JUNE QUARTER
-
రియల్టీ మార్కెట్లో భారీ అమ్మకాలు
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ డెవలపర్లు జూన్ త్రైమాసికంలో రూ.35,000 కోట్ల విలువ చేసే ఇళ్లను విక్రయించారు. ఇందులో గోద్రేజ్ ఇండస్ట్రీస్ అత్యధిక అమ్మకాలతో మొదటి స్థానంలో నిలిచింది. 21 లిస్టెడ్ రియల్ ఎస్టేట్ సంస్థల డేటాను విశ్లేíÙంచగా.. బలమైన వినియోగ డిమాండ్ మద్దతుతో దాదాపు అన్ని సంస్థలు మెరుగైన విక్రయాలు నమోదు చేశాయి. గోద్రేజ్ ప్రాపర్టీస్ జూన్ త్రైమాసికంలో రూ.8,637 కోట్ల విలువైన ఇళ్లను ముందస్తు బుకింగ్లలో భాగంగా విక్రయించింది. → డీఎల్ఎఫ్ సేల్స్ బుకింగ్లు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే మూడు రెట్ల వృద్ధితో రూ.6,404 కోట్లుగా ఉన్నాయి. → ముంబైకి చెందిన మ్యాక్రోటెక్ డెవలపర్స్ (లోధా) సైతం రూ.4,030 కోట్ల బుకింగ్లు నమోదు చేసింది. → గురుగ్రామ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే సిగ్నేచర్ గ్లోబల్ (ఇటీవలే లిస్ట్ అయిన సంస్థ) రూ.3,120 కోట్ల బుకింగ్లను సాధించింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే మూడు రెట్లు అధికం. → బెంగళూరుకు చెందిన ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ సైతం రూ.3,029 కోట్ల అమ్మకాలు నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే తగ్గాయి. → బెంగళూరు కేంద్రంగా పనిచేసే శోభ లిమిటెడ్ రూ.1,874 కోట్లు, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ రూ.1,086 కోట్ల చొప్పున ముందస్తు బుకింగ్లు సాధించాయి. అలాగే, పురవంకర లిమిటెడ్ రూ.1,128 కోట్ల అమ్మకాలు నమోదు చేసింది. బెంగళూరుకు చెందిన శ్రీరామ్ ప్రాపరీ్టస్ రూ.376 కోట్ల విలువైన ప్రాపర్టీలను విక్రయించింది. → ముంబైకి చెందిన ఒబెరాయ్ రియాలిటీ రూ.1,067 కోట్ల విలువైన ప్రాపరీ్టలను విక్రయించింది. ముంబైకే చెందిన మహీంద్రా లైఫ్స్పేస్ డెవలపర్స్ రూ.1,019 కోట్లు, కీస్టోన్ రియల్టర్స్ రూ.611 కోట్లు చొప్పున బుకింగ్లు సాధించాయి. → ముంబైకి చెందిన మరో సంస్థ సన్టెక్ రియాలిటీ రూ.502 కోట్ల అమ్మకాలు చేసింది. అలాగే, ఈక్వినాక్స్ ఇండియా డెవలపర్స్ రూ.81 క్లోు, సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ రూ.140 కోట్ల విలువైన ప్రాపరీ్టలను విక్రయించాయి. బలమైన డిమాండ్.. కరోనా అనంతరం ఇళ్లకు బలమైన డిమాండ్ నెలకొనడమే మెరుగైన అమ్మకాల బుకింగ్లకు కారణమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల నిర్వహణలో మెరుగైన ట్రాక్ రికార్డు కలిగిన బ్రాండ్ల వైపు వినియోగదారులు మొగ్గు చూపిస్తున్నట్టు పేర్కొంటున్నాయి. ఇవన్నీ స్టాక్ ఎక్సే్ఛంజ్లలో లిస్ట్ అ యిన కంపెనీల గణాంకాలు మాత్రమే. అన్ లిస్టెడ్లో ఉన్న కంపెనీల విక్రయాలు కూడా కలిపి చూస్తే భారీ మొత్తమే ఉంటుంది. టాటా రియాలిటీ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్, అదానీ రియాలిటీ, పి రమల్ రియాలిటీ, హిరనందానీ గ్రూప్, ఎంబసీ గ్రూప్, కే రహేజా గ్రూప్ అన్లిస్టెడ్లో ప్రముఖ కంపెనీలుగా ఉన్నాయి. -
ఇళ్ల ధరల జోరులో ముంబై నంబర్ 2
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఇళ్ల ధరల పెరుగదలలో ముంబై రియల్టీ మార్కెట్ రెండో స్థానం నిలిచింది. ఢిల్లీ మూడో స్థానంలో ఉన్నట్టు జూన్ త్రైమాసికానికి సంబంధించిన నైట్ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 44 ప్రముఖ నగరాల్లోని ఇళ్ల ధరల పెరుగుదల వివరాలను నైట్ఫ్రాంక్ విడుదల చేసింది. జూన్ త్రైమాసికంలో ఈ నగరాల్లో ఇళ్ల ధరల పెరుగుదల 2.6 శాతానికి పరిమితమైనట్టు తెలిపింది. ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో పెరుగుదల రేటు 4.1 శాతంగా ఉండడం గమనార్హం. ఇళ్ల ధరల పెరుగుదలలో మనీలా మొదటి స్థానంలో నిలిచింది. అక్కడ 26 శాతం మేర వృద్ధి నమోదైంది. ముంబైలో ఇళ్ల ధరలు 13 శాతం మేర జూన్ త్రైమాసికంలో పెరిగాయి. దీంతో ఏడాది క్రితం ఆరో ర్యాంక్లో ఉన్న ముంబై 2కు చేరుకుంది. ఇక ఢిల్లీలో ఇళ్ల ధరలు 10.6 శాతం పెరగడంతో, ఏడాది క్రితం ఉన్న 26వ ర్యాంక్ నుంచి మూడో స్థానానికి ఎగబాకింది. బెంగళూరులో ఇళ్ల ధరలు జూన్ క్వార్టర్లో వార్షికంగా 3.7 శాతం మేర పెరిగాయి. దీంతో 15వ ర్యాంక్ సొంతం చేసుకుంది. టాప్–10లో ఇవే.. లాస్ ఏంజెలెస్లో 8.9 శాతం (4వ ర్యాంక్), మియామీలో 7.1 శాతం (5వ ర్యాంక్), నైరోబీలో 6.6 శాతం (ఆరో స్థానం), మ్యాడ్రిడ్లో 6.4 శాతం (ఏడో స్థానం), లిస్బాన్లో 4.7 శాతం (ఎనిమిదో స్థానం), సియోల్లో 4.6 శాతం (తొమ్మిదో స్థానం), శాన్ ఫ్రాన్సిస్కోలో 4.5 శాతం (10వ స్థానం) చొప్పున జూన్ త్రైమాసికంలో ఇళ్ల ధరలు పెరిగినట్టు నైట్ ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది. దుబాయిలో 2020 సంవత్సరం నుంచి ఇళ్ల ధరలు 124 శాతం పెరగ్గా.. జూన్ క్వార్టర్లో 0.3% మేర తగ్గాయి. వియన్నాలో 3.2%, బ్యాంకాక్లో 3.9 శాతం చొప్పున ఇదే కాలంలో ఇళ్ల ధరలు తగ్గాయి. -
హైదరాబాద్లో తగ్గిన ఇళ్ల విక్రయాలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో ఇళ్ల అమ్మకాలు జూన్ త్రైమాసికంలో తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా హైదరాబాద్లో ఇళ్ల విక్రయాలు ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలోని గణాంకాలతో పోలి్చచూస్తే 14 శాతం తగ్గి రూ.12,296 యూనిట్లుగా ఉన్నాయి. జనవరి–మార్చి కాలంలో 14,298 యూనిట్ల ఇళ్లు అమ్ముడుపోవడం గమనార్హం. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రముఖ నగరాల్లో 6 శాతం తగ్గి 1,13,768 యూనిట్లుగా ఉన్నట్టు ప్రాప్టైగర్ (ఆర్ఈఏ ఇండియా గ్రూప్) వెల్లడించింది. జనవరి–మార్చి క్వార్టర్లో ఈ నగరాల్లో విక్రయాలు 1,20,642 యూనిట్లుగా ఉన్నాయి. జూన్ త్రైమాసికంలో ఇళ్ల మార్కెట్ పనితీరుపై ప్రాప్టైగర్ ఒక నివేదిక విడుదల చేసింది. ఇక ఈ ఎనిమిది పట్టణాల్లో అమ్మకాలు, క్రితం ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో విక్రయాలు 80,245 యూనిట్లతో పోల్చి చూస్తే 42 శాతం పెరిగాయి. ‘‘రియల్ ఎస్టేట్ పట్ల వినియోగదారుల్లో సానుకూల ధోరణి నెలకొన్నప్పటికీ, ఏప్రిల్–జూన్ కాలంలో ఇళ్లకు డిమాండ్ మోస్తరుగా ఉండడానికి సాధారణ ఎన్నికలే కారణం. డెవలపర్లు సైతం కొంత అప్రమత్తంగా వ్యవహరించారు. ఫలితమే కొత్త ప్రాజెక్టుల ఆవిష్కరణ సైతం తగ్గింది. కేంద్రంలో నూతన ప్రభుత్వం పెట్టుబడుల అనుకూల బడ్జెట్ను ప్రవేశపెడుతుందన్న అంచనాల మధ్య రానున్న త్రైమాసికాల్లో, ముఖ్యంగా పండుగల రోజుల్లో ఇళ్ల అమ్మకాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నాం’’ అని ఆర్ఈఏ ఇండియా గ్రూప్ సీఎఫ్వో వికాస్ వాద్వాన్ పేర్కొన్నారు. పట్టణాల వారీగా విక్రయాలు→ అహ్మదాబాద్లో ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు 26 శాతం తగ్గి 9,500 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్లో విక్రయాలు 12,915 యూనిట్లుగా ఉన్నాయి. → బెంగళూరులో 13,495 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. మార్చి త్రైమాసిక విక్రయాలు 10,381 యూనిట్లతో పోలిస్తే 30 శాతం పెరిగాయి. → చెన్నైలో ఇళ్ల అమ్మకాలు 10 శాతం వృద్ధితో 3,984 యూనిట్లకు చేరాయి. మార్చి క్వార్టర్లో విక్రయాలు 4,427 యూనిట్లుగా ఉన్నాయి. → ఢిల్లీ ఎన్సీఆర్లో 11,065 యూనిట్ల ఇళ్లు అమ్ముడయ్యాయి. మార్చి త్రైమాసికంతో పోల్చితే 10 శాతం పెరిగాయి. → కోల్కతా మార్కెట్లో 3,237 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. జనవరి–మార్చి క్వార్టర్లో విక్రయాలు 3,857 యూనిట్లుగా ఉన్నాయి. → ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో ఇళ్ల అమ్మకాలు 8 శాతం క్షీణించి 38,266 యూనిట్లకు పరిమితమయ్యాయి. → పుణె మార్కెట్లోనూ 5 శాతం క్షీణతతో 21,925 యూనిట్ల విక్రయాలు జరిగాయి. → కొత్త ఇళ్ల సరఫరా అంతక్రితం త్రైమాసికంతో పోలి్చతే జూన్ క్వార్టర్లో 1 శాతం తగ్గి 1,01,677 యూనిట్లుగా ఉన్నట్టు ప్రాప్టైగర్ నివేదిక వెల్లడించింది. -
బ్యాంక్ డిపాజిట్లు డీలా..
న్యూఢిల్లీ: డిపాజిట్ల వృద్ధి స్పీడ్ను పెంచడానికి బ్యాంకులు ప్రయతి్నంచినప్పటికీ జూన్ త్రైమాసికంలో నిరాశే మిగిలింది. తక్కువ వ్యయాలకే నిధుల సమీకరణకు దోహదపడే కరెంట్ ఖాతా – సేవింగ్స్ ఖాతా (సీఏఎస్ఏ–కాసా) డిపాజిట్లను సమీకరించడంలో బ్యాంకింగ్ పనితీరు అంత ప్రోత్సాహకరంగా లేదని గణాంకాలు పేర్కొంటున్నాయి. పలు అగ్రశ్రేణి బ్యాంకుల కాసా డిపాజిట్ సమీకరణ వృద్ధి స్పీడ్ 2023–24 మార్చి త్రైమాసికంతో పోలి్చతే తదుపరి 2024–25 జూన్ త్రైమాసికంలో తగ్గింది. కొన్ని బ్యాంకుల విషయంలో డిపాజిట్ల తీరు అక్కడక్కడే ఉండగా, మరికొన్నింటి విషయంలో క్షీణత సైతం నమోదయ్యింది. తొలి సమాచారం ప్రకారం 13 బ్యాంకుల మొత్తం డిపాజిట్లు మార్చి త్రైమాసికంలో పోలి్చతే జూన్ త్రైమాసికంలో 1.15 శాతం క్షీణించింది. జూన్ త్రైమాసికంలో డిపాజిట్ల తీరు క్లుప్తంగా... -
హైదరాబాద్లో ఇళ్ల అమ్మకాల జోరు
న్యూఢిల్లీ: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ తన జోరు కొనసాగిస్తోంది. జూన్ త్రైమాసికంలో బలమైన పనితీరు చూపించింది. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. జూన్ క్వార్టర్లో హైదరాబాద్ మార్కెట్లో 15,085 ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో అమ్ముడుపోయిన ఇళ్లు 13,565 యూనిట్లతో పోల్చి చూస్తే 11 శాతం వృద్ధి కనిపించింది. కానీ, ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికం అమ్మకాలు 19,660 యూనిట్లతో పోల్చి చూసినప్పుడు 23 శాతం క్షీణత నెలకొంది. ఇక దేశవ్యాప్తంగా ఏడు ప్రముఖ పట్టణాల్లోనూ ఇదే ధోరణి కనిపించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ కాలంలో ఇళ్ల అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంలో పోల్చినప్పుడు 5 శాతం పెరిగి 1,20,340 యూనిట్లుగా ఉన్నాయి. కానీ, ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో విక్రయాలు 1,30,170 యూనిట్లతో పోల్చిచూస్తే 8 శాతం తగ్గాయి. ‘‘క్రితం త్రైమాసికంలో అధిక విక్రయాల బేస్ ఏర్పడినప్పడు తర్వాతి త్రైమాసికంలో అమ్మకాలు తగ్గడం సాధారణమే. అంతేకాదు ఈ స్థాయిలో విక్రయాలు తగ్గడానికి గడిచిన ఏడాది కాలంలో గణనీయంగా పెరిగిపోయిన ప్రాపర్టీ ధరల ప్రభావం కూడా కారణమే. దీంతో కొంత మంది ఇన్వెస్టర్లను వెనక్కి తగ్గేలా చేసింది’’ అని అనరాక్ చైర్మన్ అనుజ్పురి తెలిపారు. వార్షికంగా క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చిచూసినప్పుడు హైదరాబాద్, పుణె, బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో ఇళ్ల అమ్మకాలు పెరగ్గా, చెన్నై, కోల్కతాలో తగ్గాయి. మార్చి త్రైమాసికంతో పోల్చిచూస్తే ఒక్క ఢిల్లీ ఎన్సీఆర్లోనే అమ్మకాలు అధికంగా నమోదయ్యాయి.పట్టణాల వారీగా.. » ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో జూన్ త్రైమాసికంలో 16,550 యూనిట్ల ఇళ్లు అమ్ముడుపోయాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చిచూసినప్పుడు ఒక శాతం పెరగ్గా, మార్చి త్రైమాసికం నుంచి ఆరు శాతం వృద్ధి చెందాయి. » ఎంఎంఆర్లో 9 శాతం వృద్ధితో 41,540 యూనిట్ల ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. » బెంగళూరులో 16,360 యూనిట్ల ఇళ్ల అమ్మకాలు జరిగాయి. క్రితం ఏడాది జూన్ త్రైమాసికంతో పోల్చి చూస్తే 9 శాతం అధికంగా నమోదయ్యాయి. » పుణె మార్కెట్లోనూ 2 శాతం వృద్ధితో ఇళ్ల అమ్మకాలు 21,145 యూనిట్లుగా ఉన్నాయి. » చెన్నైలో 5,020 యూనిట్ల ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది జూన్ త్రైమాసికం గణాంకాలతో పోల్చి చూస్తే 9 శాతం తక్కువ. » కోల్కతాలో 20 క్షీణతతో ఇళ్ల అమ్మకాలు 4,640 యూనిట్లకు పరిమితమయ్యాయి.ఆల్టైమ్ గరిష్టానికి డిమాండ్ ఇళ్లకు డిమాండ్ అసాధారణ స్థాయిలో ఉన్నట్టు డీఎల్ఎఫ్ హోమ్స్ జాయింట్ ఎండీ, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఆకాశ్ ఓహ్రి తెలిపారు. ముఖ్యంగా కరోనా తర్వాత గడిచిన రెండేళ్లలో డిమాండ్ ఆల్టైమ్ గరిష్టానికి చేరినట్టు చెప్పారు. ‘‘ఇంటి యాజమాన్యం విషయంలో ప్రజల ఆలోచనా ధోరణిలో వచ్చిన నిర్మాణాత్మక మార్పు ఇది. ఒక స్థలాన్ని కలిగి ఉండడం పట్ల విలువ ఇంతకముందెన్నడూ లేని స్థాయికి చేరింది. ఇల్లు వినియోగానికే కాకుండా, ఆకర్షణీయమైన పెట్టుబడి సాధనంగా అవతరించింది. ముఖ్యంగా లగ్జరీ ఇళ్లపై రాబడులు పెట్టుబడుల డిమాండ్ను పెంచింది’’అని ఆకాశ్ ఓహ్రి వివరించారు. -
జూన్ త్రైమాసికంలో తగ్గిన నిరుద్యోగం
న్యూఢిల్లీ: పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 6.6 శాతానికి తగ్గింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికం నాటికి ఇది 7.6 శాతంగా ఉన్నట్టు జాతీయ శాంపిల్ సర్వే కార్యాలయం (ఎన్ఎస్ఎస్వో) వెల్లడించింది. ఇందుకు సంబంధించి 19వ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదికను విడుదల చేసింది. 15 ఏళ్ల పైన వయసుండి, పనిచేసే అర్హతలు కలిగిన వారిలో, ఉపాధి లేమిని ఈ రేటు సూచిస్తుంటుంది. 2023 జనవరి–మార్చి కాలంలో నిరుద్యోగం 6.8 శాతంగా, 2022 జూలై–సెప్టెంబర్, అక్టోబర్–డిసెంబర్లో 7.2 శాతంగా నిరుద్యోగ రేటు ఉండడం గమనించొచ్చు. పట్టణాల్లో 15 ఏళ్లకు పైన మహిళల్లో నిరుద్యోగం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 9.5 శాతం నుంచి 9.1 శాతానికి తగ్గింది. ఈ ఏడాది జనవరి–మార్చి మధ్య ఇది ఇది 9.2 శాతంగా ఉంది. పురుషుల్లో నిరుద్యోగ రేటు జూన్ త్రైమాసికంలో 5.9 శాతానికి క్షీణించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 7.1 శాతంగా ఉంటే, ఈ ఏడాది జనవరి–మార్చి మధ్య 6 శాతంగా ఉండడం గమనార్హం. కార్మికుల భాగస్వామ్య రేటు పట్టణ ప్రాంతాల్లో 48.8 శాతానికి పుంజుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 47.5 శాతంగా ఉంది. ఈ ఏడాది జనవరి–మార్చి మధ్య ఇది పట్టణాల్లో 48.5 శాతంగా ఉంది. -
వృద్ధి వేగంలో భారత్ టాప్!
