Mandya
-
ఈసారికి త్యాగమే.. బీజేపీలోకి సుమలత అంబరీష్
తన తదుపరి రాజకీయ ఎత్తుగడపై ఊహాగానాలకు తెరదించుతూ కర్ణాటకలోని మండ్యా స్వతంత్ర ఎంపీ సుమలత అంబరీష్ తాను భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరనున్నట్లు ప్రకటించారు. అయితే ఈసారి తాను మండ్యా నియోజకవర్గం నుంచి పోటీ చేయడం లేదన్నారు. మండ్యాలో తన మద్దతుదారులను ఉద్దేశించి సుమలత ప్రసంగిస్తూ.. ‘నేను ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. కానీ మండ్యా పట్ల నా నిబద్ధత ఎప్పటికీ అలాగే ఉంటుంది. టికెట్ దక్కనప్పుడు కొంతమంది తమ పార్టీని వీడుతారు. కానీ నేను నా సీటును వదులుకుని బీజేపీతోనే ఉండేందుకు నిర్ణయించుకున్నాను’ అన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో కుమారస్వామి కుమారుడు నిఖిల్పై సుమలత విజయం సాధించారు. కర్ణాటకలో జేడీఎస్తో బీజేపీ పొత్తు పెట్టుకోవడంతో ఈసారి ఎన్నికల్లో మండ్యా సీటును మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామికి కేటాయించారు. 2019 ఎన్నికల్లో నిఖిల్పై సుమలత విజయం సాధించి జేడీఎస్ కంచుకోటగా భావించే మండ్యాలో రాజకీయ మార్పును తీసుకొచ్చారు. 2018లో తన భర్త అంబరీష్ మరణానంతరం, సుమలత ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించి మండ్య నుంచి పోటీ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మండ్య లోక్సభ నియోజకవర్గానికి సుమారు రూ. 4,000 కోట్ల గ్రాంట్లు అందించినట్లు సుమలత గుర్తు చేశారు. మండ్యాకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే ముందు తనతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నందుకు బీజేపీ నేతలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. “బీజేపీకి నా అవసరం ఉందని, పార్టీని వీడవద్దని ప్రధాని (మోదీ) అభ్యర్థించినప్పుడు నేను ఆయనను గౌరవించాలి” అన్నారు. ఇదే సందర్భంగా సుమలత మండ్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేశారు. తనను తాను జిల్లా 'కోడలు'గా పేర్కొంటూ తనకు ఇతర చోట్ల నుండి పోటీ చేసేందుకు బీజేపీ నుండి ప్రతిపాదనలు వచ్చినా తిరస్కరించినట్లు చెప్పారు. కాంగ్రెస్లో చేరాలని కొంతమంది కోరినప్పటికీ ఆత్మాభిమానం ఉన్నవారు ఆ పార్టీలో చేరరని ఆమె చెప్పుకొచ్చారు. -
సోదరీ సహకరించు.. సుమలత ఇంటికి కుమారస్వామి
బెంగళూరు: కర్ణాటకలోని మండ్య నియోజకవర్గంలో నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. ఎవరూ ఊహించని విధంగా జేడీఎస్ రాష్ట్ర చీఫ్, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి ప్రస్తుత ఎంపీ సుమలత అంబరీష్ను కలిశారు. రానున్న ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న తనకు సహకరించాలని కోరారు. 'సోదరి' సహకారం వచ్చా.. బెంగళూరులోని సుమలత అంబరీష్ నివాసంలో ఆమెతో సమావేశం అనంతరం కుమారస్వామి విలేకరులతో మాట్లాడుతూ ఇది మర్యాదపూర్వకంగా జరిగిన సమావేశమని వెల్లడించారు. “అంబరీష్ ఇల్లు నాకు కొత్త కాదు. మేము చాలా సంవత్సరాలు కలిసి నడిచాం. నేను మాండ్య లోక్సభ స్థానానికి ఏప్రిల్ 3న నామినేషన్ దాఖలు చేస్తున్నాను. ఇందులో భాగంగా సోదరి (సుమలత) సహకారం కోసం ఇక్కడికి వచ్చాను" అన్నారు. తమ అనుచరులు మద్దతుదారులతో సమావేశమైన తర్వాత ఏప్రిల్ 3న మండ్యలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని సుమలత తనతో చెప్పినట్లుగా పేర్కొన్నారు. సమావేశం అనంతరం సుమలత అంబరీష్ కూడా విలేకరులతో మాట్లాడారు. ‘‘ఆరోగ్యకరమైన చర్చ జరిగింది. పాత విభేదాలను మనసులో పెట్టుకోవద్దని ఆయన (కుమారస్వామి) కోరారు. భవిష్యత్ కార్యాచరణ గురించి కూడా చర్చించాం" అని ఆమె వివరించారు. మండ్య లోక్సభ స్థానం నుంచి స్వతంత్ర ఎంపీగా గెలిచిన సుమలత బీజేపీకి మద్దతిస్తూ వస్తున్నారు. ఆమె మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే ఈ ఎన్నికల్లో జేడీఎస్తో పొత్తు పెట్టుకున్న బీజేపీ ఈ సీటును జేడీఎస్కు కేటాయించింది. ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ హెచ్డీ కుమారస్వామి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో ఆమె బీజేపీకి మద్దతుగా నిలుస్తారా లేక మళ్లీ స్వతంత్రంగా బరిలోకి దిగుతారా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. కాగా లోక్సభ ఎన్నికల తర్వాత సుమలతకు కేంద్రంలో మంచి పదవి, హోదా కల్పిస్తామని బీజేపీ హైకమాండ్ హామీ ఇచ్చినట్లు సమాచారం. 2019 లోక్సభ ఎన్నికలలో మండ్య నుండి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన తరువాత, సుమలత అంబరీష్ బీజేపీకి మద్దతు ఇస్తూ వస్తున్నారు. అయితే ఆమె ఇంకా అధికారికంగా కాషాయ పార్టీలో చేరలేదు. -
సీటు దక్కని సుమలత.. ఏం చేయబోతున్నారు?
బెంగళూరు: బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడిన ప్రముఖ సినీ నటి, ప్రస్తుత మండ్య ఎంపీ సుమలత అంబరీష్.. తన భవిష్యత్తు కార్యాచరణను త్వరలో వెల్లడిస్తానని చెప్పారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో మండ్య సీటును బీజేపీ తనకే ఇస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. అయితే పొత్తులో భాగంగా బీజేపీ ఈ సీటును జేడీఎస్కు ఇచ్చింది. ఈనేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, షికారిపుర ఎమ్మెల్యే బీవై విజయేంద్రతో సుమారు గంటసేపు చర్చించిన అనంతరం సుమలత బెంగళూరులో విలేకరులతో మాట్లాడారు. ‘విజయేంద్ర తన అభిప్రాయాన్ని, అంచనాలను తెలిపారు. నేనూ నా పరిస్థితుల గురించి చెప్పాను. నేను బీజేపీతోనే ఉండాలని కోరుకుంటున్న ఆయన పార్టీలో చేరాలని కోరారు’ అని ఆమె పేర్కొన్నారు. “రేపు నా మద్దతుదారులు వస్తున్నారు. వారితో సంప్రదించకుండా ఏకపక్షంగా ఎలాంటి నిర్ణయం తీసుకోనని ఆయనకు (విజయేంద్ర) చెప్పాను. నేను వారి అంచనాలను, అభిప్రాయాలను వినాలి. మండ్యలో నా వైఖరిని స్పష్టం చేస్తానని చెప్పాను' అని సుమలత అన్నారు. మరో వైపు ఆమె తమతోనే నిలబడుతుందన్న నమ్మకం ఉందని కర్ణాటక బీజేపీ చీఫ్ విజయేంద్ర తెలిపారు. 2019 లోక్సభ ఎన్నికల్లో మండ్య స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బీజేపీ మద్దతుతో బరిలోకి దిగిన సుమలత.. మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ మనవడు నిఖిల్ కుమారస్వామిని ఓడించారు. కాగా ఇప్పుడు పొత్తులో భాగంగా బీజేపీ మండ్య సీటును జేడీఎస్కు కేటాయించింది. ఈసారి ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి పోటీ చేస్తున్నారు. ಮಂಡ್ಯ ಲೋಕಸಭಾ ಕ್ಷೇತ್ರದ ಜನಪ್ರಿಯ ಸಂಸದರಾದ ಶ್ರೀಮತಿ ಸುಮಲತಾ ಅಂಬರೀಶ್ ಅವರನ್ನು ಇಂದು ಭೇಟಿಯಾಗಿ ಪ್ರಸ್ತುತ ಲೋಕಸಭಾ ಚುನಾವಣೆಯಲ್ಲಿ ದೇಶದ ಹೆಮ್ಮೆಯ ಪ್ರಧಾನಿ ಶ್ರೀ ನರೇಂದ್ರ ಮೋದಿಯವರನ್ನು ಮತ್ತೊಮ್ಮೆ ಪ್ರಧಾನಿಯನ್ನಾಗಿಸುವುದು ನಮ್ಮೆಲ್ಲರ ಗುರಿಯಾಗಿದ್ದು ಈ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ತಮ್ಮ ಸ್ವಾಭಿಮಾನದ ಬೆಂಬಲವನ್ನು ಮಾನ್ಯ ಮೋದಿ ಅವರಿಗಾಗಿ… pic.twitter.com/kMEQauL0RH — Vijayendra Yediyurappa (Modi Ka Parivar) (@BYVijayendra) March 29, 2024 -
మాజీ సీఎం ఫ్యామిలీ సీట్లు కన్ఫమ్!
