లకు విస్తరించడానికి మౌలిక సదుపాయాల అభివృద్ధికి 2.2 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడి అత్యవసరం‘ అని నివేదికలో పేర్కొంది. నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజల్ వివరించిన నివేదికలోని కొన్ని కీలక అంశాలను పరిశీలిస్తే... → 2030 నాటికి భారత్ 7 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక పరిమాణాన్ని సాధించడానికి దేశం 2024– 2030 మధ్య 10.1 శాతం పురోగతి సాధించాలి. → మౌలిక సదుపాయాల అభివృద్ధి దేశ అభివృద్ధికి కీలకం. ఈ విషయంలో దేశం ఎంతో పురోగతి సాధించింది. పెరిగిన బడ్జెట్ కేటాయింపులతో లాజిస్టిక్స్ పనితీరు సూచిక (ఎల్పీఐ) విషయంలో భారత్ ర్యాంకింగ్ 2023లో 54కు ఎగసింది. 2014లో ఇది సూచీ 54 వద్ద ఉంది. → గత కొన్ని సంవత్సరాలుగా దేశ మౌలిక సదుపాయాలను గణనీయంగా విస్తరించేందుకు విధాన నిర్ణేతలు దూకుడుగా ముందుకు సాగుతున్నారు. → దేశ మౌలిక సదుపాయాల అభివృద్ధి తద్వారా ఆర్థిక వృద్ధిలో చురుగ్గా పాల్గొనేందుకు ప్రైవేట్ సంస్థలకు దేశంలో విస్తృత అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం ఈ దిశలో మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. → అయితే మౌలిక రంగం పురోగతికి సంబంధించి ఎదురయ్యే కొన్ని సవాళ్లు సైతం ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ పరంగా చూస్తే, ద్రవ్యలోటు పరంగా ఎదురయ్యే సవాళ్లను ఇక్కడ ప్రస్తావించుకోల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటు తీవ్రం కాకుండా చూసుకోవడంలో భాగంగా మౌలిక రంగంపై పెట్టుబడుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆచితూచి వ్యహరించాల్సిన అవసరం ఉంటుంది. → భారతదేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ప్రైవేట్ భాగస్వామ్యం గణనీయంగా తగ్గింది, 2009–13 మధ్య 160 బిలియన్ల (మొత్తం పెట్టుబడులలో 46.4 శాతం) ప్రైవేటు పెట్టుబడులు ఉన్నాయి. 2019–23 మధ్య ఈ విలువ దారుణంగా 39.2 బిలియన్ (మొత్తం పెట్టుబడుల్లో 7.2 శాతం)క డాలర్లకు పడిపోయింది. అయితే ప్రభుత్వ పరంగా ఈ విభాగంలో పెట్టుబడులు పెరిగాయి. అయితే ఇది ద్రవ్యలోటు సమస్యలకూ దారితీస్తున్న సమస్య. ప్రైవేటు రంగంలో మౌలిక విభాగ పెట్టుబడులు పెరగడం వల్ల ప్రభుత్వాలు ద్రవ్యలోటు సమతౌల్యతను రక్షించగలుగుతాయి. → మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలిక వృద్ధికి తోడ్పడే చర్యల విషయంలో ప్రభుత్వ వ్యయాన్ని వినియోగించవచ్చు. ప్రజారోగ్య సంరక్షణ, మానవ వన రుల పురోగతి, రుణ చెల్లింపులు వంటి ఇతర ఆర్థిక వృద్ధికి సంబంధించిన ఇతర కీలక విభాగాలకు ప్రభుత్వం వ్యయాన్ని మళ్లించవచ్చు. → రంగాల వారీగా చూస్తే పునరుత్పాదక ఇంధనం, డేటా సెంటర్లు, రోడ్డు రవాణా రహదారులు, గోడౌన్లు, రవాణా రంగాలు ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడానికి తగిన కీలక విభాగాలు. → వేగవంతమైన పట్టణీకరణ, యువత అధికంగా ఉండడం, పట్టణ ప్రాంతాల పురోగతి, ఎయిర్పోర్ట్లు, విద్యుత్ సరఫరా వంటి రంగాలు భారీ పెట్టుబడి అవకాశాలను కలిగి ఉన్నాయి. -
రూ.21 లక్షల కోట్లకు ఇన్విట్స్ ఏయూఎం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా మౌలిక సదుపాయాల అభివృద్ధిపై మరింతగా దృష్టి పెడుతున్న నేపథ్యంలో 2030 నాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ల (ఇన్విట్స్) నిర్వహణలోని ఆస్తుల పరిమాణం (ఏయూఎం) రూ. 21 లక్షల కోట్లకు చేరగలదని అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఇది రూ.5 లక్షల కోట్లుగా ఉంది. అలాగే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్స్) పోర్ట్ఫోలియోలోని 125 మిలియన్ చ.అ. ఆఫీస్ స్పేస్ వచ్చే కొన్నేళ్లలో 4 రెట్లు పెరిగి 400 మిలియన్ చ.అ.లకు చేరనుంది.బుధవారమిక్కడ ఈ సాధనాలపై రిటైల్ ఇన్వెస్టర్ల కోసం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో రీట్స్, ఇన్విట్స్ అసోసియేషన్ల ప్రతినిధులు ఈ విషయాలు తెలిపారు. సాధారణంగా రియల్టీ, ఇన్ఫ్రాలో పెట్టుబడులు పెట్టాలంటే పెద్ద మొత్తం అవసరమవుతుందని, కానీ రీట్స్, ఇన్విట్స్ ద్వారా చాలా తక్కువ మొత్తాన్నే ఇన్వెస్ట్ చేసి మెరుగైన ప్రయోజనాలు పొందవచ్చని వివరించారు. రీట్స్లో కనిష్టంగా రూ. 100–400కి కూడా యూనిట్లను కొనుగోలు చేయొచ్చని పేర్కొన్నారు. మైండ్స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్ సీఎఫ్వో ప్రీతి ఛేడా, హైవే ఇన్ఫ్రా ట్రస్ట్ సీఎఫ్వో అభిషేక్ ఛాజర్, నెకస్స్ సెలెక్ట్ ట్రస్ట్ సీఈవో రాజేష్ దేవ్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. దేశీయంగా 26 ఇన్విట్స్ ఉండగా, లిస్టెడ్ రీట్స్ నాలుగు ఉన్నాయి. -
Interim Budget 2024: ఎలక్ట్రిక్.. ఇక ఫుల్ చార్జ్!
న్యూఢిల్లీ: చార్జింగ్, తయారీ మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల వ్యవస్థను బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థలో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించనున్నట్లు వివరించారు. రవాణా కోసం ఉపయోగించే సీఎన్జీలోనూ, పైపుల ద్వారా సరఫరా చేసే సహజ వాయువులోను కంప్రెస్డ్ బయోగ్యాస్ను కలపడం తప్పనిసరని ఆమె పేర్కొన్నారు. మరోవైపు మధ్యంతర బడ్జెట్లో చర్యలను స్వాగతించిన క్వాంటమ్ ఎనర్జీ ఎండీ సి. చక్రవర్తి .. కొన్ని ఆకాంక్షలు మాత్రం నెరవేరలేదని పేర్కొన్నారు. 2024 మార్చితో ముగిసిపోనున్న ఫేమ్ 2 సబ్సిడీ ప్రోగ్రామ్ను పొడిగిస్తారని ఆశలు నెలకొన్నప్పటికీ ఆ దిశగా ప్రతిపాదనలు లేవని ఆయన తెలిపారు. గడువు పొడిగించి ఉంటే ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమకు గట్టి మద్దతు లభించి ఉండేదన్నారు. అలాగే లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్లు, సెల్స్పై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించి ఉంటే ఈవీల ధరలు మరింత అందుబాటు స్థాయిలోకి వచ్చేందుకు ఆస్కారం లభించేందని చక్రవర్తి తెలిపారు. సోలార్ రూఫ్టాప్ స్కీములు.. స్వచ్ఛ విద్యుత్ లక్ష్యాల సాధనకు తోడ్పడగలవని సీఫండ్ సహ వ్యవస్థాపకుడు మయూరేష్ రౌత్ తెలిపారు. మరోవైపు, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఫేమ్ స్కీముకు కేటాయింపులను బడ్జెట్లో కేంద్రం రూ. 2,671 కోట్లుగా ప్రతిపాదించారు. 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను సవరించిన అంచనాల (రూ. 4,807 కోట్లు) కన్నా ఇది 44 శాతం తక్కువ. ప్రస్తుతమున్న ఫేమ్ 2 ప్లాన్ను మరోసారి పొడిగిస్తారా లేదా అనే దానిపై స్పష్టత లేని పరిస్థితుల్లో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. ఆటోమొబైల్కు పీఎల్ఐ బూస్ట్ .. వాహన పరిశ్రమకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) స్కీము కింద బడ్జెట్లో కేటాయింపులను కేంద్రం ఏకంగా 7 రెట్లు పెంచి రూ. 3,500 కోట్లుగా ప్రతిపాదించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనా ప్రకారం ఇది రూ. 484 కోట్లు. కాగా, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్, బ్యాటరీ స్టోరేజీకి కేటాయింపులను రూ. 12 కోట్ల నుంచి రూ. 250 కోట్లకు పెంచారు. ఈవీల షేర్లు అప్ .. బడ్జెట్లో సానుకూల ప్రతిపాదనల నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల సంస్థల షేర్లు పెరిగాయి. బీఎస్ఈలో జేబీఎం ఆటో 2.48 శాతం పెరిగి రూ. 1,963 వద్ద, గ్రీవ్స్ కాటన్ సుమారు 1 శాతం పెరిగి రూ. 165 వద్ద ముగిశాయి. ఒలెక్ట్రా గ్రీన్టెక్ మాత్రం లాభాల స్వీకరణతో 0.69 శాతం క్షీణించి రూ. 1,729 వద్ద ముగిసింది. అయితే, ఒక దశలో 6 శాతం ఎగిసి 52 వారాల గరిష్టమైన రూ. 1,849 స్థాయిని తాకింది. -
భారత్ ఎకానమీ వృద్ధి 6.8 శాతం