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (2023–24, ఏప్రిల్–జూన్) 7.8 శాతంగా నమోదయ్యింది. వ్యవసాయం, ఫైనాన్షియల్ రంగాలు మంచి పనితనాన్ని ప్రదర్శించాయి. జూన్ త్రైమాసికంలో ప్రపంచంలో మరే దేశమూ ఈ స్థాయి వృద్ధిని నమోదుచేసుకోలేదు. దీనితో వృద్ధి వేగంలో భారత్ మొదటి స్థానంలో నిలిచినట్లయ్యింది. 6.3 శాతం వృద్ధి రేటుతో భారత్ తర్వాత చైనా వృద్ధి వేగంలో రెండవ స్థానంలో నిలిచింది. అయితే క్యూ1లో 8 శాతం వృద్ధి రేటు నమోదవుతుందన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంచనాలకన్నా తాజా లెక్క తక్కువగా ఉండడం గమనార్హం. ఈ నెల రెండవ వారంలో జరిగిన ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్షలో 2023–24లో దేశ జీడీపీ 6.5 శాతం ఉంటుందని ఆర్బీఐ అంచనావేసింది. క్యూ1లో 8 శాతం, క్యూ2లో 6.5 శాతం, క్యూ3లో 6 శాతం, క్యూ4లో 5.7 శాతంగా అంచనా వేసింది. 2024–25 మొదటి త్రైమాసికంలో వృద్ధిరేటు 6.6 శాతంగా అంచనాకు వచి్చంది. 7.8 శాతం వృద్ధి అంటే... 2011–12ని బేస్ ఇయర్గా తీసుకుని ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేస్తూ లెక్కిస్తే, 2022–23 మొదటి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి విలువ రూ.37.44 లక్షల కోట్లు. 2023–24 ఇదే కాలంలో ఈ విలువ రూ.40.37 లక్షల కోట్లకు ఎగసింది. అంటే వృద్ధి 7.8 శాతం పెరిగిందన్నమాట. కాగా ద్రవ్యోల్బణం సర్దుబాటు చేయని (ప్రస్తుత ధరల ప్రాతిపదిక) జీడీపీ వృద్ధి రేటు 8 శాతంగా ఉంది. విలువల్లో రూ.65.42 లక్షల కోట్ల నుంచి రూ.70.67 లక్షల కోట్లకు పెరిగింది. ► 2022–23 క్యూ1లో జీడీపీ వృద్ధి రేటు 13.1 శాతంగా ఉంది. అయితే దీనికి లో బేస్ ఎఫెక్ట్ ఒక కారణం. అంటే కరోనా కష్టకాలం 2021–22 ఇదే కాలంలో చేటుచేసుకున్న అతి తక్కువ గణాంకాలు 2022–23 క్యూ1లో అధిక రేటు (శాతాల్లో) నమోదుకు దోహదపడ్డాయి. ► తాజా గణాంకాలకు ముందు త్రైమాసికం అంటే జనవరి–మార్చి మధ్య జీడీపీ విలువ 6.1% కాగా, అంతక్రితం త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్)ఈ రేటు 4.5%. అంటే సమీక్షా కాలంసహా అంతక్రితం గత 3 త్రైమాసికాల్లో వృద్ధి రేటు పెరుగుతూ వచి్చందన్నమాట. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన జీవీఏ (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్– స్థూల విలువ జోడింపు అనేది ఆర్థిక వ్యవస్థలోని పరిశ్రమ, రంగం, తయారీదారు, ప్రాంతం లేదా ప్రాంతం ద్వారా ఉత్పత్తి అయిన వస్తువులు, సేవల విలువ. ఉత్పత్తి వ్యయాలను ఇందులో చేర్చరు) ప్రకారం వివిధ రంగాల వృద్ధి తీరును పరిశీలిస్తే.. జూలైలో మౌలిక రంగం ఓకే... ఎనిమిది రంగాల భారత్ మౌలిక పరిశ్రమ జూలైలో మంచి పనితీరును కొనసాగించింది. బొగ్గు , క్రూడ్ ఆయిల్, సహజ వాయువు, స్టీల్, సిమెంట్, విద్యుత్, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువుల రంగాలు వీటిలో ఉన్నాయి. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో వీటి వెయిటేజ్ 40.27 శాతం. ఐఐపీ జూలై డేటా సెపె్టంబర్ రెండవ వారం మొదట్లో వెలువడుతుంది. ఇక ఏప్రిల్ నుంచి జూలై వరకూ మౌలిక పరిశ్రమ వృద్ధి రేటు 6.4 శాతంగా ఉంది. కాగా, జూన్లో మౌలిక రంగం వృద్ధి రేటు 8.3 శాతం కావడం గమనార్హం. 2022 ఏప్రిల్–జూలై మధ్య ఈ రేటు 11.5 శాతం. జూలైలో మౌలిక రంగం ఓకే... ఎనిమిది రంగాల భారత్ మౌలిక పరిశ్రమ జూలైలో మంచి పనితీరును కొనసాగించింది. బొగ్గు , క్రూడ్ ఆయిల్, సహజ వాయువు, స్టీల్, సిమెంట్, విద్యుత్, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువుల రంగాలు వీటిలో ఉన్నాయి. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో వీటి వెయిటేజ్ 40.27 శాతం. ఐఐపీ జూలై డేటా సెపె్టంబర్ రెండవ వారం మొదట్లో వెలువడుతుంది. ఇక ఏప్రిల్ నుంచి జూలై వరకూ మౌలిక పరిశ్రమ వృద్ధి రేటు 6.4 శాతంగా ఉంది. కాగా, జూన్లో మౌలిక రంగం వృద్ధి రేటు 8.3 శాతం కావడం గమనార్హం. 2022 ఏప్రిల్–జూలై మధ్య ఈ రేటు 11.5 శాతం. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 6.5% వృద్ధి సాధించే సత్తా భారత్కు ఉంది. ధరల కట్టడికి ప్రభుత్వం, ఆర్బీఐ తగిన చర్యలు తీసుకుంటున్నాయి. అందువల్ల ద్రవ్యోల్బణం భయాలు అక్కర్లేదు. – వి. అనంత నాగేశ్వరన్, చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ -
హైదరాబాద్లో పెరిగిన ఇళ్ల ధరలు
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల ధరలు జూన్ త్రైమాసికంలో 6.9 శాతం పెరిగినట్టు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్హెచ్బీ) విడుదల చేసిన ‘హౌసింగ్ ప్రెస్ ఇండెక్స్’ డేటా తెలియజేస్తోంది. దేశవ్యాప్తంగా 43 పట్టణాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. కరోనా ముందు నాటితో పోలిస్తే గృహ రుణాల రేట్లు ఇప్పటికీ తక్కువగానే ఉన్నాయని, దీంతో ఇళ్ల ధరల అందుబాటు ఆరోగ్యకర స్థాయిలో ఉన్నట్టు ఎన్హెచ్బీ నివేదిక తెలిపింది. అహ్మదాబాద్లో ఇళ్ల ధరలు 9.1 శాతం పెరగ్గా, బెంగళూరులో 8.9 శాతం, కోల్కతాలో 7.8 శాతం చొప్పున ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఎగిశాయి. చెన్నైలో 1.1 శాతం, ఢిల్లీలో 0.8 శాతం, ముంబైలో 2.9 శాతం, పుణేలో 6.1 శాతం చొప్పున ఇళ్ల ధరలు పెరిగాయి. ఎన్హెచ్బీ హౌసింగ్ ప్రైస్ ఇండెక్స్ 50 పట్టణాల్లోని ప్రాపర్టీల విలువల సమాచారాన్ని బ్యాంక్లు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల నుంచి తీసుకుని ప్రతి త్రైమాసికానికి నివేదిక విడుదల చేస్తుంటుంది. మొత్తం మీద 50 పట్టణాల్లో ఇళ్ల ధరలు జూన్ క్వార్టర్లో, క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చనప్పుడు 4.8 శాతం వృద్ధి చెందాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఇళ్ల రేట్ల పెరుగుదల 7 శాతంగా ఉండడం గమనార్హం. ఇక ఈ ఏడాది మార్చి త్రైమాసికంతో పోల్చి చూసినప్పుడు 50 పట్టణాల్లో ఇళ్ల ధరలు 0.7 శాతం పెరిగాయి. 2021 జూన్ నుంచి ప్రతీ త్రైమాసికంలోనూ ఇళ్ల ధరల సూచీ పెరుగుతూ వస్తోందని ఎన్హెచ్బీ నివేదిక వెల్లడించింది. -
ఎంఆర్ఎఫ్కు ఎక్స్ప్రెస్ లాభాలు
న్యూఢిల్లీ: టైర్ల రంగంలో అగ్రగామి సంస్థ ఎంఆర్ఎఫ్ జూన్తో అంతమైన మూడు నెలల కాలంలో తన పనితీరును గణనీయంగా మెరుగుపరుచుకుంది. కన్సాలిడేటెడ్ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంలో పోలిస్తే ఐదు రెట్లు పెరిగి రూ.589 కోట్లకు దూసుకుపోయింది. కన్సాలిడేటెడ్ ఆదాయం సైతం రూ.6,440 కోట్లకు వృద్ధి చెందింది. క్రితం ఏడాది ఇదే కాలానికి లాభం రూ.123 కోట్లు, ఆదాయం రూ.5,696 కోట్ల చొప్పున ఉన్నాయి. ముఖ్యంగా ముడిసరుకుల వ్యయాలు తగ్గడం కలిసొచి్చంది. ముడి సరుకులపై చేసిన వ్యయాలు రూ.3,781 కోట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ముడి సరుకుల కోసం అయిన వ్యయాలు రూ.4,114 కోట్లుగా ఉండడం గమనార్హం. వ్యయాలు రూ.5,567 కోట్ల నుంచి రూ.5,728 కోట్లకు పెరిగాయి. ఎండీగా ఉన్న కేఎం మామెన్ను చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా 2024 ఫిబ్రవరి 8 నుంచి ఐదేళ్ల కాలానికి నియమిస్తూ కంపెనీ బోర్డ్ నిర్ణయం తీసుకుంది. విమలా అబ్రహాంను ఇండిపెండెంట్ డైరెక్టర్గా రెండో విడత మరో ఐదేళ్ల కాలానికి నియమించింది. -
లాభాల్లోకి జొమాటో
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ జొమాటో మొదటిసారి ఓ త్రైమాసికంలో లాభాలను నమోదు చేసింది. జూన్తో అంతమైన మూడు నెలల కాలానికి రూ.2 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభం నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో సంస్థ రూ.186 కోట్లు నష్టపోవడం గమనార్హం. కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.1,414 కోట్ల నుంచి రూ.2,416 కోట్లకు చేరింది. వ్యయాలు సైతం రూ.1,768 కోట్ల నుంచి రూ.2,612 కోట్లకు పెరిగాయి. ఈ ఫలితాల్లో బ్లింకిట్ గణాంకాలు సైతం కలిసే ఉన్నాయి. విడిగా ఫుడ్ డెలివరీ ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.1,470 కోట్ల నుంచి రూ.1,742 కోట్లకు పెరిగింది. హైపర్ ప్యూర్ ఆదాయం రూ.273 కోట్ల నుంచి రూ.617 కోట్లకు పెరిగింది. బ్లింకిట్ ఆదాయం రూ.164 కోట్ల నుంచి రూ.384 కోట్లకు పెరిగింది. వ్యాపారం పెద్ద సంక్లిష్టతలు లేకుండా నిర్వహించేందుకు తాము ఎంతో కష్టపడి పనిచేస్తున్నట్టు జొమాటో వ్యవస్థాపకుడు, ఎండీ, సీఈవో దీపిందర్ గోయల్ వాటాదారులకు రాసిన లేఖలో తెలిపారు. వచ్చే నాలుగు త్రైమాసికాల్లో మొత్తం వ్యాపారం వ్యాప్తంగా లాభాలను ఆర్జిస్తామని ప్రకటించారు. ఇక ముందు తమ వ్యాపారం లాభసాటిగానే కొనసాగుతుందని జొమాటో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అక్షంత్ గోయల్ తెలిపారు. వచ్చే కొన్నేళ్లపాటు తాము ఏటా 40 శాతానికి పైగా ఆదాయంలో వృద్ధిని సాధిస్తామని ప్రకటించారు. వచ్చే పదేళ్లలో జొమాటో కంటే బ్లింకిట్ వాటాదారులకు ఎక్కువ విలువ తెచ్చి పెడుతుందని దీపిందర్ గోయల్ పేర్కొన్నారు. కొన్ని పట్టణాల్లో జొమాటో స్థూల ఆర్డర్ విలువ సమీపానికి బ్లింకిట్ స్థూల ఆర్డర్ విలువ చేరినట్టు చెప్పారు. వృద్ధిని కొనసాగించేందుకు, తాము విజయం సాధిస్తామనుకున్న కొత్త వ్యాపార అవకాశాలను పరిశీలిస్తూనే ఉంటామన్నారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో జొమాటో షేరు 2 శాతం లాభపడి రూ.86 వద్ద ముగిసింది. -
ఇక్రా రేటింగ్స్ ఫలితాలు ఆకర్షణీయం
ముంబై: దేశీయంగా రెండో అతిపెద్ద రేటింగ్ ఏజెన్సీ ‘ఇక్రా రేటింగ్స్’ జూన్తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించి ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 88 శాతం వృద్ధితో రూ.40.6 కోట్లకు చేరుకుంది. ఆదాయం 11 శాతం వృద్ధితో రూ.103 కోట్లకు చేరింది. రేటింగ్ ఆదాయం 16 శాతం పెరిగింది. అనలైటిక్స్ విభాగంలో ఆదాయ వృద్ధి 4.4 శాతంగా ఉంది. క్రెడిట్ మార్కెట్లో సందడి నెలకొందని, బాండ్ల ఇష్యూలు, బ్యాంక్ క్రెడిట్ విభాగాల్లో మంచి వృద్ధి కనిపించినట్టు ఇక్రా రేటింగ్స్ తెలిపింది. గతేడాది ఇదే త్రైమాసికంలో లోబేస్ (క్షీణత) ఉండడం, ఈల్డ్ మోస్తరుగా ఉండడం బలమైన పనితీరుకు దోహదపడినట్టు వివరించింది. సవాళ్లతో కూడిన వాతావరణంలోనూ అనలైటిక్స్ వ్యాపారం వృద్ధి సాధించిందని, ఈ విభాగంపై తాము ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్టు ఇక్రా రేటింగ్స్ ఎండీ రామ్నాథ్ కృష్ణన్ పేర్కొన్నారు. జూన్ త్రైమాసికంలో పరిశోధను విస్తరించామని, మౌలిక సదుపాయాలు, రోడ్లు, జాతీయ రహదారులు, స్టీల్, బ్యాంకింగ్ రంగాలపై ప్రధానంగా దృష్టి సారించినట్టు తెలిపారు. -
గోద్రేజ్ ప్రాపర్టిస్ లాభం మూడింతలు
న్యూఢిల్లీ: గోద్రేజ్ ప్రాపర్టిస్ జూన్తో ముగిసిన త్రైమాసికానికి రూ.125 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.45 కోట్లతో పోల్చి చూసినప్పుడు మూడు రెట్లు వృద్ధి చెందింది. కొత్త బుకింగ్లు (ఇళ్లు/ఫ్లాట్లు) 11 శాతం తగ్గి జూన్ త్రైమాసికంలో రూ.2,254 కోట్లుగా ఉన్నాయి. బుకింగ్ల పరిమాణం సైతం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పడు 20 శాతం తగ్గి 2.25 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.426 కోట్ల నుంచి రూ1,266 కోట్లకు దూసుకుపోయింది. ఎన్సీడీలు, బాండ్లను ప్రైవేటు ప్లేస్మెంట్ విధానంలో జారీ చేయడం ద్వారా రూ.2,000 కోట్లను సమీకరించాలని కంపెనీ నిర్ణయించింది. జూన్ త్రైమాసికంలో 4.9 మిలియన్ చదరపు అడుగుల పరిమాణంలో ఇళ్లను కస్టమర్లకు అందించింది. లక్ష్యం దిశగానే.. ‘‘బుకింగ్ల పరంగా ఇది స్తబ్దతతో కూడిన త్రైమాసికం. డెలివరీలు, వ్యాపార అభివృద్ధి, నగదు వసూళ్లు అన్నీ కూడా జూన్ క్వార్టర్లో మంచి వృద్ధిని చూశాయి. బలమైన కొత్త ప్రాజెక్టుల ఆరంభ ప్రణాళికలు, బలమైన బ్యాలన్స్ షీట్, చెక్కుచెదరని డిమాండ్ ఇవన్నీ కలసి 2023–24 సంవత్సరంలో రూ.14,000 కోట్ల బుకింగ్ల లక్ష్యాన్ని చేరుకునే దిశలోనే ఉన్నాం’’అని గోద్రేజ్ ప్రాపర్టిస్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ పిరోజ్షా గోద్రేజ్ తెలిపారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2022–23) గోద్రేజ్ ప్రాపర్టీస్ రూ.12,232 కోట్ల విలువైన ఇళ్లను విక్రయించడం గమనార్హం. జూన్లో నమోదైన తాజా బుకింగ్లలో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్లో రూ.656 కోట్లు, ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో రూ.548 కోట్లు, బెంగళూరు మార్కెట్లో రూ.509 కోట్లు, పుణె మార్కెట్లో రూ.446 కోట్ల చొప్పున ఉన్నాయి. ఈ నాలుగు మార్కెట్లలో గోద్రేజ్ ప్రాపర్టీస్ వ్యాపార కార్యకలాపాలు ఎక్కువగా ఉన్నాయి. జయశ్రీ వైద్యనాథన్ను అడిషనల్ డైరెక్టర్గా కంపెనీ నియమించింది. -
ఐదేళ్ల గరిష్టానికి పీనోట్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: పార్టిసిపేటరీ నోట్ల (పీనోట్లు) ద్వారా దేశీయ క్యాపిటల్ మార్కెట్లలో పెట్టుబడులు జూన్ చివరికి రూ.1,11,291 కోట్లకు చేరాయి. దేశ ఈక్విటీ, డెట్, హైబ్రిడ్ సెక్యూరిటీల్లో (క్యాపిటల్ మార్కెట్లు) కలిపి ఈ మేరకు పెట్టుబడులు ఉన్నాయి. ఐదున్నరేళ్లలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. మే చివరికి పీ నోట్ల పెట్టుబడుల విలువ రూ.1,04,585 కోట్లుగా ఉంది. స్థూల ఆర్థిక అంశాలు స్థిరంగా ఉండడం ఇందుకు మద్దతుగా నిలిచిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పీనోట్ల పెట్టుబడుల విలువ పెరగడం వరుసగా నాలుగో నెలలోనూ నమోదైనట్టు సెబీ గణాంకాలు స్పస్టం చేస్తున్నాయి. సెబీ వద్ద నమోదు చేసుకున్న విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) భారత మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే విదేశీ ఇన్వెస్టర్లకు పీనోట్లను జారీ చేస్తుంటారు. సెబీ వద్ద నమోదు చేసుకోకుండా పీ నోట్ల ద్వారా ఇన్వెస్ట్ చేసుకునే వెసులుబాటు ఉంది.పీ నోట్ జారీ చేసే ఎఫ్పీఐలు ఇందుకు సంబంధించి సెబీ నిబంధనలు, మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఏప్రి ల్ చివరికి పీ నోట్ల పెట్టుబడుల విలువ రూ. 95, 911 కోట్లుగా ఉంటే, మార్చి చివరికి రూ. 88,600 కోట్లు, ఫిబ్రవరి చివరికి రూ.88,398 కో ట్లు, జనవరి చివరికి రూ.91,469 కోట్ల చొప్పున ఉంది. బలమైన పనితీరు వల్లే.. సాధారణంగా ఎఫ్పీఐల పెట్టుబడుల ధోరణికి అనుగుణంగానే పీనోట్ల పెట్టుబడులు కూడా ఉంటుంటాయి. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశి్చతులు నెలకొన్న సమయంలో భారత్ ఆర్థిక వ్యవస్థ స్థిరమైన పనితీరు చూపిస్తుండడం పీ నోట్ పెట్టుబడుల వృద్ధికి దోహదపడినట్టు మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జూన్ చివరికి ఉన్న రూ.1.11 లక్షల కోట్లలో ఈక్విటీల్లోనే రూ.1,00,701 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. డెట్లో రూ.12,382 కోట్లు, హైబ్రిడ్ సెక్యూరిటీల్లో పెట్టుబడులు రూ.203 కోట్లుగా ఉన్నాయి. జూన్ చివరికి ఎఫ్పీఐల నిర్వహణలోని పెట్టుబడులు రూ.55.63 లక్షల కోట్లకు చేరాయి. మరోవైపు భారత ఈక్విటీల్లో ఎఫ్పీఐల పెట్టుబడులు పది నెలల గరిష్ట స్థాయి అయిన రూ.47,184 కోట్లకు జూన్ నెలలో చేరాయి. అదే నెలలో డెట్మార్కెట్లో ఎఫ్పీఐలు రూ.9,200 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. -
హైబ్రిడ్ పథకాల పట్ల ఆకర్షణ
