janmabhumi
-
ఒక్క నిజమైన చెప్పారా?
సాక్షి, విజయవాడ: జన్మభూమి పేరుతో రాష్ట్ర ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తోందని వైఎస్సార్సీపీ నాయకులు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు విమర్శించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ.. అవాస్తవాలు, అసత్యాలతో జన్మభూమి సందేశం ఉందని తెలిపారు. జన్మభూమి కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు తీసుకునే ముందు శ్వేతపత్రం విడుదల చేయాలని తాము డిమాండ్ చేశామన్నారు. వైఎస్సార్ హయాంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెట్టాయన్నారు. వైఎస్ జగన్ తన పాదయాత్రలో టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నారని చెప్పారు. జన్మభూమి కార్యక్రమంతో సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్కు ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. రాష్ట్రంలో చంద్రబాబు చేసినన్ని కుంభకోణాలు ఎవరైనా చేశారా అని నిలదీశారు. భూకబ్జా కేసులో జైలుకు వెళ్లిన దీపక్రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకుని అనంతపురం జన్మభూమిలో నీతులు చెబుతారా అని అడిగారు. టీడీపీ పచ్చ చొక్కాల సంక్షేమం కోసమే జన్మభూమి కార్యక్రమం నిర్వహిస్తున్నారని, ఇది జన్మభూమి కాదు... జాదుభూమి అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు జన్మభూమిలో ఒక్క నిజమైన చెప్పారా? ఆయన చెప్పినవన్నీ నిజాలని కాణిపాకం వినాయకుడిపై ప్రమాణం చేయగలరా అని సవాల్ విసిరారు. ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను భోగి మంటల్లో తగలబెడతారని ఆరోపించారు. ప్రజల సంక్షేమం కాదు, చంద్రబాబు కుటుంబ సంక్షేమం కోసమే ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. -
పించన్లు, రేషన్ కార్డులు.. భారీగా అడుగుతున్నారు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత నాలుగు జన్మభూమి కార్యక్రమాల సందర్భంగా అందిన అన్ని అర్జీలన్నీ పరిష్కరించామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇన్నాళ్లూ అర్హులందరికీ రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్లు, ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజా జన్మభూమి సభల్లో జనం నిలదీతలు, నిరసనలతోపాటు అధికారంలోకి వచ్చి దాదాపు నాలుగేళ్లు కావస్తుండటంతో మాట మార్చారు. తాను స్వయంగా నిర్వహించిన సర్వే ప్రకారం పింఛన్లు, రేషన్ కార్డులు ఇంకా ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోందని జన్మభూమి నిర్వహణ తీరుపై గురువారం కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులుతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గత మూడు రోజులుగా జన్మభూమి కార్యక్రమంలో ప్రజల నుంచి 3,00,570 ఆర్జీలు అందినట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ మీడియాకు తెలిపారు. ఇందులో అత్యధికం ఇళ్లు, రేషన్ కార్డులు, పెన్షన్లకు సంబంధించినవేనని తెలిపారు. సీఎం నిజాలను ఒప్పుకోవటానికి కారణం సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటమేనని రాజకీయ విశ్లేషకులతోపాటు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. -
గృహాల నిర్మాణం త్వరగా చేపట్టండి
పెద్దారవీడు: ఎన్టీఆర్ పథకం ద్వారా మంజూరైన గృహాలను వెంటనే నిర్మంచుకోవాలని మార్కాపురం గృహా నిర్మాణశాఖ ఈఈ కె బసవయ్య పేర్కొన్నారు. మంగళవారం పెద్దోర్నాల, పెద్దారవీడు మండలాల్లో పలు గ్రామాల్లో సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మించుకోని లబ్దిదారుల పేర్లను తొలగించి నిబంధనల ప్రకారం అర్హులైన కొత్త లబ్దిదారులకు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికి పెద్దదోర్నాల మండలంలో 45, పెద్దారవీడు మండలంలో 135 గృహాలు నిర్మాణంలో ఉన్నాయన్నారు. మిగత లబ్దిదారులు వీలైనంత త్వరగా గృహా నిర్మాణాల పనులు చేపట్టాలని సూచించారు. ఎన్టీఆర్ పథకంలో మొత్తం రూ 1.50 లక్షలు, వీటిలో ఉపాధి హామీ పథకం రూ 58 వేలు, ఆ నిధులలో ప్రభుత్వం నుంచి 80 బస్తాలు సిమెంట్ ఇస్తుందని, లభ్ధిదారుని వాటా 18 వేలు లోను కట్టాల్సి ఉంటుందని, మిగత డబ్బులు పూర్తిగా సబ్సిడీ వర్తిస్తుందని, పిఎంజివై పథకంలో రూ 2 లక్షలు వాటిలో ఉపాధి హామీ పథకంలో రూ 61,260 వేలు, ఈ నిధులలో 100 బస్తాలు సిమెంట్ ప్రభుత్వం అందిస్తుందని వివరించారు. బేస్మింట్ లెవెల్, రూప్ లెవెల్, రూఫ్ కాస్టెడ్, కంప్లీట్, మరుగుదొడ్డి దశల వారిగా బిల్లులు మంజూరు చేస్తామని, నిర్మించుకున్న లబ్దిదారులకు వెంటనే బిల్లులు చేస్తున్నమన్నారు. త్వరలో జన్మభూమిలో దరఖాస్తులు పెట్టుకున్న వారికి నియోజకవర్గానికి 2200 గృహాలు మంజూరు కావచ్చన్నారు. ఆయన వెంట పెద్దారవీడు ఏఈ నిరీక్షణబాబు ఉన్నారు. -
‘జన్మభూమి’ పాపం.. కార్యదర్శులకు శాపం
దెందులూరు: తెలుగుదేశం పార్టీ పాలనలో మృతులకు పింఛన్లు ఇస్తున్నారు. దెందులూరు నియోజకవర్గంలోని కొందరు మృతులకు పింఛన్ మంజూరు చేయడంతో పాటు పంపిణీ చేసి ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించారు. రూ.1.79 లక్షలు అవకతవకలు జరిగినట్టు సోషల్ ఆడిట్లో అధికారులు గుర్తించారు. పెదవేగి మండలంలో రూ.1.15 లక్షలు, దెందులూరు మండలంలో రూ.39 వేలు, ఏలూరు మండలంలో రూ.22 వేలు, పెదపాడు మండలంలో రూ.3 వేలు దుర్వినియోగమైనట్టు నిర్దారించారు. గ్రామాల్లో ప్రభుత్వ పథకాలు, పింఛన్లు జన్మభూమి కమిటీలు సిఫార్సు చేసిన వారికే గుడ్డిగా అందిస్తుండటంతో ముగ్గురు కార్యదర్శులు బలయ్యారు. దెందులూరు మండలంలోని దోసపాడు, కేఎన్ పురం, గాలాయిగూడెం గ్రామ కార్యదర్శులు శరత్, ప్రసాద్, అవినాష్ను సస్పెండ్ చేస్తూ జిల్లా పంచాయతీ అధికారి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. పల్లచింతలపూడి గ్రామ కార్యదర్శిపై చర్యలకు పంచాయతీరాజ్ కమిషనర్కు నివేదించారు. పై నాలుగు మండలాల్లో జన్మభూమి కమిటీ సభ్యుల సమక్షంలో నిధులు దుర్వి నియోగం జరిగినా దెందులూరు మండలంలో ముగ్గురిపై మాత్రమే వేటు వేసి ఉన్నతాధికారులు చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. జన్మభూమి కమిటీల ఒత్తిడి మేరకే గ్రామ కార్యదర్శులు మృ తులకు పింఛన్లు మంజూరు చేశారనే విమర్శలూ ఉన్నా యి. ఏలూరు, పెదపాడు, పెదవేగి మండలాల్లో నిధులు దుర్వినియోగానికి కారకులైన గ్రామ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లపై చర్యలకు అధికారులు ఆదేశించినట్టు తెలిసిం ది. దుర్వినియోగమైన మొత్తంలో 90 శాతం నగదును రాబట్టి ట్రెజరీకి జమచేశామని ఎంపీడీఓలు చెబుతున్నారు. ప్రతి పైసా రికవరీ చేస్తాం గ్రామ పంచాయతీల్లో మృతులకు పెన్షన్ సొమ్ము మంజూరు చేసి దుర్వినియోగం చేసిన వ్యవహారంలో ప్రతిపైసా ప్రభుత్వ ఖాతాకు జమయ్యేలా రికవరీ చేస్తాం. బాధ్యులైన ప్రతి ఒక్కరిపై ప్రభుత్వపరంగా త్వరలోనే చర్యలు తీసుకుంటాం. –శ్రీనివాసులు, డీఆర్డీఏ పీడీ, ఏలూరు చర్యలు ప్రారంభించాం దెందులూరు నియోజకవర్గంలో దెందులూరు, పెదపాడు, పెదవేగి, ఏలూరు రూరల్ మండలాల్లో మృతులకు పెన్షన్లు మంజూరు చేసి నిధులు దుర్వినియోగం చేశారని సోషల్ ఆడిట్ అధికారులు ధ్రువీకరించారు. దెందులూరు మండలంలో ఇప్పటికే ముగ్గురు గ్రామ కార్యదర్శులను సస్పెండ్ చేశాం. ఓ కార్యదర్శికి పెనాల్టీ విధించి చర్యల నిమిత్తం పంచాయతీరాజ్ కమిషనర్కు సమాచారం అందించాం. మిగతా మూడు మండలాల్లో నిధుల దుర్వినియోగానికి సంబంధించి బాధ్యులందరిపై చర్యలు తీసుకుంటాం. – సుధాకర్, జిల్లా పంచాయతీ అధికారి -
మోసం తప్పా మేలేమి చేశారు!
