Maharashtra Assembly Election
-
ఇండియా కూటమికి బీటలు? మహారాష్ట్ర ఎన్నికల తర్వాత పరిస్థితి ఇదే..
2024 లోక్సభ ఎన్నికలకు ముందు, విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఇండియా కూటమి పేరుతో ఎన్డీఏను ఢీకొట్టాలని భావించాయి. అయితే ఇప్పుడు అదే ఇండియా కూటమి విచ్ఛిన్నం కాబోతోంది. వాస్తవానికి 2023లో దేశంలోని 26 ప్రధాన ప్రతిపక్షాలు కలిసి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ 26 ప్రధాన పార్టీల కలయికతో ఇండియా అలయన్స్ (ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయన్స్) ఏర్పాటయ్యింది. లోక్సభ ఎన్నికల్లో పరాభవంప్రస్తుతం మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షునిగా ఉన్న కాంగ్రెస్ ఈ కూటమికి సారధ్యం వహిస్తోంది. అయితే లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి మెజారిటీని పొందలేకపోయింది. ఇండియా కూటమిలో చేరిన పార్టీలు ఇప్పుడు ఒక్కొక్కటిగా దూరమవుతున్నట్లు కనిపిస్తోంది. వీటిలో ముందుగా మహారాష్ట్రకు చెందిన ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) నుంచి విడిపోతున్నట్లు మహారాష్ట్ర సమాజ్వాదీ పార్టీ ప్రకటించింది. దీనికి ముందు మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీకి ఎక్కువ సీట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ నిరాకరించడంతో సమాజ్వాదీ పార్టీ - కాంగ్రెస్ మధ్య వివాదం నెలకొంది. సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసింది. లోక్సభలో అవధేష్ ప్రసాద్ను వెనక్కి పంపడంపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేసింది.షాకిచ్చిన మమతా బెనర్జీఇండియా కూటమిలో కొనసాగుతున్న సమాజ్వాదీ పార్టీ అసంతృప్తి మధ్య, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా విపక్షాలకు షాక్ ఇచ్చే ప్రకటన చేశారు. మమతా బెనర్జీ ఇండియా కూటమికి నాయకత్వం వహించాలనే తన కోరికను వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ ఓటమి తర్వాత మమతా బెనర్జీ.. బెంగాల్ నుండే కూటమి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమని ప్రకటించారు. దీంతో ఇండియా అలయన్స్కు నాయకత్వం వహించే బాధ్యతను ఆమె కోరుకుంటున్నారా లేక ఇండియా అలయన్స్ నుండి ఆమె వేరుపడుతున్నారా అనేది అర్థంకాని ప్రశ్నగా మారింది. ఒక ఇంటర్వ్యూలో మమతా బెనర్జీ ఇండియా కూటమి సృష్టికర్త తానేనని, దానిని నిర్వహించాల్సిన బాధ్యత కూటమి నేతలపై ఉందన్నారు. కానీ వారు దానిని సమర్థవంతంగా నెరవేర్చలేకపోతే తానేమి చేయగలనని ప్రశ్నించారు. మరోవైపు టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఇటీవల మమతా బెనర్జీని ఇండియా కూటమికి నాయకురాలిగా అభివర్ణించారు.కూటమిని వీడిన ఆమ్ ఆద్మీ పార్టీవచ్చే ఏడాది ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ముందుగానే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి దూరమైంది. లోక్సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉంది. అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఢిల్లీలో ముక్కోణపు పోటీ కనిపిస్తోంది. దీనికిముందు పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి. దీనిని చూస్తుంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమి నుంచి విడిపోతున్నట్లు కనిపిస్తోంది.మహారాష్ట్ర ఎన్నికల తర్వాత..లోక్సభ ఎన్నికల తర్వాత ఇండియా కూటమిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఎన్నికల్లో 26 ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కలిసి పోటీ చేసినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడీ కూడా ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ నేపధ్యంలో ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీలు కూటమికి దూరమవుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల యూపీలో తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ను పక్కన పెట్టి అన్ని స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. ఈ పరిణామాలు చూస్తుంటే ఇండియా కూటమిలో కొనసాగుతున్న ఈ విచ్ఛిన్నం విచ్చిన్నం ఆగుతుందా ఇంకా కొనసాగుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది. ఇది కూడా చదవండి: 60 గంటల్లో ప్రపంచాన్ని చుట్టి.. ‘నాసా’ కొత్త చీఫ్ ఇసాక్మన్ సక్సెస్ స్టోరీ -
మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బీజేపీ ఓపెన్ ఆఫర్!
ముంబై: మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పదవిపై ఉత్కంఠ నెలకొంది. మహాయతి కూటమిలో సీఎం ఎవరు అనేది ఢిల్లీ బీజేపీ పెద్దల చేతిలోకి వెళ్లింది. మరోవైపు.. మహాయుతి కూటమి భారీ విజయం నేపథ్యంలో బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తున్నారు. హస్తం పార్టీలో గెలిచిన నేతలు బీజేపీలో చేరాలని తాజాగా కాషాయ పార్టీ నేత మాట్లాడటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.మహారాష్ట్ర బీజేపీ నేత ఆశిశ్ దేశ్ ముఖ్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో బీజేపీ కూటమి భారీ మెజార్టీతో విజయం సాధించింది. కాంగ్రెస్ కూటమిని ప్రజలు తిరస్కరించారు. వారి ఓటమిని ప్రజలే శాసించారు. గతంతో పోలిస్తే మహారాష్ట్రలో కాంగ్రెస్ మరింత బలహీనపడింది. హస్తం పార్టీకి మరిన్ని ఓట్లు తగ్గాయి. ఆ పార్టీకి భవిష్యత్ లేదు. ఇంత జరుగుతున్నా ఇంకా అదే పార్టీలో ఉంటే కాంగ్రెస్ నేతల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మిగులుతుంది. అందుకే కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా బీజేపీలో చేరాలి. ఎన్నికల్లో గెలిచిన 16 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరండి అని సూచించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా హాట్ టాపిక్ అయ్యాయి.ఇదిలా ఉండగా.. ఆశిశ్ దేశ్ ముఖ్ మాజీ కాంగ్రెస్ నేత. పలు కారణాలతో ఆయనను కాంగ్రెస్ పార్టీ గతేడాది పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో, ఆయన బీజేపీలో చేరారు. ఈ క్రమంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఆశిశ్ బరిలోకి దిగారు. నాగాపూర్ లోని సావ్నర్ స్థానంలో విజయం సాధించారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరాలని ఆయన పిలుపునిచ్చారు. -
పెళ్లికి వచ్చా.. రాజకీయాలకు కాదు: ఢిల్లీలో ఫడ్నవిస్
న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి ఘనవిజయం సాధించిన దరిమిలా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనేదానిపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ పేరు సీఎం రేసులో ముందంజలో ఉంది. కాగా దేవేంద్ర ఫడ్నవీస్ సోమవారం సాయంత్రం ఢిల్లీకి వచ్చారు. ఈ నేపధ్యంలో ఫడ్నవీస్ ఢిల్లీ పర్యటనపై పలు చర్చలు జరుగుతున్నాయి.లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీకి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు మాత్రమే ఢిల్లీకి వచ్చానని, తన ఢిల్లీ పర్యటనకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. అయితే దేవేంద్ర ఫడ్నవిస్ ఢిల్లీలో బీజేపీ అగ్ర నాయకత్వాన్ని కలవవచ్చంటూ గతంలో వార్తలు వినిపించాయి. అయితే తనకు ప్రస్తుతం పార్టీ అగ్రనేతలను కలిసే ఆలోచన లేదని ఫడ్నవిస్ స్వయంగా తెలిపారు.మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 288 స్థానాలకు గాను మహాయుతి 234 స్థానాల్లో విజయం సాధించింది. వీటిలో బీజేపీ 132 సీట్లు, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 57 సీట్లు, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 41 సీట్లు గెలుచుకున్నాయి. మిగతా మిత్రపక్షాలు నాలుగు స్థానాల్లో విజయం సాధించాయి. కాగా మీడియా కథనాల ప్రకారం దేవేంద్ర ఫడ్నవిస్ పేరు సీఎం పదవికి ఆమోదం పొందిందని, అతనితోపాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉంటారని తెలుస్తోంది. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కూడా దేవేంద్ర ఫడ్నవిస్ను సీఎం చేయడానికి అనుకూలంగా ఉందని సమాచారం. ఇది కూడా చదవండి: రాజకుటుంబంలో విభేదాలు.. ఉదయ్పూర్ ప్యాలెస్లో ఉద్రిక్తతలు.. -
ఎన్నికల మహా పాఠం
తాజా మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఎన్డీఏ కూటమికి ఒకటి, ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమికి మరొకటితో... పైకి వన్ ఆల్ అనిపించాయి. రెండు చోట్లా గద్దె మీద ఉన్న పార్టీలే అధికారాన్ని నిలబెట్టుకున్నాయి. రెండు విజయాల్లోనూ కొన్ని పోలికలున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీలు మునుపటి కన్నా పెద్ద మెజారిటీతో విజయం సాధించాయి. అనేక కారణాలు విజయాన్ని ప్రభావితం చేసినా, ప్రధానంగా సంక్షేమ పథకాలు కీలక భూమిక పోషించాయి. మరీ ముఖ్యంగా, మహిళలకు నగదు బదలీ పథకం గేమ్ ఛేంజరైనట్టు విశ్లేషణ. మహారాష్ట్రలో మహిళలకు నెలకు రూ. 1500 ఇస్తూ ఏక్నాథ్ శిందే తెచ్చిన ‘ముఖ్యమంత్రి మాఝీ లడ్కీ బహిన్ యోజన’, జార్ఖండ్లో అర్హులైన స్త్రీలకు నెలవారీగా వెయ్యి రూపాయల హేమంత్ సోరెన్ సర్కార్ ‘ముఖ్య మంత్రి మయ్యా సమ్మాన్ యోజన’ వారిని విజయతీరాలకు చేర్చాయి. మరిన్ని రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలు రావడం ఖాయమని తేల్చేశాయి. భవిష్యత్ ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చేశాయి. ఎన్నికల్లో గెలుపోటములు సహజమే కావచ్చు. కానీ, మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమి సాధించిన మహా విజయం, ప్రతిపక్ష మహావికాస్ ఆఘాడీ (ఎంవీఏ) కూటమి మూటగట్టు కున్న ఘోర పరాజయం మాత్రం ఆశ్చర్యపరుస్తాయి. పోలింగ్ రోజు సాయంత్రం 5 గంటల తర్వాత దాదాపు 9.5 లక్షల ఓట్లు పెరిగాయంటూ వస్తున్న ఆరోపణల మాట ఎలా ఉన్నా, 288 స్థానాల మహారాష్ట్ర అసెంబ్లీలో మెజారిటీ మార్కుకు కేవలం 13 తక్కువగా 132 స్థానాలు బీజేపీ గెలవడం విశేషం. కేవలం అయిదు నెలల క్రితం లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో 48 స్థానాలకు గాను 9 మాత్రమే గెల్చిన బీజేపీ, ఆ ప్రాతిపదికన ఇప్పుడు కేవలం 83 సీట్లే గెలవాలి. కానీ, అప్పటి లెక్క కన్నా మరో 49 స్థానాలు అదనంగా తన ఖాతాలో వేసుకోగలిగింది. అంటే, జూన్ నాటి ఎదురు దెబ్బల నుంచి బీజేపీ మళ్ళీ పూర్తిస్థాయిలో పుంజుకుంటే, అప్పట్లో దక్కిన కొద్దిపాటి ఉత్సాహం, ఊపును కాంగ్రెస్ చేజార్చుకుంది. మహారాష్ట్రలో బీజేపీ, కాంగ్రెస్లు 75 స్థానాల్లో ముఖాముఖి పోరుకు దిగితే, హస్తానికి పట్టుమని 10 దక్కడం గమనార్హం. ఇది నిర్ద్వంద్వంగా స్వయంకృతం. కాంగ్రెస్ తప్పిదాలకు కొదవ లేదు. మరాఠీ భాషే తెలియని పెద్దలను పార్టీ పరిశీలకులుగా పంపిన ఘనత ఈ గ్రాండ్ ఓల్డ్ పార్టీది. పరిశీలకులుగానే కాదు... ప్రచారకులుగానూ బయటి జనాభాయే. వచ్చేది హంగ్ అసెంబ్లీ అంటూ పార్టీ అధిష్ఠానానికి వర్తమానం పంపి, ఎమ్మెల్యేలను బెంగళూరుకు తరలించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేయించారంటే క్షేత్రస్థాయి వాస్తవాలకు ఎంత దూరంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ‘బటేంగే తో కటేంగే’, ‘ఏక్ హై తో సేఫ్ హై’ లాంటి నినాదాలతో జనంలో భయాన్నీ, అభద్రతనూ పెంచుతూ మహాయుతి కూటమి ప్రచారం హోరెత్తిస్తే, సరైన ప్రచార కథనాన్ని ఎంచుకోవడంలో మహావికాస్ ఆఘాడీ కూటమిలోని మూడు ప్రతిపక్షాలూ విఫలమయ్యాయి. దాదాపు 40 పైచిలుకు స్థానాల్లో ముస్లిమ్ల మద్దతు కోసం చూసుకొని, మెజారిటీ వర్గాలు బీజేపీ వైపు మొగ్గేలా చేశాయి. అలాగే, ‘ఇండియా’ కూటమి ప్రధాన పక్షాలు ఇతర పార్టీలను కలుపుకొని పోవడంలో, కనీసం నియంత్రించడంలో విఫలమయ్యాయి. అలా దాదాపు 17 శాతం ఓట్ షేర్ వచ్చిన ‘ఇతరులు’ కూటమి అవకాశాల్ని దెబ్బ తీశారు.2023 నవంబర్ – డిసెంబర్లలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో ఓటమికి కారణాలను అధ్యయనం చేసేందుకు కాంగ్రెస్ వేసుకున్న అంతర్గత కమిటీలు ఇప్పటికీ తమ నివేదికలు ఇవ్వనేలేదు. ఆ పార్టీలో జవాబుదారీతనం లేకపోవడానికి ఇది ఓ మచ్చుతునక. దూరదృష్టి లేకపోవ డంతో పాటు ఉదాసీనత కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలను పట్టి పడిస్తోంది. ప్రతిపక్షాలకు భిన్నంగా బీజేపీ పటిష్ఠమైన వ్యూహంతో ముందుకు వెళ్ళింది. ఆరెస్సెస్ శతవసంత వత్సరంలో అడుగిడిన వేళ మహారాష్ట్రలో కాషాయ విజయాన్ని కానుకగా అందించాలన్న సంకల్పం సైతం సంఘ్ కార్యకర్తలను లక్ష్యసాధనకు పురిగొల్పింది. పోలింగ్ బూత్ స్థాయి దాకా వెళ్ళి వారు శ్రమించడం ఫలితమిచ్చింది. మహారాష్ట్రలో రాహుల్ గాంధీ పరిమితంగా ప్రచారం చేస్తే, ‘చొరబాటు దారుల’ బూచితో బీజేపీ భయపెట్టిన జార్ఖండ్లో హేమంత్ సోరెన్, ఆయన సతీమణి కల్పన దాదాపు 100 ర్యాలీలలో పాల్గొని విజయసాధనకు శ్రమించాల్సిన విధానం ఏమిటో చూపెట్టారు. ఇటీవల జమ్ము – కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్, ఇప్పుడు జార్ఖండ్లో జేఎంఎం భుజాల మీద ఎక్కి, హస్తం విజయకూటమిలో నిలిచింది కానీ, వ్యక్తిగతంగా అది సాధించిన సీట్లు స్వల్పమే. ఈ ఫలితాలు ఆత్మపరిశీలన తప్పనిసరి అని కాంగ్రెస్కు పదే పదే బోధిస్తున్నాయి. రాజ్యాంగ పరిరక్షణ, అధికార బీజేపీ ఆశ్రిత పక్షపాతం లాంటి పాత పాటకు పరిమితం కాకుండా కొత్త పల్లవి అందుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. విజేతగా నిలిచిన బీజేపీ, ముఖ్యంగా మోదీ ఇప్పటికే స్వరం పెంచి, ప్రతిపక్షాలపై విరుచుకు పడుతున్నారు. మోదీ, షాలు మళ్ళీ పట్టు బిగించారు. ఇదే ఊపులో కమలనాథులు ఉమ్మడి పౌరస్మృతి, ఒక దేశం... ఒకే ఎన్నిక, వక్ఫ్ బిల్లు వగైరాలపై వేగం పెంచవచ్చు. బీమా రంగంలో పూర్తి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల లాంటి విపరీత సంస్కరణలకూ గేట్లెత్తే అవకాశం ఉంది. మహారాష్ట్ర పీఠమెక్కే కొత్త దేవేంద్రులకూ చాలా బాధ్యతలున్నాయి. దేశానికి ఆర్థిక కేంద్రంగా, స్థూలజాతీయోత్పత్తిలో దాదాపు 14 శాతం అందించే మహారాష్ట్రలో సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే, ఆర్థిక ఆరోగ్యాన్ని కాపాడాలి. అవినీతి, నిరుద్యోగం, రైతాంగ సమస్యల లాంటివి ఎన్నికల ప్రచారంలో వెనుకపట్టు పట్టినా, ఇకనైనా ఆ కీలక అంశాలపై దృష్టి పెట్టాలి. వెరసి, మహా ఫలితాల దరిమిలా అధికార, ప్రతిపక్షాలు అందరికీ చేతి నిండా పని ఉంది. -
మహారాష్ట్రలో యోగి మ్యాజిక్.. 18 చోట్ల ప్రచారం.. 17 సీట్లలో విజయం
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమికి భారీ మెజారిటీ వచ్చింది. దీంతో రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరం అయ్యాయి. ఈ ఎన్నికల్లో 132 సీట్లను గెలుపొందడం ద్వారా బీజేపీ రాష్ట్రంలో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ మహారాష్ట్ర పగ్గాలు చేపట్టవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ విజయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా కీలక పాత్ర పోషించారు.నిపుణులు విశ్లేషించిన వివరాల ప్రకారం యోగి ఆదిత్యనాథ్ 18 మంది బీజేపీ అభ్యర్థుల కోసం ప్రచారం చేయగా, వారిలో 17 మంది విజయం సాధించారు. అకోలా వెస్ట్ అసెంబ్లీ స్థానం నుంచి ఒక్క బీజేపీ అభ్యర్థి విజయ్ అగర్వాల్ మాత్రమే ఓటమి చవిచూశారు. విజయ్ అగర్వాల్ కేవలం వెయ్యి ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి సాజిద్ ఖాన్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఈ విధంగా చూస్తే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బీజేపీ అభ్యర్థుల విజయం కోసం చేసిన ప్రచారంలో 95% స్ట్రైక్ రేట్ను దక్కించుకున్నారు.ఇదేవిధంగా సీఎం యోగి.. మహాయుతి కూటమి భాగస్వామ్య పక్షాలకు చెందిన ఐదుగురు అభ్యర్ధుల కోసం కూడా ప్రచారం చేశారు. ఆయన మొత్తంగా మహాయుతికి చెందిన 23 మంది అభ్యర్థుల కోసం ప్రచారం చేశారు. వీరిలో 20 మంది గెలిచారు. ఈ 20 మంది అభ్యర్థుల్లో 17 మంది బీజేపీ అభ్యర్థులు. ముగ్గురు విఫలమైన అభ్యర్థుల్లో శివసేన నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరు ఉన్నారు. మహారాష్ట్రలో సీఎం యోగి స్ట్రైక్ రేట్పై పోస్టర్లు కూడా వెలిశాయి. ఇది కూడా చదవండి: బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు తీపికబురు -
ఉద్ధవ్ రాక్షసుడు.. మహిళలను అవమానించారు: కంగన
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం అక్కడి రాజకీయాలపై దేశవ్యాప్తంగా జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా నటి, ఎంపీ కంగనా రనౌత్ శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రేపై పలు విమర్శలు గుప్పించారు. మహిళలను అవమానించిన కారణంగానే ‘రాక్షసుడు’ ఈ పరిస్థితిని అనుభవించాల్సి వచ్చిందని కంగనా వ్యాఖ్యానించారు. ఉద్ధవ్ ఠాక్రే ఓటమిని తాను ముందే ఊహించినట్లు ఆమె తెలిపారు. స్త్రీలను గౌరవిస్తున్నారా? వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్నారా? అనే దానిని అనుసరించే ఎవరు రాక్షసుడో.. ఎవరు మంచివారో గుర్తించగలమన్నారు. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి విజయం సాధించిన దరిమిలా కంగనా ఈ విధమైన వ్యాఖ్యానాలు చేశారు.వారు తన ఇంటిని పడగొట్టారని, నానా దుర్భాషలాడారని అటువంటి చర్యలకు పరిణామాలు ఉంటాయని నమ్మానని కంగనా పేర్కొన్నారు. ఉద్ధవ్ ఠాక్రే శిక్షకు అర్హుడని, ఈ ఓటమిని తాను ముందే ఊహించానన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని కొనియాడిన కంగనా ఆయనను అజేయునిగా అభివర్ణించారు. ప్రధాని మోదీ దేశ రక్షణకు నియమితుడైన నేత అని పేర్కొన్నారు.దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసేవారికి ఈ ఎన్నికల ఫలితాలు గుణపాఠమని కంగనా పేర్కొన్నారు. అభివృద్ధి, సుస్థిరత కోసం మహారాష్ట్ర ప్రజలు ఓట్లు వేశారని కంగనా రనౌత్ పేర్కొన్నారు. కాగా కంగనా ఇంటిని అక్రమ నిర్మాణంగా ఆరోపిస్తూ, 2020, సెప్టెంబర్లో బీఎంసీ ఆమె ఇంటిలో కొంత భాగాన్ని కూల్చివేసింది. తరువాత బాంబే హైకోర్టు బీఎంసీ ఆదేశాలను రద్దు చేసింది. కంగనా నష్టపరిహారానికి అర్హురాలిగా ప్రకటించింది.ఇది కూడా చదవండి: డబ్బు కోసం కాదు, మోక్షం కోసం : నృత్యం బాధ నుంచి పుడుతుంది! -
Maharashtra: ఇద్దరు డిప్యూటీ సీఎంలు.. కుదిరిన ఒప్పందం?