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023 ఏప్రిల్–2024 మార్చి) 6.8 శాతం వృద్ధి సాధిస్తుందని పరిశ్రమల చాంబర్– సీఐఐ అంచనావేసింది. ఇంతక్రితం వేసిన 6.5–6.7 శాతం వృద్ధి శ్రేణికన్నా తాజా అంచనాలు అధికం కావడం గమనార్హం. ఇక 2024–25లో వృద్ధి రేటు 7 శాతానికి చేరుతుందని విశ్లేíÙంచింది. మౌలిక సదుపాయాల అభివృద్ధి, వ్యాపార వాతావరణం సులభతరం చేయడంపై ప్రభుత్వం నిరంతర దృష్టి సారించడం వంటి అంశాలు ఎకానమీ పురోగతికి కారణంగా పేర్కొంది. 2022–23లో భారత్ జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతం. 2023–24లో ఈ రేటు 6.5 శాతంగా ఉంటుందని ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) అంచనావేస్తోంది. క్యూ1లో 8 శాతం వృద్ధి అంచనాకు భిన్నంగా 7.8 శాతం ఫలితం వెలువడింది. క్యూ2లో 6.5 శాతం అంచనాలు వేయగా ఇందుకు 1.1 శాతం అధికంగా 7.6 శాతం వృద్ధి ఫలితం వెలువడింది. క్యూ3లో 6 శాతం, క్యూ4లో 5.7 శాతంగా ఆర్బీఐ అంచనా వేస్తోంది. 2024–25 మొదటి త్రైమాసికంలో వృద్ధిరేటు 6.6 శాతంగా ఉంటుందని భావిస్తోంది. ఆర్బీఐ అంచనాలను మించి తాజాగా సీఐఐ అంచనాలు వెలువడ్డం గమనార్హం. టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్కు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ కూడా అయిన సీఐఐ ప్రెసిడెంట్ ఆర్ దినేష్ తాజాగా ఇచి్చన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్న అంశాలు ఇవీ.. ► తాజా పాలసీ కొనసాగింపునకు... ఇటీవలి రాష్ట్ర ఎన్నికల ఫలితాలు (మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు), స్టాక్ మార్కెట్, పరిశ్రమ సానుకూలంగా ఉన్నాయి. ►విధానపరమైన నిర్ణయాల కొనసాగింపును మేము స్వాగతిస్తాము. ఆయా అంశాలు దేశ పురోగతికి దోహదపడతాయన్న విషయంలో ఏకాభిప్రాయం ఉంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా విధానపరమైన అంశాల్లో మార్పు ఉండకూడదని మేము వివరించి చెప్పడానికి ప్రయతి్నస్తాము. స్టాక్ మార్కెట్ కూడా ఇదే విధమైన చర్యల పట్ల సానుకూలంగా ఉంటుంది. ►పెట్టుబడులకు భారత్ తగిన ఆకర్షణీయ ప్రాంతమని మేము విశ్వసిస్తున్నాము. మౌలిక వనరుల అభివృద్ధి, తగిన వాతావరణ సానుకూల పరిస్థితుల ఏర్పాటుపై కేంద్రం తగిన విధంగా దృష్టి సారించడం దీనికి కారణం. ►రాబోయే ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్షల్లో రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.5 శాతం. ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి వరకూ ఈ రేటును ఆర్బీఐ 4 శాతం నుంచి 6 శాతానికి పెంచింది. గడచిన నాలుగు ద్వైమాసిక సమావేశాల్లో రేటు పెంపు నిర్ణయం తీసుకోలేదు) తగ్గించాలని మేము కోరడం లేదు. రేటు తగ్గించాలని కోరడానికి ఇది తగిన సమయం అని మేము భావించడం లేదు. ఎందుకంటే ద్రవ్యోల్బణం బెంచ్మార్క్ (4 శాతం) కంటే ఎక్కువగా ఉంది. ►ఇప్పుడు పలు రంగాలు తమ మొత్తం సామర్థ్యంలో 75 నుంచి 95 శాతాన్ని మాత్రమే వినియోగించుకుంటున్నాయి. గత 3 త్రైమాసికాల నుంచీ ఇదే పరిస్థితి. అయితే త్వరలో పరిస్థితి మారుతుందని విశ్వసిస్తున్నాం. పలు కంపెనీలు తమ మూలధన పెట్టుబడులను పెంచుతున్నాయి. ►మేము మా సభ్యత్వ సంస్థల ప్రతినిధులతో సర్వే చేశాము. మెజారిటీ సభ్యులు వాస్తవానికి ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలలతో పోలి్చతే (2023 ఏప్రిల్–సెప్టెంబర్) రెండవ అర్థ భాగంలో (2023 అక్టోబర్–మార్చి 2024) అధిక పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నారని సర్వేలో వెల్లడైంది. -
సామాజిక రంగ వ్యయంలో ఏపీనే టాప్
సాక్షి, అమరావతి: సామాజిక రంగ వ్యయంలో ఆంధ్రప్రదేశ్ మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే అగ్రభాగాన నిలిచింది. ఆ తర్వాత గుజరాత్ రెండో స్థానంలో ఉందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గణాంకాలు (కాగ్) పేర్కొన్నాయి. బడ్జెట్ కేటాయింపుల్లో ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలైన ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు వివిధ రాష్ట్రాల వ్యయాలను కాగ్ వెల్లడించింది. సామాజిక రంగ వ్యయం అంటే విద్య, వైద్య, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, పౌష్టికాహారం, పారిశుధ్యం, మంచినీటి సరఫరాపై చేసిన వ్యయంగా పరిగణిస్తారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలతో పాటు సంక్షేమం పథకాలపై ఇతర రాష్ట్రాలు కన్నా అత్యధికంగా వ్యయం చేసినట్లు కాగ్ పేర్కొంది. బడ్జెట్ కేటాయింపులు జరిగిన తొలి ఆరు నెలల్లోనే ఈ రంగంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 55.71 శాతం వ్యయం చేసినట్లు స్పష్టంచేసింది. ఈ వ్యయాన్ని మానవ వనరుల అభివృద్ధితో పాటు ప్రజలకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాల కల్పనగా పేర్కొంటారు. ఇక కాగ్తో పాటు ఆర్బీఐ కూడా సామాజిక రంగ వ్యయాన్ని కొలమానంగా విశ్లేషిస్తాయి. ఈ రంగంపై మరే ఇతర రాష్ట్రం ఇంత పెద్దఎత్తున వ్యయం చేయలేదు. ఆంధ్రప్రదేశ్ తరువాత సామాజిక రంగ కేటాయింపుల్లో గుజరాత్ 42.83 శాతంతో రెండో స్థానంలో ఉందని కాగ్ తెలిపింది. మరోవైపు.. ఆస్తుల కల్పనకు చేసిన బడ్జెట్ కేటాయింపుల్లో.. తెలంగాణ మొదటి స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలి ఆరు నెలల్లో 53.37 శాతం నిధులు వ్యయం చేయగా.. తెలంగాణ తన బడ్జెట్ కేటాయింపుల్లో 60.86 శాతం ఖర్చుపెట్టి మొదటి స్థానంలో నిలిచింది. -
సాకారమైన విజయనగరం వాసుల కల
-
ఎల్ఓసీ వెంట చైనా దుశ్చర్య
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) సరిహద్దు అయిన నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంట పాకిస్తాన్ సైన్యం రక్షణపరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోంది. ఈ పనులకు పొరుగున ఉన్న దాని మిత్రదేశం చైనా సహకరిస్తోందని భారత ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. డ్రోన్లు, కమ్యూనికేషన్ టవర్లను పాకిస్తాన్కు చైనా అందజేస్తోందని చెప్పారు. భూగర్భæ కేబుళ్లను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. పీఓకేలో చైనా స్థావరాలు పెరుగుతున్నాయని, వాటి రక్షణ కోసం పాక్ సైన్యానికి సాయం అందిస్తోందని అన్నారు. చైనా నుంచి దిగుమతి చేసుకున్న 155 ఎంఎం ఎస్హెచ్–15 శతఘ్నులను ఎల్ఓసీ వద్ద పాక్ మోహరించిందని పేర్కొన్నారు. పాక్ సైనిక పోస్టుల వద్ద చైనా సైనికాధికారులు తరచుగా కనిపిస్తున్నారని తెలియజేశారు. ఇదిలా ఉండగా, ఈ మొత్తం వ్యవహారంపై భారత సైన్యం ఇంకా అధికారికంగా స్పందించలేదు. తన ప్రయోజనాల కోసం చైనా చేస్తోందని నిపుణులంటున్నారు. -
V-Trans India Limited: మూడేళ్లలో రూ. 3,000 కోట్ల టర్నోవరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లాజిస్టిక్స్ సొల్యూషన్స్ సంస్థ వీ–ట్రాన్స్ ఇండియా 2026 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 3,000 కోట్ల టర్నోవరు సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దక్షిణాది మార్కెట్లో కార్యకలాపాలను మరింతగా విస్తరించనుంది. ఈ క్రమంలో 600 పైచిలుకు ఉద్యోగాలు కల్పించనుంది. బుధవారమిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో సంస్థ చైర్మన్ మహేంద్ర షా ఈ వివరాలు వెల్లడించారు. కేంద్రం మౌలిక సదుపాయాల కల్పనపై ప్రధానంగా దృష్టి పెడుతున్న నేపథ్యంలో లాజిస్టిక్స్ రంగానికి, తద్వారా తమ సంస్థ వృద్ధికి ఊతం లభించగలదని ఆయన వివరించారు. దేశీయంగా తయారీకి ప్రాధాన్యం పెరుగుతుండటంతో డిమాండ్కి అనుగుణంగా గిడ్డంగులు, కొత్త శాఖలను ఏర్పాటు చేయడంపై గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు షా చెప్పారు. హైదరాబాద్తో పాటు బెంగళూరు, కోయంబత్తూరు తదితర ప్రాంతాల్లో వీటిని ప్రారంభించనున్నట్లు సంస్థ ఈడీ రాజేష్ షా చెప్పారు. దాదాపు ఆరు దశాబ్దాలుగా కార్యకలాపాలు సాగిస్తున్న తమ సంస్థకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,000 పైగా శాఖలు, 50 పైచిలుకు ట్రాన్స్షిప్మెంట్ సెంటర్లు, 2,500 పైగా ట్రక్కులు ఉన్నట్లు ఆయన వివరించారు. -
10 వేల కిలోమీటర్ల డిజిటల్ హైవేలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ కనెక్టివిటీని విస్తరించే క్రమంలో ‘డిజిటల్ హైవే’ల నిర్మాణంపై ప్రభుత్వ రంగ నేషనల్ హైవేస్ అథారిటీ (ఎన్హెచ్ఏఐ) మరింతగా దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా 2024–25 నాటికల్లా 10,000 కిలోమీటర్ల మేర ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్ (ఓఎఫ్సీ) నెట్వర్క్పరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనుంది. ఎన్హెచ్ఏఐలో భాగమైన నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ (ఎన్హెచ్ఎల్ఎంఎల్) ఒక ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించింది. దీని ప్రకారం డిజిటల్ హైవే అభివృద్ధికి సంబంధించి పైలట్ ప్రాతిపదికన 512 కిలోమీటర్ల హైదరాబాద్–బెంగళూరు కారిడార్ను, 1,367 కిలోమీటర్ల ఢిల్లీ–ముంబై ఎక్స్ప్రెస్వేను ఎంపిక చేసినట్లు పేర్కొంది. -
