Jackie Shroff
-
'ది రోషన్స్' సిరీస్ పార్టీ వేడుకలో బాలీవుడ్ తారలు సందడి (ఫొటోలు)
-
మీరు గ్రేట్ సర్.. విలన్పై నెటిజన్ల ప్రశంసలు
రీల్ లైఫ్లో చెడ్డగా కనిపించేవాళ్లంతా రియల్ లైఫ్లో కూడా అంతే దుర్మార్గులుగా ఉండరు. అందుకు పూర్తి విరుద్ధంగా ఉంటారు. బాలీవుడ్లో తాజాగా రిలీజైన చిత్రం బేబీ జాన్ (Baby John Movie). ఇందులో జాకీ ష్రాఫ్ (Jackie Shroff) విలన్గా నటించాడు. కానీ నిజ జీవితంలో తానంత చెడ్డవాడిని కాదంటున్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్గా మారింది.ఎంత మంచి మనసో..అందులో జాకీ తన కారు దగ్గరకు వెళ్తున్నాడు. అతడిని ఫోటోలు తీసేందుకు కెమెరామెన్లతో పాటు అభిమానులు కూడా ఎగబడ్డారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి కిందపడ్డాడు. అయినా సరే తన ఫోన్లో ఫోటోలు తీయడం ఆపలేదు. అది చూసిన నటుడు కిందపడ్డ అతడికి చేయందించి పైకి లేపాడు. అనంతరం అక్కడున్నవారికి గుడ్నైట్ చెప్పి కారెక్కి వెళ్లిపోయాడు. ఇది చూసిన జనాలు మీపై గౌరవం మరింత పెరిగింది.. అంత హడావుడిగా వెళ్తున్నా కూడా ఆగి మరీ కిందపడ్డ వ్యక్తికి చేయందించారంటే గ్రేట్ సర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.సినిమాఇకపోతే జాకీ ష్రాఫ్.. కింగ్ అంకుల్, త్రిమూర్తి, దేవదాస్, హ్యాపీ న్యూ ఇయర్ వంటి పలు చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం హౌస్ఫుల్ 5 మూవీలో నటిస్తున్నాడు. ఇందులో అక్షయ్ కుమార్, రితేశ్ దేశ్ముఖ్, అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది జూన్ 6న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)చదవండి: 'అంబానీ మామ.. నీకు వంద రీచార్జులు'.. నవీన్ పొలిశెట్టి కొత్త సినిమా టీజర్ -
ఫిట్నెస్ ఫ్రీక్,స్టార్ కిడ్ కృష్ణ ష్రాఫ్: క్రేజీ ఫోటోస్
-
సినిమాలకు దూరం : కానీ ఈ స్టార్కిడ్ నెట్వర్త్ తెలిస్తే ఆశ్చర్యపోతారు
ఆమె ఒక సూపర్ స్టార్ కూతురు. దేశంలోనే అతిపెద్ద యాక్షన్ స్టార్కు తోడబుట్టింది. స్టార్ హోదా ఉన్నప్పటికీ చాలామంది బాలీవుడ్ స్టార్ కిడ్స్లాగా సినిమాలను కరిర్గా ఎంచుకోలేదు. కానీ స్టార్ హోదాలో కోట్లు సంపాదిస్తోంది. ఇంతకీ ఎవరీ స్టార్ కిడ్? ఆమె ఎంచుకున్న వృత్తి ఏంటి? ఈ కథనంలో తెలుసుకుందాం రండి! సాధారణంగా మూవీ స్టార్ల పిల్లలు తమ తల్లిదండ్రుల అడుగుజాడల్లో నడుస్తూ సినీ రంగంలోనే కెరీర్ను ఎంచుకుంటారు. కానీ ఆమె భిన్నంగా ఆలోచించింది. తన అభిరుచులుగా అనుగుణంగా నిర్ణయం తీసుకొని తనదైన శైలిలో రాణిస్తోంది.ఆ స్టార్ కిడ్ ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ యాక్టర్ జాకీ ష్రాఫ్, అయేషా ష్రాఫ్ దంపతుల కుమార్తె కృష్ణ ష్రాఫ్. ఆమె సోదరుడు, టైగర్ ష్రాఫ్ అనేకమంది సూపర్స్టార్లతో కలిసి నటించి, విజయవంతంగా కరీర్ను కొన సాగిస్తున్నాడు. 1993లో జన్మించిన కృష్ణ ష్రాఫ్ అమెరికన్ స్కూల్ ఆఫ్ బాంబేలో ప్రాధమిక విద్యను పూర్తి చేసి, దుబాయ్లోని SAE యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించింది. చిన్నతనంలోనే క్రీడల పట్ల ఆసక్తితో పాఠశాలలో ఒక స్టార్ క్రీడాకారిణిగా నిలిచింది. అనేక అవార్డులను కూడా గెల్చుకుంది. సోదరుడు టైగర్ ష్రాఫ్తో పాటు మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందింది కృష్ణ ష్రాఫ్ .సినిమా కుటుంబానికి చెందినప్పటికీ, కృష్ణ ష్రాఫ్ ఎప్పుడూ బాలీవుడ్పై ఆసక్తి చూపలేదు. ఆసక్తికరంగా వ్యాపార నైపుణ్యాలకు పదును పెట్టింది. అంతేకాదు ఫిటెనెస్ అంటే ప్రాణం పెడుతుంది. ఈ నేపథ్యంలోనే 2018లో సోదరుడు టైగర్ ష్రాఫ్తో కలిసి MMA మ్యాట్రిక్స్ అనే కాంబేట్- ట్రైనింగ్ కేంద్రాన్ని స్థాపించింది.. ఆ తర్వాత మ్యాట్రిక్స్ ఫైట్ నైట్ (MFN) పేరుతో భారతీయ ప్రొఫెషనల్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ప్రమోషన్ కంపెనీని ప్రారంభించారు. ఈ రెండు కంపెనీలు ముంబైలో ఉన్నాయి. నేను (సినిమా) కుటుంబం నుండి వచ్చాను కాబట్టి నేను తప్పనిసరిగా మూవీలు చేయాలని కాదు. దానికి మించిన ప్రపంచం ఉంది.నా కోరికలు , కలల్ని సాకారం చేసుకోవాలని భావిస్తున్నాను.’’ అయితే తనకు సినిమాల్లో నటించే ఆసక్తి లేదని చెప్పింది. చాలా సినిమా ఆఫర్లను తిరస్కరించినట్లు గతంలో వెల్లడించింద కృష్ణ ష్రాఫ్. అయితే 2021లో కిన్ని కిన్ని వారి అనే మ్యూజిక్ వీడియోలో కనిపించింది. ఫిట్నెస్ పట్ల తనకున్న అభిరుచికి అనుగుణంగా ఈ రంగంలో వ్యాపారవేత్తగా రాణిస్తోంది. కృష్ణ ష్రాఫ్ నికర విలువ 41 కోట్ల రూపాయలు. కాగా రోహిత్శెట్టి హోస్ట్ చేస్తున్న స్టంట్ ఆధారిత రియాలిటీ షో 'ఖత్రోన్ కే ఖిలాడీ 14' ద్వారా బుల్లితెర తెరంగేట్రానికి కృష్ణ ష్రాఫ్ సిద్ధమవుతోంది. -
కథ సెట్.. కాంబో రిపీట్
ఒక హీరో... ఒక డైరెక్టర్... వీరి కాంబినేషన్లో ఓ బ్లాక్బస్టర్... ఇది చాలు... ప్రేక్షకులు ఆ కాంబో రిపీట్ కావాలని కోరుకోవడానికి. అయితే కారణాలేమైనా కొన్ని హిట్ కాంబినేషన్స్ రిపీట్ కావడానికి ఇరవయ్యేళ్లకు పైగా పట్టింది.ఇప్పుడు కథ సెట్ అయింది.. కాంబో రిపీట్ అవుతోంది. రిపీట్ అవుతున్న ఆ హిట్ కాంబినేషన్స్ గురించి తెలుసుకుందాం. బిగిన్ ది బిగిన్ కమల్హాసన్ కెరీర్లో ‘నాయగన్’ (1987) బ్లాక్బస్టర్ ఫిల్మ్. మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో ‘నాయకుడు’గా విడుదలైంది. ఇంతటి బ్లాక్బస్టర్ ఫిల్మ్ ఇచ్చిన కమల్–మణిరత్నం కాంబోలో మరో సినిమా ప్రకటన రావడానికి మూడు దశాబ్దాలకు పైగా సమయం గడిచిపోయింది. ముప్పైఐదేళ్ల తర్వాత.. అంటే గత ఏడాది నవంబరులో తన పుట్టినరోజు సందర్భంగా మణిరత్నంతో సినిమాను ప్రకటించారు కమల్. మణిరత్నం, కమల్హాసన్, ఉదయనిధి స్టాలిన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నటుడిగా కమల్ కెరీర్లో 234వ సినిమాగా తెరకెక్కనుంది. ఈ సినిమా ప్రారంబోత్సవాన్ని నిర్వ హించి, బిగిన్ ది బిగిన్ అంటూ వీడియోను షేర్ చేశారు మేకర్స్. దుల్కర్ సల్మాన్, త్రిష, ‘జయం’ రవి ఈ చిత్రంలో కీ రోల్స్ చేస్తారని సమాచారం. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్పైకి వెళ్లనుంది. మరోవైపు ‘ఇండియన్’ (‘భారతీయుడు’) చిత్రం కూడా కమల్హాసన్ కెరీర్లో ఓ బ్లాక్బస్టర్. ఈ సినిమాకు శంకర్ దర్శకుడు. 1996లో వచ్చిన ‘ఇండియన్’ తర్వాత కమల్, శంకర్ల కాంబినేషన్లోపాతికేళ్లకు ‘ఇండియన్ 2’ రూపొందుతోంది. సుభాస్కరన్, ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. లక్నో టు లాహోర్ దాదాపు పాతికేళ్ల క్రితం బాలీవుడ్లో హీరో సన్నీ డియోల్, దర్శకుడు రాజ్కుమార్ సంతోషిల కాంబినేషన్ అంటే సెన్సేషన్. వీరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘ఘాయల్’ (1990) సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. ఆ ఏడాది బాక్సాఫీస్ టాప్ కలెక్షన్స్ సాధించిన మొదటి ఐదు చిత్రాల్లో ‘ఘాయల్’కు చోటు దక్కడం అనేది ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించిన తీరుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు . ఆ తర్వాత ‘దామిని’ (1993) చిత్రం కోసం సన్నీడియోల్, రాజ్కుమార్ సంతోషిలు కలిసి పని చేశారు. కానీ ఇది ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్. మీనాక్షీ శేషాద్రి మెయిన్ లీడ్ రోల్ చేయగా, సన్నీ డియోల్, రిషీ కపూర్, అమ్రిష్ పూరి ఇతర లీడ్ రోల్స్ చేశారు. ఈ చిత్రం కూడా సూపర్హిట్. ఇక ముచ్చటగా మూడోసారి సన్నీ డియోల్, రాజ్కుమార్ సంతోషిలు కలిసి చేసిన చిత్రం ‘ఘాతక్’. ‘దామిని’ చిత్రంలో నటించిన సన్నీ డియోల్, మీనాక్షీ చౌదరి, ఓమ్ పురి ఈ సినిమాలో కూడా నటించారు. 1996లో విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. ఇలా మూడు వరుస హిట్స్ ఉన్నప్పటికీ ఎందుకో కానీ సన్నీ డియోల్, రాజ్కుమార్ సంతోషిల కాంబినేషన్లో ఈ సినిమా తర్వాత మరో సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. సన్నీ డియోల్, రాజ్కుమార్ సంతోషిల కాంబినేషన్లో ‘లాహోర్ 1947’ అనే చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాను హీరో ఆమిర్ ఖాన్ నిర్మిస్తున్నారు. భారతదేశం,పాకిస్తాన్ విభజన నాటి పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని, లక్నో నుంచి లాహోర్కు వలస వెళ్లిన ఓ ముస్లిం కుటుంబం కథే ఈ చిత్రం అని టాక్. ఈ చిత్రం 2024లో విడుదల కానుంది. మరోవైపు హీరోగా ఆమిర్ ఖాన్, దర్శకుడు రాజ్కుమార్ సంతోషిల కాంబినేషన్ కూడా రిపీట్ అయ్యే చాన్సెస్ ఉన్నాయట. ఇదే నిజమైతే... 1994లో వచ్చిన ‘అందాజ్ అ΄్నా అ΄్నా’ తర్వాత ఆమిర్, రాజ్కుమార్ సంతోషిల కాంబినేషన్లో వచ్చే చిత్రం ఇదే అవుతుంది. అంటే.. 30 ఏళ్లకు ఆమిర్, రాజ్కుమార్ కలిసి సినిమా చేసినట్లవుతుంది. ఎప్పటికీ హీరోయే! జాకీ ష్రాఫ్ను ‘హీరో’ను చేసింది దర్శకుడు సుభాష్ ఘయ్. జాకీ ష్రాఫ్, సుభాష్ కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘హీరో’ (1983) సూపర్ హిట్గా నిలిచింది. హీరోగా జాకీకి ఇదే తొలి సినిమా. ‘హీరో’ సూపర్హిట్ అయినప్పటికీ వీరి కాంబోలో తర్వాతి చిత్రం ‘యాదేం’ (2001) తెరకెక్కడానికి 18 ఏళ్లు పట్టింది. జాకీ ష్రాఫ్తోపాటు హృతిక్ రోషన్ కూడా ఓ లీడ్ రోల్ చేసిన ఈ చిత్రం ఫర్వాలేదనిపించింది. ఇప్పుడు జాకీ ష్రాఫ్ హీరోగా ‘వన్స్ ఏ హీరో.. ఆల్వేస్ ఏ హీరో’ అంటూ తాజా చిత్రాన్ని ప్రకటించారు సుభాష్. ఇలా ఇరవై, ముప్పైఏళ్ల తర్వాత రిపీట్ అవుతున్న హీరో–డైరెక్టర్ కాంబినేషన్స్ ఇంకా ఉన్నాయి. -
రజినీకాంత్ 'జైలర్' మూవీ స్టిల్స్
-
36 ఏళ్ల తర్వాత రజనీకాంత్తో కలిసి యాక్ట్ చేస్తున్న నటుడు!
సౌత్ స్టార్ హీరో రజనీకాంత్, బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్ మూడు దశాబ్దాల తర్వాత కలిసి నటిస్తున్నారు. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘జైలర్’. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో జాకీష్రాఫ్ నటించనున్నారని, ఆయన షూటింగ్లో పాల్గొంటున్నారని యూనిట్ ప్రకటించింది. కాగా 1987లో వచ్చిన హిందీ చిత్రం ‘ఉత్తర్ దక్షిణ్’ తర్వాత రజనీకాంత్, జాకీష్రాఫ్ మళ్లీ కలిసి నటిస్తున్న సినిమా ‘జైలర్’ కావడం విశేషం. దాదాపు 36 ఏళ్ల తర్వాత రజనీ, జాకీష్రాఫ్ కలిసి నటిస్తున్నారన్నమాట. ఇకపోతే ఈ సినిమాలో రజనీకాంత్ సరసన తమన్నా హీరోయిన్గా నటించనుంది. ఈ మేరకు తమన్నా ఫస్ట్ లుక్ కూడా ఇటీవల రిలీజైంది. ఈ మూవీలో మాలీవుడ్ సూపర్స్టార్ మోహన్లాల్తో పాటు కన్నడ హీరో శివరాజ్కుమార్, కమెడియన్ సునీల్ సైతం ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. Jackie Shroff from the sets of #Jailer 🔥 @rajinikanth @bindasbhidu @Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/O9ees6RuJt— Sun Pictures (@sunpictures) February 5, 2023 చదవండి: బ్లాక్బస్టర్ గీత గోవిందం కాంబినేషన్ రిపీట్ -
ప్రియమణి 'కొటేషన్ గ్యాంగ్' టీజర్ చూశారా?
