iPhone 7
-
ఫ్లిప్కార్ట్ బంపర్ ఆఫర్.. రూ.30 వేల యాపిల్ ఐఫోన్ రూ.15 వేలకే..!
ప్రముఖ ఈ-కామర్స్ పోర్టల్ ఫ్లిప్కార్ట్ యాపిల్, శామ్ సంగ్, గూగుల్, రెడ్మీ వంటి ప్రముఖ బ్రాండ్ల సెకండ్ హ్యాండ్ లేదా Refurbished స్మార్ట్ఫోన్లను ప్రత్యేక సేల్లో భాగంగా అమ్మకానికి తీసుకొచ్చింది. ఈ సేల్లో మీకు నచ్చిన యాపిల్, శామ్ సంగ్, గూగుల్, రెడ్మీ సంస్థలకు చెందిన Refurbished స్మార్ట్ఫోన్లను అతి తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ప్రముఖ ప్రీమియం యాపిల్ ఐఫోన్ 7 128జీబీ కొత్త స్మార్ట్ఫోన్ ధర రూ.30,999 అయితే, ఈ సేల్లో మీకు రూ.15,499కు లభిస్తుంది. ఈ Refurbished స్మార్ట్ఫోన్లను అమ్మకానికి తీసుకొని వచ్చే ముందు 47 రకాల తనిఖీల చేయనున్నట్లు ఫ్లిప్కార్ట్ పేర్కొంది. ఈ స్మార్ట్ఫోన్లు కొత్త మొబైల్స్ దీటుగా పనిచేయనున్నట్లు సంస్థ పేర్కొంది. యాపిల్ ఐఫోన్ 6ఎస్ Refurbished యాపిల్ ఐఫోన్ గోల్డ్ కలర్ వేరియంట్ 64 జీబీ స్మార్ట్ఫోన్ కేవలం 10,899 రూపాయలకు మాత్రమే లభిస్తుంది. దీనిలో టచ్ ఐడీ సపోర్ట్ గల 4.7 అంగుళాల రెటీనా డిస్ ప్లే ఉంది. యాపిల్ ఐఫోన్ 6ఎస్ 5 ఎంపీ సెల్ఫీ కెమెరాతో పాటు 12 ఎంపీ రియర్ కెమెరా, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఐఫోన్ 6ఎస్లో ఏ9 ప్రాసెసర్ ఉంది. ఇది సిల్వర్, స్పేస్ గ్రే రంగులలో లభిస్తుంది. యాపిల్ ఐఫోన్ 7 Refurbished యాపిల్ ఐఫోన్ 7 128జీబీ కొత్త స్మార్ట్ఫోన్ ధర రూ.30,999 అయితే, ఈ సేల్లో మీకు రూ.15,499కు లభిస్తుంది. ఇందులో ఏ10 ఫ్యూజన్ ప్రాసెసర్'ను కలిగి ఉంది. గూగుల్ పీక్సెల్ 3 ఎక్స్ఎల్ 64 జీబీ ర్యామ్ గల సెకండ్ హ్యాండ్ గూగుల్ పిక్సెల్ 3 ఎక్స్ఎల్ మొబైల్ ₹13,999కు అందుబాటులో ఉంది. పిక్సెల్ 3 ఎక్స్ఎల్'లో 6.3 అంగుళాల క్యూహెచ్ డీ+ డిస్ ప్లే, 12.2 మెగా పిక్సల్ రియర్ కెమెరా ఉన్నాయి. ఇది డ్యూయల్ 8మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్, 3,430 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. పీక్సెల్ 3ఏ కాంపాక్ట్ ఫామ్ ఫ్యాక్టర్ 64జీబీ ఫోన్ ₹10,789కు లభిస్తుంది. దీనిలో 5.6 అంగుళాల FHD+ డిస్ ప్లే, 3 ఎక్స్ఎల్ స్మార్ట్ఫోన్లో అదే రియర్ లెన్స్ ఉంది. అయితే సెల్ఫీల కోసం కేవలం 8 మెగా పిక్సల్ కెమెరా మాత్రమే ఉంటుంది. పీక్సెల్ 3ఏలో 3,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 670 ప్రాసెసర్ ఉంది. (చదవండి: రేషన్ కార్డుదారులకు కేంద్రం శుభవార్త.. వాటి లింక్ గడువు పొడిగింపు!) -
గుడ్ న్యూస్ : ఇక తక్కువ ధరలోనే ఐఫోన్ 7
సాక్షి, బెంగళూరు : ఐఫోన్ లవర్స్కు శుభవార్త. త్వరలోనే ఇండియాలో తయారైన మరో ఐఫోన్ సరసమైన ధరలో భారతీయ వినియోగదారులకు లభ్యం కానుంది. మేడిన్ ఇండియా పోర్ట్ఫోలియోలో మరో కొత్త ఫోన్ను తీసుకొస్తోంది దిగ్గజ సంస్థ ఆపిల్. ఇందులో భాగంగా బెంగళూరులో తయారీ కేంద్రంలో ఆపిల్ ఐపోన్ 7ను రూపొందిస్తోంది. ఈ ఫోన్ల అసెంబ్లింగ్ ప్రక్రియ మార్చి నెలలో ప్రారంభమైదని ఆపిల్ ఇండియా ప్రతినిధి వెల్లడించారు. భారతదేశంతో తమ దీర్ఘకాలిక నిబద్ధతను కొనసాగిస్తూ స్థానిక కస్టమర్లకోసం స్థానికంగా ఐఫోన్ 7ని ఉత్పత్తి చేస్తున్నందుకు గర్వంగా ఉందని ఆపిల్ ప్రకటించింది. భవిష్యత్తులో మేడిన్ ఇండియా పోర్టిఫోలియోను మరింత విస్తరించనుందని కూడా తెలుస్తోంది. దీంతో ఐఫోన్ 7 బేసిక్ మోడల్ రూ.39వేలకంటే తక్కువకే అందుబాటులోకి వస్తుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణ మొబైల్స్తో పోలిస్తే ఐఫోన్లు ఖరీదు ఎక్కువే. దీనికి తోడు విదేశీ స్మార్ట్ఫోన్లపై దిగుమతి సుంకాన్ని కూడా కేంద్రం భారీగా పెంచింది. ఈ నేపథ్యంలోనే సుంకాల బారి నుంచి తప్పించుకునేందుకు గత ఏడాది నుంచే భారత్లోనే తమ ఐఫోన్ల ఉత్పత్తిని చేపట్టింది ఆపిల్ సంస్థ. తైవాన్ దిగ్గజం విస్ట్రోన్ సహకారంతో బెంగళూరులోని ప్లాంట్లో ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ ఎస్ఈలను రూపొందించిన సంగతి తెలిసిందే. -
బంపర్ ఆఫర్: ఐఫోన్లపై భారీ తగ్గింపు
2018 కొత్త ఐఫోన్ మోడల్స్... ఐఫోన్ 10ఎస్, ఐఫోన్ 10ఎస్ మ్యాక్స్, ఐఫోన్ ఎక్స్ఆర్ లాంచింగ్ సందర్భంగా, పాత ఐఫోన్ వేరియంట్లపై భారీగా ధరలు తగ్గించింది ఆపిల్. దేశీయ మార్కెట్లోనూ, గ్లోబల్గా కూడా వీటి ధరలు తగ్గాయి. దేశీయ మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 6ఎస్ 32జీబీ వేరియంట్ ధర రూ.29,900కే లభ్యమవుతుంది. ఐఫోన్ 6ఎస్ ప్లస్ బేస్ వేరియంట్ ధర కూడా 34,900 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. ఐఫోన్ కొత్త ధరలను ఆపిల్ తన వెబ్సైట్లో అప్డేట్ చేసింది. అయితే ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్, ఐఫోన్ 10 లను అమెరికాలో నిలిపివేస్తున్నట్టు పేర్కొంది. కానీ భారత్లో కేవలం ఐఫోన్ ఎస్ఈ నే నిలిపివేసింది. మిగతా మూడు ఐఫోన్లను తక్కువ ధరలకు అందుబాటులోకి తెచ్చింది. ఐఫోన్ మోడల్ కొత్త ధర పాత ధర ఐఫోన్10 (256 జీబీ) రూ.1,06,900 రూ.1,08,930 ఐఫోన్10 (64 జీబీ) రూ.91,900 రూ.95,390 ఐఫోన్ 8 (64జీబీ) రూ.59,900 రూ.67,940 ఐఫోన్ 8 (256జీబీ) రూ.74,900 రూ.81,500 ఐఫోన్ 8 ప్లస్ (64జీబీ) రూ.69,900 రూ.77,560 ఐఫోన్ 8 ప్లస్ (256జీబీ) రూ.84,900 రూ.91,110 ఐఫోన్ 7 (32జీబీ) రూ.39,900 రూ.52,370 ఐఫోన్ 7 (128జీబీ) రూ.49,900 రూ.61,560 ఐఫోన్ 7 ప్లస్ (32జీబీ) రూ.49,900 రూ.62,840 ఐఫోన్ 7 ప్లస్ (128జీబీ) రూ.59,900 రూ.72,060 ఐఫోన్ 6ఎస్ (32జీబీ) రూ.29,900 రూ.42,900 ఐఫోన్ 6ఎస్ (128జీబీ) రూ.39,900 రూ.52,100 ఐఫోన్ 6ఎస్ ప్లస్ (32జీబీ) రూ.34,900 రూ.52,240 ఐఫోన్ 6ఎస్ ప్లస్ (128జీబీ) రూ.44,900 రూ.61,450 -
సముద్ర గర్భంలో దొరికిన ఐఫోన్ పనిచేస్తుందోచ్!
న్యూఢిల్లీ : మనం పొరపాటున స్మార్ట్ఫోన్ను నీళ్లలో పడేసినా లేదా కింద పడేసినా.. ఇక దాని పని అంతే. ఆ స్మార్ట్ఫోన్ను ఓ మూలన పడేసి, కొత్తది కొనుక్కోవాల్సిందే. కానీ ఆపిల్ ఐఫోన్ల విషయంలో దాన్నే ఆపాదిస్తే, మనం తప్పులో కాలేసినట్టే. ఆపిల్ ఐఫోన్లు ఫర్ఫార్మెన్స్కు మారు పేరుగా నిలుస్తున్నాయి. తాజాగా ఐఫోన్ 7 ఇదే నిరూపించింది. సముద్ర గర్భంలో నాని నాని ఉన్న ఆపిల్ ఐఫోన్ 7, బయటకి తీస్తే భలే పనిచేస్తుందట. దాని బ్యాటరీ పూర్తిగా నీళ్లలో తడిచిపోయినా కూడా ఇంకా మంచిగా పనిచేస్తూనే ఉందని డిజిటైమ్స్ వెల్లడించింది. అంతేకాక సముద్ర గర్భంలో కూడా ఈ స్మార్ట్ఫోన్ సిగ్నల్ను కరెక్ట్గా అందుకుంటుందని తెలిపింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ కెనడా సందర్శకుడికి చెందిన ఆపిల్ ఐఫోన్ 7 పొరపాటున సముద్రంలోకి పడిపోయింది. ఎంత వెతికినా అతనికి దొరకకపోయే సరికి దానిపై ఆశలు వదిలేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. యూకేకు చెందిన స్కూబా డైవర్ సిరిస్ హార్సీకి ఆ ఫోన్ దొరికింది. ఇంగ్లండ్లోని డోర్డల్ డోర్ దగ్గరిలో గల సముద్ర గర్భం నుంచి ఓ వెలుగు రావడం కనిపించింది. అదేమిటా? అని దాని వద్దకు వెళ్లి చూసింది. సముద్ర గర్బంలో వెలుగులు చిందిస్తున్న ఆ వస్తువును చూసి ఆమె షాకైంది. అది ఐఫోన్ 7. టెక్ట్స్ మెసేజ్ రావడంతో, ఆ ఐఫోన్ 7ను వెలుతురును బ్లింక్ అవుతుంది. నీటిలో మునిగి ఉన్న ఆ డివైజ్ను హార్సీ బయటకు తీసింది. 48 గంటల పాటు ఆ ఐఫోన్ అక్కడే ఉన్నట్టు తెలిసింది. అంతసేపు పూర్తిగా నీటిలోనే మునిగి ఉన్న 84 శాతం బ్యాటరీ సామర్థ్యంతో ఆ ఫోన్ మంచిగా పనిచేస్తుందని తెలిసింది. అంతేకాక సిగ్నల్స్ను కూడా అది కరెక్ట్గా పొందుతుంది. హార్సీ తనకు దొరికిన ఐఫోన్ 7 ను తన వద్దనే ఉంచుకోకుండా.. ఆ ఫోన్ పోగొట్టుకున్న కెనడియన్కు అందచేసింది. ఈ డివైజ్ వాటర్ రెసిస్టెన్స్తో ఐపీ67 రేటింగ్ను కలిగి ఉంది. ఈ కేసుతో ఐఫోన్ 7 ఎంత స్ట్రాంట్గా పనిచేస్తుందో మరోసారి వెల్లడైంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా దీని పనితీరు అద్భుతమని టెక్ విశ్లేషకులు సైతం అంటున్నారు. -
ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ మరో సేల్ను ప్రారంభించింది. ఆపిల్ వీక్ సేల్ పేరుతో ఈ ఈ-కామర్స్ దిగ్గజం వినియోగదారుల ముందుకు వచ్చింది. ఈ సేల్లో భాగంగా అతి తక్కువ ధరకు మీ ఫేవరెట్ ఆపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేసేలా అవకాశం కల్పిస్తోంది. ఐఫోన్లపై మాత్రమే కాక, ఆపిల్ 10వ వార్షికోత్సవ ఎడిషన్ ఐఫోన్ ఎక్స్, మ్యాక్బుక్స్, ఐప్యాడ్స్, ఎయిర్పాడ్స్, ఆపిల్ వాచ్ సిరీస్లపై కూడా భారీ డిస్కౌంట్లను ఫ్లిప్కార్ట్ ఆఫర్ చేస్తోంది. ఐసీఐసీఐ బ్యాంకుతో భాగస్వామ్యం ఏర్పరుచుకున్న ఆపిల్, ఎంపిక చేసిన ఆపిల్ ఉత్పత్తులపై 10 శాతం క్యాష్బ్యాక్ను అందిస్తోంది. నేటి నుంచి ప్రారంభమైన ఈ సేల్, మే 27 వరకు జరుగనుంది. ఐఫోన్ ఎక్స్... ఆపిల్ వార్షికోత్సవ ఎడిషన్ ఐఫోన్ ఎక్స్ను 85,999 రూపాయలకు అందుబాటులోకి తెస్తోంది. ఇది అసలు ధర కంటే నాలుగు వేలు తక్కువ. ఇది 64జీబీ స్టోరేజ్ మోడల్ ధర. 256జీబీ మోడల్ ధర ఐఫోన్ను 97,920 రూపాయలకు విక్రయిస్తోంది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ద్వారా ఈ ఫోన్ను కొనుగోలు చేసే కస్టమర్లకు అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్ వస్తోంది. ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్... ఐఫోన్ 8 (64జీబీ మోడల్) స్మార్ట్ఫోన్ను కూడా ఫ్లిప్కార్ట్ డిస్కౌంట్ ధరలో 62,999 రూపాయలకు విక్రయిస్తోంది. 256జీబీ స్టోరేజ్ మోడల్ను కూడా 73,999కే అందుబాటులోకి తెచ్చింది. ఐఫోన్ 8 ప్లస్ 64జీబీ స్టోరేజ్ మోడల్ను 72,999 రూపాయలు అందుబాటులోకి తీసుకురాగ, 256జీబీ మోడల్ను 85,999 రూపాయలకు విక్రయిస్తున్నట్టు ప్లిప్కార్ట్ తెలిపింది. ఐఫోన్ 6ఎస్.. ఐఫోన్ 6ఎస్ స్మార్ట్ఫోన్ను 33,999 రూపాయల నుంచి అందుబాటులోకి తెచ్చింది. ఈ స్మార్ట్ఫోన్ అసలు ధర 40వేల రూపాయలు. ఈ ధర స్పేస్ గ్రే, గోల్డ్ కలర్ వేరియంట్లు మాత్రమే. ఐఫోన్ 6ఎస్ స్మార్ట్ఫోన్ 32జీబీ రోజ్ గోల్డ్, సిల్వర్ కలర్స్ వేరియంట్లను 34,999 రూపాయలకు అందిస్తున్నట్టు ఫ్లిప్కార్ట్ తెలిపింది. ఐఫోన్ ఎస్ఈ.. ఈ స్మార్ట్ఫోన్ 32జీబీ వేరియంట్ను 17,999 రూపాయలకే ఫ్లిప్కార్ట్ విక్రయిస్తోంది. ఆపిల్ వీక్ సేల్లో ఇదే బెస్ట్ డీల్. అదనంగా కస్టమర్లకు 10 శాతం క్యాష్బ్యాక్ వస్తోంది. ఇతర డీల్స్... ఆపిల్ ఎయిర్పాడ్స్ బ్లూటూత్ హెడ్సెట్ విత్ మిక్ను 11,499కు విక్రయిస్తోంది ఆపిల్ ఇయర్పాడ్స్ విత్ 3.5ఎంఎం హెడ్ఫోన్ ప్లగ్ వైర్డ్ హెడ్సెట్ విత్ మిక్ను 1,899కు అందుబాటులోకి ఆపిల్ టీవీ 32 జీబీ మోడల్ ఏ 1625ను 14,698 రూపాయలకు విక్రయం 9.7 అంగుళాల ఆపిల్ ఐప్యాడ్ 32జీబీ మోడల్ను 22,900 రూపాయలకు ఆఫర్ 9.7 అంగుళాల ఆపిల్ ఐప్యాడ్(6వ జనరేషన్)32 జీబీ ని 28వేల రూపాయలకు అందుబాటు ఆపిల్ వాచ్ సిరీస్ల ప్రారంభ ధర 20,900 రూపాయలు -
ఫ్లిప్కార్ట్ డే 2: స్మార్ట్ఫోన్లపై గ్రేట్ డీల్స్
సాక్షి, బెంగళూరు : ఫ్లిప్కార్ట్ ఐదు రోజుల పండుగ ఫెస్టివల్ బిగ్ బిలియన్ డేస్ నిన్నటి నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. టీవీలు, స్మార్ట్వాచ్లు వంటి వాటిపై ఫ్లిప్కార్ట్ బుధవారం గ్రేట్ డీల్స్ను అందించింది. నేటి నుంచి మొబైల్, ఎలక్ట్రానిక్స్ బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. స్మార్ట్ఫోన్లపై ఫ్లిప్కార్ట్ అందిస్తున్న టాప్ ఆఫర్స్... శాంసంగ్ గెలాక్సీ ఎస్7 ధర రూ.46వేల నుంచి రూ.29,990కు తగ్గింపు, ఎక్స్చేంజ్పై రూ.23వరకు తగ్గింపు ఆపిల్ ఐఫోన్ 7(32జీబీ) రూ.38,999కే అందుబాటు, ఎక్స్చేంజ్పై రూ.15,300 వరకు తగ్గింపు, అదనంగా ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డు హోల్డర్స్పై 10 శాతం వరకు తగ్గింపు ఓప్పో ఎఫ్3 ప్లస్(64జీబీ) ఫోన్ రూ.24,990కే లభ్యం, ఎక్స్చేంజ్పై రూ.23,500 వరకు తగ్గింపు, హెచ్టీసీ యూ11 ఫోన్పై రూ.6,991 వరకు డిస్కౌంట్ ఇస్తోంది. ప్రస్తుతం ఇది రూ.44,999కే అందుబాటులో ఉంది. పాత ఫోన్ ఎక్స్చేంజ్పై రూ.20వేల వరకు ఆఫర్ కూడా ఇస్తోంది. మిడ్రేంజ్, బడ్జెట్ స్మార్ట్ఫోన్లపై ఫ్లిప్కార్ట్ డీల్స్... ఆసుస్ జెన్ఫోన్ 3ఎస్ మ్యాక్స్, లెనోవో కే8 ప్లస్(3జీబీ) ఫోన్లు రూ.8,999కే లభ్యం రెడ్మి నోట్ 4 ఫోన్ ఫ్లాట్ డిస్కౌంట్ రూ.2000. రూ.10,999కే ఫ్లిప్కార్ట్లో అందుబాటు, ఎక్స్చేంజ్లో ఈ ఫోన్పై రూ.10వేల వరకు తగ్గింపు ఉంది. ఎంఐ మ్యాక్స్2(బ్లాక్, 64జీబీ) ఫోన్ఫై రూ.2000 తగ్గింపు, రూ.14,999కే విక్రయం, ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.14వేల వరకు తగ్గిస్తోంది. మోటో ఎం(64జీబీ) ధర రూ.12,999 నోకియా 3 రూ.9,505 కొత్త ఫోన్లపై కూడా ఆసక్తికరమైన ఆఫర్లను ఫ్లిప్కార్ట్ అందిస్తోంది. పానసోనిక్ ఎలుగ రే 700 ధర రూ.10వేలు. జెన్ఫోన్ సెల్ఫీ రూ.13,999కే లభ్యం. -
ఈ స్మార్ట్ఫోన్లకు గ్లోబల్గా మస్తు గిరాకీ!