స్థిరమైన ఆర్థిక నగరాల నిర్మాణం..విశాఖలో క్షేత్రస్థాయి పరిశీలన
సాక్షి, విశాఖపట్నం: భవిష్యత్తులో స్థిరమైన ఆర్థిక నగరాల నిర్మాణంపై జీ–20 దేశాల ప్రతినిధులు తమతమ వ్యూహాలను సమర్పించారు. విశాఖపట్నంలో జరుగుతున్న జీ–20 దేశాల రెండో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూపు (ఐడబ్ల్యూజీ) సమావేశాల్లో మూడోరోజైన గురువారం ‘సామర్థ్య నిర్మాణం’పై వర్క్షాపును ఇండియన్ ప్రెసిడెన్సీ, ఆసియా డెవలప్మెంట్ బ్యాంకులు సంయుక్తంగా నిర్వహించాయి. ఈ సదస్సులో జీ–20 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇందులో పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఫైనాన్సింగ్లలో అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులను చర్చించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. స్థానిక ప్రభుత్వాలు సమగ్ర, స్థిరమైన నగరాల కోసం అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఆర్థిక సాయం చేయడానికి అవసరమైన సామర్థ్యాలపై దృష్టిసారించారు. వర్క్షాపు మొదటి సెషన్లో భారత్ సహా సింగపూర్, దక్షిణ కొరియా, రష్యా, చైనా, యూరోపియన్ కమిషన్ నిపుణులు తమ దేశాల్లో అవలంబిస్తున్న ఉత్తమ పద్ధతులను ప్రదర్శించారు. సింగపూర్లోని నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఏజెన్సీ మాజీ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, డైరెక్టర్ జనరల్ అహ్ తువాన్లోహ్.. సింగపూర్ విధానాలు, సమ్మిళిత, స్థిర నగరాలను నిర్మించే వ్యూహాలను సమర్పించారు. ఇందులో డైనమిక్ అర్బన్ గవర్నెన్స్ సిస్టంతో సహా జీవించడం, ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లానింగ్, అభివృద్ధి, వ్యర్థాలు, నీటి నిర్వహణ, పర్యావరణ పర్యవేక్షణ, విద్య తదితర అంశాలపై వివరించారు. సెషన్ అనంతరం దక్షిణ కొరియా ప్రతినిధులు పట్టణాభివృద్ధి.. ఫైనాన్సింగ్లపై సవాళ్లు, ప్రపంచ వ్యాప్తంగా విజ్ఞానాన్ని వ్యాప్తి చేయడంపై మాట్లాడారు. తమ దేశంలోని సియోల్ నగరం ఎదుర్కొన్న నిర్దిష్ట సవాళ్లను, వాటిని తగ్గించడానికి అనుసరించిన విధానాలను, పునరాభివృద్ధికి సంబంధించిన అంశాలను సియోల్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్లు ఇన్హీ కిమ్, హుయ్ షిన్లు సమర్పించారు. చైనా, రష్యా, యూరోపియన్ కమిషన్తో పాటు భారతదేశ ప్రతినిధులు పట్టణ మౌలిక సదుపాయాలకు ఫైనాన్సింగ్ను పెంచడానికి చేపట్టిన చర్యలను ఫోకస్ చేయడానికి కేస్ స్టడీస్ను అందజేశారు. విశాఖలో క్షేత్రస్థాయి పరిశీలన వర్క్షాపు అనంతరం జీ–20 దేశాల ప్రతినిధులు విశాఖ నగరంలో విజయవంతంగా నడుస్తున్న మూడు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విశాఖ–చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రాజెక్టు (వీసీఐసీడీపీ)లోని స్మార్ట్ వాటర్ మేనేజ్మెంట్ పథకం, ముడసర్లోవ రిజర్వాయరులోని రెండు మెగావాట్ల సామర్థ్యంతో పనిచేస్తున్న మెగా ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్, జిందాల్ సంస్థ నిర్వహిస్తున్న వేస్ట్ టు ఎనర్జీ మేనేజ్మెంట్ ప్లాంట్లను వీరు సందర్శించారు. 2023 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎజెండా కింద జరుగుతున్న చర్చలను పూర్తిచేయడానికి, ప్రాక్టికల్ లెర్నింగ్ను ప్రారంభించడానికి భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను జీ–20 దేశాల ప్రతినిధులు స్వాగతించి అభినందించారు. ఇక చివరిరోజు శుక్రవారం జరిగే సమావేశంలో దేశంలోని వివిధ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల కమిషనర్లు పాల్గొంటారు. ఇందులో వీరు తమ సంస్థల్లో చేపట్టిన ప్రాజెక్టుల అనుభవాలను, విజయాలను వివరిస్తారు. అలాగే, విశాఖ పరిధిలోకి వచ్చే వీసీలు, ప్రొఫెసర్లు, విద్యార్థులు కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. -
టాప్ గేర్లో మౌలికాభివృద్ధి
న్యూఢిల్లీ: ఆర్థికవ్యవస్థకు చోదక శక్తి అయిన మౌలిక వసతుల అభివృద్ధిని శరవేగంగా కొనసాగించాలని ప్రధాని మోదీ అభిలషించారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టాక కొనసాగిస్తున్న వెబినార్ పరంపరలో శనివారం మోదీ ‘ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్: ఇంప్రూవింగ్ లాజిస్టిక్ ఎఫీషియెన్సీ విత్ పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్’ అనే అంశంపై వర్చువల్గా మాట్లాడారు. ‘ దేశ ఆర్థికరంగ ప్రగతికి పటిష్ట మౌలిక వసతులే చోదక శక్తి. మౌలికాభివృద్ధి టాప్గేర్లో కొనసాగితేనే 2047 సంవత్సరంకల్లా భారత్ సంపన్న దేశంగా అవతరించగలదు’ అని ఈ రంగం కోసం కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యలను ఆయన ప్రస్తావించారు. ‘ 2013–14 బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే ఈసారి ఈ రంగం అభివృద్ధికి ఐదు రెట్లు ఎక్కువగా నిధులు కేటాయించాం. భవిష్యత్తులో రూ.110 లక్షల కోట్ల నిధులు కేటాయిస్తాం. ఈ రంగంలోని ప్రతీ భాగస్వామ్య పక్షం కొత్త బాధ్యతలు, కొత్త సానుకూలతలు, దృఢ నిర్ణయాలు తీసుకోవాల్సిన తరుణమిది. రోడ్లు, రైల్వేలు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాల్లో అధునాతన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. దీంతో వ్యాపార అవకాశాలు ఊపందుకుంటాయి. రవాణా ఖర్చు దిగొస్తుంది. ఈ దేశమైనా వృద్ధిలోకి రావాలంటే మౌలికవసతుల కల్పన చాలా కీలకం. ఈ రంగంపై అవగాహన ఉన్నవారికి ఇది బాగా తెలుసు’ అంటూ పలు భారతీయ నగరాల విజయాలను ఆయన ప్రస్తావించారు. రెట్టింపు స్థాయిలో రహదారుల నిర్మాణం ‘2014తో చూస్తే ఇప్పుడు సగటున ఏడాదికి నిర్మిస్తున్న జాతీయ రహదారుల పొడవు రెట్టింపైంది. 600 రూట్ల కిలోమీటర్లలో ఉన్న రైల్వే విద్యుదీకరణ ఇప్పడు 4,000 రూట్ల కిలోమీటర్లకు అందుబాటులోకి వచ్చింది. 74 ఎయిర్పోర్టులుంటే ఇప్పడు 150కి పెరిగాయి. నైపుణ్యాభివృద్ధి, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఆర్థిక నైపుణ్యాలు, ఎంటర్ప్రెన్యూర్షిప్ మరింతగా పెరగాలి’’ అని మోదీ సూచించారు. ప్రగతి పథంలో భారత్ బిల్గేట్స్ ప్రశంసల వర్షం ఆరోగ్యం, అభివృద్ధి, వాతావరణం తదితర రంగాల్లో భారత్ సాధించిన ప్రగతిని కుబేరుడు, భూరి దాత బిల్ గేట్స్ పొగిడారు. భారత ప్రభుత్వం నూతన ఆవిష్కరణల కోసం పెద్ద ఎత్తున పెట్టుబడులను కేటాయిస్తే భవిష్యత్తులో భారత్ మరింతగా సర్వతోముఖా భివృద్ధిని సాధించగలదని ఆయన అభిలషించారు. ‘సురక్షిత, ప్రభావవంతమైన, అందుబాటు ధరలో వందలకోట్ల వ్యాక్సిన్ డోస్లు తయారుచేసే సత్తాను భారత్ సాధించడం గొప్పవిషయం. కోవిడ్ విపత్తు కాలంలో కోవిడ్ టీకాలను అందించి ప్రపంచవ్యాప్తంగా లక్షల జీవితాలను భారత్ కాపాడగలిగింది. పలు రకాల వ్యాధుల బారిన పడకుండా ఇతర వ్యాక్సిన్లనూ సరఫరాచేసింది. ‘శుక్రవారమే ప్రధాని మోదీని కలిశాను. సుస్థిర జగతి కోసం ఆయన చేస్తున్న కృషి కనిపిస్తోంది. సృజనాత్మకతో నిండిన భారత్లో పర్యటించడం ఎంతో ప్రేరణ కల్గిస్తోంది’ అని బిల్గేట్స్ ట్వీట్చేశారు. ‘కోవిడ్ సంక్షోభ కాలంలో 30 కోట్ల మందికి భారత్ అత్యవసర డిజిటల్ చెల్లింపులు చేసింది. సమ్మిళిత ఆర్థికవ్యవస్థకు పెద్దపీట వేసింది. 16 కేంద్ర ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ గతి శక్తి కార్యక్రమం ద్వారా రైల్వే, జాతీయరహదారులు వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమీక్షిస్తూ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలతో క్రియాశీలకంగా పనిచేయించడం డిజిటల్ టెక్నాలజీ వల్లే సాధ్యమైంది. కో–విన్, ఆధార్ సహా పలు కీలక ఆవిష్కరణలతో సాధించిన పురోగతిని ప్రపంచానికి చాటే అద్భుత అవకాశం భారత్కు జీ20 సారథ్య రూపంలో వచ్చింది. తృణధాన్యాలపై అవగాహన కోసం తీసుకుంటున్న చొరవ, చిరుధాన్యాల ఆహారం అమోఘం’’ అని గేట్స్ అన్నారు. -
రానున్నది బ్యాలెన్స్డ్ బడ్జెట్..