నటి ప్రియమణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో నటించి తానేంటో నిరూపించుకుంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం కొటేషన్ గ్యాంగ్. ఇందులో బాలీవుడ్ స్టార్ జాకీష్రాఫ్, సన్నీలియోన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఫిల్మినెటీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై గాయత్రి నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. ఈయన దర్శకుడు బాల శిష్యుడు. డ్రమ్స్ శివమణి సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు వివేక్ మీడియాతో మాట్లాడుతూ.. 'కిరాయి హత్యలు చేసే గ్యాంగ్ కథే ఈ సినిమా. చెన్నై, ముంబై, కశ్మీర్ ప్రాంతాల్లో జరిగే సంఘటనలతో కథ సాగుతుంది. అయితే ఈ మూడింటికి ఒక లింకు ఉంటుంది. మొదట చిత్రాన్ని ఓటీటీ ప్లాట్ఫాంలో విడుదల చేయాలని భావించాం. అయితే షూటింగ్ పూర్తి చేసి ఎడిటింగ్ చేసిన తర్వాత విజువల్స్, మేకింగ్ ఆఫ్ కంటెంట్ చూశాక ఇది థియేటర్లో విడుదల చేయాల్సిన చిత్రమని భావించాం. ఈ చిత్రాన్ని తమిళ, హిందీ భాషల్లో రూపొందిస్తున్నాం. ఇతర భాషల్లోనూ విడుదల చేస్తాం. ఏప్రిల్లో కొటేషన్ గ్యాంగ్ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని తెలిపారు. చిత్ర టీజర్ చూడగానే తాను ఆశ్చర్యపోయి దీనికి సంగీతాన్ని అందించడానికి అంగీకరించినట్లు డ్రమ్స్ శివమణి చెప్పారు. చదవండి: రివాల్వర్ రీటాగా కీర్తి సురేశ్ -
థియేటర్లలో పాప్ కార్న్ 500 రూపాయలా..?
బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ ఓ ఆసక్తికర అంశంపై మాట్లాడారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో సమావేశంలో ఆయన తన మాటలతో కాసేపు నవ్వులు పూయించారు. యూపీలో షూటింగ్లు జరపాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బాలీవుడ్ ప్రముఖులతో ముంబైలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నటుడు జాకీ ష్రాఫ్ సీఎం యోగిని అభ్యర్థించారు. థియేటర్లలో పాప్కార్న్ ధరను తగ్గించాలని జాకీ ష్రాఫ్ యోగి ఆదిత్యనాథ్ను కోరారు. పాప్కార్న్ 500 రూపాయలు తీసుకుంటున్నారని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. జాకీ ష్రాఫ్ మాట్లాడుతూ.. 'థియేటర్లలో పాప్కార్న్ కోసం రూ.500 తీసుకుంటున్నారు. దయచేసి పాప్కార్న్ ధర తగ్గించండి. సినిమా తీస్తున్నాం. స్టూడియోలు కడుతున్నాం. కానీ సినిమా టికెట్ కంటే ఎక్కువగా పాప్ కార్న్ ధరలు ఉంటే థియేటర్కు వచ్చేదేవరు?' అని అడిగారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వారు. ఉత్తరప్రదేశ్లోని సినిమాల షూటింగ్పై హిందీ చిత్రనిర్మాతలతో సీఎం యోగి ఆదిత్యనాథ్ సమావేశమయ్యారు. CM योगी से बोले जैकी श्रॉफ़- घर का खाना चाहिए तो मिल जाएगा. थिएटर में पॉपकॉर्न की कीमत कम करो. pic.twitter.com/dqXFXXhrPo — UnSeen India (@USIndia_) January 6, 2023 -
ముంబైలో సీనియర్ స్టార్స్ సందడి.. ఫోటోలు వైరల్
80వ దశకంలో కెరీర్ స్టార్ట్ చేసి తమకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్న సీనియర్ స్టార్స్ అందరూ ఒకేచోట కలిశారు. అలనాటి రోజులను గుర్తు చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఈ రీయూనియన్ వేడుకకి బాలీవుడ్ నటుడు జాపీ ష్రాఫ్ ఆదిథ్యం ఇచ్చాడు. ముంబైలో జరిగిన ఈ వేడుకలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, నరేశ్, భానుచందర్, నదియా, రమ్యకృష్ణ, విద్యాబాలన్, సుహాసిని, జయప్రద, రాధ, శోభన, భానుచందర్, అనుపమ్ ఖేర్, శరత్ కుమార్, అర్జున్, అనిల్ కపూర్ తదితరులు పాల్గొన్నారు. గేమ్ ఆడుతూ..డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా, ఈ సీనియర్ నటులు ప్రతి ఏటా రీయూనియన్ వేడుక నిర్వహిస్తుంటారు. ఒక్కో ఏడాది ఒక్కో హీరో ఈ వేడుకలను ఆతిథ్యం ఇస్తుంటారు. 2020లో జరిగిన రీయూనియన్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. (చదవండి: ‘రంగమ్మ..మంగమ్మ’ పాటకు అక్షయ్తో రామ్ చరణ్ డ్యాన్స్.. వీడియో వైరల్) -
ఆ హీరోతో ఒక్కటంటే ఒక్క సినిమా చేయని టబు! మారిషస్లో అప్పుడేమైంది?
భారత్లో అత్యున్నత నాలుగో అవార్డు పద్మ శ్రీ సాధించిన ఘనత. జాతీయ ఉత్తమ నటిగా రెండు అవార్డులు, ఆరు ఫిలింఫేర్ అవార్డులు. చలనచిత్ర రంగానికి చేసిన సేవలకు మరెన్నో పురస్కారాలు, విమర్శకుల ప్రశంసలు. 52 ఏళ్ల వయసులోనూ వెబ్ సిరీస్లు, సినిమాల్లో లీడ్ రోల్స్ చేస్తూ బిజీబిజీ. నేడు దిగ్గజ నటి టబు పుట్టినరోజు. ఈ సందర్భంగా కొన్ని విశేషాలు..! 1985లో ఎవర్గ్రీన్ నటుడు దేవానంద్ నవ్ జవాన్ సినిమాలో టీనేజర్ కేరెక్టర్ ద్వారా టబు సినీరంగ ప్రవేశం చేసింది. 1991లో విక్టరీ వెంకటేష్ హీరోగా కూలీ నెం.1 సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తన నటనతో అనతి కాలంలోనే అగ్ర కథానాయికగా ఎదిగింది. హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. పలు హాలీవుడ్ సినిమాల్లో నటించి మెప్పించింది. ఎన్నో ఛాలెంజింగ్ పాత్రలు చేసిన టబు తనకంటూ ప్రత్యేక గుర్తింపుపొందింది. 1994లో బాలీవుడ్ మూవీ విజయ్పథ్లో నటించి ఫిలింఫేర్ అవార్డు గెలుపొందింది. గుల్జార్, మాచీస్ సినిమాల్లో నటనకు విమర్శకుల ప్రశంసలు, ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డులు వరించాయి. నాగార్జున కెరీర్ని మరో మలుపు తిప్పిన నిన్నే పెళ్లాడతా సినిమాలో టబు నటన యువతకు గిలిగింతలు పెట్టింది. ఆ సినిమాకు కూడా ఆమెకు ఫిలింఫేర్ అవార్డు లభించింది. విరాసత్, అస్థిత్వ, చాందినీ బార్ సినిమాల్లో నటనకు విమర్శకుల ప్రశంసలు పొందింది. తదనంతరం కాలంలో సపోర్టింగ్ కేరెక్టర్లతోనూ రాణిస్తోంది. అంధాధూన్, భూల్భులయ్యా-2, దృశ్యం-2 వంటి సినిమాల్లో సహాయక పాత్రల్లో నటిస్తూ టబు బిజీ అయింది. అయితే, తన వ్యక్తిగత విషయాలను ఎక్కువగా షేర్ చేసుకోని ఆమె జీవితంలో ఓ చేదు ఘటన దాగుంది. (చదవండి: అరుదైన వ్యాధులతో బాధపడుతున్న అందమైన భామలు వీళ్లే) టాప్ హీరోయిన్ చెల్లి టబు అసలు పేరు తబస్సుమ్ ఫాతిమా హష్మి. ఆమె సోదరి ఫరా నాజ్ అప్పట్లో టాప్ హీరోయిన్. సోదరి వెంట టీనేజర్గా ఉన్న టబు షూటింగ్ స్పాట్లకు వెళ్లేది. అలా వెళ్లిన సమయంలోనే 1980లో లైంగిక వేధింపులకు గురైంది. ఒరిస్సా పోస్టు 1986లో ఇచ్చిన కథనం ప్రకారం.. జాకీ ష్రాఫ్, ఫరా నాజ్ హీరో, హీరోయిన్లుగా ఓ సినిమా షూటింగ్ మారిషస్లో జరుగుతోంది. ఆ క్రమంలో సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న నటుడు డేనీ డెంగ్జోపా అక్కడే తన ఇంట్లో చిత్ర యూనిట్కు గ్రాండ్గా పార్టీ ఇచ్చాడు. పార్టీలో ఫరా నాజ్తోపాటు టబు కూడా పాల్గొంది. అయితే, ఫరా నాజ్ ఫూటుగా తాగి పడిపోయింది. సోదరి పరిస్థితి చూసి అప్పటికే భయంతో వణిపోయిన టబుకు మరో ఉపద్రవం వచ్చిపడింది. మద్యం మత్తులో ఉన్న జాకీ ష్రాఫ్ ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇది గమనించిన డేనీ డెంగ్జోపా ఆ స్థితిలో నుంచి టబును రక్షించాడు. తర్వాత ఈ విషయం కొద్దికాలం ఎక్కడా బయటకు పొక్కలేదు. కానీ, ఫరా నాజ్ తన సోదరి పట్ల జాకీ ష్రాఫ్ ప్రవర్తనను ఎండగట్టింది. లైంగికంగా తన చెల్లెలిని వేధించాడని తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ అంశం అప్పట్లో సంచలనంగా మారింది. ఇంత జరిగినా టబు ఎక్కడా ఎప్పుడూ ఈ విషయాన్ని చెప్పకపోవడం గమనార్హం. ఎందరో నటులతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఆమె జాకీ ష్రాఫ్తో మాత్రం లీడ్ రోల్స్లో ఒక్కటంటే ఒక్క సినిమాలోనూ చేయలేదు. గతంలో ఎదురైన చేదు అనుభవం దృష్ట్యానే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు సినీ వర్గాల్లో చర్చ జరగడం మామూలైపోయింది. (చదవండి: చీటింగ్ చేసి ప్రియాంక మిస్ వరల్డ్ అయ్యిందా? ఆమె కామెంట్స్ వైరల్) -
టైగర్ ష్రాఫ్ చెల్లెలి హాట్ ఫొటోషూట్.. నెట్టింట వైరల్
Tiger Shroff Sister Krishna Shroff Hot Photoshoot Goes Viral: బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ కుమార్తె కృష్ణ ష్రాఫ్. ఆమె తన తండ్రి జాకీ ష్రాఫ్, సోదరుడు టైగర్ ష్రాఫ్ల బాలీవుడ్ స్టార్ కాదు. కానీ ఆమెకు గణనీయమైన అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ.. తన టోన్డ్ బికినీ బాడీ చిత్రాలతో ఇన్స్టా గ్రామ్లో హీట్ పెంచుతూ ఉంటుంది. ఇటీవలే ఆమె 'రాశీ సూద్' పంజాబీ సాంగ్ 'కిన్ని కిన్ని వారి'లో డెబ్యూగా నటించింది. అలాగే కృష్ణ తన ఇన్స్టా గ్రామ్లో ఒక వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఒక ఫొటోషూట్కు కృష్ణ హాట్హాట్గా ఫోజులివ్వడం చూడొచ్చు. View this post on Instagram A post shared by Krishna Shroff (@kishushroff) కొన్ని మ్యాగజైన్ల కవర్పై వచ్చిన కృష్ణ ష్రాఫ్ చిత్రాలు ప్రస్తుతం ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ బోల్డ్ ఫొటోషూట్ కోసం 28 ఏళ్ల కృష్ణ మొత్తం బ్లాక్ డ్రెస్లో హాట్గా ఫొజులిచ్చింది. ఆమె రాకీస్టార్ బాడీసూట్ ధరించి మోకాళ్ల వరకు ఎత్తైన బూట్లను మ్యాచింగ్గా వేసుకుంది. ఈ ఫొటోపై బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ 'వావ్' అని కామెంట్ చేసింది. దిశా పటానీకి, టైగర్ ష్రాఫ్ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని పుకార్లు రావడం తెలిసిందే. View this post on Instagram A post shared by Krishna Shroff (@kishushroff) కృష్ణ ష్రాఫ్ తన డ్రెస్సింగ్, ఫ్యాషన్, ఫొటోషూట్ల విషయంలో విభిన్న శైలీ కలిగి ఉంది. అందుకే ఆమె ఏం పోస్ట్ చేసిన ఇంటర్నెట్లో హల్చల్ చేస్తుంది. కృష్ణకు ఆమె సోదరుడు, తండ్రిలా బాలీవుడ్లోకి వచ్చే ఆలోచన లేదని తెలుస్తోంది. అయినా ఆమె తాజా పోస్ట్లు, ఫొటోషూట్లతో తనకు విపరీతంగా అభిమానులు పెరిగారు. కృష్ణ ష్రాఫ్ ముంబైలోని ఎమ్ఎమ్ఎ మ్యాట్రిక్స్ ఫిట్నెస్ సెంటర్కు యజమానిగా వ్యవహరిస్తుంది. -
భయపడుతూనే నటుడి బనియన్ వేసుకున్నా: ఊర్మిళ
బాలీవుడ్ నటి ఊర్మిళ మాటోండ్కర్, హీరో అమీర్ ఖాన్, నటుడు జాకీ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'రంగీలా' సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో ఊర్మిళ క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. ఇక ఇందులో తన్హ తన్హ యహా పె జీన్.. సాంగ్ కూడా ఎంతో పాపులర్. తాజాగా ఈ పాట గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకుంది ఊర్మిళ. ఈ సాంగ్ ప్రారంభంలో ఊర్మిళ ఒక బనీన్ వేసుకుని బీచ్ ఒడ్డున పరిగెడుతూ ఉంటుంది కదా, ఆ బనీన్ నటుడు జాకీ ష్రాఫ్ది అన్న సీక్రెట్ను బయటపెట్టింది. 'ఈ పాట చాలా సహజంగా రావాలనుకున్నాం, దీంతో జాకీ తన బనియన్ ధరించమని చెప్పాడు. నేను కొంచెం భయపడుతూనే దాన్ని వేసుకుని సాంగ్ షూట్ చేశాం. మొత్తానికి ఈ పాట హిట్టై ప్రశంసలు రావడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాను' అని ఊర్మిళ చెప్పుకొచ్చింది. కాగా ఈ సినిమాకు సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ డైరెక్షన్ చేయగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. -