లోక్సభ ఎన్నికలకు తమ అభ్యర్థులపై వస్తున్న ఊహాగానాలకు ముగింపు పలికిన జేడీఎస్ కర్ణాటకలో మూడు లోక్సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. మండ్య నుంచి హెచ్డీ కుమారస్వామి, కోలారు నుంచి మల్లేష్బాబు, హాసన్ నుంచి ప్రజ్వల్ రేవణ్ణల పేర్లు వెల్లడించింది. జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి మండ్య లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుతం ఆయన చన్నపట్టణ నుంచి రాష్ట్ర అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవలే గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్న కుమారస్వామి పదేళ్ల విరామం తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నారు. 2014 లోక్సభ ఎన్నికల్లో ఆయన చిక్కబల్లాపూర్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. కాగా ప్రస్తుత ఎంపీ, జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడ మనవడు, కుమారస్వామి మేనల్లుడు ప్రజ్వల్ రేవణ్ణవరుసగా రెండవసారి హాసన్ నుండి పార్టీ అభ్యర్థిగా పోటీకి దిగుతున్నారు. ఈయన ఇదే స్థానం నుండి 2019 లోక్సభ ఎన్నికలలో అరంగేట్రం చేశారు. కోలార్ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా ఎం. మల్లేష్ బాబు నిలిచారు. 2023 ఎన్నికల్లో బంగారుపేట (ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ఎస్ఎన్ నారాయణస్వామి చేతిలో ఓడిపోయారు. -
మహిళపై కారు ఎక్కించి హత్య
సాక్షి, మండ్య: రెండు కుటుంబాల మధ్య ఉన్న వ్యవసాయ భూమి గొడవలో మహిళ పైన కారు ఎక్కించి హత్య చేశారు. ఈ దారుణం మండ్య జిల్లాలోని నాగమంగళ తాలుకాలోని బెళ్ళూరు సమీపంలో ఉన్న గాణసంద్ర గ్రామంలో జరిగింది. బెంగళూరులో నివసించే గాణసంద్రవాసి రామకృష్ణయ్య భార్య జయలక్ష్మి (50) హతురాలు. పొలం పనులు చేయిస్తుండగా వివరాలు.. జయలక్ష్మీకి గత 10 సంవత్సరాల క్రితం గాణసంద్ర గ్రామంలో సర్వే నంబర్ 84లో బంజరు భూమిని ప్రభుత్వం ఇవ్వగా ఆమె సాగు చేస్తోంది. అయితే భూమి తమదని గౌడయ్య అతని కుటుంబ సభ్యులు అనేకసార్లు జయలక్షి్మతో గొడవ పెట్టుకున్నారు. బోర్లను కూడా ధ్వంసం చేశారు. మంగళవారం జయలక్ష్మి బెంగళూరు నుంచి వచ్చి ట్రాక్టర్తో పొలం పనులు చేయిస్తుండగా గౌడయ్య, కుమారుడు అనిల్ సహా 8 మంది దాడి చేశారు. జయలక్ష్మి మీదకు అనిల్ కారుతో దూసుకెళ్లడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ట్రాక్టర్ డ్రైవర్, కూలీలను కొట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి నలుగురిని అరెస్టు చేశారు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. (చదవండి: అంతం చేసింది అత్త కొడుకే..) -
లైంగిక వేధింపులు.. హెడ్ మాస్టర్ను కర్రలతో చితకబాదిన అమ్మాయిలు
బెంగళూరు: పిల్లలకు పాఠాలు బోధించాల్సిన హెడ్ మాస్టర్ పైశాచికంగా ప్రవర్తించాడు. స్కూల్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో విద్యార్థినులు అంతా కలిసి అతనికి తగిన బుద్ధి చెప్పారు. తమను వేధిస్తున్న హెడ్ మాస్టర్ వద్దకు కర్రలతో వెళ్లి చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కర్ణాటక మండ్య జిల్లా కట్టేరి గ్రామంలోని ఓ పాఠశాలలో బుధవారం ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. #mandya A senior teacher of a govt school in Kattigeri beaten up by students before handing him over to police.There were several complaints of sexual misconduct against Chinmayanand.Yesterday,students got together & hit him with sticks for harassing a girl student #Karnataka pic.twitter.com/ud2WSMCkLx — Imran Khan (@KeypadGuerilla) December 15, 2022 -
పచ్చని సంసారంలో వివాహేతర సంబంధం చిచ్చు.. పిల్లలకు విషమిచ్చి..
సాక్షి, బెంగళూరు(మండ్య): పచ్చని సంసారంలో అక్రమ సంబంధం వ్యవహారం చిచ్చు పెట్టింది. భర్త మరో మహిళతో సన్నిహితంగా ఉండటంతో భార్య తన ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి హత్య చేసుకుంది. ఈఘటన మండ్య జిల్లా మద్దూరులో జరిగింది. మద్దూరు పట్టణ పోలీసుల కథనం మేరకు హోళె వీధిలో అఖిల్ ఆహ్మద్, కౌసర్(30) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి కుమారుడు హ్యారిస్ అహ్మద్(8), కుమార్తెలు అలిసా(4), ఆనం ఫాతిమా(2) ఉన్నారు. ఉస్నాకౌసర్ స్థానిక ఆస్పత్రిలో నర్స్గా పని చేస్తోంది. అఖిల్ ఆహ్మద్ రామనగర జిల్లా చెన్నపట్టణలో కారు మెకానిక్గా పని చేస్తున్నాడు. అఖిల్ అహ్మద్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంపై కుటుంబలో గొడవలు జరిగాయి. పెద్దలు పంచాయితీ కూడా చేశారు. అయినా అతనిలో మార్పు రాలేదు. దీంతో గురువారం సాయంత్రం ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చింది. అనంతరం ఆమె ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అఖిల్ అహ్మద్, అతని తల్లిదండ్రులపై పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: (అసభ్య చిత్రాలను వీడియోలుగా తీసి.. కోట్ల రూపాయల సంపాదన) -
విద్యార్థినిపై అత్యాచారం, హత్య.. ఏమీ తెలియనట్లు నటన.. చివరికి!