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే నెల 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్ సమతుల్యంగా ఉంటుందని ఎక్కువ మంది అంచనా వేస్తున్నారు. ఉపాధి కల్పనతోపాటు, మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయింపులు పెంచొచ్చని భావిస్తున్నారు. పన్నుల పరంగా సౌలభ్యం, ద్రవ్యోలోటును నియంత్రణలో ఉంచి, ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెడతారన్న అభిప్రాయాలు నిపుణులు, ఇన్వెస్టర్ల నుంచి వినిపించాయి. ‘‘ఎన్నికల ముందు బడ్జెట్ నుంచి ఇన్వెస్టర్లు మూడింటిని ఆశిస్తున్నారు. మూలధన లాభాల పన్నుకు సంబంధించి ఏకీకృత పన్ను నిర్మాణం ఇందులో ఒకటి. దీనివల్ల ఖర్చు చేసే ఆదాయం మరింత మిగులుతుంది. ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి కీలకమైన ద్రవ్య స్థిరీకరణ రెండోది. వృద్ధికి అవరోధాలుగా మారిన సబ్సిడీల స్థిరీకరణ, పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాలు, పీఎస్యూల ప్రైవేటీకరణ లేదా స్థిరీకరణపై చర్య లు ఉంటాయని అంచనా వేస్తున్నారు’’అని ఆనంద్రాఠి షేర్స్ అండ్ స్టాక్ బ్రోకర్స్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ నరేంద్ర సోలంకి తెలిపారు. ఈ నెల ఇప్పటి వరకు మార్కెట్లు ఫ్లాట్గా ఒక శ్రేణి పరిధిలోనే ట్రేడ్ అవుతుండడం తెలిసిందే. కంపెనీల ఫలితాలు సైతం మార్కెట్లకు ఉత్సాహాన్నిచ్చేంత సానుకూలంగా లేవు. కనుక బడ్జెట్ ప్రతిపాదనలపైనే మర్కెట్ గమనం ఆధారపడి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటి వరకు రూ.16,500 కోట్ల అమ్మకాలు చేశారు. చౌక వ్యాల్యూషన్లలో ట్రేడ్ అవుతున్న చైనా తదితర వర్ధమాన మార్కెట్లకు తమ పెట్టుబడులు తరలిస్తున్నారు. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనం భయాలు కూడా ఇన్వెస్టర్ల మనుసుల్లో ఉన్నాయనే అభిప్రాయం వినిపిస్తోంది. గడిచిన పదేళ్లలో బడ్జెట్కు ముందు ఆరు సందర్భాల్లో మార్కెట్లలో ర్యాలీ కనిపించింది. గత పదేళ్లలో బడ్జెట్ తర్వాత ఆరు సందర్భాల్లో మార్కెట్లు నష్టపోయాయి. బడ్జెట్ రోజు నిఫ్టీ–50 ఏడు సందర్భాల్లో నష్టాలను చవిచూసింది. వ్యాపారాలు, ఆర్థిక వ్యవస్థకు సానుకూలించే చర్యలు బడ్జెట్లో ఉంటే మార్కెట్లు సానుకూలంగా స్పందిస్తుంటాయి. ప్రతికూల ప్రతిపాదనలు ఉంటే నష్టపోతుండడం సహజం. కానీ, ఇది తాత్కాలిక పరిణామంగానే ఉంటుంది. మూలధన లాభాల పన్ను పెంచితే ప్రతికూలం ‘‘వచ్చే బడ్జెట్ ప్రభావం అన్నది అందులోని ప్రతిపాదనలపైనే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా 2023–24 ద్రవ్యలోటును మార్కెట్లు జాగ్రత్తగా గమనిస్తాయి. 6 శాతానికి పైన అంచనాలు ఉంటే అది మార్కెట్లను నిరుత్సాహపరుస్తుంది. కానీ, ఇది జరగకపోవచ్చు’’అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ వీకే విజయ్కుమార్ పేర్కొన్నారు. మూలధన లాభాల పన్నును పెంచితే అది మార్కెట్కు ప్రతికూలంగా మారుతుందున్నారు. ఆర్థిక వ్యవస్థ లేదా ఖర్చు చేసే ఆదాయం మిగులుకు సంబంధించి ఎటువంటి ప్రతిపాదనలు ఉన్నా కానీ, అవి మార్కెట్పై చెప్పుకోతగ్గ ప్రభావం చూపిస్తాయని జార్విస్ ఇన్వెస్ట్ సీఈవో సుమీత్ చందా అభిప్రాయపడ్డారు. వేతన జీవుల పన్ను శ్లాబుల్లో మార్పులు లేదా కంపెనీల మూలధన వ్యయాలకు ప్రోత్సాహకాలు లేదా పన్నుల తగ్గింపు చర్యలు ఉంటే మార్కెట్లలో ర్యాలీని చూస్తామన్నారు. పీఎల్ఐ పథకం విస్తరణ, పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదనలు, పన్ను శ్లాబుల్లో ఉపశమనం చర్యలు ఉంటే మార్కెట్లు సానుకూలంగా స్పందిస్తాయని అన్మి ప్రెసిడెంట్ కమలేష్షా అభిప్రాయపడ్డారు. బడ్జెట్ ప్రభావం మార్కెట్లపై చాలా స్వల్పకాలమేనని, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో జరిగే పరిణామాలు తదుపరి మార్కెట్లను నడిపించే అంశాలుగా పేర్కొన్నారు. ఫిబ్రవరి 1 ఫెడ్ వ్యాఖ్యలు డోవిష్గా ఉండి, ద్రవ్యోల్బణం దిగొస్తే మార్కెట్లు ర్యాలీ చేస్తాయని జియోజిత్ విజయ్కుమార్ అంచనా వేస్తున్నారు. హెల్త్కేర్, ఫెర్టిలైజర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిఫెన్స్, ఇన్సూరెన్స్, తయారీ, డిజిటలైజేషన్, కమ్యూనికేషన్, విద్య, ఎస్ఎంఈ రంగాలకు బడ్జెట్లో ప్రయోజనాలు ఉండొచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. కాంటార్ సర్వే అనలైటిక్స్ సంస్థ కాంటార్ బడ్జెట్కు ముందు నిర్వహించిన సర్వే అంశాలను పరిశీలించినట్టయితే.. ► ప్రతి నలుగురిలో ఒకరు ఉద్యోగాల తొలగింపులపై ఆందోళనతో ఉన్నారు. ► ప్రతి నలుగురిలో ముగ్గురు పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఆందోళకరమని పేర్కొన్నారు. దీన్ని కట్టడి చేసేందుకు చర్యలు అవసరమని చెప్పారు. ► సగం మంది దేశ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది వృద్ధి బాటలో కొనసాగుతుందని భావిస్తుంటే, 31 శాతం నిదానిస్తుందన్న అభిప్రాయంతో ఉన్నారు. ► మెట్రో జనాభాతో పోలిస్తే నాన్ మెట్రోల్లో 54 శాతం మంది ఆర్థిక వ్యవస్థ పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నారు. ► ఆదాయపన్ను మినహాయింపుగా ఉన్న బేసిక్ పరిమితి రూ.2.5 లక్షలను పెంచొచ్చన్న అభిప్రాయం ఎక్కువ మంది నుంచి వినిపించింది. అలాగే, గరిష్ట పన్ను 30 శాతం శ్లాబ్కు సంబంధించి ఆదాయ పరిమితిని పెంచొచ్చనే అంచనా వ్యక్తమైంది. ► సెక్షన్ 80సీ కింద పన్ను ఆదా రాయితీలు పెంచుతారని మూడింట ఒక వంతు మంది చెప్పారు. ► కరోనా మహమ్మారి దాదాపు ముగిసినట్టేనని, అయినప్పటికీ ఆరోగ్య సంరక్షణకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇవ్వాలని 55 శాతం మంది కోరుతున్నారు. ► హైదరాబాద్ సహా 12 పట్టణాల్లో గత డిసెంబర్ 15 నుంచి ఈ ఏడాది జనవరి 15 మధ్య కాంటార్ సర్వే జరిగింది. 21–55 సంవత్సరాల వయసులోని 1,892 మంది వినియోగదారులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. -
మౌలిక సదుపాయాల లేమివల్లే కశ్మీర్లో ఉగ్రభూతం: రాజ్నాథ్
న్యూఢిల్లీ: స్వాతంత్య్రానంతరం జమ్మూకశ్మీర్లో దశాబ్దాలుగా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందలేదని, అందుకే ఉగ్రవాదం విస్తరించిందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. సరిహద్దులోని ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో రూ.2,180 కోట్లతో నిర్మించిన వంతెనలు, రహదారులు, హెలిప్యాడ్లు తదితర 75 నూతన ప్రాజెక్టులను ఆయన శుక్రవారం తూర్పు లద్దాఖ్లోని దార్బుక్–ష్యోక్–దౌలత్ బేగ్ ఓల్డీలో వర్చువల్గా ప్రారంభించారు. రాజ్నాథ్ ప్రారంభించిన వంతెనల్లో.. సముద్ర మట్టానికి 14,000 అడుగుల ఎత్తున డీఎస్–డీబీఓ రోడ్డుపై నిర్మించిన 120 మీటర్ల పొడవైన ‘క్లాస్–70 ష్యోక్ సేతు’ ఉంది. వీటిని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్మించారు. వీటిలో 45 వంతెనలు, 27 రోడ్లు, రెండు హెలిప్యాడ్లు, ఒక ‘కార్బన్ న్యూట్రల్ హాబిటాట్’ ఉన్నాయి. కశ్మీర్లో 20 ప్రాజెక్టులు, లద్దాఖ్లో 18, అరుణాచల్ ప్రదేశ్లో 18, ఉత్తరాఖండ్లో 5, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్తాన్లో 14 ప్రాజెక్టులు నిర్మించారు. ‘కార్బన్ న్యూట్రల్ హాబిటాట్’లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ 57 మంది తల దాచుకోవచ్చు. -
శుద్ధ ఇంధనాలు, ఇన్ఫ్రాకు ప్రాధాన్యం ఇవ్వాలి
న్యూఢిల్లీ: పర్యావరణ అనుకూల శుద్ధ ఇంధనాలు, మౌలిక సదుపాయాల కల్పన తదితర ప్రాధాన్య రంగాల్లో పెట్టుబడులు పెంచాలని ఆసియా మౌలిక అభివృద్ధి బ్యాంకు (ఏఐఐబీ)ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. అలాగే, విద్య, ఆరోగ్యంపైనా పెట్టుబడుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఏఐఐబీ బోర్డ్ ఆఫ్ గవర్నర్ల ఏడో వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి మంత్రి సీతారామన్ మాట్లాడారు. ప్రాధాన్య రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఏఐఐబీని కోరారు. విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాలు, సామాజిక మౌలిక సదుపాయాలు, డిజిటల్ సదుపాయాలు, విద్య, ఆరోగ్య సదుపాయాల కల్పన ప్రాధాన్యతలను మంత్రి గుర్తు చేశారు. ఈ రంగాల్లో చెప్పుకోతగ్గ మార్పును తీసుకొచ్చేందుకు మరిన్ని పెట్టుబడుల అవసరం ఉందన్నారు. ఏఐఐబీ సభ్య దేశాల విస్తృత మౌలిక అవసరాలను చేరుకోవడం కేవలం ప్రభుత్వాలు చేసే కేటాయింపులతోనే సాధ్యం కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. స్వావలంబన బాటలో భారత్.. భారత్ స్వావలంబన ఆర్థిక వ్యవస్థ బాటలో ఉన్నట్టు గుర్తు చేశారు. దీంతో కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన ప్రతికూల ప్రభావాలను సమర్థంగా అధిగమించినట్టు చెప్పారు. పెద్ద ఎత్తున నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టడం, లక్ష్యాలకు అనుగుణమైన విధానాలు.. సవాళ్ల మధ్య బలంగా నిలబడేందుకు సాయపడినట్టు వివరించారు. -