ముంబై: మహారాష్ట్రలో నూతన ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరం అవుతున్నాయి. మహాయుతిలో సీఎం పదవికి సంబంధించి పలు వార్తలు వస్తున్నాయి. తాజాగా అందిన సమాచారం ప్రకారం దేవేంద్ర ఫడ్నవీస్ ను సీఎం చేసేందుకు అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ అంగీకరించింది. తాజాగా జరిగిన సమావేశంలో దేవేంద్ర ఫడ్నవీస్ను సీఎం చేసేందుకు అజిత్ పవార్తో పాటు ఆయన ఎమ్మెల్యేలంతా మద్దతు పలికినట్లు సమాచారం. అయినప్పటికీ షిండే శిబిరంలోని ఎమ్మెల్యేలు ఇప్పటికీ సీఎం ఏక్నాథ్ షిండేనే కొనసాగాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే లాడ్లీ బహనా యోజనను సీఎం ఏక్నాథ్ షిండే ప్రారంభించారని, ఇది మహాయుతికి లబ్ధి చేకూర్చిందని వారు చెబుతున్నారు.ఏక్నాథ్ షిండే సీఎం అయితే రాబోయే బీఎంసీ ఎన్నికల్లోనూ, ఇతర మున్సిపల్ ఎన్నికల్లోనూ ప్రయోజనం చేకూరుతుందని షిండే క్యాంపు అభిప్రాయపడింది. అయితే బీజేపీకి అత్యధిక సీట్లు దక్కినందున దేవేంద్ర ఫడ్నవీస్ను సీఎం చేయాలని బీజేపీ నేతలు కోరుతున్నారు.కాగా మహారాష్ట్రలో ఒక సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములా మళ్లీ రిపీట్ కావచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కావడం దాదాపు ఖాయమనే మాట వినిపిస్తోంది. ఫడ్నవీస్ను సీఎం చేయడానికి మహాయుతిలోని అజిత్ గ్రూపు నుంచి ఎలాంటి అభ్యంతరం లేదు. ఫడ్నవీస్ సీఎం అయితే ఏకనాథ్ షిండే, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులు కావచ్చని భావిస్తున్నారు.ఏక్నాథ్ షిండేకు డిప్యూటీ సీఎం, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వంటి కీలక పోర్ట్ఫోలియోలు ఇవ్వవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. అదే సమయంలో అజిత్ పవార్కు డిప్యూటీ సీఎం పదవితో పాటు ఆర్థిక శాఖ కూడా దక్కనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఏకనాథ్ షిండే, అజిత్ పవార్ తమ తమ పార్టీల నాయకులుగా ఎన్నికయ్యారు. తాజాగా బీజేపీ అగ్రనాయకత్వంతో మహారాష్ట్రకు చెందిన ముగ్గురు నేతల సమావేశం జరగనుంది.ఇది కూడా చదవండి: Jharkhand: ఇలా గెలిచి.. అలా రాజీనామాకు సిద్ధమై.. ఏజేఎస్యూలో విచిత్ర పరిణామం -
అటు హర్యానా.. ఇటు మహారాష్ట్ర.. మారని కాంగ్రెస్ భవితవ్యం
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో కాంగ్రెస్ను పరాజయం వెంటాడుతోంది. ఎన్ని ఎన్నికలు వచ్చిపోతున్నా కాంగ్రెస్ భవితవ్యం మారడం లేదు. తొలుత హర్యానాలో కాంగ్రెస్ ఓటమిపాలయ్యింది. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ఓటమిని చవిచూసింది. లోక్సభ ఎన్నికల్లో మెరుగైన పనితీరు కనబరిచినా మహారాష్ట్రలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా మారింది. శరద్ పవార్ ఎన్సీపీ, ఉద్ధవ్ ఠాక్రే శివసేనతో పొత్తు పెట్టుకున్నప్పటికీ బీజేపీని అధికారం నుంచి కాంగ్రెస్ గద్దె దించలేకపోయింది. మహాయుతి తుఫానులో మహావికాస్ అఘాడీ కనుమరుగయ్యింది. మహారాష్ట్ర ఎన్నికల్లో ఎంవీఏ కేవలం 50 సీట్లకే పరిమితమైంది.మహారాష్ట్రలో మహాయుతి విజయం సాధిస్తుందనే అంచనాలున్నప్పటికీ, ఇంత భారీ విజయం సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. మహారాష్ట్ర ఎన్నికల్లో 288 స్థానాలకు గాను 234 స్థానాలను మహాయుతి గెలుచుకుంది. బీజేపీ ఒంటరిగా 132 స్థానాల్లో కాషాయ జెండాను ఎగురవేసి అతిపెద్ద పార్టీగా అవతరించింది. షిండే నేతృత్వంలోని శివసేన 57 సీట్లు గెలుచుకోగా, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 41 సీట్లు గెలుచుకోగలిగింది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి 10 సీట్లు, ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేనకు 20 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ 16 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.మహారాష్ట్రలో 100 సీట్లకు పైగా పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం 16 సీట్లు గెలుచుకోవడం ఆ పార్టీకి తీవ్ర నిరాశను మిగిల్చింది. ఇప్పుడు హర్యానా, మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓడిపోవడంతో రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ కేంద్ర నాయకత్వంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఓటమిపై కాంగ్రెస్లోనే నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి. దీంతో మరోసారి పార్టీ కేంద్ర నాయకత్వంలో పునర్వ్యవస్థీకరణ డిమాండ్ ఏర్పడే అవకాశాలున్నాయి. అలాగే ఇప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది పార్లమెంటు సభ్యుల సమూహం(జీ23) మరింత యాక్టివ్ కావాల్సిన అవసరం ఉందనే వాదన వినిపిస్తోంది. కాంగ్రెస్లోని జీ23 గ్రూపులోని కపిల్ సిబల్, గులాం నబీ ఆజాద్ కూడా కాంగ్రెస్ను వీడారు. వీరు గతంలో పార్టీలో కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు ఆనంద్ శర్మ, శశి థరూర్, హుడా వంటి నాయకులు మాత్రమే మిగిలారు. ఈ నేపధ్యంలో జీ 23 మరింత బలపడాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: మహాయుతి దెబ్బకు ‘ఎల్వోపీ’ సీటు గల్లంతు -
ఎన్నికల ఫలితాల మధ్య బీజేపీ కార్యాలయంలో సిద్ధమవుతున్న జిలేబీలు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. జార్ఖండ్లోని 81 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13,20 తేదీల్లో రెండు దశల్లో ఓటింగ్ జరిగింది. ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల ట్రెండ్ల మధ్య ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయంలో జోరుగా జిలేబీలు తయారు చేస్తున్నారు. VIDEO | Jalebis being prepared at BJP headquarters in New Delhi, ahead of the counting of votes in Maharashtra and Jharkhand. #MaharashtraElection2024 #JharkhandElection2024 #ElectionResults2024WithPTI pic.twitter.com/RD4kKmB5Xx— Press Trust of India (@PTI_News) November 23, 2024మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన, ఎన్సీపీల కూటమి 'మహాయుతి', కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (శరద్ చంద్ర పవార్)ల మహావికాస్ అఘాడి మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఎన్నికల్లో తమదే విజయమని రెండు కూటములు చెప్పుకుంటున్నాయి. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఇప్పటివరకూ వెల్లడైన ట్రెండ్స్లో, మహారాష్ట్రలో మహాయుతి ముందంజలో ఉంది. మహావికాస్ అఘాడి వెనుకబడింది. జార్ఖండ్లో, జేఎంఎం ప్లస్ ట్రెండ్స్లో మెజారిటీలో కొనసాగుతోంది.ఇది కూడా చదవండి: By Election Results: ఆసక్తికరంగా ఉప ఎన్నికల ఫలితాలు -
ఉదయాన్నే బూత్లకు వచ్చి ఓటేసిన ప్రముఖులు.. మహారాష్ట్ర ఎన్నికల పోలింగ్ చిత్రాలు ఇవిగో
-
మహారాష్ట్ర, జార్ఖండ్ ఓటర్లకు ప్రధాని మోదీ అభ్యర్థన
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నేడు (బుధవారం) జరుగుతున్నాయి. జార్ఖండ్లో నేడు రెండో దశ ఎన్నికలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు నేడు ఒకే దశలో ఓటింగ్ జరగనుంది. ఈ నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్ర, జార్ఖండ్ ఓటర్లకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు.జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయబోతున్నవారిని దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోదీ ‘నేటి పోటింగ్లో సరి కొత్త రికార్డును సృష్టించాలని’ విజ్ఞప్తి చేశారు. తొలిసారిగా ఓటు వేయబోతున్న యువ ఓటర్లకు అభినందనలు తెలిపారు. మహారాష్ట్ర ఓటర్లకు కూడా ప్రధాని మోదీ ఒక సందేశం ఇచ్చారు. ‘ఈ రోజు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. రాష్ట్ర ఓటర్లు పూర్తి ఉత్సాహంతో ఇందులో భాగస్వాములు కావాలి. ప్రజాస్వామ్య పండుగను సంపూర్ణం చేయాలని కోరుతున్నాను. యువతీ, యువకులంతా ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఓటు వేయాలి’ అని విజ్ఞప్తి చేశారు. झारखंड में आज लोकतंत्र के महापर्व का दूसरा और आखिरी चरण है। सभी मतदाताओं से मेरा आग्रह है कि वे इसमें बढ़-चढ़कर भागीदारी करें और वोटिंग का नया रिकॉर्ड बनाएं। इस अवसर पर पहली बार वोट डालने जा रहे अपने सभी युवा साथियों का मैं विशेष अभिनंदन करता हूं। आपका एक-एक मत राज्य की ताकत है।— Narendra Modi (@narendramodi) November 20, 2024మహారాష్ట్ర అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమిలో భాగమైన బీజేపీ అత్యధికంగా 149 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 81 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 59 స్థానాల్లో పోటీ చేస్తోంది.ఇది కూడా చదవండి: UP By Election 2024: సెమీ ఫైనల్లో యూపీ ఓటర్లు ఎటువైపు? -
అవున్సార్! ఇక్కడ అన్ని పార్టీల వారికి పదవులున్నాయి కానీ మనకే లేవ్!
-
Maharashtra: అనిల్ దేశ్ముఖ్ కారుపై రాళ్ల దాడి.. మాజీ మంత్రి తలకు గాయాలు
ముంబై, సాక్షి: మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లాలో మాజీ మంత్రి, ఎన్సీపీ (ఎస్పీ) నేత అనిల్ దేశ్ముఖ్ కారుపై రాళ్ల దాడి జరిగింది. ఈ రాళ్లదాడిలో అనిల్ దేశ్ముఖ్కు తలకు గాయాలయ్యాయి. ఈ ఘటనను నాగ్పూర్ పోలీసులు ధృవీకరించారు. నాగ్పూర్లోని కటోల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది.అనిల్ దేశ్ముఖ్ కుమారుడు సలీల్ దేశ్ముఖ్ కటోల్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తున్నారు. కుమారుడి తరఫున అనిల్ ప్రచారానికి వెళ్లారు. కటోల్ జలల్ఖేడా రోడ్డులో తన కారుపై కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వారని ఎన్సీపీ- ఎస్సీపీ నేత అనిల్ దేశ్ముఖ్ ఆరోపించారు. గాయపడిన అనిల్ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందుతోంది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు దాడి చేసిన వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. నాగ్పూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (రూరల్) హర్ష్ పొద్దార్ ఈ ఘటనను ధృవీకరించారు. ప్రస్తుతం అనిల్ దేశ్ముఖ్ బెయిల్పై ఉన్నారు. 2021లో అవినీతి ఆరోపణలతో అనిల్ దేశ్ముఖ్ మహారాష్ట్ర హోం మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. నవంబర్ 2021లో అనిల్ అరెస్టయ్యారు. డిసెంబర్ 2022లో బెయిల్పై విడుదలయ్యారు.#BREAKING 🚨 | Former Home Minister Anil Deshmukh was injured in a stone-pelting attack on Katol-Jalalkheda Road after a rally. His vehicle was damaged, and he received emergency treatment.#AnilDeshmukh #AttackonAnilDeshmukh #Katoljalalkhedaroad #attack pic.twitter.com/5WxQrMxGU0— Lokmat Times Nagpur (@LokmatTimes_ngp) November 18, 2024Credits: Lokmat Times Nagpur288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీకి ఒకే దశలో నవంబర్ 20న ఎన్నికలు జరగనుండగా, నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, బీజేపీ, అజిత్ పవార్తో కూడిన ఎన్సీపీల మహాయుతి తిరిగి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ప్రతిపక్షమైన శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ), కాంగ్రెస్ల మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ఎన్నికల్లో తమ సత్తాను చాటేందుకు ప్రయత్నిస్తోంది.ఇది కూడా చదవండి: మోదీజీ.. సవాల్ చేస్తున్నా కమిటీని పంపండి!: సీఎం రేవంత్ -
రేపే పోలింగ్.. మహారాష్ట్ర చరిత్రలోనే టఫ్ ఫైట్!