సాక్షి, బెంగళూరు: ముక్కుపచ్చలారని చిన్నారిని ఒక కామాంధుడు హత్యాచారం చేశాడు. మండ్య జిల్లా మళవళ్లి పట్టణంలో ఈ దారుణం జరిగింది. కాంతరాజు (52) అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. వివరాలు.. మంగళవారం ఉదయం 11 గంటలకు ట్యూషన్కు వెళ్లిన నాలుగో తరగతి చదువుతున్న బాలిక సాయంత్రమైనా తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురి అయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ట్యూషన్ చుట్టుపక్కల గాలించినా ఆచూకీ దొరకలేదు. సమీపంలో ఒక బేకరీ వద్ద నాగరాజు అనే వ్యక్తికి చెందిన నిర్మాణంలోని ఇంటి సంపులో బాలిక మృతదేహం ఉన్నట్లు తెలిసి అక్కడకు పరుగులు తీశారు. అది తమ కూతురిదేనని తెలిసి విలపించారు. ఏమీ తెలియనట్లు నటన ట్యూషన్లో పనిచేసే కాంతరాజు అనే వ్యక్తి పోలీసులతో పాటు తిరుగుతూ బాలిక ఆచూకీ కోసం వెతుకులాడినట్లు నటించాడు. బాలిక తల్లిదండ్రులతో మంచిగా మాట్లాడుతూ సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించాడు. పోలీసులను తప్పుదారి పట్టించేందుకు ట్యూషన్ వద్ద ఎవరో ముగ్గురు యువకులు ఉంటారని, వారిపై అనుమానం ఉందని చెప్పాడు. కాల్ రికార్డుతో దొరికిన కాంతరాజు కాంతరాజు చెప్పిన విషయాలు అబద్ధమని పోలీసులకు తెలిసింది. దీంతో అతనిపై అనుమానంతో ప్రశ్నించగా తనకేమి తెలియదని నమ్మబలికాడు. అతని మొబైల్ను పరిశీలించగా బాధిత బాలికతో మాట్లాడిన కాల్ రికార్డు దొరికింది. స్కూల్ సెలవు కావడంతో ఉదయం 11 గంటలకు ట్యూషన్కు రావాలని అతడు బాలికకు చెప్పాడు. తరువాత బాలికను నిర్మాణంలోని ఇంటికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబుతుందేమోనన్న భయంతో చంపి సంపులో పడేసినట్లు ఒప్పుకున్నాడు. -
Bharat Jodo Yatra: అడుగులో అడుగేస్తూ..
పాండవపుర: కర్ణాటకలో కొనసాగుతున్న కాంగ్రెస్ భారత్ జోడోయాత్రలో గురువారం పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పాలుపంచుకున్నారు. కుమారుడు రాహుల్ గాంధీతో కలిసి అడుగులో అడుగువేస్తూ ముందుకు సాగారు. అనారోగ్యంలో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందిన సోనియా చాలారోజుల తర్వాత ప్రజలకు దర్శనమిచ్చారు. ఆమె గత ఏడాది కరోనా మహమ్మారి బారినపడ్డారు. ఆ తర్వాత ప్రజల మధ్యకు రావడం ఇదే తొలిసారి. ఆమె చివరిసారిగా 2016 ఆగస్టులో వారణాసిలో ఓ రోడ్డుషోలో పాల్గొన్నారు. పార్టీ అధినేత్రి ఆగమనం పట్ల పాదయాత్రలో పార్టీ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున నినదాలు చేశారు. వారిలో ఉత్సాహం పరవళ్లు తొక్కింది. మాండ్యా జిల్లాలోని జక్కనహళ్లి, కరాడ్యా పట్టణాల మధ్య రాహుల్ వెంట కొన్ని కిలోమీటర్ల మేర సోనియా వడివడిగా అడుగులు వేశారు. ఈ అరుదైన ఘట్టానికి ప్రధాన స్రవంతి మీడియాతోపాటు సోషల్ మీడియాలోనూ మంచి స్పందన లభించింది. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా రాహుల్, సోనియాతో పాదయాత్రలో పాల్గొన్నారు. గతంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నామని, పెనుగాలులకు ఎదురొడ్డి నిలిచామని, సవాళ్లకు ఉన్న పరిమితులను బద్దలు కొడతామని రాహుల్ పేర్కొన్నారు. అందరం కలిసి దేశాన్ని ఐక్యంగా ముందుకు తీసుకెళ్లాలన్నదే తమ ఆశయమని ట్వీట్ చేశారు. అన్ని సవాళ్లను అధిగమించి, దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొస్తామని వివరించారు. పాదయాత్రలో తన తల్లి సోనియా గాంధీ భుజాలపై తాను చేతులు వేసిన చిత్రాన్ని పోస్టు చేశారు. వారిద్దరూ కలిసి ఉన్న ఫొటోను ట్విట్టర్లో కాంగ్రెస్ పార్టీ షేర్ చేసింది. వారికి ప్రేమే రక్షణ కవచమని పేర్కొంది. తల్లి పూజ్యనీయురాలు భారత్ జోడో యాత్రలో ఆసక్తికరమైన సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. సోనియా భుజాలపై చేతులు వేసి రాహుల్ నడవడం అందరి దృష్టిని ఆకర్శించింది. పాదయాత్రలో నడుస్తుండగా సోనియా బూట్ల లేసులు ఊడిపోయాయి. రాహుల్ వెంటనే కిందకు వంగి వాటిని గట్టిగా బిగించికట్టారు. ఈ చిత్రాన్ని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీనిపై పార్టీ సీనియర్ నేత శశి థరూర్ స్పందించారు. తల్లి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని, అమ్మంటే అమ్మే అని పేర్కొన్నారు. తల్లి పూజ్యనీయురాలు అంటూ సోషల్ మీడియాలోనూ నెటిజన్లు కామెంట్లు చేశారు. యాత్రలో సోనియాను చూసేందుకు జనం బారులుతీరారు. ఆమె వారివైపు చేతులు ఊపుతూ అభివాదం చేశారు. రాహుల్ సైతం ప్రజలతో కరచాలనం చేశారు. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం సోనియా కేవలం 30 నిమిషాలపాటు యాత్రలో పాల్గొనాలి. కానీ, రెండు గంటలకుపైగానే భాగస్వాములు కావడం విశేషం. భారత్ జోడో యాత్రతో సోనియా మమేకమయ్యారని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ట్వీట్చేశారు. యాత్ర ముగిశాక సోనియాగాంధీ గురువారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. -
భారత్ జోడో యాత్రలో పాల్గొన్న సోనియా గాంధీ
మాండ్య(కర్ణాటక): కాంగ్రెస్ పార్టీ అధినేత్రి(తాత్కాలిక) సోనియా గాంధీ గురువారం ఉదయం ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొన్నారు. 75 ఏళ్ల వయసున్న సోనియా గాంధీ అనారోగ్యంతో చాలాకాలంగా ఆమె పబ్లిక్ ఈవెంట్లకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. బీజేపీ పాలిత రాష్ట్రం కర్ణాటకలో ఆమె తనయుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఆమె కలిశారు. అంతకు ముందు సోనియా గాంధీ స్థానికంగా ఉన్న ఓ ఆలయంలో పూజలు నిర్వహించారు. మాండ్యలో చేపట్టిన యాత్రలో కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు వెంటరాగా.. తనయుడి వెంట హుషారుగా ఆమె యాత్రలో పాల్గొన్నారు. బళ్లారి ర్యాలీలో కాంగ్రెస్ అధినేత్రి ప్రసంగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్ జోడో యాత్రలో పాల్గొనడం కోసం సోమవారం సాయంత్రమే మైసూర్ చేరుకున్నారు ఆమె. ఇదిలా ఉంటే.. ఆయుధ పూజ, విజయ దశమి నేపథ్యంలో కాంగ్రెస్ భారత్ జోడో యాత్రకు రెండు రోజులు బ్రేక్ పడింది. #WATCH | Karnataka: Congress interim president Sonia Gandhi joins Congress MP Rahul Gandhi and other party leaders and workers during 'Bharat Jodo Yatra' in Mandya district pic.twitter.com/iSXNW8zciV — ANI (@ANI) October 6, 2022 ఇదీ చదవండి: ఆరోపణలు మాని మీ పని మీరు చూసుకోండి -