- ఆయకట్టు రద్దుపై నోరు మెదపరెందుకు? - ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలా? - మంత్రి సునీతపై తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ధ్వజం ఆత్మకూరు (రాప్తాడు) : అధికారం చేపట్టిన ఈ రెండున్నరేళ్లలో ప్రజలను టీడీపీ ప్రజాప్రతినిధులు మోసగించడమే తప్పా చేసిన మేలేమీ లేదని, ముఖ్యంగా పరిటాల సునీత మంత్రి పదవి చేపట్టినా నియోజకవర్గ ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని రాప్తాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన ఆత్మకూరులో విలేకరులతో మాట్లాడారు. గత మూడు విడతల జన్మభూమి అర్జీలను పరిష్కరించలేని మంత్రి సునీత.. నాల్గో విడత సభల్లో ప్రజలు తనను నిలదీయకుండా ఉండేందుకు విపక్ష నేతలను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. వరుస కరువులతో రైతులు, కూలీలు వలసలు పోతున్నా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. రాప్తాడు నియోజకవర్గంలోని ప్రతి పంచాయతీలోనూ దాదాపు వంద కుటుంబాలు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వలస పోయాయని, ఇది మంత్రి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి.. నియోజకవర్గంలోని 20 వేల మంది యువతకు మొండి చేయి చూపారన్నారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేయగానే వెయ్యి మంది రేషన్డీలర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆదర్శ రైతులు, ఆశ, అంగన్వాడీ వర్కర్లు, హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్లను అన్యాయంగా తొలగించారని వివరించారు. రైతాంగ సమస్యలపై మంత్రికి ఏ మాత్రమూ అవగాహన లేదని, ఈ విషయాన్ని కప్పిపుచ్చుకునేందుకు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని, ఇలాంటి వైఖరి ఉన్న ఆమె ప్రజలకు ఎలా మేలు చేయగలరని ప్రకాష్రెడ్డి ప్రశ్నించారు. ఎకరాకు రూ. 15వేల ఇన్పుట్ సబ్సిడీ, సంపూర్ణ రుణమాఫీ, హంద్రీనీవా ద్వారా 74 వేల ఎకరాలకు నీటినిచ్చేందుకు డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం వంటి రైతుల డిమాండ్లపై మంత్రి ఎక్కడా నోరు మెదపడం లేదన్నారు. ‘హెచ్చెల్సీ నుంచి దాదాపు 15 టీఎంసీల నీరు ప్రతి ఏటా మనకు రాకపోయినా... దాని గురించి మీరు గానీ, మీ ముఖ్యమంత్రి గానీ కర్ణాటక ప్రభుత్వంతో లేదా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించే ప్రయత్నం చేయలేదు. ఈ 15 టీఎంసీల నీటిని అప్పర్‡భద్ర కాలువ ద్వారా హంద్రీనీవా ఎగువన ఉన్న బీటీపీకి, పేరూరు డ్యాంకు, కళ్యాణదుర్గం, మడకశిర, హిందూపురం, కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లోని చెరువులకు చేర్చే అవకాశం ఉన్నప్పటికీ మీరెందుకు ప్రయత్నం చేయరు’ అని మంత్రిని ప్రశ్నించారు. జీఓ నంబర్ 22 ద్వారా డిస్ట్రిబ్యూటరీలను రద్దు చేసినా, కుప్పంకు నీటిని తరలించడానికి రాప్తాడు ప్రాంత ఆయకట్టును ఫణంగా పెట్టినా మంత్రి నోరుమెదపడం లేదని దుయ్యబట్టారు. 40 టీఎంసీలకు హంద్రీ- నీవా సామర్థ్యం పెంచి నీటిని కుప్పంకు తీసుకెళ్తే అర్థం ఉంది కానీ.. నియోజకవర్గంలోని డిస్ట్రిబ్యూటరీలను రద్దు చేసి, తద్వారా మిగులు నీటిని తరలించడం ఎంత వరకు సమంజసమని నిలదీశారు. -
‘జన్మభూమి’తో ప్రజలకు ఒరిగిందేమి లేదు
గుంతకల్లు : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమంతో పేదలకు ఒరిగిందేమి లేదని, ఊకదంపుడు ఉపన్యాస్యాలు తప్ప సమస్యల పరిష్కారం శూన్యమని ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డేరంగుల ఉదయ్కిరణ్ విమర్శించారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా బీసీలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. టీడీపీకి బీసీలు వెన్నెమొక అని చంద్రబాబునాయుడు చెప్పడం హాస్యాస్పదమన్నారు. వడ్డెర, వాల్మీకి, రజక, బెస్త, మేదర తదితర కులాలను ఎస్టీల్లో చేరుస్తానని, రూ.10 వేల కోట్ల సబ్ప్లాన్ నిధులు విడుదల చేస్తామని ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చనపుడు బీసీలకు ఎలా న్యాయం చేస్తారని విశ్వసించాలని ఆయన ప్రశ్నించారు. -
జన్మభూమి అర్జీలు 1,15,482
అనంతపురం అర్బన్ : జిల్లాలో జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు జరిగిన నాల్గోవిడత జన్మభూమి–మాఊరు కార్యక్రమంలో ప్రజల నుంచి 1,15,482 వినతులు వచ్చాయని జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం గురువారం పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా 1,003 పంచాయతీలు, 373 మున్సిపల్ వార్డులు మొత్తం 1,376 చోట్ల జన్మభూమి సభలు జరిగాయని తెలిపారు. రూరల్ పరిధిలో 71, అర్బన్ పరిధిలో 24 జన్మభూమి బృందాలు పని చేశాయని వివరించారు. సంక్రాంతి కానుకలు 10,27,800 మందికి, కొత్త రేషన్ కార్డులు 72,531 మందికి పంపిణీ చేసినట్టు వివరించారు. ప్రజల నుంచి వచ్చిన 1,15,482 వినతుల్లో 79,969 ప్రధానంగా ఉన్నాయని తెలిపారు. శాఖల వారీగా వచ్చిన వినతులు శాఖ వినతులు రూరల్ డెవలప్మెంట్ 179 రెవెన్యూ 11,166 పౌర సరఫరాలు 15,020 గృహ నిర్మాణ సంస్థ 28,477 మున్సిపల్ శాఖ 5,410 మున్సిపల్ ఆర్డీ 259 సెర్ఫ్ (పేదరిక నిర్మూలన) 15,906 ఉపాధి హామీ 435 ఆర్డబ్ల్యూఎస్ 442 పంచాయతీరాజ్ 1,088 విద్యుత్ 223 వ్యవసాయం 364 మొత్తం 978969 -
1.15 లక్షల వినతులు
- ముగిసిన జన్మభూమి - సమస్యలపై నిరసనలు, నిలదీతలు - పార్టీ కార్యక్రమంలా మార్చిన టీడీపీ నాయకులు అనంతపురం అర్బన్ : జిల్లాలో ఈ నెల రెండో తేదీ నుంచి చేపట్టిన జన్మభూమి–మా ఊరు కార్యక్రమం బుధవారం ముగిసింది. రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్ల స్థలాలు తదితర సమస్యలపై ప్రజల నుంచి 1.15 లక్షల వినతులు అధికారులకు అందాయి. జన్మభూమి ప్రారంభం నుంచి సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ నాయకులు, ప్రజలు గ్రామసభల్లో నిరసనలు తెలిపారు. ప్రజాప్రతినిధులను, అధికారులను ప్రజలు నిలదీశారు. ప్రభుత్వం అధికారికంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు, కార్యకర్తలు తమ పార్టీ వేదికలుగా మార్చారు. సమస్యలపై ప్రశ్నించిన ప్రజలపై, ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలపై దౌర్జన్యాలకు పాల్పడ్డారు. కొన్ని చోట్ల సభల నుంచి పోలీసులతో నెట్టించారు. అరెస్టు కూడా చేయించారు. సభల్లో ప్రజా సమస్యలపై ప్రజాప్రతినిధులు మాట్లాడిన సందర్భాలు లేవు. ప్రభుత్వ పథకాలను పొగడడంతోనే సరిపెట్టారు. పలు చోట్ల అధికారులు ప్రొటోకాల్ పాటించలేదు. విపక్ష పార్టీ మద్దతుదారులుగా కొనసాగుతున్న సర్పంచ్లు, వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ సభ్యులకు ప్రాధాన్యత ఇవ్వలేదు. + దళిత వర్గానికి చెందిన తనను అగౌరవ పరుస్తున్నారంటూ ఈ నెల 2వ తేదీన కంబదూరు మండలం నూతిమడగు జన్మభూమి సభలో సర్పంచ్ నరసింహులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి సిద్ధపడ్డారు. + అనంతపురం నగరంలోని 33వ డివిజన్లో ఈ నెల 2న జన్మభూమి సభను ముగించుకుని కారులో వెళుతున్న కమిషనర్ను పింఛన్ కోసం మానసిక వికలాంగుడు ప్రకాశ్ గౌడ్ అడ్డుకున్నాడు. ఆ వెనుక వాహనంలో వచ్చిన టీడీపీ కార్పొరేటర్లు అతనిపై చేయిచేసుకున్నారు. + పేదల సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారంటూ ప్రశ్నించడంతో ఈ నెల 3న పెనుకొండ మండలం దుద్దేబండలో జరిగిన సభలో వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఉరవకొండ సభలో జెడ్పీటీసీ సభ్యురాలు లలితమ్మ, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి బసవరాజు తదితరులు కోరగా.. వీరిపైకి పోలీసులను ఉసిగొల్పారు. + ఈ నెల 4న శెట్టూరు మండలం కైరేవులో నిర్వహించిన సభలో ప్రారంభంలోనే ప్రజా సమస్యలపై వైఎస్సార్సీపీ సర్పంచు జయమ్మఽ తదితరులు నిలదీశారు. గ్రామంలో చేపట్టే అభివృద్ధి పనులపై సర్పంచుకు కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదంటూ టీడీపీ నాయకులతో వాగ్వాదానికి దిగారు. + ఈ నెల 5న తాడిపత్రి మండలం క్రిష్ణాపురం గ్రామంలో జరిగిన జన్మభూమి కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్రెడ్డి, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు, రేషన్ కార్డులు ఎందుకివ్వడం లేదంటూ అధికారులను నిలదీశారు. శెట్టూరు మండలం లక్ష్మంపల్లిలో జరిగిన జన్మభూమిలో ప్రజా సమస్యలపై సీపీఐ, వైఎస్సార్సీపీ నాయకులు నిలదీశారు. వారిపై ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి సమక్షంలో టీడీపీ నాయకులు దురుసుగా ప్రవర్తించారు. సమస్యలను పరిష్కరించాలంటూ ఆ గ్రామ సర్పంచు లక్ష్మి, సింగిల్విండో అధ్యక్షుడు శివన్న సభా వేదిక ముందు నేలపైనే కూర్చుని నిరసన తెలిపారు. -
జన్మభూమి ఉద్రిక్తం
- ధ్వజమెత్తిన జాజరకల్లు - జన్మభూమి రద్దు - ‘అనంత’లో ఎమ్మెల్యే నిలదీత - పి.కొత్తపల్లిలో గ్రామసభ బహిష్కరణ - వజ్రకరూరులో అధికారులకు హితవు పలికిన ఎమ్మెల్యే విశ్వ - గుంతకల్లులో వికలాంగులు, వితంతువుల మండిపాటు అనంతపురం సిటీ : జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం నిర్వహించిన జన్మభూమి గ్రామసభలు ఒకింత ఉద్రిక్త వాతావరణంలో సాగాయి. ప్రజా సమస్యలపై స్పందించడం లేదంటూ ప్రజలు ప్రజాప్రతినిధులను, అధికారులను నిలదీశారు. చాలాచోట్ల వారు సమాధానం చెప్పలేక నీళ్లు నమలాల్సి వచ్చింది. - కాలుష్యంతో గ్రామాలకు గ్రామాలు రోగాలతో పడకేశాయని, అధికారులు తమ సమస్యలను పట్టించుకోవడం లేదని డి.హీరేహాళ్ మండల పరిధిలోని జాజరకల్లు గ్రామం మొత్తం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. మీ నిర్లక్ష్యం కారణంగా ముక్కుపచ్చలారని చిన్నారులు. వృద్ధులు అనారోగ్యాలకు గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని గ్రామస్తులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే గ్రామంలో 10 మంది దాకా చిన్నారులు కాలుష్యం కారణంగా జబ్బున పడ్డారని, అధికారులు మామూళ్లకు తలొగ్గి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆవేదన చెందారు. కాలుష్యం కోరల్లోంచి తమను, పొలాలను కాపాడతామని భరోసా ఇచ్చేంతవరకు ఇక్కడి నుంచి కదలనివ్వబోమని భీస్మించుకు కూర్చున్నారు. అయినా స్పందన రాకపోవడంతో సహనం కోల్పోయిన గ్రామస్తులు తహశీల్దార్ మారుతిని నిర్బంధించారు. ప్రజలకు సమాధానం చెప్పలేని అధికారులు జన్మభూమిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. - పింఛన్లు, ఇళ్ల కోసం ఎన్నిమార్లు అర్జీలు ఇచ్చినా పట్టించుకోలేదంటూ అనంతపురం నాల్గో డివిజన్వాసులు ఎమ్మెల్యే ప్రభాకరచౌదరిని అడ్డుకున్నారు. నేతల నిర్లక్ష్యం కారణంగా సంక్షేమ పథకాలు తమకు అందకుండా పోతున్నాయని ఆగ్రహించారు. ఎమ్మెల్యే సర్ధిచెప్పే యత్నం చేసినా స్పష్టమైన హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. - ఎన్పీ కుంట మండల పరిధిలోని పి.కొత్తపల్లిలో ప్రభుత్వం నిర్వహించిన జన్మభూమి ఆద్యంతం రసాబాసగా సాగింది. సోలార్ బాధితులకు పరిహారం అందించాలని అధికార పక్షంతోపాటు ప్రతిపక్షం, కమ్యూనిస్టు పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. అధికారుల నుంచి సమాదానం రాకపోవడంతో వారు జన్మభూమిని బహిష్కరించారు. అధికారుల తీరును నిరసిస్తూ బైఠాయించారు. - మండల కేంద్రమైన వజ్రకరూరులోని స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అధికారులను నిలదీశారు. ప్రజల సమస్యలను పక్కన పెట్టి నేతల చుట్టూ తిరిగే వైఖరిని విడనాడాలని హితవు పలికారు. ప్రజలు అడిగే ప్రశ్నలకు సావధానంగా సమాధానం చెప్పాలని హౌసింగ్ ఏఈ షౌకత్అలీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. - గతంలోనూ పింఛన్ల కోసం అనేకసార్లు అర్జీలు ఇచ్చామని, ఇంకెన్నిసార్లు ఇవ్వాలని గుత్తి 22వ వార్డు(చెర్లోపల్లి)లో వికలాంగులు, వితంతువులు అధికారులను నిలదీశారు. అర్జీలతోనే సరిపెడతారా అంటూ మండిపడ్డారు. -
ఫలితం లేని ‘జన్మభూమి’ ఎందుకు?
– ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి వజ్రకరూరు : ప్రజాసమస్యలు పరిష్కారం కానప్పుడు ‘జన్మభూమి’ కార్యక్రమం ఎందుకని ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శనివారం మండలంలోని కమలపాడులో సర్పంచు యోగానంద అధ్యక్షతన ‘జన్మభూమి – మాఊరు’ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మూడు విడతల్లో నిర్వహించిన జన్మభూమి సభల్లో ప్రజలు ఇచ్చిన వినతులే పరిష్కారానికి నోచుకోలేదు..తిరిగి నాల్గో విడతకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ప్రభుత్వం అధికారం చేపట్టి రెండున్నరేళ్లవుతున్నా ఒక్క ఇల్లూ నిర్మించలేదని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో 48 లక్షల ఇళ్లు మంజూరు చేసి, నిర్మించినట్లు తెలిపారు. ప్రజలు కరువుకాటకాలతో అల్లాడుతుంటే ముఖ్యమంత్రి ‘అంతా డిజిటల్ మయం’ అంటూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నాడన్నారు. గ్రామాల్లో ప్రజలు అనేక సమస్యలతో అల్లాడుతున్నారన్నారు. పెద్ద నోట్ల రద్దుతో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక ఇక్కట్లు పడుతున్నారన్నారు. రైతులకు వెంటనే ఇన్పుట్ సబ్సిడీ, వాతావరణ బీమా అందించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి జన్మభూమి -మాఊరు సభల్లో పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. జన్మభూమి సభల్లో దరఖాస్తు చేసుకున్న ప్రజలందరికీ పింఛన్లు, రేషన్కార్డులు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సర్పంచు యోగానంద, ఎంపీపీ కొర్రా వెంకటమ్మ, వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకులు కమలపాడు వెంకటరెడ్డి, మన్యంప్రకాష్, నారాయణరెడ్డి, మండలనా యకులు శివరామిరెడ్డి, ఉస్మాన్, రాజగో పాల్, కూర్మన్న, మాబుపీరా, సుంకన్న, రామాంజనేయులు , మనోహర్, పీరా, పూజారి సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
దాడులు..దౌర్జన్యాలు
– జన్మభూమిలో అధికార పార్టీ శ్రేణుల ఆగడాలు - సమస్యలపై నిలదీస్తే భౌతికదాడులు – వంతపాడుతున్న అధికారులు, పోలీసులు –రెండోరోజూ నిరసనల హోరు అనంతపురం అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమం అధికార పార్టీ శ్రేణుల ఆగడాలకు వేదికగా మారింది. ప్రజలు సమస్యలను ప్రస్తావిస్తే టీడీపీ నేతలు, కార్యకర్తలు భౌతికదాడులకు దిగుతున్నారు. అధికారులు, పోలీసుల ముందే రెచ్చిపోతున్నారు. దీంతో సమస్యలపై అర్జీలివ్వడానికి సైతం ప్రజలు జంకుతున్నారు.మంగళవారం జన్మభూమి రెండోరోజు కార్యక్రమం జిల్లావ్యాప్తంగా నిరననలు, నిలదీతలు, అరెస్టుల మధ్య సాగింది. పెనుకొండ మండలం దుద్దేబండలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. పేదల సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేయడం సరికాదని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ మండల కన్వీనర్, దుద్దేబండ సర్పంచ్ శ్రీకాంత్రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు రామ్మోహన్రెడ్డి, ఇతర నాయకులపై టీడీపీ కార్యకర్తలు దాడికి సిద్ధపడ్డారు. ఇంతలో ప్రజలు ప్రతిఘటించడంతో వెనక్కి తగ్గారు. సభలో ప్రసంగిస్తున్న ఎంపీటీసీ రామ్మోహన్రెడ్డి చేతిలోని మైకుని లాక్కుని బయటకు పంపించాలంటూ గొల్లపల్లికి చెందిన టీడీపీ నాయకుడు రాజు దురుసుగా మాట్లాడారు. దీంతో ఆగ్రహించిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు గ్రామానికి సంబంధం లేదని వ్యక్తులను సమావేశం నుంచి బయటకు పంపాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో టీడీపి నాయకుడు రాజుతో పాటు ఎంపీపీ భర్త కేశవయ్య తదితరులు వాగ్వాదానికి దిగారు. అంతే కాకుండా ఎస్ఐ లింగన్నపై ఒత్తిడి చేసి సర్పంచ్ శ్రీకాంతరెడ్డి, ఎంపీటీసీ రామ్మోహన్రెడ్డితో పాటు వైఎస్సార్సీపీకి చెందిన వీరనారాయణరెడ్డి అనే నాయకుణ్ని బలవంతంగా స్టేషన్కు తరలించారు. స్టేషన్వద్ద వారిని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ పరామర్శించారు. అధికార పార్టీ దౌర్జన్యాలను ఖండించారు. అలాగే ఉరవకొండలోని ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన సభలో అధికారులను వైఎస్సార్సీపీ నాయకులు నిలదీశారు. నాల్గవ విడత జన్మభూమి నిర్వహిస్తున్నా పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వరా అంటూ జెడ్పీటీసీ సభ్యురాలు లలితమ్మ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బసవరాజు, పట్టణ కన్వీనర్ తిమ్మప్ప, జిల్లా కమిటీ సభ్యుడు నిరంజన్గౌడ్, ఎంపీటీసీ చందా చంద్రమ్మ ప్రశ్నించారు. ఇళ్ల పట్టాల పంపిణీపై అధికార పార్టీ నేతలు సమాధానం చెప్పలేక పోలీసులను ఉసిగొలిపి బలవంతంగా అరెస్టు చేయించారు. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ జన్మభూమి సభల్లో నిరసనలు, నిలదీతలు వెల్లువెత్తాయి. పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు, రెయిన్గన్ల పంపిణీలో వివక్షతపై శెట్టూరులో ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరిని టీడీపీ కార్యకర్తలు, సర్పంచు, ప్రజలు నిలదీశారు. అర్హులకు పింఛన్లు ఎందుకు ఇవ్వడం లేదంటూ కణేకల్లు మండలం జక్కలవడికి జన్మభూమి సభలో అధికారులను స్థానికులు ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్లు, మరుగుదొడ్లు మంజూరు చేయాలని డి.హీరేహాళ్ మండలం మల్లికేతి గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. పలుమార్లు అర్జీలిచ్చినా రుణమాఫీ కాలేదని బొమ్మనహాళ్ మండలం సిద్దారాంపురం గ్రామంలో అధికారులను రైతులు నిలదీశారు. శింగనమల మండలం పెరవలి గ్రామంలో రేషన్ కార్డులు తొలగించారంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కంబదూరు మండలం రాళ్లఅనంతపురంలో ఇంటి బిల్లులు, పింఛన్లు ఇవ్వలేదని వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజలు నిలదీయడంతో గందరగోళం ఏర్పడింది. -
జిల్లాకు 28వేల కొత్త పింఛన్లు
కర్నూలు(హాస్పిటల్): ఎన్టీఆర్ భరోసా పథకం కింద జిల్లాకు 28వేల పింఛన్లు మంజూరయ్యాయి. వీటిని ఫిబ్రవరి నుంచి లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 3,07,143 మందికి పింఛన్లు ఇస్తున్నారు. ఇందులో వృద్ధాప్య 1,21,192, వితంతు 1,24,773, వికలాంగులు 39,548, చేనేత 3,519, కల్లుగీత 159, అభయహస్తం 17,902 మందికి ఇస్తున్నారు. వీరు కాకుండా గతంలో జన్మభూమి సభల్లో అందజేసిన 37,720 మంది దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో నియోజకవర్గానికి 2వేల చొప్పున మొత్తం 28వేల పింఛన్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. లబ్ధిదారుల జాబితాను ఆయా మండలాల ఎంపీడీఓలు తయారు చేస్తున్నారు. ఎంపిక చేసిన వారి జాబితాను వచ్చే నెల రెండో తేదీ నుంచి ప్రారంభమయ్యే జన్మభూమి గ్రామసభ/వార్డు సభల్లో ప్రకటించే అవకాశం ఉంది. కొత్త పింఛన్లను లబ్ధిదారులకు ఫిబ్రవరి నుంచి పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. -
సర్పంచ్ల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం
సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు కాటూరి గుంటూరు రూరల్ : గ్రామ సభలు జన్మభూమి కమిటీల ఆధ్వర్యంలో జరుగుతున్నాయని, ఇక మీదట అలా జరిగితే జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ సర్పంచ్లందరూ మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు సిద్ధమని సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు కాటూరి శ్రీనివాసరావు హెచ్చరించారు. నగరంలోని సీతానగర్ రెండో లైనులోని సర్పంచ్ల సంఘం జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఉన్న జన్మభూమి కమిటీలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, గ్రామ సర్పంచ్ అంటే గ్రామానికి ప్రథమ పౌరుడనే ప్రజాస్వామ్య హక్కును కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. గ్రామ సభల్లో సర్పంచ్లకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.. గ్రామ స్థాయిలో జరిగే ప్రతి కార్యక్రమం గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలోనే ఉండాలని డిమాండ్ చేశారు. గ్రామ సభలు, సమావేశాల్లో సర్పంచ్లకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, 14వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంలో సర్పంచ్లకు సర్వహక్కులు ఇవ్వాలని కోరారు. సీఆర్డీఏ పరిధిలో ఉన్న గ్రామాల్లో ఇళ్ల ప్లానులు, ఇతర ప్లానులు తదితర రెవెన్యూ అధికారాలు సర్పంచ్లకు కేటాయించాలని కోరారు. విద్యుత్ బిల్లులు, ఆర్థిక సంఘాల నిధుల వినియోగానికి ఈవోపీఆర్డీల కౌంటర్ సంతకాలను వెంటనే ఎత్తివేయాలన్నారు. సర్పంచ్ల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ కార్యదర్శి జాస్థి వీరాంజనేయులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యం కల్పించిన సర్పంచ్ల హక్కులను ప్రభుత్వాలు కాలరాయటం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తంచేశారు. 14వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం సక్రమంగా అమలు జరిగేందుకు సహకరించాలని కోరారు. అనంతరం తమ సమస్యపై కలెక్టర్ కాంతిలాల్దండేకు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి గౌస్ సంధాని, గౌరవాధ్యక్షుడు కళ్ల పానకాలరెడ్డి, ఎస్సీ సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు మన్నెం సుజాతకిషోర్, ప్రధాన కార్యదరిశ జగన్, నరసరావుపేట సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు చల్లా నారపరెడ్డి, జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు గోగినేని వసుధ, చల్లావారిపాలెం సర్పంచ్ ఉగ్గం వెంకటేశ్వరరావు, ఓబులునాయుడు పాలెం సర్పంచ్ జి శివపార్వతి సుబ్బారావు, జిల్లా వ్యాప్తంగా సర్పంచ్లు పాల్గొన్నారు. -
దుష్ట సంప్రదాయం.. నీచ రాజకీయం