రెండు జాతీయ పార్టీలు. నాలుగు ప్రాంతీయ పార్టీలు. పలు చిన్న పార్టీలు. భారీ సంఖ్యలో స్వతంత్రులు, రెబెల్స్. వెరసి మహారాష్ట్ర చరిత్రలోనే అత్యంత సంకుల సమరానికి రంగం సిద్ధమైంది. కనీవినీ ఎరగనంత పోటాపోటీగా సాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోరు చివరి దశకు చేరుకుంది. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని ఆరు ప్రాంతాలకు గాను ఏకంగా నాలుగింట విపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ఆధిపత్యమే సాగింది. అధికార మహాయుతి కూటమి కొంకణ్లో మాత్రమే కాస్త పరువు నిలుపుకుంది. అదే జోరును కొనసాగించాలని ఎంవీఏ, మిగతా ప్రాంతాల్లోనూ పాగా వేయాలని మహాయుతి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి.పశ్చిమ మహారాష్ట్ర.. షుగర్ బెల్ట్గా పిలిచే ఈ ప్రాంతం అత్యధికంగా 70 అసెంబ్లీ స్థానాలకు నిలయం. గత అసెంబ్లీ ఎన్నికల్లో అవిభక్త ఎన్సీపీ ఏకంగా 27 స్థానాలు నెగ్గింది. బీజేపీకి 20, కాంగ్రెస్కు 12, అవిభక్త శివసేనకు 5 స్థానాలు దక్కాయి. శివసేన, ఎన్సీపీల్లో చీలిక అనంతరం జరిగిన ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని 10 లోక్సభ స్థానాల్లో ఎంవీఏ ఐదింటిని నెగ్గి స్వల్ప పైచేయి సాధించగా మహాయుతి నాలుగింటితో సరిపెట్టుకుంది. మిగతా స్థానంలో నెగ్గి్గన స్వతంత్ర అభ్యర్థి కూడా కాంగ్రెస్కు మద్దతు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా లోక్సభ ఫలితాలే పునరావృతం కావచ్చని భావిస్తున్నారు. ఇక్కడ ఎన్సీపీ అజిత్, శరద్ పవార్ వర్గాలు ఏకంగా 20 స్థానాల్లో ముఖాముఖి తలపడుతుండటం విశేషం.లోక్సభ పోరులో పవార్ వర్గం ఏకంగా 3 స్థానాల్లో నెగ్గగా అజిత్ వర్గానికి ఒక్క సీటూ దక్కకపోవడం విశేషం. పవార్ల కంచుకోట బారామతి ఈ ప్రాంతంలోనే ఉంది. ఆ స్థానంపై పట్టు నిలుపుకునేందుకు శరద్ పవార్ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. పార్టీని చీల్చిన అజిత్ పవార్ ఇక్కడ బరిలో ఉండటంతో ఆయన్ను ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకున్నారు. మేనల్లుడు యుగేంద్రను అజిత్పై బరిలో దించారు. పశ్చిమ మహారాష్ట్రలో సహకార సంఘాల హవా నడుస్తుంటుంది. రైతు సమస్యలు ఈసారి ఇక్కడ ప్రధానాంశంగా మారాయి. కొంకణ్.. ఎంవీఏపై పాలక కూటమి స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించిన ఏకైక ప్రాంతం. లోక్సభ ఎన్నికల్లో ఇక్కడి 6 స్థానాల్లో మహాయుతి ఏకంగా ఐదింట నెగ్గింది. దాన్ని నిలుపుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా కొంకణ్కు పోర్టు, మలీ్టమోడల్ కారిడార్, మెగా రిఫైనరీ తదితర భారీ ప్రాజెక్టులను ప్రకటించింది. దాంతో ఎంవీఏ కూటమి తన ప్రచారాన్ని ఈ ప్రాంతంలో శివాజీ విగ్రహం కూలిపోయిన ఘటన చుట్టే తిప్పుతూ లబ్ధి పొందే ప్రయత్నాల్లో పడింది. కొంకణ్ శివసేన చీఫ్, సీఎం ఏక్నాథ్ షిండే కంచుకోట. ఇక్కడి కోప్రీ–పచ్పాఖడీ నుంచి ఆయన బరిలో దిగారు. షిండేపై ఆయన రాజకీయ గురువు ఆనంద్ డిఘే మేనల్లుడు కేదార్ ప్రకాశ్ను ఉద్ధవ్ సేన పోటీకి నిలిపింది. విదర్భ.. మహారాష్ట్రలో అత్యంత వెనకబడ్డ ప్రాంతాల్లో ఒకటి. లోక్సభ ఎన్నికల్లో ఇక్కడి 10 స్థానాల్లో ఏకంగా ఏడు ఎంవీఏ ఖాతాలో పడ్డాయి. వాటిలో ఐదింటిని కాంగ్రెసే నెగ్గింది. మరాఠాలతో పాటు ఓబీసీలు, దళితులు ఇక్కడ చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంటారు. ఒకప్పుడు ఈ ప్రాంతం కాంగ్రెస్ కంచుకోట. కానీ 20 ఏళ్లుగా ఇక్కడ బాగా బలహీనపడుతుండగా బీజేపీ పుంజుకుంటోంది. దీనికి తోడు ప్రత్యేక విదర్భ రాష్ట్ర డిమాండ్కు మద్దతివ్వడం బీజేపీకి ఆదరణను మరింత పెంచింది. అధికారాన్ని నిలుపుకోవాలంటే విదర్భలో వీలైనన్ని ఎక్కువ స్థానాలు నెగ్గడం మహాయుతికి కీలకం. దాంతో పారిశ్రామిక హబ్తో పాటు ఈ ప్రాంతంపై వరాల వర్షం కురిపించింది. ఇక్కడ దాదాపుగా అన్ని పారీ్టలకూ రెబెల్స్ బెడద తీవ్రంగా ఉంది. రైతు సమస్యలు కూడా ఇక్కడ ఓటర్లను బాగా ప్రభావితం చేసేలా కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో బీజేపీ నుంచి ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, పీసీసీ చీఫ్ నానా పటోలే పోటీ చేస్తున్నారు. మరాఠ్వాడా.. రాష్ట్రంలో అత్యంత వర్షాభావ ప్రాంతం. లోక్సభ ఎన్నికల్లో ఎంవీఏ హవా సాగింది. ఏడింట 6 స్థానాలు విపక్ష కూటమి ఖాతాలోకే వెళ్లాయి. మిగతా ఒక్క స్థానాన్ని షిండే శివసేన గెలుచుకుంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన బీజేపీ, అవిభక్త శివసేన 46 స్థానాలకు గాను 28 సీట్లను గెలుచుకున్నాయి. మరాఠాలను ఓబీసీ జాబితాలో చేర్చాలంటూ మనోజ్ జరంగే ఉద్యమించిన నేపథ్యంలో ఈసారి మాత్రం ఆ పరిస్థితి లేదు. మరాఠా రిజర్వేషన్లు కీలకంగా మారడం మహాయుతికి ఇబ్బంది కలిగించేదే. మరాఠా ఓట్లపై ఎంవీఏ, ఓబీసీ ఓట్లపై మహాయుతి ఆశలు పెట్టుకున్నాయి. మరాఠాలు, ఓబీసీలతో పాటు ముస్లింలు కూడా ఇక్కడ చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంటారు. ఉత్తర మహారాష్ట్ర.. ఇది ప్రధానంగా వ్యవసాయ ప్రాంతం. లోక్సభ ఎన్నికల్లో ఏడింటి ఆరు సీట్లు ఎంవీఏ ఖాతాలో పడగా బీజేపీ ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. ఈ ప్రాంతంలో ఉల్లి రైతులు ఎక్కువ. ఉల్లి ఎగుమతుల నిషేధంతో కేంద్రం తమ పొట్ట కొట్టిందన్న ఆగ్రహం వారిలో కనిపిస్తోంది. ఇది మహాయుతికి బాగా చేటు చేసేలా కనిపిస్తోంది. నాసిక్, పరిసర ప్రాంతాల్లో గణనీయంగా ఉన్న గిరిజనుల ఓట్లు కూడా ఇక్కడ కీలకమే. గత అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఇటీవలి లోక్సభ పోరులోనూ వారు ఎంవీఏ కూటమికే దన్నుగా నిలిచారు. ముంబై.. దేశ ఆర్థిక రాజధాని. ముంబైతో పాటు శివారు ప్రాంతాల్లో కలిపి 36 అసెంబ్లీ స్థానాలున్నాయి. లోక్సభ ఎన్నికల్లో ఇక్కడి ఆరు స్థానాల్లో మహాయుతికి దక్కింది రెండే. ముంబైపై బాగా పట్టున్న ఉద్ధవ్ శివసేన 3 స్థానాలు చేజిక్కించుకుంది. ఈసారి షిండే, ఉద్ధవ్ సేనల మధ్య ఇక్కడ హోరాహోరీ సాగుతోంది. వీటికి తోడు మహారాష్ట్ర నవనిర్మాణ సేన కూడా ఇక్కడ గట్టి ప్రభావమే చూపుతుంది.వరాల జల్లులు⇒ రెండు కూటములూ ఈసారి తమ మేనిఫెస్టోల్లో అన్ని వర్గాలపైనా వరాల వర్షం కురిపించాయి.⇒ లడ్కీ బెహన్ యోజన మొత్తాన్ని రూ.1,500 నుంచి రూ.2,100కు పెంచుతామని మహాయుతి ప్రకటించగా తామొస్తే ఏకంగా రూ.3,000 ఇస్తామని ఎంవీఏ పేర్కొంది.⇒ మహాయుతి రైతు రుణ మాఫీ హామీకి పోటీగా తాము ఏకంగా రూ.3 లక్షల దాకా రైతు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది.⇒ 25 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మహాయుతి హామీ ఇస్తే నిరుద్యోగ యువతకు నెలకు రూ.4,000 ఇస్తామని ఎంవీఏ చెప్పింది. -
Maharashtra: బీజేపీ మహిళా నేత నవనీత్ రాణాపై దాడి
అమరావతి: మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో గల దరియాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ నేత నవనీత్ రాణా ఎన్నికల ప్రచార సభలో ఆమెపై దాడి జరిగింది. ఖల్లార్ గ్రామంలో జరిగిన ఎన్నికల సభలో నవనీత్ రాణా పాల్గొన్నారు.ఆమె వేదికపై ప్రసంగం ముగించి కిందకు రాగానే కొందరు ఆమెపై కుర్చీలు విసిరేందుకు ప్రయత్నించారు. దీనిపై ఆమె ఖల్లార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితులను అరెస్టు చేయకుంటే హిందువులంతా తరలివచ్చి నిరసన తెలపాలని ఆమె కోరారు.ఈ ఘటన అనంతర నవనీత్ రాణా మీడియాతో మాట్లాడుతూ.. ఖల్లార్లో ప్రచార సభ జరుగుతుండగా కొందరు అరుస్తూ గందరగోళం సృష్టించారు. తాను ప్రసంగం ముగించుకుని, కిందకు వచ్చాక వారు ఒక మతానికి సంబంధించిన నినాదాలు చేశారు. తనను దూషించారు. కొందరు తనపై ఉమ్మివేశారని నవనీత్ రాణా తెలిపారు. వెంటనే అప్రమత్తమైన తన అంగరక్షకులు తనను కాపాడి బయటకు తీసుకువచ్చారన్నారు. ఈ ఘటనపై తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆమె తెలిపారు. ఇది కూడా చదవండి: సుదూర శ్రేణి హైపర్సోనిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం -
ఎన్నికల ప్రచారంలో నటుడు గోవిందాకు అస్వస్థత
ముంబయి: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న నటుడు గోవిందా అస్వస్థతకు గురయ్యాయి. జల్గావ్లోని ముక్తైనగర్, బోద్వాడ్, పచోరా, చోప్రాలలో మహాయుతి అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం పచోరాలో రోడ్ షో నిర్వహిస్తుండగా గోవిందా ఛాతీ నొప్పితో బాధపడ్డారు. వెంటనే ఇతర నేతలు గోవిందాను ఆస్పత్రికి తరలించారు.మహాయుతిలోని శివసేన (షిండే వర్గం) నేత గోవిందా పచోరాలో రోడ్ షో నిర్వహిస్తున్న సమయంలో అనారోగ్యం పాలవడంతో మధ్యలోనే ప్రచార కార్యక్రమాన్ని నిలిపివేశారు. ఈ రోడ్ షోలో గోవిందా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మద్దతు ఇవ్వాలని, బీజేపీ, శివసేన, ఎన్సీపీతో కూడిన అధికార కూటమికి ఓటు వేయాలని ప్రజలను కోరారు.ఇటీవల ముంబైలోని తన ఇంట్లో ప్రమాదవశాత్తూ తుపాకీ పేలడం వల్ల గోవిందా కాలికి గాయమైంది. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గోవిందా త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. నాడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత గోవింద తొలుత వీల్ చైర్ లో కనిపించారు. తన ఆరోగ్యం కోసం ప్రార్థనను చేసిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.నవంబర్ 20న మహారాష్ట్రలోని అన్ని స్థానాలకు ఓటింగ్ జరిగనుంది. ఓట్ల లెక్కింపు నవంబర్ 23న నిర్వహించనున్నారు. నవంబర్ 18తో ఎన్నికల ప్రచారం ముగియకముందే అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారంలో తమ సత్తా చాటాయి. ఈ క్రమంలో గోవిందా శివసేన, మహాయుతిల ప్రచారానికి వెళ్లారు. గోవిందా పాల్గొన్న రోడ్ షోను తిలకించేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు.ఇది కూడా చదవండి: ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ -
మా వేతనాల్లో కోత వద్దు
సాక్షి, హైదరాబాద్: ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల బందోబస్తు విధులకు హాజరయ్యే తమకు సొంత రాష్ట్రంలో ఇచ్చే వేతనాల్లో కోత విధించవద్దని హోంగార్డులు పోలీస్ ఉన్నతాధికారులకు విన్నవించారు. ఎన్నికల డ్యూటీల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు ఆ రాష్ట్ర పోలీస్శాఖ నుంచి అలవెన్స్ ఇస్తున్నారని, అదే సమయంలో ఇక్కడ విధుల్లో లేనందున తమ వేతనాల్లో కోత పడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బందోబస్తు విధుల కోసం తెలంగాణ నుంచి మూడు వేల మంది హోంగార్డులు వెళ్లనున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎన్నికల విధులకు వెళ్లేందు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా ఎన్నికల విధులకు వెళ్లిన హోంగార్డులకు అక్కడ ఇచ్చే బిల్లులతోపాటు సొంత రాష్ట్రంలో రోజువారీ వేతనం రూ.921ని కటింగ్ లేకుండా ఇవ్వాలని కోరుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే పోలీస్ ఉన్నతాధికారులకు వినతిపత్రం ఇచ్చినట్టు తెలిపారు. డిసెంబర్ 6న హోంగార్డు ఆవిర్భావ దినోత్సవాలు రాష్ట్రమంతటా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. -
మహారాష్ట్ర ఎన్నికల్లో.. కుటుంబ కథాచిత్రం!
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సకుటుంబ, సపరివార కథా చిత్రాన్ని తలపిస్తున్నాయి. ఠాక్రేల నుంచి పవార్ల దాకా అనేక కాకలు తీరిన రాజకీయ కుటుంబాల నుంచి బోలెడంత మంది ఎన్నికల బరిలో నిలిచారు. బాబాయ్, కొడుకులు, తండ్రీ కూతుళ్లు, మామ, అల్లుళ్లు, చివరకు భార్యాభర్తలు కూడా పోటీ పడుతున్నారు. కనీసం ఐదు అసెంబ్లీ స్థానాల్లో దగ్గరి బంధువులే అమీతుమీ తేల్చుకుంటున్నారు! పవార్ వర్సెస్ పవార్ బారామతి అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయం పవార్ వర్సెస్ పవార్గా ఉంది. ఎన్సీపీ (ఎస్పీ) నుంచి రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ మనవడు యుగేంద్ర పవార్ బరిలో ఉన్నారు. డిప్యూటీ సీఎంగా ఉన్న తన పెదనాన్న, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్తో ఆయన పోటీ పడుతుండటం విశేషం. ఇక్కడ ఏకంగా ఏడుసార్లు నెగ్గిన చరిత్ర అజిత్ది. ఆయన తమ్ముడు శ్రీనివాస్ పవార్ కుమారుడు యుగేంద్ర. శరద్ పవార్కు ఆయన అత్యంత సన్నిహితుడు. బారామతిలో పవార్ వర్సెస్ పవార్ ఇది రెండోసారి. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో అజిత్ భార్య సునేత్రను శరద్ పవార్ కుమార్తె సుప్రియా సులే ఓడించారు.భార్యాభర్తల సవాల్ ఛత్రపతి శంభాజీనగర్లోని కన్నడ్ అసెంబ్లీ స్థానం ఏకంగా భార్యాభర్తల నడుమ ఆసక్తికర పోరుకు వేదికైంది. శివసేన అభ్యర్థి సంజనా జాదవ్పై ఆమె భర్త హర్షవర్ధన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ రాజకీయ కుటుంబాల నుంచే వచ్చారు. హర్షవర్ధన్ మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే దివంగత రైభాన్ జాదవ్ కుమారుడు. ఇక సంజన సీనియర్ బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి రావుసాహెబ్ దన్వే కుమా ర్తె. హర్షవర్ధన్ 2009లో రాజ్ ఠాక్రేకు చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) తరఫున కన్నడ్ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. 2014లో శివసేన టికెట్పై మరోసారి విజయం సాధించారు. మరాఠా కోటా ఉద్యమంపై ప్రభుత్వం ఉదాసీనతను నిరసిస్తూ 2018లో రాజీనామా చేశారు. భార్యాభర్తలిద్దరూ 2019లో విడిపోయినా ఇంకా విడాకులు తీసుకోలేదు. ఇదే విషయాన్ని హర్షవర్ధన్ తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. సంజన మాత్రం తాను వివాహితురాలినేనని పేర్కొన్నారు. ఎందరో వారసులు... శివసేన (యూబీటీ) చీఫ్, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే వర్లీ అసెంబ్లీ స్థానాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. సీఎం ఏక్నాథ్ షిండే సారథ్యంలోని శివసేన సిట్టింగ్ రాజ్యసభ సభ్యుడు మిలింద్ దేవ్రా ఆయనకు గట్టి పోటీ ఇస్తున్నారు. బాంద్రా ఈస్ట్లో ఆదిత్య మేనమామ వరుణ్ సర్దేశాయ్ వాండ్రేతో దివంగత బాబా సిద్ధిఖీ కుమారుడు జిషాన్ (ఎన్సీపీ) తలపడుతున్నారు. ఎంఎన్ఎస్ నేత రాజ్ ఠాక్రే కుమారుడు అమిత్ ముంబైలోని మాహిం నుంచి పోటీ చేస్తున్నారు. ముంబై బీజేపీ చీఫ్ ఆశిష్ షెలార్ వాండ్రే, ఆయన సోదరుడు వినోద్ షెలార్; మాజీ సీఎం విలాస్రావ్ దేశ్ముఖ్ కుమారులు అమిత్, ధీరజ్; శరద్ పవార్ మనవడు రోహిత్ పవార్ ఎన్సీపీ (ఎస్పీ) మహారాష్ట్ర చీఫ్ జయంత్ పాటిల్ మేనల్లుడు ప్రజక్త్ తాన్పురే, ఎన్సీపీ సీనియర్ మంత్రి ఛగన్ భుజ్బల్, ఆయన సోదరుడి కుమారుడు సమీర్ తదితరులు కూడా అసెంబ్లీ బరిలో ఉన్నారు. మోహన్రావు హంబర్డే కాంగ్రెస్ నుంచి, ఆయన సోదరుడు సంతుక్రావ్ బీజేపీ నుంచి పోటీ చేస్తుండటం విశేషం. గణేశ్ నాయక్ బీజేపీ తరఫున, ఆయన చిన్న కుమారుడు సందీప్ ఎన్సీపీ (ఎస్పీ) అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. విజయ్కుమార్ గవిట్ కుటుంబం నుంచి ఏకంగా నలుగురు అసెంబ్లీ బరిలో ఉన్నారు. విజయ్కుమార్ బీజేపీ నుంచి, సోదరుడు రాజేంద్ర గవిత్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుండగా మరో సోదరుడు భరత్, కుమార్తె హీనా ఇండిపెండెంట్లుగా బరిలో ఉన్నారు! బీజేపీ ఎంపీ నారాయణ్ రాణే కుమారులు నితేశ్, నీలేశ్ కూడా అసెంబ్లీ బరిలో దిగారు.తండ్రీ కూతుళ్ల పోటీ గడ్చిరోలి జిల్లా అహేరి నియోజకవర్గం తండ్రీకూతుళ్ల పోటీకి వేదికగా నిలిచింది! ఎన్సీపీకి చెందిన మంత్రి ధర్మారావు బాబా ఆత్రంపై ఆయన కుమార్తె భాగ్యశ్రీ ఆత్రం హల్గేకర్ పోటీ చేస్తున్నారు. మాజీ మంత్రి అంబరీశ్ రావు ఆత్రం స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండటంతో ఇక్కడ ముక్కోణపు పోరు నెలకొంది. లోహా–కంధర్ నియోజకవర్గంలో ఎన్సీపీ అభ్యర్థి ప్రతాప్రావ్ పాటిల్ చిక్లీకర్ తన బావమరిది శ్యాంసుందర్ షిండేతో తలపడుతున్నారు. షిండే గతంలో చిఖలీకర్ మద్దతుతోనే అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గడం విశేషం! సిం«ద్ఖేడ్ రాజా నియోజకవర్గంలో ఎన్సీపీ (ఎస్పీ)కి అభ్యర్థి రాజేంద్ర షింగ్నే తన మేనకోడలు గాయత్రి షింగ్నేపై పోటీ చేస్తున్నారు. ఆమె అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. నాసిక్లోని చాంద్వాడ్ నుంచి బీజేపీ అభ్యర్థి రాహుల్ అహెర్ తన సోదరుడు కేదా అహెర్పై బరిలోకి దిగారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Maharashtra: తొలిసారి ఆ గ్రామంలో ఎన్నికల పండుగ
నాందేడ్: మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు దాటినా కొన్ని ప్రాంతాల్లో ఇంకా వెనుకబాటుతనం కనిపిస్తుంది. ఈ కోవలోకే వస్తుంది మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వాట్ తాలూకాలోని వాగ్దారి గ్రామం. ఈ గ్రామంలో 300 జనాభా ఉంది. భూ రెవెన్యూ మ్యాప్లో ఈ గ్రామం పేరు కూడా లేకపోవడంతో ఇన్నాళ్లూ ఈ గ్రామానికి చెందిన వారు తమ గ్రామంలో ఓటు వేయలేకపోయారు.తాజాగా ఈ సమస్యకు పరిష్కారం దొరికింది. దీంతో గ్రామంలో పోలింగ్ బూత్ ఏర్పాటు కానుంది. నవంబర్ 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈ గ్రామ ప్రజలు తొలిసారిగా తమ గ్రామంలో ఓటు వేయనున్నారు. ఇప్పటి వరకు ఈ గ్రామంలోని ఓటర్లు సమీపంలోని పోలింగ్ కేంద్రమైన జలధారకు వెళ్లేవారు. వీరు ఇక్కడికి చేరుకోవడానికి రెండు గంటల సమయం పట్టేది. అయితే అడవి గుండా వెళ్లాల్సిన రావడంతో క్రూర మృగాల భయం వారిని వెంటాడేది. తాజాగాకిన్వాట్ నియోజకవర్గం పరిధిలోని వాగ్దారీలో పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ గ్రామంలోని 190 మంది ఓటర్లు స్థానికంగానే ఓటు వేయనున్నారు. గ్రామానికి పోలింగ్ బూత్ రావడంతో త్వరలో ఇక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పడతాయని గ్రామస్తులు భావిస్తున్నారు.ఈ ప్రాంతంలోని చారిత్రక సరిహద్దులను దృష్టిలో ఉంచుకుని గ్రామంలోని భూమికి కొలతలు నిర్వహించి, పూణేలోని అధికారులకు ప్రతిపాదనలు పంపినట్లు స్థానిక అధికారులు తెలిపారు. దీంతో రాబోయే కొద్ది నెలల్లో గ్రామస్తులకు భూమి యాజమాన్యపు రుజువు లభిస్తుందని భావిస్తున్నారు. ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన ఈ పోలింగ్ కేంద్రం గ్రామస్తుల్లో కొత్త ఆశను నింపింది. ఎన్నికల్లో తమ గళం వినిపించాలని, అప్పుడే ప్రభుత్వం తమ కనీస అవసరాలను తీరుస్తుందని గ్రామస్తులు అంటున్నారు. ఇది కూడా చదవండి: మావోయిస్టులు కూడా అంతర్మథనం చేసుకుని.. -
మహా ఎన్నికలు.. ఏ మేనిఫెస్టోలో ఏముంది?