పప్పులో కాలేసిన బాలీవుడ్ స్టార్.. మమ్ముట్టికి బదులు చిరుకు విషెస్
మలయాళ నటుడు, మెగాస్టార్ మమ్ముట్టి మంగళవారం (సెప్టెంబర్ 7న) 70వ పుట్టిన రోజు జరుపుకున్న విషయం తెలిసిందే. ఎంతోమంది నటులు, రాజకీయవేత్తలు ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే బాలీవుడ్ నటుడు జాకీష్రాప్ పొరపాటున మలయాళ మెగాస్టార్కి బదులు టాలీవుడ్ మెగాస్టార్కి విషెస్ తెలిపాడు. మలయాళీ నటుడు రెహమాన్ ట్విటర్లో మమ్ముక్కతో ఉన్న ఫోటోని పోస్ట్ చేసిన మమ్ముట్టికి శుభాకాంక్షలు తెలిపాడు. ఆ పోస్ట్ కింద ‘ఎప్పుడూ ఆనందంగా ఉండాలి చిరు గారు’ అంటూ జాకీష్రాప్ కామెంట్ చేశాడు. తప్పును గుర్తించిన ఓ ట్విటర్ యూజర్ తెలిపిన్పటికీ జగ్గుదాదా ఆన్లైన్ లేకపోవడంతో డిలీట్ చేయలేదు. -
అప్పులపాలు, ఇల్లు కోల్పోయాను, కానీ..: జాకీ ష్రాఫ్
మోడల్గా కెరీర్ మొదలు పెట్టి 'హీరో' సినిమాతో వెండితెరపై కథానాయకుడిగా ఆకట్టుకున్నాడు జాకీ ష్రాఫ్. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను కట్టిపడేసిన ఆయన హీరోగా, విలన్గా పలు హిందీ చిత్రాల్లో నటించాడు. అప్పుడప్పుడూ ఇతర భాషల్లోనూ నటిస్తున్నాడు. తాజాగా ఆయన తన జీవితంలో చవిచూసిన కష్టనష్టాల గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. "ఏదో ప్రయత్నించాను, కానీ ఇంకేదో జరిగి తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వచ్చింది, అప్పులబారిన పడ్డాను. ప్రతి ఒక్కరికీ రుణాలను చెల్లించి కుటుంబానికి చెడ్డ పేరు రాకుండా జాగ్రత్తపడ్డాను. అయినా వ్యాపారంలో ఒడిదుడుకులు సహజం. కొన్నిసార్లు పై నుంచి కిందపడటం, కింద నుంచి మళ్లీ పైకి ఎదగడం జరుగుతూ ఉంటాయి. కానీ నా కొడుకు టైగర్ ష్రాఫ్ మాత్రం నేను కోల్పోయిన ఇంటిని తిరిగి నాకు అప్పజెప్తానని మాటిచ్చాడు. తన తల్లిదండ్రులకు ఇల్లు ఉండాలన్న వాడి ఆలోచనకు ముచ్చటపడిపోయాను. నా పిల్లలను చూస్తుంటే గర్వంగా అనిపించింది" "నిజానికి ఆ ఇంటిని తిరిగి తీసుకోవడం నా భార్యకు అస్సలు ఇష్టం లేదు. పోయిందేదో పోయింది.. ఇక దాని గురించి పట్టించుకోకు అని చెప్తూ ఉండేది. కానీ మాకిష్టమైన ఆ ఇంటిని తిరిగివ్వాలని వాళ్లు డిసైడ్ అయ్యారు. అందుకోసం చాలా కష్టపడ్డారు. మా పిల్లలెప్పుడూ మమ్మల్ని సంతోషంగా ఉంచాలనుకున్నారు" అని చెప్పుకొచ్చాడు. కాగా అప్పులపాలైన సమయంలో జాకీ తన ఇంట్లోని ఒక్కో వస్తువును అమ్ముతూ ఆఖరికి తన బెడ్ను కూడా అమ్మేసి కటిక నేల మీద పడుకున్నాడు. తన జీవితంలో అవి అత్యంత దుర్దినాలని గతంలో ఆయనే స్వయంగా పేర్కొన్నాడు. ప్రస్తుతం జాకీ ష్రాఫ్ 'ఓకే కంప్యూటర్' అనే వెబ్సిరీస్లో నటించాడు. ఇందులో ఆయన ఎలాంటి దుస్తులు లేకుండా నగ్నంగా కనిపించాడు. సైన్స్ని వ్యతిరేకించే వ్యక్తిగా ఆకులు, పువ్వులను శరీరానికి కప్పుకునే పాత్రలో ఆకట్టుకున్నాడు. చదవండి: ఆ నటుడిని హాఫ్ బాయిల్ అన్న గూగుల్! -
బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు కన్నుమూత
ముంబై: బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు, రచయిత సాగర్ సర్హాది (87) ముంబైలో సోమవారం ఉదయం మరణించారు. నూరి, బజార్, కబీ కబీ, సిల్సిలా, చాందిని, దీవానా, కహో నా ప్యార్ హై చిత్రాలలో పనిచేసినందుకు ఆయన మంచి పేరును తెచ్చుకున్నారు. ఉర్దూ నాటక రచయితగా ఇప్పటికీ చాలా మంది అభిమానిస్తారు. సాగర్ సర్హాది 1976లో హిట్ అయిన కబీ కబీ కి డైలాగ్స్ రాసిన తరువాత భారీగా ప్రజాదరణ పొందారు. అతడు చేసిన కృషికిగాను ఉత్తమ డైలాగ్ కేటగిరీలో ఫిలింఫేర్ అవార్డును గెలుచుకున్నారు. కబీ కబీ చిత్రంలో అమితాబ్ బచ్చన్, శశి కపూర్, రాఖీ, వహీదా రెహ్మాన్, దివంగత నటుడు రిషి కపూర్, నీతు సింగ్ నటించారు. దీనికి యశ్ చోప్రా దర్శకత్వం వహించారు. కబీ కబీ చిత్రం తరువాత , సాగర్ సర్హాది నూరి(1979), చాందిని(1989), సిల్సిలా(1981) సినిమాలకు డైలాగ్స్ రాశారు. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖులు సాగర్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. నటుడు జాకీ ష్రాఫ్ సంతాపం తెలుపుతూ... "విల్ మిస్ యు ... రిప్ సాగర్’ అంటూ..తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో బ్లాక్ అండ్ ఫోటోను పోస్ట్ చేశారు. సర్హాది స్క్రిప్ట్ రైటర్, దర్శకుడు, అంతేకాకుండా పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. View this post on Instagram A post shared by Jackie Shroff (@apnabhidu) (చదవండి: కోవిడ్ టీకా వేయించుకున్న బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర! ) -
సల్మాన్, రణ్దీప్ల మధ్య ఉండే స్మోక్ ఫైట్ హైలైట్
సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ సినిమా విడుదల తేదీ ఖరారైంది. మే 13న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్దీప్ హుడా, దిశా పటానీ, జాకీ ష్రాఫ్, జరీనా వహాబ్ కీలక పాత్రలు చేశారు. ‘‘సల్మాన్ ఖాన్ నటించిన ‘వాంటెడ్’, ‘దబాంగ్’, ‘బాడీగార్డ్’ వంటి చిత్రాలు రంజాన్కు విడుదలై సూపర్హిట్ సాధించాయి. ఆ సెంటిమెంట్ను కంటిన్యూ చేస్తూ ఈ సినిమా కూడా హిట్ సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఈ సినిమాలో సల్మాన్, రణ్దీప్ల మధ్య ఉండే స్మోక్ ఫైట్ హైలైట్. ఈ ఫైట్ను ఓ కొరియన్ స్టంట్ టీమ్ డిజైన్ చేసింది. సల్మాన్ ఫ్యాన్స్కు ఈ చిత్రం ఓ యాక్షన్ ట్రీట్’’ అని చిత్రబృందం పేర్కొంది. నిజానికి ఈ సినిమా 2020 ఈద్కు విడుదల కావాల్సింది. కానీ కరోనాతో వాయిదా పడింది. ఆ తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్కు ఇచ్చేశారు. కానీ డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్స్ ఓనర్ల అభ్యర్థనల మేరకు సల్మాన్ ఓటీటీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. మరో రెండు నెలల్లో సల్మాన్ సినిమా థియేటర్స్లోకి వస్తుండడంతో అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. -
వెబ్ సిరీస్లో బట్టల్లేకుండా కనిపించనున్న హీరో
హీరోగా, విలన్గా జాకీ ష్రాఫ్కి హిందీలో మంచి గుర్తింపు ఉంది. అప్పుడప్పుడూ ఇతర భాషల్లోనూ నటిస్తుంటారు. ప్రస్తుతం ‘ఓకే కంప్యూటర్’ అనే వెబ్ సిరీస్లో నటిస్తున్నారాయన. ఇందులో ఆయన పాత్ర పేరు పుష్పక్. ఈ సిరీస్ ట్రైలర్లో దుస్తులు లేకుండా చెట్లు, పొదల చాటున దాక్కుని కనబడతారు జాకీ. నాకు కాస్ట్యూమ్ డిజైనర్ అవసరం లేదంటున్నారాయన. ‘ఓకే కంప్యూటర్’ గురించి జాకీ మాట్లాడుతూ – ‘‘ఇందులో సాంకేతికతను, సైన్స్ని వ్యతిరేకించే వ్యక్తిగా నటిస్తున్నాను. టెక్నాలజీతో పాటు యువతరం పర్యావరణానికి ప్రాధాన్యం ఇవ్వాలని నా పాత్ర చెబుతుంటుంది. ఈ పాత్రకు తగ్గట్టుగా రాలిపోయిన ఆకులు, పువ్వులను నా శరీరానికి కప్పుకుంటాను. అందుకే కాస్ట్యూమ్ డిజైనర్ అవసరం లేదన్నాను’’ అని చెప్పారు. చదవండి: శ్రీముఖిలో ఈ టాలెంట్ కూడా ఉందా! -
ఇంతపెద్ద సీనా... ఎవరు చేస్తారండీ
‘హీరో’ సినిమా కోసం జాకీష్రాఫ్ను తీసుకున్నాక దర్శకుడు సుభాష్ ఘాయ్ ‘నీకు ఫ్లూట్ తెలుసా?’ అని అడిగాడు. ‘ఆ... దూరం నుంచి ఒకసారి చూశాను’ అన్నాడు జాకీష్రాఫ్. సుభాష్ ఘాయ్ గుండెల్లో రాయి పడింది. ఎందుకంటే ‘హీరో’ సినిమాలో హీరో ఫ్లూటిస్ట్. సినిమా సంగీతం అంతా ఫ్లూట్ మీదే ఆధారపడి ఉంది. జాకీ ష్రాఫ్కు ఫ్లూట్ పట్టుకోవడం కూడా రాదు. ఈ మైనస్ను తాను ఎలా ప్లస్ చేశాడో ‘ఇండియన్ ఐడెల్’ తాజా ఎపిసోడ్లో సుభాష్ ఘాయ్ విశేషంగా చెప్పారు. 1983లో వచ్చిన సూపర్హిట్ సినిమా ‘హీరో’. సుభాష్ ఘాయ్ని ‘షో మేన్’ను చేసిన సినిమా ఇది. దీనికి ముందు సుభాష్ ఘాయ్ రిషి కపూర్తో ‘కర్జ్’ ఇచ్చాడు. అయితే ఈసారి పూర్తిగా కొత్త వాళ్లతో సినిమా తీద్దామనుకున్నాడు. ఈ విషయం తెలిసిన జాకీ ష్రాఫ్ సుభాష్ ఘాయ్ని కలిశాడు. అతను అప్పటికి మోడల్గా పని చేస్తున్నాడు. ‘నీకు యాక్టింగ్ వచ్చా’ అని అడిగాడు సుభాష్ ఘాయ్. ‘రాదు’ అన్నాడు జాకీ. ‘ఏదీ... ఈ సీన్ చేసి చూపించు’ అనంటే సీన్పేపర్ తీసుకుని ‘ఇంతపెద్ద సీనా... ఎవరు చేస్తారండీ’ అన్నాడు. ఆ ఫ్రాంక్నెస్ సుభాష్కు నచ్చింది. ‘నువ్వే నా సినిమా హీరో’ అని అప్పటికప్పుడు చెప్పేశాడు. దానికి జాకీ ష్రాఫ్ ఆశ్చర్యపోయి ‘సార్... నేను నిజాలు మాట్లాడే మనిషిని. ఈ మధ్యే ఒక సినిమాలో శక్తికపూర్ అసిస్టెంట్కు అసిస్టెంట్గా నటించా. నన్ను మీరు హీరో అంటున్నారు. ఆలోచించుకోండి’ అన్నాడు. ఆ మాటలకు ఇంకా నచ్చేశాడు సుభాష్ ఘాయ్కు. ‘హీరో’ సినిమా షూటింగ్ మొదలైంది. అందులో హీరో ఫ్లూట్ వాయిస్తుంటాడు. ‘నాకు ఫ్లూట్ పట్టుకోవడం కూడా రాదు’ అన్నాడు జాకీ ష్రాఫ్. టేప్ రికార్డర్లో ఫ్లూట్ల బిట్ వస్తుంటే తెల్ల ముఖం వేసుకుని చూస్తున్నాడు. ‘సరే... నీకు మెడ ఊపడం వచ్చా?’ అని అడిగారు సుభాష్ ఘాయ్. ‘వచ్చు’ అన్నాడు జాకీ ఫ్రాఫ్. ‘అయితే ఫ్లూట్ పట్టుకుని దాని ధ్వని ఎలా పోతుంటే అలా తల ఊపు. అప్పుడు నీ తలను చూస్తారు. వేళ్లను కాదు’ అన్నారు సుభాష్ ఘాయ్. జాకీ ష్రాఫ్ అలాగే ఊపాడు. సినిమా చూస్తే అతను నిజంగా వాయిస్తున్నట్టు ఉంటుంది. ఈ విశేషాలు జనవరి 23న ప్రసారం అయిన ‘ఇండియన్ ఐడెల్’లో ముఖ్య అతిథిగా పాల్గొన్న సుభాష్ చెప్పారు. ‘కర్జ్’లో ‘ఓం శాంతి ఓం’ పాట రికార్డు చేయడానికి కిశోర్ కుమార్ కోసం 4 నెలలు వెయిట్ చేశారట ఆయన. ‘నా కోసం ఎందుకు? వేరే ఎవరి చేతైనా పాడించవచ్చుగా’ అని కిశోర్ కుమార్ అడిగితే ’ఈ పాటకు నాకు పెర్ఫార్మర్ కావాలి. మీకు మించిన పెర్ఫార్మర్ ఎవరున్నారు’ అన్నారట సుభాష్. ‘ఆ పాట ఆయన వల్లే అంత బాగుంది’ అన్నారాయన. ‘తాళ్’ సినిమా కోసం రహమాన్ని బుక్ చేశాక రహమాన్ని తీసుకొని గీత రచయిత ఆనంద్ బక్షీ ఇంటికి వెళ్లారట. అక్కడ ఇద్దరికీ ఒకరినొకరిని పరిచయం చేసి 15 నిమిషాలు కూచుంటే ఇద్దరూ ఒక్క మాట మాట్లాడుకోలేదట. దానికి కారణం ఆనంద్ బక్షీకి ఇంగ్లిష్ రాదు. రహమాన్కు హిందీ రాదు. ‘సుభాష్ ఘాయ్ వల్లే నేను హిందీ నేర్చుకున్నాను’ అని రహమాన్ ఈ ఎపిసోడ్లో వీడియో సందేశంలో అన్నాడు. తాళ్ పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. నిజంగా సుభాష్ ఘాయ్ పెద్ద షో మేన్. పామరుణ్ణి రంజింప చేసిన దర్శకుడు. జనవరి 24 ఆయన జన్మదినం. -