ప్రతి వారం ఓ కొత్త స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి విడుదలవుతూ.. వినియోగదారులను అలరిస్తూనే ఉంది. కొత్త కొత్త స్మార్ట్ఫోన్ల లాంచింగ్స్తో రోజురోజుకు స్మార్ట్ఫోన్ మార్కెట్ కూడా విపరీతంగా విస్తరిస్తోంది. అయితే వీటిలో ఏ ఏ స్మార్ట్ఫోన్లు వినియోగదారులను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి? బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ఫోన్లుగా ఏవి నిలుస్తున్నాయి? అంటే.. ఈ క్వార్టర్లో ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా గిరాకీ వచ్చిన స్మార్ట్ఫోన్ల జాబితాను రీసెర్చ్ కంపెనీ స్ట్రాటజీ అనాలిటిక్స్ తన క్వార్టర్లీ రిపోర్టులో వెల్లడించింది. 2017 క్యూ 2 ఎక్కువగా సేల్ అయిన స్మార్ట్ఫోన్లు... ఆపిల్ ఐఫోన్ 7... ప్రారంభ ధర రూ.56,200 ఆపిల్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ ఐఫోన్ 7, ఈ క్వార్టర్లో ఎక్కువగా మార్కెట్ షేరును సంపాదించుకుంది. 4.7 శాతం మార్కెట్ షేరుతో 16.9 మిలియన్ యూనిట్లు ఈ క్వార్టర్లో అమ్ముడుపోయాయి. ఆపిల్ ఐఫోన్ 7 ప్లస్.. ప్రారంభ ధర రూ.76,300 ఐఫోన్ 7లో అతిపెద్ద వేరియంట్ ఈ ఐఫోన్ 7 ప్లస్. ఈ స్మార్ట్ఫోన్ ఐఫోన్ 7 తర్వాత రెండో స్థానంలో నిలుస్తోంది. ఈ క్వార్టర్లో 4.2 శాతం మార్కెట్ షేరును సంపాదించుకున్న ఐఫోన్ 7 ప్లస్ స్మార్ట్ఫోన్, 15.1 మిలియన్ యూనిట్ల విక్రయాలను నమోదుచేసింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 8... ధర రూ.57,900 దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. 10.2 మిలియన్ హ్యాండ్సెట్ల షిప్మెంట్లతో ఇది 2.8 శాతం మార్కెట్ షేరును దక్కించుకుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్8 ప్లస్... ప్రారంభ ధర రూ.64,900 గ్లోబల్గా ఈ స్మార్ట్ఫోన్ ఈ క్వార్టర్లో 2.5 శాతం మార్కెట్ షేరును సంపాదించింది. ఈ క్వార్టర్లో 9 మిలియన్ యూనిట్లు రవాణా అయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ విక్రయాలను నమోదుచేసిన స్మార్ట్ఫోన్లలో గెలాక్సీ ఎస్8 ప్లస్, నాలుగో స్థానంలో నిలిచింది. షావోమి రెడ్మి 4ఏ... ధర రూ.5,999 ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ మధ్యలో బడ్జెట్ స్మార్ట్ఫోన్ రెడ్మి 4ఏ ఐదో స్థానంలో నిలిచింది. ఈ స్మార్ట్ఫోన్ రెండో క్వార్టర్లో 5.5 మిలియన్ యూనిట్ల సరుకు రవాణాను రికార్డు చేశాయి. గ్లోబల్గా ప్రస్తుతం దీని మార్కెట్ షేరు 1.5 శాతం. -
పేటీఎం ఇండిపెండెన్స్ డే సేల్: భారీ క్యాష్బ్యాక్లు
ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్కార్ట్లు తమ బంపర్ డిస్కౌంట్ సేల్స్ను ప్రకటించిన అనంతరం.. మీకంటే మీమేమనా తక్కువా అని పేటీఎం మాల్ కూడా భారీ డీల్స్ను ప్రకటించింది. ఇండిపెండెన్స్ డేకి ముందస్తుగా పేటీఎం మాల్ తన యాప్, వెబ్సైట్లో స్మార్ట్ఫోన్లు, గ్యాడ్జెట్లపై భారీ డిస్కౌంట్లకు తెరతీసింది. మంగళవారం నుంచి అంటే ఆగస్టు 8 నుంచి ఆగస్టు 15 వరకు ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు, అప్లియెన్స్, అప్పీరల్స్, యాక్ససరీస్ వంటి అన్ని ఉత్పత్తులపైనా క్యాష్బ్యాక్ ఆఫర్లను, డిస్కౌంట్లను అందించనున్నట్టు ఈ మాల్ వెల్లడించింది. ఈ సేల్ సందర్భంగా ఉత్పత్తులపై 80 శాతం వరకు తగ్గింపు, ఇంకా 20వేల రూపాయల వరకు క్యాష్బ్యాక్లను ఆఫర్ చేయనున్నట్టు పేర్కొంది. ఈ సేల్లో అతిపెద్ద హైలెట్, ఐఫోన్ 7పై 8000 రూపాయల వరకు క్యాష్బ్యాక్ను ఆఫర్ చేయడం. అంతేకాక ఐఫోన్ ఎస్ఈపై కూడా ఫ్లాట్ 15 శాతం డిస్కౌంట్, రూ.3000 క్యాష్బ్యాక్ను పేటీఎం అందిస్తోంది. దీంతో 27,200 రూపాయలుగా ఉన్న ఐఫోన్ ఎస్ఈ ధర 19,990కి దిగొచ్చింది. అంతేకాక షాపింగ్ ఓచర్లను, అదనంగా 5000 రూపాయల విలువ గల క్యాష్బ్యాక్ ఓచర్లను అందిస్తోంది. వీటిని విమానాలు, అప్పీరల్స్, మొబైల్ యాక్ససరీస్పై వాడుకోవచ్చు. ఐఫోన్ 6, ఐఫోన్ 6ఎస్ స్మార్ట్ఫోన్లు రూ.3000, రూ.3500 క్యాష్బ్యాక్లతో పేటీఎం మాల్లో లిస్టయ్యాయి. షావోమి ఇటీవల లాంచ్చేసిన ఎంఐ మ్యాక్స్ 2 కూడా పేటీఎం తన మాల్లో అందుబాటులో ఉంచింది. లెనోవో, మైక్రోమ్యాక్స్, వివో స్మార్ట్ఫోన్లపై కనీసం 10 శాతం క్యాష్బ్యాక్ను ఆఫర్ చేస్తున్నట్టు తెలిపింది. ఇక ల్యాప్టాప్ల విషయానికి వస్తే, ఆపిల్, హెచ్పీ, లెనోవో బ్రాండ్లపై రూ.20వేల వరకు క్యాష్బ్యాక్లను అందించనున్నట్టు పేటీఎం మాల్ చెప్పింది. ఆపిల్ మ్యాక్బుక్ ఎయిర్ 13 అంగుళాల దానిపై ఫ్లాట్ రూ.10వేల క్యాష్బ్యాక్, లెనోవో ఐడియాప్యాడ్ 320పై రూ.5000 క్యాష్బ్యాక్లను పేటీఎం లిస్టు చేసింది. అదేవిధంగా టీవీలు, వాషింగ్ మిషన్లపై 20వేల రూపాయల మేర క్యాష్బ్యాక్లను ఆఫర్ చేస్తోంది. మిక్సర్ గ్రైండర్స్, ఫ్యాన్లపై 20 శాతం వరకు క్యాష్ బ్యాక్ ఉంది. ఇలా పేటీఎం మాల్లో అందించే చాలా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై క్యాష్బ్యాక్ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. -
అమెజాన్లో ఐఫోన్ 6 ధరెంతో తెలుసా?
భారీ ఆఫర్లు, బంపర్ డిస్కౌంట్లతో ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన మొట్టమొదటి ప్రైమ్ డే సేల్ను నిన్న సాయంత్రం ఆరుగంటల నుంచి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ స్పెషల్ సేల్ నేటి అర్థరాత్రి(జూలై 11, అర్థరాత్రి) వరకు కొనసాగనుంది. ఈ సేల్ సందర్భంగా ఐఫోన్ 6ను 25వేల రూపాయలకే అమెజాన్ అందిస్తోంది. అంతేకాక ఈ ఫోన్ను హెచ్డీఎఫ్సీ డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా 15 శాతం డిస్కౌంట్ను కూడా అందుబాటులో ఉంచింది. దీంతో పాటు ఐఫోన్ 6ఎస్(స్పేస్ గ్రే, 32జీబీ), ఐఫోన్6ఎస్(గోల్డ్, 32జీబీ) ఫోన్లను 25 శాతం తగ్గింపుతో రూ.34,999కి విక్రయిస్తోంది. వీటితోపాటు ఐఫోన్ 7 రోజ్ గోల్డ్, బ్లాక్, గోల్డ్ వేరియంట్లు రూ.42,999కే అందుబాటులో ఉన్నాయి. ఈ వేరియంట్ల అసలు ధర రూ.56,200. ప్రస్తుతం అమెజాన్ ఆఫర్ చేస్తున్న తగ్గింపు ధరతో 23 శాతం పొదుపు చేసుకోవచ్చు. ప్రైమ్ యూజర్లు ఎల్జీ జీ6 స్మార్ట్ఫోన్ను 30 శాతం ఆదాతో 37,990 రూపాయలకే కొనుగోలు చేసుకోవచ్చని అమెజాన్ తెలిపింది. గూగుల్ పిక్సెల్ స్మార్ట్ఫోన్ ధరను కూడా తగ్గించి రూ.38,999కే విక్రయిస్తోంది. అయితే ఈ సేల్ ప్రత్యేకంగా రూ.499తో ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న తన ప్రైమ్ యూజర్లకు మాత్రమే. రెండు రకాల డీల్స్ను ఈ సేల్లో అమెజాన్ ఆఫర్చేస్తోంది. రెగ్యులర్ డిస్కౌంట్లను, ప్రత్యేక సందర్భాల్లో పరిమిత ఉత్పత్తులపై ఆఫర్ చేసే డీల్స్. ఇవే కాకుండా మరెన్నో డీల్స్, ఆఫర్లు సేల్లో ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఉన్నాయని అమెజాన్ ప్రతినిధులు చెబుతున్నారు. 30 కొత్త బ్రాండ్లను కూడా ఈ సేల్లో లాంచ్చేసింది. భారత్తో పాటు ప్రైమ్ డే సేల్ జరుగబోయే దేశాల్లో ఫ్రాన్స్, చైనా, జర్మనీ, కెనడా, బెల్జియం, జపాన్లు ఉన్నాయి. గతేడాదే అమెజాన్ ఈ సేల్ను ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేసింది. ఈ సారి భారత్లో కూడా ఎక్స్క్లూజివ్గా నిర్వహిస్తున్నారు. -
అమెజాన్ మరోసారి భారీ ఆఫర్లు
ఆన్లైన్ రీటైలర్ అమెజాన్ మరోసారి స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లకు తెర తీసింది. స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ ఫోన్ ఆధారిత డివైజ్లపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. నేటినుంచి జూన్ 21 వరకు సాగే మూడు రోజుల ధరలను ప్రకటించింది. ముఖ్యంగా మోటోరోలా, వన్ప్లస్, ఆపిల్, శాంసంగ్ తదితర బ్రాండ్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. అంతేకాదు ల్యాప్టాప్, హెడ్ఫోన్ లాంటి ఇతర ఉపకరణాలపై ఆఫర్లు , డిస్కౌంట్లను పొందవచ్చని అమెజాన్ వెల్లడించింది. ఐఫోన్ 7, వన్ప్లస్ 3 టీ , జీ5 ప్లస్, ఐఫోన్ ఎస్ఈ, కూల్పాడ్ నోట్ 5 లైట్ తదితర స్మార్ట్ఫోన్లపై ఈ తగ్గింపు ధరలను ఆఫర్ చేస్తోంది. ఐఫోన్ 7 32జీబీ, 128జీబీ, 256జీబీ ఫోన్లు రాయితీ ధరల్లో వరుసగా రూ. 42,999, రూ. 54,490,రూ. 65,900 లో లభ్యం. అలాగే రూ. 13,060 పాత స్మార్ట్ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఐఫోన్ 6 32జీబీ రూ. 24,999కే లభించనుది. దీనికి కూడా ఎక్స్ఛేంజ్ ఆఫర్ వర్తిస్తుంది. వన్ ప్లస్ 3టీపై డిస్కౌంట్ తోపాటు వొడాఫోన్ 45 జీబీ డేటా అయిదు నెలలు ఉచితం. మోటో జెడ్ ను రూ.29వేలకే అందిస్తోంది. రూ. 13వేల దాకా ఎక్స్ఛేంజ్ ఆఫర్ , శాంసంగ్ గెలాక్సీ 7 ప్రో రూ.8690కు అందుబాటులో ఉంచింది. రూ. 6,712 దాకా ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూల్ ప్యాడ్ పై రూ. 2వేలు డిస్కౌంట్ అందిస్తోంది. వీటితోపాటు ఆపిల్, హెచ్పీ, లెనోవా, డెల్ తదితర బ్రాండ్లు ల్యాప్ ట్యాప్ ధరలను కూడా భారీగా తగ్గించింది. దాదాపు రూ.10 వేల దాకా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. అంతేనా..ఈ మూడు రోజుల అమ్మకాల్లో టీవీ, ఫ్రిజ్ ఇతర పెద్ద గృహోపకరణాలపై డిస్కౌంట్ అందిస్తోంది. మరిన్ని వివరాలకు అమెజాన్ అధికారిక వెబ్సైట్ను సందర్శించాల్సిందే. -
ఐఫోన్ 7పై ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్
ఇటీవలే 'బిగ్ 10 సేల్' నిర్వహించిన ఫ్లిప్ కార్ట్ మరోసారి నేటి నుంచి సమ్మర్ షాపింగ్ డేస్ ను ప్రారంభించింది. ఈ సేల్ లో భాగంగా అన్ని ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ వేరియంట్లపై భారీ డిస్కౌంట్ ను ప్రకటించి, తగ్గింపు ధరతో అందుబాటులో తీసుకొచ్చింది.. దీంతో ఐఫోన్ 7(బ్లాక్, 32జీబీ) వేరియంట్ రూ.45,999కే అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ పై అదనంగా మరో 15వేల రూపాయల వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ ను కూడా ఫ్లిప్ కార్ట్ అందిస్తోంది. యాక్సిస్ బ్యాంకు బుజ్ క్రెడిట్ కార్డు యూజర్లు 5 శాతం క్యాష్ బ్యాక్ ను అందిస్తోంది. అంతేకాక సిటీ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డు యూజర్లకు 10 శాతం క్యాష్ బ్యాక్ నూ, ఫోన్ పే యూజర్లకు 25 శాతం డిస్కౌంట్ నూ అందిస్తున్నట్టు తెలిసింది. దీంతో మొత్తంగా ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే వారు 30వేల రూపాయల వరకు డిస్కౌంట్ ను పొందవచ్చు. సమ్మర్ షాపింగ్ డేస్ సేల్ లో భాగంగా అన్ని ఐఫోన్7, 7 ప్లస్ వేరియంట్లు 'నో కాస్ట్ ఈఎంఐ' ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చాయి.ఆపిల్ ఐఫోన్7 ప్రారంభ ధర 60వేల రూపాయల నుంచి ఉంది. ఐఫోన్ 7(జెట్ బ్లాక్, 128జీబీ) ఫోన్ 54,499 రూపాయలకు, ఐఫోన్ 7 ప్లస్(బ్లాక్, 128జీబీ) ఫోన్ 67,999లకు ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉన్నాయి.. వీటికి కూడా ఎక్స్చేంజ్ పై 15వేల రూపాయల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. అన్ని ఐఫోన్ మోడల్స్ పై ధర తగ్గింపుతో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్లను ఫ్లిప్ కార్ట్ అందిస్తోంది. -
ఐఫోన్7 వరస్ట్ ఫీచర్ను అది కాఫీ కొట్టింది!