న్యూఢిల్లీ: హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ పథకాలకు ఇన్వెస్టర్లు ప్రాధాన్యం ఇస్తున్నారు. జూన్ క్వార్టర్లో రూ.14,021 కోట్లను ఈ పథకాల్లో ఇన్వెస్ట్ చేసినట్టు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీని వెనుక ప్రభుత్వం ఇటీవల తీసుకొచి్చన నూతన పన్ను నిబంధన కారణమని తెలుస్తోంది. క్రితం ఏడాది ఏప్రిల్–జూన్ కాలంలో హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్లోకి వచి్చన పెట్టుబడులు రూ.10,084 కోట్లుగా ఉన్నాయి. అంటే సమారు 40 శాతం మేర పెట్టుబడులు పెరిగాయి. హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ పథకాలు ఈక్విటీ, డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో బంగారం తదితర సాధనాల్లోనూ కొంత మేర పెట్టుబడులు పెడతాయి. హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ పథకాల ఫోలియోలు (ఇన్వెస్టర్ల పెట్టుబడి ఖాతాలు) కూడా పెరిగాయి. మధ్యస్థం నుంచి తక్కువ రిస్క్ తీసుకునే వారికి హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. ఈక్విటీ, డెట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్ కాస్త తగ్గుతుంది. మరీ ముఖ్యంగా ఈ ఏడాది మార్చితో ముగిసిన మూడు నెలల కాలంలో ఇవే హైబ్రిడ్ ఫథకాల నుంచి ఇన్వెస్టర్లు రూ.7,420 కోట్లను నికరంగా ఉపసంహరించుకోవడం గమనార్హం. గత డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలోనూ రూ.7,041 కోట్లు, సెపె్టంబర్ త్రైమాసికంలో రూ.14,436 కోట్ల చొప్పున ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. 2021 డిసెంబర్ త్రైమాసికం తర్వాత హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్లోకి గరిష్ట స్థాయిలో పెట్టుబడులు రావడం మళ్లీ జూన్ త్రైమాసికంలోనే నమోదైంది. పన్ను పరమైన అనుకూలత హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి పెట్టుబడులు రావడం వెనుక పన్ను పరమైన ప్రయోజనాన్ని నిపుణులు ప్రస్తావిస్తున్నారు. డెట్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులను మూడేళ్లపాటు కొనసాగిస్తే వచి్చన లాభం నుంచి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించి చూపించుకునే అవకాశం ఉండేది. దీంతో పన్ను భారం తక్కువగా ఉండేది. కానీ, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచి్చన నిబంధనల ప్రకారం డెట్ ఫండ్స్లో పెట్టుబడుల కాల వ్యవధితో సంబంధం లేకుండా లాభం వార్షిక ఆదాయంలో భాగంగా చూపించి పన్ను చెల్లించడం తప్పనిసరి. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించుకునే వెసులుబాటు రద్ధు చేశారు. దీంతో ఆవి ఆకర్షణను కోల్పోయాయి. డెట్ పథకాలకు సంబంధించి పన్ను నిబంధనలో మార్పు హైబ్రిడ్ పథకాల్లోకి పెట్టుబడులు పెరిగేందుకు కారణమైనట్టు క్లయింట్ అసోసియేట్స్ సహ వ్యవస్థాపకుడు హిమాన్షు కోహ్లి తెలిపారు. ‘‘ఆర్బిట్రేజ్ ఫండ్స్లో వార్షిక రాబడి 7 శాతంగా ఉంటుంది. డెట్ ఫండ్స్తో పోలిస్తే పన్ను పరంగా అనుకూలమైనది. అందుకే ఈ విభాగంలో మరింత ఆదరణ కనిపిస్తోంది’’ అని వివరించారు. డెట్ ఫండ్స్పై పన్ను నిబంధన మారిపోవడంతో ఇన్వెస్టర్లు హైబ్రిడ్ పథకాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు మారి్నంగ్స్టార్ రీసెర్చ్ మేనేజర్ కౌస్తభ్ బేల పుర్కార్ తెలిపారు. ఆర్బిట్రేజ్ ఫండ్స్ తక్కువ అస్థిరతలతో, ఈక్విటీ పన్ను ప్రయోజనం కలిగి ఉండడం ఆకర్షణీయమైనదిగా పేర్కొన్నారు. హైబ్రిడ్ పథకాల్లో లాభాలకు ఈక్విటీ మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది కనుక తక్కువ పన్ను అంశం ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోందని తెలుస్తోంది. -
ఎన్టీపీసీ లాభం రూ.4,907 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ విద్యుదుత్పత్తి సంస్థ ఎన్టీపీసీ జూన్తో ముగిసిన త్రైమాసికానికి రూ.4,907 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.3,978 కోట్లతో పోలిస్తే 23 శాతం వృద్ధి చెందింది. ఆదాయం మాత్రం రూ.43,561 కోట్ల నుంచి రూ.43,390 కోట్లకు తగ్గింది. జూన్ క్వార్టర్లో 103.98 బిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉత్పత్తి 104.42 బిలియన్ యూనిట్లుగా ఉంది. కోల్ ప్లాంట్లలో లోడ్ ఫ్యాక్టర్ 77.43 శాతంగా ఉంది. -
ఐడీఎఫ్సీ ఫస్ట్ ఫలితాలు ఆకర్షణీయం
ముంబై: ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ జూన్ త్రైమాసికానికి మెరుగైన ఫలితాలను ప్రకటించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చనప్పుడు 61 శాతం వృద్ధితో రూ.765 కోట్లకు దూసుకుపోయింది. క్రితం ఏడాది ఇదే కాలానికి నికర లాభం రూ.474 కోట్లుగానే ఉంది. నికర వడ్డీ ఆదాయం 36 శాతం వృద్ధితో రూ.3,745 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంలో వడ్డీ ఆదాయం రూ.2,571 కోట్లుగా ఉంది. నిర్వహణ లాభం 45 శాతం వృద్ధితో రూ.1,427 కోట్లకు పెరిగినట్టు బ్యాంక్ తెలిపింది. రుణ ఆస్తుల నాణ్యత కూడా మెరుగుపడింది. స్థూల ఎన్పీఏలు 2.17 శాతానికి తగ్గాయి. ఇవి క్రితం ఏడాది ఇదే త్రైమాసికం చివరికి 3.36%గా ఉంటే, ఈ ఏడాది మార్చి చివరికి 2.51 శాతంగా ఉండడం గమనా ర్హం. నికర ఎన్పీఏలు 0.70 శాతానికి పరిమితమయ్యాయి. ‘‘46.5% కాసా రేషియోతో బలమైన ఫ్రాంచైజీని నిర్మిస్తున్నాం. బలమైన బ్రాండ్, విలువలు, కస్టమర్ అనుకూలమైన ఉత్పత్తులు, డిజిటల్ ఆవిష్కరణలతో మా రిటైల్ డిపాజిట్లు చక్కగా వృద్ధి చెందుతున్నాయి’’అని ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఎండీ, సీఈవో వి.వైద్యనాథన్ తెలిపారు. ఫండెడ్ అసెట్స్ (రాబడినిచ్చే ఆస్తులు) 25% వృద్ధితో రూ.1,71,578 కోట్లకు పెరిగాయి. మొత్తం రుణ ఆస్తుల్లో ఇన్ఫ్రా రుణాలు 2.2 శాతానికి తగ్గాయి. -
ఫ్లాట్గా వెంచర్ క్యాపిటల్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: భారతీయ కంపెనీలు జూన్ క్వార్టర్లో 8 బిలియన్ డాలర్ల వీసీ నిధులను సంపాదించాయి. మార్చి త్రైమాసికంతో పోలిస్తే పెరగ్గా, క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే స్తబ్దుగానే ఉన్నట్టు కేపీఎంజీ నివేదిక తెలిపింది. టాప్ డీల్స్లో బైజూస్ 700 మిలియన్ డాలర్లు, లెన్స్కార్ట్ 600 మిలియన్ డాలర్లు, ట్రూబ్యాలన్స్ 168 మిలియన్ డాలర్ల సమీకరణ ఉన్నాయి. ఫిన్టెక్, ఎడ్యుటెక్, గేమింగ్ కంపెనీలు దేశంలో ఎక్కువ వీసీ నిధులను ఆకర్షించాయి. ఆ తర్వాత అగ్రిటెక్ కూడా వీసీ ఇన్వెస్టర్ల ప్రాధాన్య క్రమంలో ఉంది. ఈ వివరాలను కేపీఎంజీ సంస్థ ‘వెంచర్పల్స్ క్యూ 2023’ పేరుతో విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. అంతర్జాతీయంగా వెంచర్ క్యాపిటల్ (వీసీ) పెట్టుబడులు జూన్ త్రైమాసికంలో స్వల్పంగా తగ్గి 77.4 బిలియన్ డాలర్లుగా (రూ.6.34 లక్షల కోట్లు) ఉన్నాయి. మొత్తం 7,783 డీల్స్ నమోదయ్యాయి. అంతర్జాతీయంగా అనిశి్చత పరిస్థితుల్లోనూ భారీ డీల్స్కు ఇన్వెస్టర్ల నుంచి మద్దతు ఉందని ఈ నివేదిక తెలిపింది. అమెరికాకు చెందిన స్ట్రైప్ 6.8 బిలియన్ డాలర్లను జూన్ త్రైమాసికంలో సంపాదించింది. సింగపూర్కు చెందిన షీన్ 2 బిలియన్ డాలర్లు, అమెరికాకు చెందిన ఏఐ స్టార్టప్ ఇన్ఫ్లెక్షన్ 1.3 బిలియన్ డాలర్ల నిధులను సొంతం చేసుకున్నాయి. కొత్త నిధుల సమీకరణ విషయంలో ప్రముఖ వీసీ సంస్థలు కొంత వేచి చూసే ధోరణితో ఉన్నట్టు కేపీఎంజీ నివేదిక తెలిపింది. అంతర్జాతీయంగా అధిక ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ అస్థిరతలు, వడ్డీ రేట్లను ఇంకా పెంచే అవకాశాలు ఉండడంతో సవాళ్లు ఇప్పట్లో ముగిసే పరిస్థితులు కనిపించడం లేదని ఈ నివేదిక అభిప్రాయపడింది. -
కోటక్ బ్యాంక్ పనితీరు భేష్
ముంబై: కోటక్ మహీంద్రా బ్యాంక్ జూన్ త్రైమాసికంలో బలమైన పనితీరు చూపించింది. స్టాండలోన్ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 67 శాతం వృద్ధితో రూ.3,452 కోట్లకు చేరుకుంది. కన్సాలిడేటెడ్గా చూసుకుంటే (బీమా, ఏఎంసీ, బ్రోకరేజీ తదితర వ్యాపారాలు కలిసిన) నికర లాభం 51 శాతం పెరిగి రూ.4,150 కోట్లుగా నమోదైంది. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 33 శాతం వృద్ధితో రూ.6,234 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్ 5.57 శాతంగా నమోదైంది. ఆర్బీఐ గతేడాది మే నుంచి రెపో రేటును 2.5 శాతం మేర పెంచగా, ఈ మొత్తాన్ని రుణగ్రహీతలకు బ్యాంక్ బదలాయించింది. కానీ, అదే సమయంలో డిపాజిట్లపై బదిలీ చేసిన ప్రయోజనం ఇంతకంటే తక్కుగానే ఉండడం గమనార్హం. అయితే డిపాజిట్లపై రేట్ల సవరణ ప్రభావం దృష్ట్యా నికర వడ్డీ మార్జిన్ ప్రస్తుత స్థాయిలో కొనసాగడం కష్టమేనని బ్యాంక్ డిప్యూటీ ఎండీ దీపక్ గుప్తా పేర్కొన్నారు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర వడ్డీ మార్జిన్ 5.25 శాతంగా ఉండొచ్చన్నారు. ఫీజుల ఆదాయంలో వృద్ధి : ఫీజులు, సేవల ఆదాయం 20 శాతం పెరిగి రూ.1,827 కోట్లుగా నమోదైంది. కాసా రేషియో 49 శాతానికి చేరుకుంది. మార్కెట్ గెయిన్ రూపంలో రూ.240 కోట్ల మొత్తం సమకూరింది. బ్యాంకు రుణాలు 19 శాతం పెరిగి రూ.3,37,031 కోట్లకు చేరాయి. అన్సెక్యూర్డ్ రిటైల్ రుణాలు (మైక్రోఫైనాన్స్ సహా) మొత్తం రుణాల్లో 10.7 శాతానికి పెరిగాయి. క్రెడిట్ కార్డుల రూపంలో రుణ పుస్తకంపై కొంత ఒత్తిడి ఉన్నట్టు దీపక్ గుప్తా తెలిపారు. అయినప్పటికీ ఈ విభాగం రెండంకెల వృద్ధిని సాధిస్తుందని చెప్పారు. ఇప్పటి వరకైతే ఈ విభాగం విషయంలో సౌకర్యంగానే ఉన్నట్టు తెలిపారు. రుణ ఆస్తుల నాణ్యత మెరుగు బ్యాంకు రుణ ఆస్తుల నాణ్యత కొంత మెరుగుపడింది. స్థూల ఎన్పీఏలు 1.77 శాతానికి (రూ.6,587కోట్లు) తగ్గాయి. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో ఇవి 2.24 శాతంగా ఉన్నాయి. ఇక నికర ఎన్పీఏలు 0.40 శాతానికి పరిమితమయ్యాయి. ఇవి క్రితం ఏడాది ఇదే కాలంలో 0.62 శాతంగా ఉన్నాయి. తాజాగా ముగిసిన జూన్ త్రైమాసికంలో రూ.1,205 కోట్లు ఎన్పీఏలుగా మారాయి. -
ఆఫీస్ లీజింగ్లో స్తబ్ధత
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏడు ప్రముఖ పట్టణాల్లో ఆఫీసు లీజ్ మార్కెట్ జూన్ త్రైమాసికంలో బలహీన పనితీరు చూపించింది. మొత్తం ఆఫీసు లీజు విస్తీర్ణం 6 శాతం క్షీణించి 13.9 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. ఏడు ప్రముఖ పట్టణాల్లో స్థూల ఆఫీస్ లీజు క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో 14.8 మిలియన్ చదరపు అడుగులుగా ఉండడం గమనార్హం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సంయక్తంగా 8.2 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ లీజును నమోదు చేశాయి. ఈ మూడు మార్కెట్లు సంయుక్తంగా 59 శాతం వాటాను ఆక్రమించాయి. ఏప్రిల్–జూన్ త్రైమాసికంపై రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ‘వెస్టియన్’ ఓ నివేదికను విడుదల చేసింది. అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో దేశీయంగా పెద్ద సంస్థలు, ఎంఎన్సీలు నిర్ణయాలు తీసుకోవడంలో నెలకొన్న జాప్యమే ఈ పరిస్థితికి కారణమని వెస్టియన్ నివేదిక పేర్కొంది. కాకపోతే మార్చి త్రైమాసికంలో పోలిస్తే, జూన్ క్వార్టర్లో ఏడు పట్టణాల్లో ఆఫీస్ స్పేస్ లీజు డిమాండ్ 17 శాతం పెరిగినట్టు వెల్లడించింది. జూన్ త్రైమాసికంలో ఆఫీస్ స్పేస్ వినియోగం, కొత్త వసతుల పూర్తి పెరిగినట్టు వెస్టియన్ సీఈవో శ్రీనివాసరావు తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరు ఆఫీస్ మార్కెట్పై ప్రభావం చూపిస్తున్నట్టు చెప్పారు. టెక్నాలజీ రంగం ముందు ఆఫీస్ స్పేస్ లీజులో టెక్నాలజీ రంగం ముందున్నట్టు వెస్టియన్ తెలిపింది. ఆ తర్వాత ఇంజనీరింగ్, తయారీ రంగం నుంచి డిమాండ్ ఉందని.. ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్లోనూ కదలిక వచ్చినట్టు వివరించింది. సెపె్టంబర్ త్రైమాసికానికి సంబంధించి నియామకాల ఉద్దేశ్యాలు మెరుగుపడినట్టు, దేశ వృద్ధి అవకాశాల పట్ల ఆశావహ పరిస్థితికి ఇది నిదర్శనమని పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లు స్థిరపడితే ద్వితీయ ఆరు నెలల కాలంలో భారత్లో రియల్ ఎసేŠట్ట్ కార్యకలాపాల్లో చురుకుదనం కనిపించొచ్చని అంచనా వేసింది. పట్టణాల వారీగా.. ► విడిగా చూస్తే హైదరాబాద్ ఆఫీస్ లీజు మార్కెట్లో 4 శాతం క్షీణత కనిపించింది. 2.3 మిలియన్ చదరపు అడుగులకు పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 2.4 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ► చెన్నై మార్కెట్లో 83 శాతం వృద్ధితో 1.2 నుంచి 2.2 మిలియన్ చదరపు అడుగులకు పెరిగింది. ► బెంగళూరులో 12 శాతం క్షీణించి 3.7 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. ► ముంబై మార్కెట్లో 25 శాతం క్షీణించి 1.8 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ► పుణెలో 6 శాతం పెరిగి 1.8 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది. ► ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లోనూ 5శాతం తక్కువగా 2 మిలియన్ చదరపు అడుగులకు ఆఫీస్ లీజు పరిమితమైంది. ► కోల్కతాలో ఏకంగా 88 శాతం క్షీణించి 0.1 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ► జూన్ త్రైమాసికంలో ఆఫీస్ లీజులో టెక్నాలజీ రంగం 26% వాటా ఆక్రమించింది. ఇంజనీరింగ్, తయారీ రంగం వాటా 19%గా ఉంటే, ఫ్లెక్సి బుల్ ఆఫీస్ స్పేస్ వాటా 18%గా నమోదైంది. ► ఈ ఏడాది జనవరి–జూన్ వరకు దేశవ్యాప్తంగా ఏడు పట్టణాల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 25.8 మిలియన్ చదరపు అడుగులుగా ఉంటే.. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై పట్టణాల వాటాయే 14.6 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. -
కొత్త పాలసీల ప్రీమియంలో కనిపించని వృద్ధి
ముంబై: జీవిత బీమా కంపెనీలు కొత్త పాలసీల ప్రీమియం రూపంలో జూన్తో ముగిసిన మూడు నెలల కాలంలో రూ.73,005 కోట్లను సమకూర్చుకున్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో వచి్చన ప్రీమియం ఆదాయం రూ.73,674 కోట్లతో పోల్చి చూస్తే నికరంగా 0.9 శాతం మేర క్షీణించింది. జీవిత బీమా రంగంలోనే దిగ్గజ సంస్థ అయిన ఎల్ఐసీపై ఎక్కువ ప్రభావం పడింది. క్రితం ఏడాది జూన్ త్రైమాసికంలో జీవిత బీమా కంపెనీల నూతన పాలసీల ప్రీమియం ఆదాయం 40 శాతం వృద్ధి చెందడం గమనార్హం. జూన్ క్వార్టర్లో ఎల్ఐసీ న్యూ బిజినెస్ ప్రీమియం ఆదాయం 7 శాతం క్షీణించి రూ.44,837 కోట్లకు పరిమితమైంది.(ఎస్బీఐ ఖాతాదారులకు అదిరిపోయే వార్త!) ఇండివిడ్యువల్ (వ్యక్తుల) సింగిల్ ప్రీమియం ఆదాయం 1.4 శాతం తగ్గి రూ.4,568 కోట్లుగా ఉంది. కానీ, క్రితం ఏడాది ఇదే కాలంలో ఎల్ఐసీ ఈ విభాగంలో 38 శాతం ప్రీమియం ఆదాయ వృద్ధిని నమోదు చేసింది. ఇండివిడ్యువల్ నాన్ సింగిల్ ప్రీమియం ఆదాయం 6.6 శాతం తగ్గి రూ.5,871 కోట్లుగా ఉంది. గ్రూప్ సింగిల్ ప్రీమియం 7.4 శాతం తగ్గి రూ.33,465 కోట్లుగా నమోదైంది. జూన్ త్రైమాసికం చివరి నెలలో మాత్రం ఎల్ఐసీ తొలి ఏడాది ప్రీమియం ఆదాయంలో 18.3 శాతం వృద్ధిని చూపించింది. మే నెలలో 4.1 శాతం క్షీణతతో పోలిస్తే మెరుగైన పనితీరు చూపించింది. ఇక ప్రైవేటు జీవిత బీమా సంస్థలు అన్నింటి నూతన ప్రీమియం ఆదాయం జూన్ క్వార్టర్లో 10.6 శాతం పెరిగి రూ.28,168 కోట్లుగా నమోదైంది. (నిజంగా భయంకరమే..! రేణూ దేశాయ్ అద్భుతమైన పిక్స్ వైరల్!) -
స్థిరీకరణకు అవకాశం