ఖల్నాయక్ రిటర్న్స్
బాలీవుడ్ షో మ్యాన్ సుభాష్ ఘాయ్ తెరకెక్కించిన మాస్ ఎంటర్టైనర్ ‘ఖల్నాయక్’ (1993) సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇందులో సంజయ్ దత్ చేసినది యాంటీ హీరో రోల్ అయినప్పటికీ ప్రేక్షకులు విపరీతంగా ఇష్టపడ్డారు. 27 ఏళ్ల తర్వాత దర్శకుడు సుభాష్ ఘాయ్ ఈ చిత్రం సీక్వెల్కి శ్రీకారం చుట్టబోతున్నారు. తొలి భాగంలో సంజయ్ దత్ చేసిన విలన్ బల్లూ పాత్రను సీక్వెల్లో వేరే హీరో చేయబోతున్నారు. ‘ఖల్నాయక్’ చిత్రంలో హీరో పాత్రను చేశారు జాకీ ష్రాఫ్. ఇప్పుడు ఆయన తనయుడు టైగర్ ష్రాఫ్ మలి భాగంలో యాంటీ హీరో రోల్ చేయనున్నారు. ‘వార్’ సినిమా తర్వాత విలన్గా టైగర్ ష్రాఫ్కి మంచి మార్కులు పడటంతో మరో పవర్ఫుల్ విలన్ ‘ఖల్నాయక్’ పాత్రకు టైగర్ సై అన్నారట. జైలు నుండి బయటకు వచ్చే సంజయ్ దత్ పాత్రతో సినిమా కథ ప్రారంభమవుతుందని తెలిసింది. తొలి భాగంలో గంగ పాత్ర చేసిన మాధురీ దీక్షిత్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో నటించనుండటం విశేషం. కథానాయిక పాత్రకు ఓ ప్రముఖ నటిని అనుకుంటున్నారు. ‘ఖల్నాయక్’ని గ్యాంగ్స్టర్ కథగా తీశారు. సీక్వెల్ను డ్రగ్ మాఫియా నేపథ్యంలో చిత్రీకరించాలనుకుంటున్నారని సమాచారం. -
రజనీ వర్సెస్ జాకీ
రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘అన్నాత్తే’. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఖుష్భూ, మీనా, నయనతార, కీర్తీ సురేశ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. అయితే ఈ సినిమాలో విలన్గా ఎవరు నటిస్తారనే విషయం ఇప్పటివరకూ ప్రకటించలేదు. తాజాగా ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ నటిస్తారని తెలిసింది. ఈ ఫ్యామిలీ డ్రామాలో జాకీతో తలపడనున్నారట రజనీకాంత్. ఈ ఏడాది చివర్లో చెన్నైలో వేసిన ప్రత్యేక సెట్లో ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభిస్తారని సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం అని చిత్రబృందం తెలిపింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది జరిగేలా కనిపించడం లేదు. -
పొలం పనుల్లో బిజీగా ఉన్న నటుడు
లాక్డౌన్ వల్ల షూటింగ్లు, లొకేషన్లు అంటూ హడావుడిగా తిరిగే సినిమావాళ్లకు బోలెడంత ఖాళీ సమయం దొరికింది. అయితే చాలామంది ఇంటిపని, వంటపని చేస్తూ వాటి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ వస్తున్నారు. అయితే ఓ బాలీవుడ్ నటుడు మాత్రం అవన్నీ కాదు కానీ అంటూ రైతు అవతారం ఎత్తాడు. నటుడు జాకీష్రాఫ్ తన ఫార్మ్హౌస్లో ఉన్న సమయంలోనే లాక్డౌన్ ప్రకటించారు. దీంతో జాకీ అక్కడే చిక్కుకుపోగా అతని కుటుంబం మాత్రం ముంబైలో ఉంది. అయితే కుటుంబసభ్యులతో నిరంతరం టచ్లోనే ఉంటున్నారీ నటుడు. (కరోనా: పాజిటివ్ వార్తను చెప్పిన హీరో) ఈ సందర్భంగా ఆయన భార్య ఐశా.. జాకీ అక్కడ ఏం చేస్తున్నారన్న విషయాలను వెల్లడించింది. ఒక్కడే ఉంటున్నందుకు ఏమాత్రం బోర్ ఫీల్ అవట్లేదని తెలిపింది. పొలంలోని మొక్కలే అతనికి మంచి కంపెనీ ఇస్తున్నాయని చెప్పుకొచ్చింది. ప్రకృతి పైర గాలులను ఆనందంగా ఆస్వాదిస్తున్నాడని పేర్కొంది. కాగా జాకీ ష్రాఫ్కు మొక్కలంటే ఎంతో ఇష్టం. అతని గార్డెన్లో సేంద్రీయ కూరగాయలతో పాటు పంటలు కూడా పండిస్తారు. విరివిగా మొక్కలు నాటాలంటూ అభిమానులను సైతం ప్రోత్సహించేవాడు. అంతేకాకుండా అతని 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా కొంత భూమిని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. (నాన్నతో కలిసి నటించను: టైగర్ ష్రాఫ్) -
మేము పెళ్లి చేసుకోలేదు: హీరో సోదరి
ముంబై : తనకు రహస్యంగా వివాహం చేసుకోవాల్సిన అవసరమేమీ లేదని బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ కూతురు క్రిష్ణా ష్రాఫ్ అన్నారు. తన పెళ్లి గురించి క్రేజీ వార్తలు ఎందుకు ప్రచారం అవుతున్నాయో అర్థం కావడం లేదని వాపోయారు. ‘భాగీ’ ఫేం, తన అన్నయ్య టైగర్ ఫ్రాఫ్తో కలిసి క్రిష్ణా ఓ ఫిట్నెస్ సెంటర్ను నడుపుతున్న సంగతి తెలిసిందే. పలువురు సెలబ్రిటీల సందడితో ఈ స్టార్ కిడ్స్ జిమ్ నిత్యం కళకళలాడుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే క్రిష్ణాకు బాస్కెట్బాల్ ప్లేయర్ ఇబాన్ హయమ్స్ పరిచయమయ్యాడు. ఇక అప్పటి నుంచి టైగర్ బెస్టీగా గుర్తింపు పొందిన ఇబాన్.. క్రిష్ణాతో ప్రేమలో పడ్డాడంటూ బీ-టౌన్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఇబాన్ తన ఇన్స్టా స్టోరీలో క్రిష్ణ గురించి చెబుతూ ‘వైఫీ’ అని సంబోధించడంతో వారి పెళ్లి అయిపోందని గాసిప్ రాయుళ్లు కథనాలు అల్లేస్తున్నారు. సోదరుడు టైగర్తో క్రిష్ణా ష్రాఫ్ అదే విధంగా..‘మైండింగ్ అవర్ ఓన్ బిజినెస్..ఇదే మేము కోరుకుంటున్న స్వర్గం..ఎంతో ప్రత్యేకమైన రోజు.. ఇదే మా గమ్యం’ అంటూ తామిద్దరం సన్నిహితంగా ఉన్న ఫొటోను క్రిష్ణ ఇన్స్టాలో పోస్ట్ చేయడంతో వీళ్లు రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే వార్తలకు బలం చేకూరినట్లైంది. ఈ విషయంపై స్పందించిన క్రిష్ణ మాట్లాడుతూ...‘ బిగ్గరగా నవ్వాలని ఉంది. అసలు ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయి. మేము రహస్యంగా వివాహం చేసుకున్నామనడం క్రేజీ. ఇలాంటి వార్తలు విని మా అమ్మ కూడా పెళ్లి చేసుకున్నావా అని అడుగుతోంది. అసలేం జరిగిందో చెప్పమంటూ పోరు పెడుతోంది. ఇబాన్, టైగర్ ఐదేళ్లుగా మంచి స్నేహితులు. అలా నాకు కూడా తను పరిచయం. వాళ్లిద్దరూ కలిసి బాస్కెట్ బాల్ ఆడటం నేను ఎంజాయ్ చేస్తా’ అంటూ పెళ్లి వార్తలను కొట్టిపడేశారు. కాగా తన సోదరుడు టైగర్.. హీరోయిన్ దిశా పటానీతో కలిసి బాహాటంగానే చక్కర్లు కొడుతున్నప్పటికీ వాళ్లిద్దరి మధ్య ఎటువంటి బంధం లేదంటూ క్రిష్ణ తన సోదరుడి ప్రేమ విషయంపై స్పందించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోదరుడితో పాటు తన రిలేషన్షిప్ గురించి కూడా క్రిష్ణ బాగానే కవర్ చేస్తోందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram Minding our own business like it’s our own company, this is destiny, we meant to be, something so special, like it’s heavenly. ♾ #justforyou @ebanhyams @doitall23 A post shared by Krishna Jackie Shroff (@kishushroff) on Sep 3, 2019 at 9:50am PDT -
‘సాహో’ టాక్.. ఆ సెంటిమెంట్లే కారణమా!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ సాహో. యూవీ క్రియేషన్స్ సంస్థ సుజీత్ దర్శకత్వంలో దాదాపు 350 కోట్ల బడ్జెట్తో రూపొందించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీకి డివైడ్ టాక్ రావటంపై అభిమానులు రకరకాల కారణాలు చెపుతున్నారు. (మూవీ రివ్యూ : ‘సాహో’) రాజమౌళి దర్శకత్వంలో నటించిన హీరోలకు తదుపరి చిత్రాలు పెద్దగా కలిసి రావన్న సెంటిమెంట్ ఇండస్ట్రీలో బలంగా ఉంది. రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ సినిమాల్లో నటించాడు తారక్, అయితే ఆ సినిమాల తరువాత ఎన్టీఆర్కు వరుసగా సుబ్బు, ఆంద్రావాలా, కంత్రీ లాంటి భారీ డిజాస్టర్లు వచ్చాయి. మగధీర లాంటి భారీ హిట్ తరువాత రామ్చరణ్కు కూడా ఆరెంజ్ లాంటి డిజాస్టర్ ఎదురైంది. విక్రమార్కుడు సినిమా తరువాత రవితేజ కూడా ఖతర్నాక్ సినిమాతో నిరాశపరిచాడు. గతంలో రాజమౌళితో కలిసి ఛత్రపతి సినిమా చేసిన ప్రభాస్కు తరువాత పౌర్ణమి సినిమాతో షాక్ తగిలింది. ఇప్పుడు మరోసారి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి తరువాత చేసిన సాహోకు కూడా నెగెటివ్ వస్తుండటంతో ఆ వాదనకు మరింత బలం చేకూరినట్టైంది. సాహో ప్రీ రిలీజ్ వేడుకలో రాజమౌళి, ప్రభాస్ అంతేకాదు బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ తెలుగులో నటించిన సినిమాలన్నీ డిజాస్టర్లుగా నిలిచాయి. అస్త్రం, శక్తి, పంజా లాంటి తెలుగు సినిమాల్లో నటించాడు జాకీ. ఆ సినిమాలన్నీ ఫ్లాప్ కావటంతో ఈ నటుడిపై ఐరన్ లెగ్ ముద్ర వేశారు. పంజా తరువాత తెలుగు సినిమాల్లో నటించని జాకీని సాహో కోసం తీసుకొచ్చారు చిత్రయూనిట్. జాకీ ష్రాఫ్ (ఫైల్ ఫోటో) దీంతో సినిమాకు నెగెటివ్ టాక్ రావటానికి ఇది కూడా ఓ కారణం అంటున్నారు ఫ్యాన్స్. దీనికి తోడు టాలీవుడ్లో దర్శకులకు ద్వితీయ విఘ్నం అనే సెంటిమెంట్ కూడా ఉంది. దాదాపు టాలీవుడ్ దర్శకులంతా రెండో సినిమాతో నిరాశపరిచారు. అందుకే సుజీత్ విషయంలోనూ అదే సెంటిమెంట్ నిజమౌతుంది అన్న ప్రచారం జరుగుతోంది. -
‘సాహో’ మూవీ స్టిల్స్
-
ఒప్పుకో.. లేదా చచ్చిపో
అతని పేరు రాయ్. అతనికి ఎక్కువ అవకాశాలు ఇవ్వడం ఇష్టం ఉండదు. ఒకటీ అతను చెప్పిన దానికి ఒప్పుకోవడం లేదా చచ్చిపోవడం. సింపుల్. ‘సాహో’లో ఇలాంటి పాత్రనే పోషిస్తున్నారు బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్. ‘సాహో’ సినిమాలోని ఒక్కో క్యారెక్టర్ పోస్టర్ను రిలీజ్ చేస్తూ వస్తున్నారు. గురువారం ‘రాయ్’ పాత్రధారి జాకీ ష్రాఫ్ లుక్ను రిలీజ్ చేశారు. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాను సుజీత్ దర్శకత్వం వహించారు. వంశీ, ప్రమోద్, విక్కీలు నిర్మించారు. ఆగస్ట్ 30న విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్ రేపు రిలీజ్ కానుంది. -
నాన్నతో కలిసి నటించను
... అంటున్నారు బాలీవుడ్ యంగ్ హీరో, జాకీ ష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్. ఎవ్వరైనా తమ తల్లిదండ్రులతో యాక్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తారు. కానీ టైగర్ మాత్రం భయపడుతున్నాడు. ఆ భయానికి కారణం కూడా చెప్పుకొచ్చాడు. ‘‘నాన్న, నేను కలసి నటించాలంటూ చాలా ఆఫర్స్ వచ్చాయి. కానీ సరైన స్క్రిప్ట్ రావాలి. అలాగే ప్రస్తుతానికి నాన్నగారితో నటించలేను. నాన్న, నేను ఒకే ఫ్రేమ్లో ఉంటే కచ్చితంగా నేను ఫ్రీజ్ అయిపోతాను. అందుకే ఇప్పట్లో ఆయనతో స్క్రీన్ షేర్ చేసు కోను’’ అన్నాడు. మరి మీ సినిమాలను గురించి నాన్నతో డిస్కస్ చేస్తారా? అని అడగ్గా – ‘‘నేను ఏ సినిమా చేస్తున్నాను, స్క్రిప్ట్ విషయాలు ఎప్పుడూ నాన్నతో డిస్కస్ చేయను. సినిమా మొత్తం పూర్తయిన తర్వాతే నాన్నకు చూపిస్తాను. చూశాక, ‘బిందాస్. చాలా బావుంది. పాస్ అయ్యావు’ అని మాత్రం చెబుతారు. నాన్నే నా పెద్ద విమర్శకుడు అని భావిస్తాను’’ అని చెప్పారు. -
అతడు నా కుమారుడితో సమానం..