- జన్మభూమి వేదికలపై టీడీపీ జెండాలు, ఓడిన అధికారపార్టీ నేతలు - 'రంజాన్ తోఫా' అక్రమాల కాంట్రాక్టర్ కే సంక్రాంతి కానుక కాంట్రాక్ట్ మతలబేమిటి? - అధికార టీడీపీ తీరుపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి ఫైర్ పట్నంబజారు(గుంటూరు): ప్రభుత్వం తలపెట్టిన జన్మభూమి కార్యక్రమం.. టీడీపీ నేతల పాలిట పునరావాసంగా మారిందని, ఎన్నికల్లో ఓడిపోయిన ఆ పార్టీ నేతలే జన్మభూమి వేదికలను ఆక్రమిస్తున్నారని, అధికారిక కార్యక్రమాల్లో పార్టీ జెండాలు పెట్టి దుష్టసంప్రదాయానికి తెరలేపారని అధికార తెలుగుదేశం తీరుపై మండిపడ్డారు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారరెడ్డి వెంకటేశ్వర్లు. జన్మభూమి కార్యక్రమంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను అసలు పరిగణనలోకే తీసుకోకుండా చంద్రబాబు సర్కార్ నీచ రాజకీయాలకు ఒడిగట్టుతున్నదని ఆరోపించారు. శుక్రవారం గుంటూరు నగరంలోని అరంగల్ పేటలోగల వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఉమ్మారెడ్డి.. జన్మభూమి, సంక్రాతి కానుకల విషయంలో ప్రభుత్వం తీరును ఎండగట్టారు. 'అధికార తెలుగుదేశం పార్టీ దుష్ట సంప్రదాయాలకు, నీచ రాజకీయాలకు పాల్పడుతోంది. ఓడిపోయిన అధికార పార్టీ నేతలు జన్మభూమి-మన ఊరు కార్యక్రమాల్లో వేదికలపై ఆశీనులవుతున్నారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలకు విలువ ఇవ్వకుండా రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో టీడీపీ జెండాలు పెట్టడం దుష్టసంప్రదాయం' అని ఉమ్మారెడ్డి అన్నారు. గత రెండు విడతల జన్మభూముల్లో 33 లక్షల దరఖాస్తులు రాగా, వాటిలో 5 లక్షల సమస్యలను పరిష్కరించామని ప్రభుత్వం పేర్కొనగా, అధికారులు మాత్రం అందుకు విరుద్ధంగా 99శాతం సమస్యలను పరిష్కరించామని చెబుతుండటాన్ని బట్టే ఈ కార్యక్రమంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నదీ లేనిదీ అర్థమవుతున్నదని, అందుకే జన్మభూమి కార్యక్రమాల్లో ఎక్కడికక్కడ ప్రజలు.. మంత్రులు, అధికాలను నిలదీస్తున్నారని పేర్కొన్నారు. ఆర్భాటాలకు నిధులెక్కడివి? నిధుల కొరత కారణంగా కొన్ని పనులు చేయలేకపోతున్నామంటున్న సీఎం చంద్రబాబుకు నివాస ఏర్పాట్లు, ప్రత్యేక విమానాలు, విందు వినోదాలకు మాత్రం నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ఉమ్మారెడ్డి ప్రశ్నించారు. చంద్రన్న కానుక కోసం రూ.360 కోట్లు కేటాయిస్తే, దానిలో రూ.180 కోట్లు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల ఫొటోలు ముద్రించేందుకే ఖర్చయ్యాయన్నారు. 'రంజాన్ తోఫా' లో అక్రమాలకు పాల్పడిన కాంట్రాక్టర్ కే సంక్రాంతి సరుకుల కాంట్రాక్టును అప్పగించడంలో మతలు ఏమిటో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణం పేరుతో ఆఖరికి విద్యార్థులను కూడా వదలిపెట్టడం లేదని, గతంలో సేకరించిన విరాళాలు దుర్వినియోగం అయ్యాయని ఆరోపించారు. ఇస్టానుసారంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు సర్కార్ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. -
‘జన్మభూమి’ని అడ్డుకున్న గ్రామస్థులు
చింతలపుడి: ప్రభుత్వం ప్రజా సంక్షేమం పట్టించుకోకుండా.. అనవసరపు ఆర్భాటాలకు పోతుందని ఆగ్రహించిన గ్రామస్థులు జన్మభూమి కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపుడిలో గురువారం నిర్వహించనున్న జన్మభూమి- మా భూమి కార్యక్రమాలకు హజరైన అధికారులకు గ్రామస్థుల నుంచి అనూహ్య స్పందన ఎదురైంది. గ్రామానికి వచ్చే రహదారి సరిగ్గా లేదని గత కొంత కాలంగా మొర పెట్టుకుంటున్నా పట్టించుకోని అధికారులకు తమ గ్రామంలోకి వచ్చే అధికారం లేదని వారిని గ్రామ శివారులోనే అడ్డుకున్నారు. అనంతరం రహదారి లేకపోవడంతో.. గర్భిణులు ఆస్పత్రులకు వెళ్లాలన్నా.. విద్యార్థులు కళాశాలలకు వెళ్లాలన్నా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందు రహదారి నిర్మించిన ఆ తర్వాతనే జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులకు తెలిపారు. దీంతో అధికారులు ప్రజాప్రతినిధులు అక్కడి నుంచి తిరుగు ముఖం పట్టారు. -
పింఛన్లు ఇవ్వడం లేదంటూ సీఎం సభలో నిరసన
తిరుపతి కార్పొరేషన్ : అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేయడం లేదని తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్న జన్మభూమి గ్రామసభలో పలువురు వృద్ధులు, వికలాంగులు నిరసన వ్యక్తం చేశారు. తిరుపతిలో గురువారం నిర్వహించిన జన్మభూమి సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్న సమయంలో పలువురు మీడియా గ్యాలరీ వరకు వచ్చారు. అర్హత ఉన్నా తమకు రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదంటూ నిరసన వ్యక్తం చేశారు. అదే విధంగా రేషన్ కార్డులు కావాలని కొందరు, ఇళ్లస్థలాలు మంజూరు చేయాలని మరికొందరు నిరసన తెలిపారు. వామపక్ష, కాంగ్రెస్ పార్టీ నేతల అరెస్టు తిరుపతిలో ముఖ్యమంత్రి పాల్గొనాల్సిన జన్మభూమి కార్యక్రమాన్ని అడ్డుకుంటారని భావించి కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేశారు. సమస్యలు తెలియజేసేందుకు సీపీఎం, సీపీఐ నాయకులు వేర్వేరుగా ర్యాలీ చేపట్టి సీఎం పాల్గొన్నసభకు బయలుదేరారు. వారిని మార్గం మధ్యలోనే పోలీసులు అరెస్టు చేశారు. అదేవిధంగా తిరుపతిలో హైకోర్టు ఏర్పాటుచేయాలని మూడు రోజులు కాంగ్రెస్ నాయకులు సంతకాలను సేకరించారు. ఈ నేపథ్యంలో వారు సీఎం సభను అడ్డుకుంటారని భావించి పీసీసీ కార్యదర్శి రుద్రరాజు శ్రీదేవిని ఉదయమే అరెస్టు చేసి చంద్రబాబు పర్యటన ముగిసిన తర్వాత విడుదల చేశారు. -
కొమ్మువలసలో జన్మభూమి బహిష్కరణ
ఎల్ఎన్పేట: శ్రీకాకుళం జిల్లా ఎల్ఎన్పేట మండలం కొమ్మువలస గ్రామస్తులు జన్మభూమి కార్యక్రమాన్ని బహిష్కరించారు. గురువారం గ్రామంలో జర్మభూమి కార్యక్రమం జరిగింది. అయితే అర్హులకు గాకుండా అనర్హులకు, టీడీపీ సానుభూతి పరులకే సంక్షేమ పథకాలు అందిస్తుండటంతో గ్రామస్తులంతా కలిసి కార్యక్రమాన్ని బహిష్కరించారు. ప్రభుత్వం నిర్వహిస్తోన్న జన్మభూమి కార్యక్రమం వట్టి మోసపూరిత కార్యక్రమమని గ్రామస్తులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. గ్రామస్తులకు, జన్మభూమి కమిటీ సభ్యులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. -
రెండు నిమిషాలకే జన్మభూమి వాయిదా..
రొంపిచర్ల: జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్న ఎమ్మెల్యేకు స్వాగతం పలుకుతూ గ్రామస్తులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అధికారికి ఆగ్రహం తెప్పించింది. దీంతో రెండు నిమిషాలకే జన్మభూమి కార్యక్రమాన్ని వాయిదా వేశారు. గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం విపర్లరెడ్డి పాలెం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జన్మభూమి కార్యక్రమం సందర్భంగా గ్రామస్తులు తమ ఎమ్మెల్యేకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై ఎండీవో మండిపడ్డాడు. ఫ్లెక్సీని తొలగిస్తేనే జన్మభూమి కార్యక్రమం జరుపుతానని తేల్చి చేప్పాడు. కాగా, ఎండీవో తీరుపై ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమానం కొద్ది గ్రామస్తులు ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తే.. దాని గురించి ప్రజాసమస్యలను పరిష్కరించే కార్యక్రమాన్ని ఆపడమేంటని ప్రశ్నించారు. దీంతో జన్మభూమి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎండీవో తిరిగి రెండు నిమిషాలకే వాయిదా వేశారు. -
కర్మకొద్దీ బాబును గెలిపించారు: డీఎల్
అర్హులు ప్రభుత్వ పథకాలు పొందాలంటే జన్మభూమి కమిటీ సభ్యుల కాళ్లు పట్టుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని.. ఈ పరిస్థితి చూస్తుంటే కర్మపట్టి ప్రజలు చంద్రబాబును గెలిపించారనిపిస్తోందని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన స్వగ్రామం వైఎస్సాఆర్ జిల్లా ఖాజీపేటలోని జెడ్పీ హైస్కూల్లో మంగళవారం నిర్వహించిన జన్మభూమి - మాఊరు గ్రామసభకు ఆయన హాజరయ్యారు. అధికారులు వేదికపైకి ఆహ్వానించినా.. ఆయన ప్రజల మధ్య కూర్చొని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బడ్జెట్లో నిధులే కేటాయించనప్పుడు కొత్త ఇళ్లు ఎలా ఇస్తారని, పంట నష్టపరిహారం మాటేమిటని నిలదీశారు. జన్మభూమి కమిటీ సభ్యులు చెప్పిన వారికి మాత్రమే ఇళ్లు కేటాయిస్తే, అర్హులైన మిగతా వారి సంగతేంటని ప్రశ్నించారు. కమిటీ సభ్యుల కాళ్లు పట్టుకుని బతిమాలుకోవాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ అందుబాటులో ఉన్నప్పటికీ వ్యవసాయానికి రెండు విడతలుగా కాకుండా ఒకే విడత 7 గంటలు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. -
ఫ్లెక్సీతో షాకిచ్చిన టీడీపీ నేత
తాళ్లరేవు : తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు మండలం ఇంజరంలో సోమవారం ‘జన్మభూమి-మా ఊరు’ సందర్భంగా ‘సమస్యలను పరిష్కరించండి’ అంటూ టీడీపీకి చెందిన ఎమ్మెల్యేని, అధికారులను కోరుతూ అధికార పార్టీ నాయకుడే ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కొరుపల్లి సత్యనారాయణమూర్తి (చిన్నబ్బాయి) ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలో ఇంజరం హైస్కూల్కు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కోరారు. నిధుల్లేక నిలిచిపోయిన అదనపు తరగతి గదులు, స్కూలుకు వచ్చే రహదారి అధ్వానస్థితిని చూపే ఫొటోలను ముద్రించారు. -
పోరు భూమి
నేటి నుంచి మూడో విడత జన్మభూమి సమస్యలు, హామీలపై నిలదీతకు ప్రజలు, విపక్షాల సన్నద్ధం పింఛన్లు, ఇళ్లు, కమిటీల పెత్తనం, రుణ మాఫీ తదితర సమస్యలపై ప్రశ్నించే అవకాశం విశాఖపట్నం : ‘జన్మభూమి మావూరు’ శుక్రవారం నుంచి మళ్లీ మొదలవుతోంది. తొలి రెండు విడతలు మొక్కుబడి తంతు గానే సాగగా.. ఈసారి మాత్రం తమపై వత్తిడి ఉం టుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. హుద్హుద్ ప్రభావంతో తొలివిడత, స్థానిక సంస్థల ఎన్నికల ప్రభావంతో మలివిడత మొక్కుబడిగా సాగగా.. మూడో విడత మాత్రం ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటనలు.. విపక్షాల నుంచి నిరసనలు వెల్లువెత్తే అవకాశాలు కన్పిస్తున్నాయి. అర్జీల చిట్టా కాకిలెక్కలే! టీడీపీ సర్కారు గద్దనెక్కిన తర్వాత 2014 అక్టోబర్లో తొలి జన్మభూమి తలపెట్టారు. హుద్హుద్ దెబ్బకు ఈ కార్యక్రమానికి ఆదిలోనే బ్రేకులుపడ్డాయి. ఆ తర్వాత నవంబర్లో కొనసాగించగా, తుపాను ప్రభావంతో అర్జీలు వెల్లువెత్తాయి. ఏకంగా 3.54 లక్షల అర్జీలు రాగా, వాటిలో అర్హమైనవంటూ లక్షా 92 వేల 202 అర్జీలను మాత్రమే అప్లోడ్ చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీతో 2015 జూన్లో మొక్కుబడిగా జరిగిన రెండోవిడత జన్మభూమిలో 20 వేల అర్జీలు మాత్రమే వచ్చాయి. రెండు విడతల్లో 3.74లక్షల అర్జీలు రాగా, 2.02,390 అర్జీలను అప్లోడ్ చేశారు. వీటిలో 1.81లక్షల అర్జీలను పరిష్కరించగా, ఇంకా 20,883 అర్జీలు పరిష్కరించాల్సి ఉందని లెక్కతేల్చారు. ఈ లెక్కలన్నీ కాకిలెక్కలుగానే కన్పిస్తున్నాయనే విమర్శలున్నాయి. కొత్త కార్డులు జారీ చేసినా.. టీడీపీ పగ్గాలు చేపట్టక ముందు జిల్లాలో 12.25 లక్షలకుపైగా బీపీఎల్ కార్డులుండేవి. ప్రస్తుతంవాటి సంఖ్య 10,28,800కు చేరింది. అంటే రెండు లక్షలకు పైగా కార్డులు వివిధ రూపాల్లో తొలగించేశారు. కొత్తకార్డుల కోసం 1.75 లక్షల మంది దరఖాస్తు చేస్తే 1.15 లక్షల కార్డులు మాత్రమే మంజూరు చేశారు. కాగా ఇప్పటివరకు ముద్రించిన కార్డులు కేవలం 70 వేల లోపే. కొత్తకార్డులను జన్మభూమి పంపిణీ చేయనుండగా మంజూరైన కార్డులందని వారు, కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు, కార్డులు కోల్పోయిన వారు సైతం సభల్లో నిలదీసే అవకాశాలు కన్పిస్తున్నాయి. పింఛన్దారుల పాట్లు.. ఈ ప్రభుత్వం వచ్చేనాటికి జిల్లాలో 3.26 లక్షల పింఛన్లుండగా.. వడపోతల పేరిట పాతిక వేలకు పైగా పింఛన్లను తొలగించారు. ఆ తర్వాత కాల్బ్యాక్, కొత్తగా మంజూరు చేసిన పింఛన్లు కలుపుకొని జిల్లాలో పింఛన్ల సంఖ్య 3,24,585కు చేరితే గత మూడునెలల్లో ఆధార్ మిస్మ్యాచ్ పేరిట 28,287 పింఛన్లను నిలిపేశారు.