మొబైల్ మార్కెట్లో దూసుకుపోతున్న వన్ ప్లస్... త్వరలోనే ఓ సరికొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. వన్ ప్లస్ 5 పేరుతో ఈ స్మార్ట్ ఫోన్ ను కంపెనీ లాంచ్ చేయనుందట. 2017లో తీసుకురాబోతున్నారంటూ ఎక్కువగా అంచనావేసిన ఫోన్లలో ఈ వన్ ప్లస్5 ఒకటి. ఐఫోన్ లెవల్ క్వాలిటీలో దీన్ని లాంచ్ చేస్తారని టెక్ అభిమానులు అంచనావేస్తున్నారు. కొన్ని ఫీచర్లను సైతం ఆపిల్ నుంచి వన్ ప్లస్ కాఫీకొడుతుందని తెలుస్తోంది. అయితే ఈ క్రమంలోనే భాగంగానే ఐఫోన్ 7లో లేని ఓ ఫీచర్ ను, వన్ ప్లస్5 కూడా తన స్మార్ట్ ఫోన్ లో అందించడం లేదని రిపోర్టులు చెబుతున్నాయి. అదేమిటో తెలుసా? 3.5ఎంఎం హెడ్ ఫోన్ జాక్. హెడ్ ఫోన్ జాక్ లేకుండానే ఐఫోన్7 మాదిరిగా వన్ ప్లస్ 5 స్మార్ట్ ఫోన్ కూడా మార్కెట్లోకి రానుందని రిపోర్టులు తెలుపుతున్నాయి. అంటే ఇది కేవలం బ్లూటూత్ హెడ్ ఫోన్లపైనే ఆధారపడి ఉంటుందని చెప్పాయి. హెడ్ ఫోన్ జాక్ అందించకపోతుండటంతో, ఐఫోన్ 7 మాదిరిగా, వన్ ప్లస్ కూడా తన స్మార్ట్ ఫోన్ లో మరేదైనా సరికొత్త టెక్నాలజీని తీసుకొస్తారా? అని టెక్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. వన్ ప్లస్ 5కు సంబంధించిన ఇమేజ్ లను చైనీస్ సోషల్ మీడియా సైట్ వైబో షేర్ చేసింది. లీక్ చేసిన ఈ ఫోటోలో వన్ ప్లస్ 5 స్మార్ట్ ఫోన్ కు డ్యూయల్ లెన్స్ కెమెరా, విలక్షణమైన వన్ ప్లస్ లోగో కనిపిస్తోంది.. కానీ ఈ విషయంపై వన్ ప్లస్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. వచ్చే రెండు మూడు నెలల్లోనే ఈ కొత్త ఫోన్ మార్కెట్లోకి వచ్చేస్తుంది. అసలు హెడ్ ఫోన్ జాక్ ఇస్తుందా ? లేదా? అన్నది అప్పుడే క్లారిటీగా తెలుస్తుందని టెక్ వర్గాలంటున్నాయి. ఐఫోన్ 7లో హెడ్ ఫోన్ జాక్స్ లేకపోవడం టెక్ అభిమానులను నిరాశపరిచిన సంగతి తెలిసిందే. -
బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ఫోన్ అదే!
శాన్ ఫ్రాన్సిస్కో: ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది ఎక్కువగా అమ్ముడైన స్మార్ట్ఫోన్గా యాపిల్ ‘ఐఫోన్ 7’ నిలిచింది. 2017 మొదటి త్రైమాసికంలో 2.15 కోట్ల ‘ఐఫోన్ 7’ యూనిట్లు అమ్ముడయినట్టు తాజా నివేదిక వెల్లడించింది. ప్రపంచ మార్కెట్లో జరిగిన స్మార్ట్ఫోన్ అమ్మకాల్లో ఇది ఆరు శాతంగా నమోదైంది. 1.74 కోట్ల హ్యాండ్సెట్ల అమ్మకాలతో యాపిల్ కంపెనీకే చెందిన ఐఫోన్ 7 పస్ స్మార్ట్ఫోన్ రెండో స్థానంలో నిలిచింది. అంతర్జాతీయంగా 2017 మొదటి త్రైమాసికంలో 35.33 కోట్ల స్మార్ట్ఫోన్లు సేల్ అయినట్టు స్ట్రాటజీ ఎనలిటిక్స్ నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన టాప్-5 స్మార్ట్ఫోన్లలో రెండు యాపిల్ కంపెనీవే కావడం విశేషం. 89 లక్షల యూనిట్ల అమ్మకాలతో ఒప్పో ఆర్9ఎస్ మూడో స్థానంలో ఉంది. శామ్సంగ్ గెలాక్సీ జే3, శామ్సంగ్ గెలాక్సీ జే5 నాలుగైదు స్థానాల్లో నిలిచాయి. కాగా, భారత్లో టాప్ ప్రీమియం స్మార్ట్ఫోన్గా యాపిల్ ‘ఐఫోన్ 5ఎస్’ అవతరించింది. -
ఫ్లిప్ కార్ట్ లో ఐఫోన్ 7 ఎంతో తెలుసా?
ముంబై: దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్, ఐఫోన్లపై బంపర్ ఆఫర్లు ప్రకటించింది. నేటి నుంచి ఏప్రిల్ 26 వరకు నిర్వహించనున్న ఆపిల్ డేస్ సేల్ లో భాగంగా ఆ కంపెనీ ఉత్పత్తులపై భారీగా ధరలను తగ్గిస్తున్నట్టు తెలిపింది.. ఈ సేల్ ఆఫర్ లో భాగంగా ఆపిల్ గతేడాది లాంచ్ చేసిన తన లేటెస్ట్ మొబైల్ ఐఫోన్ 7(256జీబీ) వేరియంట్ పై 20వేల రూపాయల బంపర్ డిస్కౌంట్ ను ప్రకటించింది. దీంతో ఈ వేరియంట్ కేవలం 39,999కే అందుబాటులో ఉంది. ఈ ఫోన్ అసలు ధర 59,999 రూపాయలు నుంచి 70,000 రూపాయల వరకు ఉంది. సిల్వర్, బ్లాక్, జెట్ బ్లాక్, గోల్డ్, రోజ్ గోల్డ్ రంగుల్లో ఇది లభ్యమవుతోంది. కేవలం ఐఫోన్ 7పై డిస్కౌంట్ ను మాత్రమే కాక, ఎక్స్చేంజ్ డిస్కౌంట్ ను రూ.19000 వరకు కంపెనీ ఆఫర్ చేస్తోంది. అయితే ఫోన్ ను బట్టి ఎక్స్చేంజ్ మొత్తం ఆధారపడి ఉంటుందని కంపెనీ పేర్కొంది. యాక్సిస్ బ్యాంకు బుజ్ క్రెడిట్ కార్డు హోల్డర్స్ కు అదనంగా 5 శాతం ధర తగ్గింపు దొరకనుంది. ఇతర స్టోరేజ్ వేరియంట్లు ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ లపై కూడా డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాక ఐఫోన్ 6(16జీబీ) పై 26,010 రూపాయల ధర తగ్గింపును ప్రకటించింది. దీంతో ఈ ఐఫోన్ 6 ఫ్లిప్ కార్ట్ లో 25,990 రూపాయలకే లభ్యం కానుంది. ఎక్స్చేంజ్ , యాక్సిస్ క్రెడిట్ కార్డు డిస్కౌంట్లు దీనికి వర్తిస్తాయి.. ఆపిల్ మ్యాక్ బుక్ ఎయిర్ కూడా యాక్సిస్ బ్యాంకు బుజ్ క్రెడిట్ కార్డుదారులకు 54,990 రూపాయలకే లభ్యం కానుంది. ఇతర డెబిట్, క్రెడిట్ కార్డుదారులకైతే ఆపిల్ మ్యాక్ బుక్ ఎయిర్ పై 10 శాతం డిస్కౌంట్ ను ప్రకటించింది. ఆపిల్ వాచ్ లపై 35 శాతం వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. ఆసక్తికరంగా ఐఫోన్ 7కు ఫ్లిప్ కార్ట్ అధికారిక ఆన్ లైన్ రీటైలర్ గా ఉంది. -
వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్న కంపెనీలు!
వాస్తవ విరుద్దంగా ప్రకటనలు: ఏఎస్సీఐ న్యూఢిల్లీ: యాపిల్ ఐఫోన్ 7 ప్రకటనను ఎప్పుడైనా పరిశీలనగా చూశారా...? నిజానికి ఆ ప్రకటనలో చూపించేది ఐఫోన్ 7 కాదు. ఐఫోన్ 7ప్లస్. అంటే మెరుగైన ఉత్పత్తిని చూపిస్తూ వినియోగదారులను ఆకర్షించేలా ఈ ప్రకటన ఉన్నట్టు అర్థమవుతోంది. ఇలా 143 వాణిజ్య ప్రకటనలు తప్పుదోవ పట్టించేవిగా ప్రకటనల ప్రమాణాల కౌన్సిల్ (ఏఎస్సీఐ) ప్రకటించింది. వీటిలో కోకకోలా, భారతీ ఎయిర్టెల్ వంటి దిగ్గజ కంపెనీలవి సైతం ఉన్నాయి. మొబిక్విక్, హిందూస్తాన్ యునిలీవర్, నివియా, అముల్, ఓపెరా, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ తదితర సంస్థలకు సంబంధించి 191 ఫిర్యాదులు ఏఎస్సీఐ ఆధ్వర్యంలోని ఫిర్యాదుల కౌన్సిల్కు ముందుకు వచ్చాయి. వీటిలో 143 ప్రకటనలు నిజంగానే తప్పుదోవ పట్టిస్తున్నవిగా ఏఎస్సీఐ తేల్చింది. వీటిలో ఆరోగ్య రంగానికి చెందినవి 102, విద్యా రంగ ప్రకటనలు 20, వ్యక్తిగత సంరక్షణ విభాగంలో 7, ఆహార పానీయాల విభాగంలో 6, ఇతర విభాగాల నుంచి 8 ఉన్నాయి. -
ఐ ఫోన్ 7, 7 ప్లస్లపై ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్
న్యూఢిల్లీ: ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఆపిల్ ఐ ఫోన్లపై డిస్కౌంట్ ధరలను ఆఫర్ చేస్తోంది. ఆపిల్ తాజా స్మార్ట్ఫోన్లు ఐ ఫోన్ 7 రెడ్, 7 ప్లస్ రెడ్ పై రూ. 4000 తగ్గింపు అందిస్తోంది. మొదటి రోజు అమ్మకాలపై మాత్రమే ఈ తగ్గింపు ధరలు వర్తిస్తాయని అమెజాన్ ప్రకటించింది. గత నెలలో రెడ్ కలర్ స్పెషల్ వేరియింట్ లో ఈ ఐ ఫోన్ 7, 7 ప్లస్ మోడల్స్ను ఆపిల్ లాంచ్ చేసింది. అలాగే ఇండియాలో ప్రీ బుకింగ్ లను గత వారం మొదలు పెట్టింది. ప్రస్తుతం వీటిపై అమెజాన్ ఈ స్పెషల్ డిస్కౌంట్ అందిస్తోంది. ఐ ఫోన్ 7 రూ. 66000 కే అమెజాన్ అందిస్తోంది. దీని లాంచింగ్ ధర రూ.70,000 ప్రస్తుతం ఐ ఫోన్ 7 ప్లస్ ధర రూ. 78,000గా ఉంది. దీని లాంచింగ్ ధర రూ. 82, 000 మరోవైపు 128 జీబీ వేరియంట్ ఐ ఫోన్లపై మాత్రమే ఈ ఫ్లాట్ డిస్కౌంట్ లభ్యం. అలాగే రూ. 8550 ల దాకా ఎక్సేంజ్ ఆఫర్ కూడా ప్రకటించింది. ఎక్సేంజ్ చేసుకునే డివైస్ ఆధారంగా డిస్కౌంట్ ధరను నిర్ణయిస్తారు. కాగా ఏప్రిల్ 14నుంచి ఆపిల్ ఐ ఫోన్ 7,7 ప్లస్ విక్రయించనున్నట్టు ఆపిల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐ ఫోన్ 7 256 జీబీ వేరియంట్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ధర. 80,000గా నిర్ణయించింది. -
ఐ ఫోన్ 7ప్లస్, 7లపై డిస్కౌంట్ ఆఫర్
న్యూఢిల్లీ: అప్గ్రేడ్ చేసిన ఆపిల్ ఐ ఫోన్లపై ఫ్లిప్కార్ట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. 5శాతం తగ్గింపుతోపాటు, రూ. 25వేల దాకా ఎక్సేంజ్ ఆఫర్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ లో ఆపిల్ ఐఫోన్ 7, 7 ప్లస్ స్టార్ట్ఫోన్లపై తగ్గింపు ధరలో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. అయితే పాత ఐఫోన్ హ్యాండ్సెట్లు ఎక్సేంజ్ ద్వారా మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. ముఖ్యంగా ఐఫోన్ 4, 4, 5, -5, 5 సి, 6, 6 ప్లస్, 6ఎస్ ప్లస్ , ఎస్ఈ ఫోన్లకు ఎక్సేంజ్ చేసుకునే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ఐఫోన్ 7 32జీబీ 5శాతం డిస్కౌంట్ తో రూ 57,000కు అందుబాటులో ఉంది. దీని అసలు ధర. రూ 60,000. దీనికి అదనంగా ఇతర ఐఫోన్ మోడల్స్తో మార్పిడి చేసుకున్న వినియోగదారులు రూ.21.800 తగ్గింపు ఆఫర్ తో రూ. 35,200 ల వరకు ఈ హ్యాండ్ సెట్ ధర తగ్గనుంది. అదే విధంగా, ఐఫోన్ 7 (128జీబీ) మరియు ఐఫోన్ 7 (256జీబీ ) వరుసగా రూ.43,200,రూ. 51,200 ఫ్లాట్ డిస్కౌంట్ . దీనికి ఎక్సేంజ్ ఆఫర్ అదనం. కాగా వీటి అసలు ధరలు వరుసగా రూ 70,000 , రూ .80,000లుగా ఉన్నాయి. ఐఫోన్ 7 ప్లస్ , 32జీబీ వెర్షన్ 5 శాతం డిస్కౌంట్ తర్వాత రూ 44, 800కు కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్అసలు ధరరూ. 72,000. అదేవిధంగా, 128జీబీ వెర్షన్ రూ. 52,800 (అసలు ధర రూ 82,000) కొనుగోలు చేయవచ్చు.256జీబీ రూ.60,800గా ఉండనుంది. అసలు ధర రూ. 92,000గాఉంది. (ఈ ధరలు 5 శాతం డిస్కౌంట్ + ఎక్సేంజ్ ఆఫర్ రూ.26,600 కలిపి మొత్తం రూ.31,200 తగ్గింపు తర్వాత) దీంతో పాటు యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బిఐ, కోటక్ బ్యాంక్, సిటీ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంకు లాంటి పలు బ్యాంకుల ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. అలాగే, ఐఫోన్ 7 ప్లస్ 128జీబీ గోల్డ్ కలర్ వేరియంట్, 32జీబీ, ఐఫోన్ 7 128జీబీ ఈ అప్గ్రేడ్ప్రోగ్రాం నుంచి మినహాయించిన సంగతిని గమనించగలరు. మరోవైపు తను కొనుగోలు చేసి ఐఫోన్ కు వెనుక చిన్న గీతలు పడడంతో ఎక్సేంజ్ను నిరాకరించారనీ, టైం వేస్ట్ అంటూ కోలకత్తాకు చెందిన మనోహర్ ఫ్లిప్కార్ట్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో.. కొనుగోలుదారులూ..బీ కేర్ఫుల్.. -
ఆపిల్ ఉత్పత్తులపై పేటీఎం భారీ ఆఫర్లు
డిజిటల్ లావాదేవీల్లో ఫుల్ పాపులర్ అయిన పేటీఎం, ఐఫోన్, మ్యాక్ బుక్ మోడల్స్ లాంటి ఆపిల్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు ప్రకటించింది. ది గ్రేట్ ఆపిల్ సేల్ ప్రారంభించింది. ఫిబ్రవరి 14 నుంచి ఫిబ్రవరి 16 వరకు పేటీఎం నిర్వహించే ఈ సేల్ లో మ్యాక్ బుక్ కొనుగోలుచేసిన వారికి రూ.20వేల వరకు క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నట్టు తెలిపింది. అయితే వీటిలో ఎంపికచేసిన వాటికే ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తించనుంది. ప్రస్తుతం 15 అంగుళాలు కలిగిన ఆపిల్ మ్యాక్ బుక్ రూ.1,50,000కు అందుబాటులో ఉంది. దీనిపై వినియోగదారులు రూ.20వేల వరకు క్యాష్ బ్యాక్ పొందనున్నారు. అంతేకాక మరికొన్ని ఆపిల్ ఉత్పత్తులపై కూడా పేటీఎం ఆఫర్లను అందిస్తోంది. 256జీబీ కలిగిన ఐఫోన్ 7 కొనుగోలు చేసిన వారికి రూ.12వేల క్యాష్ బ్యాక్ అందించనున్నట్టు తెలిపింది. ఈ ఐఫోన్ పేటీఎంలో రూ.92వేలుగా నమోదైంది. క్యాష్ బ్యాక్ మొత్తాన్ని ఉత్పత్తి అందించిన 24 గంటల్లోగా వినియోగదారుల పేటీఎం అకౌంట్లోకి క్రెడిట్ చేయనున్నట్టు పేర్కొంది. అయితే ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్లో ఎలాంటి క్యాష్ ఆన్ డెలివరీ లేదంట. అదేవిధంగా రూ.65వేల ధర కలిగిన 128జీబీ ఐఫోన్ 7 కొనుగోలుచేసిన వారికి, రూ.7500 క్యాష్ బ్యాక్, రూ.46వేలు ధర ఉన్న 32జీబీ ఐఫోన్ 6ఎస్ కొంటే, రూ.6000 క్యాష్ బ్యాక్, రూ.65వేల ధర కలిగిన ఆపిల్ ఐప్యాడ్ ప్రో కొంటే, రూ.9000 క్యాష్ బ్యాక్, ఆపిల్ వాచ్ కొనుగోలు చేసిన వారికి రూ.4500 వరకు క్యాష్ బ్యాక్ అందించనున్నట్టు పేటీఎం పేర్కొంది. -
ఐఫోన్లపై ఫ్లిప్కార్ట్ భారీ డిస్కౌంట్లు!