ముంబై : బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తన కంటే చాలా చిన్న వయసు హీరోయిన్లతోనూ ఆన్స్ర్కీన్ రొమాన్స్ పండించడంలో ముందుంటారు. తరాల అంతరాలు అధిగమించి నటనతో ఆకట్టుకుంటారు. తాజాగా భారత్ మూవీలో తనకంటే కేవలం పదేళ్లు పెద్దయిన జాకీ ష్రాఫ్కు కొడుకుగా సల్మాన్ నటిస్తున్నారు. సల్మాన్, తాను దాదాపు ఒకే సమయంలో కెరీర్ను ప్రారంభించామని తమ మధ్య పదేళ్ల వయసు అంతరం ఉన్నా కండలవీరుడి తండ్రిగా నటించడానికి తనకు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదని జాకీ ష్రాఫ్ చెప్పుకొచ్చారు. సల్మాన్ను తానెప్పుడూ తన కుమారుడిగానే భావించానని, ఇప్పటికీ అతను తనకు చిన్నపిల్లాడేనని అన్నారు. తమ కెరీర్ తొలినాళ్లలో తాను ధరించే జీన్స్, షూస్ను సల్మాన్ ఎంతో ఇష్టపడేవాడని గుర్తుచేసుకున్నారు. భారత్ మూవీలో సల్మాన్ ఖాన్, జాకీ ష్రాఫ్తో పాటు దిశా పటానీ, టబు, నోరా ఫతేహి, కత్రినా కైఫ్, సునీల్ గోవర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
ఫారిన్ కోచ్
బాలీవుడ్ నటులు తమిళంలో నటించడం కొత్తేం కాదు. ‘తుపాకీ’ సినిమాలో విద్యుత్ జమాల్ విలన్గా నటించారు. అజిత్ ‘వివేగమ్’ సినిమాలో వివేక్ ఒబెరాయ్ నటించారు. ‘2.ఓ’లో అక్షయ్కుమార్ నటించారు. రీసెంట్గా అమితాబ్ బచ్చన్ ‘ఉయంర్ద మణిదన్’(తమిళం, హిందీ) అనే సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా విజయ్ సినిమాలో జాకీ ష్రాఫ్ నటించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అట్లీ దర్శకత్వంలో విజయ్ హీరోగా ఫుట్బాల్ స్పోర్ట్స్ నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. నయనతార కథానాయికగా నటిస్తున్నారు. ఇందులో ఫారిన్ ఫుట్బాల్ టీమ్ కోచ్గా కనిపిస్తారట జాకీ ష్రాఫ్. ఇదివరకు ఆయన పలు తమిళ చిత్రాల్లో నటించారు. కాగా తాజా చిత్రంలో ఫుట్బాల్ ప్లేయర్ కమ్ కోచ్ మైఖేల్ పాత్రలో విజయ్ నటిస్తారని తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నైలో వేసిన ఆరు కోట్ల భారీ సెట్లో జరుగుతోంది. -
భిన్న ముఖాలు!
వెండితెరపై ఓ ఆపద నుంచి దేశాన్ని రక్షించేందుకు ఓ మిషన్ను స్టార్ట్ చేశారు బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం. గూఢచారిగా ఆ ఆపద నుంచి అతను దేశాన్ని ఎలా రక్షించాడు? అనే విషయం సమ్మర్లో తెలుస్తుంది. జాన్ అబ్రహాం హీరోగా హిందీలో రూపొందుతున్న చిత్రం ‘రోమియో అక్బర్ వాల్టర్’. రోబ్బీ గ్రేవాల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో గూఢచారిగా నటిస్తున్నారు జాన్. ఈ సినిమాకు సంబంధించిన రెండు లుక్స్ను విడుదల చేశారు. ‘ఒక వ్యక్తి. భిన్నముఖాలు. దేశాన్ని కాపాడటం కోసం చేసే ఓ మిషన్’ అంటూ ఈ లుక్స్ను రిలీజ్ చేశారు జాన్. ఇందులో జాన్ అబ్రహాం ఎనిమిది డిఫరెంట్ లుక్స్లో కనిపిస్తారని బాలీవుడ్ సమాచారం. మౌనీ రాయ్, జాకీ ష్రాఫ్, సుచిత్రా కృష్ణమూర్తి తదితరులు నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 12న విడుదల కానుంది. -
వైరల్ : ‘సాహో’ సెట్ నుంచి మరో పిక్!
బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీల నుంచి ఫేమస్ యాక్టర్స్ ఒకే ఫ్రేమ్లో కనపడితే.. అది సోషల్మీడియాలో వైరల్ కాకుండా ఉంటుందా. ప్రస్తుతం అలాంటి ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాహో సెట్లో దిగిన ఆ ఫోటో అరుణ్ విజయ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. బాహుబలి తరువాత ప్రభాస్ ఇమేజ్ జాతీయ స్థాయిలో పెరిగిపోయింది. అందుకే ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సాహో ఇండియన్ సినిమాగా మారిపోయింది. ఈ మూవీలో అన్ని పరిశ్రమలకు చెందిన ప్రముఖులు నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నుంచి నీల్ నితిన్ ముఖేష్, శ్రద్దా కపూర్, జాకీ ష్రాఫ్లు, కోలీవుడ్ నుంచి యంగ్ యాక్టర్ అరుణ్ విజయ్, మాలీవుడ్ నుంచి సీనియర్ యాక్టర్ లాల్ ఇలా ప్రముఖులు సాహో చిత్రంలో నటిస్తున్నారు. ఇంతటి భారీ తారాగణంతో అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రస్తుతం జాకీ ష్రాఫ్, ప్రభాస్, లాల్, అరుణ్ విజయ్కు సంబంధించిన సన్నివేశాలను యూనిట్ షూట్ చేస్తున్నట్టు సమాచారం. ఈ సెట్లో అరుణ్ విజయ్ వీరితో ఫోటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పిక్ వైరల్గా మారింది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీని ఆగస్టు 15న విడుదల చేసేందుకు చిత్రయూనిట్ ప్రయత్నిస్తోంది. Haven’t seen a more cooler person on sets !! Was great catching up with you #jackieshroff sir.. #Prabhas @bindasbhidu #lal #saaho.. 💪 pic.twitter.com/oEC48PEskn — ArunVijay (@arunvijayno1) 22 January 2019 -
ఇంకేం ఇంకేం కావాలే...
క్లాప్బోర్డులు, ఆర్క్ లైట్లు, స్టార్ట్ కెమెరా, షాట్ ఓకే... వీటితో బిజీగా ఉండే స్టార్స్ ఫర్ ఎ చేంజ్ అప్పుడప్పుడూ వీటికి దూరంగా ఉండాలని అనుకుంటారు. 1980లలో వెండితెరను ఏలిన స్టార్స్లో కొందరు ఇలానే అనుకుని, ప్రతి ఏడాదీ కలుస్తున్నారు. ఒక్కో ఏడాది ఒక్కో చోట. కొన్నిసార్లు ప్రైవేట్ ప్లేసెస్ ఇందుకు వేదిక అయితే కొన్నిసార్లు ఒక్కో సెలబ్రిటీ మిగతా అందరికోసం తమ ఇంట్లో ఆతిథ్యం ఏర్పాటు చేస్తుంటారు. ప్రతి ఏడాదిలానే ఈసారి ‘1980స్ రీ–యూనియన్’ జరిగింది. ఇప్పుడు చెన్నైలో కలుసుకున్నారు. జనరల్గా రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్ వంటి స్టార్స్ కూడా కనిపిస్తుంటారు. ఈసారి వీళ్లు మిస్సింగ్. వైట్ అండ్ బ్లూ కలర్ని డ్రెస్కోడ్గా ఫిక్స్ చేసుకున్నట్లున్నారు. అందరూ తెలుపు, నీలం రంగు దుస్తుల్లో దర్శనమిచ్చారు. మోహన్లాల్, సీనియర్ నరేశ్, జాకీ ష్రాఫ్, అర్జున్, సుమన్, శరత్కుమార్, భాగ్యరాజ్, సత్యరాజ్, సుహాసిని, ఖుష్బూ, శోభన, నదియా, రాధ తదితరులు పాల్గొన్నారు. లేడీ యాక్టర్స్ అందరూ ‘గీత గోవిందం’లోని ‘ఇంకేం ఇంకేం కావాలే..’ పాటకు డ్యాన్స్ చేశారట. మోహన్లాల్ కేరళలోని సంప్రదాయపు బోట్ నడుపుతున్నట్టు యాక్ట్ చేశారట. ఇలాంటి సరదా ఆటలతో సందడి చేశారని సమాచారం. -
#మీటూ : ‘మీ భార్య కూడా ఇలాగే చేశారు కదా’
తనుశ్రీ- నానా పటేకర్ వివాదంతో భారత్లో మీటూ ఉద్యమం తీవ్ర రూపం దాల్చిన సంగతి తెలిసిందే. పెద్ద మనుషుల ముసుగులో చెలామణీ అవుతున్న పలువురు వ్యక్తుల అసలు సిసలు వ్యక్తిత్వాన్ని ఈ ఉద్యమం బహిర్గతం చేస్తోంది. అయితే ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్న వారు కొందరైతే.. మరికొందరు మాత్రం కేవలం ఇది పబ్లిసిటీ స్టంట్ అంటూ కొట్టిపారేస్తున్నారు. ఈ క్రమంలో మీటూ ఉద్యమంపై బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ స్పందించారు. ‘ చాలా ఏళ్ల క్రితం జరిగిన ఏవో కొన్ని విషయాలను పట్టుకుని ఇప్పుడు కొంతమంది ముందుకు వస్తున్నారు. కొందరైతే ఎదుటివారి తప్పులను ఎత్తి చూపేందుకు సిద్ధమయ్యారు. మరికొందరు ఓ అడుగు ముందుకేసి బజారుకెక్కి రచ్చ చేస్తున్నారు’ అంటూ రాయడానికి వీల్లేని అసభ్య పదజాలాన్ని వాడారు. కాగా జాకీ ష్రాఫ్ వ్యాఖ్యలపై.. బ్రాండ్ కన్సల్టెంట్ సుహెల్ సేథ్(55)పై ఆరోపణలు చేసిన మోడల్, బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్ డయాండ్రా సోర్స్ తీవ్రంగా స్పందించారు. ‘ ఈ వ్యాఖ్యలతో జాకీ ష్రాఫ్పై ఉన్న గౌరవం పోయింది. మీరు చేసిన పిచ్చి పనుల తాలూకు మకిలి బజారుకెక్కి శుభ్రం చేసుకోవాలని చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మీ భార్య కూడా గతంలో ఇలాంటి పనులు చేశారు కదా. మరి దానికి ఏం అంటారో’ అంటూ ప్రశ్నించారు. ఇక జాకీ ష్రాఫ్ భార్య అయేషా మాజీ మోడల్ అన్న సంగతి తెలిసిందే. తన కంటే చిన్నవాడైన ఓ యువ మోడల్తో అయేషా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారంటూ ఆమెపై ఆరోపణలు వెల్లువెత్తాయి. -
ఎంత కష్టం వచ్చిందో
ఒక్క సినిమా. కష్టమేమో రెండు సినిమాలంత అట. ఒక భాషలో చేసిన వెంటనే ఇంకో భాషలో యాక్ట్ చేయాలి. దానికోసం రెండు భాషల్లో డైలాగ్స్ గుర్తు పెట్టుకోవాలి. ప్రస్తుతం శ్రద్ధా కపూర్ ఇదే చేస్తున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏదంటే ‘సాహో’. సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సాహో’. శ్రద్ధా కపూర్ ఇందులో కథానాయిక. యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ, ప్రమోద్ నిర్మాతలు. ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న ఈ భారీ చిత్రం షూటింగ్ కోసం రెండు సినిమాల కష్టం పడాల్సిందే అంటున్నారు శ్రద్ధా. ఈ విషయం గురించి మాట్లాడుతూ – ‘‘సాహో అనేది చాలా పెద్ద ప్రాజెక్ట్. పెద్ద సెట్స్, లొకేషన్స్ చేంజ్లు ఉన్నాయి. అలాగే ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రం కావడంతో ప్రతీ సీన్ రెండు సార్లు యాక్ట్ చేయాలి. ఒకసారి తెలుగులో యాక్ట్ చేస్తాం. అది బాగా వస్తే మళ్లీ అదే సీన్ని హిందీలో చేయాలి. అలా కాకపోతే మరోలా. ఈ సినిమా కోసం నా లైన్స్ నేనే గుర్తు పెట్టుకుంటున్నా. కొత్త భాషలో డైలాగ్స్ గుర్తు పెట్టుకోవడం చాలా కొత్త ఎక్స్పీరియన్స్లా ఉంది. చాలా టైమ్ కూడా పడుతుంది. పేరుకి ఒక్క సినిమా అయినా కష్టం రెండు సినిమాలది. అయినా ఎంత కష్టపడ్డా రిజల్ట్ ఆ కష్టాన్ని మర్చిపోయేలా చేస్తుంది’’ అని పేర్కొన్నారు. నీల్ నితిన్ ముఖేశ్, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, ఎవెలిన్ శర్మ ముఖ్య పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో రిలీజ్ కానుంది. -
షూటింగ్లో నటిని ఆవహించిన స్వామి
తమిళసినిమా: చిత్ర షూటింగ్లో నటిని ఆవహించిన స్వామి. ఆశ్చర్యానికి గురైన చిత్ర యూనిట్. నటుడు ధనుష్ తండ్రి, దర్శకుడు కస్తూరిరాజా దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం పాండిముని. ఇంతకు ముందు ధనుష్ నటించిన తుళ్లువదో ఇళమై, కాదల్ కొండేన్, యారడీ నీ మోహిని వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఆయన సొంత నిర్మాణ సంస్థ ఆర్కే.ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిస్తున్న చిత్రం పాండిముని. జాకీష్రాప్ అఘోరిగా ప్రధాన పాత్రను పోషిస్తున్న ఇందులో కొత్త నటుడు ఆశీప్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఇందులో మేఘలి, జ్యోతి, వైష్టవి, యాషిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరో ప్రధాన పాత్రలో షియాజీ షిండే నటిస్తున్నారు. ఈ చిత్రం వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది భయంకరమైన హర్రర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. 70 ఏళ్ల క్రితం అటవీ ప్రాంతంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం పాండిముని అని చెప్పారు. చిత్ర షూటింగ్ కొత్తగిరిలో నిర్వహిస్తుండగా ఒక ఆశ్చర్య సంఘటన జరిగిందన్నారు. మణకుడిసోలై అ ప్రాంతంలో కుట్టాంసామి అనే గుడి ఉందన్నారు.ఆ ప్రాంత ప్రజలు ఇష్టదైవంగా కొలుసుకుంటారని చెప్పారు. ఆ ఆలయానికి 700 వందల చరిత్ర ఉందని కొందరు, వెయ్యి సంవత్సరాల చరిత్ర అని చెబుతుంటారన్నారు. ఆ ఆలయానికి పాండవులు వచ్చి వెళ్లినట్టు చెబుతారన్నారు. ఒక గృహలాంటి ఆ గుడి వద్ద తాము పాండిముని చిత్ర షూటింగ్ చేసినట్లు చెప్పారు. అయితే ఆ గుడికి స్త్రీలకు అనుమతిలేదు, కాళ్లకు చెప్పులు వేసుకుని రాకూడదన్న ఆచారాలు ఉన్నట్లు ఆ ప్రాంత నివాసులు తెలిపారన్నారు. దీంతో తాము క్షమాపణలు చెప్పి అక్కడి నుంచి వచ్చేశామని చెప్పారు. మరుసటి రోజు ఆ పరిసర ప్రాంతాల్లో ౖౖషూటింగ్కు రాగా నటి మేఘలికి స్వామి ఆవిహించి ఆడగడం మొదలెట్టిందన్నారు. దీంతో యూనిట్ వర్గాలు దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు. వెంటనే ఆ ప్రాంత ప్రజలు వచ్చి పరిహార పూజలు నిర్వహించడంతో నటి మేఘలి నుంచి స్వామి వెళ్లిపోయాడని తెలిపారు. అదే మాదిరి మరో ఆశ్చర్యమైన సంఘటన ఏమిటంటే పనకుడిసోలైలోని కుట్టంసామి ఆలయంపై భాగంలో హెలికాప్టర్ ఎగరలేదన్నారు. ఆలయం చుట్టూ తిరిగిన హెలీకాప్టర్ ఆలయంపై భాగంలో తిరిగకపోవడం నిజంగా ఆశ్చర్యపరిచిన అంశం అన్నారు. ఆ ప్రాంతంలో ఆశీప్,మేఘలి,జ్యోతి,వైష్ణవి,యాషికలకు సంబంధించిన సన్నివేశాలను, మూడు పాటలను చిత్రీకరించినట్లు తెలిపారు. మొత్తం 25 రోజుల పాటు ఆ ప్రాంతంలో షూటింగ్ను నిర్వహించినట్లు చెప్పారు. తదుపరి షెడ్యూల్లో జాకీష్రాప్ నటిస్తున్న అఘోరి పాత్రకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు దర్శక నిర్మాత కస్తూరిరాజా తెలిపారు. దీనికి ఛాయాగ్రహణం మధుఅంజట్, సంగీతాన్ని శ్రీకాంత్ దేవా అందిçస్తున్నారు. -
దొంగా.. దొంగా
‘బాహుబలి’ సినిమాలో ఊళ్ల మీద పడి దోచేసుకునే దొంగలను తన ఎత్తులతో పనిపడతాడు అమరేంద్ర బాహుబలి. ఆ పాత్రలో ప్రభాస్ కటౌట్ సూపర్. ఇప్పుడీ కటౌట్ దొంగగా కనిపిస్తే.. కచ్చితంగా మంచి దొంగే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ దొంగ లోకల్ దొంగ కాదు ఇంటర్నేషనల్ దొంగ అట. ఒక దేశం నుంచి ఇంకో దేశాన్ని చిటికెలో దాటేస్తాడట. ఇంటర్ పోల్ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించేస్తాడట. అసలు విషయం ఏంటంటే.. ‘సాహో’ సినిమాలో ప్రభాస్ పురాతన వజ్రాలు దొంగిలించే క్రేజీ దొంగ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘సాహో’. యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కథానాయిక. ప్రభాస్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకునే సీరియస్ పోలీస్ ఆఫీసర్ రోల్లో శ్రద్ధ కనిపించనున్నారు. మరి ఈ దొంగా పోలీస్ ఆట ఎలా ఉంటుందో తెలియాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే. జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, అరుణ్ విజయ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. ఈ చిత్రానికి కెమెరా: మది, సంగీతం:శంకర్ ఎహాసన్ లాయ్. -
అర్థం మారింది
జనరల్గా ‘రా (ఆర్.ఏ.డబ్యూ)’ అంటే డిఫెన్స్ డిక్షనరీలో ‘రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్’ అని అర్థం వస్తుంది. కానీ రీల్పై రా అంటే... ‘రోమియో అక్బర్ వాల్టర్’ అంటున్నారు హిందీ హీరో జాన్ అబ్రహాం. రోబీ గ్రేవాల్ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా రూపొందుతున్న ‘రోమియో అక్బర్ వాల్టర్’ చిత్రం షూటింగ్ మొదలైంది. ఇందులో కథానాయికగా మునీ రాయ్ నటిస్తున్నారు. హిందీ చిత్రం జాకీష్రాఫ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో ‘స్పై’ పాత్రలో నటిస్తున్న జాన్ అబ్రహాం డిఫరెంట్ గెటప్స్లో కనిపించనున్నారు. గుజరాత్, ముంబై, ఢిల్లీలో మేజర్ షూటింగ్ జరపాలనుకుంటున్నారు. ‘కొత్త సినిమా జర్నీ మొదలైంది’ అని పేర్కొన్నారు జాన్ అబ్రహాం. -
టైగర్ను చూసి గర్విస్తున్నా..