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని రాజకీయ పార్టీలు పోటీలు పడి వాగ్దాలను గుప్పిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని అధికార మహాయుతి తిరిగి అధికారాన్ని నిలుపుకోవాలనే లక్ష్యంతో ఉండగా, కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి (ఎంవీఎ) మహాయతిని ఢీకొట్టేందుకు సకల ప్రయత్నాలు చేస్తోంది. అటు ఎంవీఏ కూటమి ఇటు మహాయతి (బీజేపీ, షిండే సేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) రెండూ మహిళలు, రైతులు, వృద్దులను ఆకట్టుకునేందుకు పోటీలు పడుతూ పలు పథకాలను ప్రకటించాయి.కొత్తగా ఉచిత బస్సు ప్రయాణంశివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే), ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం), కాంగ్రెస్ల కూటమి ఎంవిఎ ‘లోక్సేవేచి పంచసూత్రి’ కింద పలు వాగ్దానాలను ప్రకటించింది. ఇందులో నెలకు మూడు వేల రూపాయల డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు మొదలైనవి ఉన్నాయి. అలాగే మూడు లక్షల రూపాయల వరకు ఉన్న వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని, రుణాలు చెల్లించే రైతులకు అదనంగా రూ.50 వేలు మాఫీ చేస్తామని ఎంవీఏ కూటమి హామీ ఇచ్చింది. నిరుద్యోగ యువతకు నాలుగు వేల రూపాయల వరకూ ప్రయోజనం చేకూరుస్తామని, పేదలకు రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమా కవరేజీని అందిస్తామని హామీనిచ్చారు.పథకాల మొత్తాల పెంపుఇక బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి గత కొంతకాలంగా నగదు పథకాలను అందిస్తోంది. ఒకప్పుడు ఉచిత పథకాలను విమర్శిస్తూ, దేశ అభివృద్ధికి ఇది ప్రమాదకరమని పేర్కొన్న ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు బీజేపీ తరపున పలు సంక్షేమ పథకాలను ప్రకటిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మహాయుతి తన లడ్కీ బహిన్ పథకపు మొత్తాన్ని 1,500 నుండి రూ.2,100కి పెంచింది. ఈ పథకం కింద మహిళలు, వృద్ధులు ప్రయోజనం పొందనున్నారు. అలాగే విద్యార్థులకు నెలకు రూ. 10,000 సహాయం, రైతులకు రూ.15,000 ఆర్థిక సహాన్ని ప్రకటించింది. గతంలో ఇది రూ.12,000గా ఉంది.మహిళలు.. లఖ్పతి దీదీలుమహిళలకు నెలకు రూ.2100 ఇస్తామని అధికార మహాయతి కూటమి హామీ ఇచ్చింది. 2027 నాటికి 50 లక్షల మంది మహిళలను 'లఖ్పతి దీదీ'గా తీర్చిదిద్దుతామని పేర్కొంది. దీంతో పాటు రివాల్వింగ్ ఫండ్ రూపంలో రూ.1000 కోట్లు అందజేస్తామని కూడా హామీ ఇచ్చింది. ఇక మహావికాస్ అఘాడి (ఎంవీఏ) విషయానికొస్తే మహిళల కోసం మహాలక్ష్మి యోజనను ప్రారంభిస్తామని, దీని కింద మహిళలకు నెలకు రూ. 3000 ఆర్థిక సహాయం అందజేస్తామని హామీనిచ్చింది. అలాగే మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ సదుపాయాన్ని కల్పిస్తామని హామీనిచ్చింది.రైతులకు రుణాలు.. విద్యార్థులకు స్కాలర్షిప్లుమహారాష్ట్రలోని రైతులకు రూ.15 వేల వరకు రుణమాఫీ చేస్తామని మహాయుతి హామీ ఇచ్చింది. అలాగే వ్యవసాయోత్పత్తులపై కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై 20 శాతం రాయితీ కల్పిస్తామని అధికార కూటమి హామీ ఇచ్చింది. కరెంటు బిల్లులు కూడా తగ్గిస్తామని పేర్కొంది. ఇదే విషయంలో సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు రూ.50వేలు ఇస్తామని ప్రతిపక్ష కూటమి హామీ ఇచ్చింది. 10 లక్షల మంది విద్యార్థులకు రూ.10,000 స్కాలర్షిప్ ఇస్తామని మహాయుతి హామీనిచ్చింది. అలాగే ఎంట్రప్రెన్యూర్షిప్ను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆకాంక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొంది. ఇక ఎంవీఏ విషయానికొస్తే రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి రూ.4000 స్కాలర్షిప్ను ప్రకటించింది.రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి తొలగింపురాష్ట్రంలోని ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని అధికార కూటమి వివేకానంద యూత్ హెల్త్ కార్డ్ను అందజేస్తామని, యువతకు వార్షిక ఆరోగ్య పరీక్షలను సులభతరం చేస్తామని పేర్కొంది. సీనియర్ సిటిజన్ల కోసం ఆధార్ ఎనేబుల్డ్ సర్వీస్ పాలసీని ప్రారంభించనున్నట్లు మహాయుతి తెలిపింది. అదే సమయంలో రాష్ట్రంలో రూ.25 లక్షల ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభిస్తామని ఎంవీఏ హామీ ఇచ్చింది. ఉచితంగా మందులు అందజేస్తామని కూడా కూటమి హామీ ఇచ్చింది. వృద్ధులకు ఇచ్చే పెన్షన్ను రూ.21,500 నుంచి రూ.82,100కు పెంచుతామని మహాయుతి చెప్పగా, వృద్ధులకు ఇచ్చే పెన్షన్ అంశాన్ని ఎంవీఏ ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన వారికి రూ.15 లక్షల వరకు వడ్డీ లేని రుణాలను అందజేస్తామని మహాయుతి తెలిపింది. ఎంవిఎ అధికారంలోకి వస్తే, రాష్ట్రంలో కుల గణనను నిర్వహిస్తామని, రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని కూడా తొలగిస్తామని ప్రకటించింది. మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. ఫలితాలు నవంబర్ 23న వెల్లడి కానున్నాయి.ఇది కూడా చదవండి: ఖమ్మం మహిళకు అమెరికాలో కీలక బాధ్యతలు -
తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ దుష్ప్రచారం
సాక్షి ముంబై: ప్రధాని మోదీతోపాటు మహారాష్ట్రలో ని బీజేపీ నేతలు తెలంగాణ ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మండిపడ్డారు. ఈ నెల 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేపడుతున్న రేవంత్.. ఇందులో భాగంగా శనివారం ముంబైలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వంతోపాటు మహారాష్ట్రలో ఉన్న బీజేపీ కూటమి ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణలో కాంగ్రెస్ గ్యారంటీల అమలుపై మోదీ సహా బీజేపీ నేతలు అబద్ధాలు చెప్పడం మానుకోనంత వరకు తాము నిజాలు చెబుతూనే ఉంటామన్నారు. అందుకే తాను మహారాష్ట్ర ప్రజలకు తెలంగాణలో అమలు చేస్తున్న ఆరు గ్యారంటీల అమలు విషయంపై నిజాలు చెప్పేందుకు వచ్చినట్లు రేవంత్ చెప్పారు. అత్యధిక రైతు ఆత్మహత్యలు మహారాష్ట్రలోనే..దేశంలోకెల్లా మహారాష్ట్రలోనే అత్యధికంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని రేవంత్రెడ్డి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమాన్ని మరిచిపోవడం వల్లే మహారాష్ట్రలో రైతులు అత్యధికంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుందని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. తాము అధికారంలోకి వచి్చన 25 రోజుల్లోనే 22.22 లక్షల మంది రైతులకు రూ. 17,869 కోట్ల రుణమాఫీ, 10 నెలల్లోనే 50 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు, రూ. 500కే గ్యాస్ సిలిండర్, 50 లక్షల మంది పేదలకు ప్రతి నెలా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న రకం ధాన్యానికి రూ. 500 బోనస్ అందిస్తున్నట్లు రేవంత్ వివరించారు. 17 మెగా ప్రాజెక్టులను గుజరాత్కు తరలించారుమహారాష్ట్రకు రావల్సిన 17 మెగా ప్రాజెక్టులు ప్రధాని మోదీ గుజరాత్కు తరలించుకొని పోయారని రేవంత్ ఆరోపించారు. దేశ చరిత్రలోనే మహారాష్ట్రకు ప్రత్యేక స్థానం ఉందని.. అంబేడ్కర్ సహా దేశ ప్రగతిని మార్చిన ఎందరో మహానుభావులకు మహారాష్ట్ర జన్నించిందని గుర్తుచేశారు. ప్రజలను మోసగించిన బీజేపీ కూటమిని ఈ ఎన్నికల్లో ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. అమీన్ పటేల్ను గెలిపించండి... ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం సాయంత్రం ముంబై ముంబాదేవి నియోజకవర్గంలో తెలంగాణవాసులు ఎక్కువగా ఉండే కమాటిపురాలో రోడ్ షో నిర్వహించారు. మహావికాస్ అఘాడీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ముంబాదేవిలో మూడుసార్లు గెలిచి మరోసారి పోటీ చేస్తున్న కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అమీన్ పటేల్ను గెలిపించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణవాసులకు అండగా ఉంటామన్నారు. -
మహారాష్ట్ర డీజీపీ రష్మీ శుక్లా పై ఈసీ వేటు
-
రాజ్యసభ ఎంపీ మిలింద్ దేవ్రాను బరిలో దింపుతున్న ఏక్నాథ్ షిండే
-
మరో మహా యుద్ధం!