కన్నతల్లీ కర్కోటకురాలు
మండ్య: మానవత్వం లేని మహిళ అప్పుడే పుట్టిన నవజాత శిశువు (మగ)ను 30 అడుగుల లోతులో ఉన్న పాడుబడిన బావిలో పారవేసిన దారుణ ఘటన జిల్లాలోని పాండవపుర తాలూకా చంద్రె గ్రామంలో చోటు చేసుకుంది. శనివారం ఉదయం శిశువు ఏడుపు వినిపించడంతో స్థానికులు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకుని శిశువును సంరక్షించారు. అనంతరం పాండవపుర పట్టణ ఆస్పత్రికి తరలించగా అక్కడ ఉన్న ఓ మహిళ చనుబాలు ఇచ్చి అమ్మతనం చాటుకుంది. శిశువును చీమలు కరవడంతో మెరుగైన చికిత్స కోసం మండ్య మిమ్స్కు తరలించారు. విషయం తెలుసుకున్న జిల్లా ఇన్చార్జ్ మంత్రి గోపాలయ్య మిమ్స్ ఆస్పత్రికి చేరుకుని శిశువును పరిశీలించి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. ఉత్తమ వైద్యం అందివ్వాలని జిల్లా అధికారి అశ్వతికి సూచించారు. (చదవండి: ఆడపిల్లను కన్నావు... అదనపు కట్నం తెస్తేనే సంసారం) -
అప్పుల బాధ నుంచి తప్పించుకునేందుకు చనిపోయినట్లు డ్రామా.. చివరికి
సాక్షి, బెంగళూరు: అప్పుల బాధ నుంచి తప్పించుకునేందుకు ఒక వ్యక్తి తాను చనిపోయినట్లు డ్రామా ఆడి అడ్డంగా దొరికిపోయాడు. ఈఘటన మాండ్య శ్రీరంగపట్టణ తాలూకా బొట్టనహళ్లి గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలు.. గ్రామానికి చెందిన మను అనే వ్యక్తి ఫైనాన్స్ కంపెనీ ఏర్పాటు చేశాడు. బయట వ్యక్తుల వద్ద అప్పులు చేశాడు. బాకీ తీర్చాలని ఆసాములు ఒత్తిడి చేయడంతో గత నెల 12 నుంచి కనిపించకుండా పోయాడు. తాను ధరించిన విగ్కు కోడి రక్తం పూసి, చెప్పులను కాలువ వద్ద వదిలేసి గోవా వెళ్లాడు. వాటిని గమనించిన తల్లిదండ్రులు మనుని ఎవరో హత్య చేశారని భావించారు. ఇదిలా ఉండగా సుప్రియ అనే యువతికి రూ. 8 లక్షలు ఇచ్చినట్లు, అందుకు సంబంధించిన డాక్యుమెంట్ ఇవ్వాలని, లేదంటే సినిమా తరహాలో చంపేస్తానని ఓ వ్యక్తి మనును బెదిరించినట్లు ఒక ఆడియో వైరల్ అయింది. దీంతో మను తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి మను బతికే ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. అప్పుల బాధతోనే డ్రామా ఆడినట్లు అంగీకరించాడు. చదవండి: బెంగళూరులో ఘోరం.. తమ్ముని భార్య వేధిస్తోందని -
నగల వ్యాపారి హనీట్రాప్లో కొత్త ట్విస్ట్
మండ్య: మండ్యకు చెందిన బంగారం వ్యాపారి హనీట్రాప్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. గతనెల ఓ లాడ్జీలో యువతితో ఉన్న జగన్నాథశెట్టిని ఇద్దరు యువకులు, ఓ మహిళ లాడ్జికి వచ్చి బెదిరించారు. ఆ సమయంలో జగన్నాథ శెట్టి తాను ఓ కళాశాల ప్రిన్సిపల్ అని చెప్పుకుని ట్యూషన్ కోసం యవతిని పిలుచుకుని వచ్చానని వారికి చెప్పాడు. ఆయన మాటలను వారు విశ్వసించకపోవడంతో పాటు తీవ్రంగా కొట్టారు. కొట్టొద్దని వేడుకున్నా వదలలేదు. తాజాగా ఈ వీడియో మొత్తం ఇప్పుడు వైరల్గా మారింది. వైరల్గా జగన్నాథశెట్టి ఆడియో.. మైసూరులో ఓ లాడ్జిలో రెండు రోజులు ఉందామని జగన్నాథశెట్టి ఓ యువతికి ఫోన్ చేశాడు. సదరు యువతి పుస్తకాలు ఏమైనా తీసుకురావాలా అన్ని ప్రశ్నిస్తే నీకు ఏ పుస్తకం కావాలో నేనే తీసుకువస్తానని ఆ ఆడియో పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే జగన్నాథ శెట్టి మండ్య బస్టాండ్లో మంగళూరు వెళ్లడానికి వేచి ఉండగా ముగ్గురు వ్యక్తులు మైసూరుకు డ్రాప్ ఇస్తామని చెప్పి ఓ వాహనంలో ఎక్కించుకుని ఓ లాడ్జిలోకి తీసుకెళ్లి యువతిని గదిలోకి పంపించి హనీట్రాప్నకు పాల్పడ్డారని, ఆ ముఠా డబ్బులు డిమాండ్ చేశారని జగన్నాథశెట్టి అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చదవండి: (నగల వ్యాపారికి హనీ ట్రాప్.. వద్దన్నా హోటల్కు.. యువతి ఎంట్రీ..) అయితే తాజాగా జగన్నాథశెట్టి సదరు యువతితో మాట్లాడిన ఆడియో, ఆయనపై ముఠా దాడిచేసే వీడియో ఇప్పుడు బయటకు రావడంతో ఆయన చిక్కుల్లో పడ్డారు. నిజంగా హనీట్రాప్ జరిగిందా లేదా, ఇది సల్మా ఆమె గ్యాంగ్ డబ్బులు వసూలు చేసుకుని ఈ వీడియో వైరల్ చేశారా అనేది ఇప్పుడు చర్చనీయంశమైంది. దీంతో పోలీసులు అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేపట్టారు. -
ఘోర ప్రమాదం.. గోడ కూలి పాప, మహిళ మృతి
సాక్షి, బెంగళూరు: డెంకణీకోట పట్టణంలోని ఉరుసు జాతరలో ఘోరం సంభవించింది. గోడ కూలడంతో ఓ పాప, మహిళ మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. పట్టణంలోని యారబ్ దర్గాలో కొన్నిరోజులుగా ఉరుసు జరుగుతోంది. ఇందులో అసోం రాష్ట్రానికి చెందిన వారు అంగళ్లను ఏర్పాటు చేసుకొన్నారు. బుధవారం ఉరుసు ముగింపు సందర్భంగా అంగళ్లను ఖాళీ చేస్తుండగా పాత రాతి గోడ కూలిపోయింది. రాళ్ల కింద చిక్కి అసోం రాష్ట్రానికి చెందిన హామియాబేగం (35), రబికుల్ ఇస్లాం (22), సాధ్ ఆలీ (35), డెంకణీకోట జైవీధికి చెందిన బాలాజీ కూతురు సహన (11), వెంకటేష్ కూతురు హేమావతి(12)లు చిక్కుకొన్నారు. వెంటనే స్థానికులు వారిని బయటకు తీసి చికిత్స కోసం డెంకణీకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా హామియాబేగం, సహన మృతి చెందారు. మిగతా ముగ్గురికి డెంకణీకోట ప్రభుత్వ ఆస్ఫత్రిలో చికిత్సలందజేస్తున్నారు. ఈ ఘటనపై డెంకణీకోట పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: బెంగళూరులో ఏకధాటిగా వర్షాలు.. 1989 తరువాత ఇదే తొలిసారి -
నగల వ్యాపారికి హనీ ట్రాప్.. వద్దన్నా హోటల్కు.. యువతి ఎంట్రీ..