మరో పక్క వరుసగా మూడునెలల పాటు పింఛన్ తీసుకోలేదనే సాకుతో జిల్లాలో సుమారు 5వేలకు పైగా పింఛన్లు రద్దుచేశారు. వీరంతా సభల్లో తమ గోడు వినిపించుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇటీవల జరిగిన జెడ్పీ మీటింగ్లో పింఛన్ల విషయమై అధికార, విపక్ష ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హౌసింగ్ పైనే దృష్టంతా.. హౌసింగ్ ఫర్ ఆల్ అంటూ జీవీఎంసీ పరిధిలో 20.030 ఇళ్లు మంజూరు చేస్తే ఏకంగా 1.84 లక్షల మంది దరఖాస్తుచేసుకున్నారు. గ్రామీణజిల్లాకు 12,500 ఇళ్లు మంజూరు చేస్తే ఇప్పటికే 46,053 మంది అర్హులుగా లెక్కతేల్చి అప్లోడ్ చేశారు. కానీ ఈ జాబితాలను జన్మభూమి కమిటీలకు అప్పగించారు. ఈ జాబితాల్లో టీడీపీ కార్యకర్తలెవరో లెక్కతేల్చి వారికి మాత్రమే ఆమోదముద్ర వేయనుండడంతో అర్హులైన మిగిలిన బాధితులు సభలను వేదికగా చేసుకుని నిలదీసే అవకాశం ఉంది. ‘కొను’గోల్మాల్ ఇక జిల్లాలో ఖరీఫ్ కోతలు నూరుశాతం పూర్తయ్యాయి. దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. కానీ నేటివరకు ఎక్కడా కొనుగోలు ప్రారంభం కాలేదు. దళారీల చేతిలో అన్నదాతలు నిలువునా మోసపోతున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో అధికారుల వైఫల్యాన్ని ఎండగట్టే అవకాశాలున్నాయి. రూ.3 వేల పెట్టుబడి నిధి చాలామంది డ్వాక్రా మహిళల ఖాతాల్లో జమకాలేదు.మరో పక్క 2015-16లో జమకావాల్సిన రెండో విడత రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళల పెట్టుబడి నిధి ఇంకా విడుదల చేయలేదు. హుద్హుద్ బాధిత రైతుల్లో చాలా మందికి ఇంకా పరిహారం జమకాని పరిస్థితి నెలకొంది. ఇంకా జిల్లా, క్షేత్ర స్థాయిలో నెలకొన్న సమస్యలతో పాటు ప్రతీ పథకం లోనూ జన్మభూమి కమిటీల పెత్తనం.. వసూళ్ల దందా, ఎన్నికల హామీల అమలులో సర్కార్ వైఫల్యాలపై జన్మభూమి సభలను వేదికగా చేసుకుని యుద్ధభేరి మోగించేందుకు వైఎస్సార్ సీపీ శ్రేణులు సన్నద్ధమవుతుండడం అధికారులకు చమటలు పట్టిస్తోంది. -
'అవినీతికి పాల్పడితే సహించేది లేదు'
హైదరాబాద్: అవినీతికి పాల్పడితే సహించేది లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెచ్చరించారు. సోమవారం హైదరాబాద్ లో చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. జన్మభూమిని విజయవంతం చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. కొందరు ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని చెప్పారు. ఎమ్మెల్యేల వ్యవహారాల్లో మంత్రులు జోక్యం చేసుకోవద్దని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సమన్వయంతో పనిచేయాలని చంద్రబాబు సూచించారు. -
జన్మభూమి సభలో రైతు ఆత్మహత్యాయత్నం
తొట్టెంబేడు: చిత్తూరు జిల్లా తొట్టెంబేడు మండలం చిడత్తూరులో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో రసాభాస జరిగింది. టీడీపీకి చెందిన వ్యక్తి తన భూమిని కబ్జా చేశారని రామకృష్ణయ్య అనే రైతు ఆరోపించాడు. అనంతరం రామకృష్ణయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే స్పందించిన అధికారులు ఆ రైతును చికిత్స నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు. -
'జన్మభూమి'లో టీడీపీ కౌన్సిలర్ల బైఠాయింపు
చిత్తూరు: చిత్తూరు నగరపాలక సంస్థ 45వ వార్డులో ఆదివారం చేపట్టిన జన్మభూమి కార్యక్రమంలో రసాభాస చోటుచేసుకుంది. తాగునీరు సక్రమంగా సరఫరా చేయలేదంటూ పట్టణ టీడీపీ కౌన్సిలర్లతో పాటు వారి అనుచరులు బైఠాయించారు. మంచి నీటి సరఫరా సరిగాలేదంటూ వారు ఆందోళన చేపట్టారు. -
'జన్మభూమి'లో రసాభాస
తూర్పుగోదావరి(తొండంగి): తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం బెండపూడి గ్రామంలో బుధవారం జరిగిన జన్మభూమి కార్యక్రమం రసాభాసగా మారింది. పింఛన్లు తీసేశారంటూ గ్రామంలో వృద్ధులు, వితంతువులు ప్రభుత్వాధికారులను నిలదీశారు. మాకు పింఛన్ మంజూరు చేస్తారా ? లేదా అని గ్రామస్తులు అధికారులను ప్రశ్నించారు. గ్రామస్తులకు సమాధానం చెప్పలేక అధికారులు వెనుదిరిగారు. -
ఎన్నికల కోడ్ ఉన్నా జన్మభూమి కార్యక్రమం
పార్వతీపురం (విజయనగరం జిల్లా)/చిత్తూరు: రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలోని గోపాలపురం, అద్దపు శిల గ్రామాల్లో బుధవారం జన్మభూమి కార్యక్రమం నిర్వహించారు. పార్వలతీపురం ఎండీఓ కె. కృష్ణారావు ఆధ్వర్యంలో అధికారులు ఈ రెండు గ్రామాల్లో జన్మభూమి నిర్వహించారు. అదేవిధంగా చిత్తూరు జిల్లాలోనూ జన్మభూమి కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో అధికారులు పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం చర్చనీయాంశమైంది. -
'జన్మభూమి'ని అడ్డుకున్న టీడీపీ సర్పంచ్
తోట్లవల్లూరు : కృష్ణా జల్లా తోట్లవల్లూరు మండలంలోని పాములలంకలో బుధవారం జన్మభూమి కార్యక్రమాన్ని సాక్షాత్తూ టీడీపీ గ్రామ సర్పంచ్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గ్రామస్తులు అడ్డుకున్నారు. కృష్ణానదిపై వంతెన నిర్మించాలని కోరుతూ జన్మభూమి కార్యక్రమాన్ని బహిష్కరించారు. తోట్లవల్లూరు, పాములలంక మధ్య బ్రిడ్జి నిర్మాణానికి రూ.13.5 కోట్లు మంజూరు చేశారు. శంకుస్థాపన చేసి ఏడాదయినా ఇంతవరకూ పనులు మొదలు కాలేదు. వెంటనే పనులు ప్రారంభించాలని కోరుతూ గ్రామస్తులు ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. -
బదిలీలతో బిజీబిజీ...ఎవరూ అతీగతీ
జన్మభూమి- మన ఊరు కేవలం ప్రభుత్వ కార్యక్రమం. అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రమే హాజరవ్వాలి. కానీ పచ్చ చొక్కాల దౌర్జన్యాలతో గందరగోళంగా మారాయి. అధికారులు కూడా తానా తందానా అనడంతో ప్రొటోకాల్ పత్తాలేకుండా పోయింది. రెండో విడత వచ్చే సరికి కమిటీల పేరుతో అధికార ముద్రతో సర్కారు సభలపైకి ఉసి గొల్పడంతో ప్రజా సమస్యలు పక్కకు తొలగి పార్టీ ఎజెండా ముందుకు వచ్చింది. సర్వేల పేరుతో అర్హులను కూడా తొలగించడంతో మనస్థాపానికి గురై పలువురు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడ్డారు. ఓ వృద్ధురాలు ఏకంగా కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆ మృతదేహంతో బంధువులు ధర్నాకు దిగారు. ఇంకో సంఘటనలో మరో వృద్ధుడు గుండె ఆగి చనిపోయాడు. తను పట్టిన కుందేలుకు మూడే కాళ్లున్నాయన్న చందంగా అధికారులు పని చేసుకుపోవడంతో సంక్షేమం స్థానంలో సంక్షోభం ఏర్పడింది. లబ్ధిదారుల్లో మానసిక ఆందోళన నెలకొంది. ఇంతలో బది‘లీల’లు ప్రారంభమయ్యాయి. ఈ అర్జీల గతి ఏమవుతుందోనని లబ్ధిదారుల్లో సరికొత్త భయం నెలకొంది. వచ్చిన అధికారికి అంతా కొత్తే. ‘పెద్దాయనొచ్చె...మళ్లీ మొదలెట్టు’ అన్న చందంగా తయారవుతుందేమోనని అనుమానాలు ప్రారంభమయ్యాయి. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో పలు అవాంతరాలతో ముగిసిన జన్మభూమి సభలు అనుకున్న లక్ష్యానికి చేరుకోక విమర్శల పాలయింది. వచ్చిన లక్షల అర్జీలు సంబంధిత శాఖలకు పంపించే తరుణంలో బదిలీల ప్రక్రియకు శ్రీకారం చుట్టడంతో ప్రయోజనం ప్రశ్నార్ధకంగా మారింది. ప్రకాశం జిల్లాలో రెండు విడతలుగా 22 రోజులపాటు జరిగిన ‘జన్మభూమి - మా ఊరు’ సభలకు రెండు లక్షల 80 వేల అర్జీలు వచ్చాయి. ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ఇంకా నడుస్తుండటంతో ఈ దరఖాస్తులు ఆయా కార్యాలయాల్లోనే మూలుగుతున్నాయి. అర్జీలకు ఆధార్తో ముడిపెట్టారు. ఆధార్ నెంబర్తోపాటు సెల్ నెంబర్ కూడా సేకరించాలని నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా 1255 గ్రామసభలు నిర్వహించారు. అందులో రెండు లక్షల 80 వేల దరఖాస్తులు వస్తే కేవలం రెవెన్యూ శాఖకు సంబంధించే లక్షా రెండువేల అర్జీలున్నాయి. భూ సమస్యలు, పట్టాదార్ పాసు పుస్తకాల కోసమే ఎక్కువ ధరఖాస్తులు వచ్చాయి. పట్టాదారు పాస్పుస్తకాలకు సంబంధించిన 1బీ ఖాతాలను క్రాస్ చెక్ చేయకపోవడంవల్ల సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఒక్క చీరాల మండలంలోనే 80 శాతం అర్జీలు అధికారుల రికార్డులతో సరిపోలడం లేదు. దీంతో రైతులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వచ్చిన అర్జీలలో వ్యక్తిగతమైనపనుల కోసం ఎన్ని అర్జీలు వచ్చాయి, సామాజికపరంగా ఎన్ని ఉన్నాయనే అంశాన్ని విడగొట్టాల్సి ఉంది. వీటిని పరిష్కరించడానికి ఒక నిర్ధిష్టమైన గడువు లేదు. దీంతో అధికారులు వీటిని ప్రాధాన్యతాక్రమంలో రానున్న ఐదు సంవత్సరాల్లో వారి అవసరాలు తీర్చేందుకు చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ముఖ్యంగా డబ్బుతో ముడిపడిన ఏ అంశం కూడా పరిష్కారమయ్యే అవకాశం కనపడటం లేదు. ఆరోగ్య శిబిరాలు, వెటర్నరీ శిబిరాలు, పొలం పిలుస్తోంది, బడి పిలుస్తోంది. పేదరికంపై గెలుపు, స్వచ్ఛ ఆంధ్రా, నీరు -చెట్టు తదితర కార్యక్రమాలు కూడా మొక్కుబడిగా నిర్వహించారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సందర్భంగా పొలం పిలుస్తోంది, బడి పిలుస్తోంది అంటూ సభలు నిర్వహించినా తర్వాత ఎక్కడా వాటి ఊసే లేదు. కొత్తగా బడికి వెళ్లని వారిని గుర్తించి స్కూళ్లలో చేర్చింది కూడా లేదు. డ్వాక్రా రుణాలు కూడా ముఖ్యమంత్రి సభలో ఇచ్చినవే. రుణమాఫీ అమలు కాకపోవడం వల్ల డ్వాక్రా గ్రూపులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రాలేదు. నిర్దేశించిన లక్ష్యం ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. రెవెన్యూ శాఖకు సంబంధించినవే కాకుండా, పింఛన్లకు సంబంధించి 55,703 అర్జీలు, పౌరసరఫరాల శాఖకు సంబంధించి 42, 650, హౌసింగ్కు సంబంధించి 38,469, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి 11,754 అర్జీలు, మున్సిపాలిటీలకు సంబంధించి 5 వేల అర్జీలు వచ్చాయి. పింఛన్లకు పేరు మార్చి ఎన్టీఆర్ భరోసా పేరుతో పంపిణీ చేసిన సంగతి తెలిసిందే, ఈ సభల్లో 2,56000 మందికి పింఛన్లు పంపిణీ చేశారు. పింఛన్లకు సంబంధించి జిల్లాలో 79 వేల మంది పేర్లను తొలగించామని జిల్లా కలెక్టర్ విజయకుమార్ అధికారికంగా వెల్లడించారు. అందులో 27 వేలు పునరుద్ధరించారు. ఇంకా 52 వేల మందిలో అర్హత ఉండి కూడా పింఛన్ లేక చాలా మంది అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. పింఛన్లకు అర్హులైనప్పటికీ జాబితాలో లేనివారు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీలకు సమాచారం అందించాలని అధికారులు చెబుతున్నారు. అయితే వారికి మాత్రం న్యాయం జరగడం లేదు. ఈ కమిటీలు కూడా పూర్తిగా తెలుగుదేశం వారితో నింపడంతో అర్హులకు న్యాయం జరగడం లేదు. తమకు పింఛన్ అందని కారణంగా జిల్లాలో ఒకరు ఆత్మహత్య చేసుకోగా ఇంకొకరు గుండె ఆగి చనిపోయిన సంగతి తెలిసిందే. ఇంత జరిగినా ప్రభుత్వంలో మార్పు రాలేదు. ‘జన్మభూమి మా ఊరు’ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ పూర్తిగా తమ పార్టీ కార్యక్రమంగా నిర్వహించింది. పార్టీ నాయకులను వేదికపైన కూర్చోపెట్టేందుకు ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చిన జిల్లా మంత్రి, ఇతర శాసనసభ్యులు జన్మభూమి ముగిసిన తర్వాత దీనిపై సమీక్షించిన పాపాన పోలేదు. -
టిడిపి సీమంత రాజకీయం..!