ఏపీ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ అవార్డు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ అవార్డు దక్కింది. పోర్ట్ ఆధారిత మౌలిక వసతుల అభివృద్ధిలో ఏపీకి అవార్డు లభించింది. ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా నిలిచింది. నీతి ఆయోగ్ సలహాదారు సుదేందు జె. సిన్హా నేతృత్వంలోని జ్యూరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవార్డుకి ఎంపిక చేశారు. ఏపీ ప్రభుత్వం తరపున మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈ అవార్డును అందుకోనున్నారు. చదవండి: (లోన్యాప్ ఆగడాలపై ఏపీ ప్రభుత్వం సీరియస్) -
Roger Cook: ఏపీ సర్కార్ని చూస్తే అసూయగా ఉంది
సాక్షి, విశాఖపట్నం: పారిశ్రామికాభివృద్ధికి అనుగుణంగా రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం శ్రమిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని చూస్తే అసూయగా ఉందని పశ్చిమ ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రీమియర్.. ట్రేడ్, టూరిజం, సైన్స్ డెవలప్మెంట్ శాఖ మంత్రి రోజర్ కుక్ వ్యాఖ్యానించారు. విశాఖలో నిర్వహించిన ‘ఆంధ్రప్రదేశ్–పశ్చిమ ఆస్ట్రేలియా వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సు’లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుక్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. పశ్చిమ ఆస్ట్రేలియాకు ఏపీ అతిపెద్ద భాగస్వామి మాకు భారత్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామ్య దేశం. ఏ ఇతర దేశాలతోనూ ఇంత పెద్ద మొత్తంలో ఒప్పందాలు, పెట్టుబడులకు ముందుకు వెళ్లలేదు. భారత్లో అతిపెద్ద భాగస్వామి రాష్ట్రంగా ఏపీ ఉంది. భారత్లోని 70కి పైగా సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, యూనివర్సిటీలతో పరస్పర సహకారం అందిపుచ్చుకుంటున్నాం. ముంబై తర్వాత వైజాగ్.. పది రోజుల పర్యటనలో భాగంగా మా బృందంతో కలిసి విశాఖపట్నం వచ్చాం. ఇక్కడకు నేను రావడం ఇదే మొదటిసారి. ఢిల్లీ, ముంబై నగరాల్లో పర్యటించాం. తర్వాత వైజాగ్ వచ్చాం. ఇది చాలా అద్భుతమైన నగరం. ముంబై తర్వాత పర్యాటక రంగం అభివృద్ధికి ఎక్కువ అవకాశాలున్న నగరమిదే. ఇక్కడ టూరిజంలో పెట్టుబడులకు అవకాశాలు అపారం. భారత్లో ఒక్కో నగరం ఒక్కో ప్రత్యేకతని సంతరించుకుంది. ఇందులో వైజాగ్ మరింత ప్రత్యేకంగా ఉందనడంలో ఎలాంటి సందేహంలేదు. రెండు నగరాల కంటే మిన్నగా.. ముందుగా ఢిల్లీలో సదస్సు నిర్వహించినప్పుడు ఎక్కువగా పశ్చిమ ఆస్ట్రేలియా, ఢిల్లీ ప్రభుత్వాల మధ్య చర్చలు జరిగాయి. ముంబైలో టూరిజంపైనే సింహభాగం చర్చించాం. కానీ, ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక్క రంగంపైనే దృష్టిసారించలేదు. ఢిల్లీ, ముంబై కంటే మిన్నగా సదస్సు జరిగింది. రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలపై మంత్రులు, ప్రభుత్వాధికారులు చక్కగా వివరించారు. పారిశ్రామిక అభివృద్ధి బాగుంది.. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక అభివృద్ధి చాలా బాగుంది. పశ్చిమ ఆస్ట్రేలియా, ఏపీకి మధ్య వివిధ రంగాల్లో సారూప్యతలు ఉన్నాయి. ముఖ్యంగా ఎనర్జీ రంగంలో ఇరు ప్రాంతాలు ఒకేలా వ్యవహరిస్తున్నాయి. అందుకే ఎనర్జీ రంగంతో పాటు అంతర్జాతీయ విద్య, సముద్ర ఉత్పత్తులు, వ్యవసాయం మొదలైన రంగాల్లో ఆంధ్రప్రదేశ్తో కలిసి నడవాలని నిర్ణయించాం. సీఎం జగన్ ఆలోచనలు అద్భుతం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి విషయంలో ఏపీ ప్రభుత్వం చాలా కచ్చితంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుచేయాలన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలు అసూయ పుట్టించేవిగా ఉన్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విషయంలో భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కొత్త పోర్టుల అనుసంధానం నిజంగా అద్భుతమైన నిర్ణయం. ముఖ్యమంత్రిని తమ బృందం కలవాలని అనుకున్నాం. వరదల కారణంగా ఆయన బిజీగా ఉన్నట్లు చెప్పారు. అందుకే త్వరలోనే మరోసారి ఏపీలో పర్యటిస్తా. సీఎం జగన్తో భేటీ అవుతాను. -
మౌలికానికి గతి ‘శక్తి’
న్యూఢిల్లీ: మెరుగైన ప్రణాళికల రచన, అమలు, పర్యవేక్షణ ద్వారా ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి పీఎం గతి శక్తి కొత్త దిశను నిర్దేశించగలదని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ప్రాజెక్టుల అమల్లో జాప్యాలను, అధిక వ్యయాలను తగ్గించేందుకు దోహదపడగలదని ఆయన తెలిపారు. ప్రభుత్వంతో జట్టు కట్టాలని, పెట్టుబడులు పెట్టడం ద్వారా దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని ’గతి శక్తి’పై ఏర్పాటైన సమావేశంలో పాల్గొన్న సందర్భంగా కార్పొరేట్లకు సూచించారు. దేనికదే అన్న ధోరణిలో పనిచేసే వివిధ విభాగాలను సమన్వయం చేసేందుకు, సమగ్రమైన ప్రణాళికలతో ప్రాజెక్టులను అమలు చేయడంలో ఉపయోగపడేందుకు ఉద్దేశించిన పీఎం గతి శక్తి – జాతీయ మాస్టర్ ప్లాన్ను గతేడాది ప్రకటించారు. ‘ఇన్ఫ్రా ప్లానింగ్, అమలు, పర్యవేక్షణకు ఇక నుంచి పీఎం గతి శక్తితో కొత్త దిశ లభిస్తుంది. దీనితో ప్రాజెక్టుల అమల్లో జాప్యం జరగడం, ఫలితంగా వ్యయాలు పెరిగిపోవడం మొదలైనవి తగ్గుతాయి‘ అని ప్రధాని పేర్కొన్నారు. సిసలైన పీపీపీ విధానం.. ఇన్ఫ్రా ప్రణాళికల రచన నుంచి అభివృద్ధి చేసి, వినియోగంలోకి తెచ్చే దశ దాకా మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానం సిసలైన రీతిలో అమలయ్యేలా చూసేందుకు గతి శక్తి తోడ్పడుతుందని ప్రధాని చెప్పారు. భారత ఎకానమీ మరింత పటిష్టంగా మారేందుకు, అసంఖ్యాకంగా కొత్త ఉపాధి అవకాశాల కల్పనకు ఇన్ఫ్రా ఆధారిత అభివృద్ధి విధానం దోహదపడగలదని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టులను పూర్తి చేయడానికి సంబంధించి సాంప్రదాయ విధానాల్లో .. వివిధ భాగస్వాముల మధ్య సమన్వయం ఉండటం లేదని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ‘వివిధ విభాగాల వద్ద సమాచారం స్పష్టంగా లేకపోవడం ఇందుకు కారణం. పీఎం గతి శక్తితో ఇకనుంచి అందరూ పూర్తి సమాచారంతో తమ తమ ప్రణాళికలను రూపొందించుకోవడం వీలవుతుంది. దేశ వనరులను గరిష్ట స్థాయిలో సమర్థంగా వినియోగించుకోవడానికి సాధ్యపడుతుంది‘ అని ఆయన చెప్పారు. గతి శక్తి కార్యక్రమ ప్రాధాన్యత గురించి ప్రస్తావిస్తూ.. 2013–14లో ప్రభుత్వ ప్రత్యక్ష పెట్టుబడుల వ్యయాలు రూ. 2.50 లక్షల కోట్లుగా ఉండగా.. 2022–23లో ఇది రూ. 7.5 లక్షల కోట్లకు చేరిందని ప్రధాని వివరించారు. ‘సమాఖ్య విధానంలోని సహకార స్ఫూర్తిని మరింత పటిష్టంగా అమలు చేసే దిశగా, ఈ ఏడాది బడ్జెట్లో రాష్ట్రాలకు రూ. 1 లక్ష కోట్ల మేర తోడ్పాటు అందించేందుకు కేంద్రం కేటాయింపులు జరిపింది. బహువిధమైన ఇన్ఫ్రా, ఇతర ప్రయోజనకరమైన అసెట్స్పై రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ నిధులను ఉపయోగించుకోవచ్చు‘ అని ప్రధాని పేర్కొన్నారు. పుష్కలంగా డేటా.. గతి శక్తి – నేషనల్ మాస్టర్ ప్లాన్లో ప్రస్తుత, ప్రతిపాదిత మౌలిక ప్రాజెక్టులతో పాటు అటవీ భూములు, పారిశ్రామిక స్థలాలు మొదలైన వాటన్నింటికి సంబంధించి 400 పైగా రకాల డేటా అందుబాటులో ఉందని మోదీ చెప్పారు. మాస్టర్ ప్లాన్ కీలక వివరాలన్నీ ఒకే చోట సింగిల్ ప్లాట్ఫామ్లో లభ్యమవుతాయని పేర్కొన్నారు. ప్రణాళికల రచన కోసం ప్రైవేట్ రంగం వీటన్నింటినీ మరింత విస్తృతంగా ఉపయోగించుకోవచ్చని ఆయన తెలిపారు. కాగా, ప్రైవేట్, ప్రభుత్వ పెట్టుబడుల రాకకు గతి శక్తి తోడ్పడగలదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ చెప్పారు. దీనితో ఆర్థిక వ్యవస్థకు పలు ప్రయోజనాలు చేకూరగలవని ఆయన పేర్కొన్నారు. -
మౌలిక రంగంపై మరింత దృష్టి
న్యూఢిల్లీ: మౌలిక రంగం పురోగతిపై ప్రపంచ దేశాలు ఉమ్మడిగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. ఈ రంగానికి సంబంధించి నిధులను సమకూర్చడం, రుణ యంత్రాగాల ఏర్పాటు వంటి అంశాలపై కలిసికట్టుగా ముందుకు నడవాలని ఇండోనేసియా అధ్యక్షతన జరుగుతున్న జీ–20 ఆర్థికమంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల రెండవరోజు వర్చువల్ సమావేశంలో ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మౌలిక రంగంపై జరిగిన చర్చా వేదికలో పాల్గొని ఆర్థికమంత్రి ప్రసంగించినట్లు ఆర్థికశాఖ విడుదల చేసిన ఒక ట్వీట్ పేర్కొంది. ఇండోనేషియాలోని జకార్తాలో జీ20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశం శుక్రవారం కరోనాసవాళ్లను ఎదుర్కొనడం, మౌలిక రంగంలో పెట్టుబడులుసహా పలు కీలక అంశాలపై చర్చించింది. -