మరో ఎన్నికల సమరానికి తెర లేచింది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం ప్రకటించింది. ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ తర్వాత దేశంలో అత్యధికంగా 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో ఒకే విడతలో నవంబర్ 13న, మొత్తం 81 స్థానాలున్న జార్ఖండ్కు నవంబర్ 13, 20లలో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. ఈ ఏడాది ప్రథమార్ధంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో వరుసగా మూడోసారి కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టినా, సొంతకాళ్ళపై సర్కారు నడపలేని పరిస్థితి. కాంగ్రెస్ సారథ్యంలోని ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమికి ఇది కొంత ఊపు తెచ్చినా, తాజా హర్యానా ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ ముచ్చటగా మూడోసారి గద్దెనెక్కడంతో బ్రేకులు పడ్డాయి. ఇక, ఇప్పుడీ మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలతో ఎన్నికల గోదాలో ఈ ఏడాది ఆఖరి పంచ్ ఏ పార్టీది అవుతుందన్నది తేలనుంది. దేశానికి వాణిజ్య కూడలి లాంటి కీలకమైన మహారాష్ట్రలో బీజేపీ సారథ్య మహాయుతి కూటమికీ, శివసేన (ఉద్ధవ్ బాల్ఠాక్రే) – జాతీయవాద కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ – శరద్పవార్) – కాంగ్రెస్ల మహా వికాస్ ఆఘాడీ (ఎంవీఏ) కూటమికీ మధ్య పోరు రసవత్తరమే. 2019 లోక్సభ ఎన్నికల్లో 48 స్థానాలకు 41 గెలిచిన బీజేపీ – సేన కూటమి, 2024లో 17కే పరిమితమైంది. ఇంత దెబ్బ తగిలినా, కొన్ని నెలలుగా సంక్షేమ పథకాలు, హైవేలపై టోల్ ఫీ రద్దు లాంటి చర్యలతో మహాయుతి, సీఎం ఏక్నాథ్ శిండే రాష్ట్రంలో మళ్ళీ అధికారం నిలుపుకోవాలని చూస్తున్నారు. అయితే, రెండేళ్ళలో రెండు పార్టీలను చీల్చి అనైతిక కూటమితో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు చేశారనే ప్రజా భావన, అధికారపక్ష వ్యతిరేకత, నిరుద్యోగం, ప్రాంతాల మధ్య అభివృద్ధిలో అంతరాలు ప్రతిపక్షానికే అనుకూలిస్తాయని ఓ అంచనా. ఇక, స్థానిక పార్టీలైన శివసేన, ఎన్సీపీలు రెండుగా చీలాక ఎవరి సత్తా ఏమిటో నిరూపించుకొనేందుకు ఈ అసెంబ్లీ పోరు సిసలైన క్షేత్రస్థాయి పరీక్ష కానుంది. హర్యానాతో బీజేపీ పుంజుకుంటే, ప్రతిపక్ష కూటమిలో ఎక్కువ సీట్లు కోరి పెద్దన్న పాత్ర పోషించాలనుకున్న కాంగ్రెస్ వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి. మోదీ, అమిత్షాలు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పర్యటిస్తున్న నేపథ్యంలో... విపక్ష కూటమి విభేదాలు మరిచి, సీట్ల సర్దుబాటులో పట్టువిడుపులు చూపి, తమ వ్యూహానికి పదును పెట్టుకోకుంటే చిక్కులు తప్పవు. జార్ఖండ్ అసెంబ్లీకి జేఎంఎంతో కలసి కూటమిగా పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. సీట్ల సర్దుబాటుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోనప్పటికీ, ఇప్పటి దాకా చేసిన అభివృద్ధి పనులు తమను గెలిపిస్తాయని కూటమి నేతలు భావిస్తున్నారు. రెండు విడతల్లో జరగనున్న జార్ఖండ్ ఎన్నికలు ఆసక్తికరమైనవి. వాజ్పేయి హయాంలో 2000లో రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి జార్ఖండ్లో జేఎంఎం అయిదేళ్ళ పూర్తి కాలం అధికారంలో కొనసాగడం ఇదే తొలిసారి. గతంలో ఆ పార్టీ అనేక పర్యాయాలు అధికారంలోకి వచ్చినా, ప్రతిసారీ మూణ్ణాళ్ళ ముచ్చటే అయింది. లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఊపును రాష్ట్రంలో కొనసాగించాలని ‘ఇండియా’ కూటమి ఉబలాటపడుతుంటే, హర్యానా ఫలితాల ఉత్సాహంతో ఈ గిరిజన రాష్ట్రంలో సరికొత్త సామాజిక సమీకరణాల ఆసరాగా అధికారంలోకి రావాలని బీజేపీ కూటమి భావిస్తోంది. ఖనిజ సంపద పుష్కలంగా ఉండే ఈ దక్షిణ బిహార్ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా చేయాలంటూ ఒకప్పుడు హేమంత్ తండ్రి, జేఎంఎం అధినేత శిబూ సోరెన్ ఉద్యమం చేసి, విజయం సాధించారు. ఆనాటి నుంచి గిరిజన ఓటర్లు ఆ పార్టీకి రాజకీయ అండ. హేమంత్, ఆయన కూటమి ఆ గిరిజన ఓటుబ్యాంకును నమ్ముకున్నారు. దానికి తోడు అక్రమ ఆస్తుల కేసులో హేమంత్ అరెస్ట్ వ్యవహారాన్ని చూపి, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గిరిజనుల ఆత్మగౌరవ అంశాన్ని లేవనెత్తాలని జేఎంఎం ప్రయత్నం. సంథాల్ పరగణా లాంటి మారుమూల ప్రాంతాల్లో ఆ పార్టీ సంస్థాగతంగా బలంగా ఉంటే, పట్టణ ప్రాంతాల్లో బీజేపీతో ఢీ అంటే ఢీ అనడానికి కాంగ్రెస్ సత్తా ఉపకరిస్తుందని ఆలోచన. ఇక, రాష్ట్రానికి తొలి సీఎం అయిన గిరిజనుడు బాబూలాల్ మరాండీ ప్రతిపక్ష నేతగా తమ వెంట ఉండడం బీజేపీకి కలిసొచ్చే అంశం. 2015 – 2020 మధ్య గిరిజనేతర నాయకత్వంతో ప్రయోగాలు చేసి దెబ్బతిన్న కాషాయపార్టీ పాఠాలు నేర్చుకుంది. ఈసారి స్థానిక వర్గాలతో వ్యూహాత్మక సర్దు బాట్లకు దిగింది. ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్తో జట్టు కట్టి కుర్మీ ఓట్లపై కన్నేసింది. మాజీ సీఎం చంపాయ్ సోరెన్ను పార్టీలోకి తీసుకొని గిరిజన ప్రాంతాల్లోకి చొచ్చుకుపోవాలని చూస్తోంది. వెరసి, జార్ఖండ్ ఎన్నికలు సైతం ఆసక్తికరంగా మారాయి. పార్టీల వ్యూహాలు అటుంచితే, ఈవీఎంలపై వివాదం, ఈసీ వ్యవహార శైలిపై అనుమానాలకు మాత్రం ఇప్పటికీ స్పష్టమైన సమాధానాలు లేవు. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో 4 విడతల పోలింగ్కు సవాలక్ష కారణాలు చెప్పిన ఈసీ ఎక్కువ స్థానాలుండే అసెంబ్లీకి మాత్రం ఒకే విడత పోలింగ్ జరపడం విచిత్రమే. అలాగే, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ మంగళవారం ప్రకటించనున్నారని అస్సామ్ సీఎం హేమంత్ బిశ్వశర్మ ముందే ఎలా చెప్పగలిగారన్నదీ ప్రశ్నార్థకమే. ఇలాంటి వాటి వల్లే ఎన్నికల సంఘం స్వతంత్రత, పని తీరుపై ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. పోలింగ్ శాతం నుంచి ఫలితాల ప్రకటనపైనా విమర్శలెదుర్కొంటున్న ఈసీ ఇకనైనా పారదర్శకత పెంచుకోవాలి. తన నిజాయతీని నిరూపించుకోవాలి. అప్పుడే ప్రజాస్వామ్యంపై నమ్మకం మిగులు తుంది. ఎందుకంటే, ఈ కీలక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు... వచ్చే ఏడాదికి దిక్సూచి కానున్నాయి. వెంటనే వచ్చే ఢిల్లీ, ఆ పైన జరిగే బీహార్ ఎన్నికలకు భూమికను కూడా సిద్ధం చేస్తాయి. -
ఎన్సీపీ నేత దారుణ హత్య
ముంబయి:త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రలో ఎన్సీపీ నేత హత్య కలకలం రేపింది. అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ నేత సచిన్ కుర్మీన్ను దుండగులు పొడిచి చంపారు. గుర్తు తెలియని వ్యక్తులు పదునైన ఆయధంతో సచిన్ కుర్మిన్ను హత్య చేశారని పోలీసులు తెలిపారు.ముంబయిలోని బైకుల్లా ప్రాంతంలో శుక్రవారం(అక్టోబర్4) అర్ధరాత్రి ఈ హత్య జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఇదీ చదవండి: అహ్మద్నగర్ ఇక అహిల్యానగర్ -
బీజేపీకి షాక్.. శరద్ పవార్ ఎన్సీపీలోకి మాజీ మంత్రి
ముంబై: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహారాష్ట్రలో బీజేపీకి షాక్ తగిలింది. పార్టీ నేత, మాజీ మత్రి హర్షవర్దన్ పాటిల్ తర్వలో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్తో భేటీ అయిన మరుసటి రోజు హర్షవర్దన్ ఈ ప్రకటన చేశారు. శుక్రవారం పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులతో సమావేశమై.. తాను బీజేపీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ..‘నేను గత రెండు నెలలుగా ఇందాపూర్ నియోజకవర్గం అంతటా పర్యటిస్తూ వివిధ వర్గాల ప్రజలను కలుస్తున్నాను. ఒక విషయం స్పష్టంగా ఉంది. నేను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రజలు పట్టుబడుతున్నారు. నా మద్దతుదారులతో మాట్లాడిన తర్వాత శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరాలని నిర్ణయించుకున్నాను’ అని తెలిపారు. అయితే పుణెలోని ఇందాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్సీపీ ఎమ్మెల్యే దత్తమామ భర్నేపై పోటీ చేయాలని హర్షవర్దన్ భావిస్తున్నారు.కాగా అక్టోబరు 7న ఇందాపూర్లో జరిగే భారీ ర్యాలీలో ఎన్సీపీ (ఎస్పీ)లో ఆయన చేరుతారని మద్దతుదారులు తెలిపారు. ఇక ఆయన కుమార్తె అంకితా పాటిల్, మాజీ పూణె జిల్లా పరిషత్ సభ్యురాలు కూడా శరద్ పవార్ వర్గంలో చేరనున్నట్లు సమాచారం. పాటిల్ ఇందాపూర్ నుంచి నాలుగుసార్లు అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించారు. 2019 సెప్టెంబర్లో కాంగ్రెస్ను బీజేపీలో చేరారు.అయితే ప్రస్తుతం ఇందాపూర్ నుంచి ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. దీంతో ఇక్కడి నుంచి బీజేపీ తమ అభ్యర్ధిని ఎంపిక చేసేందుకు అసక్తి కనబరచడం లేదని తెలుస్తోంది. ఇందాపూర్ నియోజకవర్గం నుంచి తన అభ్యర్థిత్వంపై సరైన నిర్ణయం తీసుకోనందుకు బీజేపీపై అసంతృప్తితో ఉన్న పాటిల్ పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. -
మహారాష్ట్ర: హస్తం పార్టీ టికెట్లకు ఫుల్ డిమాండ్
ముంబై: త్వరలో జరగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ల కోసం గట్టి పోటీ నెలకొంది.మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమిలో భాగంగా ఎన్సీపీ,శివసేన(ఉద్ధవ్)పార్టీలతో కలిసి కాంగ్రెస్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయనుంది. పొత్తులో కాంగ్రెస్కు సుమారు 100 నుంచి 110 సీట్లు కేటాయించే అవకాశాలున్నాయి.ఈ సీట్లలో టికెట్ల కోసం ఇప్పటికే 1800కుపైగా దరఖాస్తులు వచ్చాయని నేతలు చెబుతున్నారు. ఒక్కో దరఖాస్తుకు రూ.20వేల రుసుము నిర్ణయించారు.ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించకముందే ఇన్ని దరఖాస్తులు వచ్చాయంటే తేదీలు ప్రకటించాక వీటి సంఖ్య ఇంకా పెరిగే ఛాన్సుందని నేతలు అంచనా వేస్తున్నారు. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో మహావికాస్అఘాడీ కూటమి మంచి ప్రదర్శన కనబరిచింది. ఈ ప్రభావంతోనే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కూటమి మంచి ఫలితాలు సాధించనుందన్న అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనా ఫలితంగానే పార్టీ టికెట్ల కోసం గట్టి పోటీ నెలకొందని మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత పృథ్వీరాజ్ చవాన్ తెలిపారు.ఇదీ చదవండి: హర్యానా ఎన్నికల వేళ బీజేపీకి షాక్ -
Maharashtra Polls: నాకూ సీఎం కావాలని ఉంది.. అజిత్ పవార్
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సీఎం పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి గెలిస్తే.. తాను సీఎం కావాలనే ఆశతో ఉన్నట్లు అజిత్ పవార్ పేర్కొన్నారు.పుణెలోని దగ్దుషేత్ హల్దవాయ్ గణపతి ఆలయంలో మంగళవారం అజిత్ పవార్ పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. ‘ప్రతిఒక్కరు తమ నాయకుడిని సీఎంగా చూడాలని కోరుకుంటారు. నేను కూడా అదే అనుకుంటున్నారు. కానీ ఎవరైనా సీఎం కావాలనుకుంటే.. వారు మెజార్టీ సంఖ్యకు చేరుకోవాలి. ప్రతి ఒక్కరి ఆకాంక్షలు నెరవేరవు.చదవండి: ‘వారిపై చర్యలు తీసుకోండి’.. ప్రధాని మోదీకి ఖర్గే లేఖప్రతి ఒక్కరికి ఒక అభిప్రాయంక, కోరికలు ఉంటాయి. కానీ అందరూ వారు కోరుకున్నది పొందలేరు. అదంతా ఓటర్ల చేతిలో ఉంటుంది. 288 స్థానాలకుగానూ 145 సీట్లు దక్కించుకోవాలి’ అని ఈ డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా రాబోయే ఎన్నికల్లో సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోనే మహాయుతి కూటమి(బీజేపీ, శివసేన, ఎన్సీపీ) పోటీ చేస్తుందని పేర్కొన్నారు.‘మా కూటమిని మరోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు మేమంతా ప్రయత్నిస్తున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత అంతా కలిసి చర్చించుకొని తదుపరి సీఎంను ఎంచుకుంటాం’ అని తెలిపారు. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏక్నాథ్ శిండేను ముఖ్యమంత్రి చేయాలంటూ శివసేన నేతలు డిమాండ్ చేస్తోన్న తరుణంలో పవార్ స్పందించడం గమనార్హం. మరోవైపు డిప్యూటీ సీఎంగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ను మరోసారి సీఎం పీఠంపై కూర్చోబెట్టాలని బీజేపీ నేతలు ఆకాంక్షిస్తున్నారు. -
Maharashtra: సీట్ల పంపకాలు పూర్తి.. 140 స్థానాల్లో బీజేపీ పోటీ?
ముంబై: లోక్సభ ఎన్నికల అనంతరం దేశంలో మరోసారి ఎన్నికల వేడి మొదలైంది. హర్యానా, జమ్మూకశ్మీర్, మహారాష్ట్రకు వరుసగా అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో రాజకీయ హడావిడీ నెలకొంది. గెలుపే లక్ష్యంగా అన్నిపార్టీలు ఎన్నికల పోరుకు సమాయత్తం అవుతున్నాయిఈ క్రమంలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా షెడ్యూల్ విడుదల కాకముందే.. అధికార, విపక్షాలు తమ ఫోకస్ పెంచాయి. తాజాగా మహయుతి ప్రభుత్వంలోని పార్టీల మధ్య (బీజేపీ, శివసనే,ఎన్సీపీ) సీట్ల పంపకాలపై చర్చలు మొదలయ్యాయి. మూడు పార్టీలు సైతం తమ పట్టు నిలుపుకునేందుకు ఎక్కువ స్థానాల్లో పోటీ కోరినట్లు సమాచారం. అయితే ఎట్టకేలకు అధికార కూటమిలో సీట్ల పంపకాల చర్చ అప్పుడే కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ 140 నుంచి 150 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 80 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందని, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 55 స్థానాల్లో పోటీ చేయవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. మిగతా చిన్న మిత్రపక్షాలకు మూడు సీట్లు కేటాయించనున్నట్లు వినికిడి.అయితే ప్రభుత్వానికి ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి కూటమి నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో 48 స్థానాల్లో 30 స్థానాలను గెలుచుకొని సత్తా చాటాయి ప్రతిపక్ష కాంగ్రెస్, ఎన్సీపీ(శరద్చంద్ర), శివసేన(ఉద్దవ్). లోక్సభ ఎన్నికల జోష్నే అసెంబ్లీ ఎన్నికల్లోనూ చూపించేందుకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు మహా వికాస్ అఘాడి కూటమి తమ సీట్ల భాగస్వామ్యాన్ని ఇంకా ప్రకటించలేదు. మరోవైపు కేవలం 17 స్థానాలకు మాత్రమే పరిమితమైన ఎన్డీయే కూటమి.. అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చి అధికారాన్ని కాపాడుకునేందుకు యత్నిస్తోంది. కాగా గత 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, అవిభక్త శివసేన కూటమి అఖండ విజయం సాధించింది.అయితే సీఎం పదవిపై విభేదాలు నెలకొన్న నేపథ్యంలో శివసేన బీజేపీతో తెగదెంపులు చేసుకొని కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. కానీ కొంతకాలానికే ఆ ప్రభుత్వం కుప్పకూలింది. 2022లో శివసేన నుంచి ఏక్నాథ్ షిండే బయటకు వచ్చి బీజేపీతో జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం కొంతకాలానికే ఎన్సీపీని చీల్చుతూ అజిత్ పవార్ బీజేపీ ప్రభుత్వంతో చేతులు కలిపి డిప్యూటీ సీఎం పదవి దక్కించుకున్నారు. -
అందుకే మహారాష్ట్రకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించలేదు: సీఈసీ
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలు అనంతరం మరోసారి దేశంలో ఎన్నికల నగరా మోగింది. జమ్ముకశ్మీర్తోపాటు, హర్యానా రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. అయితే ఆ రెండు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, జార్ఖండ్కు సైతం అసెంబ్లీ ఎన్నికల తేదీలను నేడు ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతానికి వీటి షెడ్యూల్ గురించి సీఈసీ రాజీవ్ కుమార్ ఎలాంటి ప్రకటన చేయలేదు.అయితే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ తర్వాత ప్రకటిస్తామని మాత్రం రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. ఇందుకు గల కారణాలను కూడా ఆయన వివరించారు. జమ్ముకశ్మీర్లో భద్రతా అవసరాల దష్ట్యా మహారాష్ట్ర ఎన్నికలను వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. అంతేగాక.. మహారాష్ట్రలో వర్షాలు కురుస్తుండటంతో ఓటరు జాబితాను అప్డేట్ చేయడంలో ఆలస్యం అయ్యిందని, ఇది ఎన్నికల నిర్వహణకు కీలకమైనదిగా ఆయన తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం పితృ పక్షం, దీపావళి, గణేష్ చతుర్థి వంటి ముఖ్యమైన పండుగుల, కార్యక్రమాలు జరగాల్సి ఉందని, ఇవన్నీ కారణాలతో ఎన్నికలను వాయిదా వేయవలసి వచ్చిందన్నారు.చివరిసారి హర్యానాకు, మహారాష్ట్రకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అప్పుడు జమ్ముకి ఎన్నికలు లేవు. కానీ ఈసారి వరుసగా అయిదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి(జమ్మూ కశ్మీర్, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ). ఎన్నికలకు సిబ్బంది అవసరాన్ని బట్టి రెండు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించుకున్నాం.రాష్ట్రాల శాసనసభ పదవీకాలం ముగియడానికి ఆరు నెలల ముందు వరకు ఎన్నికలను షెడ్యూల్ విడుదల చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉంది. ఈ క్రమంలో ఎన్నికలకు అవసరమైన అన్ని సన్నాహాలు సమర్థవంతంగా పూర్తయిన తర్వాత మహారాష్ట్రలో ఎన్నికలు నిర్వహిస్తాం’ అని చెప్పారు. -
Uddhav Thackeray: సార్వత్రిక పోరులో గెలుపు ఆరంభం మాత్రమే
ముంబై: ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో తమ కూటమి మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) గెలుపు ఆరంభం మాత్రమేనని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ఎంవీఏ విజయయాత్ర రాష్ట్రంలో మరికొద్ది నెల ల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసా గుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 48 సీట్లకు గాను ఎంవీఏ పార్టీలు 30 సీట్లను గెల్చుకో వడం తెల్సిందే. ఉద్ధవ్ శనివారం ఎన్సీపీ (ఎస్పీ)చీఫ్ శరద్ పవార్, కాంగ్రెస్ సీనియర్ నేత పృథ్వీరాజ్ చవాన్తో కలిసి మీడియాతో మాట్లాడారు. బీజేపీ అజేయమనే అపోహ ఎంత బూటకమైనదో లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రజలు రుజువు చేశారని ఉద్ధవ్ అన్నారు. ఎన్డీఏ సర్కారుగా మారిన మోదీ సర్కారు ఎంతకాలం కొనసాగుతుందో చూడాలని వ్యాఖ్యానించారు. -
వద్దన్న బీజేపీ... మళ్లీ ముందుకు!