ముంబై: స్టాక్ సూచీలు జీవిత గరిష్ట స్థాయిల వద్ద ట్రేడవుతున్న తరుణంలో.., ఈ వారం కొంత స్థిరీకరణకు లోనయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లను వచ్చే సంకేతాలను అందిపుచ్చుకోవచ్చు. దేశీయంగా కీలక కంపెనీల జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాల విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్ల దృష్టి వాటిపై మళ్లనుంది. అలాగే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొత్త షేర్లు నేడు(సోమవారం) ఎక్చ్సేంజీల్లో లిస్ట్ కానున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు గురువారం(జూన్ 20న) ప్రారంభం కానున్నాయి. రుతు పవనాల పురోగతి వార్తలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, డాలర్ మారకంలో రూపాయి, క్రూడాయిల్ కదలికలు ట్రేడింగ్ను ప్రభావితం చేసే ఇతర అంశాలుగా ఉన్నాయి. ‘‘గరిష్ట స్థాయిల్లో స్వల్పకాలిక కన్సాలిడేషన్కు ఆస్కారం ఉంది. జూన్ క్వార్టర్ ఆర్థిక ఫలితాల విడుదల నేపథ్యంలో స్టాక్ ఆధారిత ట్రేడింగ్పై దృష్టి సారించడం శ్రేయస్కరం. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వహిస్తూ కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్లు చేయోచ్చు. సాంకేతికంగా నిఫ్టీకి 19650 వద్ద నిరోధం ఉంది. ఈ స్థాయిని చేధిస్తే 19770 వద్ద మరో కీలక నిరోధం ఎదురుకానుంది. లాభాల స్వీకరణ చోటు చేసుకుంటే దిగువ స్థాయిలో 19300 వద్ద తక్షణ మద్దతును కలిగి ఉంది’’ అని మాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అరవిందర్ సింగ్ నందా తెలిపారు. కంపెనీల తొలి క్వార్టర్ ఫలితాలపై ఆశాశహ అంచనాలు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస కొనుగోళ్లు, టోకు ధరలు దిగిరావడం, మార్కెట్లో అస్థిరత తగ్గడం తదితర సానుకూలాంశాలతో వరుసగా మూడోవారమూ సూచీలు లాభాలను ఆర్జించగలిగాయి. ఐటీ, మెటల్, రియల్టీ, ఫార్మా షేర్లు రాణించడంతో గత వారం మొత్తంగా సెన్సెక్స్ 781 పాయింట్లు, నిఫ్టీ 233 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. అలాగే వారాంతాన సెన్సెక్స్ 66,160 వద్ద, నిఫ్టీ 19,595 వద్ద కొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరుపై దృష్టి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తొలి త్రైమాసిక ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. అలాగే విలీన ప్రక్రియ పూర్తైన తర్వాత అర్హులైన హెచ్డీఎఫ్సీ వాటాదారులకు 311 కోట్లకు పైగా ఈక్విటీ షేర్లను జారీ చేసింది. తద్వారా హెచ్డీఎఫ్సీ షేర్హోల్డర్లు ఇప్పటికే వారు కలిగి ఉన్న షేర్లకు ప్రతి 25 షేర్లకు బదులుగా 42 హెచ్డీఎఫ్సీ షేర్లు అందనున్నాయి. కొత్త షేర్లు నేడు(సోమవారం) ఎక్చ్సేంజీల్లో లిస్ట్ కానున్నాయి. తాజాగా లిస్ట్ అవుతున్న షేర్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రస్తుత ఈక్విటీ షేర్లతో సమానంగా ఉంటాయని వెల్లడైంది. క్యూ1 ఆర్థిక ఫలితాలపై కన్ను కీలక కంపెనీలు తమ జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ఈ వారంలో ప్రకటించనున్నాయి. ఈ నేపథ్యంలో స్టాక్ ఆధారిత ట్రేడింగ్కు ఆస్కారం ఉంది. ఇండెక్సుల్లోని హెచ్డీఎఫ్ఎసీ బ్యాంక్, ఎల్టీఐమైండ్టీ కంపెనీల క్యూ1 ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ బుధవారం.., ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలివర్ గురువారం.., హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, ఆ్రల్టాటెక్ సిమెంట్, జేఎస్డబ్ల్యూ స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీలు శుక్రవారం తమ జూన్ క్వార్టర్ ఫలితాలను ప్రకటించనున్నాయి. అలాగే ఐసీఐసీఐ లాంబార్డ్, ఐసీసీఐ ప్రుడెన్షియల్, ఎల్అండ్టీ టెక్నాలజీ, టాటా కమ్యూనికేషన్స్, యూనిటెడ్ స్పిరిట్, కెన్ఫిన్ హోమ్స్, ఎంఫసిస్, టాటా ఎలాక్సీ, క్రిసిల్ కంపెనీలూ ఫలితాలను విడుదల చేసే జాబితాలో ఉన్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీల యాజమాన్యం చేసే అవుట్లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు నిశీతంగా పరిశీలించే వీలుంది. ప్రపంచ పరిణామాలు చైనా కేంద్ర బ్యాంకు సోమవారం కీలక వడ్డీరేట్లపై నిర్ణయాన్ని వెల్లడించనుంది. అలాగే ఆ దేశ రెండో క్వార్టర్ జీడీపీ డేటా వెల్లడి కానుంది. అమెరికా జూన్ రిటైల్ అమ్మకాలు, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు మంగవారం విడుదల అవుతాయి. బ్రిటన్, యూరోపియన్ యూనియన్ సీపీఐ ద్రవ్యోల్బణ డేటా బుధవారం, మరుసటి రోజు గురువారం కరెంట్ ఖాతా గణాంకాలు.., జపాన్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ వెల్లడి కానున్నాయి. జపాన్ ద్రవ్యోల్బణ గణాంకాలు శుక్రవారం విడుదల అవుతుంది. ఆయా దేశాల ఆర్థిక స్థితిగతులను వెల్లడించే స్థూల ఆర్థిక గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. కొనసాగిన ఎఫ్ఐఐల కొనుగోళ్లు దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ప్రవాహం జూలై ప్రథమార్థంలో కొనసాగింది. ఈ నెల తొలి భాగంలో రూ.30,600 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. దేశీయ కార్పొరేట్ ఆదాయాలు, స్థూల ఆర్థిక డేటా మెరుగ్గా నమోదవడం ఇందుకు కారణమయ్యాయి. కాగా మే, జూన్ నెలల్లో వరుసగా రూ.43,838 కోట్లు, రూ.47,148 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. ‘‘అంతర్జాతీయంగా డాలర్ క్షీణతతో ఎఫ్ఐఐల కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. బెంచ్మార్క్ సూచీలు ప్రస్తుతం జీవితకాల గరిష్టం వద్ద ట్రేడ్ అవుతున్నాయి. చైనాతో పోలిస్తే భారత ఈక్విటీల వ్యాల్యూయేషన్లు అధికంగా ఉన్నాయి. కావున చైనాలో అమ్మకం, భారత్లో కొనుగోలు విధానం విదేశీ ఇన్వెస్టర్లు ఎక్కువకాలం కొనసాగించకపోవచ్చు’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సరీ్వసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ వ్యూహకర్త వీకే విజయకుమార్ తెలిపారు. -
నిలకడగా ఆఫీస్ అద్దెలు.. హైదరాబాద్లో డౌన్
న్యూఢిల్లీ: ఆఫీసు అద్దెలు దేశవ్యాప్తంగా ఆరు ముఖ్య పట్టణాల్లో ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో స్థిరంగా ఉన్నట్టు కొలియర్స్ ఇండియా నివేదిక వెల్లడించింది. ఈ నివేదికలోని వివరాల ప్రకారం.. ఈ పట్టణాల్లో చదరపు అడుగు అద్దె సగటున రూ.95గా ఉంది. ఈ పట్టణాల్లో 32 శాతం అదనపు కార్యాలయ వసతి ఈ కాలంలో అందుబాటులోకి వచి్చంది. ఇక కార్యాలయ స్థలాల కోసం డిమాండ్ 2 శాతం పెరిగింది. హైదరాబాద్తో పాటు పుణె, బెంగళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాల వివరాలు ఈ నివేదికలో ఉన్నాయి. స్థూల ఆఫీసు స్పేస్ లీజు జూన్ క్వార్టర్లో క్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలో పోలి్చచూసినప్పుడు, 2 శాతం పెరిగి 14.6 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది. టెక్నాలజీ, ఇంజనీరింగ్, తయారీ రంగాల నుంచి లీజు కోసం డిమాండ్ పెరిగింది. ఢిల్లీల్లో వృద్ధి ఢిల్లీ మార్కెట్లో ఆఫీస్ స్పేస్ లీజు 11 శాతం పెరిగి 3.1 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. కొత్తగా కార్యాలయ స్థలాల అందుబాటు. 43 శాతం పెరిగి 2.1 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. నెలవారీ అద్దె చదరపు అడుగుకు రూ.94.20గా ఉంది. ముంబైలో ఆఫీస్ స్పేస్ లీజు 41 శాతం క్షీణించి 1.6 మిలియన్ చదరపు అడుగులకు పరిమితమైంది. నూతన సరఫరా 79 శాతం తగ్గి 0.2 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. కార్యాలయ అద్దె చదరపు అడుగుకు రూ.140.10గా నమోదైంది. పుణెలో లీజు పరిమాణం 1.7 మిలియన్ చదరపు అడులుగా ఉంటే, ఒక చదరపు అడుగు అద్దె రూ.76.70గా ఉంది. నూతర సరఫరా 52 శాతం పెరిగి 0.9 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. హైదరాబాద్లో డౌన్ హైదరాబాద్ మార్కెట్లో ఆఫీస్ స్పేస్ లీజు జూన్ త్రైమాసికంలో 22 శాతం క్షీణించి 1.5 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లీజు పరిమాణం 1.9 మిలియన్ చదరపు అడుగులుగా ఉండడం గమనించొచ్చు. అయితే, కార్యాలయ స్థలాల నూతన సరఫరా క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 19 శాతం తగ్గి 3 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. నెలవారీ కార్యాలయ వసతి అద్దె చదరపు అడుగుకు రూ.73.70గా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది రూ.73.60గా ఉండడం గమనార్హం. చెన్నై మార్కెట్లో అత్యధికంగా ఆఫీస్ స్పేస్ లీజు మూడు రెట్లు పెరిగి 3.3 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. ఇక్కడ కొత్త సరఫరా 2.4 మిలియన్ చదరపు అడుగులకు పెరిగింది. ఆఫీస్ అద్దె చదరపు అడుగుకు రూ.75.1గా ఉంది. బెంగళూరు మార్కెట్లో ఆఫీస్ అద్దె రూ.91.90గా నమోదైంది. ఆఫీస్ స్పేస్ లీజు పరిమాణం 22 శాతం తగ్గి 3.4 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. నూతన సరఫరా రెండింతలు పెరిగి 3.8 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది. -
రూ.2.85 లక్షల కోట్లకు మైక్రో ఫైనాన్స్ రుణాలు
ముంబై: సూక్ష్మ రుణ సంస్థల (ఎంఎఫ్ఐ) రుణ పరిమాణం జూన్ త్రైమాసికం ముగిసే నాటికి రూ.2.85 లక్షల కోట్లని సీఆర్ఐఎఫ్ హై మార్క్ నివేదిక ఒకటి తెలిపింది. మార్చి త్రైమాసికంతో పోల్చితే ఈ మొత్తాలు స్వల్పంగా 0.2 శాతం తగ్గినట్లు ఈ క్రెడిట్ సమాచార సేవల సంస్థ వివరించింది. అయితే రుణ నాణ్యత పెరిగినట్లు పేర్కొంది. నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► వార్షికంగా పోల్చితే (గత ఏడాది జూన్ త్రైమాసికంతో పోల్చితే) సూక్ష్మ రుణ పుస్తక విలువ 18 శాతం పెరిగింది. అప్పట్లో కోవిడ్–19 సెకండ్వేవ్ ఈ విభాగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. ► జూన్ త్రైమాసికంలో రుణ పంపిణీ రూ.49,788 కోట్లు. మార్చి త్రైమాసికంతో పోల్చితే ఇది 39.2% తక్కువ. అయితే గత ఏడాది ఇదే కా లంతో పోల్చితే మాత్రం 88.9 శాతం అధికం. ► జూన్ త్రైమాసికం ముగిసే సమయానికి 90 రోజులకు పైగా ఉన్న రుణ బకాయిల విలువ మార్చి త్రైమాసికంతో పోల్చితే 0.5 శాతం తగ్గి 2.2 శాతంగా ఉంది. క్రితం సంవత్సరంతో పోలిస్తే ఈ రేటు భారీగా 1.1 శాతం తగ్గింది. ► ఒక్కో ప్రత్యేక రుణగ్రహీత సగటు బ్యాలెన్స్ మార్చి త్రైమాసికంతో పోల్చితే 1.1 శాతం తగ్గి రూ. 46,400కి చేరింది. కాగా, ఒక్కో ఖాతా సగటు బ్యాలెన్స్ 2.1 శాతం క్షీణించింది. ► సూక్ష రుణ సంస్థల రుణాలు జూన్ త్రైమాసికంలో పట్టణాల్లో 0.8 శాతం క్షీణిస్తే, గ్రామీణ మార్కెట్లలో ఈ తగ్గుదల 0.2 శాతంగా ఉంది. ► దేశ వ్యాప్తంగా చూస్తే, జూన్ 2022 త్రైమాసిక మొత్తం రుణాల్లో తొలి 10 టాప్ మార్కెట్లు 84 శాతం వాటా కలిగి ఉన్నాయి. తమిళనాడు, ఉత్తరప్రదేశ్, బీహార్ అత్యధిక వృద్ధి గణాంకాలను నమోదు చేశాయి. ► పశ్చిమ బెంగాల్లోని నార్త్ 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, నదియా జిల్లాలు ఎంఎఫ్ఐ రుణాల విషయంలో చివరి వరుసలో ఉన్నాయి. ► ఇక సూక్ష్మ రుణాల విషయంలో బ్యాంకులు 35.6 శాతం పోర్ట్ఫోలియో వాటాతో (జూన్ త్రైమాసికంలో) మార్కెట్లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే మార్చి త్రైమాసికంతో పోల్చితే పోర్ట్ఫోలియోలో 5.6 శాతం క్షీణత నమోదయ్యింది. -
డెట్ ఫండ్స్కు అమ్మకాల సెగ
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లు డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి జూన్ త్రైమాసికంలో రూ.70,213 కోట్లను ఉపసంహరించుకున్నారు. అధిక ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెరుగుదల ఇందుకు దారితీసింది. ‘‘సెప్టెంబర్ త్రైమాసికంలో ద్రవ్య పరిస్థితులు ఇంకా కఠినతరం అవుతాయి. దీంతో డెట్ మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ ఆస్తులు మరికొంత తగ్గొచ్చు’’అని ట్రస్ట్ మ్యూచువల్ ఫండ్ సీఈవో సందీప్ తెలిపారు. జూన్ చివరికి డెట్ మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ ఆస్తులు 5 శాతం తగ్గి రూ.12.35 లక్షల కోట్లుగా ఉన్నాయి. మార్చి క్వార్టర్ చివరికి ఇవి రూ.13 లక్షల కోట్లుగా ఉన్నాయి. 2021–22 మొదటి త్రైమాసికం నాటికి రూ.14.16 లక్షల కోట్లు. -
ఈక్విటీల్లో ఎఫ్పీఐల వాటా డౌన్
న్యూఢిల్లీ: దేశీ ఈక్విటీలలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్పీఐలు) వాటాల విలువ వరుసగా మూడో త్రైమాసికంలోనూ క్షీణించింది. మార్నింగ్స్టార్ నివేదిక ప్రకారం 2022 ఏప్రిల్–జూన్(క్యూ1)లో 14 శాతం నీరసించి 523 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. అంతకుముందు క్వార్టర్లో ఈ విలువ 612 బిలియన్ డాలర్లుకాగా.. 2021 జూన్ క్వార్టర్కల్లా 592 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఈ ఏడాది ప్రారంభం నుంచీ విదేశీ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దేశ, విదేశాలలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల ప్రభావంతో పెట్టుబడుల్లో వెనకడుగు వేస్తున్నారు. దేశీ ఈక్విటీ మార్కెట్ల విలువలోనూ ఎఫ్పీఐల వాటా మార్చిలో నమోదైన 17.8 శాతం నుంచి 16.9 శాతానికి నీరసించింది. 2022 జూన్ త్రైమాసికంలో ఎఫ్పీఐలు 13.85 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను విక్రయించారు. మార్చి క్వార్టర్లో వెనక్కి తీసుకున్న పెట్టుబడులు 14.59 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇవి తక్కువే కావడం గమనార్హం! యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కఠిన విధాన నిర్ణయాల నేపథ్యంలో ఎఫ్పీఐల సెంటిమెంటు బలహీనపడినట్లు నివేదిక పేర్కొంది. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు కారణంగా బాండ్ల ఈల్డ్స్ సైతం జోరందుకున్నట్లు తెలియజేసింది. వీటికి చమురు హెచ్చుతగ్గులు, కమోడిటీ ధరల పెరుగుదల, రష్యా–ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులు జత కలిసినట్లు వివరించింది. -
యాపిల్ ఇండియా ఆదాయం రెట్టింపు
న్యూయార్క్: ఈ ఏడాది జూన్తో ముగిసిన త్రైమాసికంలో టెక్ దిగ్గజం యాపిల్ ఆదాయం సుమారు 2 శాతం వృద్ధి చెంది రికార్డు స్థాయిలో 83 బిలియన్ డాలర్లకు చేరింది. భారత మార్కెట్లో ఆదాయం దాదాపు రెట్టింపైనట్లు సంస్థ వెల్లడించింది. ‘అమెరికా, యూరప్, ఆసియా పసిఫిక్లోని ఇతర మార్కెట్లలో జూన్ త్రైమాసికంలో ఆదాయం రికార్డు స్థాయిలో పెరిగింది. సంపన్న, వర్ధమాన మార్కెట్లలో గణనీయంగా వృద్ధి చెందింది. బ్రెజిల్, ఇండొనేషియా, వియత్నాలలో రెండంకెల స్థాయిలోనూ, భారత్లో రెట్టింపు స్థాయిలోనూ పెరిగింది‘ అని ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా యాపిల్ సీఈవో టిమ్ కుక్ తెలిపారు. రష్యా వ్యాపారం, స్థూల ఆర్థిక అంశాలపరంగా కొంత ప్రతికూల ప్రభావాలు పడినప్పటికీ సర్వీసుల విభాగం ఆదాయం 12 శాతం పెరిగి 19.6 బిలియన్ డాలర్లకు చేరినట్లు వివరించారు. ప్రతిభావంతులైన ఉద్యోగులను అట్టే పెట్టుకునేందుకు, కొత్త వారిని ఆకర్షించేందుకు కస్టమర్లు యాపిల్ ఉత్పత్తుల్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు కుక్ తెలిపారు. భారత ఐటీ దిగ్గజం విప్రో ఇందుకు ఉదాహరణగా ఆయన చెప్పారు. అంతర్జాతీయంగా కొత్త గ్రాడ్యుయేట్లను రిక్రూట్ చేసుకోవడంలో ఇతర సంస్థలతో పోటీపడే క్రమంలో మాక్బుక్ ఎయిర్ వంటి అత్యుత్తమ పనితీరు కనపర్చే యాపిల్ ఉత్పత్తులపై విప్రో ఇన్వెస్ట్ చేస్తోందని కుక్ వివరించారు. -
ఒలెక్ట్రా లాభం 825 శాతం జంప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహన తయారీలో ఉన్న ఒలెక్ట్రా గ్రీన్టెక్ జూన్ త్రైమాసికం స్టాండలోన్ ఫలితాల్లో నికరలాభం 825 శాతం దూసుకెళ్లి రూ.18.8 కోట్లు సాధించింది. ఎబిటా 322 శాతం అధికమై రూ.36.8 కోట్లకు చేరుకుంది. టర్నోవర్ 640 శాతం పెరిగి రూ.305 కోట్లు నమోదైంది. త్రైమాసికంలో 169 ఎలక్ట్రిక్ బస్లను సరఫరా చేయడంతో గణనీయమైన ఆదాయ వృద్ధిని సాధించామని ఒలెక్ట్రా గ్రీన్టెక్ సీఎండీ కె.వి.ప్రదీప్ తెలిపారు. రానున్న త్రైమాసికాలలో కొత్త ఉత్పత్తి శ్రేణిని పరిచయం చేయడంతోపాటు మరిన్ని విభాగాల్లోకి ప్రవేశిస్తామని చెప్పారు. రోడ్డు రవాణా సంస్థలకు బస్ల డెలివరీలను పెంచడంతోపాటు డెలివరీల షెడ్యూల్ను పూర్తి చేస్తామని అన్నారు. -
‘మాంద్యం’లోకి జారిన అమెరికా!
వాషింగ్టన్: అమెరికా జూన్ త్రైమాసిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిలేకపోగా 0.9 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. అగ్రరాజ్య జీడీపీ క్షీణతలో ఉండడం వరుసగా ఇది రెండవ త్రైమాసికం. మార్చి త్రైమాసికంలో ఎకానమీ 1.6 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. వరుసగా రెండు త్రైమాసికాలు ఎకానమీ క్షీణ బాటలో ఉంటే దానిని అనధికారికంగా (సాంకేతికంగా) మాంద్యంగానే పరిగణిస్తారు. తాజా పరిస్థితిని క్షీణతగా ఎంతమాత్రం భావించరాదని అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ పేర్కొంటున్నారు. ఎకానమీలో పలు రంగాలు పటిష్టంగా ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థను క్షీణతలోకి జారిందని పేర్కొనడం సరికాదన్నది వారి వాదన. తీవ్ర ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు వంటి పరిణామాల నేపథ్యంలో రుణ వ్యయాలు పెరిగిపోయి అమెరికా వినియోగదారులు, వ్యాపారులు తీవ్ర ఒత్తిడులను ఎదుర్కొంటున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం ‘మాంద్యం’ అంటే ఏమిటన్న ప్రశ్నపై భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. ద్రవ్యోల్బణ అదుపునకు జనవరి మొదలు ఇప్పటివరకూ వడ్డీ రేటును ఫెడ్ 2.25 శాతం పెంచింది. దీనితో ఫెడ్ ఫండ్స్ రేట్లు 2.25 –2.5 శాతానికి చేరాయి. అయితే ఇకపై రేటు పెంపులో దూకుడు ఉండకపోవచ్చని అంచనా. -
గృహ రుణాలపై వడ్డీ రేట్ల పెంపు.. రియల్ ఎస్టేట్పై తగ్గిన ఆసక్తి!