ఆపిల్ ఐఫోన్ను డిస్కౌంట్ ధరల్లో కొనుకోవాలనుకుంటున్నారా? అయితే ఇదే సరియైన సమయమట. దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ తన ప్లాట్ఫామ్లో ఆపిల్ ఫెస్ట్ నిర్వహిస్తోంది. జనవరి 10 నుంచి 13 వరకు జరిగే ఈ ఫెస్ట్లో ఐఫోన్లపై బంపర్ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోంది. ఐఫోన్లతో పాటు ఆపిల్ యాక్ససరీస్పై కూడా డిస్కౌంట్లను ఈ సైట్ ప్రకటించింది. అదనంగా ఫ్లిప్ కార్ట్లో ఐఫోన్ 6 కొనుకునే వారికి అన్ని డెబిట్, క్రెడిట్ కార్డులపై 5 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. ఆపిల్ ఫెస్ట్లో డిస్కౌంట్లేమిటో మీరే ఓ సారి చూడండి... ఆపిల్ ఐఫోన్ 7 : ఆపిల్ ఐఫోన్ 7(128జీబీ) జెట్ బ్లాక్ 7 శాతం డిస్కౌంట్తో రూ.65వేలకే అందుబాటులో ఉంటుంది. ఎలాంటి చార్జీలు లేని ఈఎంఐ ప్లాన్ నెలకు రూ.5,147 చొప్పున చెల్లించే విధంగా అందుబాటులో ఉంది. రెగ్యులర్ ఈఎంఐ అయితే నెలకు రూ.3,152 చెల్లించాలని. ఎక్స్చేంజ్పై రూ.5000 డిస్కౌంట్ తో పాటు అదనంగా ధరపై రూ.3000 తగ్గింపు ఉంది. అలా ఎక్స్చేంజ్పై రూ.23వేల వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. అదే యాక్సిస్ బ్యాంకు బుజ్ క్రెడిట్ కార్డు యూజర్లయితే అదనంగా మరో 5 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. ఐఫోన్ 7(32జీబీ) రోజ్ గోల్డ్ ఫోన్ అయితే 7 శాతం డిస్కౌంట్కి రూ.55,000కు విక్రయించనున్నారు. ఎలాంటి ఈఎంఐ ఛార్జీలు లేవు. ఎక్స్చేంజ్పై రూ.23వేల డిస్కౌంట్. అదనంగా రెగ్యులర్ ఎక్స్చేంజ్ వాల్యుకి రూ.3,000 డిస్కౌంట్. యాక్సిస్ బ్యాంకు బుజ్ క్రెడిట్ కార్డు యూజర్లు అదనంగా 5 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. 128 జీబీ ఆపిల్ ఐఫోన్ 7 రోజ్ గోల్డ్ వేరియంట్ను రూ.65,000కే విక్రయించనున్నారు. 6 శాతం డిస్కౌంట్తో ఐఫోన్7(256 జీబీ) జెట్ బ్లాక్ ఆప్షన్ మోడల్ను రూ.75,000కు ఆపిల్ విక్రయించనుంది.. ఐఫోన్ 7 ప్లస్ : ఆపిల్ ఐఫోన్ 7 ప్లస్(128జీబీ) జెట్ బ్లాక్ ఆప్షన్ను రూ.82వేలకే కొనుగోలు చేసుకోవచ్చు. అదనంగా దీనిపై రూ.23వేల వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ ఉంది. రెగ్యులర్ ఎక్స్చేంజ్ వాల్యుపై మరో రూ.3వేలు డిస్కౌంట్ ఇవ్వనున్నారు. యాక్సిస్ బ్యాంకు బుజ్ క్రెడిట్ కార్డుదారులకి 5 శాతం అదనపు ప్రయోజనం చేకూరనుంది. ఆపిల్ ఐఫోన్ 7 ప్లస్(128జీబీ) రోజ్ గోల్డ్ ఆప్షన్ను కూడా రూ.82వేలకే లభ్యం కానుంది. జెట్ బ్లాక్ రంగులో ఇతర వేరియంట్లు 258 జీబీ వేరియంట్ ధర రూ.92వేలు. ఐఫోన్ 7 ప్లస్128జీబీ) జెట్ బ్లాక్ ఆప్షన్కు ఇచ్చిన డిస్కౌంట్ ఆఫర్లనే ఈ ఫోన్కు ఫ్లిప్కార్ట్లో అందిస్తున్నారు. ఐఫోన్ 6 ఎస్ : ఆపిల్ ఐఫోన్6(16జీబీ) స్పేస్ గ్రే వేరియంట్ రూ.31,990కు కొనుకోవచ్చు. ఎక్స్చేంజ్పై రూ.24వేల వరకు డిస్కౌంట్ ఉంది. అదనంగా రెగ్యులర్ ఎక్స్చేంజ్ వాల్యుపై రూ.4,000 డిస్కౌంట్ను అందిస్తున్నారు. ఈఎంఐ రూ.1,552కే ప్రారంభమవుతుంది. ఆపిల్ 6ఎస్(32జీబీ) స్పేస్ గ్రే, రోజ్ గోల్డ్ కలర్స్ వేరియంట్లు రూ.46,999కు లభ్యం కానున్నాయి.. ఎక్స్చేంజ్పై రూ.23వేల వరకు డిస్కౌంట్, అదనంగా రెగ్యులర్ ఎక్స్చేంజ్ వాల్యుపై రూ.3000 తగ్గింపు పొందవచ్చు. అదే యాక్సిస్ బ్యాంకు బుజ్ క్రెడిట్ కార్డు యూజర్లయితే అదనంగా మరో 5 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. ఆపిల్ ఐఫోన్ 6ఎస్ ప్లస్: (32జీబీ) సిల్వర్, రోజ్ గోల్డ్ ఫోన్లు రూ.56,999కు అందుబాటులో ఉండనున్నాయి. ఎక్స్చేంజ్పై రూ.23వేల డిస్కౌంట్, అదనంగా రెగ్యులర్ ఎక్స్చేంజ్ వాల్యుపై రూ.3,000 డిస్కౌంట్ను అందిస్తున్నారు. యాక్సిస్ బ్యాంకు బుజ్ క్రెడిట్ కార్డు యూజర్లందరికీ అదనంగా మరో 5 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. ఆపిల్ ఐఫోన్ 5ఎస్ : దేశంలో ఎక్కువగా పాపులర్ అయిన ఈ మోడల్ 16 జీబీ సిల్వర్, స్పేస్ గ్రే రంగు వేరియంట్ రూ.19,999కు ఆపిల్ అందించనుంది. ఎక్స్చేంజ్పై రూ.15వేల వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నారు. ఆపిల్ యాక్ససరీస్, కీబోర్డులు, మౌస్ వంటి వాటిపై ఫ్లాట్ డిస్కౌంట్ 50, 25 శాతం ఆఫర్ చేస్తున్నారు. -
ఫ్లిప్కార్ట్తో జతకట్టి, ఆపిల్ అదరగొట్టింది!
బెంగళూరు : పండుగ సీజన్లో ఎలాగైనా భారత్లో ఐఫోన్స్ విక్రయాలు పెంచుకోవాలని భావించిన ఆపిల్, ఆన్లైన్ దిగ్గజం ఫ్లిప్కార్ట్తో దోస్తికట్టింది. ఫ్లిప్కార్ట్తో జతకట్టిన వేళ విశేషం ఆపిల్కు బాగా కలిసివచ్చింది. ఐఫోన్ విక్రయాల్లో విరగదీసింది. అక్టోబర్లో 50 శాతం ఐఫోన్ అమ్మకాలు ఫ్లిప్కార్ట్తోనే జరిగినట్టు తెలిసింది. ఆపిల్కు ఎలాంటి అవుట్టెల్స్ లేకపోవడంతో, సిటీలకు, పట్టణాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డెలివరీ చేయడానికి ఈ దోస్తీ బాగా సహకరించిందని ఆపిల్ సంబురపడుతోంది. ఆపిల్ లేటెస్ట్గా తీసుకొచ్చిన ఐఫోన్7, ఐఫోన్ 7 ప్లస్ విక్రయాలు అత్యధిక మొత్తంలో నమోదవుతూ, అక్టోబర్లో దాదాపు 2.6 లక్షల యూనిట్ల సరుకు రవాణా జరిగినట్టు టెక్నాలజీ పరిశోధన సంస్థ సైబర్మీడియా తెలిపింది. చాలామటికి ఐఫోన్ విక్రయాలు ఎక్స్చేంజ్ ఆఫర్లోనే జరిగినట్టు పేర్కొంది. 70 శాతం ఆండ్రాయిడ్ ఫోన్లను ఐఫోన్ 7ల కోసం ఎక్స్చేంజ్ చేసుకున్నట్టు వివరించింది. 30 శాతం ముందటి తరం ఐఫోన్లకు అప్గ్రేడ్గా తీసుకున్నట్టు తెలిపింది. రూ.20వేలకు ఎక్కువున్న ప్రీమియం హ్యాండ్ సెట్ కేటగిరీలో ఆపిల్ మార్కెట్ షేర్ అత్యధికంగా ఆర్జించడానికి ఈ దోస్తి దోహదం చేసిందని కొందరు విశ్లేషకులు పేర్కొన్నారు. 2016 మొదటి తొమ్మిది నెలల కాలంలో రూ.20వేలకు పైన ఉన్న హ్యాండ్ సెట్ల మార్కెట్లో ఆపిల్ షేరు 20 శాతంగా ఉండేదని సైబర్ మీడియా వెల్లడించింది. కానీ అక్టోబర్లో ఈ షేరు భారీగా పెరిగినట్టు పేర్కొంది. శాంసంగ్ నోట్ 7 ఎదుర్కొంటున్న పేలుళ్ల సమస్య కూడా ఆపిల్కు బాగా కలిసి వచ్చినట్టు సైబర్ మీడియా ప్రముఖ విశ్లేషకుడు(టెలికాం) ఫైసల్ కావూసా తెలిపారు. ఒక్క భారత్లోనే కాక ప్రపంచవ్యాప్తంగా కూడా శాంసంగ్ గెలాక్సీ పేలుళ్ల సమస్య ఆపిల్కు లబ్ది చేకూరుస్తుందన్నారు. రెడింగ్టోన్ ఇన్గ్రామ్, రాశి ఫెరిఫిరల్స్ డిస్ట్రిబ్యూటర్ల ద్వారా ఆపిల్ ఇన్ని రోజులు ఐఫోన్లను భారత్లో విక్రయించేది. కానీ మొదటిసారి సంప్రదాయానికి భిన్నంగా, ఈ పండుగ సీజన్లో ఆన్ లైన్ దిగ్గజం ఫ్లిప్కార్ట్తో జతకట్టి, డైరెక్ట్గా తానే ఐఫోన్ విక్రయాలను భారత్లో చేపట్టింది. -
ఐఫోన్లతో ఇల్లు కొనేసింది!
బుర్రలో విషయం ఉన్నోళ్లు ఏడారిలో సైతం ఇసుక అమ్మగలరు. అతితెలివి తేటలున్నోళ్లు తిమ్మిని బమ్మిని చేసేసి బతికేస్తుంటారు. చైనాలో ఓ అమ్మడు ఐఫోన్లతో ఏకంగా ఇల్లు కొనేసింది. బాయ్ ఫ్రెండ్స్ ఇచ్చిన ఐఫోన్లను అమ్మేసి ఏంచక్కా సొంతిల్లు సమకూర్చుకుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సహోద్యోగి చెప్పడంతో వెలుగులోకి వచ్చింది. చైనాలో ఐఫోన్లు బహుమతిగా ఇచ్చి ప్రేమను వ్యక్తం చేయడం పిచ్చిగా మారిందనడానికి ఈ ఉదంతం అద్దం పడుతోంది. షియోలీ(ఇది అసలు పేరు కాకపోవచ్చు) అనే యువతి తన దగ్గర ఉన్న 20 ఐఫోన్లను ఆన్ లైన్ లో అమ్మేసి సుమారు 12 లక్షల రూపాయలు పోగేసింది. ఈ డబ్బును డౌన్ పేమెంట్ గా చెల్లించి ఇల్లు కొక్కుకుంది. షియోలీకి 20 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని ఆమె సహద్యోగి ఒకరు 'తియాన్ యా యి డూ' బ్లాగ్ ద్వారా ఫ్రౌడ్ ఖియొబా పేరుతో వెల్లడించాడు. వాళ్లందరి నుంచి ఐఫోన్ 7 గిఫ్ట్ గా ఆమె తీసుకుందని తెలిపాడు. చైనాకు వలసవచ్చిన కుటుంబంలో జన్మించిన ఆమె ముందుచూపుతోనే ఇల్లు కొనుక్కుని వుండొచ్చని అభిప్రాయపడ్డాడు. అయితే ఆమె ఇల్లు కొనుక్కున్న పద్ధతే తనకు నమ్మశక్యంగా లేదని ఆశ్చర్యపోయాడు. ఈ విషయం గురించి తెలియగానే షియోలీ కొనుకున్న ఇల్లు చూడాలని, ఆమె డబ్బు ఎలా కూడబెట్టిందో తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి కనబరిచారని వెల్లడించాడు. షియోలీని ఇంటర్వ్యూ చేయడానికి మీడియా వెంటపడింది. అయితే మీడియాతో మాట్లాడేందుకు ఆమె నిరాకరించింది. షీయోలీ స్టోరీ '20 మొబైల్స్ ఫర్ ఏ హౌస్' హ్యాష్ టాగ్ తో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ చేశారు. కొంతమంది ఆమెను ప్రసంసిస్తే, మరికొంత మంది ఆమె చేసిన పని కరెక్ట్ కాదని తిట్టిపోశారు. -
ఐఫోన్ 7 ఫ్రీగా వస్తుందన్న కక్కుర్తితో..!