సాక్షి, మండ్య (బెంగళూరు): కొన్నాళ్లుగా నిలిచిపోయిన హనీట్రాప్ దందా మళ్లీ మొదలైనట్లు కనిపిస్తోంది. మండ్యలో ఒక నగల వ్యాపారిపై వలపు వల విసిరి భారీగా కొల్లగొట్టిన వైనం వెలుగుచూసింది. మండ్య మహావీర్ సర్కిల్లో ఉన్న శ్రీనిధి నగల షాపు యజమాని ఎస్.జగన్నాథ్ శెట్టి హనీ ట్రాప్కు గురై రూ. 48 లక్షలు పోగొట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బస్టాండులో ఉండగా కారులో పికప్ వివరాలు... ఈ ఏడాది ఫిబ్రవరి నెల 22వ తేదీ రాత్రి సుమారు 8 గంటలకు పని మీద మంగళూరుకు వెళ్లాలని మండ్య బస్టాండుకు వచ్చాడు. ఇంతలో ఒక కారు వచ్చి ఆయన ముందు ఆగింది, అందులోనివారు మీరు ఎక్కడ వెళుతున్నారు అని అడిగారు. మేము మైసూరు వరకు డ్రాప్ చేస్తామని ఆయనను ఎక్కించుకున్నారు. మా వద్ద కొన్ని బంగారు బిస్కెట్లు ఉన్నాయి, వాటి విలువ చెప్పాలని ఆయన వద్దు వద్దంటున్నా మైసూరులోని ఒక హోటల్కు తీసుకెళ్లారు. అందులో నిందితులు సల్మా బాను, జయంత్ ఉన్నారు, మరో యువతి కూడా గదిలోకి వచ్చింది. కెమెరాతో అంతా వీడియో తీసి, మా చెల్లెళ్లతో నీకేం పని అని జయంత్ ఆ వ్యాపారిని బెదిరించాడు. అతన్ని కొట్టి రూ. 4 కోట్లు ఇవ్వాలని డిమాండ్ పెట్టారు. దీంతో దిక్కుతోచని బాధితుడు ఒక ఎల్ఐసి ఉద్యోగి నుంచి, మరో జువెలరీ షాప్ యజమాని నుంచి మొత్తం రూ.48 లక్షలు వారికి ఇప్పించాడు. అయితే మరింత డబ్బు తేవాలని దుండగులు పీడిస్తుండడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చేపట్టారు. చదవండి: (అప్పు తీర్చమన్నందుకు హత్య, ఇద్దరికి జీవితఖైదు) -
భయానక వీడియో: కాలనాగు నుంచి బిడ్డను కాపాడుకుంది
వైరల్: కర్ణాటక మాండ్య నుంచి భయానక వీడియో ఒకటి సర్క్యులేట్ అవుతోంది. ఓ తల్లి సమయస్ఫూర్తితో భారీ విష సర్పం కాటు నుంచి బిడ్డను రక్షించుకుంది. రెప్పపాటులో ఆ బిడ్డకు ఘోర ప్రమాదమే తప్పింది. ఆ తల్లీబిడ్డలు ఇద్దరూ ఇంటి నుంచి బయటకు వస్తున్న టైంలో ఈ ఘటన జరిగి ఉంటుందని స్పష్టం అవుతోంది. ఇంటి బయట మెట్ల కింద నుంచి పాము వెళ్తోంది. ఆ సమయంలో పామును గమనించకుండా ఆ చిన్నారి కిందకు కాలు వేయబోయాడు. అంతలో.. ఆ తల్లి చూపించిన తెగువ, సమయస్ఫూర్తిని మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు పలువురు. ఎంతైనా అమ్మ కదా! View this post on Instagram A post shared by India Today (@indiatoday) -
తల లేదు.. మొండెం మాత్రమే: క్లూ చెప్పండి, రూ.లక్షలు గెలవండి
మండ్య: జిల్లాలో ఒకేరోజు వేర్వేరు చోట్ల ఇద్దరు మహిళల మృతదేహాల మిస్టరీ ఇప్పటికీ వీడలేదు. హతులెవరు, హంతకులెవరు అనేది పోలీసులకు చిన్న క్లూ కూడా దొరకలేదు. దీంతో ఈ మరణాలపై సమాచారం ఇస్తే బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించారు. ఈ నెల 7వ తేదీన మండ్య జిల్లాలోని పాండవపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బేబి గ్రామంలో ఉన్న చెరువులో సుమారు 30 సంవత్సరాల మహిళ మృతదేహం కనిపించింది. మృతదేహానికి తల లేదు. మొండెం మాత్రమే ఉంది. ఇప్పటివరకు హతురాలు ఎవరో నిర్ధారణ కాలేదు. వివరాలను తెలిపిన వారికి రూ.లక్ష బహుమానంగా ఇస్తామని పోలీసులు ప్రకటించారు. అదేరోజు శ్రీరంగ పట్టణం తాలూకా అరికెరె పోలీస్ స్టేషన్ పరిధిలో సీడీఎస్ కాలువ వద్ద నీటి గుంతలో 40 సంవత్సరాల మహిళ మృతదేహం కనిపించింది. ఆమెకు కూడా తల లేదు. ఇద్దరి దేహాలపై బట్టలు లేవు. ఈ మహిళ వివరాలు చెప్పినవారికి రూ.లక్ష నజరానాను ప్రకటించారు. చదవండి: (భర్త దగ్గరకు వెళ్లొద్దని చెప్పినా వినకుండా వెళ్లి..) -
ప్రిన్సిపాల్ చెంప చెళ్లుమనిపించిన ఎమ్మెల్యే.. ఎందుకో తెలుసా?
ఓ కాలేజీ ప్రిన్స్పాల్ చెంపపై లాగిపెట్టి ఒక్కటిచ్చాడో ఎమ్మెల్యే. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఎందుకు అనుకుంటున్నారా.. ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నలకు ప్రిన్సిపాల్ సరైన సమాధానం ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. ఈ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల ప్రకారం.. జనతాదళ్ (సెక్యులర్) ఎమ్మెల్యే శ్రీనివాస్ జూన్ 20వ తేదీన మాండ్యాలోని నల్వాడి కృష్ణ రాజా వెడియార్ ఐటీఐ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా కాలేజీలో జరుగుతున్న కంప్యూటర్ ల్యాబ్కు సంబంధించిన పనుల గురించి ఎమ్మెల్యే ఆరా తీశారు. ఈ క్రమంలో కాలేజీ ప్రిన్స్పాల్.. ఎమ్మెల్యే అడిగిన ప్రతీ ప్రశ్నకి పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో, సహనం కోల్పోయిన ఎమ్మెల్యే శ్రీనివాస్.. అక్కడున్న వారందరి ముందే ప్రిన్సిపాల్ చెంప చెళ్లుమనిపించారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడున్న వారంతా షాకయ్యారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎమ్మెల్యే తీరుపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని వారు తెలిపారు. JanataDal MLA M Srinivas slaps the Principal of Nalwadi krishnaraja college in Karnataka in infront of everyone This happens when power goes to head Shame😈 pic.twitter.com/8RTCCud8Mo — Sheetal Chopra 🇮🇳 (@SheetalPronamo) June 21, 2022 ఇది కూడా చదవండి: సింప్లిసిటీ చాటుకున్న ద్రౌపది ముర్ము.. పలువురి ప్రశంసలు -
యువతిపై మాజీ ప్రియుడు హత్యాయత్నం
మండ్య: ఓ యువకుడు యువతిపై హత్యాయత్నం చేసిన ఘటన మండ్య నగరంలోని మండ్య వైద్య కళాశాల ఆవరణంలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు... మండ్య తాలూకా వై యరహళ్లి గ్రామానికి చెందిన నవ్య (20) మండ్య మిమ్స్ ఎంఆర్డీ విభాగంలో పారా మెడికల్ కోర్సు చేస్తోంది. అదే గ్రామానికి చెందిన తన బంధువు పరమేశ్, నవ్య నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల నవ్య పరమేశ్కు దూరంగా ఉంటోంది. దీన్ని సహించలేని పరమేశ్ ఆమెను హత్య చేయాలని పథకం పన్నాడు. గురువారం మధ్యాహ్నం నుంచి నవ్య కోసం అక్కడే వేచి ఉన్నాడు. 4.30 గంటల సమయంలో నవ్య కళాశాల నుంచి బయటకు రాగా తను వెంట తెచ్చుకున్న బలమైన కట్టెతో దాడి చేశాడు. దీంతో నవ్య తలకు తీవ్రంగా గాయమైంది. అక్కడే ఉన్న విద్యార్థులు పరమేశ్ను పట్టుకుని చితకబాదారు. తీవ్ర రక్తస్రావమైన నవ్యను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు దుండగున్ని అరెస్ట్ చేశారు. చదవండి: (ఎస్ఐ వివాహేతర సంబంధం.. గుట్టురట్టు చేసిన భార్య) -
ఘోరం: డ్రైవర్ సజీవ దహనం
మండ్య(బెంగళూరు): జల్లిలోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ వంతెన పిల్లర్ను ఢీకొన్న ఘటనలో మంటలు ఏర్పడి డ్రైవర్ సజీవ దహనమైన ఘటన మండ్య జిల్లాలోని మద్దూరు పట్టణంలోని ఎల్ఐసీ కార్యాలయం సమీపంలో చోటుచేసుకుంది. మృతుడిని హాసన్ జిల్లాకు చెందిన దినేశ్ (44)గా గుర్తించారు. వివరాలు... రామనగర జిల్లా బిదడి కెంపెనహళ్లి నుంచి జల్లి లోడు తీసుకుని డ్రైవర్ దినేశ్ బయలుదేరాడు. ( చదవండి: విడాకులు తీసుకున్నారు.. మాట్లాడాలని భార్యని హోటల్కి పిలిచి.. ) గురువారం తెల్లవారుజామున టిప్పర్ లారీ అదుపుతప్పి నిర్మాణ దశలో ఉన్న వంతెన పిల్లర్ను ఢీకొంది. లారీ ఇంజిన్ నుంచి మంటలు లేచి అంటుకున్నాయి. డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
ఛీ... సొంత అన్న కూతురినే...