తీర్పు స్పష్టంగానే వచ్చింది. కానీ పార్టీలే మాట తప్పాయి. ఇక్కడ ఏ పార్టీ మాట తప్పిందంటే... చెప్పటం కష్టం. మహారాష్ట్రలో బీజేపీ– శివసేన కూటమికి జనం అధికారమిచ్చినా... రెండున్నరేళ్ల చొప్పున ముఖ్యమంత్రి పీఠాన్ని పంచుకుంటామని ముందు చెప్పి, తరవాత మాట తప్పుతున్నందుకే తాము బీజేపీతో కలవటం లేదని శివసేన చెబుతోంది. తాము అలాంటి హామీనే ఇవ్వలేదని, శివసేనే మాట మారుస్తోందని బీజేపీ చెబుతోంది. అందుకే... ఇద్దరి పొత్తూ పెటాకులైంది. బీజేపీకి సింగిల్గా బలం చాలదు కనక... గవర్నరు పిలిచినా... చేతులెత్తేసింది. శివసేనను పిలిచినా అదే కథ. కాకపోతే ఈ పార్టీ కొంచెం సమయం కావాలంది. దానికి నిరాకరిస్తూ మరో పార్టీ ఎన్సీపీని కూడా పిలిచారు గవర్నరు. అంతలోనే ఈ గొడవ తేలదంటూ ఈ వారం మొదట్లో గవర్నరు రాష్ట్రపతి పాలనకూ సిఫారసు చేశారు. కేంద్రం ఓకే చేసేసింది. ఇది అన్యాయమంటూ శివసేన సుప్రీంకోర్టుకు వెళ్లింది కూడా. 288 సీట్ల మహారాష్ట్రలో బీజేపీకి 105, శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్కు 44 స్థానాలున్నాయి. బీజేపీగానీ, శివసేనగానీ లేకుండా ఏ ప్రభుత్వమూ ఏర్పాటయ్యే పరిస్థితి లేదు. అందుకే సేన కూడా మొండిపట్టు పడుతోంది. ప్రాంతీయ శక్తుల ఎదుగుదలకు అవకాశమున్న మహారాష్ట్రలో ముందుముందు బలోపేతం కావాలంటే అధికార పీఠం తన చేతిలో ఉండాలన్నది సేన మనోగతం. అందుకే మునుపటిలా బీజేపీకే ఐదేళ్లూ అవకాశం ఇవ్వకుండా తనకూ రెండున్నరేళ్లు సీఎం పీఠం కావాలంది. ఇదే ప్రతిపాదనతో ఎన్సీపీ– కాంగ్రెస్లతోనూ సంప్రదింపులు జరుపుతోంది. ఎన్సీపీ ఓకే అంటున్నా... కాంగ్రెస్ మాత్రం సైద్ధాంతిక వైరుధ్యాల దృష్ట్యా అంత సుముఖత వ్యక్తం చేయలేదు. కాకపోతే దేశ ఆర్థిక రాజధాని ముంబైని బీజేపీకి దూరం చేయాలంటే సేనకు మద్దతివ్వక తప్పదు. అందుకే ముగ్గురూ కలిసి ఓ అవగాహనకు రావటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. చివరికి కాంగ్రెస్ కూడా సై అనే ప్రకటించింది. కాంగ్రెస్ ఎలాగూ శివసేనతో కలవదని, సేన తమ చెంతకే వస్తుందని ధీమాగా ఉన్న బీజేపీకి ఇది షాకే. అందుకే వేగంగా పావులు కదిపింది. తమకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతుందని, కాబట్టి ప్రభుత్వానికి అవకాశమివ్వాలని గవర్నరును శనివారం కోరింది. కనీసం 144 మంది మద్దతిస్తేనే ప్రభుత్వం సాధ్యం. మరి 118 మందితో ఏం చేస్తారు? తమ పార్టీల ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నది బీజేపీ వ్యూహమని సేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మండిపడుతున్నాయి. ఏమో!! ఏం జరుగుతుందో... గవర్నరు ఏం చేస్తారో చూడాల్సిందే!!. కనీసం 144 మంది మద్దతిస్తేనే ప్రభుత్వం సాధ్యం. మరి 118 మందితో ఏం చేస్తారు? తమ పార్టీల ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నది బీజేపీ వ్యూహమ’ని సేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మండిపడుతున్నాయి. -
సావంత్ వర్సెస్ మహాడేశ్వర్!
సాక్షి, ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు తిరుగుబాటు అభ్యర్థులు సవాల్గా మారారు. తూర్పు బాంద్రా అసెంబ్లీ నియోజక వర్గంలో శివసేన ఇబ్బందుల్లో పడిపోయింది. ఈ నియోజకవర్గంలో ఒకరు శివసేన అభ్యర్థి కాగా మరొకరు శివసేన తిరుగుబాటు అభ్యర్థి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు. దీంతో ఇక్కడ ఇద్దరు బలమైన అభ్యర్తులే కావడంతో పోరు రసవత్తరంగా మారింది. దీంతో ఫలితాలు ఎలా వస్తాయనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. ప్రకాశ్ సావంత్దే ఆధిపత్యం.. 2004లో జరిగిన ఎన్నికల్లో తూర్పు బాంద్రా అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ ఆధీనంలోకి వచ్చింది. ఆ తరువాత 2009లో జరిగిన ఎన్నికల్లో ఈ నియోజక వర్గాన్ని శివసేన చేజిక్కించుకుంది. శివసేన టికెట్పై పోటీచేసిన ప్రకాశ్ సావంత్కు 45,651 ఓట్లు రాగా ప్రత్యర్థిగా కాంగ్రెస్ టికెట్పై బరిలోకి దిగిన జనార్ధన్ చాందుర్కర్కు 38,239 ఓట్లు, ఎమ్మెన్నెస్ అభ్యర్థి శిల్పా పోద్దార్కు 19,109 ఓట్లు వచ్చాయి. ఆ తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో కూడా ప్రకాశ్ సావంత్ భారీ మెజారిటీతో విజయకేతనం ఎగురవేశారు. అయితే 2015లో ప్రకాశ్ సావంత్ ఆకస్మిక మృతితో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఉప ఎన్నికలో శివసేన తరఫున ప్రకాశ్ భార్య తృప్తి సావంత్ పోటీ చేయగా 52,711 ఓట్లు, కాంగ్రెస్ తరఫున నారాయణ్ రాణే పోటీ చేయగా 33,703 ఓట్లు, ఎంఐఎం తరఫున రహెబర్ సిరాజ్ ఖాన్ పోటీ చేయగా 15,050 ఓట్లు వచ్చాయి. కాగా ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో విజయ ఢంకా మోగించినప్పటికీ ఈ నెల 21వ తేదీన జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తృప్తి సావంత్కు అభ్యర్థిత్వం ఇవ్వకుండా సిట్టింగ్ మేయర్ విశ్వనాథ్ మహాడేశ్వర్కు అభ్యర్థిం కట్టబెట్టారు. దీంతో ఆగ్రహానికి గురైన తృప్తి సావంత్ తిరుగుబాటు చేసి ఇండిపెండెంట్గా నామినేషన్ వేశారు. ఆమె బరిలోకి దిగడంవల్ల విశ్వనాథ్కు విజయవకాశాలు కొంత సన్నగిల్లినట్లు వాతావరణం కనిపించింది. దీంతో నామినేషన్ ఉపసంహరించుకోవాలని చేసిన ప్రయత్నాలేవి ఫలించలేదు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఇక్కడ శివసేన తరఫున విశ్వనాథ్ మహాడేశ్వర్, ఇండిపెండెంట్గా తృప్తి సావంత్, కాంగ్రెస్ తరఫున జిషాన్ సిద్ధికీ, ఎమ్మెన్నెస్ తరఫున అఖిల్ చిత్రే బరిలో నిలిచ్చారు. ఇక్కడ నలుగురు అభ్యర్ధులు బరిలో ఉన్నట్లు తేలిపోయింది. అసలు పోటీ శివసేన అభ్యర్థి మహాడేశ్వర్, ఇండిపెండెంట్ అభ్యర్థి సావంత్ మధ్య జరగడం ఖాయంగా కనబడుతోంది. ఒకపక్క సిట్టింగ్ ఎమ్మెల్యే మరోపక్క ముంబై మేయర్ బరిలో ఉండడంవల్ల పోటీ హోరాహోరీగా జరగనుంది. అంతేగాకుండా ఈ నియోజక వర్గం ఇటు శివసేనకు అటు ఇండిపెండెంట్ అభ్యర్థి తృప్తి సావంత్కు సవాలుగా మారింది. ఎలాగైన ఈ నియోజకవర్గంలో పట్టుసాధించాలని శివసేన దృడసంకల్పంతో ఉంది. మరోపక్క తన ఆదీనంలో ఉన్న ఈ నియోజక వర్గాన్ని ఎట్టి పరిస్ధితుల్లో చేజారిపోకుండా తృప్తి సావంత్ కూడా తన ప్రతిష్టను ఫణంగా పెట్టారు. దీంతో ఈ నియోజక వర్గంపై ఓటర్లతోపాటు సామాన్య ప్రజలకు కూడా మరింత ఆసక్తి నెలకొంది. ఇరువురు బలమైన అభ్యర్ధులు కావడంతో ఓటర్లు ఎవరికి పట్టం కట్టబెడతారనేది ఎన్నికల ఫలితాల్లో తేటతెల్లం కానుంది. (చదవండి: మహారాష్ట్రలో ఫడ్నవీయం) -
‘మహా’ పొత్తు కుదిరింది
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీ చేయనున్నాయి. సీట్ల సర్దుబాటుపై అవగాహనకు వచ్చామని, ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనేది ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ప్రకటిస్తారని బీజేపీ నేత చంద్రకాంత్ పాటిల్ సోమవారం ప్రకటించారు. తమ కూటమిలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, రాష్ట్రీయ సమాజ్ ప„ŠS, శివ సంగ్రామ్ సంఘటన్, రైతు క్రాంతి సేన కూడా ఉన్నాయని శివసేన నేత సుభాష్ దేశాయ్ చెప్పారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని శివసేన నేత, ఉద్ధవ్ ఠాక్రే పెద్ద కుమారుడు ఆదిత్య ఠాక్రే ప్రకటించారు. ఠాక్రే కుటుంబం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి వ్యక్తి ఆదిత్య ఠాక్రేనే కావడం విశేషం. ముంబైలోని వర్లి స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు ఆదిత్య వెల్లడించారు. వర్లి సేన బలంగా ఉన్న స్థానాల్లో ఒకటి. 1966లో బాల్ ఠాక్రే శివసేనను స్థాపించినప్పటి నుంచి ఆ కుటుంబసభ్యులెవరూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. రాజ్యాంగ పదవులు పొందలేదు. మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే (బాల్ ఠాక్రే సోదరుడి కుమారుడు) 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నారు కానీ తరువాత మనసు మార్చుకున్నారు. ఎక్కువ స్థానాల్లో శివసేన గెలిస్తే ఆదిత్య ఠాక్రే సీఎం అవుతారని సేన వర్గాలు చెబుతున్నాయి. ఒక శివసైనికుడిని సీఎం చేస్తానని తన తండ్రి దివంగత బాల్ ఠాక్రేకు హామీ ఇచ్చానని శనివారం ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించడం గమనార్హం. 2014 ఎన్నికల్లో బీజేపీ, శివసేన వేర్వేరుగా పోటీ చేశాయి. ఫలితాల అనంతరం అదే సంవత్సరం డిసెంబర్లో బీజేపీ ప్రభుత్వంలో శివసేన చేరింది. ఎంఎన్ఎస్ పోటీ ఈ ఎన్నికల్లో మహారాష్ట్ర నవ నిర్మాణ సేన పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్ఠాక్రే ప్రకటించారు. ‘ఈ ఎన్నికల్లో పోటీ చేస్తాం. గెలుస్తాం’ అని ఆయన సోమవారం ప్రకటించారు. ఎన్ని స్థానాల్లో పోటీ చేయనున్నది ఆయన ప్రకటించలేదు. కానీ సుమారు 125 సీట్లలో ఎంఎన్ఎస్ పోటీ చేయొచ్చని ఆ పార్టీ నేత ఒకరు తెలిపారు. ముంబై, పుణె, నాసిక్, థానె, పాల్ఘార్.. తదితర పట్టణ ప్రాంతాల్లోనే ఆ పార్టీ బరిలో నిలిచే అవకాశముంది. అయితే, ఆదిత్య ఠాక్రే పోటీ చేస్తున్న ముంబైలోని వర్లి స్థానంలో ఎంఎన్ఎస్ అభ్యర్థిని నిలుపుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. -
ఎన్నికలపై మోదీ, షా కీలక భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. ఈ భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అలాగే పొత్తులపై కూడా వారి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కీలకమైన మహారాష్ట్రలో శివసేనతో పొత్తుపై సుదీర్ఘ చర్చ జరిగినట్లు సమాచారం. మరోవైపు ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థుల గురించి మోదీ వద్ద నడ్డా ప్రస్తావించినట్లు తెలిసింది. నామినేషన్లకు సమయం అసన్నమవ్వడంతో ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని నడ్డా ప్రతిపాదించారు. దీనికి సానుకూలంగా స్పందించిన మోదీ, షా త్వరలోనే అభ్యర్థుల జాబితాకు ఆమోదం తెలుతామన్నట్లు సమాచారం. ఇక తెలంగాణలోని హుజూర్నగర్ ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. స్థానిక బీజేపీ నేత డా. కోట రామారావును తమ అభ్యర్థిగా బరిలో నిలపుతున్నట్లు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా అధికారికంగా ఆదివారం ప్రకటించారు. అలాగే దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరుగునున్న 32 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు కూడా అభ్యర్థులను ప్రకటించారు. -
బీజేపీ ఎన్నికల అస్త్రం బయటకు తీసిందా?
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశ వ్యాప్తంగా 64 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు రంగం సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల ప్రకటన వెలువడగానే రాజకీయ పార్టీలు, ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు, నాయకులు ఆర్భాటం చేయడం సహజం. కానీ దేశంలో ఎన్నడూ లేని విధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈసారి ఎన్నికల్లో కేంద్ర బిందువుగా మారింది. ఎన్నికల వేళ ప్రత్యర్థి పార్టీలకు చెందిన నాయకులపై దాడులకు పాల్పడుతూ వారికి చుక్కలు చూపిస్తోంది. ఇదంతా కేంద్రంలోని బీజేపీ కుట్రగా విపక్షాలు విమర్శలు గుప్పిస్తుంటే.. అవినీతిపరులను వదిలేది లేదంటూ ప్రభుత్వం హెచ్చరికలు జారీచేస్తోంది. వెరసి దేశంలో తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో అధికార, విపక్ష విమర్శలు, ఆరోపణలకు ఈడీ ప్రధాన కేంద్రంగా మారింది. దీంతో తమపై రాజకీయ కక్షసారింపు కోసమే కేంద్రం ఈడీ అనే అస్త్రంను ప్రయోగిస్తోందని విపక్ష పార్టీల సభ్యులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు కేంద్రం చేతిలో ఈడీ కీలుబొమ్మగా మారిందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. పెద్దల చుట్టూ కేసుల ఉచ్చులే.. ఈడీ దాడులతో ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం, కర్ణాటక ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్లు జైలులో ఉండగా.. తాజాగా మహారాష్ట్ర మాజీ సీఎం, ఎన్సీపీ నేత శరద్ పవార్పై ఈడీ ఉచ్చు బిగుసుకుంది. మహారాష్ట్ర రాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంక్ (ఎంఎస్సీబీ)లో రూ.25 వేల కోట్ల కుంభకోణానికి సంబంధించి వీరిపై మనీల్యాండరింగ్ కేసు నమోదు చేసినట్లు ఈడీ ఇటీవల తెలిపింది. దీనిపై ఆయన్ను త్వరలోనే విచారించే అవకాశం ఉంది. ఈ పరిణామం ఆ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పవార్పై ఇలాంటి తప్పుడు కేసులు పెడుతూ.. వేధిస్తున్నారని విపక్ష పార్టీలు కేంద్రంపై మండిపడుతున్నాయి. తాజాగా పవర్కు మద్దతుగా బీజేపీ మిత్ర పక్షం శివసేన కూడా స్వరం వినిపించింది. ఈ కుంభకోణంలో పవార్ తప్పేమీలేదని ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ అభిప్రాయపడ్డారు. అయితే పవార్ను కేసులో ఇరికించేందుకు బీజేపీ పెద్ద ఎత్తున కుట్ర పన్నిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇటీవల మహారాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దీని వెనక ప్రధాన పాత్ర పోషించారని విమర్శిస్తోంది. అయితే అమిత్ షా రెండు రోజుల పర్యటన ముగిసిన తెల్లారే పవార్పై కేసు నమోదు కావడం గమనార్హం. మరో కీలక నేత, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎన్ఎన్ఎస్పీ) చీఫ్ రాజ్ఠాక్రేకు కూడా ఓ కేసు నిమిత్తం ఈడీ నోటీసు జారీ చేసింది. మరోవైపు కర్ణాకటలో 15 అసెంబ్లీ స్థానాలకు జరగాల్సిన ఉప ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్కు కఠిన పరీక్షగా మారాయి. ఈ ఎన్నికల్లో నెగ్గడం బీజేపీకి ఎంతో అవసరం. దీంతో సీనియర్ నేత, ట్రబుల్ షూటర్గా పేరొందిన డీకే శివకుమార్ను కట్టడి చేయాలని ప్రభుత్వం భావించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిలో భాగంగానే ఆగమేఘాల మీద ఈడీ శివకుమార్కు సమన్లు జారీ చేసింది. ఈ దాడి అనంతరం శివకుమార్ వద్ద రూ.300 కోట్లకు పైగా లెక్కలు చూపని ఆస్తి ఉన్నట్లు ఈడీ గుర్తించింది. మరోక్షణం ఆలస్యం చేయకుండా అతన్ని జైలుకు పంపింది. ఆయనతో పాటు ఆయన కుమార్తె ఐశ్వర్యనూ ఈడీ విచారించింది. దీంతో ఎన్నికలను కొంత సునాయాసంగా ఎదుర్కొవచ్చని బీజేపీ భావిస్తోన్నట్లు హస్తం నేతలు విమర్శ. డీకే అరెస్ట్పై కన్నడ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ కక్షసాధింపుతోనే ఆయనను టార్గెట్ చేశారని హస్తం నేతలు మండిపడుతున్నారు. వీడని వాద్రా కేసులు.. మరోవైపు హర్యానా అసెంబ్లీకి ఎన్నికల ప్రకటన వెలువడింది. సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా ఇప్పటికే ఈడీ, సీబీఐ కేసులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రకటన వెలువడటంతో కేసు విచారణను ఈడీ మరింత వేగవంతం చేసింది. కోర్టు అనుమతితో విదేశాలకు వెళ్లిన ఆయనను ఏ క్షణమైన ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. కాగా బికనీర్ భూముల కుంభకోణంలో ఆయన ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇదిలావుండగా.. హర్యానా మాజీ సీఎం భూపేందర్ సింగ్ హూడాని కూడా ఈడీ వదల్లేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అక్రమంగా భూలావాదేవీలు జరిపారని ఈడీ ఆరోపిస్తోంది. దీనిపై ఆయన ఇదివరకే ఈడీ నుంచి నోటీసులను కూడా అందుకున్నారు. రాష్ట్రంలో ఎన్నికల జరుగుతుండటంలో అధికార బీజేపీకి ఆయనపై ఉన్న కేసులే ప్రధాన అస్త్రంగా మారాయి. ఇక చిదంబరం అరెస్ట్ దేశ వ్యాప్తంగా పెద్ద చర్చకే దారితీసింది. కీలకమైన ఎన్నికలు, దేశంలో ఆర్థిక సంక్షోభం వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకునే ఆయన్ని జైలుకు పంపారని విపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నాయి. -
శరద్ పవార్కు మద్దతుగా శివసేన
ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత శరద్ పవార్కు బీజేపీ మిత్రపక్షమైన శివసేన నుంచి మద్దతు లభించింది. మహారాష్ట్ర సహకార బ్యాంకు కుంభకోణంలో శరద్ పవార్ ప్రేమేయం ఏమీ లేదని, కుంభకోణం వెలుగుచూసిన సమయంలో పవార్ అధికారంలో కూడా లేరని శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. శుక్రవారం ముంబైలో జరిగిన మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ.. 'పవార్ పెద్ద నేత. బ్యాంకుతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. ఇలాంటి కేసుల్లో ఆయన పేరు పరిగణనలోకి తీసుకోవడం వల్ల మహారాష్ట్రలో అనారోగ్యకరమైన వాతావరణం నెలకొంటుంది. స్కామ్ జరిగినప్పుడు ఆయన అధికారంలో కూడా లేరు. ఆయన పార్టీ నేతలు ఉండొచ్చేమో కానీ ఆయనకు ఎలాంటి ప్రమేయం లేదు' అని సంజయ్ రౌత్ తెలిపారు. బ్యాంకు కుంభకోణంలో ఆయన పేరు చేర్చడానికి ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈడీ సంప్రదించి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా అసెంబ్లీ ఎన్నికల ముందు శరద్ పవార్కు మద్దతుగా రౌత్ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. దీనిపై బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర రాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంక్ (ఎంఎస్సీబీ)లో రూ.25 వేల కోట్ల కుంభకోణానికి సంబంధించి వీరిపై మనీల్యాండరింగ్ కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపిన విషయం తెలిసిందే. ప్రజాధనం దుర్వినియోగం అయినట్లు ఈడీ తేల్చింది. పవార్, ఆయన మేనల్లుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్తో పాటు 70 మంది ఎంఎస్సీ బ్యాంకు అధికారు పేర్లను అందులో చేర్చింది. -
మరాఠీల మొగ్గు ఎటువైపో?