ఫ్రీగా వస్తే పినాయిల్ తాగే వ్యక్తులు ఉంటారని తరచుగా ఆ మాట వింటూనే ఉంటాం. ప్రస్తుతం దానికి భిన్నమైన ఘటన ఉక్రెయిన్ లో జరిగింది. ఓ యువకుడు స్మార్ట్ ఫోన్ పిచ్చితో ఏకంగా తన పేరును శాశ్వతంగా మార్చేసుకున్నాడు. వినడానికి ఇది విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. ఆ వివరాలిలా ఉన్నాయి.. ఓలెజ్ఞాండర్ తురిన్(20) ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలో ఉండేవాడు. అతడికి స్మార్ట్ ఫోన్స్ అంటే విపరీతమైన ఇష్టం. అందులో ఏకంగా ఐఫోన్ 7 వస్తుందంటే ఆగుతాడా. ఉక్రెయిన్ యువకుడు రాజధాని కీవ్ నగరంలో ఓ ఆఫర్ గురించి విన్నాడు. అదేమంటే.. కీవ్ లోని ఐఫోన్ స్టోర్ బంపర్ ఆఫర్ అంటూ.. పేరు మార్చుకునేందుకు సిద్ధంగా ఉన్న వ్యక్తులలో తొలి ఐదుగురికి ఐఫోన్ 7 ఫ్రీ అని ప్రకటించింది. దీంతో ఏ మాత్రం వెనుకాడకుండా ఓలెజ్ఞాండర్ అందుకు అంగీకరించాడు. స్టోర్ వాళ్ల ఆఫర్ మేరకు 'ఐఫోన్ సిమ్ సెవెన్' గా తనపేరు మార్చుకున్నాడు. 'ప్రతి మనిషి తనను తాను ఏదో ఒక కొత్త తరహాలో ఆవిష్కరించుకోవాలనుకుంటారు కదా. ప్రస్తుతం తాను కూడా అందరికంటే భిన్నంగా ఉండాలని భావించాను. మరో వ్యక్తి గతంలో ఇదే తరహాలో తన పేరును ట్విట్టర్ అని మార్చుకున్నాడు. అలాంటిది నేను ఐఫోన్ కోసం పేరు మార్చుకుంటే తప్పేముంది' అని ఐఫోన్ సిమ్ సెవెన్ అన్నాడు. ఓలెజ్ఞాండర్ తురిన్ సోదరి మాట్లాడుతూ.. ఈ విషయాన్ని తాము జీర్ణించకోలేకపోతున్నామని, నమ్మడానికి చాలా కష్టంగా ఉన్నా తప్పడం లేదన్నారు. సెవెన్ గా పేరు మార్చుకోవడంతో ఒక్కరోజులోనే స్థానికంగా సెలబ్రిటీ అయిపోయాడు. -
ఐఫోన్ మళ్లీ పేలింది!
సిడ్నీ: శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 స్మార్ట్ ఫోన్లు పేలుతున్న ఘటనలు తరచుగాగా చోటు చేసుకోవడంతో ఆ కంపెనీ గత త్రైమాసికంలో ఆ కంపెనీ మార్కెట్ పై ప్రభావం చూపింది. శాంసంగ్ నుంచి పోటీ తగ్గుతుందని యాపిల్ సంబరపడింది. కానీ ప్రస్తుతం యాపిల్ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. తాజాగా దిగ్గజ కంపెనీ యాపిల్ ఐఫోన్లు పేలుతుండటం ఆ కంపెనీ యూజర్లను ఆందోళనకు గురిచేస్తుంది. గతంలో ఓసారి ఐఫోన్ 6, మరోసారి ఐఫోన్ 7 ప్లస్ బ్లాక్ కలర్ మోడల్ స్మార్ట్ ఫోన్ పేలిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఐఫోన్ 7 పేలిపోయి ఓ కారులోని వస్తువులు పూర్తిగా దగ్దమయ్యాయి. ఈ ఘటన ఆస్ట్రేలియా లోని న్యూసౌత్ వెల్స్ లో చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. తన పేరు మాట్ జోన్స్ అని తాను సర్ఫింగ్ కు వెళ్లగా తన ఐఫోన్ పేలిపోయిందని అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేశాడు. తాను సర్ఫింగ్ కు వెళ్తూ ఐఫోన్ 7ను కారులో వదిలివెళ్లానని, తిరిగొచ్చి చూసే సరికి కారు నిండా దట్టమైన పొగ వ్యాపించిందని చెప్పాడు. కేవలం వారం కిందటే ఐఫోన్ తాను కొనుగోలు చేయగా.. అంతలోనే ఫోన్ పేలిపోయిందన్నాడు. తాను కేవలం కంపెనీ ఇచ్చిన ఛార్జర్ మాత్రమే వాడినట్లు తెలిపాడు. బ్యాటరీల తయారీలో లిథియం-అయాన్ వాడుతున్న స్టార్ట్ ఫోన్ల లోనే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. పేలుడుకు సంబంధించిన ఘటనపై విచారణ చేపట్టామని గతంలో ఐఫోన్లు పేలిన సందర్భంలో కంపెనీ ప్రతినిధులు చెప్పారు. అయితే ఆగస్టులోనే ఐఫోన్ తొలిసారిగా పేలినా.. రెండు నెలల తర్వాత కూడా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. కొన్ని రోజుల కిందట ఐఫోన్ 6 పేలి ఓ వ్యక్తి గాయపడిన ఘటన ఆస్ట్రేలియాలో కలకలం రేపింది. సిడ్నీకి చెందిన మేనేజ్మెంట్ కన్సల్టెంట్ గారెత్ క్లియర్ బైకుపై వెళుతుండగా వెనుక జేబులో పెట్టుకున్న ఐఫోన్ నుంచి ఒక్కసారిగా మంటలు ప్రారంభమయ్యాయి. ఈ ఘటనలో అతడికి గాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. (తప్పక చదవండీ: స్మార్ట్ దిగ్గజాలను ఏడు నెంబర్ ఏడిపిస్తోందా?) -
ఐఫోన్7లో మనకు తెలియని మరో కొత్త ఫీచర్!
న్యూయార్క్ : మీరు కొత్తగా కొనుకున్న ఐఫోన్7లో హోమ్ బటన్ పనిచేయడం లేదా..? అయితే ఏమాత్రం ఆందోళన పడకండి. దానికి ఓ పరిష్కారం ఉందట. ఓ వర్చ్యువల్ బటన్ను(దాగిఉన్న హోమ్ బటన్) ఆపిల్ సంస్థ ఐఫోన్7లో పొందుపరిచిందట. ఫిజికల్ హోమ్ బటన్ పనిచేయడం ఆగిపోయినప్పుడు, వెంటనే ఈ వర్చ్యువల్ బటన్ ఆన్ అయిపోతుందట. అయితే ఈ వర్చ్యువల్ హోమ్ బటన్ ఎక్కడ ఉంటుందా అనేదే సందేహమా.. ఈ బటన్ను ఐఫోన్7 ఫోన్ల స్క్రీన్ కింద భాగంలో ఆ సంస్థ అమర్చిందని ఆపిల్-ట్రాకింగ్ వెబ్సైట్ మ్యాక్రూమర్స్ వెల్లడించింది. ఐఫోన్7 హోమ్ బటన్ను ఈ ఏడాదే కొత్తగా రీడిజైన్ చేశారు. ఈ కొత్త హోమ్ బటన్ ఫింగర్ప్రింట్ సెన్సార్, అదనపు ఒత్తిడితో దీన్ని ఆన్ చేయవచ్చు. బటన్ను యూజర్లు నొక్కినప్పుడు ఇది వైబ్రేట్ అవుతుంది. అదేవిధంగా ఆ బటన్ యాక్టివేట్ అయినట్టు యూజర్లకు వెంటనే తెలిసిపోతుందని ఫార్చ్యూన్ రిపోర్టు చేసింది.ఈ ఫీచర్ టెక్నికల్గా దాగిఉంటుందని, ఫిజికట్ బటన్ పనిచేయనప్పుడు, ఇది ఆన్ అవుతుందని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. పాత పద్ధతులకు స్వస్తి చెబుతూ హోమ్ బటన్లో మార్పులు తీసుకురావాలని ఆపిల్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఐఫోన్ నుంచి తర్వాత రాబోతున్న గ్లాస్ వేరియంట్ల కోసం హోమ్ బటన్లో ఆపిల్ మార్పులు తెస్తున్నట్టు సమాచారం. చిన్నచిన్నగా ఫిజికల్ హోమ్ బటన్ల వాడకాన్ని ఆపిల్ సంస్థ తొలగిస్తుందని టాక్. -
ఐఫోన్7 యూజర్లకు ఎయిర్టెల్ సూపర్ ఆఫర్
న్యూఢిల్లీ : ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్ యూజర్లకు దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎయిర్టెల్ ఇన్ఫినిటీ పోస్ట్పెయిడ్ ప్లాన్తో నెలకు 10జీబీ 4జీ/3జీ డేటాను ఏడాది పాటు కొత్త ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్ వినియోగదారులు ఉచితంగా వాడుకునేలా అవకాశం కల్పిస్తున్నట్టు సునిల్ భారతీ మిట్టల్ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. కొత్త ఐఫోన్7 ఫోన్లు నిన్నటి నుంచే భారత వినియోగదారుల ముంగిట్లోకి వచ్చాయి. రిటైల్ దుకాణాల్లోనూ లేదా ఎయిర్టెల్ అధికారిక వెబ్సైట్లోనూ ఈ ఫోన్లను కొనుకోవచ్చని కంపెనీ తెలిపింది. తాజా ఐఫోన్ల కొనుగోలు చేసిన కస్టమర్లకు ఎయిర్టెల్ మొబైల్ బ్రాండ్బ్యాండ్ నెట్వర్క్ ఇన్ఫినిటీ ప్లాన్స్పై ఉచిత డేటాను, అపరిమిత వాయిస్కాలింగ్ను ఆఫర్ చేయనున్నట్టు భారత, దక్షిణాసియా డైరెక్టర్ అజయ్ పురి చెప్పారు. ఈ ఉచిత డేటా ప్లాన్కు అదనమని టెలికాం కంపెనీ పేర్కొంది. ఈ ఉచిత డేటా విలువ ఏడాదికి దాదాపు రూ.30వేల వరకు ఉంటుందని కంపెనీ అధికారులు తెలుపుతున్నారు. ఇన్ఫినిటీ పోస్ట్పెయిడ్ ప్లాన్స్ కింద అపరిమిత వాయిస్ కాలింగ్(లోకల్, ఎస్టీడీ, నేషనల్ రోమింగ్), 3జీ/4జీ డేటా, ఎస్ఎమ్ఎస్, వైంక్ మ్యూజిక్, వైంక్ మూవీస్కు ఉచిత సబ్స్క్రిప్షన్ను ఈ ప్లాన్స్ కింద ఎయిర్టెల్ ఆఫర్ చేస్తోంది. -
ఐఫోన్7 కొనుగోలుపై బంపర్ ఆఫర్స్!!
ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఐఫోన్7, ఐఫోన్ 7 ప్లస్ స్మార్ట్ఫోన్లు, నేడు భారత వినియోగదారుల ముగింట్లోకి రానున్నాయి. ఈ ఫోన్లను కొనుక్కోవాలని ఆశిస్తున్న కస్టమర్ల కోసం ఈ-కామర్స్ వెబ్సైట్లు డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించేశాయి. ఈ-కామర్స్ దిగ్గజాలు ఆఫర్ చేస్తున్న 5 డీల్స్, డిస్కౌంట్స్ ఏమిటో ఓ సారి చూద్దాం.. ఫ్లిప్కార్ట్ ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్ స్మార్ట్ఫోన్లపై రూ.24,500 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ను ఇవ్వనున్నట్టు తెలిపింది. అమెజాన్ సైతం ఎక్స్చేంజ్ డిస్కౌంట్ను రూ.16వేల వరకు ఆఫర్ చేసింది. ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్లు ఈ కొత్త ఐఫోన్లపై ఈఎంఐ ఆప్షన్లను అందుబాటులో ఉంచాయి. ఐఫోన్7 ఈఎంఐ ఆప్షన్ రూ.2,910 నుంచి ప్రారంభమవుతుంది. ఐఫోన్ 7 ప్లస్ వినియోగదారులు నెలసరి వాయిదాల్లో రూ.3,967 చెల్లించుకోవచ్చు. అదేవిధంగా స్నాప్డీల్ వెబ్సైట్లో కూడా ఐఫోన్ 7 ఈఎంఐ రూ.2,852 నుంచి, ఐఫోన్ 7ప్లస్ ఈఎంఐ రూ.3,898 నుంచి మొదలవుతుంది. క్యాష్బ్యాక్ ఆఫర్లను కూడా ఈ-కామర్స్ దిగ్గజాలు ప్రకటించాయి. సిటీ బ్యాంకు కార్డ్స్తో ఈ ఫోన్లను కొన్నవారికి ఫ్లాట్పై రూ.10వేల క్యాష్బ్యాక్ ఇవ్వనున్నట్టు ఫ్లిప్కార్ట్ తెలిపింది. 2017 జనవరి 8న ఈ మొత్తాన్ని క్రెడిడ్ చేయనున్నట్టు వెల్లడించింది. అమెజాన్ సైతం ఐఫోన్7, 7ప్లస్ కొన్న హెచ్డీఎఫ్సీ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డు హోల్డర్స్కు ఫ్లాట్పై రూ.11వేల క్యాష్బ్యాక్ను ఆఫర్ చేసింది. పేటీఎం రూ.7వేల వరకు క్యాష్బ్యాక్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. టాటా సీఎల్ఐక్యూలో కొత్త ఫోన్లను హెచ్డీఎఫ్సీ డెబిట్, క్రెడిట్ కార్డులపై కొనుగోలు చేసిన వారికి రూ.10వేల క్యాష్బ్యాక్ను ఆఫర్ చేయనున్నారు. తాజా ఐఫోన్లను కొనుగోలుచేసిన ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డు హోల్డర్స్కు 10శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్ అందించనున్నట్టు ఫ్లిప్కార్ట్ తెలిపింది. అదేవిధంగా స్నాప్డీల్ సైతం వివిధ డెబిట్, క్రెడిట్ కార్డు వినియోగదారులకు 20 శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్ ప్రకటించింది. పాత ఐఫోన్లను కొత్త ఐఫోన్7 ఫోన్లతో ఎక్స్చేంజ్ చేసుకునే వారు అమెజాన్లో రూ.4వేల గిప్ట్ కార్డు కూడా పొందనున్నారు. ప్రైమ్ సర్వీసు యూజర్లకు కేవలం రూ.500 గిప్ట్ కార్డును మాత్రమే అందించనున్నట్టు అమెజాన్ వెల్లడించింది. -
భారత్లో ఐఫోన్7 లాంచింగ్.. ఎన్నింటికో తెలుసా?
ఆపిల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్ స్మార్ట్ఫోన్లు నేటి నుంచి భారత మార్కెట్లోకి ప్రవేశించనున్నాయి. ఆపిల్ కొత్త బ్యాచ్ ఐఫోన్ల ఆవిష్కరణ ఇప్పటివరకు పడమర వైపు దేశాలన్నింటిలోనూ అర్థరాత్రినే జరిగాయి. కానీ దానికి భిన్నంగా భారత్లో శుక్రవారం సాయంత్రం ఏడు గంటల నుంచే ఈ ఫోన్లను మార్కెట్లోకి విడుదలచేయాలని ఆపిల్ నిర్ణయించింది. దేశరాజధానిలోను చాలా రిటైల్ దుకాణాలు ఇప్పటికే నేటి సాయంత్రం నుంచి ఐఫోన్ 7లను విక్రయించనున్నట్టు చెప్పేశాయట. గతంలో మాదిరిగా థర్డ్ పార్టీ అమ్మకందారులతో సంబంధం లేకుండా యాపిల్ నేరుగా ఫ్లిప్కార్ట్ వంటి ఈ-కామర్స్ సంస్థలతో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. ఈ-రిటైలర్లలో ముందుగా బుక్ చేసుకున్న వినియోగదారులకి షెడ్యూల్ ప్రకారం నేటి నుంచి అందనున్నాయి. జెట్ బ్లాక్, బ్లాక్, రోజ్ గోల్డ్, సిల్వర్ రంగుల్లో అధికారికంగా ఈ ఫోన్లు అందుబాటులో ఉండనున్నాయి. యాపిల్ ఇప్పటికే భారత్లో ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్ ధరలను ప్రకటించింది. మూడు స్టోరేజ్ వేరియంట్లు 32జీబీ,128జీబీ, 256జీబీలలో ఈ ఫోన్లు మార్కెట్లోకి వస్తున్నాయి. 32జీబీ ఐఫోన్7 ధర..రూ.60,000 128జీబీ ఐఫోన్7ధర...రూ.70,000 256జీబీ ఐఫోన్7ధర.. రూ.80,000 32జీబీ ఐఫోన్7 ప్లస్ ధర.. రూ.72,000 128జీబీ ఐఫోన్7 ప్లస్ ధర.. రూ.82,000 256జీబీ ఐఫోన్7 ప్లస్ ధర.. రూ.92,000 ఐఫోన్ 7 ఫీచర్స్... 4.70 అంగుళాల డిస్ప్లే క్వాడ్ -కోర్ ప్రాసెసర్ 750x1334 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఐఓఎస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ 2జీబీ ర్యామ్ 32జీబీ స్టోరేజ్ 12 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 7 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 1960ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ ఐఫోన్ 7 ప్లస్ ఫీచర్స్... 5.50 అంగుళాల డిస్ప్లే క్వాడ్-కోర్ ప్రాసెసర్ 1080x1920 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఐఓఎస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ 3జీబీ ర్యామ్ 32జీబీ స్టోరేజ్ 12 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 7 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 2900ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ -
స్మార్ట్ దిగ్గజాలను ఏడు నెంబర్ ఏడిపిస్తోందా?