సాక్షి, ముంబయి : బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ తన కుమారుడు టైగర్ ష్రాఫ్ విజయాలను చూసి మురిసిపోతున్నారు. తనను టైగర్ తండ్రిగా పిలవడాన్ని గర్వంగా భావిస్తానని జాకీ ష్రాఫ్ చెప్పుకొచ్చారు. సినిమాల ఎంపికపై తాను టైగర్కు సలహాలు ఇవ్వనని, తన కెరీర్ గురించి ఏమాత్రం ఆందోళన చెందనని చెప్పారు. కఠోరశిక్షణతో టైగర్ ష్రాఫ్ తన శరీరాన్ని తీర్చిదిద్దుకున్నాడని, మానసికంగా ధృడంగా మారాడని కొడుకుకు కితాబిచ్చారు. తాజాగా బాఘీ 2తో టైగర్ ష్రాఫ్ సూపర్ హిట్ అందుకున్నారు. టైగర్ ఎన్నో విజయాలు, పరాజయాలను చూస్తూ పెరిగాడని, రిస్క్ తీసుకోవడాన్ని సవాల్గా భావిస్తాడన్నారు. అందరికీ ప్రేమను పంచడం, అపజయాలను హృదయానికి తీసుకోకపోవడం అలవరుచుకున్నాడని అన్నారు. నటుడు కావాలని తానెన్నడూ కలలు కనలేదని అన్నారు.తాను ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకున్నా బాలీవుడ్లో ఎదిగానని, ఏదిచ్చినా దేవుడి ప్రసాదంగా స్వీకరిస్తానని చెప్పారు. నా సినిమా బాగా ఆడి నిర్మాతలకు డబ్బులు వస్తే తాను సంతృప్తిగా ఫీలవుతానని అన్నారు. -
భయపెడతాం
కథానాయిక నికిషా పటేల్ గుర్తుండే ఉంటారు. ఎస్.జే సూర్య దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘పులి’ సినిమాతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కన్నడ, తమిళ సినిమాల్లో బిజీ అయ్యారు. మధ్యలో కల్యాణ్రామ్ హీరోగా వచ్చిన ‘ఓం 3డీ’ సినిమాలో, సాయిరామ్ శంకర్తో ‘అరకు రోడ్’ చిత్రంలో నటించారు. ఆమె నటిస్తున్న తాజా తమిళ చిత్రం ‘పాండిముని’. కస్తూర్ రాజా దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ జాకీష్రాఫ్ అఘోరాగా కనిపించనున్నారు. ‘పాండిముని’ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో రూపొందే హారర్ చిత్రమట. అంటే నికిషా పటేల్ అండ్ టీమ్ థియేటర్స్లో ఆడియన్స్ను భయపెట్టడానికి రెడీ అవుతున్నారన్నమాట. -
సముద్రమంత పెద్ద కష్టం తలసేమియా
తలసేమియా.. అంటే గ్రీకు భాషలో సముద్రం అని అర్థం. మనకు మాత్రం ఇదో వ్యాధి అనే విషయం తెలుసు. వ్యాధిగ్రస్తుల కష్టం సముద్రమంత పెద్దది. అందుకే దానికి ఆ పేరు. తల్లిగర్భంలో ఉన్నప్పుడే ఆవహించే ఈ మహమ్మారి.. పుట్టిన మరుక్షణం నుంచే నరకం చూపిస్తుంది. ఒకసారి ఆపరేషన్ చేస్తే సమసిపోయే సమస్య కాదు.. జీవితాంతం రక్తం ఎక్కిస్తూనే ఉండాలి. అందుకే దీనిపై అవగాహన పెంచుకోవాలని పిలుపునిస్తున్నాడు బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్. ముంబై: తలసేమియా అనేది జన్యు సంబంధమైన వ్యాధి. తలసేమియా పిల్లల జీవితాలు పౌర్ణమి – అమావాస్యలను తలపిస్తాయి. ఒంటినిండా రక్తం ఉన్నప్పుడు.. బిడ్డ పున్నమి చంద్రుడిలా కళకళలాడుతుంటాడు. హుషారుగా కన్పిస్తాడు. రక్తం తగ్గిపోయే కొద్దీ అమావాస్య చంద్రుడిలా నీరసించిపోతాడు. పిల్లల ప్రాణాలతో చెలగాటమాడే రక్తపిశాచి ఇది. దురదృష్టం ఏమిటంటే.. ప్రాణంపోసే కన్నవారి ద్వారానే ఈ ప్రాణాంతక వ్యాధి సంక్రమిస్తుంది. తలసేమియా జన్యువాహకులైన తల్లిదండ్రులకు (తలసేమియా మైనర్) జన్మించే బిడ్డల్లో పాతిక శాతం మంది పుట్టుకతోనే వ్యాధిగ్రస్తులయ్యే (తలసేమియా మేజర్) అవకాశం ఉంది. మనదేశంలో ఆరు కోట్లమంది తలసేమియా వాహకులు ఉన్నారు. సమస్య ఏంటంటే..: మనం పీల్చుకునే ప్రాణవాయువును రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకూ అందించే బాధ్యత హిమోగ్లోబిన్దే. తలసేమియా రోగుల్లో శరీరానికి అవసరమైనంత మేర హిమోగ్లోబిన్ ఉత్పత్తి కాదు. తయారైనా ఎక్కువకాలం మనలేదు. ఫలితంగా హిమోగ్లోబిన్ నిల్వలు దారుణంగా పడిపోతాయి. అలా పడిపోయిన ప్రతిసారీ కృత్రిమంగా అందించాల్సి ఉంటుంది. అందకపోతే ప్రాణం పోతుంది. ఏటా దేశంలో 12000 చిన్నారులు తలసేమియాతో పుడుతున్నారట. చికిత్స ఏంటంటే..: తలసేమియా రోగులకు జీవితాంతం రక్తం ఎక్కించాలి. మరోదారి లేదు. నెలనెలా ఖరీదైన మందులు కొనాలి. రక్తం ఎక్కించిన ప్రతిసారీ ల్యూకో డిప్లీషన్ ఫిల్టర్స్ వాడాలి. క్రమం తప్పకుండా దంత, గుండె, మూత్రపిండాల, కాల్షియం, ఫాస్పరస్ స్థాయిలను తెలిపే పరీక్షలూ చేయిస్తుండాలి. వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. అప్పుడే ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు. లేదంటే ఏదో ఓ రోగం వస్తుంది. తలసేమియా పిల్లలకు వ్యాధి నిరోధకత తక్కువ. అవగాహన అవసరం దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టబోతున్న యువతీయువకులు తలసేమియాపై అవగాహన పెంచుకోవాలని బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్ పిలుపునిస్తున్నారు. ఆరోగ్యకరమైన కుటుంబం కోసం ముందుగానే తలసేమియాను గుర్తించే రక్తపరీక్ష చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. భారత్లో తలసేమియాపై అవగాహన కల్పించే ప్రచారకర్తగా కొనసాగుతున్న జాకీష్రాఫ్ ఐఏఎన్ఎస్ వార్తాసంస్థతో మాట్లాడుతూ.. ‘తల్లిదండ్రులు తలసేమియాకు సంబంధించిన నిజాలు తెలుసుకోవాలి. తాము వాహకులం కాదని నిర్ధారించుకున్నాకే బిడ్డకు జన్మనిచ్చేందుకు సిద్ధం కావాలి. ఇందుకోసం వైద్యశాస్త్రంలో ఎన్నో మార్గాలున్నాయి. అలా కాదని నిర్లక్ష్యం చేస్తే.. పుట్టబోయే బిడ్డ మాత్రమే కాదు.. తల్లిదండ్రులు కూడా నరకాన్ని అనుభవించాల్సి ఉంటుంద’న్నారు. -
ప్రభాస్ నమ్మాడు
ఇప్పుడు ప్రభాస్తో ఫైట్లు–ఫీట్లు చేయడానికి ముచ్చటగా ముగ్గురున్నారు. సుజీత్ దర్శకత్వంలో ఆయన హీరోగా చేస్తున్న ‘సాహో’లో హిందీ నటులు నీల్ నితిన్ ముఖేశ్, చంకీ పాండేలు విలన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ లిస్టులోకి మరో హిందీ నటుడు చేరారు. ఆయనే... జాకీ ష్రాఫ్. తెలుగులో ‘అస్త్రం, శక్తి, పంజా’ సినిమాల్లో విలన్గా చేసిన జాకీ, ‘సాహో’లో నటిస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమా గురించి జాకీ ష్రాఫ్ మాట్లాడుతూ– ‘‘ఐయామ్ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ ప్రభాస్ ‘సాహో’. సినిమాలో కీలక పాత్రను నేను చేయగలనని ప్రభాస్ నమ్మాడని తెలిసి ఇంకా సంతోషపడ్డా’’ అన్నారు. ప్రస్తుతం ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్లో జరుగుతోంది. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్లు నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ హీరోయిన్. -
క్షణక్షణం ఉత్కంఠ
సందీప్ కిషన్, లావణ్యా త్రిపాఠి జంటగా, హిందీ నటుడు జాకీష్రాఫ్ ప్రధాన పాత్రలో సీవీ కుమార్ దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన చిత్రం ‘మాయావన్’. ఈ సినిమాను ‘ప్రాజెక్ట్ జెడ్’ పేరుతో ఎస్.కె. బషీద్ సమర్పణలో ఎస్.కె. కరీమున్నీసా తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. సెప్టెంబర్ తొలివారంలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఎస్.కె.బషీద్ మాట్లాడుతూ– ‘‘ఆద్యంతం ఉత్కంఠ కలిగించే అంశాలతో తెరకెక్కిన చిత్రమిది. సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకుల ఆసక్తి తగ్గదు. సందీప్ కిషన్ నటన హైలైట్. లావణ్యా త్రిపాఠి ఇప్పటి వరకు కనిపించని పాత్రలో నటించారు’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గిబ్రాన్, కెమెరా: గోపి అమర్నాథ్, డైలాగ్స్: శశాంక్ వెన్నెలకంటి. -
నా కొడుకు ఓ రేసుగుర్రం: నటుడు
ముంబయి: బాలీవుడ్ వెటరన్ నటుడు జాకీ ష్రాఫ్ వారసుడిగా తెరంగ్రేటం చేసినా.. తనకంటూ పేరు తెచ్చుకుంటున్నాడు ఆయన కుమారుడు టైగర్ ష్రాఫ్. కుమారుడు సక్సెస్ అవుతున్నప్పుడు ఆ తండ్రి చూపే పుత్రవాత్సల్యాన్ని మాటల్లో చెప్పలేం. ప్రస్తుతం జాకీ ష్రాఫ్ అదే స్థితిలో ఉన్నారు. ఇటీవల ఈ ఈవెంట్లో పాల్గొన్న ఆయన తన కొడుకు గురించి మాట్లాడుతూ.. టైగర్ ష్రాఫ్ ఓ రేసుగుర్రం లాంటి వాడన్నారు. ఎప్పుడూ పని మీద శ్రద్ధ చూపించే వ్యక్తులలో టైగర్ ఒకడని కొనియాడారు. టైగర్ వ్యక్తిత్వం అందరికంటే కాస్త భిన్నమైనది. స్కూల్ రోజుల్లో వాడు బాస్కెట్ బాల్ ఆడేవాడు. ఎంతలా అంటే.. ప్రత్యర్ధి స్కూలు జట్లు కూడా టైగర్ ఆటను మెచ్చుకునేవి. ఏదైనా పని మొదలుపెడితే ఇతర వ్యాపకాలపైకి ఆకర్షితుడు కాడు. వాడు రేసుగుర్రంలా బరిలో దిగుతాడని నా అభిప్రాయం. తొలి మూవీ ‘హీరో పంతీ’లో రొమాంటిక్ సీన్లతో ఆకట్టుకున్న టైగర్ .. 'భాఘీ'తో యాక్షన్ సీన్లతోనూ మెప్పించాడు. ఇలా రోజురోజుకూ నటనలో ఓ మెట్టు ఎదుగుతున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందని' జాకీ ష్రాఫ్ వివరించారు. -
ప్రభాస్తో తలపడనున్న బాలీవుడ్ స్టార్స్..?