మండ్య/కర్ణాటక: మైసూరు దుస్సంఘటనను ప్రజలు మరువక ముందే మండ్య నగరంలో మరో ఘోరం చోటు చేసుకుంది. సల్మాన్ (32) అనే కామాంధుడు సొంత అన్న కూతురిపై దారుణానికి పాల్పడ్డాడు. గురువారం బాలికను పాఠశాలకు తీసుకెళ్లిన నిందితుడు మధ్యలో నిర్జన ప్రదేశానికి ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. ముఖంపై గాయాలు చేశాడు. సాయంత్రం బాలికను చూసిన తల్లిదండ్రులు ఏమైందని అడగ్గా బాబాయ్ ఘాతుకాన్ని వివరించింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సల్మాన్ను అరెస్టు చేశారు. అత్యాచారాల్ని ఆపండి కోలారు: మహిళలపై అత్యాచారాలు, దౌర్జన్యాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ప్రగతి పర మహిళా సంçఘాల కార్యకర్తలు రోడ్డెక్కారు. గురువారం మెక్కె సర్కిల్లో బ్యాడ్జీలు ధరించి ప్రతిఘటన నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ విఆర్ సుదర్శన్ మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దౌర్జన్యాలు సభ్య సమాజం తల దించుకునేలా ఉన్నాయన్నారు. దుండగులకు కఠిన శిక్షలు విధించి గట్టి సందేశం పంపాలన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. చదవండి: మైసూరు అత్యాచార ఘటన: కీలక విషయాలు! -
విమర్శలు చేసేందుకు చనిపోయిన నా భర్త పేరెందుకు?
సాక్షి, బెంగళూరు: నటి, ఎంపీ సుమలత అంబరీష్, జేడీఎస్ నేత కుమారస్వామి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మాండ్య జిల్లాలో అక్రమ మైనింగ్ ద్వారా కుమార స్వామి, ఇతర జేడీఎస్ నేతలు లబ్ధి పొందారని ఆమె ఆరోపించారు. అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రాంతంలోకి తనను వెళ్లనివ్వలేదన్నారు. దీనిపై త్వరలో సీఎం యెడియూరప్ప, గనుల మంత్రిని కలిసి ఫిర్యాదు చేస్తానన్నారు. తనపై విమర్శలు చేసేందుకు చనిపోయిన తన భర్త అంబరీష్ పేరును తరచూ ప్రస్తావించడంపై ఆమె మండిపడ్డారు. ఆయనకు వ్యక్తిత్వమే లేదు దొడ్డబళ్లాపురం: కుమారస్వామి ఏనాడో తన వ్యక్తిత్వాన్ని కోల్పోయారని, కొత్తగా సుమలతపై చేసిన వ్యాఖ్యల వల్ల పోగొట్టుకుంది కాదని ఎమ్మెల్సీ సీపీ యోగేశ్వర్ అన్నారు. శుక్రవారం రామనగర శివారులో మీడియాతో మాట్లాడిన ఆయన కేఆర్ఎస్ డ్యామ్ పరిసరాల్లో ఎన్నో ఏళ్లుగా అక్రమ మైనింగ్ జరుగుతోందని, ఇదే విషయాన్ని సుమలత చెప్పి ఉంటారన్నారు. అయితే ఈ విషయంలో కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు సిగ్గుపడేలా ఉన్నాయన్నారు. -
ముద్దొచ్చే చిన్నారులు.. ఎందుకిలా చేశావమ్మా?
మండ్య/కర్ణాటక: కుటుంబ కలహాలతో తల్లి తన ఇద్దరు పిల్లల సహా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జిల్లాలోని నాగమంగళ తాలూకా హుళ్లెనహళ్లి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. వివరాలు... తాలూకాలోని కెరెగోడు సమీపంలో ఉన్న గౌడగెరె గ్రామానికి చెందిన గిరీశ్ భార్య సించన (32), పిల్లలు డింపన (4), మహేంద్ర (6) ఉన్నారు. కుటుంబంలో వచ్చిన గొడవలతో సించన పుట్టినిల్లు హుళ్లెణహళ్లి గ్రామానికి వచ్చింది. గురువారం ఉదయం తన పిల్లలతో కలిసి సమీపంలోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు.. ముద్దొచ్చే చిన్నారులను చూసైనా ఈ తీవ్ర నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సిందమ్మా అంటూ విలపించిన తీరు ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టించింది. వివాహిత దారుణహత్య తుమకూరు: గొర్రెలను మేత కోసం తీసుకెళ్తున్న మహిళపై దుండగులు వేటకొడవలితో నరికి హత్య చేశారు.ఈ ఘటన తుమకూరు తాలూకా కోడి తిమ్మనహళ్లిలో గురువారం చోటు చేసుకుంది. కోరా పోలీసుల కథనం మేరకు.. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన నాగరాజు భార్య సిద్దగంగమ్మ(40) రోజులాగే గురువారం ఉదయం గొర్రెలను మేత కోసం పొలానికి తీసుకెళ్తుండగా గ్రామ సమీపంలో కాపుగాసిన దుండగులు ఆమెపై దాడి చేశారు. వేడకొడవలితో మెడపై, ఇతర శరీర భాగాలపై విచక్షణారహితంగా నరికి ఉడాయించారు. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వచ్చి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. తనకు, అన్నదమ్ముల మధ్య పొలం విషయంలో గొడవలు ఉన్నాయని, తన భార్యను వారే హత్య చేసి ఉంటారని హతురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది. -
పులి ముందు ఎలుకలా నిల్చున్నది ఎవరు?