మౌలిక వసతుల కల్పనకు రూ.1,392 కోట్ల రుణం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం వైద్య, ఆరోగ్య రంగంలో చేపట్టిన మౌలిక వసతుల కల్పనకు నాబార్డు చేయూతనిచ్చింది. వైఎస్సార్, విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాల్లో మూడు నూతన బోధనాస్పత్రుల నిర్మాణానికి, అలాగే శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లోని ఐటీడీఏ ప్రాంతాల్లో ఐదు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి నాబార్డు రూ.1,392.23 కోట్ల రుణం మంజూరు చేసిందని నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ సుధీర్కుమార్ జన్నావర్ వెల్లడించారు. నాబార్డు రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్(ఆర్ఐడీఎఫ్) కింద ఈ సాయం అందిస్తున్నట్టు తెలిపారు. ► వైఎస్సార్, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఏర్పాటు కానున్న మూడు బోధనాస్పత్రుల్లో మేజర్ ఆపరేషన్ థియేటర్, క్లినికల్ ఓపీడీలు, డయాలసిస్, బర్న్ వార్డు, క్యాజువాలిటీ వార్డు, స్పెషలైజ్డ్ క్లినికల్ కమ్ సర్జికల్ వార్డు, ఆక్సిజన్ ప్లాంట్.. వంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని నాబార్డు సీజీఎం తెలిపారు. వైద్య విద్యకు సంబంధించి నాణ్యత ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. ► మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల్లోనూ కన్సల్టేషన్ రూమ్లు, ఆయుష్ క్లినిక్, ట్రీట్మెంట్ ప్రొసీజర్ రూమ్, డయాలసిస్ వార్డు, డయాగ్నస్టిక్ ల్యాబ్స్, ఓటీ కాంప్లెక్స్, ఓపీడీ, జనరల్, పీడియాట్రిక్, ఆర్థోపెడిక్ వార్డులు తదితర సౌకర్యాలు అందుబాటులోకొస్తాయని చెప్పారు. ► రాష్ట్రంలో విద్య, వైద్య రంగాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి నాబార్డు తగిన తోడ్పాటునందిస్తుందని ఆయన తెలిపారు. ► రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాడు–నేడు కార్యక్రమానికి నాబార్డు ద్వారా 3 వేల 92 కోట్ల రూపాయల సాయం అందించామని, ఈ నిధులతో 25 వేల 648 పాఠశాలల్లో అదనపు తరగతి గదులు నిర్మాణం, మరుగు దొడ్లు, తాగునీటి సౌకర్యం వంటి వసతులు కల్పించినట్టు చెప్పారు. అలాగే అంగన్ వాడీ కేంద్రాలు, ఇంటిగ్రేటెడ్ అగ్రి ఆక్వా ల్యాబ్స్ ఏర్పాటుకూ నాబార్డు సాయం అందించినట్టు సీజీఎం సుధీర్కుమార్ జన్నావర్ వివరించారు. -
రైల్వేస్టేషన్లలో అదనపు బాదుడుకు ప్లాన్! రైలెక్కినా దిగినా రూ.10 నుంచి 50?
న్యూఢిల్లీ: దేశంలోని పలు రైల్వే స్టేషన్ల రూపు రేఖలు మార్చేసి అద్భుతమైన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారని మనం మురిసిపోతున్నాం కానీ, ఆ మౌలిక సదుపాయాలకయ్యే ఖర్చుని ప్రయాణికులపై బాదడానికి రైల్వే శాఖ సన్నద్ధమైంది. ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్లలో రైలు ఎక్కాలన్నా, దిగాలన్నా ప్రయాణికుల జేబుకి ఇక చిల్లు పడడం ఖాయం. ఈ స్టేషన్లలో లెవీ ఫీజు వసూలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా రైల్వే శాఖ అధికారులు శనివారం వెల్లడించారు. ఆయా స్టేషన్లు వినియోగంలోకి వచ్చిన తర్వాత ఈ ఫీజులు వసూలు చేస్తామని చెప్పారు. మోదీ చిన్నతనంలో టీ అమ్మిన స్టేషన్ రైల్వే స్టేషన్ అభివృద్ధి ఫీజుని వారు ప్రయాణించే తరగతులని బట్టి రూ.10 నుంచి రూ.50 వరకు నిర్ణయించే అవకాశం ఉంది. ఈ మొత్తాన్ని టికెట్ బుక్ చేసుకునే సమయంలో అదనంగా వసూలు చేస్తారు. ఈ లెవీ ఫీజు మూడు కేటగిరీల్లో ఉంటుంది. ఏసీ తరగతుల్లో ప్రయాణించే వారి నుంచి రూ.50, స్లీపర్ క్లాసు ప్రయాణికులకు రూ.25, జనరల్ బోగీలలో ప్రయాణించే వారి నుంచి రూ.10 వసూలు చేయనున్నట్టుగా రైల్వే బోర్డు జారీ చేసిన సర్క్యులర్ వెల్లడించింది. ఆయా స్టేషన్లలో ప్లాట్ఫారమ్ టిక్కెట్ ధరని కూడా మరో 10 రూపాయలు పెంచనున్నారు. సబర్బన్ రైల్వే ప్రయాణాలకు మాత్రం ఈ లెవీ ఫీజులు ఉండవు. -
తెరపైకి మళ్లీ ఏఐజేఎస్
సాక్షి, న్యూఢిల్లీ: అఖిల భారత న్యాయ సర్వీసు (ఏఐజేఎస్) ఏర్పాటు చేసే దిశగా కేంద్రం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రాలతో కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజుజు త్వరలోనే నిర్వహించే సమావేశంలో ప్రధాన అజెండాగా ఈ అంశాన్ని తీసుకోనున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా రాష్ట్రాలతో ఏకాభిప్రాయానికి రావాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి న్యాయ వ్యవస్థలో మౌలికసదుపాయాల కల్పన మాత్రమే ఈ సమావేశం అజెండాగా ఉంది. దేశవ్యాప్తంగా న్యాయసేవలు బలోపేతం చేయడానికి ఏఐజేఎస్ పాత్ర కీలకమని కేంద్రం భావిస్తోంది. ప్రతిభ ఆధారిత అఖిల భారత ఎంపిక వ్యవస్థతో అర్హతలు కలిగిన వారి ఎంపికకు ఏఐజేఎస్ అవకాశం కల్పిస్తుందని కేంద్రం చెబుతోంది. అణగారిన, కిందిస్థాయి వర్గాలకు అవకాశాలు వస్తాయని గతంలో కేంద్రమంత్రులు వ్యాఖ్యానించిన విషయం విదితమే. -
మౌలిక సదుపాయాలు అధ్వానం
ముంబై: దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాలను మెరుగు పరచాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ అన్నారు. అందరికీ న్యాయం అందాలంటే, న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాలు అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. కానీ మన కోర్టుల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు, నిర్వహణ ఒక ప్రణాళిక లేకుండా ఉండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్కు చెందిన భవనాలను శనివారం సీజేఐ రమణ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే హాజరయ్యారు. న్యాయశాఖ మంత్రి ఎదుటే జస్టిస్ రమణ తన ఆవేదనంతా బయటపెట్టారు. దేశంలోని చాలా కోర్టుల్లో సరైన సదుపాయాలు లేవని, కొన్ని కోర్టు భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని చెప్పారు. మౌలిక సదుపాయాలు ఉంటేనే న్యాయవ్యవస్థ బాగుంటుందని, న్యాయవ్యవస్థ సమర్థంగా పనిచేస్తే ఆర్థిక రంగం వృద్ధి చెందుతుందని జస్టిస్ రమణ అభిప్రాయపడ్డారు. 2018లో సరైన సమయంలో తీర్పులు రాకపోవడం వల్ల దేశం వార్షిక జీడీపీలో 9% మూల్యం చెల్లించాల్సి వచ్చిందని ఒక అంతర్జాతీయ అధ్యయనంలో వెల్లడైనట్టుగా ఈ సందర్భంగా జస్టిస్ రమణ చెప్పారు. ఇప్పుడు తాను ప్రారంభించిన ఔరంగాబాద్ కోర్టు భవన నిర్మాణం 2011లో మొదలైందని, అది పూర్తి కావడానికి పదేళ్లు పట్టిందంటే ప్రణాళికలో ఎన్ని లోపాలున్నాయో తెలుస్తోందని అన్నారు. కేవలం క్రిమినల్స్, బాధితులు మాత్రమే కోర్టు గుమ్మం తొక్కుతారన్న అభిప్రాయం ఇప్పటికీ సామాన్యుల్లో నెలకొని ఉందని.. చాలా మంది తాము అసలు కోర్టు ముఖం కూడా చూడలేదని గర్వంగా చెప్పుకుంటారన్న జస్టిస్ రమణ అలాంటి ఆలోచనల్ని రూపుమాపి అందరూ తమ హక్కుల సాధనకు కోర్టుకు వచ్చే పరిస్థితులు కల్పించాలన్నారు. ప్రజలు కోర్టుకు రావడానికి సంకోచపడే రోజులు పోవాలని, న్యాయవ్యవస్థపై విశ్వాసం ఉండడమే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని వ్యాఖ్యానించారు. దృఢమైన న్యాయవ్యవస్థతో ప్రజాస్వామ్యం విజయవంతం: రిజిజు జస్టిస్ ఎన్.వి. రమణ మౌలిక సదుపాయాల అంశం గురించి ఆందోళన వ్యక్తం చేయడానికి ముందే కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తన ప్రసంగంలో ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే దృఢమైన న్యాయవ్యవస్థ ఉండాలన్నారు. న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడానికి కేంద్రం ఎన్నో చర్యలు చేపట్టిందన్నారు. కింది కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.9 వేల కోట్లు కేటాయిస్తూ గత మంత్రివర్గ సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ బడ్జెట్తో 4 వేల కోర్టు భవనాలు, న్యాయమూర్తులకు 4 వేల నివాసాలు కట్టించి ఇస్తామని వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నాయని రిజిజు చెప్పారు. కోర్టుల్లో పరిస్థితి ఇదీ..! కోర్టుల్లో మౌలికసదుపాయాలు ఎంత అధ్వానంగా ఉన్నాయో జస్టిస్ రమణ గణాంకాలతో సహా వివరించారు. ‘‘దేశవ్యాప్తంగా 20,143 కోర్టు భవనాలు ఉన్నాయి. 16% కోర్టుల్లో కనీసం టాయిలెట్లు లేవు. 26% కోర్టుల్లో మహిళలకు ప్రత్యేకంగా టాయిలెట్ సదుపాయం లేదు. కేవలం 54% కోర్టుల్లోనే రక్షిత మంచినీరు లభిస్తోంది. 5% కోర్టుల్లో ప్రాథమిక వైద్య సదుపాయాలు ఉన్నాయి. 32% కోర్టుల్లో రికార్డు రూములు విడిగా ఉన్నాయి. 51%కోర్టుల్లో మాత్రమే లైబ్రరీ సదుపాయం ఉంది. కేవలం 27% కోర్టుల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచా రణ చేయడానికి వీలుగా న్యాయమూర్తుల టేబుల్పై కంప్యూటర్లు ఉన్నాయి’’ అని తెలిపారు. -
ఈ నెల 13న గతి శక్తి ప్లాన్ ఆవిష్కరణ
న్యూఢిల్లీ: కనెక్టివిటీపరమైన మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన గతి శక్తి–నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాస్టర్ ప్లాన్ (ఎన్ఐఎంపీ)ని ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 13న ఆవిష్కరించనున్నారు. పరిశ్రమల్లో ఉత్పాదకత పెరిగేందుకు, స్థానిక తయారీదారులకు తోడ్పాటు అందించేందుకు, పరిశ్రమలో పోటీతత్వం పెంచేందుకు అలాగే భవిష్యత్తులో మరిన్ని ఆర్థిక మండళ్లను తీర్చిదిద్దేందుకు ఇది ఉపయోగపడనుంది. ఇన్ఫ్రా కనెక్టివిటీ ప్రాజెక్టుల సమన్వయం కోసం 16 శాఖలు 2024–25 నాటికి పూర్తయ్యే ప్రాజెక్టుల వివరాలను గతిశక్తి డిజిటల్ ప్లాట్ఫాంలో అందుబాటులో ఉంచుతాయి. వీటిలో హై రిజల్యూషన్తో ఉపగ్రహ చిత్రాలు, మౌలిక సదుపాయాలు, స్థలం, లాజిస్టిక్స్, పాలనాపరమైన సరిహద్దులు మొదలైనవి ఉంటాయి. వివిధ రవాణా సాధనాల మధ్య ప్రస్తుతం సమన్వయం లేదని, వీటిని సమన్వయపర్చే క్రమంలో ఎదురయ్యే అడ్డంకులను గతి శక్తి తొలగించగలదని అధికారులు వివరించారు. -
బూమ్ బూమ్.. ఇన్ ఫ్రా..!