దాదాపు నాలుగేళ్లుగా బాహుబలికే అంకితమైపోయిన ప్రభాస్, ఇటీవలే ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేశాడు. రెండో భాగం చిత్రీకరణ కూడా పూర్తి కావటంతో బాహుబలి గెటప్కు గుడ్ బై చెప్పేసిన ప్రభాస్, తన నెక్ట్స్ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ప్రభాస్తో సినిమా చేయడానికి చాలా కాలంగా ఎదురుచూస్తున్న సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించేందుకు ఓకె చెప్పాడు. యువీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్తో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తుంది. బాహుబలి సినిమాతో ప్రభాస్కు వచ్చిన ఇమేజ్ను కంటిన్యూ చేసే స్థాయిలో ఈ సినిమా రూపొందనుంది. అందుకు తగ్గట్టుగా నటీనటుల ఎంపిక లోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మూడు భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు అన్ని భాషల్లో హైప్ క్రియేట్ అయ్యే విధంగా కాస్టింగ్ను ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ మార్కెట్ మీద దృష్టి పెట్టిన నిర్మాతలు ప్రభాస్కు ప్రతినాయకులుగా బాలీవుడ్ స్టార్స్ను రంగంలోకి దించుతున్నారు. ప్రస్తుతం అజిత్ హీరోగా తెరకెక్కుతున్న వివేగంలో విలన్గా నటిస్తున్న వివేక్ ఒబరాయ్తో పాటు పలు తెలుగు చిత్రాల్లో నటించిన బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్లు ప్రభాస్ సినిమాలోనటిస్తున్నారు. విలన్లతో పాటు హీరోయిన్ను బాలీవుడ్ నుంచి దిగుమతి చేసుకునే ఆలోచనలో ఉంది యువి క్రియేషన్స్. ఇప్పటికే బాలీవుడ్ సంగీత త్రయం శంకర్ ఇషాన్ లాయ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నట్టుగా ప్రకటించారు. పేరుకు సౌత్ సినిమానే అయినా.. ప్రభాస్ కొత్త సినిమాను పూర్తి బాలీవుడ్ ప్రాజెక్ట్గా రూపొందించే పనిలో ఉన్నారు మేకర్స్. మరి బాహుబలి హవాను ప్రభాస్ కంటిన్యూ చేస్తాడో లేదో చూడాలి. -
ఆ పార్టీ ప్రచార బరిలో సినీ దిగ్గజాలు!
రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి సినీ గ్లామర్ తోడయ్యే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ సినీస్టార్లను ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్టు కనిపిస్తోంది. తాజాగా మంగళవారం బాలీవుడ్ ప్రముఖులు అర్జున్ రాంపాల్, జాకీష్రఫ్ న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద కనిపించారు. ఈ ఇద్దరు నటులు కూడా పార్టీ కార్యాలయం బీజేపీ సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. అనంతరం బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ మీడియాతో మాట్లాడుతూ తాను రాజకీయ నాయకుడిని కాదని, బీజేపీలో చేరే ఉద్దేశం తనకు లేదని తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశం కోసం మంచి పనులు చేస్తున్నదని, వాటికి తన మద్దతు ఉంటుందని తెలిపారు. ప్రధాని మోదీ పథకాలైన స్వచ్ఛభారత్, పెద్దనోట్ల రద్దుకు తాను గట్టిగా మద్దతునిస్తున్నట్టు తెలిపారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేసేందుకు తాను సిద్ధమేనంటూ సంకేతాలు ఇచ్చారు. -
రెచ్చిపోతున్న హీరో కూతురు
ముంబై: బాలీవుడ్ హీరో జాకీ ష్రాఫ్ కుమార్తె కృష్ణా ష్రాఫ్ సోషల్ మీడియా సెన్సేషన్గా మారింది. తన హాట్ హాట్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ కుర్రకారు మతిపోగొడుతోంది. ఇటీవల తన టాప్లెస్ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కృష్ణా ష్రాఫ్.. తాజాగా బికినీలో ఉన్న ఫొటోను ఉంచింది. టూ పీస్ బికినీ ధరించిన ఈ అమ్మాయి రాత్రి వేళ స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతున్నట్టుగా ఉంది. మెదడుకు, శరీరానికి విశ్రాంతి ఇవ్వాలని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన తన ఫొటోపై కామెంట్ రాసింది. హాట్ హాట్ ఫొటోల వల్లేమో కానీ ఇన్స్టాగ్రామ్లో హీరోగారి అమ్మాయికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతోంది. ఆమెకు లక్షా 85 వేలమంది ఫాలోవర్లు ఉన్నారు. కృష్ణా తన సోదరుడు టైగర్ ష్రాఫ్ మాదిరిగా బాలీవుడ్లో అరంగేట్రం చేస్తుందని ప్రచారం జరుగుతోంది. కాగా కూతురి బోల్డ్ పిక్చర్స్పై మీడియా సమావేశంలో జాకీ ష్రాఫ్ స్పందిస్తూ.. ఈ విషయంలో తాను జోక్యం చేసుకోనని చెప్పారు. తన పిల్లలు టైగర్, కృష్ణా ఇద్దరూ తెలివైనవారని, ఏం చేయాలో వాళ్లకు అవగాహన ఉందని అన్నారు. వాళ్ల ప్రవర్తనపై తనకు అభ్యంతరం లేదని, ఈ విషయం గురించి మాట్లాడనని చెప్పారు. -
మరోసారి తమిళ తెరపైకి జాకీష్రాఫ్
హిందీ స్టార్స్ కోలీవుడ్లో నటించడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు. కాకపోతే తమ పాత్రలో కాస్త వైవిధ్యాన్ని ఆశిస్తున్నారంతే. బాలీవుడ్ స్టార్ హీరో జాకీష్రాఫ్ ఇప్పటికే అరణ్యం, సూపర్స్టార్ రజనీకాంత్తో కలసి కోచ్చడైయాన్ చిత్రాలతో కోలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తాజాగా ముచ్చటగా మూడోసారి తమిళ తెరపై మెరవనున్నారు. పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన నిర్మాత సీవీ.కుమార్ ఇప్పుడు ఆ అనుభవంతో మెగాఫోన్ పట్టారు. మాయావన్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో సందీప్ కిషన్, రెజీనా జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రం షూటింగ్ జరుపుకుంటున్న ఆ చిత్రంలో ముఖ్యపాత్రకు బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్ అయితే బాగుంటుందని సీవీ.కుమార్ భావించారట. దీంతో గత వారం ముంబై వెళ్లి ఆయనకు కథ వినిపించి నటించాలని కోరగా జాకీష్రాఫ్ మారు మాట మాట్లాడకుండా ఓకే అన్నారట. ఏప్రిల్ నాలుగు నుంచి ఆయన మాయావన్ చిత్ర షూటింగ్లో పాల్గొననున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు. ఇందులో జాకీష్రాఫ్ దాదాగా నటించనున్నారని సమాచారం. ఆయనకు పోరాట దృశ్యాలు కూడా ఉంటాయని తెలిసింది. ఈ చిత్రాన్ని స్టూడియోగ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా నిర్మించడం విశేషం. -
'టైగర్పై నా ప్రభావం పడనివ్వను'
ముంబై: యువ హీరో టైగర్ ష్రాఫ్ కెరీర్పై తన ప్రభావం ఏమాత్రం ఉండబోదని అతడి తండ్రి, బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీష్రాఫ్ అన్నారు. టైగర్కు తాను సలహాలు ఇవ్వదలుచుకోలేదని, అతడి కెరీర్ సాఫీగా సాగుతోందన్నాడు. టైగర్ చాలా క్రమశిక్షణ గల వ్యక్తి అని, అతడి జీవితంలో సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటాడని కుమారుడిని ప్రశంసించాడు. సాజిద్ నదియాడ్వాలా ప్రొడక్షన్లో గతేడాది విడుదలైన 'హీరోపంతి' మూవీతో టైగర్ ష్రాఫ్ బాలీవుడ్కు పరిచయం అయిన విషయం తెలిసిందే. టైగర్ నటించిన బాఘి, ఏ ఫ్లైయింగ్ జాట్ సినిమాలు త్వరలో విడుదల కానున్నాయి. అతడి కెరీర్లో తన పాత్రేమీ లేదని, సరైన పద్ధతిలో అతడ్ని పెంచినట్లు చెప్పుకొచ్చాడు. అతడి చదువు విషయంలోనూ తానేప్పుడు సలహాలు ఇవ్వలేదని, క్రమశిక్షణ ఉన్న ఆటగాడు అని అందుకే తన ఆలోచనల్ని టైగర్పై ప్రయత్నం చేయనన్నాడు. కూతురు బాస్కెట్ బాల్ కోచింగ్ ఇస్తున్న విషయాన్ని ఎవరూ గుర్తుచేయడం లేదని, కేవలం సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోల గురించే ప్రస్తావిస్తున్నారని జాకీష్రాఫ్ అసహనం వ్యక్తం చేశాడు. -
బాఘీ’లో టైగర్ షరాఫ్
జాకీ షరాఫ్ తనయుడు టైగర్ షరాఫ్ తనయుడు మరోసారి నదియాద్వాలా చిత్రంలో నటించనున్నాడు. నదియాద్వాలా నిర్మించిన ‘హీరోపంతి’ చిత్రంతో తెరంగేట్రం చేసిన ఈ యంగ్ టైగర్, సాజిద్ నదియాద్వాలా, యూటీవీ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించనున్న ‘బాఘీ-రెబల్ ఫర్ లవ్’లో నటించనున్నాడు. ‘హీరోపంతి’ దర్శకుడు సబ్బీర్ ఖానే దీనికి కూడా దర్శకత్వం వహించనున్నాడు. టైగర్-నదియాద్వాలా కాంబినేషన్లో మరో చిత్రాన్ని రూపొందించనున్న విషయాన్ని సబ్బీర్ ‘ట్విట్టర్’లో వెల్లడించాడు. ఏప్రిల్ 15న దేశవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానున్నట్లు తెలిపాడు. -
సినిమా రివ్యూ: హ్యపీ న్యూ ఇయర్
చంద్రమోహన్ మనోహర్ శర్మ అలియాస్ చార్లీ (షారుక్ ఖాన్) 300 కోట్ల రూపాయల విలువైన వజ్రాలను పారిశ్రామిక వేత్త చరణ్ గ్రోవర్ (జాకీష్రాఫ్) నుంచి దొంగిలిండచడానికి ప్లాన్ వేస్తాడు. అందుకోసం ఏర్పాటు చేసిన 'హ్యాపీ న్యూ ఇయర్ మిషన్' టీమ్ లో టామీ (బొమ్మన్ ఇరానీ), నందూ భిడే ( అభిషేక్ బచ్చన్), జాక్ (సోనూ సూద్), మోహిని (దీపికా పదుకొనే), రోహన్ (వివాన్ షా)లను చేర్చుకుంటాడు. దుబాయ్లో జరిగే వరల్డ్ డాన్స్ ఛాంపియన్ షిప్లో పాల్గొని, అక్కడే వజ్రాలను చేజిక్కించుకోవాలని ప్లాన్ చేస్తారు. వజ్రాలను దొంగిలించడానికి కారణమేంటి? అందులో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? వజ్రాలను ఎలా చేజిక్కించుకున్నారనేదే సింపుల్ గా 'హ్యాపీ న్యూ ఇయర్' కథ. ఆకట్టుకునే అంశాలు: దీపికా పదుకొనే, అభిషేక్ బచ్చన్, షారుక్ యాక్టింగ్ బొమ్మన్, సోనూ సూద్ల కామెడీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు, డ్యాన్స్ నిరాశపరిచే అంశాలు: లాజిక్ లేని, రొటీన్ కథ కథనంలో వేగం లోపించడం దోపిడీ నేపథ్యంగా సాగే కథలోథ్రిల్స్, ట్విస్ట్ లు లేకపోవడం నటీనటుల పెర్ఫార్మెన్స్: ఈ చిత్రంలో ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకునే పాత్రలు కేవలం రెండే రెండు. ఒకటి అభిషేక్ బచ్చన్, రెండవది దీపికా పదుకొనే. నందూ భిటే పాత్రలో అభిషేక్ కొత్తగా కనిపిస్తారు. చక్కటి టైమింగ్తో కామెడీని, ఫెర్మార్మెన్స్ను పండించడంలో అభిషేక్ తన సత్తాను చూపాడు. అభిషేక్కు మంచి గుర్తింపు తెచ్చే పాత్ర అని చెప్పవచ్చు. ఇక మోహినిగా బార్ డాన్సర్గా దీపిక కనిపించింది. వచ్చీరాని ఇంగ్లీష్ మాట్లాడే పాత్రలో దీపికా మంచి మార్కులు కొట్టేసింది. ఇక షారుక్తో కలిసి అక్కడక్కడ మెరుపులు మెరిపించింది. చెవిటి వాడిగా సోను సూద్, మూర్ఛ రోగిగా బొమ్మన్, సాఫ్ట్ వేర్ హ్యాకర్గా వివాన్ షా తమ పాత్రల పరిధి మేరకు పర్వాలేదనింపిచారు. కథ అంతా షారుక్ నడిపించినా.. ఆపాత్రకు బలమైన క్యారెక్టరైజేషన్ కొరవడంతో పెద్దగా ఆకట్టకోలేకపోయడానే చెప్పవచ్చు. దర్శకత్వ విభాగ పనితీరు: సింపుల్ కథను ఎంచుకుని పగ, ప్రతీకారం నేపథ్యానికి వినోదం, ప్రేమ, ఎమోషన్స్ లను మేళవించి టాప్ ఆర్టిస్టులతో దర్శకురాలు ఫరాఖాన్ చేసిన ప్రయత్నం హ్యాపీ న్యూ ఇయర్. పగ, ప్రతీకారం నేపథ్యంగా రూపొందే చిత్రాల్లో బలమైన విలనిజం లేకపోవడం ఈ చిత్రానికి పెద్ద మైనస్ గా మారింది. ప్రధానమైన విలన్ జాకీ ష్రాఫ్ పాత్రను గెస్ట్గా మార్చడంతో హీరోయిజం ఎక్కడా ఎలివేట్ కాలేకపోయింది. షారుక్ తోపాటు మిషన్ హ్యాపీ న్యూయర్ టీమ్ ను బలంగా తీర్చిదిద్దలేకపోవడం లాంటి అంశాల్లో ఫరా ఖాన్ బలహీనతలు కనిపిస్తాయి. పూర్తి స్థాయిలో అటు యాక్షన్ చిత్రంగా లేదా వినోదాత్మకం చిత్రంగా మలచడంలో విఫలమయ్యారని చెప్పవచ్చు. ఎలాంటి ఎమోషన్స్ లేకుండా ప్రేమ కథ సాగడం, షారుక్-దీపికా పదుకొనేల మధ్య కెమిస్ట్రీ పెద్దగా వర్కవుట్ కాకపోవడం ఈ చిత్రంలో మరో ప్రధానమైన వైఫల్యంగా మారింది. షారుక్ ఎయిట్ ప్యాక్, సోనుసూద్ సిక్స్ ప్యాక్ మీద పెట్టిన దృష్టిని కొంత మరల్చి కథపై పెట్టి ఉంటే మరింత మెరుగైన ఫలితాన్ని పొందే అవకాశం ఉండేది. ఒక మాటలో చెప్పాలంటే ఈ చిత్రం చూశాక హ్యపీ న్యూ ఇయర్ పూర్తిస్థాయి చిత్రంగా కాకుండా టెలివిజన్ డ్యాన్స్ అండ్ రియాల్టీ షోగానే ప్రేక్షకులకు అనిపించడం సహజం. --రాజబాబు అనుముల -