న్యూఢిల్లీ: గృహ రుణాలపై వడ్డీ రేట్ల పెంపుతో ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో రియల్ ఎస్టేట్ రంగంపై ఆసక్తి కొంత తగ్గింది. నైట్ ఫ్రాంక్ ఇండియా, నారెడ్కో రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ సూచీ క్యూ2లో 62 పాయింట్లకు పరిమితమైంది. జనవరి–మార్చి త్రైమాసికంలో (క్యూ1) ఇది 68గా నమోదైంది. డెవలపర్లు, ఇన్వెస్టర్లు, ఆర్థిక సంస్థలపై సర్వే ప్రాతిపదికన ఈ సూచీలో స్కోరు ఉంటుంది. 50కి ఎగువన ఉంటే సెంటిమెంటు ఆశావహంగా ఉన్నట్లు, సరిగ్గా 50 ఉంటే యథాతథంగా లేదా తటస్థంగా ఉన్నట్లు, 50కి దిగువన ఉంటే నిరాశ ధోరణిలో ఉన్నట్లు పరిగణిస్తారు. ఈ ఏడాది మే, జూన్లో రిజర్వ్ బ్యాంక్ వరుసగా రెండు సార్లు కీలక పాలసీ రేట్లను పెంచడంతో గృహ రుణాల వడ్డీ రేట్లపై ప్రతికూల ప్రభావం ఉంటుందన్న అంచనాలతోనే క్యూ2లో సెంటిమెంట్ సూచీ స్కోరు తగ్గిందని వివరించాయి. వచ్చే ఆరు నెలల కాలాన్ని ప్రతిబింబించే భవిష్యత్ ధోరణి సెంటిమెంట్ సూచీ కూడా క్యూ1లోని చారిత్రక గరిష్ట స్థాయి 75 నుండి క్యూ2లో 62 పాయింట్లకు తగ్గింది. ద్రవ్యోల్బణం, డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణత వంటి అంశాలు ఇందుకు కారణం. అయినప్పటికీ ప్రస్తుత, భవిష్యత్ సూచీలు రెండూ 50కి ఎగువనే ఉన్న నేపథ్యంలో సెంటిమెంటు వచ్చే ఆరు నెలలు ఆశావహంగానే ఉండగలవని నైట్ ఫ్రాంక్–నారెడ్కో నివేదికలో పేర్కొన్నాయి. నివేదికలోని మరిన్ని వివరాలు.. ♦రియల్ ఎస్టేట్ రంగంలో సరఫరాకు కీలకంగా ఉండే డెవలపర్లు, ఇన్వెస్టర్లు తదితర వర్గాలు .. అమెరికాలో ఆర్థిక సమస్యలు, రష్యా–ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు, యూరప్లో ఆర్థిక మందగమనం వంటి అంశాలపై మరింత నిశితంగా పరిశీలిస్తున్నాయి. ♦రెసిడెన్షియల్ విభాగంలో పటిష్టమైన డిమాండ్ ఉన్నట్లు గత 8–10 త్రైమాసికాలుగా రుజువైంది. సరైన ధర, ప్రోత్సాహకాలు ఉంటే ఇది అమ్మకాల రూపంలోకి మారగలదు. ♦కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న కమర్షియల్ ఆఫీస్ విభాగం వృద్ధి బాట పట్టింది. పటిష్టమైన ఆర్థిక వృద్ధి, నియామకాల జోరు, ఉద్యోగులు తిరిగి కార్యాలయాలకు వస్తుండటం తదితర అంశాలతో గత 3–4 త్రైమాసికాలుగా ఈ విభాగం పుంజుకుంటోంది. -
మెప్పించని విప్రో
న్యూఢిల్లీ: ప్రముఖ ఐటీ సేవల కంపెనీ విప్రో లాభాలకు గండి పడింది. కన్సాలిడేటెడ్ నికర లాభం ఏకంగా 21 శాతం పతనమై జూన్ త్రైమాసికంలో రూ.2,564 కోట్లకు పరిమితమైంది. ఆదాయం 18 శాతం వృద్ధితో రూ.18,252 కోట్ల నుంచి రూ.21,529 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి నికర లాభం రూ.3,243 కోట్లుగా ఉంది. డాలర్లలో చూస్తే ఆదాయం 17 శాతానికి పైగా పెరిగి 2,735 డాలర్లుగా ఉంది. క్వార్టర్ వారీగా చూస్తే ఆపరేటింగ్ మార్జిన్ 2 శాతం తగ్గి 15 శాతానికి పరిమితమైంది. సెప్టెంబర్ త్రైమాసికంలో ఆదాయం 2,817–2872 మిలియన్ డాలర్లుగా ఉండొచ్చని, సీక్వెన్షియల్గా (జూన్ త్రైమాసికంతో పోలిస్తే) 3–5 శాతం మధ్య వృద్ధి నమోదు కావచ్చని కంపెనీ పేర్కొంది. ‘‘విప్రో వృద్ధి అవకాశాల కోసం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాం. వీటి ఫలితాల పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. ఆర్డర్ల పుస్తకం వార్షికంగా చూస్తే కాంట్రాక్టు విలువ పరంగా 32 శాతం పెరిగింది. పెద్ద డీల్స్ సొంతం చేసుకున్నాం. నేడు ఆర్డర్ల పైపులైన్ ఆల్టైమ్ గరిష్ట స్థాయిలో ఉంది. మా వ్యాపార వృద్ధికి వీలున్న చోట పెట్టుబడులు కొనసాగిస్తాం. మా క్లయింట్లకు మరింత మెరుగ్గా సేవలు అందించడంపై దృష్ట సారిస్తాం’’అని విప్రో ఎండీ, సీఈవో థియరీ డెలాపోర్టే తెలిపారు. ఆపరేటింగ్ మార్జిన్లు 15 శాతంగా ఉన్నాయంటే కనిష్ట స్థాయికి చేరుకున్నట్టేనని కంపెనీ సీఎఫ్వో జతిన్ దలాల్ పేర్కొన్నారు. కాగా, ఉద్యోగుల సంఖ్య 15,446 పెరిగి 2.58 లక్షలకు చేరింది. -
స్టార్టప్లకు నిధులు: 40 శాతం ఢమాల్!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా భౌగోళిక-రాజకీయ అస్థిరత నెలకొన్న నేపథ్యంలో దేశీ స్టార్టప్లలోకి పెట్టుబడుల ప్రవాహం గణనీయంగా తగ్గింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 40 శాతం పడిపోయి 6.8 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. పీడబ్ల్యూసీ ఇండియా రూపొందించిన స్టార్టప్ డీల్స్ ట్రాకర్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. అంకుర సంస్థల్లో సగటున 5 మిలియన్ డాలర్ల స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి. పెట్టుబడుల్లో 60 శాతం వాటాను ప్రారంభ దశలోని అంకుర సంస్థలే దక్కించుకున్నాయి. వరుసగా మూడు త్రైమాసికాల పాటు 10 బిలియన్ డాలర్ల పైగా నిధులు సమకూర్చుకున్న దేశీ స్టార్టప్ వ్యవస్థ ఈ ఏడాది (2022) రెండో త్రైమాసికంలో 6.8 బిలియన్ డాలర్లు మాత్రమే సమకూర్చుకోగలిగిందని నివేదికలో పీడబ్ల్యూసీ ఇండియా పేర్కొంది. టెక్నాలజీ స్టాక్స్ వేల్యుయేషన్లు పడిపోవడం, ద్రవ్యోల్బణం ఎగియడం, అంతర్జాతీయంగా మందగమనం, భౌగోళిక-రాజకీయ అనిశ్చితి తదితర అంశాలు ఇందుకు కారణమని వివరించింది. సాస్ కంపెనీల్లోకి అత్యధికంగా నిధులు.. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ (సాస్), ఫిన్టెక్ కంపెనీల్లోకి అత్యధికంగా 3.1 బిలియన్ డాలర్ల మేర నిధులు వచ్చాయి. ప్రారంభ దశలోని అంకుర సంస్థల్లోకి పెట్టుబడులు సుమారు 800 మిలియన్ డాలర్ల స్థాయిలో స్థిరంగా కొనసాగుతున్నాయి. రాబోయే త్రైమాసికాల్లోనూ ఇదే ధోరణి ఉండవచ్చని లేదా డిజిటైజేషన్ ఊతంతో మరింతగా పెరగవచ్చని నివేదిక తెలిపింది. మొత్తం మీద నిధుల ప్రవాహం ఒక స్థాయిలో స్థిరపడటానికి 12-18 నెలలు పట్టొచ్చని అంచనా వేస్తున్నట్లు వివరించింది. ఈలోగా స్టార్టప్లు తాము నిధులు సమకూర్చుకునేందుకు అవసరమైన విధంగా వ్యాపారాలను తీర్చిదిద్దుకోవడంపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉంటుందని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్నర్ అమిత్ నావ్కా పేర్కొన్నారు. వివిధ దశల్లో ఉన్న స్టార్టప్ల వేల్యుయేషన్లపై ఒత్తిడి కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. నివేదికలోని మరిన్ని వివరాలు .. ♦ బెంగళూరు, ముంబై, దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) కీలక స్టార్టప్ నగరాలుగా కొనసాగుతున్నాయి. ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో వీటి వాటా 95 శాతంగా ఉంది. చెన్నై, పుణె ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ♦ బెంగళూరులో ఏడు కంపెనీలు 100 మిలియన్ డాలర్ల పైగా సమీకరించాయి. డైలీహంట్, ర్యాపిడో, లీడ్స్క్వేర్డ్, లెన్స్కార్ట్, క్రెడ్, ఎథర్ ఎనర్జీ, అబ్జర్వ్.ఏఐ వీటిలో ఉన్నాయి. ♦ ఎన్సీఆర్లో 7 కంపెనీలు 100 మిలియన్ డాలర్ల పైగా సమీకరించాయి. ♦ ముంబైలో నాలుగు కంపెనీలు తలో 100 మిలియన్ డాలర్లు అందుకున్నాయి. అప్గ్రాడ్, జెప్టో, కాయిన్డీసీఎక్స్, టర్టిల్మింట్ వీటిలో ఉన్నాయి. ♦ 2022 రెండో త్రైమాసికంలో దేశీయంగా నాలుగు అంకుర సంస్థలు మాత్రమే యూనికార్న్ (1 బిలియన్ డాలర్ల పైగా వేల్యుయేషన్) హోదా దక్కించుకున్నాయి. అంతర్జాతీయంగా యూనికార్న్ల సంఖ్య 1,200కి చేరింది. ఇక, డెకాకార్న్ల సంఖ్య (10 బిలియన్ డాలర్ల పైగా వేల్యుయేషన్ ఉన్నవి) 57కి చేరింది. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో కొత్తగా నాలుగు సంస్థలు ఈ జాబితాలోకి చేరాయి. -
టెక్ మహీంద్రా లాభం 26% అప్..
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా నికర లాభం 26 శాతం ఎగిసింది. రూ. 1,339 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో లాభం రూ. 1,065 కోట్లు. ఇక తాజా సమీక్షాకాలంలో ఆదాయం 16 శాతం వృద్ధి చెంది రూ. 10,881 కోట్లుగా నమోదైంది. జూన్ క్వార్టర్తో పోలిస్తే 6.4 శాతం పెరిగింది. ఇది దశాబ్ద కాలంలోనే గరిష్ట వృద్ధి. టెక్ మహీంద్రా షేరు ఒక్కింటికి రూ. 15 చొప్పున ప్రత్యేక డివిడెండ్ ప్రకటించింది. క్యూ2లో కొత్తగా 750 మిలియన్ డాలర్ల డీల్స్ కుదిరాయని, వీటిలో సింహభాగం డిజిటలైజేషన్కి సంబంధించినవే ఉన్నాయని టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నానీ తెలిపారు. రాబోయే రోజుల్లోనూ ఇదే తరహా పనితీరు సాధించగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే 15.2 శాతంగా నమోదైన నిర్వహణ లాభాల మార్జిన్ను ఇకపైనా అదే స్థాయిలో లేదా అంతకు మించి సాధించే అవకాశాలు ఉన్నాయని గుర్నానీ చెప్పారు. రెండు సంస్థల కొనుగోలు .. డిజిటల్ ఇంజినీరింగ్ కంపెనీ లోడ్స్టోన్తో పాటు మరో సంస్థను కొనుగోలు చేస్తున్నట్లు టెక్ మహీంద్రా తెలిపింది. ఇందుకోసం సుమారు 105 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 789 కోట్లు) వెచ్చిస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు, బ్రిటన్కు చెందిన ఉయ్ మేక్ వెబ్సైట్స్ (డబ్ల్యూఎండబ్ల్యూ)ని 9.4 మిలియన్ పౌండ్లకు (సుమారు రూ. 97 కోట్లు) కొనుగోలు చేసినట్లు వివరించింది. అట్రిషన్తో సమస్యలు.. నిపుణులకు డిమాండ్ నెలకొనడంతో అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలసలు) ఐటీ సంస్థలకు సమస్యాత్మకంగా తయారైందని గుర్నానీ తెలిపారు. అయితే, తమ సంస్థ దీన్ని ఎదుర్కొంటున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. టెక్ మహీంద్రాలో అట్రిషన్ రేటు తాజా క్యూ2లో 21 శాతానికి పెరిగింది. ఇది గత క్యూ2లో 14 శాతంగా ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో 17 శాతానికి చేరింది. హైదరాబాద్, బెంగళూరు, పుణె వంటి పెద్ద నగరాల్లో అట్రిషన్ రేటు అధికంగా ఉండగా.. నాగ్పూర్, భువనేశ్వర్ వంటి ప్రాంతాల్లో తక్కువ స్థాయిలో ఉందని గుర్నానీ చెప్పారు. సెప్టెంబర్ క్వార్టర్లో కంపెనీ 14,000 మంది పైచిలుకు ఉద్యోగులను తీసుకోవడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 1.41 లక్షలకు చేరినట్లు గుర్నానీ చెప్పారు. సోమవారం బీఎస్ఈలో టెక్ మహీంద్రా షేరు స్వల్పంగా పెరిగి రూ. 1,524 వద్ద క్లోజయ్యింది. -
విదేశీ ఫండ్స్పై భారీగా తగ్గిన పెట్టుబడుల ప్రవాహం
న్యూఢిల్లీ: దేశీ మార్కెట్పై దృష్టిపెట్టే ఆఫ్షోర్ విభాగంలోని ఫండ్స్, ఎక్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్లు) నుంచి మరోసారి పెట్టుబడులు వెనక్కి మళ్లాయి. ఈ కేలండర్ ఏడాది(2021) రెండో త్రైమాసికం(ఏప్రిల్– జూన్)లో నికరంగా 1.55 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 11,500 కోట్లు) ఔట్ఫ్లో నమోదైంది. వెరసి వరుసగా 13వ త్రైమాసికంలోనూ ఈ ఫండ్స్ నుంచి విత్డ్రాయల్స్ చోటుచేసుకున్నట్లు మార్నింగ్స్టార్ తాజా నివేదిక పేర్కొంది. కాగా.. 2021 క్యూ1(జనవరి–మార్చి)లో నమోదైన 37.6 కోట్ల డాలర్ల(రూ. 2,790 కోట్లు)తో పోలిస్తే పెట్టుబడులు భారీ స్థాయిలో వెనక్కి మళ్లడం గమనించదగ్గ అంశం! 2020 అక్టోబర్–డిసెంబర్లోనూ 98.6 కోట్ల డాలర్ల పెట్టుబడులు తరలిపోయాయి. విదేశీ ఇన్వెస్టర్ల దృష్టి దేశీయంగా ఈక్విటీ మార్కెట్లలో ప్రధానంగా ఆఫ్షోర్ ఫండ్స్, ఈటీఎఫ్ల ద్వారా విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే జూన్ క్వార్టర్లో ఆఫ్షోర్ ఫండ్ విభాగంలో 1.7 బిలియన్ డాలర్ల అమ్మకాలు నమోదయ్యాయి. మార్చి త్రైమాసికంలో ఇవి 1.1 బిలియన్ డాలర్లు మాత్రమే. కాగా.. 37 నెలల ఔట్ఫ్లో తదుపరి మార్చిలో 3.32 కోట్ల డాలర్ల పెట్టుబడులు రావడం గమనార్హం. అయితే కోవిడ్–19 సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ ట్రెండ్కు వెంటనే బ్రేక్ పడింది. ఇక మరోవైపు సానుకూల పరిస్థితులను కొనసాగిస్తూ వరుసగా మూడో క్వార్టర్లోనూ ఆఫ్షోర్ ఈటీఎఫ్లకు నికరంగా పెట్టుబడులు తరలివచ్చాయి. జూన్ త్రైమాసికంలో 15.3 కోట్ల డాలర్ల ఇన్ఫ్లో నమోదైంది. మార్చి త్రైమాసికంలో నమోదైన 76.7 కోట్ల డాలర్లతో పోలిస్తే మాత్రం భారీగా తగ్గాయి. 2020 అక్టోబర్–డిసెంబర్లోనూ 88.2 కోట్ల డాలర్ల పెట్టుబడులు వచ్చిన సంగతి తెలిసిందే. దీర్ఘకాలానికి..: సాధారణంగా ఆఫ్షోర్ ఫండ్స్లో పెట్టుబడులు దీర్ఘకాలానికి సంబంధించినవికాగా.. ఆఫ్షోర్ ఈటీఎఫ్ల ద్వారా విదేశీ ఇన్వెస్టర్లు స్వల్పకాలిక ధృక్పథంతో ఇన్వెస్ట్ చేస్తుంటారు. 2018 ఫిబ్రవరి మొదలు ఈ రెండు ఫండ్స్ నుంచి నిరవధికంగా పెట్టుబడులు తరలిపోతూ వస్తున్నాయి. ఈ ట్రెండ్ 2020 మార్చికల్లా గరిష్టానికి చేరింది. దాదాపు 5 బిలియన్ డాలర్ల అమ్మకాలు నమోదయ్యాయి. వెరసి ఒక త్రైమాసికంలో అత్యధిక స్థాయి ఔట్ఫ్లోస్గా రికార్డు నమోదైంది. ఈ బాటలో 2021 జూన్కల్లా ఆఫ్షోర్ ఫండ్స్ నుంచి 20.8 బిలియన్ డాలర్లు, ఆఫ్షోర్ ఈటీఎఫ్ల నుంచి 2.6 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వెనక్కి మళ్లాయి. జూన్ క్వార్టర్లో పెట్టుబడులు తరిగిపోయినప్పటికీ ఈ ఫండ్స్ ఆస్తుల విలువ మార్చి త్రైమాసికంతో పోలిస్తే 4 శాతం బలపడి 46.3 బిలియన్ డాలర్లకు చేరడం విశేషం! చదవండి : రష్యాలో ప్రాజెక్టులు,15 బిలియన్ డాలర్లు దాటిన భారత్ పెట్టుబడులు -
తగ్గిన జీఎంఆర్ నష్టాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ సంస్థ జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జూన్ త్రైమాసి కం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో రూ.318 కోట్ల నష్టం చవిచూసింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.834 కోట్ల నష్టం వాటిల్లింది. టర్నోవర్ రూ.1,224 కోట్ల నుంచి రూ.1,897 కోట్లకు చేరింది. వ్యయాలు రూ.2,197 కోట్ల నుంచి రూ.2,331 కోట్లకు ఎగబాకాయి. ఎయిర్పోర్టుల ఆదాయం రూ.494 కోట్ల నుంచి రూ.898 కోట్లుగా ఉంది. విద్యుత్ విభాగం ఆదాయం రూ.300 కోట్ల నుంచి రూ.446 కోట్లకు చేరింది. క్రితం ముగింపుతో పోలిస్తే జీఎంఆర్ ఇన్ఫ్రా షేరు ధర శుక్రవారం 0.89 శాతం తగ్గి రూ.27.90 వద్ద స్థిరపడింది. -
అరబిందో లాభం రూ.770 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ సంస్థ అరబిందో ఫార్మా జూన్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాలు మెరుగ్గా ప్రకటించింది. నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 8.9 శాతం ఎగసి రూ.770 కోట్లు సాధించింది. టర్నోవర్ రూ.5,540 కోట్ల నుంచి రూ.5,702 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నాట్రోల్ను మినహాయించారు. యూఎస్ ఫార్ములేషన్స్ ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే స్థిరంగా ఉండి రూ.2,681 కోట్లు సాధించింది. యూరప్ ఫార్ములేషన్స్ ఆదాయం 19.7 శాతం వృద్ధితో రూ.1,583 కోట్లు నమోదు చేసింది. ఏపీఐల ఆదాయం రూ.780 కోట్ల నుంచి రూ.812 కోట్లకు చేరింది. ఆదాయంలో 6.3 శాతం.. పరిశోధన, అభివృద్ధికి రూ.358 కోట్లు వెచ్చించారు. ఆదాయంలో ఇది 6.3 శాతం. మూడు ఇంజెక్టేబుల్స్తో కలిపి నాలుగు ఏఎన్డీఏలకు యూఎస్ఎఫ్డీఏ నుంచి తుది అనుమతి లభించింది. 2021–22 ఏడాదికి రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.1.50 మధ్యంతర డివిడెండ్ చెల్లింపునకు బోర్డు సమ్మతించింది. సవాళ్లతో కూడిన ప్రస్తుత సమయంలో త్రైమాసిక పనితీరు సంస్థ స్థితిస్థాపకతను ప్రతిబింబిస్తుందని అరబిందో ఫార్మా ఎండీ ఎన్.గోవిందరాజన్ ఈ సందర్భంగా తెలిపారు. పశువులకు సంబంధించి జనరిక్ ఔషధాల అభివృద్ధి, కాంట్రాక్ట్ రీసెర్చ్ సర్వీసులు అందిస్తున్న హైదరాబాద్ కంపెనీ క్రోనస్ ఫార్మా స్పెషాలిటీస్ ఇండియాలో అరబిందో 51% మెజారిటీ వాటా కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ రూ.420 కోట్లు. అలాగే అనుబంధ కంపెనీలైన ఆరోనెక్సŠట్ ఫార్మా, ఎమ్వియెస్ ఫార్మా వెంచర్స్ను అరబిందో ఫార్మాలో విలీనం చేయనున్నట్టు ప్రకటించింది. అరబిందో షేరు ధర గురువారం 3.64 శాతం తగ్గి రూ.825.70 వద్ద స్థిరపడింది. -
ఇండియా సిమెంట్స్ లాభం.. డబుల్
న్యూఢిల్లీ: ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ కన్సాలిడేటెడ్ నికర లాభం జూన్ త్రైమాసికంలో రెట్టింపునకు పైగా పెరిగి రూ.46.63 కోట్లుగా నమోదైంది. విక్రయాల ద్వారా ఆదాయం సైతం 37 శాతం వృద్ధితో రూ.1,045 కోట్లకు చేరుకుంది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి లాభం రూ.20 కోట్లు, ఆదాయం రూ.763 కోట్లుగా ఉండడం గమనార్హం. ‘‘లాక్డౌన్లు, రవాణాపై ఆంక్షలు, సరఫరా పరంగా సమస్యలు, ప్రయాణాలపై ఆంక్షలు, సామాజికంగా భౌతిక తూరం తదితర చర్యలు జూన్ త్రైమాసికంలో కంపెనీ సాధారణ వ్యాపార కార్యకలాపాలపై ప్రభావం చూపించాయి’’ అని ఇండియా సిమెంట్స్ తెలిపింది. బీఎస్ఈలో ఇండియా సిమెంట్స్ షేరు 2 శాతం తగ్గి రూ.179 వద్ద క్లోజయింది. -
పుంజుకున్న టైటాన్
న్యూఢిల్లీ: టాటా గ్రూపులో భాగమైన టైటాన్ కంపెనీ 2021–22 జూన్ త్రైమాసికంలో తన పనితీరును మెరుగుపరుచుకుంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో సంస్థ రూ.297 కోట్లు నష్టపోగా.. తాజాగా ముగిసిన త్రైమాసికంలో రూ.18 కోట్ల లాభాన్ని ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ.3,519 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.2,020 కోట్లుగా ఉంది. టైటాన్ ఆభరణాల విభాగం మంచి పనితీరును చూపించినట్టు సంస్థ ప్రకటించింది. ఈ విభాగం ఆదాయం రూ.1,182 కోట్ల నుంచి రూ.2,467 కోట్లకు వృద్ధి చెందింది. వాచ్లు, వేరబుల్ ఉత్పత్తుల నుంచి ఆదాయం రూ.292 కోట్లకు పుంజుకుంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఈ విభాగం ఆదాయం రూ.75 కోట్లుగానే ఉండడం గమనార్హం. అలాగే, కళ్లద్దాల వ్యాపార ఆదాయం రూ.30 కోట్ల నుంచి రూ.67 కోట్లకు మెరుగుపడగా.. ఇతర ఉత్పత్తుల నుంచి వచ్చిన ఆదాయం రూ.14 కోట్లుగా నమోదైంది. -
ఉద్యోగ అవకాశాలు మెరుగుపడ్డాయి: టీమ్లీజ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆర్థిక కార్యకలాపాలపై ఆంక్షలను సడలించడం, వ్యాపార కార్యకలాపాలు, అమ్మకాలను పెంచడంపై దృష్టి సారించడంతో ఫ్రెషర్ల నియామకంపై సానుకూల ప్రభావం చూపుతోందని టీమ్లీజ్ నివేదిక వెల్లడించింది. 661 చిన్న, మధ్య, భారీ కంపెనీలు ఈ సర్వేలో పాలుపంచుకున్నాయి. ‘ప్రస్తుత త్రైమాసికంలో ఫ్రెషర్లను నియమించే ఉద్దేశం 7 శాతం పెరిగింది. జూనియర్ స్థాయి సిబ్బందిని చేర్చుకునే అంశం కూడా సానుకూల పథంలో ఉంది. జూలై–సెప్టెంబరులో పెద్ద ఎత్తున నియామకాలు ఉండే అవకాశం ఉంది. చాలా పరిశ్రమలు సెకండ్ వేవ్ ప్రభావాన్ని అధిగమించి, వృద్ధి దిశగా పయనిస్తున్నట్టు కనిపిస్తోంది. జీఎస్టీ వసూళ్లు, ఈ–వే బిల్లులు, వాహనాల రిజిస్ట్రేషన్లు, విద్యుత్ డిమాండ్, రైళ్ల ద్వారా సరుకు రవాణా, పెట్రోల్ వినియోగం వంటివి సెకండ్ వేవ్ ప్రభావం నుండి ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం ప్రారంభించాయని సూచిస్తున్నాయి. ఈ అంశాలతో నియామక సెంటిమెంట్పై సానుకూల ప్రభావం ఉంటుంది’ అని వివరించింది. ప్రధానంగా ఐటీ రంగంలో నియామకాల జోరు ఉంటుందని టాలెంట్ అక్విజిషన్ అనలిస్ట్ రేచల్ స్టెల్లా రాజ్ తెలిపారు. -
జూన్లో మౌలిక పరిశ్రమ ఓకే!