స్మార్ట్ఫోన్ దిగ్గజాలకు ఏడు నెంబర్ ఏడిపిస్తోందా? అసలు అచ్చికి రావడం లేదా? అంటే అవుననే అనిపిస్తోంది.ఇటీవలే శాంసంగ్ తాజా స్మార్ట్ఫోన్ గెలాక్సీ నోట్7 పేలుడు ఘటనలు మార్కెట్లో తీవ్ర సంచలనం రేపగా.. ఇప్పడు అదే బాటలో మరో దిగ్గజం ఆపిల్కు షాక్ తగిలిందట. ఐఫోన్ 7 ప్లస్ బ్లాక్ కలర్ మోడల్ పేలిపోయిందని వార్తలు బయటికి పొక్కాయి. ఎప్పుడూ ఒకరినొకరు కాఫీ చేసుకుంటూ స్మార్ట్ఫోన్ ప్రపంచాన్ని ఏలే ఈ రెండు దిగ్గజాలు ఏడు నెంబర్తో తాజా ఫ్లాగ్షిప్లను విడుదల చేశాయి. కానీ ఈ రెండింటికి ఏడు నెంబర్ షాకిస్తూ పేలుడు ఘటనలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే గెలాక్సీ నోట్7 పేలుళ్ల సమస్య శాంసంగ్కు తీవ్ర నష్టాన్ని చేకూర్చింది. శాంసంగ్ గెలాక్సీ నోట్7 బ్యాటరీ లోపంతో పేలిపోగా, ఐఫోన్ 7 ప్లస్ బ్లాక్ మోడల్ సరియైన కారణాలు వెల్లడికాలేదు. ఈ ఫోన్ను ఆర్డర్ చేసుకున్న వినియోగదారుని దగ్గరికి పేలిపోయిన ఫోన్ డెలివరీ అయింది. ఆర్డర్ను అందుకుని బాక్స్ తెరిచిచూడగానే పేలిపోయిన ఫోన్ను గుర్తించినట్టు వినియోగదారుడు పేర్కొన్నాడు.ఫ్యాక్టరీ నుంచి డెలివరీ అయ్యే మధ్యలో ఈ పేలుడు సంభవించి ఉంటుందని ఫోన్ యజమాని చెబుతున్నాడు. ఆపిల్ ఈ విషయంపై ఇప్పటికీ బహిరంగంగా ఎలాంటి కామెంట్ చేయలేదు.కానీ విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఐఫోన్ను ఆర్డర్ చేసుకున్న వినియోగదారుడు రీప్లేస్మెంట్ కోసం ఆపిల్ సంస్థను ఆశ్రయించాడు. ప్రస్తుతం పేలిపోయిన ఐఫోన్ 7 ప్లస్ బ్లాక్ కలర్ మోడల్ ఫోటోలు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. -
మరో 30దేశాల్లో ఐ ఫోన్ 7 ఎంట్రీ
న్యూయార్క్ : పండగ సీజన్ లో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రముఖ మొబైల్ మేకర్ ఆపిల్ సంసిద్ధమవుతోంది. ఇటీవల ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన సూపర్ ఐ ఫోన్ 7 ,7 ప్లస్ స్మార్ట్ ఫోన్లను మరో 30 దేశాల్లో విడుదల చేసింది. దీపావళి షాపింగ్ కోసం శనివారం నుంచి రష్యా, సౌదీ అరేబియా, స్లొవాకియా, స్లోవేనియా, అన్డోరా, బహరేన్, బోస్నియాఅండ్ హెర్జెగోవినా, బల్గేరియా, క్రొయేషియా, సైప్రస్, చెక్ రిపబ్లిక్, ఎస్టోనియా, గ్రీస్, గ్రీన్ల్యాండ్, గర్న్సీ, హంగేరి, ఐస్లాండ్, జెర్సీ, కొసావో, కువైట్, లాట్వియా, లిక్తెన్స్తీన్, లిథువేనియా, మాల్దీవులు, మాల్టా, మొనాకో, పోలాండ్, కతర్, రోమేనియా దేశాల్లో అమ్మకాలు ప్రారంభించింది. దీంతోపాటు వాచ్ సిరీస్ 1 కి అప్ డేటెడ్ వెర్షన్ ఆపిల్ వాచ్ సిరీస్ 2 ను మరో 20 దేశాల్లో అధికారికంగా ఈ రోజు లాంచ్ చేసింది. కాగా సెప్టెంబర్ 16న దాదాపు 28 దేశాల్లో లాంచ్ అయిన ఐ ఫోన్ 7, 7 ప్లస్ స్మార్ట్ ఫోన్ల కు అనూహ్య స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలోనే దేశంలో ప్రపంచం నలుమూలల ఈ ఫోన్ ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఐ ఫోన్ 7, 7 ప్లస్ లను అక్టోబర్ 7 న లాంచ్ చేయనున్న సంగతి తెలిసిందే. -
ఫ్లిప్కార్ట్తో జతకట్టిన యాపిల్
టెక్ దిగ్గజం యాపిల్, ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్ స్మార్ట్ఫోన్లను భారత్లో విక్రయించడానికి ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్తో జతకట్టింది. ఆన్లైన్లో ఈ ఫోన్ల అందుబాటుని మరింత విస్తరించడానికి ఫ్లిప్కార్ట్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు యాపిల్ ఇండియా ప్రకటించింది. అక్టోబర్ 7 నుంచి ఈ కొత్త ఫోన్లు భారత్లో విడుదల కానున్నాయి. ఈ భాగస్వామ్యంతో ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్లు అధికారిక ధరల ప్రకారం ఆన్లైన్ రిటైలర్లో అందుబాటులో ఉండనున్నాయి. ఈ డీల్తో గతంలో మాదిరిగా థర్డ్ పార్టీ అమ్మకందారులతో కాకుండా యాపిల్ నేరుగా ఈసారి ఫ్లిప్కార్ట్ ద్వారానే ఐఫోన్లను విక్రయించనుంది. ఐఫోన్7 సిరీస్ ఫోన్లతో పాటు, పాత ఐఫోన్ మోడల్స్ను సైతం ఫ్లిప్కార్ట్లో నమోదుకానున్నాయి. ఈ మాదిరి ఆన్లైన్ సైటుతో యాపిల్ ఒప్పందం కుదుర్చుకోవడం ఇదే మొదటిసారి. గత కొన్నేళ్లుగా ఐఫోన్ల విక్రయానికి భాగస్వామిగా ఉంటున్న ఇన్ఫిబీమ్ కూడా ఈ ఫోన్లను అందించనుంది. యాపిల్ ఇప్పటికే భారత్లో ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్ ధరలను ప్రకటించింది. ఐఫోన్7 ఫోన్ 32జీబీ వేరియంట్ రూ.60,000 నుంచి ప్రారంభమవుతుంది. అంతే స్టోరేజ్ కెపాసిటీ కలిగి ఉన్న ఐఫోన్ 7 ప్లస్ను రూ.72,000కు విక్రయించనుంది. 128 జీబీ, 256 జీబీ ఐఫోన్ 7 వేరియంట్లు రూ.70వేలు, రూ.80వేలుగా కంపెనీ ప్రకటించింది. అదేవిధంగా 128జీబీ, 256జీబీ ఐఫోన్7 ప్లస్ స్మార్ట్ఫోన్ వేరియంట్లు రూ.82వేలు, రూ.92వేలుగా ఉండనున్నాయి. -
ఐఫోన్7 అప్పుడే అవుట్ ఆఫ్ స్టాక్
మెరిసే గాడ్జెట్లపై ఎక్కువగా ఆసక్తిచూపే స్మార్ట్ఫోన్ ప్రియుల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన జెట్ బ్లాక్ కలర్ ఆప్షన్ ఐఫోన్7 స్టాక్ అప్పుడే అయిపోయిందట. ఐఫోన్ 7 ప్లస్, అన్నీ జెట్ బ్లాక్ ఐఫోన్7 ఫోన్లు ఇప్పటికే అమ్ముడుపోయినట్టు యాపిల్ వెల్లడించింది. ముందస్తు రిజిస్ట్రేషన్లతో ఈ ఫోన్లన్నీ అమ్ముడుపోయినట్టు ప్రకటించిన యాపిల్, ఈ ఫోన్ కొనుకుందామని ఆశగా శుక్రవారం స్టోర్కు విచ్చేసే వినియోగదారులకు ఇవి పరిమితంగా మాత్రమే అందుబాటులో ఉంటాయని ఓ ప్రకటనలో పేర్కొంది. రిజర్వేషన్ లేకుండా వచ్చే కస్టమర్లకు సప్లై చేయలేకవచ్చని వెల్లడించింది. పరిమిత పరిమాణంలో మాత్రమే ఈ సిల్వర్, గోల్డ్, రోజ్ గోల్డ్, బ్లాక్ రంగుల్లో ఐఫోన్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. శుక్రవారం నుంచి అన్ని రిటైల్ దుకాణాల్లో ఈ ఫోన్లను అందుబాటులోకి తెస్తున్నారు. అయితే ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లతోనే అన్ని అమ్ముడుపోవడంతో, పరిమితంగా మాత్రమే ఈ ఫోన్లు వినియోగదారులకు లభించనున్నాయి. యాపిల్ జెట్ బ్లాక్ ఐఫోన్స్, ఐఫోన్7 ప్లస్ మోడల్స్ అన్నీ ముందస్తు ఆన్లైన్ ఆర్డర్తో పూర్తిగా అమ్మేసినట్టు, ప్రస్తుతం ఎలాంటి ఇన్వెంటరీ లేదని తెలిపింది. ఒకవేళ జెట్ బ్లాక్ రంగులో ఐఫోన్ కావాలనుకుంటే, ఆన్లైన్లో ఆర్డరు చేసి, కొన్ని రోజులు వేచిచూడాల్సి ఉందని యాపిల్ పేర్కొంది. స్టోర్లలో ఈ ఫోన్లను పొందలేరని వెల్లడించింది. అన్ని రంగుల అన్ని మోడల్స్ ఐఫోన్లు యాపిల్.కామ్లోనే ఆర్డరు చేయాల్సి ఉంటుందని కూడా తెలిపింది. కస్టమర్ల సహనాన్ని తాము అభినందిస్తున్నామని, త్వరలోనే ఈ ఫోన్లను వినియోగదారుల చేతులోకి తీసుకొస్తామని యాపిల్ వివరించింది. అంచనాలకు మించి డిమాండ్ వెల్లువెత్తుండడంతో, కంపెనీ స్టాక్స్ కూడా అంతర్జాతీయంగా ఈ వారంలో 8 శాతం ఎగిశాయి. -
ఐఫోన్7 బ్యాటరీ ఎంత పెద్దదో తెలుసా?
శాన్ఫ్రాన్సిస్కోలోని బిల్ గ్రాహం సివిక్ ఆడిటోరియం వేదికగా ఎంతో ప్రతిష్టాత్మకంగా లాంచ్ అయిన ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్ స్మార్ట్ఫోన్ల బ్యాటరీ సామర్థ్యమెంతా అంటే అందరికీ సందేహమే. ఎందుకంటే ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయాలను పాటిస్తూ.. యాపిల్ ఈతరం ఫోన్లకూ ర్యామ్, బ్యాటరీ సైజులను ముందుగా రివీల్ చేయలేదు. కానీ ప్రస్తుతం తీసుకొస్తున్న ఈ ఫోన్ల బ్యాటరీ సామర్థ్యాలు ముందు వాటికంటే ఎక్కువ కెపాసిటీలను కలిగి ఉంటాయని మాత్రం యాపిల్ ఆవిష్కరణ ఈవెంట్లోనే పేర్కొంది. ప్రస్తుతం ఈ రెండు హ్యాండ్ సెట్లు చైనీస్ సర్టిఫికేషన్ వెబ్సైట్ టీనాలో లిస్టు అయ్యాయట. దీంతో ఈ ఫోన్ల బ్యాటరీ సైజులు బయటి పొక్కేశాయి. ఈ వెబ్సైట్ లిస్టింగ్ ప్రకారం ఐఫోన్7 ప్లస్ 2,900 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉందట. ఐఫోన్ 6ఎస్ ప్లస్ కంటే ఈ బ్యాటరీ కొంచెం పెద్దదని వెల్లడైంది. చిన్న ఫోన్ ఐఫోన్7 బ్యాటరీ సామర్థ్యం 1,960 ఎంఏహెచ్ మాత్రమేనట. ఇది కూడా ఐఫోన్ 6ఎస్ కంటే పెద్దదిగానే ఉందని తెలుస్తోంది. 3జీ ఇంటర్నెట్ వాడితే 12 గంటల వరకు పనిచేయనుందని టీనా సర్టిఫికేషన్ తెలిపింది. ముందుతరం ఐఫోన్ల కంటే ఈ బ్యాటరీలు 14 శాతం పెద్దవిగా ఉన్నాయని టీనా సర్టిఫికేషన్ వెల్లడిస్తోంది. కానీ యాపిల్ ఇప్పటివరకు బ్యాటరీ సామర్థ్యాలపై అధికారికంగా ప్రకటించలేదు. సిల్వర్, గోల్డ్, రోజ్ గోల్డ్, జెట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్లను యాపిల్ ఆవిష్కరించింది. 32జీబీ, 128జీబీ, 256జీబీ స్టోరేజ్ వేరియంట్లగా వినియోగదారుల ముందుకు వచ్చాయి. ఇండియాలో ఈ ఫోన్ల విక్రయాలు అక్టోబర్ 7 నుంచి చేపట్టనున్నారు. ప్రారంభధర రూ.60వేలు. ఆండ్రాయిడ్ ఫోన్లతో పోలిస్తే ఈ బ్యాటరీ సామర్థ్యాలేమీ ఆశించదగ్గ రీతిలో లేవని టెక్ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. చాలా ఆండ్రాయిడ్ ఫోన్లు ఇప్పటికే 3,000ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో వినియోగదారులను అలరిస్తున్నాయి. కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లు పవర్ బ్యాంకును కూడా ఆఫర్ చేస్తున్నాయి. అయితే చిన్న బ్యాటరీ, పూర్ బ్యాటరీ లైఫ్ను కలిగి ఉంటుందనడంలో ఎలాంటి రుజువు లేదంటున్నారు మరికొంతమంది విశ్లేషకులు. తక్కువ వనరులతోనే ఎక్కువ సేపు పనిచేసేలా చేయొచ్చని చెబుతున్నారు. ర్యామ్ కెపాసిటీని కూడా యాపిల్ రివీల్ చేయలేదు. బెంచ్ మార్కింగ్ వెబ్సైట్ గీక్బెంచ్, సర్టిఫికేషన్ పోర్టల్ టీనాలు ఐఫోన్ 7 ప్లస్ 3జీబీ ర్యామ్ను కలిగి ఉంటుందని అంచనావేస్తున్నాయి. -
ఏ దేశంలో ఐఫోన్ 7 ఖరీదు తక్కువో తెలుసా?
టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ తాజాగా విడుదల చేసిన ఐ ఫోన్ 7 ఖరీదును చూసి అందరూ షాక్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఐ ఫోన్ 7 ఖరీదుపై పెద్ద ఎత్తున జోక్ లు పేలుతున్నాయి. మరి ఐ ఫోన్ 7అతి తక్కువ ధరకు దక్కించుకోవాలనుకుంటున్నారా? అయితే ఒకసారి కిందకు వెళ్లాల్సిందే. దేశం కరెన్సీ ఐ ఫోన్ 7(32జీబీ)ధర భారత్ రూ.60 వేలు రూ.60,000 ఇటలీ 799 యూరోలు రూ.60,046 నార్వే 7,390నార్వీగియన్ క్రోన్లు రూ.59,893 స్వీడన్ 7,495స్వీడిష్ క్రోనాలు రూ.59,032 న్యూజిలాండ్ 1199 న్యూజిల్యాండ్ డాలర్లు రూ.56,285 డెన్మార్క్ 5,799 డానిష్ క్రోన్లు రూ.58,548 ఫిన్ లాండ్ 779 యూరోలు రూ.58,543 ఐ లాండ్ 779యూరోలు రూ.58,543 పోర్చుగల్ 779యూరోలు రూ.58,543 బెల్జియం 769యూరోలు రూ.57,791 ఫ్రాన్స్ 769యూరోలు రూ.57,791 నెదర్లాండ్స్ 769యూరోలు రూ.57,791 స్పెయిన్ 769యూరోలు రూ.57,791 ఆస్ట్రియా 759యూరోలు రూ.57,040 జర్మనీ 759యూరోలు రూ.57,040 లక్సెంబర్గ్ 743యూరోలు రూ.55,837 మెక్సికో 15,499 మెక్సికన్ పెసోలు రూ.54,842 ఆస్ట్రేలియా 1079 ఆస్ట్రేలియన్ డాలర్లు రూ.54,429 చైనా 5,388 యువాన్లు రూ.53,833 యూకే 599 పౌండ్లు రూ.53,169 తైవాన్ 24,500 న్యూ తైవాన్ డాలర్లు రూ.51,990 స్విట్జర్లాండ్ 759 స్విస్ ఫ్రాంక్ లు రూ.52,066 సింగపూర్ 1048 సింగపూర్ డాలర్లు రూ.51,600 హాంకాంగ్ 5,588 హాంకాంగ్ డాలర్లు రూ.48,199 జపాన్ 72,800 జపనీస్ యెన్లు రూ.47,433 యూఏఈ 2,599 యూఏఈ దిర్హామ్ లు రూ.47,342 కెనడా 899 కెనడియన్ డాలర్లు రూ.46,097 యూఎస్ఏ 649 అమెరికన్ డాలర్లు రూ.43,423 నోట్: ధరలన్నీ శనివారం నాటి(10-09-2016) భారతీయ మారక విలువల ప్రకారం ఇచ్చాం. యూకే, భారత్ లాంటి దేశాల్లోని ధరలు ట్యాక్స్ లతో కలిపి ఇవ్వడం జరిగింది. యూఎస్ తదితర దేశాల్లో ప్రాంతాల వారీగా పన్నుల్లో మార్పులు ఉండొచ్చు. -
ఐఫోన్ 7 ఇయర్ ఫోన్లతో ప్రమాదమా?