నటించడమే బాగుంది
తరుణ్ తహిల్యాని, రోహిత్ బాల్ వంటి గొప్పగొప్ప డిజైనర్లు రూపొందించిన దుస్తులు ధరించి ర్యాంప్ వాక్ చేసినా కెమెరా ముందు నటించడమే బాగుందని చెబుతోంది కృతి సనన్. ‘వన్’ సినిమాతో టాలీవుడ్ హీరో మహేశ్బాబు సరసన నటించి మంచి మార్కులే కొట్టేసిన ఈ సుందరి జాకీష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్తో కలసి బాలీవుడ్లో అడుగు పెట్టింది. టైగర్ష్రాఫ్, కృతి జంటగా ‘హీరోపంతి’ సినిమా ఇటీవలే విడుదలైంది. మోడల్ రంగం నుంచి సినీ పరిశ్రమకు వచ్చిన మీకు ఏది సులభంగా ఉందని పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు కృతి సమాధానమిస్తూ... ర్యాంప్ వాక్ చేయడం కంటే కెమెరా ముందే తనకు సౌకర్యంగా అనిపించిందని చెప్పింది. ర్యాంప్పై నడిచేటప్పుడు ఎదుటివారిని అప్పటికప్పుడే సంతృప్తి పర్చాల్సి ఉంటుందని, తప్పులు జరిగితే సరిదిద్దుకునే సమయం అక్కడ ఉండదని, సినిమాలో అయితే ఎన్ని టేక్లైనా తీసుకొని సీన్ సరిగ్గా వచ్చేంతవరకు నటించే అవకాశముంటుందని చెప్పింది. ఐదేళ్లప్పుడే ర్యాంప్వాక్ చేసిన తాను న్యూఢిల్లీలోని ఆర్కే పురంలోగల ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నప్పుడు మోడల్ రంగంవైపు వెళ్తానని అనుకోలేదని, అలాగే మోడల్గా కొనసాగుతున్నప్పుడు సినీ పరిశ్రమవైపు వస్తానని అనుకోలేదని చెప్పింది. ర్యాంప్వాక్ చేస్తున్నప్పుడు ఒక్కోసారి చాలా ఇబ్బందిగా అనిపించేదని, నటించే సమయంలో మాత్రం అలాంటి అనుభవం ఒక్కసారి కూడా ఎదురుకాలేదని చెప్పింది. మోడలింగ్ను ఎప్పుడూ కెరీర్గా భావించలేదని, సినీ పరిశ్రమలోకి వచ్చిన తర్వాత మాత్రం నటనను కెరీర్గా మలచుకోవాలనే అభిప్రాయం కలుగుతోందని చెప్పింది. మే 23న విడుదలైన ‘హీరోపంతి’ తొలివారంలోనే రూ. 23 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద మంచి బోణీ చేసిందని, తొలి సినిమా విజయవంతం కావడం సంతోషంగా ఉందని చెప్పింది. కొత్తదనాన్ని, కొత్తవారిని ఆదరిస్తున్న బాలీవుడ్లో మరిన్ని అవకాశాలు వస్తున్నాయని, అయితే కథలు, పాత్రల ఎంపికలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానంది. -
‘హీరోపంటి’తో అదరగొడతా
‘హీరో పంటి’తో బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం కాబోతున్న టైగర్ ష్రాఫ్ తన ఆరంగేట్రం అదిరిపోతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఈ సినిమా కోసం తాను చేసిన కఠోర సాధనే హీరోగా నిలబెడతుందన్న ధీమాతో ఉన్నాడు. ఈ నెల 23న సినిమా థియేటర్లలో విడుదల కానున్న ‘హీరో పంటి’ సినిమా ప్రేక్షకులందరినీ అలరిస్తుందన్నాడు. అదే రోజు తన తండ్రి జాకీ ష్రాఫ్ విలన్గా నటించిన కొచ్చడియాన్ సినిమా రిలీజ్ అవుతుండటం కూడా సంతోషంగా ఉందన్నాడు. ఇది తండ్రీకొడుకుల మధ్య పోటీ అని పేర్కొన్నాడు. ‘హీరో పంటి విజయవంతం కావడం కోసం హీరోగా చాలా శ్రమించా. ఈ మూవీని ప్రేక్షకులు స్వీకరిస్తారన్న నమ్మకం ఉంది’ అని చెబుతున్నాడు టైగర్ ష్రాఫ్. తొలిసారిగా బాలీవుడ్కు పరిచయం అవుతున్న ష్రాఫ్ ఈ సినిమా విజయవంతమైనా కాకపోయినా తనదైన ముద్ర వేయగలుగుతానని ధీమాగా చెప్పాడు. ‘ఒకరోజు టైగర్ ష్రాఫ్ గురించి ట్విట్టర్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే అనేకమంది సామాజిక అనుసంధాన వేదికలో నా పేరుపై తమాషాగా కామెంట్లు రాయడం చూశా. వాటిని చదివి నవ్వుకున్నా’నని తెలిపాడు. ఇప్పుడే ఇలా చర్చల్లో ఉంటే ప్రేక్షకులపై కొంత ఇప్పటికే ప్రభావం చూపినట్టేనని అన్నాడు. పబ్లిసిటీ అనేది పబ్లిసిటీయే. అది చెడా, మంచా అన్నది పరిగణనలోకి తీసుకోవద్దు. మన గురించి ఎవరూ మాట్లాడకపోతేనే ఆందోళన చెందాలని అన్నాడు టైగర్ ష్రాఫ్. చూపుల కన్నా ప్రతిభ ముఖ్యమని తెలిపాడు. ‘నేనేమిటనేదిో ప్రేక్షకులకు చూపాలనుకుంటున్నా. వారికి నచ్చిన తరహాలోనే నా పాత్ర ఉంటుంది. ఒకవేళ నచ్చకపోతే ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా నటనను మార్చుకుంటా. నా ప్రతిభను నిరూపించుకుంటాన’ని తెలిపాడు. ‘హీరోపంటి’ సినిమా ప్రచారం కోసం వారణాసికి వచ్చిన టైగర్ ష్రాఫ్... ఢిల్లీ, పంజాబ్, నాగపూర్లకు కూడా వెళ్లనున్నాడు. -
అందాల ఆరబోత చాలు
నేను మాత్రం ఎంతకాలమని అందాలారబోతనే నమ్ముకుంటాను? ఇప్పటి వరకు గ్లామర్ డాల్గా అందాలు ఒలకబోసింది చాలు. ఇకపై చాలెంజింగ్ పాత్రలే నటిస్తాను అంటున్నదెవరో తెలుసా? నాజూకు భామ శ్రీయ. ఈ బ్యూటీలో మంచి నటి ఉన్న విషయాన్ని ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఎందుకనో శ్రీయను ఎక్కువగా గ్లామరస్ హీరోయిన్గానే చూపించడానికి దక్షిణాది దర్శక, నిర్మాతలు ఆసక్తి చూపించారు. కచ్చితమైన కొలతలతో కూడిన ఆమె శారీరక సౌష్టం కూడా ఇందుకు ఒక కారణం కావచ్చు. తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి యువ స్టార్స్ విజయ్, ధనుష్ వరకు టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి నుంచి క్రేజీ స్టార్స్ బాలకృష్ణ, నాగార్జున వరకు జత కట్టిన ఈ ముద్దుగుమ్మ కొందరు తారలను అనుకరించే ప్రయత్నం చేసి విఫలం అయ్యారు. ముఖ్యంగా నటి అనుష్క వేదం చిత్రంలో వేశ్యపాత్ర పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు. శ్రీయా కూడా అదే బాటలో పయనించి పవిత్ర అనే చిత్రంలో వెలయాలి పాత్ర పోషించారు. కానీ ఆ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. అదే విధంగా కన్నడంలో చంద్ర అనే చిత్రంలో పవర్ఫుల్ పాత్రను పోషించారు. ఆ చిత్రం ఆమెకు నిరాశనే మిగిల్చింది. దీంతో పునరాలోచనలో పడిన శ్రీయ ఇకపై రెగ్యులర్ పాత్రలు, ముఖ్యంగా గ్లామర్ పాత్రలు పోషించరాదని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. శ్రీయ వల్ల సాధ్యం కాదని అనుకునే సవాల్తో కూడిన పాత్రలను పోషించి నటిగా తానేమిటో నిరూపించుకుంటానంటున్నారు. ఇందుకోసం చిత్రానికి 50 నుంచి 60 కాల్షీట్స్ కేటాయించి అయినా ఆ పాత్రగా మారడానికి ప్రయత్నిస్తానన్నారు. ఇకపై అలాంటి పాత్రలతో కూడిన చిత్రాలనే అంగీకరిస్తానని చెప్పారు. షూటింగ్ పూర్తి చేసుకుని సాయంత్రం ఇంటికి వెళుతున్నప్పుడు ఈ రోజు బాగా నటించానన్న మంచి అనుభూతి తనకు కలగాలన్నారు. రాత్రులు సుఖ నిద్రకలగాలని చెప్పారు. ప్రస్తుతం తెలుగులో నాగార్జున హీరోగా నటించిన మనం చిత్రంలో ముఖ్య పాత్రను పోషించానన్నారు. హిందీలో జాకీష్రాఫ్ సరసన ఒక చిత్రంలో నటిస్తున్నట్లు శ్రీయ వెల్లడించారు. -
అందాల ఆరబోత చాలు
నేను మాత్రం ఎంతకాలమని అందాలారబోతనే నమ్ముకుంటాను? ఇప్పటి వరకు గ్లామర్ డాల్గా అందాలు ఒలకబోసింది చాలు. ఇకపై చాలెంజింగ్ పాత్రలే నటిస్తాను అంటున్నదెవరో తెలుసా? నాజూకు భామ శ్రీయ. ఈ బ్యూటీలో మంచి నటి ఉన్న విషయాన్ని ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఎందుకనో శ్రీయను ఎక్కువగా గ్లామరస్ హీరోయిన్గానే చూపించడానికి దక్షిణాది దర్శక, నిర్మాతలు ఆసక్తి చూపించారు. కచ్చితమైన కొలతలతో కూడిన ఆమె శారీరక సౌష్టం కూడా ఇందుకు ఒక కారణం కావచ్చు. తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి యువ స్టార్స్ విజయ్, ధనుష్ వరకు టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి నుంచి క్రేజీ స్టార్స్ బాలకృష్ణ, నాగార్జున వరకు జత కట్టిన ఈ ముద్దుగుమ్మ కొందరు తారలను అనుకరించే ప్రయత్నం చేసి విఫలం అయ్యారు. ముఖ్యంగా నటి అనుష్క వేదం చిత్రంలో వేశ్యపాత్ర పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు. శ్రీయా కూడా అదే బాటలో పయనించి పవిత్ర అనే చిత్రంలో వెలయాలి పాత్ర పోషించారు. కానీ ఆ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. అదే విధంగా కన్నడంలో చంద్ర అనే చిత్రంలో పవర్ఫుల్ పాత్రను పోషించారు. ఆ చిత్రం ఆమెకు నిరాశనే మిగిల్చింది. దీంతో పునరాలోచనలో పడిన శ్రీయ ఇకపై రెగ్యులర్ పాత్రలు, ముఖ్యంగా గ్లామర్ పాత్రలు పోషించరాదని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. శ్రీయ వల్ల సాధ్యం కాదని అనుకునే సవాల్తో కూడిన పాత్రలను పోషించి నటిగా తానేమిటో నిరూపించుకుంటానంటున్నారు. ఇందుకోసం చిత్రానికి 50 నుంచి 60 కాల్షీట్స్ కేటాయించి అయినా ఆ పాత్రగా మారడానికి ప్రయత్నిస్తానన్నారు. ఇకపై అలాంటి పాత్రలతో కూడిన చిత్రాలనే అంగీకరిస్తానని చెప్పారు. షూటింగ్ పూర్తి చేసుకుని సాయంత్రం ఇంటికి వెళుతున్నప్పుడు ఈ రోజు బాగా నటించానన్న మంచి అనుభూతి తనకు కలగాలన్నారు. రాత్రులు సుఖ నిద్రకలగాలని చెప్పారు. ప్రస్తుతం తెలుగులో నాగార్జున హీరోగా నటించిన మనం చిత్రంలో ముఖ్య పాత్రను పోషించానన్నారు. హిందీలో జాకీష్రాఫ్ సరసన ఒక చిత్రంలో నటిస్తున్నట్లు శ్రీయ వెల్లడించారు. -
కోచ్చడయాన్ ప్రపంచ సినిమా
కోచ్చడయాన్ను తమిళ చిత్రంగా చూడకండి, ఇది ప్రపంచ సినిమా అంటోంది హీరోయిన్ దీపికా పదుకునే. సూపర్స్టార్ రజనీకాంత్ నటిస్తున్న అత్యంత భారీ చిత్రం కోచ్చడయాన్. ఇందులో రజనీ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. హాలీవుడ్ చిత్రం అవతార్ తరహాలో రూపొందుతున్న కోచ్చడయూన్ తొలి తమిళ 3డీ చిత్రం కావడం విశేషం. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో క్యాప్చరింగ్ టెక్నాలజీతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రజనీకాంత్ రెండవ కూతురు సౌందర్య అశ్విన్ దర్శకురాలు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వ పర్యవేక్షణ నిర్వహించిన ఈ చిత్రంలో హీరోయిన్గా దీపికా పదుకునే నటిస్తోంది. ఆమె ఇటీవల చెన్నైకి వచ్చిన సందర్భంగా కోచ్చడయాన్ గురించి మాట్లాడింది. కోచ్చడయూన్ అంతర్జాతీయ చిత్రంగా పేర్కొంది. తమిళం, ఆంగ్లం, రష్యన్, జపనీస్, చైనీస్ తదితర భాషల్లో తెరపైకి రానున్నట్లు తెలిపింది. తనను తాను తొలిసారిగా యానిమేషన్ సన్నివేశాలలో చూసి ఆశ్చర్యపోయూనని వెల్లడించిం ది. కోచ్చడయూన్లోని విజువల్ సన్నివేశాలు ఇంతవరకు ఏ భారతీయ చిత్రంలోనూ చోటు చేసుకోలేదని పేర్కొంది. రజనీకాంత్ నిజంగానే ఇండియన్ సూపర్స్టార్ అని పొగడ్తల వర్షం కురిపించింది. సౌందర్య అశ్విన్ శ్రమకు కచ్చితంగా హాలీవుడ్ స్థాయిలో పేరు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. కోచ్చడయాన్ విడుదల కోసం రజనీ అభిమానులు మాదిరిగానే తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వివరించింది. కోచ్చడయూన్ నవంబర్ 1న విడుదల కానున్నట్లు సమాచారం.