బలమైన ఆర్థిక వ్యవస్థకు పటిష్టమైన మౌలిక సదుపాయాలు చాలా అవసరం. ఈ సదుపాయాలపైనే ఎన్నో పరిశ్రమల ఏర్పాటు ఆధారపడి ఉంటుంది. అందుకనే కేంద్ర సర్కారు మౌలిక సదుపాయాల అభివృద్ధి, విస్తరణకు సంబంధించి భారీ ప్రణాళికలతో ఉంది. ఇందులో భాగంగా ఇటీవలే నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ (ఎన్ఎంపీ)ను ప్రకటించింది. ఇందులో భాగంగా రహదారులు, రైల్వే, విద్యుత్ తదితర రంగాల్లోని ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు నిర్వహణకు అప్పగించనుంది. తద్వారా 2024–25 నాటికి రూ.6 లక్షల కోట్లు సమకూరుతాయని అంచనా. ఈ మొత్తాన్ని మౌలిక సదుపాయాల విస్తరణకే కేంద్రం ఖర్చు చేయనుంది. బ్యాంకింగ్ వ్యవస్థలో ఎన్పీఏల కారణంగా మౌలిక సుదుపాయాల ప్రాజెక్టులకు కొంత కాలం పాటు రుణ లభ్యత కఠినంగా మారిందని చెప్పుకోవచ్చు. కానీ, కరోనా మహమ్మారి తర్వాత పరిస్థితుల్లోనూ మార్పు కనిపిస్తోంది. మౌలిక సదుపాయాలపై కేంద్రం, రాష్ట్రాలు ప్రత్యేక దృష్టి సారిస్తున్న తరుణంలో ఈ రంగంలోని పెట్టుబడులపై ఇన్వెస్టర్లు ఓ సారి దృష్టి సారించొచ్చు. ఇన్ఫ్రా స్టాక్స్ దీర్ఘకాలం కోసం నేరుగా స్టాక్స్లో పెట్టుబడులు పెట్టుకోవాలన్న ఆలోచనతో ఉంటే.. ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ను ఎంపిక చేసుకోవచ్చు. ఎల్అండ్టీ: 2007 నవంబర్లో ఎల్అండ్టీ షేరు ధర రూ.972. గతేడాది మార్చిలో ఇదే షేరు రూ.815వరకు తగ్గగా.. ప్రస్తుతం రూ.1,740 సమీపంలో ఉంది. కొన్ని రంగాల్లోని షేర్లు ఇదే కాలంలో ఎన్నో రెట్లు పెరిగిపోయాయి. కానీ, మౌలిక రంగ షేర్లు ఇప్పటికీ ఆకర్షణీయమైన వ్యాల్యూషన్లలో ట్రేడ్ అవుతున్నాయి. నిర్మాణ, ఇంజనీరింగ్ రంగంలో ఎల్అండ్టీ దిగ్గజం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతేకాదు, ఈ కంపెనీకి చెందిన సబ్సిడరీలు (మైండ్ట్రీ, ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, ఎల్అండ్టీ టెక్నాలజీస్) ఐటీ రంగంలో మెరుగ్గా రాణిస్తున్నాయి. ఇది కూడా అదనపు బలం. 2020–21 సంవత్సరం ఆదాయంలో మౌలిక రంగ వ్యాపార వాటా 45 శాతంగా ఉంది. రూ.3.2 లక్షల కోట్ల ఆర్డర్బుక్తో కంపెనీ పటిష్టంగా కనిపిస్తోంది. పీఎన్సీ ఇన్ఫ్రాటెక్: ప్రభుత్వ ప్రణాళికలతో ఎక్కువగా ప్రయోజనం పొందే కంపెనీల్లో ఇది కూడా ఒకటి. వచ్చే రెండేళ్లలో రూ.15 లక్షల కోట్ల మేర రహదారుల విస్తరణను కేంద్రం చేపట్టనుంది. ఈ సంస్థకు రుణ భారం తక్కువగా ఉంది. 20 ఏళ్ల మంచి ట్రాక్ రికార్డు కూడా సొంతం. ఈక్విటీతో పోలిస్తే 1.37 రెట్ల రుణ భారం కలిగి ఉంది. ఆదాయం, నికర లాభాల్లో మంచి వృద్ధిని చూపిస్తోంది. రూ.12,095 కోట్ల విలువైన ఆర్డర్లు కంపెనీ చేతిలో ఉన్నాయి. ఆదాయంలో 20 శాతం వృద్ది నమోదు చేస్తామన్న అంచనాలను కంపెనీ ప్రకటించింది. ఎల్అండ్టీ మాదిరి వైవిధ్య వ్యాపారాలతో కూడిన కంపెనీ ఇది కాదు. కల్పతరు పవర్ట్రాన్స్మిషన్: విద్యుత్ సరఫరా, ఆయిల్ అండ్ గ్యాస్ పైపులైన్లు, రైల్వే, రహదారుల నిర్మాణంలోని కంపెనీ ఇది. ఆదాయాల్లోనూ మంచి వైవిధ్యం ఉంది. 2020–21 ఆదాయంలో 37 శాతం అంతర్జాతీయ కార్యకలాపాల నుంచి వచి్చంది. అప్రధాన ఆస్తులను విక్రయించడం ద్వారా రుణ భారాన్ని తగ్గించుకునే ప్రణాళికతో ఉంది. 2021 మార్చి నాటికి ఈక్విటీతో పోలిస్తే రుణభారం 0.66 రెట్లుగా ఉంది. కంపెనీ చేతిలో రూ.29,313 కోట్ల ఆర్డర్లు ఉండడంతో భవిష్యత్తు వ్యాపార వృద్ధికి చక్కని అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్ఫ్రా మ్యూచువల్ ఫండ్స్ నేరుగా స్టాక్స్లో పెట్టుబడులకు కనీస పరిజ్ఞానానికితోడు.. ఆయా కంపెనీలకు సంబంధించిన మార్పులను పరిశీలించి, అవసరమైతే పెట్టుబడి నిర్ణయాలను సమీక్షించుకునే తీరిక కూడా ఉండాలి. అందుకే నేరుగా స్టాక్స్ అందరికీ అనుకూలం కాదు. తగినంత సమయం వెచి్చంచలేని వారు.. మ్యూచువల్ ఫండ్స్ రూపంలో పెట్టుబడులు పెట్టుకోవడం మంచిది. మౌలిక సదుపాయాల రంగంలోని కంపెనీల్లోనే పెట్టుబడులు పెట్టే ఇన్ఫ్రా మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి. ఈ పథకాలు తమ నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల్లో 80 శాతాన్ని మౌలిక రంగ కంపెనీల్లోనే పెడతాయి. ఫ్రాంక్లిన్ బిల్డ్ ఇండియా ఫండ్: ఈ విభాగంలో మెరుగైన పనితీరు చూపిస్తోంది. దేశ వృద్ధి పథంపై ఈ పథకం ప్రధానంగా దృష్టి సారిస్తుంటుంది. అంటే ట్రాన్స్పోర్టేషన్, ఇన్ఫ్రా కంపెనీలే కాకుండా.. మెటీరియల్స్, ఇండ్రస్టియల్స్, ఫైనాన్షియల్ సరీ్వసెస్ కంపెనీల్లోనూ ఇన్వెస్ట్ చేస్తుంది. లార్జ్క్యాప్ కంపెనీల్లో 61 శాతం ప్రస్తుతానికి ఇన్వెస్ట్ చేసి ఉంది. కనుక మార్కెట్ కరెక్షన్లలో నష్టాల రిస్క్ కొంత తక్కువగా ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. వైవిధ్యమైన పథకంగా దీన్ని చూడొచ్చు. 2009 సెపె్టంబర్లో పథకం మొదలు కాగా.. అప్పటి నుంచి ఇప్పటి వరకు వార్షిక రాబడులు 16 శాతానికి పైనే ఉన్నాయి. ఇన్వెస్కో ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్: లార్జ్క్యాప్, మిడ్క్యాప్, స్మాల్క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. నిర్మాణం, సిమెంట్, ఇండ్రస్టియల్ ప్రొడక్ట్స్, విద్యుత్ కంపెనీల్లో ప్రధానంగా ఇన్వెస్ట్ చేస్తుంటుంది. 