కాలిఫోర్నియా: ఇప్పటికే ప్రపంచ మార్కెట్లోకి అడుగుపెట్టిన ప్రతిష్టాత్మకమైన ఐఫోన్ 7 సిరీస్ మొబైల్ ఫోన్లు అక్టోబర్ ఏడవ తేదీన భారత మార్కెట్లోకి అడుగుపెడుతున్న విషయం తెల్సిందే. సంప్రదాయబద్ధమైన ఇయర్ ఫోన్లకు బదులుగా ‘ఎయిర్పాడ్స్’గా పిలిచే వైర్లెస్ ఇయర్ ఫోన్లను ఇందులో ప్రవేశపెట్టడం విప్లవాత్మకమార్పుగా ఐఫోన్ కంపెనీ అభివర్ణిస్తోంది. ఇది వైర్లెస్ యుగానికి నాంది పలికేందుకు తొలి ముందడుగుగా కంపెనీ సీఈవో టిమ్కుక్ స్వయంగా వ్యాఖ్యానించారు. ఈ సిరీస్ ఐఫోన్లలో ఉపయోగిస్తున్న వైర్లెస్ ఎయిర్పాడ్స్ పూర్తిగా బ్లూటూత్ టెక్నాలజీపైనే పనిచేస్తాయి. ఎయిర్పాడ్స్లో బ్లూటూత్ కారణంగా విడుదలయ్యే రేడియేషన్ వల్ల ప్రజల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. చెవికి సమీపంలో ఉండే మెదడు రక్తప్రసరణకు ఈ రేడియేషన్ అవరోధం కలిగిస్తుందని, దీనివల్ల మెదడుపై దుష్ప్రభావం ఉంటుందని ‘యుసి బెర్క్లీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్’ ప్రొఫెసర్ డాక్టర్ జోయెల్ మోస్కోవిట్జ్ హెచ్చరించారు. అయితే ఎయిర్పాడ్స్ నుంచి విడుదలయ్యే రేడియేషన్ ఫ్రీక్వెన్సీ (పౌనపుణ్యం) ఎంతుంటుందో ప్రస్తుతం వివరాలు అందుబాటులో లేవు. కానీ ఎఫ్సీసీ (ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్) నిర్దేశించిన మార్గదర్శకాలకు లోబడే రేడియేషన్ ఉంటుందని వీటిని తయారు చేసిన ఆపిల్ కంపెనీ ఇంజనీర్లు తెలియజేస్తున్నారు. మానవ ఆరోగ్యానికి హానికలిగించే రేడియేషన్, అయస్కాంత తరంగాలను నిరోధించేందుకు అనుగుణంగా ఎఫ్సీసీ మార్గదర్శకాలు లేవని ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 200 మంది శాస్త్రవేత్తలు తేల్చారని డాక్టర్ జోయెల్ హెచ్చరించారు. ఆపిల్ ఎయిర్పాడ్స్ను వాడడం అంటే ఓ మైక్రోవేవ్ను చెవులో పెట్టుకోవడమేనని ఆయన వ్యాఖ్యానించారు. మైక్రోవేవ్ నుంచి వెలువడే రేడియేషన్ కన్నా తమ ఎయిర్పాడ్స్ నుంచి తక్కువ స్థాయిలో రేడియేషన్ విడుదలవుతుందని ఆపిల్ ఇంజనీర్లు సమర్థిస్తున్నారు. బ్లూటూత్ స్పీకర్లను దూరంగా ఉండి విన్నా కొంత రేడియేషన్ ప్రభావానికి మనం గురవుతామని, అలాంటప్పుడు నేరుగా, అందులో మెదడుకు దగ్గరగా విడుదలయ్యే రేడియేషన్ ఎక్కువ ముప్పు ఉంటుందని ఆయన అన్నారు. కార్డుతో పనిచేసే ఇయర్ ఫోన్లే అన్నింటికన్నా ఉత్తమమన్నది తన అభిప్రాయమని ఆయన చెప్పారు. -
వచ్చే నెల 7 నుంచి భారత్లో ఐఫోన్ 7 సేల్
ప్రారంభ ధర రూ.60,000 న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజ కంపెనీ యాపిల్ తాజాగా మార్కెట్లో ఆవిష్కరించిన ‘ఐఫోన్ 7’ స్మార్ట్ఫోన్స్ అక్టోబర్ 7 నుంచి భారతీయులకు అందుబాటులోకి రానున్నాయి. వీటి ప్రారంభ ధర రూ.60,000గా ఉంది. కంపెనీ బుధవారం శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన ఒక కార్యక్రమంలో ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ అనే రెండు స్మార్ట్ఫోన్స్ను మార్కెట్లో ఆవిష్కరించింది. అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, చైనా వంటి దేశాల ప్రజలకు ఈ స్మార్ట్ఫోన్స్ సెప్టెంబర్ 16 నుంచే అందుబాటులోకి వస్తున్నాయి. అయితే మనం మరో 3 వారాలు వీటి కోసం ఆగాల్సిందే. ఈ కొత్త ఐఫోన్స్లో 32 జీబీ, 128 జీబీ, 256 జీబీ అనే మూడు స్టోరేజ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటాయి. ఐఫోన్ 7 స్క్రీన్ పరిమాణం 4.7 అంగుళాలు, ఐఫోన్ 7 ప్లస్ స్క్రీన్ పరిమాణం 5.5 అంగుళాలుగా ఉంది. ఐఫోన్ 6, 6ప్లస్, 5ఎస్ ఉండవా? చౌక ధరలకు యాపిల్ పాత మొబైల్ హ్యాండ్సెట్స్ను కొనుగోలు చేస్తున్న వారు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. వీరికి కంపెనీ పెద్ద షాక్ ఇవ్వనుంది. యాపిల్ తాజాగా ఐఫోన్ 7 ఆవిష్కరణ తర్వాత తన ఇండియా వెబ్సైట్ నుంచి ఐఫోన్ 6, ఐఫోన్ 6ప్లస్, ఐఫోన్ 5ఎస్ మోడళ్లను తొలగిం చింది. అంటే కంపెనీ భారత్లో ఐఫోన్ 7 విక్రయాల ప్రారంభం తర్వాత వీటిని తన పోర్ట్ఫోలియో నుంచి తొలగించే అవకాశముంది. దీంతో భారతీయ వినియోగదారులకు మొత్తంగా మూడు ఐఫోన్ మోడల్స్ (ఐఫోన్ 7/7ప్లస్, ఐఫోన్ 6ఎస్/6ఎస్ ప్లస్, ఐఫోన్ ఎస్ఈ) మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఐఫోన్ 7 ఆవిష్కరణ అనంతరం ఐఫోన్ 5ఎస్ను కంపెనీ తన పోర్ట్ఫోలియో నుంచి తొలగిస్తుందని అందరం ఊహించాం. కానీ ఐఫోన్ 6 హ్యాండ్సెట్స్ను కూడా తీసేస్తుండటం ఆశ్చర్యం కలిగించే అంశం. -
ఐఫోన్7లో కొత్తేమీ లేదట!
ఫుల్ హెప్ క్రియేట్ చేస్తూ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్నామంటూ యాపిల్ లాంచ్ చేసిన ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్లో కొత్తదనమేమి కనిపించడం లేదట. ఈ ఫోన్లో ఉన్న ప్రత్యేక ఫీచర్లన్నీ ఇప్పటికే ఆండ్రాయిడ్ వెర్షన్లో లాంచ్ అయిన స్మార్ట్ఫోన్ బ్రాండ్లలో ఉన్నవేనని టెక్ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. దానివరకు అది అప్గ్రేడెడ్గా వచ్చినా.. ఫీచర్ల పరంగా చూస్తే రూ.10 వేల నుంచి రూ.15 వేల శ్రేణిలో ఉన్న వివిధ స్మార్ట్ఫోన్ బ్రాండ్లలో ఇవి అందుబాటులో ఉంటున్నాయని పేర్కొంటున్నారు. ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్7 అరువు తెచ్చుకున్న ఐదు ప్రముఖ ఫీచర్లేమిటో ఓసారి చూద్దాం.. డ్యూయల్ కెమెరా : యాపిల్ కొత్తగా తీసుకొచ్చిన ఐఫోన్7, ఐఫోన్ 7ప్లస్లో కెమెరాపై ఎక్కువగా దృష్టిసారించినట్టు పేర్కొంది. డ్యూయల్ కెమెరాతో వినియోగదారుల ముందుకు వచ్చింది. కానీ ఆ ఫీచరేమీ ఐఫోన్7కు ప్రత్యేకంగా నిలవడం లేదట. 2014లోనే డ్యూయల్ కెమెరాతో హెచ్టీసీ తన స్మార్ట్ఫోన్ ఎం8ను లాంచ్ చేసిందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు చాలా స్మార్ట్ఫోన్లు డ్యూయల్ కెమెరాలతో లాంచ్ అయ్యాయని తెలిపారు. మరో విశేషమేమిటంటే రూ.10వేల ధరలోనే ఆ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయట. డ్యూయల్ కెమెరా సెట్అప్తో ఎక్కువ ప్రీమియం ఆఫర్ చేసే ఫోన్లు ఎల్జీ జీ5, హ్యువాయ్ పీ9లు ఐఫోన్7 ప్లస్కు సగం ధరలోనే మార్కెట్లో లభ్యమవుతుండటం విశేషం. వాటర్ఫ్రూప్ డిజైన్ : నీరు, దుమ్ము నుంచి పూర్తి రక్షణ కల్పించే విధంగా ఐపీ67 వాటర్ఫ్రూప్ ప్రమాణాల మేరకు ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్లను యాపిల్ లాంచ్ చేసింది. అయితే ఈ ఫీచర్ను కూడా నాలుగేళ్ల క్రితమే సోనీ తన ఎక్స్పీరియా జడ్ స్మార్ట్ఫోన్తో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చిందట. స్మార్ట్ఫోన్ల రారాజు శాంసంగ్ కూడా తక్కువ ధరలోనే తన ఎస్7, ఎస్7 ఎడ్జ్ ఫోన్లను విక్రయిస్తోందని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు.. ఫ్రంట్ కెమెరాలో అధిక రెజుల్యూషన్ : గతేడాదే ఐఫోన్6ఎస్/6ఎస్ ప్లస్ ఫోన్లలో 5 ఎంపీ సెన్సార్ను అప్గ్రేడ్ చేసిన యాపిల్, కొత్తగా లాంచ్చేసిన ఐఫోన్ 7 ఫోన్లలో 7ఎంపీ సెన్సార్ను అప్గ్రేడ్ చేసింది. కానీ రూ.15,000 సెగ్మెంట్లోనే 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఫోన్లు వినియోగదారుల ముందు అలరిస్తున్నాయట. అయితే ఫ్రంట్ కెమెరా క్వాలిటీలో మిడ్ రేంజ్ ఆండ్రాయిడ్ ఫోన్లకు, ఐఫోన్7కు సరితూగడం లేదని భావిస్తే, జియోని ఎస్6ఎస్, ఓపో ఎఫ్1లు ఫ్రంట్ కెమెరాలో అద్భుతమైన ఫలితాలను ప్రదర్శిస్తున్నాయని వారు వివరిస్తున్నారు. ఈ రెండు ఫోన్లు ఫ్రంట్ కెమెరా క్వాలిటీలో బెస్ట్ ఫోన్లన్ని ఇప్పటికే రుజువైందని స్పష్టంచేశారు. 3.5 ఎంఎం జాక్ లేకపోవడం : ఇక హెడ్ఫోన్స్ విషయానికొస్తే.. ఊహించినట్టుగానే 3.5ఎంఎం హెడ్జాక్ను యాపిల్ ఈ కొత్త ఫోన్లలో తొలగించింది. కానీ 3.5ఎంఎం కోరుకునే వారికోసం అడాప్టర్ను అందిస్తోంది యాపిల్. అదేవిధంగా వైర్లెస్ హెడ్ఫోన్స్ ఇందులో ప్లస్ పాయింట్ అని యాపిల్ చెబుతోంది. కానీ ఇవే ఫీచర్లను లీఇకో తన లీ2, లీమ్యాక్స్2 ఫోన్లను ఆఫర్ చేస్తోందని టెక్ విశ్లేషకుల వాదన. యూఎస్బీ టైప్-సీ పోర్టును లీఇకో కొన్ని నెలల క్రితమే అందుబాటులోకి తీసుకొచ్చిందని, లీఇకో ఆఫర్ చేస్తున్న ఈ అధిక క్వాలిటీ యూఎస్బీ టైప్-సీ హెడ్ఫోన్లనూ యాపిల్ కొత్త ఫోన్లకు జోడించడం ప్రత్యేకతేమి కాదంటున్నారు విశ్లేషకులు. స్టీరియో స్పీకర్స్ : మరో ఆండ్రాయిడ్ ఫీచర్ స్టీరియో స్పీకర్స్. తొలి సారిగా ఐఫోన్7లో స్టీరియో స్పీకర్లను ఏర్పాటు చేశారు. కొత్త ఫోన్లలోని స్టీరియో స్పీకర్లు ఉండడంతో సినిమా వీక్షణ అనుభవం సరికొత్తగా ఉండే అవకాశం ఉందని యాపిల్ హామి ఇస్తోంది.. అయితే ఇప్పటికే చాలా ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లు చాలా ఏళ్ల నుంచే స్టీరియో స్పీకర్లను ఆఫర్ చేస్తున్నాయట. హెచ్టీసీ ఈ స్టీరియో స్పీకర్ల ట్రెండ్ను సృష్టించిందట. అనంతరం లెనోవా, మోటరోలా వంటి మిడ్ రేంజ్ ఫోన్లలో కూడా ఇవి అందుబాటులోకి వచ్చాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో స్మార్ట్ఫోన్ యూజర్లను ఎక్కువగా ఆకట్టుకునే ఈ ఫీచర్లన్నీ ఆండ్రాయిడ్ ఫోన్లలలో లభ్యమవుతున్నట్టు, ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఐఫోన్7లో కొత్తమీ లేదని నిరాశ వ్యక్తంచేస్తున్నారు టెక్ విశ్లేషకులు. -
ఐఫోన్7పై యాపిల్ ముందస్తు వార్నింగ్
ఐఫోన్7, ఐఫోన్ 7ప్లస్ ఫోన్లను లాంచ్ చేసిన ఒక్కరోజుకే యాపిల్ ఆసక్తికరమైన హెచ్చరికలు చేసింది. ఐఫోన్ 7, ఐఫోన్7 ప్లస్ జెట్ బ్లాక్ వేరియంట్ను చాలా జాగ్రత్తగా వాడాలని ముందస్తు వార్నింగ్ ఇచ్చింది. ఈ వేరియంట్ త్వరగా గీతలు(స్క్రాచ్లు) పడే అవకాశాలున్నాయంటూ హెచ్చరించిన యాపిల్, గీతలు పడకుండా ఉండేందుకు ఈ వేరియంట్కు కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కంపెనీ వెబ్సైట్లో కొత్త ఐఫోన్7 పేజీలో ఈ విషయాలను యాపిల్ వెల్లడించింది. మెరిసే గాడ్జెట్లపై ఎక్కువగా ఆసక్తిచూపే స్మార్ట్ఫోన్ ప్రియుల కోసం ఈ జెట్ బ్లాక్ ఐఫోన్7ను తీసుకొచ్చినట్టు తెలిపింది. ఇతర యాపిల్ అనాడిజైట్ ఉత్పత్తులతో లాగా దీని పైభాగం సమానంగా ఉన్నప్పటికీ, చాలా హార్డ్గా ఉంటుందని యాపిల్ తెలిపింది. తక్కువ రాపిడిలో వాడినప్పుడు ఎక్కువ ప్రకాశవంతంగా వెలుగొందుతుందని పేర్కొంది. ఐఫోన్ జాగ్రత్తపరుచుకోవడానికి తాము ప్రతిపాదించే వాటిని ఈ ఫోన్కు వాడితే, ఐఫోన్7 జెట్ బ్లాక్ వేరియంట్ను గీతల బారినుంచి తప్పించవచ్చని వెల్లడించింది. ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్ కొత్త జెట్ బ్లాక్ వేరియంట్లు 128జీబీ, 256జీబీ స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉండనున్నాయి. అదేవిధంగా గోల్డ్, సిల్వర్, రోజ్ గోల్డ్ రంగుల్లో కూడా యాపిల్ ఈ ఫోన్లను తీసుకొచ్చింది. కొత్త బ్లాక్ వేరియంట్ కేవలం 32జీబీ స్టోరేజ్ ఆప్షన్లోనే అందుబాటులో ఉండనుంది. శాన్ఫ్రాన్సిస్కోలోని ఓ ప్రత్యేక ఈవెంట్గా యాపిల్ ఈ ఫోన్లను ఆవిష్కరించింది. అక్టోబర్ 7 నుంచి భారత్లో విక్రయాలు ప్రారంభంకానున్నాయి. వీటి ప్రారంభ ధర ఇండియాలో రూ.60,000గా కంపెనీ నిర్ణయించింది. -
అదరగొట్టే ఐఫోన్7 ఫీచర్లు ఇవేనట!