సాక్షి, ముంబై: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సైరన్ మోగడంతో ముంబైలో రాజకీయ పార్టీల కదలిక లు జోరందుకున్నాయి. తమ తమ నియోజక వర్గాలలో ఓటర్లను ఆకర్షించుకునే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఏ వార్డులో ఎన్ని ఓట్లు తమకు అనుకూలంగా ఉన్నాయనే దానిపై ఆయా పార్టీల నాయకులు, పదాధికారులు, కార్యకర్తలు బేరీజు వేసుకుంటున్నారు. మరాఠీ ఓటర్లున్న నియోజక వర్గాలలో ప్రధాన రాజకీయ పార్టీలన్ని వ్యూహం పన్నుతున్నాయి. ముంబైలో సుమారు 24 లక్షల మరాఠీ ఓటర్లున్నారు. మరాఠీ ప్రజల శాతం తగ్గిపోతున్నప్పటికీ ముంబైలో వారి ఓట్లే కీలకం కానున్నాయి. అనేక నియోజక వర్గాలలో మరాఠీ ఓట్లు ఫలితాలను తారుమారు చేస్తాయి. దీంతో ప్రధాన పార్టీల నాయకుల దృష్టి ఆ ఓట్లపైనే ఉంది. రెండు కూటముల మధ్యే పోరు.. ముంబైలో శివసేన–బీజేపీ, కాంగ్రెస్–ఎన్సీపీ మధ్య పొత్తు కుదిరితే ఈ రెండు కూటముల మధ్య నేరుగా పోరు జరగనుంది. బహుజన్ వంచిత్ ఆఘాడి ఏర్పడిన తరువాత అసెంబీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే ప్రథమం. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) కూడా బరిలో దిగేందుకు సన్నహాలు చేస్తోంది. దీంతో కొన్ని చోట్ల ద్విముఖ పోటీ, మరికొన్ని చోట్ల త్రిముఖ, చతుర్ముఖ పోటీ జరగనుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ తమ నియోజక వర్గాలలో ఇప్పటి నుంచి నడుం బిగించారు. ముంబైలో మొత్తం 36 అసెంబ్లీ నియోజక వర్గాలున్నాయి. అందులో శివ్డీ, వర్లీ, మాహిం, వడాల, తూర్పు బాంద్రా, కాలీనా, బోరివలి, చెంబూర్, జోగేశ్వరీ, తూర్పు ఘాట్కోపర్, పశ్చిమ ఘాట్కోపర్, చాందివలి, విలేపార్లే, వర్సోవా, కాందివలి, మాగఠాణే తదితరా నియోక వర్గాలలో మరాఠీ ఓట్లు ఫలితాలను నిర్ణయిస్తాయి. సునీల్ ప్రభు, రవీంద్ర వైకర్, ప్రకాశ్ సుర్వే, పరాగ్ అలవ్ణి, భారతీ లవేకర్, సంజయ్ పోత్నీస్, ఆశీష్ శేలార్, సదా సర్వణ్కర్ తదితర మరాఠీ ఎమ్మెల్యేలకు తమ తమ నియోజక వర్గాలలో మంచి పట్టు ఉంది. ఈ సారి కూడా వారి మళ్లీ అభ్యర్తిత్వం కట్టబెట్టే అవకాశాలున్నాయి. ఈ నియోజక వర్గాలలో మరాఠీ ఓటర్ల సంఖ్య అధికంగా ఉంది. అంతేగాకుండా ఈ నియోజక వర్గాలలో మరాఠీ కార్పొరేటర్లు కీలక పాత్ర పోషిస్తారు. ఎన్సీపీ, ఎమ్మెన్సెస్, సమాజ్వాది పార్టీ, ఎంఐఎం మినహా ఇక్కడ అన్ని పార్టీల ఎమ్మెల్యేలున్నాయి. గతంలో జరిగిన ఎన్నికల్లో మరాఠీ ఓట్లతోనే వారంతా గెలిచారు. ఈ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ పోటీ చేయలేదు. కాని ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతోంది. శివసేన, ఎమ్మెన్సెస్కు మరాఠీ ఓటర్ల అండ ఉన్నప్పటికీ కొంచెం అటు, ఇటుగా మిగతా పార్టీలకు కూడా ఓట్లు పోలయ్యే ప్రమాదముంది. ఇదే సమయంలో వంచిత్ ఆఘాడి కూడా మొదటిసారి బరిలో దిగడంతో మరాఠీ ఓట్లు చీలిపోయి ఫలితాలు తారుమారు అయ్యే ప్రమాదం లేకపోలేదు. ప్రాబల్యం తగ్గిపోతుండటంతో.. ఇప్పటికే ముంబైలో మరాఠీ ఓటర్లు తగ్గుతున్నారు. 2001లో మధ్యముంబైలో మరాఠీ ప్రజల సంఖ్య 45 లక్షలు ఉండగా 2011లో ఈ సంఖ్య 44 లక్షలకు పడిపోయింది. ముంబైలో మొత్తం 94,58,397 ఓటర్లున్నారు. ప్రసుత్తం అందులో మరాఠీ ఓటర్లు కేవలం 24 లక్షలున్నారు. దీంతో ముస్లీం, ఉత్తరభారతీయ ఓటర్లను కాంగ్రెస్–ఎన్సీపీ కూటమి దువ్వే ప్రయత్నం చేయగా మరాఠీ, దక్షిణ భారతీయుల ఓటర్లను శివసేన–బీజేపీ కూటమి ఆకర్షించే ప్రయత్నం చేయనున్నాయి. ఈ ప్రజలకు ఎలాంటి హామీలిచ్చి తమవైపు ఆకర్షించుకోవాలనే దానిపై ఇప్పటి నుంచి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. కొన్ని చోట్ల మరాఠీ ఓటర్లు తగ్గడంతో ఇతర ప్రాంతాల ఓటర్లే కీలక పాత్ర పోషించనున్నారు. దీంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు చేయనున్నాయి. -
పొత్తు కుదురుతుందా..? వికటిస్తుందా..?
సాక్షి, ముంబై: బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి అమిత్ షా ముంబై రద్దయింది. బీజేపీ–శివసేన పొత్తుపై ఇవాళ అధికారికంగా ప్రకటన వెలువడనుందనే నేపథ్యంలో ఆయన గురువారం ముంబైలో పర్యటించాల్సి ఉంది. అయితే అమిత్ షా పర్యటన అనూహ్యంగా వాయిదా పడింది. దీనిపై భారతీయ జనతా పార్టీ నిన్న రాత్రి ఓ ప్రకటన చేసింది. అయితే ఆయన పర్యటన ఎప్పుడు ఉంటదనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు అక్టోబరు 21న జరగనున్నాయి. బీజేపీ–శివసేన కాషాయ కూటమి పొత్తుపై గత కొద్ది రోజులుగా ఇరు పారీ్టల నాయకులు తమకు తోచిన విధంగా ప్రకటనలు చేస్తున్నారు. దీంతో పొత్తు కుదురుతుందా..? వికటిస్తుందా..? అనే దానిపై ఇరుపారీ్టల నాయకులు సందిగ్ధంలో పడిపోయారు. ఈ నేపథ్యంలో అమిత్ షా రద్దుతో పొత్తుపై అధికారికంగా ప్రకటన మరికాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ చీఫ్ అమిత్ షా ప్రతిపక్షాలు నిర్ణయం తీసుకున్నా.. ప్రతిపక్షాలు, గిట్టని పార్టీ నాయకులు ఇలా ఎవరేమనుకున్న బీజేపీ–శివసేన మధ్య కచి్చతంగా పొత్తు కుదురుతుందని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సోమవారం విలేకరుల సమావేశంలో స్పష్టమైన సంకేతాలిచ్చారు. పొత్తుపై తను కూడా ఆందోళన చెందుతున్నానని అన్నారు. దీంతో పొత్తు, సీట్ల పంపకం అంశాన్ని ఎక్కువ రోజులు నాన్చకుండా సాధ్యమైనంత త్వరగా తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు ఫడ్నవీస్ చెప్పారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్-శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే రాష్ట్రంలో ఎన్నికల సైరన్ మోగింది. కాని పొత్తుపై ఇంతవరకు ఒక స్పష్టత రాకపోవడంతో ప్రతిపాదనలు అటకెక్కుతున్నాయన్నారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దీంతో ఫడ్నవీస్ పొత్తు, సీట్ల పంపకంపై వివరాలు వెల్లడిస్తుండవచ్చని విలేకరులు భావించారు. కాని వారి అంచనాలు తారుమారయ్యాయి. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ పెట్టుబడులపై వివరాలు వెల్లడించి విలేకరుల సమావేశాన్ని ముగించారు. ఇరు పారీ్టల మధ్య పొత్తుపై మీరెంత ఆందోళన చెందుతున్నారో... నేను కూడా అంతే ఆందోళన చెందుతున్నానని అన్నారు. కానీ, సరైన సమయంలో, సరైన నిర్ణయం తీసుకుని ప్రకటిస్తామని స్పష్టం చేశారు. -
‘అది భారత్-పాక్ విభజన కన్నా కష్టం’
సాక్షి, ముంబై: ఎన్నికల ప్రకటన వెలువడటంతో మహారాష్ట్రలో రాజకీయ వేడి మొదలైంది. పొత్తులపై అధికార విపక్ష పార్టీలు దూకుడుపెంచాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి పోటీ చేస్తున్నట్లు ఇది వరకే ప్రకటించగా, అధికార బీజేపీ-శివసేన మాత్రం ఇంకా ఎటూ తేల్చుకోలేక పోతున్నాయి. ఈ నేపథ్యంలో సీట్ల ఒప్పందంపై శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. శివసేన-బీజేపీ మధ్య సీట్ల పంపకం భారత్-పాకిస్తాన్ దేశ విభజన కన్నా చాలా క్లిష్టమైన అంశమన్నారు. రాష్ట్రంలో రెండు అతిపెద్ద పార్టీల మధ్య సీట్ల పంపకం అంత సులువైన అంశంకాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఇరుపార్టీల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని, సీట్ల పంపకంపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడుతుందని ఆయన తెలిపారు. శివసేన మొదట్లో 50-50 ఫార్మూలాను ప్రతిపాదించిందని కానీ బీజేపీ నిరాకరించడంతో తామే వెనక్కి తగ్గామని రౌత్ వెల్లడించారు. అయితే తాము 130 సీట్లకు పైగా డిమాండ్ చేస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. కాగా మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు ఇదివరకే ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే. దీంతో అధికార, విపక్ష పార్టీలు ఓ వైపు ప్రచారం చేస్తూనే..మరోవైపు సీట్ల పంపకాలపై కసరత్తులు చేస్తున్నాయి. అధివృద్ధి జపం చేస్తున్న బీజేపీ మరోసారి విజయంపై ధీమాగా ఉండగా.. సమర్థవంతమైన బీజేపీని ఎదుర్కొనేందుకు హస్తం కూడా పదునైన వ్యూహాలను సిద్ధం చేస్తోంది. -
47 ఏళ్ల రికార్డు బ్రేక్ చేసిన సీఎం
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సరికొత్త రికార్డు సృష్టించారు. గత 47 ఏళ్లలో ఐదేళ్ల పూర్తి కాలంపాటు పదవిలో కొనసాగిన ఏకైక సీఎంగా చరిత్రలో నిలిచారు. చివరిగా జరిగిన 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించగా, మిత్రపక్షం శివసేనతో కూటమి ఏర్పాటు చేసి ఫడ్నవిస్ సీఎంగా తొలిసారి పదవీ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనే ఆ స్థానంలో కొనసాగుతున్నారు. దీంతో గడిచిన 47 ఏళ్ల తరువాత పూర్తి కాలంపాటు సీఎం పదవిలో కొనసాగిన తొలి వ్యక్తిగా ఫడ్నవిస్ నిలిచారు. కాగా ఈ ఘనత సాధించిన రెండవ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిసే కావడం విశేషం. ఈయన కంటే ముందు వసంత రావునాయక్ మాత్రమే పూర్తి కాలం పాటు సీఎంగా రాష్టానికి సేవలు అందించారు. 1962లో మొదటిసారి ముఖ్యమంత్రిగాఎన్నికైన ఈయన 1967 నుంచి 1972 వరకు 11 ఏళ్ల పాటు పదవిలో కొనసాగారు. అయితే 1960లో బాంబే స్టేట్ నుంచి మహారాష్ట్ర, గుజరాత్ విడిపోయిన విషయం తెలిసిందే. ఈ 60 ఏళ్ల కాలంలో మహారాష్ట్రకు 26 మంది ముఖ్యమంత్రులు పనిచేశారు. వీరిలో నేషనల్ కాంగ్రెస్ (ఎన్సీపీ) అధినేత శరద్పవర్ అత్యధికంగా నాలుగుసార్లు సీఎంగా పనిచేశారు. వసంతరావు నాయక్, వసంతదాదా మూడు సార్లు.. శంకర్రావు, విలాస్రావ్ దేశ్ముఖ్ రెండు సార్లు ఎన్నికయ్యారు. 1999 నుంచి 2014 వరకు వరుసగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో విలాస్రావ్ దేశ్ముఖ్, నారాయణ్ రాణే, సుశిల్ కుమార్ షిండే, అశోక్ చవాన్, పృద్వీరాజ్ చౌహన్లు పదవీ బాధ్యతలు చేపట్టినా వీరిలో ఏ ఒక్కరూ పూర్తి కాలం పదవిలో లేరు. మరోవైపు మహారాష్ట్ర అసెంబ్లీకి తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. అయితే మరోసారి కూడా తానే సీఎంగా బాధ్యతలు స్పీకరిస్తానని ఫడ్నవిస్ ఇప్పటికే స్పష్టంచేశారు. -
‘కశ్మీర్ విముక్తి కోసం మూడు తరాల పోరాటం’
ముంబై: దేశ మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 1947లో కశ్మీర్ను భారత్లో విలీనం చేయకుండా నెహ్రూ చారిత్రాత్మక తప్పిదానికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. నెహ్రూ నిర్ణయం వల్లనే కశ్మీర్లో ఉగ్రవాదం పెచ్చుమీరిపోయిందని ఆరోపించాడు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అమిత్ షా ఆదివారం ముంబైలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కశ్మీర్ అంశం మాజీ హోంమంత్రి సర్దార్ వల్లబాయ్ పటేల్కు అప్పగించినట్లయితే ఎప్పుడో భారత్లో విలీనమయ్యేదని అభిప్రాయడ్డాడు. ‘కశ్మీర్లో ఉగ్రమూకలను అరికట్టడానికి ప్రయత్నిస్తున్నాం. దేశం గర్వపడే అంశాన్ని కాంగ్రెస్ రాజకీయం చేయడం వారి అపరిపక్వతకు నిదర్శం. బీజేపీ ఈ అంశాన్ని జాతీయవాద విజయంగా పరిగణిస్తుంది. కశ్మీర్ అంశంపై పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలపై తప్పుడు ప్రచారం చేస్తోంది. ఆర్టికల్ 370 రద్దును రాజకీయ సమస్యగా రాహుల్ గాంధీ చిత్రీకరిస్తున్నారు. రాహుల్ ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వస్తున్నారు, కానీ కశ్మీర్ విముక్తి కోసం బీజేపీ మూడు తరాల నాయకులు పోరాడుతున్నారు. బీజేపీ ప్రధాన ఎజెండా దేశాన్ని ఐక్యంగా ఉంచడమే. ఒకే దేశం, ఒకే ప్రధానమంత్రి, ఒకే రాజ్యాంగం అనే సిద్ధాంతానికి బీజేపీ కట్టుబడి ఉంది’ అని అమిత్ షా పేర్కొన్నారు. -
రాహుల్ ఇప్పుడే రాజకీయాల్లోకి వస్తున్నారు: షా
సాక్షి, ముంబై: దేశాన్ని పాలించిన గత ప్రభుత్వాలు కశ్మీర్ను కేవలం రాజకీయ లబ్ధి కోసమే వాడుకున్నాయని కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విమర్శించారు. తమ ప్రభుత్వ ఏర్పడిన వందరోజలు లోపలే కశ్మీరీల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామని అన్నారు. ముంబైలో ఆదివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న షా.. కాంగ్రెస్, విపక్షాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాహుల్ గాంధీ కశ్మీర్ అంశాన్ని ఇప్పటికీ రాజకీయం చేస్తున్నారని, దేశాన్ని పాలించిన వారి కుటుంబికులే కశ్మీర్కు ఈ గతిపట్టించారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఇప్పుడిప్పుడే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారని, కానీ తమ పార్టీ మూడు దశాబ్దాల నుంచి కశ్మీర్ విముక్తి కోసం పోరాటం చేస్తోందని షా గుర్తుచేశారు. కశ్మీరీల కోసం తమ పార్టీ నేతల కలల్ని ప్రధాని మోదీ సాకారం చేశారని షా అభివర్ణించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు మొహబూబా ముఫ్తీ, ఫరూక్ అబ్దుల్లాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పౌరుల జీవితాలతో రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. కశ్మీర్లో త్వరలోనే ఎన్నికల రాబోతున్నాయని షా ప్రకటించారు. -
మహారాష్ట్ర, హరియాణాల్లో ఎన్నికల నగారా
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాల శాసనసభ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల్లో లోక్సభ, శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) షెడ్యూలు విడుదల చేసింది. దీంతోపాటు తెలంగాణలోని హుజూర్నగర్ శాసనసభ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక జరగనుంది. ఎన్నికల షెడ్యూలు విడుదలైన మరుక్షణం నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా మీడియాకు వెల్లడించారు. ఈ రెండు రాష్ట్రాలకు ఒకే విడతలో ఎన్నికలు జరపనున్నట్లు ప్రకటించారు. కాగా, హరియాణాలోని 90 అసెంబ్లీ స్థానాల్లో 17 స్థానాలు షెడ్యూలు కులాలకు రిజర్వ్ అయి ఉన్నాయి. ఇక్కడ ఎస్టీ నియోజకవర్గాలేవీ లేవు. మహారాష్ట్రలో మొత్తం 288 నియోజకవర్గాలకు గాను 29 ఎస్సీ, 25 ఎస్టీ రిజర్వు అయి ఉన్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ 2014 నవంబరు 10వ తేదీన కొలువుదీరగా శాసనసభ కాల పరిమితి 2019 నవంబరు 9వ తేదీతో ముగియనుంది. అలాగే, హరియాణా శాసనసభ 2014, నవంబరు 3వ తేదీన కొలువుదీరగా 2019, నవంబరు 2న ముగియనుంది. 64 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక దేశవ్యాప్తంగా ఒక లోక్సభ స్థానం, వివిధ రాష్ట్రాల్లోని 64 శాసనసభ స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేసింది. ఎంపీ రామచంద్ర పాశ్వాన్ మరణించడంతో బిహార్లోని సమస్తిపూర్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. సమస్తిపూర్ లోక్సభ నియోజకవర్గంతో పాటు హుజూర్నగర్ సహా దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 64 శాసన సభ స్థానాలకూ అక్టోబరు 21న ఎన్నిక జరగనుంది. ప్రధానంగా కర్ణాటకలో 15, యూపీలో 11, బిహార్, కేరళ రాష్ట్రాల్లో 5, అస్సాం, గుజరాత్లలో 4 చొప్పున స్థానాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటకలో ఫిరాయింపు నిరోధక చట్టం పరిధిలో ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడడంతో అక్కడ ఎక్కువ స్థానాల్లో ఉప ఎన్నిక జరుగుతోంది. ఉప ఎన్నిక జరిగే నియోజకవర్గాల్లో ఎన్నికల నిబంధనావళి తక్షణం అమల్లోకి వస్తుంది. సుప్రీంను ఆశ్రయిస్తాం: కర్ణాటక ఎమ్మెల్యేలు సాక్షి, బెంగళూరు: ఎన్నికల సంఘం ప్రకటనపై అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు బెంగళూరులో మాట్లాడుతూ.. తమపై అనర్హత పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉండగా ఎన్నికలు జరపాలన్న ఈసీ నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. ఈసీ నిర్ణయంపై స్టే కోరుతామన్నారు. మొత్తం 17 మందిపై అనర్హత వేటు పడగా ఈసీ 15 స్థానాలకు మాత్రమే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం గమనార్హం. మిగతా ఇద్దరి ఎన్నికకు సంబంధించిన పిటిషన్లు హైకోర్టులో పెండింగ్లో ఉన్నందున నిర్ణయం తీసుకోలేదని ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా అన్నారు. వీరికి అనర్హత వేటు పడిన వారితో సంబంధం లేదని వివరించారు. జూలైలో కర్ణాటకలో జరిగిన వివిధ రాజకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్, జేడీఎస్కు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి గైర్హాజరు కావడంతో హెచ్డీ కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వం కూలిపోగా, బీజేపీ పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. -
మోదీ-షా ద్వయం మరోసారి ఫలిస్తుందా?