సాక్షి, బెంగళూరు: దివంగత నటుడు అంబరీశ్ ముందు జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి చేతులు కట్టుకుని నిలబడిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీనిపై కుమార గురువారం స్పందిస్తూ నేను ప్రజల ముందు కూడా చేతులు కట్టుకుని నిలబడతాను, ఈ విషయానికి అంత ప్రాధాన్యం అవసరం లేదు అన్నారు. ఆడపిల్లపై ప్రస్తుతం చర్చ వద్దని, ఎన్నికల సమయంలో మాట్లాడతానని ఎంపీ సుమలతను ఉద్దేశించి అన్నారు. కాగా ప్రముఖ నటి, మండ్య స్వతంత్ర ఎంపీ సుమలత అంబరీశ్ గురించి కుమారస్వామి ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మండ్య జిల్లాలోని కేఆర్ఎస్ డ్యామ్ గేట్ల లీకేజ్ని అరికట్టడానికి ఎంపీని అడ్డుగా పడుకోబెడితే సరిపోతుందంటూ ఆయన వ్యాఖ్యానించడం కలకలం రేపింది. ఇందుకు సుమలత ఘాటుగానే స్పందించారు. ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి స్థాయికి దిగజారి మాట్లాడితే ఆయనకు, తనకూ తేడా ఉండదని చురకలు అంటించారు. అదే విధంగా కేఆర్ఎస్ డ్యామ్ విషయం గురించి మాట్లాడుతూ.. కుమారస్వామి అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అని, మండ్యా జిల్లాలోని శ్రీరంగ పట్టణ తాలుకాలో అక్రమ గనుల తవ్వకాలు తాను ఆపేయాలని ఆదేశించినట్లు సుమలత పేర్కొన్నారు. ఈ విషయంలో కుమారస్వామి అవినీతి వైపు నిలబడి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో కుమారస్వామి వర్సెస్ సుమలత అన్నట్లుగా అనుచర వర్గాలు సోషల్ మీడియాలో మాటల యుద్ధానికి తెర తీశారు. ఈ నేపథ్యంలో సుమలత- అంబరీష్ ఫ్యాన్స్ కుమార- అంబి పాత ఫొటోలు షేర్ చేస్తూ.. ‘‘పులి ముందు ఎవరు ఎలుకలా నిలబడ్డది ఎవరు? ఇప్పుడు ఆయన మహిళల గురించి ఏం మాట్లాడుతున్నారు’’ అంటూ తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు. -
కవలల ఉసురు తీసిన పెళ్లి సంబంధాలు.. కలిసి ఉండలేమని..
సాక్షి బెంగళూరు: ఆ ఇంట్లో ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. ఆడపిల్లలు పుట్టడం తల్లిదండ్రుల ఆనందానికి హద్దులు లేవు. వారిద్దరూ కలిసి మెలిసి, ఎంతో ప్రేమగా ఉండేవారు. ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. ఒకే చోట పెరిగిన వీరు.. జీవితాంతం ఇంతే ప్రేమగా కలిసి ఉండాలని భావించారు. కానీ ఇంతలో వీరికి పెళ్లి వయస్సు రావడంతో తల్లిదండ్రలు పెళ్లి చేయాలని నిశ్చయించారు. దీంతో సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. అయితే, పెళ్లి జరిగితే తాము విడిపోతామనే భయంతో ఆత్మహత్య చేసుకున్నారు. కర్ణాటకలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన కన్నీరు పెట్టిస్తోంది. వివరాలు.. కర్ణాటక మండ్య జిల్లా శ్రీరంగపట్నం మండలం, హనసనహళ్లి గ్రామానికి చెందిన సురేష్, యశోద దంపతులకు దీపిక, దివ్య అనే ఇద్దరు కవల పిల్లలున్నారు. వారికి పెళ్లి వయస్సు రావడంతో తల్లిదండ్రులు సంబంధాలు చూస్తున్నారు. అయితే, ఒకే కుటుంబానికి చెందిన సంబంధాలు లభించలేదు. ఈక్రమంలో వేర్వేరు కుటుంబాలను చెందిన వారికి ఇచ్చి వివాహం చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. వివాహమైతే తామిద్దరం ఒకేచోట ఉండలేం, విడిపోతామని మనస్తాపానికి గురైన దీపిక, దివ్య.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి తమ గదుల్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. చివరికి తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చారు. కళకళలాడే తమ బిడ్డలు ఇల్లు చీకటి చేశారని మృతుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై అరికేర్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు జరుపుతున్నారు. -
దారుణం: భర్త అంత్యక్రియలు.. ఆ వెంటనే భార్య ఆత్మహత్య
మండ్య: జీవితాంతం కష్టసుఖాల్లో తోడుంటానని ఏడడుగులు నడిచిన భర్త అంతలోనే దూరం కావడం ఆమెను తీవ్ర వేదనకు గురిచేసింది. భర్త అంత్యక్రియలు పూర్తి అయిన తర్వాత ఇంటికి వచ్చిన భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘోరం మండ్య జిల్లా నాగమంగళ తాలూకా బొమ్మనహళ్లిలో జరిగింది. వివరాలు.. కిరణ్ (30), పూజా (22)లకు 11 నెలల క్రితమే వివాహం జరిగింది. బొమ్మనహళ్లిలోనే కాపురం ఉన్నారు. కిరణ్ గుండెజబ్బుతో బాధపడుతూ బెంగళూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో శనివారం ఉదయం చనిపోయాడు. బంధువులు మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు చేశారు. ఇంటికి వచ్చిన తర్వాత పూజా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అంతలోనే మరో దారుణంతో ఇరు కుటుంబాలు నిశ్చేష్టులయ్యాయి. కొంతసేపటికి ఆమె మృతదేహానికి కూడా అంత్యక్రియలు జరిపించారు. -
డేంజర్ జోన్లో 6 జిల్లాలు
బనశంకరి: రాష్ట్రంలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రభుత్వం లాక్డౌన్ విధించినప్పటికీ పెద్ద ప్రయోజనం కనబడడం లేదు. దేశంలోని 52 జిల్లాలు డేంజర్జోన్లో ఉండగా అక్కడ 100 శాతానికి పైగా కేసుల వృద్ధి నమోదవుతోంది. వాటిలో కర్ణాటకలోని 6 జిల్లాలున్నాయి. ఏప్రిల్ 14 నుంచి ఇప్పటివరకు 52 జిల్లాల్లో విచ్చలవిడిగా కరోనా కేసులు పెరుగుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గుర్తించింది. అందులో దేశంలోని మహానగరాలను వెనక్కినెట్టి రాష్ట్రంలోని 6 జిల్లాలు ముందువరుసలో నిలిచాయి. కొడగుకు దేశంలోనే 3వ స్థానం.. దేశంలో అత్యధిక కరోనా కేసుల వృద్ధి ఉన్న జిల్లాల్లో 3వ స్థానంలో రాష్ట్రంలోని కాఫీనాడు కొడగు జిల్లా ఉంది. కొడగు 184 శాతం కేసుల వృద్ధిరేటు కలిగి ఉంది. తుమకూరు 146 శాతం, కోలారు 136 శాతం, మండ్య 118 శాతం, రామనగర 102 శాతం, చామరాజనగర 143 శాతం వృద్ధి రేటు కలిగి ఉన్నాయి. ఇక్కడ ఫుల్ లాక్డౌన్ శివాజీనగర: ప్రధాని నరేంద్ర మోదీ సీఎంలతో, కలెక్టర్లతో తాజా సమావేశం తరువాత రాష్ట్రంలో పలు జిల్లాల్లో గురువారం నుంచి సంపూర్ణ లాక్డౌన్ మొదలైంది. కరోనా ప్రభంజనాన్ని అడ్డుకోవడానికి ఇప్పటికే మే 24 వరకు సడలింపులతో లాక్డౌన్ జారీలో ఉంది. కేసులు తీవ్రం కావడంతో ఉమ్మడి బళ్లారి జిల్లా, హాసన్, కల్బుర్గి, కొప్పళ, శివమొగ్గ, చిక్కబళ్లాపుర జిల్లాల్లో 4 రోజుల పాటు కఠిన లాక్డౌన్ అమలు కాబోతోంది. ఈ సమయంలో కిరాణా షాపులు కూడా తెరవనివ్వరు. -
వెయ్యి మంది అతిథులు: వధూవరుల కుటుంబాలకు షాక్!