న్యూయార్క్ : యాపిల్ ఐఫోన్కు ఎంత క్రేజ్ అంటే... ఈ ఫోన్ కొనుకోవడమే ఓ ఫ్యాషన్గా భావిస్తుంటారు నేటి యువత. అలాంటి ఐఫోన్ తన కొత్త మోడల్తో నేడు వినియోగదారుల ముందుకు రాబోతుందట. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కస్టమర్లను అలరించడానికి శానిఫ్రాన్సిస్కోలోని బిల్ గ్రాహమ్ సివిక్ ఆడిటోరియం వేదికగా ఐఫోన్7 లాంచ్ కాబోతుంది. నేడు నిర్వహించబోయే ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఐఫోన్ 7 లాంచింగ్ ఉంటుందని యాపిల్ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ, నేడే ఈ ఫోన్ను యాపిల్ ఆవిష్కరిస్తుందని టెక్ వర్గాలు చెప్పేశాయి. అయితే ఇంత క్రేజ్ సృష్టిస్తున్న ఐఫోన్7 ఎలా ఉండబోతుందో ఓ సారి తెలుసుకుందాం... 4.7 అంగుళాల, 5.5 అంగుళాల డిస్ప్లేలతో ఐఫోన్ రెండు మోడళ్లను ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ పేర్లతో వినియోగదారుల ముందుకు యాపిల్ తీసుకు రాబోతుందట. ఐఫోన్6, ఐఫోన్ 6 ప్లస్ మోడల్స్ కంటే ఇవి చాలా స్లిమ్గా కస్టమర్లను అలరించబోతున్నాయట. ముందస్తు ఫోన్లతో పోలిస్తే వీటిల్లో కెమెరా క్వాలిటీ పెరుగుతుందట. డ్యూయల్ కెమెరా సిస్టమ్ కలిగి ఉండబోతున్న ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్లతో రెండు వేర్వేరు ఎక్స్పోజ్యూర్లో ఫోటోలు తీసుకోవచ్చని తెలుస్తోంది. కొత్త ఐఫోన్7 ప్లస్కు రెండు కెమెరాలు 12 ఎంపీ సెన్సార్సే ఉండబోతున్నాయట. ఐఫోన్7 కు ఒకటే 12 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంటుందని సమాచారం. రెండు కొత్త కలర్స్లో యాపిల్ ఈ సారి ఐఫోన్లను తీసుకురానుంది. అవి డీప్ బ్లూ, స్పేస్ బ్లాక్ వేరియంట్ అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. సరికొత్త త్రీడీ టెక్నాలజీ టచ్తో యూజర్ ఎక్స్పీరియెన్స్ కొత్తగా ఉండబోతోందట.. ప్రెషర్ సెన్సిటివ్ హోమ్ బటన్ దీన్ని ప్రత్యేకత. 32 జీబీ నుంచి 256 జీబీ వరకు స్టోరేజ్ సామర్థ్యంతో, వేగవంతమైన ఏ10 ప్రాసెసర్తో ఈ కొత్త మోడల్స్ వినియోగదారుల మందుకు వస్తున్నాయి. ఫోన్లకు, ఇతర ప్రొడక్ట్లకు డేటా, పవర్ ట్రాన్సఫర్ చేసుకునే విధంగా స్మార్ట్ కనెక్టర్ను ఈ ఫోన్లు కలిగి ఉంటాయని తెలుస్తోంది. సెప్టెంబర్ 16 నుంచి ఈ మోడల్స్ మార్కెట్లోకి ప్రవేశిస్తాయని, ఒక వారం నుంచి ప్రీ-ఆర్డర్లను యాపిల్ ప్రారంభిస్తుందని మార్కెట్ వర్గాల చెబుతున్నాయి వాటర్ రెసిస్టెంట్ డిజైన్, మెరుగైన స్టీరియో స్పీకర్స్, అత్యధిక బ్యాటరీ కెపాసిటీ, బ్లూటూత్ సపోర్టెడ్ హెడ్ ఫోన్స్, డ్యుయల్ స్పీకర్స్, టైప్-సీ ఇంటర్ ఫేస్లు ఇవన్నీ కొత్త ఐఫోన్7లో ఉండబోతున్నాయని టాక్. స్క్రీన్కు కింద ఉన్న ఫిజికల్ టచ్ ఐడీ బటన్ను తొలగించి, నేరుగా బయోమేట్రిక్ కార్యాచరణతో ఇంటిగ్రేట్ చేయాలని యాపిల్ ప్లాన్ చేసిందట. మరి ధర అనుకుంటున్నారా..? అంతర్జాతీయంగా ఆపిల్-7 బేస్ మోడల్ (32జీబీ) ధరను 749 డాలర్లుగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. భారత్ లో దీని ధర సుమారు రూ. 63వేలు ఉండే అవకాశముంది. ఈ ఫీచర్లన్నీ ఐఫోన్7లో చూడబోతున్నామో తెలుసుకోవాలంటే ఈ రాత్రి వరకు వేచిచూడాల్సిందే. -
ఐఫోన్-7 వచ్చేస్తోంది..రేటెంతో తెలుసా!
టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ కంపెనీ ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న ఐఫోన్-7 అతి త్వరలోనే భారత్ కు రానుంది. నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్ ఫోన్ గా పేరొందిన ఐఫోన్-7 ఈరోజు (సెప్టెంబర్ 7న) అంతర్జాతీయంగా విడుదల కానుండగా.. మరో 19 రోజుల్లో భారత్ కు ఇది రానుంది. సెప్టెంబర్ 26న ఐఫోన్-7ను భారత్ లో విడుదల చేయనున్నారు. బుధవారం సాన్ ఫ్రాన్సిస్కోలోని గ్రహం బిల్ సివిక్ ఆడిటోరియంలో అట్టహాసంగా జరగనున్న వేడుకలో ఐఫోన్-7ను ఆపిల్ ఆవిష్కరించనుంది. అంతర్జాతీయంగా ఆపిల్-7 బేస్ మోడల్ (32జీబీ) ధరను 749 డాలర్లుగా నిర్ణయించారు. భారత్ లో దీని ధర సుమారు రూ. 63వేలు ఉండే అవకాశముంది. అమెరికాలో ఈ నెల 15 నుంచి 19వ తేదీ మధ్యలో ఐఫోన్-7 అమ్మకాలు ప్రారంభమవుతాయని, భారత్ కు వచ్చేసరికి సెప్టెంబర్ 26నుంచి ఐఫోన్-7 మార్కెట్ లో లభిస్తుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, రెండో అతిపెద్ద స్మార్ట్ మార్కెట్ అయిన భారత్ పై ఆపిల్ ఈ మధ్య ప్రత్యేకంగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది భారత్ లోనే యాపిల్ అత్యధిక అమ్మకాలు జరిపింది. ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో భారత్ లో ఐఫోన్ అమ్మకాలు 51శాతం పెరిగాయి. అంతేకాకుండా గత ఏడాది తొలిసారిగా భారత్ లో ఆపిల్ కంపెనీ ఒక బిలియన్ డాలర్ మార్క్ ఆదాయాన్ని సాధించింది. -
ఐఫోన్-7 ఫొటోలు లీక్.. కొత్త ఫీచర్స్తో హల్చల్
న్యూయార్క్: యాపిల్ కంపెనీ తీసుకురానున్న ప్రతిష్టాత్మక ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్కు సంబంధించి మరిన్ని తాజా ఫొటోలు లీకయ్యాయి. గత మోడళ్లకు భిన్నంగా ఈ రెండింటిలోనూ లార్జర్ కెమెరాలు ఉంటాయని తాజా ఫొటోలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం ఆన్లైన్లో హల్చల్ చేస్తున్న ఈ ఫొటోలను గురించి 9టు5.కామ్ ఓ కథనాన్ని ప్రచురించింది. తాజా మోడళ్లలో ఎంటెన్నా లైన్స్ ను రీడిజైన్ చేసినట్టు వెల్లడించింది. 5.5 అంగుళాల తెరతో వస్తున్న ఐఫోన్ 7 ప్లస్లో డ్యుయెల్ కెమెరా కాంపొనెంట్ ఉంటుందని గతంలో కథనాలు రాగా.. తాజాగా లీకైన ఫొటోల్లో ఈ రెండు ఇన్నర్ కెమెరాల మధ్య సెంటిమీటర్ గ్యాప్ ఉంటుందని వెల్లడవుతోంది. అదేవిధంగా 4.7 అంగుళాల తెరతో రానున్న ఐఫోన్ 7లోనూ కెమెరా అప్గ్రేడ్ చేసినట్టు 9టు5.కామ్ వెల్లడించింది. -
ఐఫోన్ 7తోనే యాపిల్ వాచ్2 ఎంట్రీ
ప్రపంచంలో అత్యంత ఖరీదైన బ్రాండ్ గా నిలిచిన యాపిల్ తన కొత్త ఐఫోన్ 7తో పాటే, యాపిల్ వాచ్2ను మార్కెట్లోకి తీసుకురావాలని యోచిస్తోందట. సెప్టెంబర్ లో ఆవిష్కరించబోతున్న ఐఫోన్ 7తో పాటే దీన్ని తీసుకురాబోతుందని సమాచారం. మూడో త్రైమాసికం లోపల ఈ వాచ్ ల ఉత్పత్తి సామర్థ్యాన్ని ఇరవై లక్షల యూనిట్లకు పెంచి, వాటి సరుకు రవాణా పెంచనుందని తెలుస్తోంది. రెండోతరం యాపిల్ వాచ్ ల చిప్స్, కాంపొనెంట్లను కూడా మూడో త్రైమాసికంలో ప్రారంభించాలనుకుంటోందని వెల్లడించాయి. ఇకముందు రాబోతున్న యాపిల్ వాచ్ లకు అంచనావేసిన దానికంటే ఎక్కువ డిమాండే ఉండబోతుందని.. అందుకే డిమాండ్ కు అనుగుణంగా వాటిని అందించాలని యాపిల్ భావిస్తోందట. అయితే ఇటీవల జరిగిన శాన్ ఫ్రాన్సిస్కో వార్షిక డెవలపర్ల సదస్సు డబ్ల్యూడబ్ల్యూసీలోనే ఈ వాచ్ ను ఆవిష్కరిస్తారని ముందస్తు రిపోర్ట్ లు పేర్కొన్న సంగతి తెలిసిందే. కానీ యాపిల్ వాచ్ 2ను ఈ సదస్సులో యాపిల్ తీసుకురాలేదు. ఐఫోన్ 7తో పాటే యాపిల్ వాచ్ 2ను తీసుకొచ్చేందుకే ఈ ఈవెంట్ లో దీన్ని ఆవిష్కరించలేదని రిపోర్టులు పేర్కొన్నాయి. ముందస్తు వాచ్ లకంటే యాపిల్ వాచ్ 2 డిజైల్ లో ఎలాంటి మార్పు లేదని, కానీ వాటికంటే 20 నుంచి 40శాతం పలుచగా ఉండబోతున్నాయని రిపోర్టులు నివేదించాయి. బ్యాటరీ సామర్థ్యాన్ని యాపిల్ పెంచిదని తెలిపాయి. సెల్యులార్ కనెక్టివిటీని ఈ వాచ్ సపోర్టు చేస్తుందని తెలుస్తోంది. -
ఐఫోన్ 7 ఫీచర్స్ లో మరో రూమర్
ఐఫోన్ 7ను యాపిల్ ఎప్పుడు మార్కెట్లోకి ప్రవేశపెడుతుందో ఏమో కాని..విడుదల తేదీ నుంచి ఫీచర్ల వరకూ అన్నీ రూమర్లు మార్కెట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఒకరు హెడ్ జాక్ ఉండదంటే. మరొకరు యూనీకోడ్ మెటల్ గ్లాస్, ఫాస్టర్ టచ్ ఐడీతోనే ఈ ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటున్నారు. ఇప్పుడు మరో కొత్త రూమర్. ఐఫోన్ 7ను యాపిల్ మూడు డిస్ ప్లే వేరియంట్లలో ప్రవేశపెట్టబోతున్నారని టాక్. 4, 4.7, 5.5 అంగుళాల్లో ఈ ఫోన్ ను యాపిల్ తీసుకురాబోతుందట. స్టాండర్డ్ వేరియంట్లకు 2జీబీ ర్యామ్, హైయర్ మోడల్స్ కు 3జీబీ తో రూపొందించబోతుందని తెలుస్తోంది. డ్యూయల్ కెమెరా ప్రత్యేకతలు, ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం, ఏ10 చిప్ ను దీనిలో పొందుపరిచారని రిపోర్టులు తెలుపుతున్నాయి. ఇటీవలే ఐఫోన్ 7 ఇమేజ్ కూడా లీక్ అయింది. ఈ ఇమేజ్ ఫోన్ ను మొత్తం యూనీకోడ్ మెటల్ గ్లాస్ తో రూపొందించినట్టు చూపుతోంది. ఆంటీనా తీగలు ఫోన్ కు పైనా, కింద అమర్చబడట్టు చూపుతున్నాయి. ఈ లీకేజీ ఇమేజ్ లో కెమెరా హార్డ్ వేర్ కు, డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాస్ కు మధ్యలో ఒక అదనపు రహస్య రంధ్రం ఉంది. శబ్దాలను నిరోధించే మైక్రోఫోన్ తో ఈ ఐఫోన్ 7 మార్కెట్లోకి రాబోతుందని రిపోర్టు చెబుతుండటంతో, ఈ రహస్య రంధ్రం మైక్రోఫోన్ నేమో అని భావిస్తున్నారు. లేజర్ ఆటోఫోకస్ మోడ్యుల్ గా రెండో రంధ్రం ఉండబోతుందని, ఇది తక్కువ వెలుతురులో కూడా క్లారిటీగా ఇమేజ్ ను తీయగలదని తెలుస్తోంది. అదేవిధంగా స్మార్ట్ కనెక్టర్ తో ఐఫోన్ 7ను రూపొందించబోతున్నారని టాక్. సెప్టెంబర్ లోనే ఈఫోన్ ప్రవేశపెడుతున్నారని మార్కెట్ వర్గాల నుంచి సంకేతాలు వస్తున్నాయి. -
త్వరలో ఇక ఐఫోన్7 జిగేల్..
ఐఫోన్ 6, ఐఫోన్ 6ఎస్ మోడళ్లతో వినియోగదారుల మదిని దోచుకున్న యాపిల్, మరో సరికొత్త డిజైన్తో మొబైల్ రంగ విఫణిలోకి రాబోతుంది. ఐఫోన్ 7 పేరుతో కొత్త మోడల్ని మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. అద్భుతమైన కెమెరా ఫీచర్తో యాపిల్ 2014లో ఐఫోన్ 6స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దాని అనంతరం అదే డిజైన్తో మరిన్ని ఫీచర్స్ను కలుపుకొని ఐఫోన్ 6ఎస్ ను గత ఏడాది (2015)లో విడుదల చేశారు. జానీ ఈవ్స్ టీమ్ ఈ మోడళ్ల రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించింది. అయితే.. కెమెరా లెన్స్లో కొన్ని లోపాలున్నట్టు వినియోగదారుల నుంచి ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులతో 6, 6ఎస్ లోపాలను సరిచేసుకుని, వినియోగదారులకు ఆమోదయోగ్యమైన రీతిలో ఐఫోన్ 7ను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్టు యాపిల్ తెలిపింది. 5.5 అంగుళం, డ్యూయల్ లెన్స్ కెమెరాతో ఐఫోన్ 7ను రూపొందించనున్నారు. అదేవిధంగా, ప్రస్తుతమున్న వైట్ ప్లాస్టిక్ బ్యాండ్లను కూడా తొలగించనున్నట్టు మార్కెట్లో రూమర్స్ వస్తున్నాయి. 6, 6ఎస్ మోడళ్లలో వాడిన మెటల్ కూడా రేడియో సిగ్నల్స్కు ఆటంకం కలుగజేస్తుండడంతో, ఈ కొత్త మోడళ్లలో వేరే రకం మెటల్ను వాడాలని యాపిల్ భావిస్తోంది. అల్యూమినియం, గ్లాస్తో కప్పేసిన ఈ మోడళ్లకి తెలుపు రంగు వాటి రూపును నాశనం చేస్తుందని వినియోగదారులు నుంచి అభిప్రాయాలు వెల్లువెత్తాయి. ఈ లోపాలన్నింటినీ సరిచేసుకుని ఐఫోన్ 7ను రూపొందించనున్నట్టు యాపిల్ తెలిపింది. సెప్టెంబర్ తర్వాతనే సరికొత్త ఐఫోన్ 7 మార్కెట్లోకి వస్తుందని సంకేతాలు వస్తున్నాయి. వైర్లెస్ ఛార్జింగ్, వాటర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్, 3.5 ఎమ్ఎమ్ హెడ్ఫోన్, పెద్ద బ్యాటరీ, వేగవంతమైన ప్రాసెసర్తో ఐఫోన్ 7 వినియోగదారుల ముందుకు రాబోతున్నది. -
ఐఫోన్ 7లో ఆ ఫీచర్లు వద్దు!
కాలిఫోర్నియా: సాంకేతిక దిగ్గజ సంస్థ యాపిల్ తీసుకురానున్న ఐఫోన్ 7 సిరీస్లో మార్పులను వినియోగదారులు స్వాగతించలేకపోతున్నారు. ఈ ఏడాది విడుదల చేయనున్న ఐఫోన్ లో ఉన్న ఫీచర్ల గురించి ఆన్ లైన్ లో అంతులేకుండా రూమర్లు వస్తున్నాయి. ఇయర్ ఫోన్స్, హెడ్ఫోన్ల కోసం ఉపయోగించే సాకెట్ను, బ్యాటరీ చార్జింగ్ కోసం ఉపయోగించే 3.5 జాక్ను పూర్తిగా ఎత్తివేసి వైర్లెస్ ఇయర్ ఫోన్స్, హెడ్ఫోన్స్ అందుబాటులోకి తీసుకురానుందని తెలుస్తోంది. లైటనింగ్ కనెక్టర్ లేదా బ్లూటూత్ ద్వారా ఇయర్ లేదా హెడ్ఫోన్లకు కనెక్ట్ చేసుకునేందుకు వీలు కల్పించనుంది. ఐఫోన్ 7కు సంబంధించి యాపిల్ ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి వివరాలు వెల్లడించలేదు. ప్రతిపాదిత ఫీచర్లపై ఐఫోన్ ప్రియులు పెదవి విరుస్తున్నారు. ఈ ఫీచర్లు వద్దని కోరుతూ యాపిల్ సంస్థకు లేఖ పంపేందుకు సిద్ధమవుతున్నారు. దీనిపై 2 లక్షల మందిపైగా సంతకాలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే దీని వెనుక ఎవరు ఉన్నారు? వీరంతా ఐఫోన్ అభిమానులేనా? అనేది తెలియడం లేదు.