న్యూఢిల్లీ: ఎనిమిది కీలక మౌలిక పరిశ్రమల గ్రూప్ జూన్లో 8.9 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. గత ఏడాది ఇదే నెల్లో అతి తక్కువ క్షీణ (లో బేస్ ఎఫెక్ట్) గణాంకాలు నమోదుకావడం తాజా ఫలితంపై సానుకూల ప్రభావం చూపింది. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. ఇక్కడ 2020 జూన్ నెలను తీసుకుంటే, కరోనా సవాళ్లు, కఠిన లాక్డౌన్ నేపథ్యంలో ఎనిమిది పరిశ్రమల మౌలిక రంగంలో అసలు వృద్ధిలేకపోగా 12.4 శాతం క్షీణత నమోదయ్యింది. ఈ ఏడాది మే నెలలో ఈ గ్రూప్ వృద్ధి 16.3 శాతంకాగా, ఏప్రిల్లో ఏకంగా 60.9 శాతంగా ఉంది. ఎనిమిది పరిశ్రమలు వేర్వేరుగా చూస్తే.. ఆరు రంగాలు వృద్ధి బాటలోకి... ► బొగ్గు : 7.4 శాతం పురోగతి చోటుచేసుకుంది. 2020 ఇదే నెల్లో 15.5 శాతం క్షీణించింది ► సహజ వాయువు : 12 శాతం క్షీణత నుంచి 20.6 శాతం వృద్ధికి మళ్లింది. ► రిఫైనరీ ప్రొడక్టులు : 8.9 శాతం క్షీణత 2.4 శాతం వృద్ధి టర్న్ తీసుకుంది ► స్టీల్: 25 శాతం వృద్ధి సాధించింది. 2020 జూన్లో 23.2 శాతం క్షీణతలో ఉంది ► సిమెంట్: 6.8 శాతం క్షీణ బాట నుంచి 4.3 శాతం పురోగతి బాటకు మారింది ► విద్యుత్: 10% క్షీణత 7.2 వృద్ధికి మళ్లింది. తగ్గిన వృద్ధి స్పీడ్ ► ఎరువులు: 2 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. అయితే 2020 ఇదే నెల్లో వృద్ధి 4.2 శాతం నుంచి తాజా సమీక్షా నెల్లో తగ్గడం గమనార్హం. మైనస్లోనే క్రూడ్ ఇక క్రూడ్ ఉత్పత్తి క్షీణతలోనే కొనసాగుతోంది. సమీక్షా నెల్లో 1.8 శాతం మైనస్ ఉత్పత్తి నమోదయ్యింది. అయితే 2020 జూన్తో పోల్చితే క్షీణత (– 6 శాతం) తగ్గడం కొంత ఊరట. మొదటి త్రైమాసికంలో... ఎనిమిది మౌలిక రంగాలు ఏప్రిల్–జూన్ మధ్య 25.3 శాతం వృద్ధి సాధించాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో 23.8 శాతం క్షీణత నమోదయ్యింది. ఐఐపీ వృద్ధి 12 నుంచి 17 శాతం.. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో ఎనిమిది పరిశ్రమల గ్రూప్ వెయిటేజ్ దాదాపు 44 శాతంగా ఉంది. వచ్చే రెండు వారాల్లో వెలువడనున్న పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) గణాంకాలపై తాజా జూన్ మౌలిక రంగం ఫలితాలు సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో జూన్ ఐఐపీ 12 నుంచి 17 శాతం పురోగమిస్తుందని భావిస్తున్నాం. లో బేస్ ఎఫెక్ట్తో పాటు జీఎస్టీ ఈ–వే బిల్లులు మెరుగుపడ్డం, ఆటో ఉత్పత్తి ఆశాజనకంగా ఉండడం, కరోనా సెకండ్వేవ్ కేసులు తగ్గి పలు రాష్ట్రాల్లో సాధారణ వ్యాపార పరిస్థితులు మెరుగుపడ్డం వంటి అంశాలు కూడా జూన్ ఐఐపీ చక్కటి వృద్ధి రేటుకు దోహపడతాయని విశ్వసిస్తున్నాం. – అదితి నాయర్, ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్ -
భారీగా పెరిగిన మోల్డ్టెక్ లాభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్లాస్టిక్ ప్యాకేజింగ్ సంస్థ మోల్డ్టెక్ ప్యాకేజింగ్ జూన్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే పదింతలకుపైగా ఎగసి రూ.18.5 కోట్లు నమోదు చేసింది. టర్నోవర్ రెండింతలకుపైగా అధికమై రూ.134 కోట్లు సాధించింది. ఎబిటా 176 శాతం పెరిగింది. ఉత్తరాది మార్కెట్ కోసం ఉత్తర ప్రదేశ్లో ప్లాంటు స్థాపించేందుకు కావాల్సిన స్థలాన్ని కొనుగోలు చేసినట్టు సంస్థ సీఎండీ లక్ష్మణ రావు వెల్లడించారు. అద్దె ప్రాతిపదికన కాన్పూర్లో తీసుకున్న ప్రాంగణంలో అక్టోబర్లో కార్యకలాపాలు మొదలవుతాయని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. -
యూనియన్ బ్యాంకు లాభంలో మూడు రెట్ల వృద్ధి
న్యూఢిల్లీ: యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా (యూనియన్ బ్యాంకు) జూన్ త్రైమాసికానికి రూ.1,120 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.341 కోట్లతో పోలిస్తే మూడు రెట్లకు పైగా వృద్ధి నమోదైంది. ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలో లాభం రూ.1,269 కోట్లతో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. మొత్తం ఆదాయం రూ.20,666 కోట్లుగా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.20,487 కోట్లతో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. వసూలు కాని నిరర్థక రుణాలు (ఎన్పీఏలు), కంటింజెన్సీలకు చేసిన కేటాయింపులు రూ.3,593 కోట్లుగా ఉన్నాయి. స్థూల ఎన్పీఏలు 14.95% (రూ.97,190 కోట్లు) నుంచి 13.60%కి (రూ.87,762 కోట్లు) మెరుగుపడగా.. నికర ఎన్పీఏలు 4.97 శాతం నుంచి 4.69%కి (రూ.27,437 కోట్లు) తగ్గాయి. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో యూనియన్ బ్యాంకు షేరు 7% లాభంతో రూ.37.95 వద్ద క్లోజయింది. -
మెప్పించిన టెక్ మహీంద్రా
న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ టెక్ మహీంద్రా జూన్తో ముగిసిన త్రైమాసికంలో ఆకర్షణీయమైన పనితీరును ప్రదర్శించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం 43 శాతం వృద్ధి చెంది రూ.1,366 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.956 కోట్లతో పోల్చినా లేక ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలో లాభం రూ.1,206 కోట్లతో చూసినా వృద్ధి చెందింది. లాభాల్లో మార్జిన్ 15.3 శాతానికి విస్తరించడం వల్ల పన్నుకు ముందస్తు లాభంలో 39 శాతం వృద్ధి నమోదైంది. కన్సాలిడేటెడ్ ఆదాయం 10 శాతం పెరిగి రూ.10,485 కోట్లుగా నమోదైంది. సీక్వెన్షియల్గా ఆదాయం (మార్చి క్వార్టర్తో పోలిస్తే) 10 శాతం వృద్ధిని చూపించింది. డాలర్ మారకంలో చూస్తే నికర లాభం 42 శాతానికి పైగా వృద్ధితో 183.2 మిలియన్ డాలర్లుగాను, ఆదాయం 14.6 శాతం వృద్ధితో 1,383 మిలియన్ డాలర్లుగాను ఉన్నాయి. కంపెనీ ఉద్యోగులు సీక్వెన్షియల్గా (మార్చి త్రైమాసికంతో పోల్చినప్పుడు) జూన్ క్వార్టర్లో 5,209 మంది పెరిగారు. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,26,263కు చేరింది. సుమారు 13,544 కోట్లు (183 మిలియన్ డాలర్లు) నగదు, నగదు సమాన నిల్వలున్నాయి. కంపెనీ చరిత్రలోనే అత్యధిక త్రైమాసిక లాభాన్ని జూన్ క్వార్టర్లో నమోదు చేసినట్టు సీఎఫ్వో మిలింద్ కుల్కర్ణి తెలిపారు. 815 మిలియన్ డాలర్ల (రూ.6 వేల కోట్లకు పైగా) విలువైన నూతన వ్యాపార ఒప్పందాలను సొంతం చేసుకున్నట్టు వెల్లడించారు. అన్ని విభాగాల్లోనూ మంచి పనితీరును సాధించినట్టు చెప్పా రు. డిజిటల్పై పెరుగుతున్న వ్యయాలను అవకాశాలుగా మలుచుకుని రానున్న కాలంలో ఇదే వృద్ధిని లేదంటే ఇంతకుమించి మెరుగైన పనితీరును నమోదు చేస్తామన్న ఆశాభావాన్ని కంపెనీ ఎండీ, సీఈవో సీపీ గుర్నానీ పేర్కొన్నారు. -
యాపిల్కు కలిసొచ్చిన భారత్
న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం యాపిల్కు భారత్తోపాటు లాటిన్ అమెరికా మార్కెట్లు కలిసొచ్చాయి. దీంతో జూన్ త్రైమాసికంలో కంపెనీ రెండంకెల వృద్ధితో రికార్డు స్థాయిలో ఆదాయాన్ని నమోదు చేసింది. ఈ కాలంలో టర్నోవర్ 36 శాతం అధికమై రూ.6,05,616 కోట్లు సాధించినట్టు సంస్థ సీఈవో టిమ్ కుక్ వెల్లడించారు. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.4.43 లక్షల కోట్లుగా ఉంది. నికరలాభం రూ.83,328 కోట్ల నుంచి రూ.1,61,448 కోట్లకు చేరింది. ఏ దేశం నుంచి ఎంత మొత్తం ఆదాయం సమకూరింది వంటి వివరాలను కంపెనీ వెల్లడించలేదు. ‘ఉత్పత్తులు, సేవల విభాగాల్లో అన్ని ప్రాంతాల్లో రెండంకెల ఆదాయ వృద్ధి దక్కించుకున్నాం. ప్రత్యేకంగా భారత్, లాటిన్ అమెరికా, వియత్నాంతోసహా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు మెరుగైన ఫలితాలు ఇచ్చాయి. ఈ మార్కెట్లలో నమ్మశక్యం కాని త్రైమాసికంగా జూన్ నిలిచిపోతుంది’ అని సీఈవో పేర్కొన్నారు. మొత్తం ఆదాయంలో ఐఫోన్ వాటాయే సింహభాగం ౖMðవసం చేసుకుంది. ఐఫోన్ అమ్మకాల ద్వారా కంపెనీకి రూ. 2,93,880 కోట్లు సమకూరింది. వాటా పరంగా మ్యాక్, ఐప్యాడ్, వేరబుల్స్, ఇతర ఉత్పుత్తులు, సేవలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
సాగర్ సిమెంట్స్ లాభం జూమ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంట్ తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ సాగర్ సిమెంట్స్ జూన్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాలు మెరుగ్గా నమోదు చేసింది. నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 42.35 శాతం ఎగసి రూ.51.43 కోట్లు సాధించింది. టర్నోవర్ 50 శాతం అధికమై రూ.397 కోట్లకు చేరుకుంది. ఎబిటా 23 శాతం పెరిగి రూ.107 కోట్లు దక్కించుకుంది. ఈపీఎస్ 31.87 శాతం పెరిగి రూ.21.31గా ఉంది. మధ్యప్రదేశ్లో సద్గురు సిమెంట్స్ రూ.578 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ప్లాంట్ నిర్మాణం సెప్టెంబర్ నాటికి పూర్తి కానుంది. ఒడిశాలో జైపూర్ సిమెంట్స్ రూ.312 కోట్లతో నెలకొల్పుతున్న ప్లాంట్ రెండు నెలల్లో సిద్ధం అవుతోంది అని సంస్థ జేఎండీ శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. సాగర్ సిమెంట్స్ షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే బుధవారం 1.72 శాతం తగ్గి రూ.1,339.75 వద్ద స్థిరపడింది. -
గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి రూ.1,328 కోట్లు
న్యూఢిల్లీ: బంగారం ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్లు)లోకి జూన్ త్రైమాసికంలో భారీగా పెట్టుబడులు వచ్చాయి. నికరంగా రూ.1,328 కోట్లను గోల్డ్ ఈటీఎఫ్లు ఆకర్షించాయి. కానీ, క్రితం ఏడాది జూన్ త్రైమాసికంలో వచ్చిన రూ.2,040 కోట్లతో పోలిస్తే తగ్గినట్టు.. మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫి) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గతేడాది భారీగా పెట్టుబడులు రావడం అన్నది అప్పటి అనిశ్చిత పరిస్థితుల వల్లేనని మార్కెట్ పల్స్ సీఈవో అర్షద్ ఫాహోమ్ పేర్కొన్నారు. కరోనా కారణంగా ఏర్పడిన అనిశ్చిత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు సురక్షిత సాధనమైన బంగారంలోకి కొంత పెట్టుబడులను మళ్లించడమే భారీ పెట్టుబడులకు కారణమని గ్రీన్పోర్ట్ఫోలియో సహ వ్యవస్థాపకుడు దివమ్ శర్మ తెలిపారు. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో (జనవరి–మార్చి) బంగారం ఈటీఎఫ్ల్లోకి రూ. 1,779 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం. 5 -
ఐఆర్సీటీసీకి రూ.25 కోట్ల నష్టాలు
న్యూఢిల్లీ: ఐఆర్సీటీసీ కంపెనీకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020–21) జూన్ క్వార్టర్లో రూ.25 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం (2019–20) ఇదే క్వార్టర్లో రూ.72 కోట్ల నికర లాభం వచ్చిందని ఐఆర్సీటీసీ తెలిపింది. కరోనా వైరస్ కల్లోలం, లాక్డౌన్ల కారణంగా ఈ క్యూ1లో నష్టాలు వచ్చాయని వివరించింది. కార్యకలాపాల ఆదాయం రూ.459 కోట్ల నుంచి 71 శాతం పతనమై రూ.131 కోట్లకు పడిపోయిందని పేర్కొంది. టూరిజం విభాగం ఆదాయం రూ.48 కోట్ల నుంచి రూ.3 కోట్లకు తగ్గిందని తెలిపింది. కేటరింగ్ విభాగం ఆదాయం రూ.272 కోట్ల నుంచి రూ.90 కోట్లకు, రైల్నీర్ ఆదాయం రూ.58 కోట్ల నుంచి రూ.3 కోట్లకు తగ్గాయని పేర్కొంది. మర్చంట్ బ్యాంకర్ల డెడ్లైన్ 14 వరకూ పొడిగింపు ఐఆర్సీటీసీలో 15–2 శాతం వాటాను కేంద్రం ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్)మార్గంలో విక్రయించనున్న విషయం తెలిసిందే. ఈ వాటా విక్రయానికి మర్చంట్ బ్యాంకర్లుగా వ్యవహరించడానికి కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తులను సమర్పించడానికి గడువు తేదీని ఈ నెల 10 నుంచి మరో నాలుగు రోజులు... .ఈ నెల 14 వరకూ పొడిగించింది. ఐఆర్సీటీసీలో కేంద్రానికి 87.40 శాతం వాటా ఉంది. సెబీ పబ్లిక్ హోల్డింగ్ నిబంధనల ప్రకారం ఈ వాటాను 75 శాతానికి తగ్గించుకోవలసి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వాటాల విక్రయం ద్వారా రూ.2.1 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని చేరడానికి ఐఆర్సీటీసీ వాటా విక్రయం ఒకింత తోడ్పడుతుందని అంచనా. కేంద్రం ఇటీవలనే హిందుస్తాన్ ఏరోనాటిక్స్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కంపెనీల్లో వాటా విక్రయం ద్వారా రూ.5,000 కోట్లు సమీకరించింది. మర్చంట్ బ్యాంకర్ల గడువు పొడిగింపు వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో ఐఆర్సీటీసీ షేర్ 0.2% లాభంతో రూ. 1,374 వద్ద ముగిసింది. -
ఎస్బీఐ లాభాల ఖాతా
న్యూఢిల్లీ: ఎస్బీఐ లాభం జూన్ త్రైమాసికంలో గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్లో బ్యాంకు 2.1 శాతం వాటాను జూన్ క్వార్టర్లో విక్రయించడం ద్వారా రూ.1,540 కోట్లను సమకూర్చుకుంది. దీంతో బ్యాంకు స్టాండలోన్ లాభం రూ.4,189 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.2,312 కోట్లుగా ఉంది. వాటాల విక్రయం అనంతరం ఎస్బీఐ లైఫ్లో ఎస్బీఐ వాటా 55.60 శాతానికి తగ్గింది. ఇక బ్యాంకు స్టాండలోన్ ఆదాయం రూ.70,653 కోట్ల నుంచి రూ.74,458 కోట్లకు వృద్ధి చెందింది. నిర్వహణ లాభం 36 శాతం పెరిగి రూ.18,061 కోట్లుగా ఉంటే, వడ్డీ ఆదాయం సైతం రూ.62,638 కోట్ల నుంచి 6 శాతం వృద్ధితో రూ.66,500 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్ మాత్రం 3.24 శాతం నుంచి 3.01 శాతానికి తగ్గిపోయింది. తగ్గిన మొండిబకాయిలు.. బ్యాంకు స్థూల నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏలు) గతేడాది ఇదే త్రైమాసికంలో 7.53 శాతంగా ఉంటే, తాజాగా 5.44 శాతానికి క్షీణించాయి. అదే విధంగా నికర ఎన్పీఏలు కూడా 3.07 శాతం నుంచి 1.8 శాతానికి పరిమితమయ్యాయి. ఎన్పీఏలకు చేసిన కేటాయింపులు కూడా రూ.9,420 కోట్లకు పరిమితమయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఎన్పీఏలకు బ్యాంకు రూ.11,648 కోట్లను పక్కన పెట్టడం గమనార్హం. ముఖ్యంగా కరోనా కారణంగా ఎగవేతలను దృష్టిలో ఉంచుకుని రూ.1,836 కోట్లను కేటాయించింది. ప్రొవిజన్ కవరేజీ రేషియో 86.32 శాతానికి చేరింది. సీఏఆర్ 13.40 శాతానికి పెరిగింది. సబ్సిడరీలతో కలసి చూస్తే.. కన్సాలిడేటెడ్గా ఎస్బీఐ నికర లాభం 62 శాతం దూసుకుపోయింది. రూ.4,776 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.2,950 కోట్లుగా ఉంది. కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.83,274 కోట్ల నుంచి రూ.87,984 కోట్లకు పెరిగింది. ఈ కాలంలో రుణ వృద్ధి 6.58 శాతంగా నమోదైంది. ప్రధానంగా రిటైల్ విభాగంలో (వ్యక్తిగత రుణాలు) 12.85 శాతం, విదేశీ బ్రాంచ్ల ద్వారా 11 శాతం మేర అధిక రుణాలు పంపిణీ చేసింది. నిధుల సమస్య లేదు.. మూలధన నిధుల పరంగా అదనపు మద్దతు సాయం, క్షీణిస్తున్న నగదు ప్రవాహాల రూపంలో తమకు సవాళ్లు ఎదురుకావచ్చని పేర్కొంది. -