జన్మభూమి - మా ఊరు సభలో భాగంగా గర్భిణులకు చేస్తున్న సీమంతంలోనూ అధికార పార్టీ రాజకీయ ప్రచారం చేస్తోంది. కృత్తివెన్ను మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహిస్తున్న జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గర్భిణులకు సీమంతాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా వారికి చీర, పూలు, పండ్లు, గాజులు, పసుపు, కుంకుమతో కూడిన వాయనం ఇచ్చి ఆశీర్వదిస్తున్నారు. అయితే ఆ వాయనంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దె అనురాధ ఫొటోలు ఉండటంతో జన్మభూమికి వచ్చిన పలువురు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. చివరికి సీమంతం కార్యక్రమాల్లో సైతం అధికార పార్టీ తమ ప్రచారం మానుకోలేదంటూ ఎద్దేవాచేస్తున్నారు. - కృత్తివెన్ను -
ఆరిపాక జన్మభూమిలో పాల్గొన్న చంద్రబాబు
-
రుణం చెల్లించాల్సిందే
సాక్షి, చిత్తూరు: రుణమాఫీ సంగతి దేవుడెరుగు. డ్వాక్రా రుణాలు తక్షణం వసూలు చేయాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. దీంతో సీఎం సొంత జిల్లాలో అటు వెలుగు అధికారులు ఇటు బ్యాంకర్లు వేర్వేరుగా డ్వాక్రా రుణాలను బల వంతంగా వసూలు చేస్తున్నారు. కాదూ కూడదంటే రుణం చెల్లించిన వారికే రుణమాఫీ అమలు చేస్తారని భయపెడుతున్నారు. పాతబకాయి తిరిగి చెల్లించకుంటే అధిక వడ్డీ వసూలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. రుణమాఫీ ఏమైందని ప్రశ్నిస్తే దాంతో మాకు సంబంధం లేదంటూ అధికారులు తప్పించుకుంటున్నారు. పాత బకాయి చెల్లిస్తేనే... పాత బకాయిలు చెల్లిం చకపోతే కొత్త రుణానికి జీరో వడ్డీ వర్తించదంటూ వెలుగు అధికారులు సంఘాల ను భయపెడుతున్నారు. సకాలంలో తిరిగి చెల్లిం చకపోతే ఐదు లక్షలకు నెలకు 5వేల వడ్డీ తప్పనిసరిగా చెల్లించాల్సిందేనంటూ అధికారులు తేల్చి చెబుతున్నారు. పాతబకాయిలు చెల్లించిన వారికే రుణమాఫీ వర్తిస్తుందని కొందరు వెలుగు అధికారులు అటు బ్యాంకు అధికారులు ప్రచారం చేస్తున్నట్లు సమాచారం. రుణమాఫీలో భాగంగా ప్రభుత్వం ఇస్తామన్న లక్షపై మాత్రం అధికారులు నోరుమెదపడంలేదు. ప్రశ్నిస్తే దాని విషయం మాకు తెలియదు ప్రభుత్వం ఇచ్చినపుడు తీసుకోమంటూ, సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నారు. బాబువి మాయమాటలేనా? మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రంపైకి అక్కాచెల్లెళ్లు రుణాలు చెల్లించాల్సిన అవసరం లేదంటూ మాయమాటలు వల్లిస్తున్నారు. అన్నీ తానే కడతానంటూ మాటలతో మభ్యపెడుతుండడంతో డ్వాక్రా మహిళలు రుణాలు తిరిగి చెల్లించాలా వద్దా అనే మీమాంసలో పడ్డారు. సీఎం పైకి ఎన్ని మాటలు చెప్పినా రుణ వసూళ్లు పూర్తిచేయాలంటూ తమకు ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయంటూ వెలుగు అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి సొంతజిల్లాలో అధికంగా వసూళ్లుచేసి మెప్పు పొందేందుకు డ్వాక్రా రుణాల వసూళ్లలో అధికారులు కొంత కఠినంగా వ్యవహరిస్తూ బలవంత పు వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో 65 వేల వరకూ డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. దాదాపు 7 లక్షల 80 వేలమంది సభ్యులున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలోనే జిల్లాలో 230 కోట్ల రుణాలు ఇచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇవి కాకుండా 2013-14కు సంబంధించి 1387 కోట్లు రుణాలు ఇచ్చారు. ఇప్పటికే గ్రూపులు చెల్లించక పోవడంతో 154 కోట్ల బకాయిలు పెండింగ్లోపడ్డాయి. గడువు లోపు చెల్లించక నిలిచి పోయిన బకాయిలు మరో 55 కోట్లు ఉంది. మొత్తంగా ఈ ఏడాది ఇచ్చిన 230 కోట్లు కాక 1,596 కోట్ల బకాయిలు ఉన్నాయి. వీటిని తక్షణం వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో జిల్లాలో బ్యాంకర్లు, వెలుగు అధికారులు డ్వాక్రా సంఘాలపై ఒత్తిడి పెంచి బలవంతంగా వసూళ్లకు దిగారు. ఇప్పటికే 60 శాతం బకాయిలు వసూలు చేశామంటూ అధికారులు హడావుడి చేస్తున్నారు. రూ.పది వేలు ఎప్పుడు ఇస్తారో మరోవైపు అక్కచెల్లెళ్లకు ఖర్చులకోసం ఒక్కో సభ్యురాలికి 10 వేలు ఉచితంగా ఇస్తానని ముఖ్యమంత్రి ఆర్భాటంగా ప్రకటించారు. ఈ విషయం జన్మభూమి సభల్లో పదేపదే చెబుతున్నారు. ఆ మొత్తాన్ని ఎప్పుడు ఇస్తారో మాత్రం చెప్పడంలేదు. జిల్లాలో 7లక్షల 80 వేలమంది సభ్యులకు ఒక్కొక్కరికీ 10 వేల వంతున మొత్తం 780 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. సీఎం మాటలు చెప్పడం తప్ప పైసా విదల్చలేదు. ఇది కూడా రుణమాఫీ మాదిరే ప్రచారార్భాటం తప్ప మరొకటి కాదని సంబంధిత అధికారులే బహిరంగంగా వ్యాఖ్యానిస్తుండడం విశేషం. -
బాధితులకు ఏం పరిహారం ఇస్తారో చెప్పండి?
జన్మభూమిలో అధికారులను నిలదీసిన వైఎస్సార్ సీపీ నేతలు నక్కపల్లి: హూదూద్ తుఫాన్కు నష్టపోయిన రైతులకు, ఇతర బాధితులకు ప్రభుత్వం తరపున ఏ పరిహారం ఇస్తున్నారో చెప్పాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యనిర్వాహకమండలి సభ్యుడు వీసం రామకృష్ణ అధికారులను నిలదీశారు. శనివారం నక్కపల్లి మండల కేంద్రంలో జరిగిన జన్మభూమి కార్యక్రమం వాడివేడిగా జరిగింది. ప్రత్యేకాధికారి శివప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పలువురు నాయకులు ఏకరువుపెట్టారు. తుఫాన్ వల్ల భారీ నష్టం వాటిల్లిందని ఇళ్లు, ఉద్యాన వన తోటలు నష్టపోయిన వారికి ఇంతవరకు ఒక్కపైసా కూడా పరిహారం చెల్లించలేదని వీసం ఆరోపించారు. ఇళ్లకు, తోటలకు వాటిల్లిన నష్టాన్ని అంచనా వేయడంలో అధికారులు పక్షపాతం చూపించారన్నారు. 90కి పైగా ఇళ్లు నష్టపోతే కేవలం 20కి మించి నష్టం వాటిల్లలేదని అధికారులు నివేదికలు తయారు చేసారన్నారు. ఇక తోటల విషయంలో ఎకరాకు 20కి మించి చెట్లు కూలిపోతేనే పరిహారం ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. తుఫాన్ వల్ల నష్టపోయిన బాధితులకు పరిహారం చెల్లించే విషయంలో ప్రభుత్వం కాలయాపన చేయడం తగదన్నారు. గత ఏడాది మండలానికి మంజూరైన దీపం గ్యాస్ కనెక్షన్లను అన్ని గ్రామాల్లోను పంపిణీ చేసి నక్కపల్లిలో ఎందుకు పంపిణీ చేయలేదని నిలదీశారు. సర్వేల పేరుతో అర్హుల పింఛన్లు రద్దుచేశారంటూ పలువురు బాధితులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. పింఛన్లు, రేషన్కార్డుల కోసం వందలాది దరఖాస్తులు వచ్చాయి. పింఛన్లను సర్పంచ్ వీ సం వెంకటలక్ష్మి, ఎంపీటీసీ సభ్యులు శేషారత్నం, వీసం దేవి తదితరుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పలువురు గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. ఎంపిడీవో కృష్ణ, వైఎస్సార్ సీపీ నాయకుడు వీసం నానాజీ, టీడీపీ నాయకులు కొప్పిశెట్టి వెంకటేష్, దేవవరపు శివ పాల్గొన్నారు. -
జన్మభూమిలో పోలీసుల ‘ఓవర్’యాక్షన్
ఆధార్ ఉంటేనే లోపలికి... పోలీసు పహారా మధ్య కార్యక్రమం వైఎస్సార్ సీపీ కార్యకర్తల అరెస్టు ఎమ్మెల్యే కల్పన జోక్యంతో విడుదల పామర్రు : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించలతపెట్టిన జన్మభూమి-మావూరు కార్యక్రమం పలు వివాదాలకు నెలవవుతోంది. పింఛన్ల బాధితులు, రైతులు, డ్వాక్రా మహిళల నిరసనలు, దీర్ఘకాల సమస్యల పరిష్కారంలో విఫలమయ్యారంటూ స్థానికుల ఆందోళనలు వెరసి పోలీసుల లాఠీచార్జీలతో రసాభాసగా కొనసాగుతున్నాయి. శనివారం కొమరవోలు లో జన్మభూమి కార్యక్రమం ఉదయం బ్యానర్లు కట్టే విషయంలోనే గొడవతో ప్రారంభమైంది. పోలీసు సిబ్బంది ఉదయమే వచ్చి గ్రామంలో ఉన్నప్పటికీ... వైఎస్సార్సీపీ కార్యకర్తలు కట్టిన బ్యానర్లు కన్పించకుండా....వాటికి అడ్డుగా టీడీపీ నాయకులు బ్యానర్లు కట్టడంతో ఘర్షణ ప్రారంభమయ్యింది. ఇరు వర్గాలకు న్యాయం చేయాల్సిన పోలీసులు పక్షపాతంగా వ్యవహరించి వైఎస్సార్సీపీ కార్యకర్తలు కట్టిన బ్యానర్లు తొలగించారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్న కార్యకర్తలను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన జోక్యంతో విడిచి పెట్టారు. తదుపరి గ్రామం ముఖద్వారం వద్ద పోలీసులు పెద్దసంఖ్యలో మోహరించి బయట వ్యక్తులు ప్రవేశించకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఈ విషయంలో గ్రామస్తులను సైతం ఆధార్కార్డు చూపనిదే గ్రామంలోకి పంపలేదు. దీంతో రైతులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. ఎమ్మెల్యే కల్పన తన కార్యకర్తలతో కలిసి కొమరవోలు ముఖద్వారం వద్దకు వచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఎమ్మెల్యే కల్పన అనుచరుల కారును అడ్డగించి కారులోని వ్యక్తులను జన్మభూమి పంపకుండా నిలిపివేశారు. దీంతో కార్యకర్తలకు, పోలీసులకు మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. సభ ఇలా జరిగింది... తొలుత జన్మభూమి- మన ఊరు కార్యక్రమానికి సర్పంచి పొట్లూరి కృష్ణకుమారి హాజరు కాగా, టీడీపీ కార్యకర్తలు ఆమెను అడ్డగించడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. జన్మభూమికి ఎమ్మెల్యే కల్పన హాజరు కావడంతో ఆమెతో పాటు సర్పంచి కలసి వచ్చారు. ఎమ్మెల్యే కల్పన మాట్లాడుతూ ప్రొటోకాల్లో ఉన్న వ్యక్తులను మాత్రమే వేదికపై ఉంచి మిగిలిన వ్యక్తులను పంపించి వేయాలని ఎంపీడీవో రామనాథంను ఆదేశించారు. దీనికి ఎంపీడీవో బదులిస్తూ సర్పంచి లేకపోవడంతోనే ఉపసర్పంచి అధ్యక్షత వహించారన్నారు. ఇది జరుగుతుండగానే సభా ప్రాంగణం బయట రోడ్డుపై ఉన్న ఇరుపార్టీల కార్యకర్తలు వేదిక వైపు దూసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ఇరుపార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఒకానొక సమయంలో అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపైకి దూసుకు రావడంతో పోలీసులు లాఠీఛార్జీ చేసి ఇరుపార్టీల వారిని చెల్లాచెదురు చేశారు. అనంతరం ఘర్షణ సద్దుమణిగాక ఎమ్మెల్యే ప్రసంగాన్ని ముగించి వెళ్లిపోయారు. భారీ బందోబస్తు.... ఓ డీఎస్పీ, ముగ్గురు సీఐలు, ఆరుగురు ఎస్ఐలు, మరో 50మంది కానిస్టేబుళ్ల బందోబస్తు మధ్య కార్యక్రమం కొనసాగింది. కాగా డీఏస్పీ అంకినీడు ప్రసాద్ వచ్చి రాగానే సిబ్బందిని మీ లాఠీలు ఏవని ప్రశ్నించారు. తీసుకు రాలేదని చెప్పడంతో లాఠీలులేకుండా విధులకు ఎలా హాజరయ్యారని సున్నితంగా మందలించారు. దీంతో పోలీసులు పామర్రు స్టేషన్కు వెళ్లి జీపులో లాఠీలు తెచ్చారు. -
ఇదేనా భరోసా..!