2013 జనవరిలో ఈ పథకం ప్రారంభం కాగా.. నాటి నుంచి వార్షిక సగటు రాబడులు 18.53 శాతంగా ఉన్నాయి. అయితే, ఏదో ఒక రంగానికి చెందిన కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేసే థీమ్యాటిక్ ఫండ్స్ (ఇన్ఫ్రా, ఫార్మా, ఐటీ.. ఇలా)లోరిస్క్ పాళ్లు ఎక్కువ. కనుక పెట్టుబడులకు తగినంత వైవిధ్యం ఉండేలా చూడాలి. వచ్చే ఐదేళ్ల కాలానికి ఇన్ఫ్రాలో పెద్ద ఎత్తున పెట్టుబడులకు అవకాశం ఉన్న నేపథ్యంలో ఐదేళ్ల కాలానికి ఈ పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. థీమ్యాటిక్ పథకాల్లో పెట్టుబడులు పెట్టడం ఎంత ముఖ్యమో సరైన సమయంలో వాటిని వెనక్కి తీసుకోవడమూ అంతే ముఖ్యం. ఇన్విట్లు పెట్టుబడిపై క్రమం తప్పకుండా ఆదాయం కోరుకునే వారు, కొంత రిస్క్ తీసుకోవడానికి సుముఖంగా ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్)లను ఎంపిక చేసుకోవచ్చు. ఇన్ఫ్రా కంపెనీలు ఏర్పాటు చేసే ప్రత్యేక పెట్టుబడుల వాహకాలే ఇని్వట్లు. కంపెనీలు తమ నిర్వహణలోని కొన్ని ప్రాజెక్టులను ఇని్వట్ కిందకు బదిలీ చేయడం ద్వారా నిధులను సమీకరించుకోవచ్చు. అలా సమకూరిన నిధులను అవి నూతన ప్రాజెక్టుల నిర్వహణ, రుణ భారం తగ్గించుకునేందుకు వినియోగించుకునే వెసులుబాటు లభిస్తుంది. సెబీ నిబంధనల ప్రకారం ఇన్విట్లు 80% నిధులను ఆదాయాన్నిచ్చే ప్రాజెక్టుల్లోనే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే, ప్రాజెక్టుల నుంచి వచ్చే ఆదాయాన్ని వాటాదారులకు పంపిణీ చేయాలి. ఒక్కో యూనిట్ వారీ నికర మిగులు పంపిణీ ఆదాయం (ఎన్డీఎస్) నుంచి 90 శాతం వాటాదారులకు ప్రతీ త్రైమాసికానికి ఒక పర్యాయం పంపిణీ చేయాలి. అలా అని ప్రతీ క్వార్టర్కు కచి్చతంగా ఇంత చొప్పున వస్తుందని ముందే అంచనా వద్దు. స్టాక్ ఎక్సే్ఛంజ్ల్లో లిస్ట్ అయిన ఇని్వట్లలో షేర్ల మాదిరే క్రయ, విక్రయాలు చేసుకునేందుకు వెసులుబాటు ఉంది. కంపెనీల వాటాలు షేర్ల రూపంలో ఉంటే.. ఇన్విట్లకు సంబంధించి యూనిట్లు ట్రేడవుతుంటాయి. కనుక షేర్ల మాదిరే, మూలధన లాభాలు, నష్టాలకు అవకాశం ఉంటుంది. డెట్, ఈక్విటీల కలయికగా (హైబ్రిడ్) దీన్ని చూడొచ్చు. ఇన్విట్ ఐపీవోల్లో కనీస పెట్టుబడి రూ.10,000–15,000. లిస్టింగ్ తర్వాత ఇంతకుముందు కనీసం 100 యూనిట్లను కొనుగోలు చేయడం, విక్రయించడమే సాధ్యమయ్యేది. ఇప్పుడు షేర్ మాదిరే ఒక్కో యూనిట్ చొప్పున కొనుగోలు చేసుకోవచ్చు. లిస్టింగ్లో ఇవీ... పవర్గ్రిడ్ ఇని్వట్, ఇండియా గ్రిడ్ ట్రస్ట్, ఐఆర్బీ ఇని్వట్ ఫండ్ లిస్ట్ అయి ఉన్నాయి. ఇందులో పవర్గ్రిడ్ ఇని్వట్ అన్నది పవర్గ్రిడ్ కార్పొరేషన్కు సంబం ధించినది. ఇండియాగ్రిడ్ ట్రస్ట్ను కేకేఆర్, స్టెరిలైట్ పవర్ ట్రాన్స్ మిషన్ స్పాన్సర్ చేస్తున్నాయి. . ఇండియాగ్రిడ్ ప్రతీ త్రైమాసికానికి ఒక్కో యూనిట్పై రూ.3ను పంపిణీ చేస్తోంది. ఐఆర్బీ ఇన్ఫ్రా నిర్వహణలోని ఇని్వట్ ఫండ్ పరిధిలో టోల్ ఆధారిత రహదారి ప్రాజెక్టులున్నాయి. రోడ్లపై వాహనాల రద్దీ ఆధారంగా ఐఆర్బీ ఇన్విట్ ఆదాయంలోనూ అస్థిరతలు ఉంటుంటాయి. ప్రతీ యూనిట్కు 2018–19లో ఎన్డీఎస్ 12.25గా ఉండగా, ఆ తర్వాతి రెండేళ్లలో రూ.10, రూ.8.5కు తగ్గడం గమనార్హం. కరోనా లాక్డౌన్ల ప్రభావం ఈ సంస్థ ఆదాయంపై పడింది. ఇండియా గ్రిడ్ ఆరంభం నుంచి ఏటా పవర్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్టులను అదనంగా చేర్చుకుంటూ వస్తోంది. దీంతో 2017–18లో రూ.448 కోట్ల ఆదాయం కాస్తా.. 2020–21 నాటికి రూ.1,675 కోట్లకు విస్తరించింది. భవిష్యత్తులో మరిన్ని ఇని్వట్లు కూడా ఐపీవోకు రానున్నాయి. లాభాలపై పన్ను.. ఇన్విట్లను కొనుగోలు చేసి, తర్వాత విక్రయించినప్పుడు వచ్చే లాభం, నష్టాలు ఆదాయపన్ను పరిధిలోకి వస్తాయి. ఇని్వట్ల నుంచి అందుకునే ఆదాయం వాటాదారుల వ్యక్తిగత ఆదాయానికి కలుస్తుంది. కనుక ఎవరికి వారే తమ ఆదాయ పన్ను శ్లాబు ఆధారంగా ఈ మొత్తంపైనా పన్ను చెల్లించాల్సి వస్తుంది. నూతన కన్సెషనల్ పన్ను విధానాన్ని ఇని్వట్ నిర్వహణలోని ప్రాజెక్టులు ఎంపిక చేసుకుంటేనే ఇది వర్తిస్తుంది. ఇన్విట్లను మూడేళ్ల తర్వాత విక్రయిస్తే దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను పరిధిలోకి లాభం వస్తుంది. అప్పుడు రూ.లక్షకు మించిన లాభంపై 10 శాతం పన్ను చెల్లించాలి. మూడేళ్లలోపు లాభాలు స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను కిందకు వస్తాయి. వీటిపై 15 శాతం పన్ను ఉంటుంది. ఆయా అంశాలన్నింటిపై సమగ్ర అవగాహన కోసం నిపుణులను సంప్రదిస్తే మంచిది. 2005–08 మధ్యకాలంలో ఇన్ఫ్రా స్టాక్స్లో పెద్ద బూమ్ కనిపించింది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత తిరిగి మౌలిక సదుపాయాల కంపెనీల స్టాక్స్ పెద్దగా ర్యాలీ చేసింది లేదు. తలకుమించిన రుణ భారంతో కొన్ని కనుమరుగు అయిపోగా.. నాణ్యమైన కంపెనీలు గట్టిగా నిలబ డ్డాయి. వీటికితోడు ఇని్వట్ రూపంలో కొత్త అవకాశాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటికి అదనంగా ఇన్ఫ్రా కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ పథకాలు కూడా ఉన్నాయి. వీటిల్లో ఇన్వెస్టర్లు తమ రిస్క్, కాల వ్యవధి, రాబడుల ఆకాంక్షల ఆధారంగా అనుకూలమైన సాధనాన్ని ఎంపిక చేసుకుని పెట్టుబడులు పెట్టుకోవచ్చు. -
టెల్కోల మౌలిక సదుపాయాల షేరింగ్కు ఓకే
న్యూఢిల్లీ: టెల్కోలు ఇకపై ప్రధాన నెట్వర్క్లు సహా ఇతర మౌలిక సదుపాయాలను పరస్పరం పంచుకునేందుకు (షేరింగ్) వెసులుబాటు కలి్పస్తూ సంబంధిత నిబంధనలను టెలికం విభాగం (డాట్) సవరించింది. దీనితో రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి టెల్కోల పెట్టుబడులు, నిర్వహణ వ్యయాల భారం గణనీయంగా తగ్గనుంది. ఇక, మొబైల్ నెట్వర్క్లకు అవసరమైన కనెక్టివిటీని కలి్పంచేందుకు శాటిలైట్ కనెక్టివిటీని ఉపయోగించుకునే దిశగా వాణిజ్యపరమైన వీశాట్ లైసెన్స్ నిబంధనల్లో కూడా డాట్ సవరణలు చేసింది. ఇప్పటిదాకా టెలికం సంస్థలు.. మొబైల్ టవర్లు, నెట్వర్క్లోని కొన్ని క్రియాశీలక ఎల్రక్టానిక్ విడిభాగాలను మాత్రమే షేర్ చేసుకునేందుకు అనుమతి ఉంది. యాంటెనా, ఫీడర్ కేబుల్ వంటి వాటికి ఇది పరిమితమైంది. తాజా సవరణతో ప్రధాన నెట్వర్క్లో భాగాలను కూడా పంచుకునేందుకు వీలవుతుందని సెల్యులార్ ఆపరేటర్ల సమాఖ్య సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచర్ తెలిపారు. దేశీయంగా డిజిటల్ కనెక్టివిటీని పెంచే క్రమంలో ఇది పురోగామి చర్యగా అభివరి్ణంచారు. 5జీ వేలంపై ట్రాయ్తో సంప్రదింపులు.. 5జీ స్పెక్ట్రం వేలానికి సంబంధించి డాట్ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ధర, వేలం వేయతగిన స్పెక్ట్రం పరిమాణం, ఇతర విధి విధానాల గురించి తగు సిఫార్సులు చేయాల్సిందిగా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ని కోరింది.