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మరోసారి ఎన్నికల వేడి మొదలైంది. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశ వ్యాప్తంగా 64 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల బరిలోకి దిగేందుకు రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. దేశంలో ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీనే ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీదారులు. వరుస ఓటములతో కుదేలవుతున్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు చావోరావే తేల్చుకునే పరిస్థితి. ముఖ్యంగా హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలతో పాటు కర్ణాటకలోని 15 స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లోనూ ఆ పార్టీ కఠిన పరీక్షనే ఎదుర్కొనుంది. పార్టీ నాయకత్వంతో పాటు, కార్యకర్తల భవిష్యత్తుని ఈ ఎన్నికలు నిర్ణయిస్తాయని రాజకీయ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఇక వరుస విజయాలతో దూసుకుపోతున్న బీజేపీ విషయానికొస్తే.. జరగబోయే ఎన్నికల్లో తమకు తిరుగలేదని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు.. కేంద్రంలో మద్దతు కలిగిన బలమైన ప్రభుత్వం ఉండటం, ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్నికల వ్యూహకర్తగా పేరొందిన అమిత్ షాలు ఉండనేఉన్నారు. మోదీ చరిష్మాతోనే 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ.. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే వ్యూహాన్ని అమలు చేయాలని భావిస్తోంది. దానిలో భాగంగానే హర్యానా, నాసిక్ సభల్లో ప్రసంగించిన మోదీ.. ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. మోదీచే మరికొన్ని బహిరంగ సభలను నిర్వహించాలని బీజేపీ నాయకత్వం ప్రణాళికలు రచిస్తోంది. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో దేశ వ్యాప్తంగా మోదీ 400 ర్యాలీలు నిర్వహించగా ఆ ఎన్నికల్లో బీజేపీ 282 స్థానాలను సాధించింది. దీనికి భిన్నంగా గత ఎన్నికల్లో కేవలం 144 ర్యాలీల్లో పాల్గొన్న మోదీ ఏకంగా 303 స్థానాలను సాధించిపెట్టారు. వ్యతిరేకత తప్పదా..? అయితే కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం.. అనేక కీలక, వివాదాస్పద నిర్ణయాలను తీసుకున్న విషయం తెలిసిందే. వాటిలో ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు, ఎన్ఆర్సీని అమలు చేసింది. వీటిని కొన్ని వర్గాల ప్రజలు స్వాగతించగా.. మరికొందరు తీవ్రగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో కీలకపైన అసెంబ్లీ ఎన్నికల ముందు వీటి నుంచి కమళ దళం ప్రతిఘటన ఎదుర్కొక తప్పదని రాజకీయవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన జాతీయ పౌరుల జాబితా (ఎన్ఆర్సీ) నుంచి దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తొలుత అస్సాంలో అమలు చేసిన కేంద్రం.. ఆ తరువాత దేశ వ్యాప్తంగా అమలు చేస్తామని ఇదివరకే ప్రకటించింది. మొదట్లో ఎన్ఆర్సీ సృష్టించిన ప్రకంపనలు అంతాఇంతా కాదు. ఎన్ఆర్సీ వ్యతిరేక ఉద్యమం పలుప్రాంతాల్లో తీవ్ర రూపం దాల్చింది. మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ తాజా ఎన్నికలపై ఎంతోకొంత ప్రభావం చూపుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. వెరసి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తమకే లాభం చేకూరుస్తాయని ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి. ట్రిపుల్ తలాక్ చట్టంతో ముస్లింలు బీజేపీపై కొంత ఆగ్రహంగా ఉన్నారని భావిస్తోన్న కాంగ్రెస్ ఆ వర్గాన్ని తమవైపు తిప్పుకోని పూర్వవైభవం సాధించాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అలాగే ఎన్ఆర్సీపై కూడా పోరాడుతోంది. దీనిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రతిపక్షాలు చెమటోడుస్తున్నాయి. బీజేపికి పెద్ద దిక్కుగా మారిన మోదీ, అమిత్ షాలే అన్ని ఎన్నికల్లోనూ విజయం బాధ్యతను మోస్తున్నారు. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలతో పాటు కర్ణాటకలో ఉప ఎన్నికల్లో కూడా విజయం సాధించాలని ఆ పార్టీ భావిస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో షా, మోదీ ద్వయం ఫలిస్తుందా అనేది వేచి చూడాలి. -
మళ్లీ ‘పూల్వామా’ దాడి జరిగితేనే బీజేపీ గెలుపు!
ఔరంగబాద్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్సీపీ అధినేత, సీనియర్ నాయకుడు శరద్ పవార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పూల్వామా తరహా ఉగ్రవాద దాడి జరిగితే తప్ప బీజేపీ మహారాష్ట్ర ఎన్నికల్లో గట్టెక్కలేదని, రాష్ట్రంలోని దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వంపై ప్రజలు ప్రతీకారంతో రగిలిపోతున్నారని అన్నారు. ‘లోక్సభ ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం, వ్యతిరేకత ఉన్నాయి. కానీ, పూల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి జరగడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి’ అని ఆయన విలేకరులతో పేర్కొన్నారు. అదే తరహాలో మరో పూల్వామా దాడి జరిగితే తప్ప బీజేపీ మహారాష్ట్ర ఎన్నికల్లో గట్టెక్కబోదని పేర్కొన్నారు. బీజేపీ-శివసేన కూటమి నుంచి అధికారాన్ని తాము చేజిక్కించుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఫడ్నవీస్ సర్కారు గత ఐదేళ్లలో ప్రజలకోసం చేసిందేమీ లేదని అన్నారు. ఎన్సీపీపై ప్రజల్లో భారీ అంచనాలు ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీతోపాటు బహుజన్ వికాస్ అగాథి, సమాజ్వాదీ పార్టీ వంటి చిన్న పార్టీలతో జత కలిసి కాషాయ కూటమిని ఎదుర్కోబోతున్నామని అన్నారు. -
దీపావళికి ముందే ఆ రాష్ట్రాల్లో ఎన్నికలు!
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హరియాణాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ఏర్పాట్లు పూర్తి చేసింది. మహారాష్ట్ర అసెంబ్లీలోని 288 సీట్లు, హరియాణాలోని 90 స్థానాలకు రెండ్రోజుల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ దీపావళి పండుగ (అక్టోబర్ 27వ తేదీ)కు ముందుగానే ఎన్నికలు కూడా పూర్తి చేయాలని ఈసీ భావిస్తోందని సమాచారం. మహారాష్ట్ర, హరియాణాలతోపాటు ఢిల్లీ, జార్ఖండ్ అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరిపే యోచనలో ఈసీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నాలుగు రాష్ట్రాలకు కలిపి ఒకే దఫా నోటిఫికేషన్ విడుదల చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా జార్ఖండ్ అసెంబ్లీ పదవీ కాలం వచ్చే ఏడాది జనవరి 5వ తేదీతో, ఢిల్లీ అసెంబ్లీ ఫిబ్రవరి 22వ తేదీతో ముగియనుంది. కాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన పొత్తుపై ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. బీజేపీతో పొత్తుకు శివసేన సిద్ధంగానే ఉన్నప్పటికీ సీట్ల పంపకాల విషయంలో మాత్రం ఏకాభిప్రాయం కుదిరే అవకాశం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఒంటరిగా పోటీకి సిద్ధంగా ఉండాలని శివసేన శ్రేణులకు అధినేత ఉద్ధవ్ ఠాక్రే సూచించినట్టు తెలుస్తోంది. -
కొత్త బంగారులోకం చేద్దాం!
నాసిక్: భూతల స్వర్గం కశ్మీర్ను మరోసారి కొత్త బంగారు లోకంగా మార్చేద్దామని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ప్రతి కశ్మీరీని హత్తుకుని, కశ్మీర్ను మళ్లీ స్వర్గసీమగా మారుద్దామని పిలుపునిచ్చారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నాసిక్లో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రసంగించిన మోదీ.. దశాబ్దాల కశ్మీరీ కష్టాలకు గత కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమని దుయ్యబట్టారు. కశ్మీర్లో హింసను ప్రజ్వరింపజేసేందుకు సరిహద్దులకు ఆవలి నుంచి నిర్విరామ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పాకిస్తాన్పై ధ్వజమెత్తారు. ఉగ్రవాదం, హింసల నుంచి కశ్మీర్, లద్దాఖ్ ప్రజలను దూరం చేసేందుకు ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం తీసుకున్నామన్నారు. ‘దశాబ్దాల హింసాత్మక వాతావరణం నుంచి బయటపడాలని యువత, తల్లులు, సోదరీమణులు నిర్ణయించుకున్నారు. వారికి ఉద్యోగాలు, అభివృద్ధి కావాలి. జమ్మూకశ్మీర్, లద్దాఖ్లలోని సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు మేం కట్టుబడి ఉన్నాం’ అని మోదీ వివరించారు. దేశంలోని యాభై కోట్ల పాడి పశువులకు టీకాలు వేయించాలని తమ ప్రభుత్వం నిర్ణయిస్తే.. ఇదో రాజకీయ నిర్ణయమని విమర్శిస్తున్నారని, పశువులు ఓట్లు వేయవన్న సంగతి వారు గుర్తుచేసుకోవాలని మోదీ ఎద్దేవా చేశారు. ఛత్రపతి శివాజీ వంశస్తుడు బహూకరించిన తలపాగాతో మోదీ బహిరంగ సభలో పాల్గొన్నారు. సైనిక అవసరాలను వారు పట్టించుకోలేదు జాతీయ భద్రతపై గత యూపీఏ ప్రభుత్వం కనీస శ్రద్ధ చూపలేదని మోదీ విమర్శించారు. సైనిక బలగాల కోసం 2009లో 1.86 లక్షల బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కావాలన్న డిమాండ్ను పట్టించుకోలేదని గుర్తు చేశారు. ‘2014లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రమే ఆ డిమాండ్ నెరవేరింది. అప్పటివరకు సరిహద్దుల్లో మన జవాన్లు అవి లేకుండానే ప్రాణాలొడ్డి విధులు నిర్వర్తించేవారు. అంతేకాదు, ఇప్పుడు భారత్లో తయారయ్యే బుల్లెట్ప్రూఫ్ జాకెట్లు దాదాపు 100 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి’ అని మోదీ వివరించారు. పవార్పై విమర్శలు... పాకిస్తాన్ అంటే తనకిష్టమన్న ఎన్సీపీ సీనియర్ నేత శరద్ పవార్ వ్యాఖ్యలపై మోదీ ధ్వజమెత్తారు. ‘శరద్ పవార్కు ఏమైంది? అంతటి సీనియర్ నేత పాకిస్తాన్ విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూంటే బాధగా ఉంది. ఆయనకు పొరుగు దేశమంటే ఇష్టం కావచ్చుగానీ.. ఉగ్రవాదం మూలాలు ఎక్కడున్నాయో అందరికీ తెలుసు’ అని మోదీ వ్యాఖ్యానించారు. జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి ఎన్సీపీతోపాటు ఇతర ప్రతిపక్షాలు సహకరించలేదని, మద్దతుగా నిలవలేదని మోదీ విమర్శించారు. కాంగ్రెస్ నేత రాహుల్ పేరు ప్రస్తావించకుండానే... కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలను భారత వ్యతిరేక శక్తులకు ఊతమిస్తున్న దేశాలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయని మోదీ చెప్పారు. రామమందిర నిర్మాణంపై.. మిత్రపక్షం శివసేనపైనా మోదీ విమర్శలు గుప్పించారు. సేన పేరును ప్రస్తావించకుండా.. రామ మందిర నిర్మాణం విషయంలో కొందరు పెద్ద నోరేసుకుని మాట్లాడుతున్నారని, వారంతా సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకు సంయమనం పాటించాలన్నారు. న్యాయవ్యవస్థపై నమ్మకముంచాలని చేతులు జోడించి కోరుతున్నానన్నారు. మందిర నిర్మాణం కోసం ఇంకా ఎన్నాళ్లు ఎదురుచూడాలని, అందుకు కేంద్రం ఓ కొత్త చట్టం రూపొందించాలని తాము చాన్నాళ్లుగా కోరుతున్నామని శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే సోమవారం వ్యాఖ్యానించడం తెల్సిందే. -
ఉద్ధవ్ అసంతృప్తి.. ఏం జరుగుతుందో!?
ముంబై: రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన పొత్తు కుదురుతుందా? అన్నది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. బీజేపీతో పొత్తుకు శివసేన సిద్ధంగానే ఉంది. ఈ రెండు హిందుత్వ పార్టీలు కలిసి పోటీచేసే ఆలోచనలో ఉన్నాయి. అయితే, సీట్ల పంపకాల విషయంలో మాత్రం ఏకాభిప్రాయం కుదిరే అవకాశం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఒంటరిగా పోటీకి సిద్ధంగా ఉండాలని శివసేన శ్రేణులకు అధినేత ఉద్ధవ్ ఠాక్రే సూచించినట్టు తెలుస్తోంది. ఆదివారం మాతేశ్రీలో శివసేన నేతలతో భేటీ అయిన ఉద్దవ్.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిపోరుకైనా సిద్ధంగా ఉండాలని పేర్కొన్నట్టు సమాచారం. నిజానికి శివసేన ఒంటరిగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. బీజేపీతో కలిసి పోటీచేస్తేనే రాజకీయంగా లాభం ఉంటుందని ఆ పార్టీ భావిస్తోంది. అయితే, పొత్తులో భాగంగా తమకు కేటాయించే సీట్లు తగ్గిస్తే మాత్రం ఒప్పుకునేది లేదని శివసేన కృతనిశ్చయంతో ఉంది. బీజేపీతో పొత్తులో భాగంగా శివసేన మొదట 140 సీట్లు డిమాండ్ చేసింది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అన్ని సీట్లు ఇవ్వలేమని బీజేపీ చెప్పడంతో ఆ సంఖ్యను 120కి తగ్గించింది. అయితే, బీజేపీ అధినాయకత్వం మాత్రం శివసేనకు 106 సీట్లు మాత్రమే ఇచ్చేందుకు సిద్ధపడుతోంది. అంతకుమించి ఇవ్వలేని, ఇతర ఎన్డీయేలోని చిన్న పార్టీలకు సీట్లు సర్దుబాటు చేయాల్సిన బాధ్యత తనపైన ఉందని బీజేపీ అంటోంది. మరీ అంత తక్కువ సీట్లు అయితే, పొత్తుకు దూరంగా ఉండి ఒంటరిగా పోటీ చేయాలని ఉద్ధవ్ భావిస్తున్నారని, అంతేకాకుండా ఈసారి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే సీఎం పదవిని కూడా అడగాలని ఆయన భావిస్తున్నారని శివసేన వర్గాలు చెప్తున్నాయి. గత ఎన్నికల్లో సీట్ల పంపకాలలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో బీజేపీ-శివసేన వేర్వేరుగా పోటీ చేశాయి. బీజేపీ 122, శివసేన 63, కాంగ్రెస్41, ఎన్సీపీ 42 సీట్లను గెలుపొందింది. అనంతరం బీజేపీ-శివసేన పొత్తు కుదుర్చుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తాయన్నది ఆసక్తి రేపుతోంది.