తాళ్లూరు:ఏళ్ల నుంచి పింఛన్ తీసుకుంటున్నారు.. పింఛన్ల పునః పరిశీలనలోనూ అర్హులుగా తేలారు. జన్మభూమి సభల్లో ఎన్టీఆర్ భరోసా పత్రాలూ అందుకున్నారు. ఆ నెల పింఛన్ కూడా తీసుకున్నారు. కానీ మరుసటి నెలకే జాబితాలో పేరు లేదు. అదేమిటంటే ఆధార్ నంబరు సరిగా నమోదు కాలేదని కొందరివి..వేలిముద్రలు సరిపోలేదని మరికొందరివి నిర్దాక్షిణ్యంగా తొలగించేశారు. ఏ ఆధారం లేని తమకు ఉన్న పింఛనూ తీసేశారు..ఇదెక్కడి అన్యాయమంటూ పింఛన్దారులు లబోదిబోమంటున్నారు. సర్కారు ఇస్తామన్న భరోసా ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. తాళ్లూరుకు చెందిన లోకిరెడ్డి సుబ్బారెడ్డి ఇంటర్మీడియెట్ వరకు చదువుకున్నాడు. ప్రైవేటుగా డిగ్రీ చేస్తున్నాడు. వికలాంగుడు కావడంతో రెండేళ్ల నుంచి పింఛన్ వస్తోంది. ఇటీవల సామాజిక పింఛన్ల తనిఖీలో అర్హుడిగా తేల్చారు. దీంతో బట్వాడా కోసం పోస్టుమాస్టర్ వద్దకు వెళ్లాడు. బయోమెట్రిక్ విధానంలో వేలిముద్రలు సరిపోవడం లేదు..ఆధార్ నంబరు తప్పుగా నమోదైందని..దీంతో మీకు పింఛన్ ఇవ్వలేమని అధికారులు చెప్పారు. గత నెల రోజులుగా ఎంపీడీవో కార్యాలయం చుట్టూ తిరిగి ఆధార్ నంబరు నమోదు చేసుకున్నాడు. అయినా రెండో నెలలో పింఛన్ రాలేదు. దీంతో ఏం చెయ్యాలో ఎవరిని కలవాలో తెలియని పరిస్థితి. వీరే కాదు..ఇదే సమస్యలతో వందల మంది పింఛన్దారులు అర్హులై ఉండీ..పింఛన్ అందక నానా అవస్థలు పడుతున్నారు. ఆధార్ సక్రమంగా నమోదు కాక, బయోమెట్రిక్ పద్ధతిలో వేలిముద్రలు సరిపోక నియోజకవర్గంలో దాదాపు 1310 మంది పింఛన్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నారు. వీరిలో అనేక మంది వృద్ధులు బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు మందులు కొనేందుకు పూర్తిగా పింఛన్ నగదుపైనే ఆధారపడుతున్నారు. దర్శి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 20,025 మంది పింఛన్లు పొందుతున్నారు. ఇందులో పింఛన్ల పునః పరిశీలనలో 3,726 పింఛన్లు రద్దయ్యాయి. ఆధార్ కార్డుల్లేక, వేలిముద్రలు సరిపోక మరో 1310 పింఛన్లు ఆగాయి. గతంలో బయోమెట్రిక్ విధానంలో వృద్ధుల వేలిముద్రలు నమోదు కాకపోతే..వారి బంధువులవి ఆన్లైన్లో నమోదు చేసేవారు. మళ్లీ నూతన పద్ధతి అంటూ ఈనెల పింఛన్లు ఆపేశారు. పింఛన్లపై ప్రభుత్వం రోజుకో విధానం అవలంబిస్తుండటంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. జన్మభూమి- మా ఊరు కార్యక్రమంలో తమకు జరిగిన అన్యాయంపై అడిగేందుకు సిద్ధమవుతున్న పింఛన్దారులను పోలీసులు అడ్డుకుంటున్నారని... ఇక న్యాయం ఎక్కడ జరుగుతుందని లబ్ధిదారులు వాపోతున్నారు. పింఛన్ పత్రాలు ఇవ్వడం ఎందుకు ?: కోటమ్మ ఐదేళ్ల నుంచి పింఛన్ తీసుకుంటున్నా. ఊళ్లో పంచాయతీ దగ్గర సభ పెట్టిన పింఛన్ భరోసా పత్రాలిచ్చారు. ఆ నెల పింఛన్ తీసుకున్నా. మాకు భూములున్నాయని ఎవరో చెప్పి పింఛన్ ఆపించేశారంట. మరి భరోసా పత్రాలివ్వడం ఎందుకు? మళ్లీ పింఛన్ తొలగించడం ఎందుకు? ఇటువంటి పత్రాలున్నా..పోయినా ఒక్కటే. మా లాంటి వారిని ఇబ్బంది పెడితే పుట్టగతులుండవు. -
‘గుర్తింపు’ లేకుంటే బుట్టదాఖలే
సాక్షి, రాజమండ్రి : పింఛన్ కావాలంటే ఆధార్ కావాలి.. రేషన్ కార్డు ఉండాలంటే ఆధార్ ఉండి తీరాలి..ఇలా అన్నింటికీ ఆధార్ లంకె పెడుతున్న ప్రభుత్వం ఇపుడు జన్మభూమి గ్రామసభలో ఇచ్చే దరఖాస్తులకు కూడా ఫొటో ఐడెంటిటీ (గుర్తింపు) కార్డు ఉండాలన్న నిబంధన విధించింది. జన్మభూమి సభల్లో నేతల ప్రసంగాలు విని, గంటల తరబడి క్యూల్లో నిలబడి ఎట్టకేలకు అధికారులకు తాము ఆశించే ప్రయోజనానికి అవసరమైన అర్జీ ఇచ్చాం కదా అని నిశ్చింతగా ఉండడం ఇప్పుడు కుదరదు. వాటికిక ఏదైనా గుర్తింపు కార్డు జత చేస్తేనే అవి ఆన్లైన్లో చేరి, అధికారుల పరిశీలనకు నోచుకుంటాయి. లేదం టే చెత్తబుట్ట పాలు కావడం ఖాయం. వీటి జిరాక్సు కాపీలను జోడించాలి.. ఇల్లు, పింఛను, రేషన్ కార్డు వంటివి మంజూరు చేయాలని కోరే అర్జీలకు తప్పనిసరిగా ఆధార్ కార్డు నకలు జోడించి తీరాలి. ఇతర వ్యక్తిగత అవసరాలకు సంబంధించి ఎటువంటి దరఖాస్తు అయినా అధికారులకు ఇచ్చే సమయంలో తాము ఇచ్చే అర్జీతో ఆధార్ కార్డు, ఓటరు కార్డు లేదంటే రేషను కార్డు జిరాక్సు కాపీ విధిగా జత చేయాలి. అంతే కాకుండా అందుబాటులో ఉండే మొబైల్ ఫోన్ లేదా ల్యాండ్ లైన్ నెంబరు దరఖాస్తుపై తప్పనిసరిగా ఉండాలి. అధికారులకు ఇచ్చే అర్జీ తర్వాత కంప్యూటర్ విభాగానికి వెళుతుంది. అక్కడ అర్జీదారుని గుర్తింపు కార్డు, ఫోన్ నంబరు ప్రధానంగా తీసుకుని ఇతర వివరాలను కంప్యూటర్లో పొందు పరుస్తారు. అవి లేకపోతే ఇచ్చిన దరఖాస్తును చిత్తు కాగితంతో సమానంగా పరిగణిస్తారు. అన్నీ దాటి, ఆశ నెరవేరేదెన్నడో? ప్రభుత్వం జన్మభూమిలో అందిన దరఖాస్తులను ముందుగా కంప్యూటరీకరిస్తోంది. అనంతరం మొబైల్ ద్వారా వాటి సమాచారం తెలుసుకునేందుకు ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం (ఐవీఆర్ఎస్)ను ఏర్పాటు చేయనుంది. జన్మభూమి కార్యక్రమం అనంతరం ఐవీఆర్ఎస్ ద్వారా ప్రభుత్వం నుంచి దరఖాస్తుదారునికి ఒక ఫోన్ వస్తుంది. ‘మీరు జన్మ భూమిలో దరఖాస్తు చేసుకున్నారు.. మీ చిరునామా ఇదేనా? దరఖాస్తుదారు నిజంగా మీరేనా?’ వాకబు చేస్తారు. ఈ విధంగా జన్మభూమిలో అందిన దరఖాస్తుల్లో అసలు, నకిలీల నిర్ధారణకు సర్కారు పరీక్షలు పెట్టేందుకు సిద్ధమవుతోంది. దీనిని బట్టి చేసుకున్న దరఖాస్తు అధికారులు తీసుకోవాలి, వాటిని కంప్యూటరీకరించాలి, అనంతరం ఐవీఆర్ఎస్ ద్వారా ఫోన్ రావాలి. ఆ తర్వాతే అర్హమైన వాటి జాబితాలో చేరతాయి. అవి పరిష్కారమై దరఖాస్తుదారుకు ప్రయోజనం దక్కేది ఎప్పుడో సర్కారే చెప్పాలి. అధికారులకూ చిక్కుసమస్యే.. దరఖాస్తు తీసుకునే సమయంలో కూడా అధికారులు ఫొటో గుర్తింపు పత్రాల నకళ్లు తీసుకోవాలని సూచించింది. కానీ చాలా వరకూ కార్యక్రమాల్లో గుర్తింపు కార్డు జిరాక్సులు లేకపోవడంతో గతంలో ఇచ్చిన దరఖాస్తుల్లో కొన్ని వేల దరఖాస్తులను కంప్యూటరీకరించలేదని తెలుస్తోంది. వీటికి సంబంధించిన గుర్తింపు కార్డులు, ఫోన్ నంబర్లు సేకరించి శుక్రవారం సాయంత్రంలోగా కంప్యూటరీకరించాలని అన్ని మండలాల అధికారులకూ ప్రభుత్వం ఆదేశించింది. దీంతో గతంలోని దరఖాస్తులకు సంబంధించి ఇప్పటికిప్పుడు ఆధారాలు, వివరాలు ఎలా సేకరించాలా అని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
పండుటాకులకు..గుండెకోత
జీవిత చరమాంకంలో ఆసరానిస్తున్న పింఛన్ పథకంతో సర్కారు ఆడుతున్న క్రూర క్రీడ పండుటాకుల అసువులకే ఎసరు పెడుతోంది. పింఛన్ మొత్తాన్ని పెంచుతున్నామని, సంతోషం, సంతృప్తి వగైరా ఐదురెట్లు పెరుగుతాయని ఆర్భాటపు ప్రచారం చేసుకుంటున్న పాలకులు తెరమాటున ఆడుతున్న పాచికలాట.. పడమటి పొద్దుకు తిరిగినవారి పాలిట మృత్యుఘాతమవుతోంది. పెరిగిన మొత్తం అందుకుంటామని ఆనందిస్తుండగా..అనేక సాకులతో ఉన్న పింఛన్లు కోల్పోయిన వృద్ధుల్లో కొందరి గుండెలు ఆగిపోతున్నాయి. సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఎన్నికల వాగ్దానాల అమలులో టీడీపీ సర్కారు పెడుతున్న మెలికలు ఎందరికో మృత్యుఘంటికలుగా మారుతున్నాయి. చంద్రబాబు అధికారంలోకి రావడంతో పింఛన్ మొత్తం రూ.200 నుంచి రూ.వెయ్యికి పెరుగుతుందని సంబరపడ్డ వృద్ధుల్లో పలువురికి..అంధకారమే ఎదురైంది. వయసు తేడాలని, ఆధార్ లేదని.. ఇంకా పలు సాకులతో కొందరి పింఛన్ను ప్రభుత్వం రద్దు చేసింది. హతాశులైన పండుటాకులు.. ఆ ఆసరాను పునరుద్ధరించాలని మర పెట్టుకుంటూ జన్మభూమి-మా ఊరు సభల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అయినా ఫలితం దక్కకపోవడంతో పిండేసే దుఃఖంతో కొందరి గుండెలు ఆగిపోతున్నాయి. జిల్లాలో ఇలాంటి విషాదాలు ఎక్కడో ఒక చోట నమోదవుతూనే ఉన్నాయి. అన్ని విధాలా అర్హత ఉన్న వారి పింఛన్లకు కూడా కోత పెడుతుండడంతో ఎందరో వృద్ధులు ఆవేదన చెందుతున్నారు. సవాలక్ష సాకులు చూపించి ఇప్పటి వరకు సుమారు 90 వేల పైచిలుకు పింఛన్దారులను లబ్ధికి దూరం చేసినట్టు లెక్కలు చెపుతున్నాయి. వృద్ధుల నోటి దగ్గరి ముద్దను లేకుండా చేయడానికి సర్కారు చూపుతున్న కారణాలు కేవలం సాంకేతికపరమైనవే అని చెప్పవచ్చు. చివరకు కొత్తగా పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తులలో కూడా ప్రభుత్వం కోతపెట్టి వారి గుండెకోతకు కారణమవుతోంది. పింఛన్ల ఎంపిక పారదర్శకంగా చేస్తున్నామంటూ ఏర్పాటు చేసిన గ్రామకమిటీలు చేసిన సిఫార్సులనే గాలికొదిలేసి కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి ఆశలను వమ్ముచేయడంతో వారు గుండెపగిలి చనిపోతున్న విషాధ ఘటనలు చోటుచేసుకున్నా సర్కార్కు చీమకుట్టినట్టయినా లేదు. గాంధీ జయంతికి ప్రారంభించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్దారులకు భరోసా ఇవ్వకపోగా వారి బతుకుల్లో