హెచ్డీఎఫ్సీ లాభం రూ. 4,059 కోట్లు
ముంబై: దేశంలోనే అతిపెద్ద గృహ రుణ సంస్థ హెచ్డీఎఫ్సీ జూన్ త్రైమాసికంలో మిశ్రమ పనితీరు చూపించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం 15 శాతం వృద్ధి చెంది రూ.4,059 కోట్లుగా నమోదైంది. ఆదాయం మాత్రం 2 శాతం క్షీణించి రూ.11,168 కోట్లుగా ఉంది. బ్యాంకింగ్, బీమా, మ్యూచువల్ ఫండ్స్ సహా దాదాపు అన్ని రకాల ఆర్థిక సేవల విభాగాల్లో కంపెనీలకు సబ్సిడరీలు ఉన్నాయి. వీటిని మినహాయించి స్టాండలోన్గా (కేవలం గృహ రుణాల వ్యాపారం) చూసుకుంటే సంస్థ లాభం 5 శాతం క్షీణించి రూ.3,051 కోట్లుగా నమోదైంది. ఆదాయం 2 శాతం పెరిగి 10790 కోట్లుగా ఉంది. తగ్గని మారటోరియం రుణాలు సంస్థ మొత్తం రుణాల్లో ఇప్పటికీ 22 శాతం మారటోరియం పరిధిలోనే ఉన్నాయి. మొదటి విడత మారటోరియం (రుణ చెల్లింపులకు విరామం) కాలం అయిన మే చివరి నాటికి 27 శాతం రుణాలు ఆ పరిధిలో ఉన్నాయి. వీటిల్లో రిటైల్ రుణ గ్రహీతలవి 16.6 శాతం. ఆగస్టు చివరి వరకు ఈ మారటోరియంను ఆర్బీఐ కొనసాగించగా.. ఈ అవకాశాన్ని ఎక్కువ మంది వినియోగించుకున్నట్టు తెలుస్తోంది. ముందు నాటితో పోలిస్తే 5 శాతం మందే రుణ చెల్లింపులకు ముందుకు వచ్చారు. ఎన్పీఏలు 1.87%: సంస్థ స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు/వసూలు కాని రుణాలు) మొత్తం రుణాల్లో గతంలో 1.99 శాతంగా ఉంటే, జూన్ ఆఖరుకు 1.87 శాతానికి తగ్గాయి. సంస్థ నికర వడ్డీ మార్జిన్ 3.1 శాతంగా ఉంది. -
డాక్టర్ రెడ్డీస్ లాభం 579 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఔషధ రంగ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్ఎల్) నికర లాభం 13 శాతం క్షీణించి రూ. 579 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో నికర లాభం రూ. 663 కోట్లు. ఇక ఆదాయం 15 శాతం పెరిగి రూ. 3,843 కోట్ల నుంచి రూ. 4,417 కోట్లకు చేరింది. డీఆర్ఎల్ సీఎఫ్వో సౌమేన్ చక్రవర్తి బుధవారం ఈ విషయాలు వెల్లడించారు. కరోనా వైరస్ సంక్షోభ సమయంలోనూ కార్యకలాపాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవడం, ఉత్పాదకతను పెంచుకునే చర్యలు కొనసాగించడం మొదలైన అంశాలపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు ఆయన వివరించారు. క్యూ1లో అన్ని అంశాల్లోనూ ఆర్థికంగా పటిష్టమైన పనితీరు కనపర్చగలిగామని డీఆర్ఎల్ సహ–చైర్మన్ జీవీ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. వోక్హార్డ్ నుంచి కొనుగోలు చేసిన వ్యాపారాన్ని డీఆర్ఎల్ వ్యవస్థకు అనుసంధానించే ప్రక్రియ ప్రారంభించినట్లు వివరించారు. ఆగస్టులో రెండు కోవిడ్ ఔషధాలు.. కోవిడ్–19 వ్యాధి చికిత్సలో ఉపయోగించే రెండు యాంటీ వైరల్ ఔషధాలు.. రెమిడెసివిర్, ఫావిపిరావిర్ను ఆగస్టులో ప్రవేశపెట్టేందు కు సన్నాహాలు చేస్తున్నట్లు చక్రవర్తి తెలిపారు. రెమ్డిసివిర్ను వర్ధమా న, ఆసియా దేశాలకు కూడా ఎగుమతి చేయాలని భావిస్తున్నట్లు సంస్థ సీఈవో ఎరెజ్ ఇజ్రేలీ పేర్కొన్నారు. భారత్ సహా 127 దేశాల్లో రెమ్డిసివిర్ విక్రయానికి సంబంధించి అమెరికన్ సంస్థ గిలీడ్ సైన్సెస్తో డీఆర్ఎల్కు ఒప్పందం ఉంది. అలాగే, అవిగాన్ ట్యాబ్లెట్స్ (ఫావిపిరావిర్) విక్రయానికి సంబంధించి జపాన్కు చెందిన ఫ్యూజి ఫిల్మ్ కార్పొరేషన్తో ఒప్పందం ఉంది. గ్లోబల్ జనరిక్స్కు యూరప్ ఊతం.. యూరప్, వర్ధమాన మార్కెట్ల ఊతంతో గ్లోబల్ జనరిక్స్ విభాగం ఆదాయాలు ఆరు శాతం పెరిగి రూ. 3,507 కోట్లకు చేరింది. కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడంతో పాటు అమ్మకాలు పెరగడంతో యూరప్లో ఆదాయం 48 శాతం ఎగిసింది. కీలకమైన ఉత్తర అమెరికా మార్కెట్లో ఆదాయం ఆరు శాతం పెరిగింది. కొత్త ఉత్పత్తులు, సానుకూల ఫారెక్స్ రేటు ఇందుకు తోడ్పడ్డాయని కంపెనీ తెలిపింది. క్యూ1లో ఉత్తర అమెరికా మార్కెట్లో ఆరు కొత్త ఔషధాలు ప్రవేశపెట్టినట్లు వివరించింది. భారత మార్కెట్లో మాత్రం ఆదాయం వార్షిక ప్రాతిపదికన 10 శాతం, సీక్వెన్షియల్గా 8 శాతం క్షీణించింది. కరోనా వైరస్ పరిణామాలతో అమ్మకాలు క్షీణించడమే ఇందుకు కారణం. తొలి త్రైమాసికంలో దేశీ మార్కెట్లో డీఆర్ఎల్ నాలుగు కొత్త బ్రాండ్స్ను ప్రవేశపెట్టింది. పీఎస్ఏఐకి కొత్త ఉత్పత్తుల తోడ్పాటు ఫార్మాస్యూటికల్ సర్వీసెస్, యాక్టివ్ ఇంగ్రీడియెంట్స్ (పీఎస్ఏఐ) విభాగం ఆదాయాలు వార్షికంగా 88 శాతం, సీక్వెన్షియల్గా 19 శాతం పెరిగాయి. కొన్ని ఉత్పత్తుల విక్రయాలు భారీగా పెరగడం, కొత్త ఉత్పత్తుల అమ్మకాలు, సానుకూల ఫారెక్స్ రేటు ఇందుకు తోడ్పడ్డాయి. సమీక్షాకాలంలో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై కంపెనీ రూ. 400 కోట్లు వెచ్చించింది. ప్రధానంగా సంక్లిష్టమైన జనరిక్స్, బయో–సిమిలర్స్ తదితర ఉత్పత్తుల రూపకల్పనపై దృష్టి పెడుతోంది. కోవిడ్–19 చికిత్స సంబంధ ఔషధాల అభివృద్ధి ప్రాజెక్టులపైనా కసరత్తు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. -
మారుతీ చరిత్రలో తొలిసారి నష్టాలు
న్యూఢిల్లీ: దేశీయ కార్ల మార్కెట్లలో రారాజు అయిన మారుతి సుజుకీ కరోనా దెబ్బకు నష్టాల పాలైంది. జూన్తో అంతమైన మూడు నెలల కాలంలో రూ.268 కోట్ల కన్సాలిడేటెడ్ నష్టం వచ్చింది. 2003 జూలైలో కంపెనీ స్టాక్ ఎక్ఛ్సేంజ్లలో లిస్ట్ అయిన తర్వాత నష్టాలు ఎదుర్కోవడం మొదటిసారి. సరిగ్గా ఏడాది క్రితం ఇదే జూన్ త్రైమాసికంలో మారుతి రూ.1,377 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాలను కళ్ల చూడగా, కరోనా మహమ్మారి కారణంగా కార్యకలాపాలపై గట్టి ప్రభావమే పడినట్టు తెలుస్తోంది. ఇక జూన్తో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రూ.18,739 కోట్ల నుంచి రూ.3,679 కోట్లకు పరిమితమైంది. వాహన విక్రయాలు 76,599 యూనిట్లుగా ఉన్నాయి. వీటిల్లో దేశీయంగా 67,027 వాహనాలను విక్రయించగా, 9,572 యూనిట్లను ఎగుమతి చేసింది. కానీ సరిగ్గా ఏడాది క్రితం ఈ కాలంలో కంపెనీ విక్రయాలు 4,02,594 యూనిట్లుగా ఉండడం గమనార్హం. ‘‘కరోనా మహమ్మారి కారణంగా కంపెనీ చరిత్రలోనే ఇదొక అసాధారణ త్రైమాసికం. ఈ కాలంలో ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ కారణంగా అధిక సమయం ఎటువంటి ఉత్పత్తి, విక్రయాలకు అవకాశం లభించలేదు. మా మొదటి ప్రాధాన్యత ఉద్యోగులు, భాగస్వాములు, కస్టమర్ల ఆరోగ్యం, భద్రతకే. దీంతో జూన్ త్రైమాసికంలో చేసిన మొత్తం ఉత్పత్తి సాధారణ రోజుల్లో అయితే రెండు వారాల ఉత్పత్తికి సమానం’’ అని మారుతి సుజుకీ తన ప్రకటనలో వివరించింది. కరోనా ముందస్తు కార్యకలాపాల స్థాయికి చేరువ అవుతున్నట్టు తెలిపింది. ఫలితాల నేపథ్యంలో మారుతి సుజుకీ స్టాక్ బీఎస్ఈలో 1.6 శాతం నష్టపోయి రూ.6,186 వద్ద ముగిసింది. -
కోటక్ మహీంద్రా లాభం 9 శాతం డౌన్
న్యూఢిల్లీ: కోటక్ మహీంద్రా బ్యాంకు స్టాండలోన్ నికర లాభం (బ్యాంకు వరకే) జూన్ త్రైమాసికంలో 8.5 శాతం తగ్గి రూ.1,244 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.1,360 కోట్లుగా ఉండడం గమనార్హం. మార్చి త్రైమాసికం లాభం రూ.1,266 కోట్లతో పోల్చి చూస్తే పెద్దగా మార్పులేదు. ఆదాయం సైతం రూ.7,945 కోట్ల నుంచి రూ.7,685 కోట్లకు తగ్గింది. నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు), కంటింజెన్సీలకు చేసిన కేటాయింపులు గణనీయంగా పెరిగి రూ.962 కోట్లకు చేరాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో కేటాయింపులు రూ.316 కోట్లతో పోలిస్తే 3 రెట్లు పెరిగాయి. ఈ ఏడాది మార్చి క్వార్టర్లో కేటాయింపులు రూ.1,047 కోట్లతో పోల్చుకుంటే జూన్ క్వార్టర్లో తగ్గాయి. స్థూల ఎన్పీఏలు 2.19% నుంచి 2.70%కి (రూ.5,619 కోట్లు) చేరాయి. నికర ఎన్పీఏలు 0.73% నుంచి 0.87%కి (రూ.1,777 కోట్లు) చేరాయి. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం 4.1% తగ్గి రూ.1,853 కోట్లుగా ఉంటే, ఆదాయం రూ.12,129 కోట్ల నుంచి రూ.12,323 కోట్లకు ఎగసింది. ఆర్థిక మందగమనం కారణంగా రుణ ఎగవేతలు పెరగొచ్చని, దీంతో రానున్న కాలంలో గ్రూపు స్థాయిలో కేటాయింపులు పెరుగుతాయని కోటక్ బ్యాంకు పేర్కొంది. -
కోరమాండల్ లాభం 301 శాతం జంప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎరువుల తయారీ సంస్థ కోరమాండల్ ఇంటర్నేషనల్ జూన్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 301 శాతం అధికమై రూ.250 కోట్లు నమోదు చేసింది. నెట్ ప్రాఫిట్ మార్జిన్ 4.87 శాతం పెరిగి 7.8 శాతంగా ఉంది. ఎబిటా 113 శాతం హెచ్చి రూ.415 కోట్లుంది. టర్నోవరు రూ.2,141 కోట్ల నుంచి రూ.3,224 కోట్లకు దూసుకెళ్లింది. ఒకవైపు కోవిడ్–19 మహమ్మారి ఉన్నప్పటికీ ఉత్తమ ఫలితాలు నమోదు చేశామని సంస్థ ఎండీ సమీర్ గోయల్ ఈ సందర్భంగా తెలిపారు. నూట్రియెంట్ మరియు అనుబంధ విభాగాలు మెరుగైన పనితీరు కనబరిచాయని చెప్పారు. ఫాస్ఫాటిక్ ఫెర్టిలైజర్ విక్రయాలు 75 శాతం అధికమైందని వెల్లడించారు. మార్కెట్ వాటా 13.2 నుంచి 16 శాతానికి ఎగబాకిందని పేర్కొన్నారు. -
61% పడిపోయిన బజాజ్ ఆటో లాభం
న్యూఢిల్లీ: లాక్డౌన్ ప్రభావం బజాజ్ ఆటో కంపెనీపై గట్టిగానే పడింది. జూన్ త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.395 కోట్లు.. ఆదాయం రూ.3,079 కోట్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలతో పోల్చి చూస్తే లాభం, ఆదాయం 61 శాతం మేర తగ్గిపోయాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీకి రూ.1,012 కోట్ల లాభం, రూ.7,776 కోట్ల ఆదాయం రావడం గమనార్హం. స్టాండలోన్ లాభం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.1,126 కోట్ల నుంచి రూ.528 కోట్లకు తగ్గిపోయింది. జూన్ త్రైమాసికంలో కంపెనీ 4,43,103 వాహనాలను విక్రయించింది. ఇందులో 2,51,000 యూనిట్లు (విలువ పరంగా రూ.1,651 కోట్లు) ఎగుమతి చేసినవే. క్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 12,47,174 యూనిట్లుగా ఉన్నాయి. ‘‘కరోనా మహమ్మారి కారణంగా మొదటి త్రైమాసికం పూర్తిగా సవాళ్లతో కొనసాగింది. లాక్డౌన్, వైరస్ నియంత్రణ చర్యలు సరఫరా వ్యవస్థపై ప్రభావం చూపించడంతో మొత్తం మీద డిమాండ్ తగ్గింది’’ అని బజాజ్ ఆటో తెలిపింది. ఎగుమతి చేసే మార్కెట్లలో కూడా కరోనా ప్రభావం ఉన్నట్టు కంపెనీ అంగీకరించింది. -
ఎల్అండ్టీ లాభం రూ.537 కోట్లు
న్యూఢిల్లీ: మౌలిక రంగంలోని దిగ్గజ కంపెనీ ఎల్అండ్టీ గ్రూపు కార్యకలాపాలు జూన్ త్రైమాసికంలో గణనీయమైన ప్రభావానికి గురయ్యాయి. కన్సాలిడేటెడ్ లాభం ఏకంగా 68 శాతం పడిపోయి రూ.537 కోట్లకు పరిమితమైంది. ఆదాయం సైతం 27 శాతం తగ్గిపోయి రూ.22,037 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.1,698 కోట్లు, ఆదాయం రూ.30,271 కోట్లుగా ఉన్నాయి. మొత్తం వ్యయాలు కూడా రూ.27,616 కోట్ల నుంచి రూ.21,368 కోట్లకు పరిమితమయ్యాయి. ‘‘కరోనా నియంత్రణకు విధించిన లాక్డౌన్ కారణంగా గ్రూపు కార్యకలాపాలు, ఆర్థిక ఫలితాలపై తీవ్రమైన ప్రభావం పడింది. అందుబాటులో ఉన్న కొద్దిపాటి కార్మికులు, ఉద్యోగులతో కార్యకలాపాలను క్రమంగా, తగిన జాగ్రత్తల మధ్య ఆరంభించాము’’అని ఎల్అండ్టీ తెలిపింది. గ్రూపులో అధిక వ్యాపారాలపై కరోనా ప్రభావం ఉందని.. కస్టమర్లు, ఉద్యోగులు, సబ్ కాంట్రాక్టర్ల పరిధిలో పనిచేసే కార్మికులు, భాగస్వాములు, వెండర్ల ప్రయోజనాల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకున్నట్టు వివరించింది. జూన్ త్రైమాసికంలో కంపెనీ రూ.23,574 కోట్ల విలువ చేసే నూతన ఆర్డర్లను సొంతం చేసుకుంది. ఇందులో రూ.8,872 కోట్ల మేర అంతర్జాతీయ ఆర్డర్లే. గ్రూపు కన్సాలిడేటెడ్ ఆర్డర్ల విలువ జూన్ ఆఖరుకు రూ.3,05,083 కోట్లుగా ఉంది. -
బ్రిటానియాకు ‘బిస్కెట్ల’ దన్ను
న్యూఢిల్లీ: బ్రిటానియా ఇండస్ట్రీస్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం(2020–21) జూన్ క్వార్టర్లో రెట్టింపునకు మించి పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం (2019–20) క్యూ1లో రూ.249 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.543 కోట్లకు పెరిగింది. లాక్డౌన్ సమయంలో బిస్కెట్లకు డిమాండ్ పెరగడం, వలస కార్మికులు పట్టణాల నుంచి పల్లెలకు చేరడం కూడా ఈ కంపెనీ అమ్మకాలకు కలసివచ్చిందని నిపుణులంటున్నారు. మొత్తం ఆదాయం రూ.2,768 కోట్ల నుంచి 27 శాతం వృద్ధితో రూ.3,514 కోట్లకు పెరిగిందని కంపెనీ పేర్కొంది. అన్ని అంశాల్లోనూ ఈ కంపెనీ ఫలితాలు విశ్లేషకుల అంచనాలను మించాయి. ► నిర్వహణ లాభం రూ.395 కోట్ల నుంచి రూ.717 కోట్లకు ఎగసింది. ► నిర్వహణ లాభ మార్జిన్ 6.4 శాతం పెరిగి 21 శాతానికి చేరింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో బ్రిటానియా ఇండస్ట్రీస్ షేర్ 2 శాతం నష్టంతో రూ.3,784 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఏడాది గరిష్ట స్థాయి, రూ.3,949ను తాకింది. -
స్పైస్జెట్ రికార్డ్ లాభం
న్యూఢిల్లీ: స్పైస్జెట్ కంపెనీ మళ్లీ లాభాల్లోకి రావడమే కాకుండా, రికార్డ్ స్థాయి త్రైమాసిక లాభాన్ని ఈ ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్లో సాధించింది. బోయింగ్ 737 మ్యాక్స్ విమాన సర్వీసులను నిలిపేసినప్పటికీ, ఈ కంపెనీ ఈ క్యూ1లో రూ.262 కోట్ల నికర లాభం సాధించింది. గత క్యూ1లో రూ.38 కోట్ల నికర నష్టాలు వచ్చాయని స్పైస్జెట్ తెలిపింది. గత క్యూ1లో రూ.2,253 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో రూ.3,145 కోట్లకు పెరిగిందని పేర్కొంది. బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల నిలిపివేత.. ఈ జూన్ క్వార్టర్లో బాగానే ప్రభావం చూపించిందని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కిరణ్ కోటేశ్వర్ తెలిపారు. ఈ ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, నిర్వహణ ఆదాయం రూ.2,220 కోట్ల నుంచి రూ.3,002 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. సగటు విమాన చార్జీ 11 శాతం పెరిగిందని పేర్కొన్నారు. 107 విమానాలతో సర్వీసులు ఈ ఏడాది అక్టోబర్ కల్లా బోయింగ్ 737 ఎన్జీ విమానాలను 5–10 వరకూ కొత్తగా సర్వీసుల్లోకి తీసుకోనున్నామని కోటేశ్వర్ తెలిపారు. జూన్ చివరినాటికి మొత్తం 107 విమానాలతో సర్వీసులనందిస్తున్నామని ఆయన వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలోస్పైస్జెట్ షేర్ 1 శాతం లాభంతో రూ.138 వద్ద ముగిసింది. -