బుగ్గిపోస్తోందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. శుక్రవారం ఒక్కరోజే పింఛన్ రద్దయిన ఇద్దరు వృద్ధులు తనువు చాలించడం పింఛన్ల పంపిణీల్లో అర్హులకు జరుగుతున్న అన్యాయానికి పరాకాష్టగా నిలుస్తోంది. చేటు తెచ్చిన సర్వే కాట్రేనికోన గ్రామం శివారు రామస్వామితోటకు చెందిన పరమట చంద్రన్న(85)కు రూ.200 పింఛన్ వచ్చేది. చంద్రబాబు సర్కార్ వచ్చాక రూ.1000 పింఛన్ వస్తుందని చంద్రన్న ఆశపడ్డాడు. పిల్లలు పెళ్లిళ్లు చేసుకుని వెళ్లిపోగా ఒక్కడే బతుకుబండిని లాగిస్తున్నాడు. పొరుగున ఉన్న తేటకాయల శివశంకర్ సాకుతుండటంతో రూ.1000 పింఛన్ సొమ్ముతో బతుకు బాగుపడుతుందని ఆశించాడు. అయితే సర్వే అనంతరం అతని పింఛన్ రద్దయింది. దాంతో గత వారం రోజులుగా అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఫలితం కనిపించక ఆవేదనతో శుక్రవారం గుండె పగిలి మృతిచెందాడు. గత వారం రోజులుగా పెరిగే పింఛన్ కోసం తిరుగుతున్న చంద్రన్న చివరికి ఇలా ఆ ఆశ నెరవేరకుండానే మరణించడానికి సర్కారే కారణమని స్థానికులు శాపనార్థాలు పెట్టారు. వయసు తక్కువని ఎసరు పెట్టారు.. కాగా రాజమండ్రి రూరల్ మండలం రాజవోలులో కూడా ఇలాంటి విషాదం జరిగింది. గత నెల వరకూ వచ్చిన రూ.200 ఫించను ఎన్టీఆర్ భరోసాతో రూ.1000 అవుతుందని ఆ గ్రామానికి చెందిన చిగటాపు సూర్యారావు(73) ఆశించాడు. అదే ఆశతో నేతల చుట్టూ తిరుగుతున్న సూర్యారావుకు వయస్సు సరిపోవడం లేదంటూ పింఛన్ జాబితా నుంచి పేరు తొలగించేశారు. భార్య సరస్వతి తెచ్చే కూలికి రూ.వెయ్యి కలిపితే కాస్త నిశ్చింతగా బతకొచ్చు అనుకుంటే వయస్సు తక్కువగా ఉందని పింఛను తొలగించేయడం, వచ్చే రూ.200 కూడా పోవడంతో సూర్యారావు మనస్తాపానికి గురయ్యాడు. బెంగతో మంచం పట్టి శుక్రవారం కన్నుమూశాడు. హుషారుగా ఉండే సూర్యారావు పింఛన్ రద్దయిందనే బెంగతోనే తనువు చాలించారని భార్య సరస్వతి బావురుమంది. కాగా కోరుకొండ మండలం మునగాల జన్మభూమి గ్రామసభకు వితంతు పింఛన్ కోసం వచ్చిన సోమన మంగ మెట్ట మీద జారిపడి కాలు విరిగి ఆసుపత్రి పాలైంది. స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద ఎంపీపీ స్కూల్ ఆవరణలో జన్మభూమి సభలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆమెకు పింఛన్ ఇస్తారో, లేదో స్పష్టత లేదు. వెలుగులోకి రాని విషాదాలెన్నో..! పింఛన్ తొలగించేశారని ఆవేదనతో బుధవారం ప్రత్తిపాడు మండలం గజ్జనపూడి గ్రామసభకు వచ్చిన వృద్ధురాలు ఒమ్మి చంద్రమ్మ(75) అక్కడికక్కడే కుప్పకూలి విగతజీవిగా మారింది. ఇలా కొన్ని విషాద ఘటనలు వెలుగులోకి రాగా, మరికొన్ని ఉదంతాలు వెలుగులోకి రావడం లేదు. ఇలా ప్రతి గ్రామంలో పింఛన్లను కోతపెడుతూ వృద్ధులు, వితంతువులు, వికలాంగుల జీవితాలతో సర్కార్ ఆటలాడుకుంటోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంపచోడవరం నియోజకవర్గంలో ఏడెనిమిది వేల పింఛన్లను తొలగించేశారు. రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరులో 40 మంది కుష్టువ్యాధిగ్రస్తుల పింఛన్లను తొలగించేశారు. జిల్లావ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో కుంటిసాకులతో, సాంకేతిక కారణాలతో అనేకుల పింఛన్లను తొలగించేశారు. ఎన్టీఆర్ భరోసా పథకం పురుడుపోసుకోక మునుపు అన్ని రకాల పింఛన్లు కలిపి జిల్లాలో 4,65,617 ఉన్నాయి. వాటిలో 90,981 పింఛన్లను ఎన్టీఆర్ భరోసా అమలులోకి వచ్చిన తరువాత గత సెప్టెంబరులో నిలిపివేశారు. వాటిలో 40,509 మందిని అనర్హులంటూ తొలగించేశారు. మిగిలిన వాటిని పక్కన పెట్టడానికి పలు కారణాలను చూపించారు. ఇవి కాకుండా వేలిముద్రలు సరిపోలడం లేదంటూ మరో 30 వేల వరకు తొలగించేశారు. ఈ చర్యల ద్వారా సర్కార్ మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని పలువరు ధ్వజమెత్తుతున్నారు. -
జన్మభూమిలో ఎమ్మెల్యే నిలదీత
అందరికీ పింఛన్లు ఇవ్వాలంటూ నినాదాలు తిరుపతి కార్పొరేషన్: ప్రజా సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యూరని, అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని ఆరోపిస్తూ సీపీఎం నాయకులు ఎమ్మెల్యే వెంకటరమణను అడ్డుకున్నారు. జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా తిరుపతిలో శుక్రవారం సప్తగిరినగర్, యశోదనగర్ ప్రాంతాల్లో సభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వెంకటరమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా యశోదనగర్లోని లిటిల్ ఏంజెల్స్ స్కూల్లో ఏర్పాటు చేసిన జన్మభూమి సభకు ఆయన చేరుకున్నారు. ఈసందర్భంగా అక్కడికి చేరుకున్న సిపిఎం పార్టీ నాయకులు, స్థానికులు ఎమ్మెల్యేను సమస్యలపై నిలదీశారు. సుందరయ్యనగర్, రైల్వేకాలనీ, యశోదనగర్లోని తాగునీరు, అండర్ డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించారు. దీనికి ఎమ్మెల్యే ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వకపోగా హడావిడిగా ఐదుగురికి పింఛన్లు ఇచ్చేసి, అక్కడి నుంచి జారుకునే ప్రయత్నం చేశారు. దీంతో సీపీఎం నాయకులు పాఠశాల ప్రధాన గేట్లకు అడ్డంగా నిలుచుకుని ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. అక్కడి నుంచి కదలకుండా ప్రజా సమస్యలను పరిష్కరించాలని, అర్హులందరికి పింఛన్లు, ఇంటి పట్టాలు కేటాయించాలని నినాదాలు చేశారు. గేటు ముందు బైఠాయించి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా సీపీఎం నగర కార్యదర్శి సుబ్రమణ్యం మాట్లాడుతూ జన్మభూమి కార్యక్రమంలో పింఛన్లు ఇస్తామని లబ్ధిదారులందరిని ఆహ్వానించి, కేవలం ఐదుగురికే ఇచ్చి తప్పుకోవడం ఎంత వరకు సమంజసమని నిలదీశారు. సుందరయ్య నగర్, రైల్వే కాలనీ, యశోదనగర్లో రోడ్డు, తాగునీరు, యూడీఎస్, పోలీస్ అవుట్ పోస్టు ఏర్పాటు చేయాలని పలు మార్లు చెప్పినా స్పందించక పోవడం దారుణం అన్నారు. ఎమ్మెల్యే, అధికారులు స్పందించి సీపీఎం నాయకులతో మాట్లాడారు. సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించారు. సీపీఎం నాయకులు జయచంద్ర, యాదగిరి, గురుప్రసాద్, చిన్న పాల్గొన్నారు. -
వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానో...లేదో !
శ్రీకాళహస్తి : ‘ఐదేళ్ల వరకు ఎన్నికలు లేవు... వచ్చే ఎన్నికల్లో పోటీలో ఉంటానో ఉండనో నాకే తెలియదు.... అయినా ప్రజాసమస్యలు తెలుసుకుని... వాటిని పరిష్కరించడానికే జన్మభూమికి హాజ రయ్యూన’ని రాష్ట్ర అటవీ శాఖా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చెప్పారు. గురువారం పట్టణంలోని 28, 29, 30 వార్డుల్లో జరిగిన జన్మభూమి-మా ఊరు గ్రామసభల్లో మంత్రి పాల్గొన్నారు. సాధారణంగా నాయకులు ఎన్నికల సమయాల్లో మాత్రమే కనిపిస్తారని, అయితే ఐదేళ్ల వరకు ఎన్నికలు లేనప్పటికీ ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలనే లక్ష్యంతో తాను హాజరైనట్లు తెలిపారు. అర్హులందరికీ పెన్షన్లు అందేలా చూడాలని మున్సిపల్ చైర్మన్ పేట రాధారెడ్డి, కమిషనర్ సన్యాసరావును ఆదేశిం చారు. అయితే పట్టణంలో పలువురు పురుషులు, వితంతువుల పెన్షన్లు తీసుకుంటున్నారని వాటిని రద్దు చేయాల్సి ఉందన్నారు. పట్టణాన్ని ప్రత్యేక లైటింగ్తో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. సోమశిల-స్వర్ణముఖికాలువ పనులు పూర్తి చేస్తామన్నారు. ప్రధానంగా పెన్షన్లు, మురుగుకాలువలు, రోడ్లు, తాగునీరు తదితర మౌలిక వసతులు కల్పించాలని మంత్రిని ఈ సందర్భంగా కొందరు కౌన్సిలర్లు కోరారు. మున్సిపల్ చైర్మన్ పేట రాధారెడ్డి మాట్లాడుతూ అభివృద్ధే ధేయ్యం గా...పట్టణాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకుపోతామని చెప్పారు. టీడీపీ సీనియర్ నాయకుడు పోతుగుంట గురవయ్యనాయుడు, బీజేపీ నాయకుడు కోలా ఆనంద్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మిద్దెల హరి, వైస్ చైర్మన్ ముత్యాల పార్థసారథి, ఇన్చార్జి కమిషనర్ సన్యాసరావు,కో-ఆప్షన్ సభ్యుడు షాకీర్ఆలీ,కౌన్సిలర్లు విజయకుమార్నాయుడు, ప్రసాద్నాయుడు, సుప్రజ పాల్గొన్నారు. స్థానికులు వారివారి సమస్యలను అర్జీల రూపంలో అందజేశారు. -
కర్నూలు జన్మభూమిలో పాల్గొన్న చంద్రబాబు
-
పశ్చిమలో చంద్రబాబు జన్మభూమి
-
రావెల, గల్లా జయదేవ్ను అడ్డుకున్న రైతులు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిశోర్ బాబు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్లకు చేదు అనుభవం ఎదురైంది. శనివారం గుంటూరు జిల్లా కాకుమానులో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రావెల, జయదేవ్లను రైతులు అడ్డుకున్నారు. రైతుల రుణమాఫీని ఎప్పుడు చేస్తారో చెప్పాలంటూ రైతులు వారిని నిలదీశారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రైతు రుణ మాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. టీడీపీ అధికారంలోకి వచ్చినా ఇప్పటి వరకు రుణమాఫీ చేయలేదు.