తయారీ, మైనింగ్ పేలవం
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) వృద్ధి రేటు మెరుగుపడ్డం లేదు. జూన్లో కేవలం 2 శాతంగా నమోదయ్యింది. అంటే 2018 జూన్తో (అప్పట్లో వృద్ధి రేటు 7 శాతం) పోల్చితే 2019 జూన్లో కేవలం 2 శాతం వృద్ధి మాత్రమే నమోదయ్యిందన్నమాట. గడచిన నాలుగు నెలల్లో ఇంత తక్కువస్థాయి వృద్ధి రేటు ఇదే తొలిసారి. శుక్రవారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► మైనింగ్, తయారీ రంగాలు పేలవ పనితనాన్ని ప్రదర్శించాయి. ► దేశంలో పారిశ్రామికరంగం వృద్ది రేటు మందగమనంలో కొనసాగుతోంది. ఫిబ్రవరిలో కేవలం 0.2 శాతం వృద్ధి నమోదయ్యింది. మార్చిలో 2.7 శాతంగా ఉంది. ఏప్రిల్ (4.3 శాతం), మే నెలల్లో (4.6 శాతం) కొంత బాగుందనిపించినా, మళ్లీ జూన్ వచ్చే సరికి భారీగా జారిపోయింది. ► తయారీ: 2018 జూన్లో 6.9 శాతంగా ఉన్న తయారీ రంగంలో వృద్ధి రేటు 2019 జూన్లో కేవలం 1.2 శాతానికి పడిపోయింది. తయారీ రంగంలోని మొత్తం 23 పారిశ్రామిక గ్రూపుల్లో 8 మాత్రమే సానుకూల వృద్ధిరేటును నమోదు చేసుకున్నాయి. ► క్యాపిటల్ గూడ్స్: భారీ యంత్రపరికరాల ఉత్పత్తి, డిమాండ్లను సూచించే క్యాపిటల్ గూడ్స్ విభాగంలో వృద్ధి 9.7 శాతం నుంచి 6.5 శాతానికి పడిపోయింది. ► మైనింగ్: మైనింగ్లో వృద్ధి రేటు 6.5 శాతం నుంచి 1.6 శాతానికి పడిపోయింది. ► విద్యుత్: విద్యుత్ ఉత్పత్తి 8.5 శాతం నుంచి 8.2 శాతానికి తగ్గింది. ► కన్జూమర్ డ్యూరబుల్స్: కార్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల వంటి కన్జూమర్ డ్యూరబుల్స్ ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా –5.5 శాతం క్షీణత నమోదయ్యింది. ► కన్జూమర్ నాన్–డ్యూరబుల్స్: కాస్మొటిక్స్, క్లీనింగ్ ప్రొడక్ట్స్, దుస్తులు వంటి ఫాస్ట్ మూ వింగ్ కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగంలో మాత్రం వృద్ధి రేటు 7.8 శాతంగా ఉంది. జూన్ త్రైమాసికమూ మందగమనమే ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలలు ఏప్రిల్, మే, జూన్ త్రైమాసిక కాలాన్ని చూసినా, పారిశ్రామిక వృద్ధి మందగమనంలోనే ఉంది. ఈ కాలంలో వృద్ధి రేటు కేవలం 3.6 శాతంగా నమోదయ్యింది. 2018 ఇదే కాలంలో ఈ వృద్ధి రేటు 5.1 శాతంగా ఉంది. -
భెల్ నష్టాలు రూ.219 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ భెల్ కంపెనీకి ఈ ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్లో రూ.219 కోట్ల నికర నష్టాలు(కన్సాలిడేటెడ్) వచ్చాయి. గత క్యూ1లో రూ.40 కోట్ల నికర లాభం ఆర్జించామని భెల్ తెలిపింది. ఆదాయం తక్కువగా ఉండటంతో ఈ క్యూ1లో నష్టాలు వచ్చాయని వివరించింది. మొత్తం ఆదాయం రూ.6,116 కోట్ల నుంచి రూ.4,673 కోట్లకు తగ్గిందని పేర్కొంది. విద్యుత్తు విభాగం ఆదాయం రూ.4,636 కోట్ల నుంచి రూ.3,492 కోట్లకు, ఇండస్ట్రీ సెగ్మెంట్ ఆదాయం రూ.1,161 కోట్ల నుంచి రూ.920 కోట్లకు తగ్గాయని భెల్ పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో భెల్ షేర్ 2 శాతం నష్టంతో రూ.57 వద్ద ముగిసింది. -
ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ లాభం 359 కోట్లు
న్యూఢిల్లీ: లార్సెన్ అండ్ టుబ్రో(ఎల్ అండ్ టీ) గ్రూప్నకు చెందిన ఐటీ కంపెనీ ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్(ఎల్టీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్లో రూ.359 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో ఆర్జించిన నికర లాభం(రూ.361 కోట్లు)తో పోల్చితే ఒకటిన్నర శాతం క్షీణత నమోదైందని ఎల్టీఐ తెలిపింది. ఆదాయం మాత్రం రూ.2,156 కోట్ల నుంచి 15 శాతం వృద్ధితో రూ.2,485 కోట్లకు పెరిగిందని కంపెనీ సీఈఓ, ఎమ్డీ, సంజయ్ జలోన పేర్కొన్నారు. నిలకడ కరెన్సీ రేట్ల మారకం ప్రాతిపదికన ఆదాయంలో 12 శాతం వృద్ధిని సాధించామని తెలిపారు. డిజిటల్ సర్వీస్ల విభాగం మంచి వృద్ధిని సాధించిందని, తమ మొత్తం ఆదాయంలో ఈ విభాగం వాటా 39 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. డాలర్ల పరంగా ఆదాయం 12 శాతం వృద్ధితో 36 కోట్ల డాలర్లకు చేరిందని వివరంచారు. ఈ ఏడాది జూన్ నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 29,347కు పెరిగిందని, ఆట్రీషన్(ఉద్యోగుల వలస) 18.3 శాతంగా ఉందని వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ షేర్ 2 శాతం నష్టంతో రూ.1,578 వద్ద ముగిసింది. -
విప్రో లాభం 2,388 కోట్లు
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం విప్రో నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్లో 12 శాతం వృద్ధితో రూ.2,388 కోట్లకు పెరిగింది. అయితే సీక్వెన్షియల్గా చూస్తే, (గత క్యూ4లో వచ్చిన నికర లాభం రూ.2,484 కోట్లుతో పోల్చితే) 4 శాతం తగ్గింది. గత క్యూ1లో రూ.13,978 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం 5 శాతం వృద్ధితో రూ.14,716 కోట్లకు పెరిగిందని విప్రో కంపెనీ తెలిపింది. సీక్వెన్షియల్గా చూస్తే, 9% తగ్గింది. సెప్టెంబర్ క్వార్టర్లో ఆదాయం 2% మేర పెరగగలదని ఈ కంపెనీ అంచనా వేస్తోంది. కాగా ఇటీవలే ఫలితాలు వెల్లడించిన టీసీఎస్, ఇన్ఫోసిస్ల కంటే విప్రో ఆదాయం విషయంలో వెనకబడిపోయింది. టీసీఎస్ ఆదాయం 11% వృద్ధితో రూ.38,172 కోట్లకు, ఇన్ఫోసిస్ ఆదాయం 14% వృద్ధితో రూ.21,803 కోట్లకు పెరిగాయి. నిర్వహణ లాభం 6 శాతం డౌన్... కంపెనీకి కీలకమైన ఐటీ సర్వీసుల విభాగం ఆదాయం 2 శాతం తగ్గి 203 కోట్ల డాలర్లకు చేరిందని విప్రో వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో ఈ విభాగం ఆదాయం 204–208 కోట్ల డాలర్ల(0–2% వృద్ధి)రేంజ్లో ఉండగలదని పేర్కొంది. సీక్వెన్షియల్గా చూస్తే, ఈ విభాగం నిర్వహణ లాభం 6% తగ్గి రూ.2,652 కోట్లకు చేరిందని, మార్జిన్ 1% తగ్గి 18.4 శాతానికి చేరిందని తెలిపింది. వేతనాల వ్యయం అధికంగా ఉండటం, రూపాయి బలపడటం దీనికి కారణాలని వివరించింది. పరిస్థితులు మెరుగుపడతాయ్...! 10 కోట్ల డాలర్లకు మించిన డీల్స్ మూడు సాధించామని విప్రో కంపెనీ విప్రో సీఈఓ ఈడీ, అబిదాలి నీమూచ్వాలా పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ నిలకడగానే ఉందన్నారు. అయితే ఆర్థిక వ్యవస్థ మందగమనంగా ఉండటం వల్ల బ్యాంకింగ్, ఆర్థిక, బీమా రంగ కంపెనీలు నిర్ణయాలు తీసుకునే విషయంలో వెనకాడుతున్నాయని వివరించారు. ఇది తాత్కాలికంగానే ఉంటుందని, రోజులు గడుస్తున్న కొద్దీ పరిస్థితులు మెరుగుపడగలవన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. షేర్ల బైబ్యాక్ పూర్తి చేస్తాం... సెబీ ఆమోదం రాగానే రూ.10,500 కోట్ల షేర్ల బైబ్యాక్ను పూర్తి చేస్తామని విప్రో తెలిపింది. ఈ షేర్ల బైబ్యాక్లో భాగంగా ఈ కంపెనీ ఒక్కో షేర్ను రూ.325 ధరకు మొత్తం 32.31 కోట్ల షేర్లను బైబ్యాక్ చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం మందగమనంగానే మొదలైందని విప్రో సీఎఫ్ఓ జతిన్ దలాల్ చెప్పారు. భవిష్యత్తులో మంచి వృద్ధి సాధన దిశగా ప్రతిభ, సామర్థ్యాలపై పెట్టుబడులు కొనసాగిస్తామన్నారు. మార్కెట్లో ట్రేడింగ్ ముగిసిన తర్వాత కంపెనీ ఆర్థిక ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలపై అనిశ్చితి కారణంగా బీఎస్ఈలో విప్రో షేర్ 0.13 శాతం నష్టంతో రూ.260 వద్ద ముగిసింది. -
టీవీఎస్ మోటార్స్ లాభం 7 శాతం అప్
న్యూఢిల్లీ: వాహనాల తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ జూన్ త్రైమాసికంలో రూ. 129 కోట్ల నికర లాభం ప్రకటించింది. ప్రీ–జీఎస్టీ వాహన నిల్వలకు సంబంధించి డీలర్లకు అదనపు డిస్కౌంటు కోసం రూ. 16.50 కోట్లు కేటాయించిన అనంతరం ఈ లాభాలు నమోదు చేసినట్లు సంస్థ పేర్కొంది. ఇది క్రితం క్యూ1లో నమోదైన రూ. 121 కోట్లతో పోలిస్తే సుమారు 7 శాతం అధికం. అటు క్యూ1లో ఆదాయం రూ. 3,188 కోట్ల నుంచి రూ. 3,800 కోట్లకు పెరిగింది. ఉత్పత్తుల రేట్లు తగు రీతిలో తగ్గించడం ద్వారా వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్టీ) ప్రయోజనాలను వినియోగదారులకు బదలాయించినట్లు సంస్థ తెలిపింది. -
బోనస్ ప్రకటించిన బీహెచ్ఈఎల్
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బీహెచ్ఈఎల్ లాభం జూన్ త్రైమాసికంలో 3.9 శాతం వృద్ధితో రూ.80 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో వచ్చిన లాభం రూ.77 కోట్లు. ఆదాయం మాత్రం 1.5 శాతం తగ్గి రూ.5,820 కోట్ల నుంచి రూ.5,732 కోట్లకు చేరింది. మెటీరియల్స్, ఉద్యోగుల ప్రయోజనాలు, తరుగుదల తదితర రూపంలో వ్యయాలు 2 శాతం పెరిగి రూ.6,086 కోట్లకు చేరినట్టు సంస్థ తెలిపింది. విద్యుత్ రంగం నుంచి వచ్చిన ఆదాయం రూ.4,335 కోట్లుగా ఉంది. పూర్తి చేయాల్సిన ఆర్డర్ బుక్ విలువ రూ.1,01,380 కోట్లుగా ఉన్నట్టు బీహెచ్ఈఎల్ తెలిపింది. ప్రతి రెండు షేర్లకు గాను ఒక షేరును బోనస్గా ఇచ్చేందుకు బోర్డు సిఫారసు చేసింది. -
గ్రామాల్లో కార్లకు గిరాకీ!
♦ జూన్ క్వార్టర్లో 30 శాతం పెరిగిన విక్రయాలు ♦ మారుతి, హ్యుందాయ్లకు కలిసొచ్చిన కాలం న్యూఢిల్లీ: కార్ల కంపెనీలపై ఈ వర్షకాలం లాభాల జల్లు కురిపిస్తోంది. సాధారణ వర్షపాతం అంచనాలతో మొదటి త్రైమాసికంలో కార్ల విక్రయాలు అధిక సంఖ్యలో అమ్ముడుపోయాయి. మారుతి సుజుకి విక్రయాలు గ్రామీణ ప్రాంతాల్లో 30% పెరగ్గా, హ్యుందాయ్ అమ్మకాల్లో 23%కి పైగా వృద్ధి నమోదైంది. దేశీయ కార్ల మార్కెట్లో ఈ రెండు సంస్థల ఉమ్మడి వాటా 67%. వీటి విక్రయాల ద్వారా పరిశ్రమ ప్రగతిని తేలిగ్గా అంచనా వేయొచ్చు. మొత్తం విక్రయాల వృద్ధి కన్నా గ్రామీణ ప్రాంతాల్లో అధిక వృద్ధి నమోదైంది. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో మారుతీ 1,34,624 కార్లను విక్రయించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో విక్రయాలు 1,04,059తో పోలిస్తే 30% అధికం. మరోవంక దేశ వ్యాప్తంగా మారుతీ కార్ల విక్రయాల్లో వృద్ధి 14 శాతమే. ఈ ఏడాది వర్షపాతం 98%గా ఉంటుందంటూ గత నెలలో భారత వాతావరణ విభాగం తన అంచనాలను సవరించడం తెలిసిందే. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో సెంటిమెంట్ మెరుగైందని, జూన్ త్రైమాసిక విక్రయాల్లో వృద్ధి గణాంకాలు తమ అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయని మారుతీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇక హ్యుందాయ్ ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 18,337 కార్లను గ్రామీణ ప్రాంతాల్లో విక్రయించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 14,879తో పోలిస్తే 23% అధికం. అయితే ఇదే త్రైమాసికంలో మొత్తం మీద భారత మార్కెట్లో హ్యుందాయ్ కార్ల విక్రయాల్లో వృద్ధి 1%లోపే ఉండటం గమనార్హం. మెరుగైన వర్షపాత అంచనాలతో కస్టమర్లలో సెంటిమెంట్ బలపడిందని, దీంతో అధిక వృద్ధి నమోదైందని హ్యుందాయ్ అంటోంది. నెట్వర్క్ విస్తరణపై దృష్టి గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ను గమనించిన ప్రధాన కంపెనీలు తమ రూరల్ నెట్వర్క్ విస్తరణపై దృష్టి పెట్టాయి. కస్టమర్లను చేరుకునేందుకు విక్రయాలు, సేవలకు సంబంధించి సిబ్బందిని నియమించుకుంటున్నాయి. బ్యాంకులతోనూ ప్రత్యేకంగా ఒప్పందాలు చేసుకుంటున్నాయి. హ్యుందాయ్కు గ్రామీణ ప్రాంతాల్లో 300 ఔట్లెట్లున్నాయి. వీటికి అదనంగా కంపెనీ కార్ల విక్రయాల కోసం ఫ్లోట్వ్యాన్స్ను రంగంలోకి దింపింది. ఈ వ్యాన్లు ఒకే చోట స్థిరంగా ఉండకుండా వివిధ గ్రామాల్లో పర్యటిస్తూ కార్ల విక్రయాలు చేపడతాయి. ఇక, పండుగల ప్రారంభ సీజన్ కావడంతో ఈ క్వార్టర్లోనూ విక్రయాలు మరింత మెరుగ్గా ఉంటాయని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. వర్షాకాలం సాగు పనుల నేపథ్యంలో ట్రాక్టర్లకూ, అదే సమయంలో ద్విచక్ర వాహనాలకూ డిమాండ్ ఉంటుందని ఆటోమొబైల్ పరిశ్రమ ఆశిస్తోంది. -
ఎక్స్లెంట్గా ఏసీసీ లాభాలు
న్యూఢిల్లీ : దేశంలో సిమెంట్ తయారీలో అగ్రగామిగా ఉన్న ఏసీసీ రెండో త్రైమాసిక లాభాల్లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చింది. 79 శాతం వృద్ధితో కన్సాలిడెటెడ్ నికర లాభాలు రూ.239.12 కోట్లగా నమోదుచేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ లాభాలు రూ.133.46 కోట్లగా ఉన్నాయి. ఈ సంస్థ జనవరి- డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా ఫాలో అవుతూ ఉంటోంది. దీంతో అన్నీ కంపెనీ 2016 ఆర్థిక సంవత్సర తొలి ఫలితాలను విడుదల చేస్తుండగా.. వాటికి ఒక త్రైమాసికం ముందుగా జూన్తో ముగిసిన రెండో త్రైమాసిక ఫలితాలను ఏసీసీ మంగళవారం రిలీజ్ చేసింది. అయితే మొత్తంగా కన్సాలిడెటెడ్ ఆదాయం 3 శాతం కోల్పోయి, రూ.2,917.26 కోట్లగా నమోదుచేసింది.2015 ఇదే క్వార్టర్లో ఈ ఆదాయాలు రూ.3,015.29 కోట్లగా ఉన్నాయి. కంపెనీ మొత్తం ఖర్చులను సైతం 9శాతం తగ్గించుకుంది. పెట్కోక్ ఎక్కువగా వాడడంతో, ఫ్యూయల్ మిక్స్లో ఆప్టిమైజేషన్ను సాధించగలిగామని కంపెనీ ప్రకటించింది. అదేవిధంగా స్లాగ్, బూడిద, జిప్సం, జిప్సం మిశ్రమాల ఆప్టిమైజేషన్, ఉత్పత్తి ధరలను తగ్గించిందని పేర్కొంది. సంస్థ మొత్తం వ్యయాలు ఏప్రిల్-జూన్ క్వార్టర్లో రూ.2,603.18 కోట్లకు పడిపోయాయని, గతేడాది ఇదే పీరియడ్లో ఇవి రూ.2,848.46 కోట్లగా ఉన్నాయని ఏసీసీ ప్రకటించింది. ఫలితాల నేపథ్యంలో ఒక్కో షేరుకు 11రూపాయల మధ్యంతర డివిడెంట్ను ఇస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. ధరల తగ్గింపుపై ఫోకస్ను కంపెనీ ఇలాగే కొనసాగిస్తుందని, చత్తీస్ గఢ్లోని జముల్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టు, కంపెనీ స్థాయిని, లాభాలను మరింత పెంచుతుందని ఏసీసీ ఆశాభావం వ్యక్తంచేసింది.మంచి రుతుపవనాలు, ప్రభుత్వం తీసుకుంటున్న ఇన్ ఫాక్ట్ర్చర్ డెవలప్మెంట్, హౌసింగ్, ఇతర మెగా ప్రాజెక్టుల ప్రేరణ వచ్చే త్రైమాసికంలో నిర్మాణ కార్యక్రమాలపై పాజిటివ్ ప్రభావం చూపుతాయని కంపెనీ ఫలితాల సందర్భంగా పేర్కొంది.