మండ్య: కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన కల్యాణమండపం యజమానికి, వధువు, వరుడి కుటుంబాలకు అధికారులు జరిమానా విధించారు. మండ్య నగరంలో శుక్రవారం ఒక కళ్యాణమండపంలో వివాహం జరిగింది. 500 మందికి మాత్రమే అనుమతి ఉండగా వెయ్యిమందికి పైగా ఉండటం, మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడంపై సమాచారం అందుకున్న ఆరోగ్య శాఖ అధికారులు, తహసీల్దార్ చంద్రశేఖర్ శంగాలి, నగరసభ కమిషనర్ లోకేష్లు పోలీసులతో కలిసివెళ్లారు. కళ్యాణ మండపం యజమానికి రూ.12వేలు, వధువు, వరుడి కుటుంబాలకు రూ.2వేలు చొప్పున జరిమానా విధించారు. మాస్క్ మరిచారు.. జరిమానా కట్టారు బెంగళూరులో కరోనా మహమ్మారి ఎంతో మందిని బలిగొంటోంది. అయినప్పటికీ ప్రజలు మాస్కులు లేకుండా సంచరిస్తున్నారు. ఈ క్రమంలో బీబీఎంపీ మార్షల్స్ జరిమానాలు విధించారు. -
ఒక్కదాన్నే ఉన్నా.. నువ్వు రా; ఇంటికి పిలిపించి కాటికి పంపారు
మండ్య: ప్రేమ పాశంలో చిక్కుకున్న యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. బాలిక చేత తల్లిదండ్రులు ఫోన్ చేసి పిలిపించి కొట్టడంతో మృత్యువాత పడ్డాడు. ఈ ఘోరం బుధవారం అర్ధరాత్రి సమయంలో మండ్య నగరంలోని కల్లజళ్ళి లేఔట్లోని విశ్వేశ్వర నగరలో చోటు చేసుకుంది. బాధిత యువకుడు అదే ప్రదేశానికి చెందిన సతీష్ కుమారుడు దర్శన్ (17). అదే ప్రాంతంలో ఉండే 10వ తరగతి బాలికతో అతడికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. తరచూ ఫోన్లతో మాట్లాడడం, బయట కలుస్తూ ఉండేవారు. ఈ విషయం తెలిసి బాలిక తల్లిదండ్రులు మండ్య నగరసభ 7వ వార్డు సభ్యుడు, స్థాయి సమితి అధ్యక్షుడైన శివలింగ, ప్రభుత్వ టీచర్ అనురాధ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. అతనికి ఎలాగైనా గట్టిగా బుద్ధి చెప్పాలని పథకం వేశారు. ఇంట్లో ఎవరూ లేరని చెప్పించి.. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి సమయంలో బాలిక తల్లిదండ్రులు ఆమె చేత యువకునికి ఫోన్చేయించి మా ఇంట్లో ఎవరూ లేరు, నువ్వు రా అని చెప్పించారు. నిజమేనని నమ్మి దర్శన్ వెళ్లాడు. అతని కోసం కాచుకుని కూర్చున్న బాలిక కుటుంబీకులు అతన్ని పట్టుకుని తీవ్రంగా కొట్టారు. దర్శన్ అరుపులు విన్న చుట్టుపక్కలవారు అతడి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు పరుగున వచ్చారు. వారి ముందే మళ్లీ కొట్టడంతో అతడు సొమ్మసిల్లి పడిపోయాడు. చుట్టుపక్కల వారితో కలిసి మండ్య మిమ్స్ ఆస్పత్రికి తరలిచారు. కొంతసేపటికి అక్కడ దర్శన్ చనిపోయాడు. దర్శన్ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మండ్య పశ్చిమ విభాగం పోలీసులు పరిశీలన జరిపి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. యువకుని మృతికి కారణం అయినవారిని అరెస్టు చేయాలని స్థానికులు డిమాండు చేశారు. చదవండి: దారుణం: కూతురిపై తండ్రి కాల్పులు -
పెళ్లికి వెళ్లి.. కోటీశ్వరుడై తిరిగొచ్చాడు..
సాక్షి, మండ్య: అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో తెలియదు. మామూలు మనిషి కాస్తా కోటీశ్వరుడు కావచ్చు. నిజంగా అలాగే జరిగింది. కర్ణాటకలో మండ్య జిల్లాలోని మద్దూరు తాలూకాలోని సోమనహళ్ళి గ్రామానికి చెందిన యువకునికి కేరళలో రూ.కోటి లాటరీ తగిలింది. శోహాన్ బలరామ్ అనే యువకుడు ఈ నెల 5వ తేదీన కుటుంబంతో కలిసి బంధువుల పెళ్లి కోసం కేరళకు వెళ్లాడు. అక్కడ శుభకార్యం చూసుకుని స్నేహితుడు దేవదాసు ప్రభాకర్ ఇంటికి వెళ్లాడు. దేవదాసు దుకాణంలో కేరళ భాగ్యమిత్ర లాటరీ టికెట్ను రూ.100 పెట్టి కొన్నాడు బలరామ్. తరువాత కుటుంబంతో కలిసి కారులో మండ్యకు బయల్దేరాడు. మధ్యాహ్నం 3.30 సమయంలో శోహాన్ మొబైల్కు ఫోన్ వచ్చింది. నువ్వు కొన్న టికెట్కు రూ. 1 కోటి లాటరీ వచ్చిందని మిత్రుడు చెప్పగా ఏదో తమాషా చేస్తున్నాడు అని నవ్వుకున్నాడు. కానీ వెంటనే టికెట్ తీసుకుని తిరిగి రా అని ఒత్తిడి చేయడంతో వెనుదిరిగాడు. డ్రాలో వచ్చిన నంబర్ చూసుకుంటే నిజంగానే లాటరీ తగిలింది. సుమారు 48 లక్షల మంది లాటరీ టికెట్ కొంటే అందులో ఐదుమందికి మాత్రమే ఈ అదృష్టం దక్కుతుందని స్థానికులు తెలిపారు. బలరామ్ సంతోషం పట్టలేక స్వీట్లు కొని పంచిపెట్టాడు. లాటరీ డబ్బుతో తమకున్న రైస్మిల్ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటామని అన్నారు. -
ఆన్లైన్ క్లాసులు: తండ్రి బాగోతం బట్టబయలు!
బెంగళూరు : ఆన్లైన్ క్లాసెస్ విధానం ఓ వ్యక్తి బాగోతాన్ని బట్టబయలు చేసింది. క్లాసులు వినేందుకు కూతురు ఫోన్ తీసుకోగా.. అతడి వివాహేతర సంబంధం గురించి బయటపడింది. ఈ విషయం తెలుసుకున్న భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. కర్ణాటకలోని మాండ్య జిల్లాలో నాగ మంగళంలో నివాసముంటున్న దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ఆన్లైన్ క్లాసుల కోసమని వారి పెద్ద కూతురు తండ్రి ఫోన్ తీసుకుంది. ఈ క్రమంలో మొబైల్ ఓపెన్ చేయగానే.. తన తండ్రి వేరొక మహిళతో ఏకాంతంగా గడిపిన వీడియో ఆమె కంటపడింది. వెంటనే ఈ విషయాన్ని తల్లికి చెప్పింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె తల్లి.. భర్తతో కలసి కాపురం చేయలేనని తేల్చిచెప్పింది. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే సదరు భర్త మాత్రం తనకు భార్యాపిల్లలు కావాలని, వాళ్లతో ఉంటానని చెప్పడం గమనార్హం. దీంతో ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిరేలా పోలీసులు కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు. కాగా వీడియోలో అతడితో ఉన్న మహిళ వారికి దగ్గరి బంధువని సమాచారం. ఈ విషయమై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మహిళ అంగీకారంతో వీడియో చిత్రీకరించాడా లేదా అన్న విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఐటీ చట్టం-2000 కింద కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు. -
ప్రేమ పెళ్లి.. అనంతరం ప్రియుడి మోజులో..
సాక్షి, కర్ణాటక (మండ్య): ప్రేమపెళ్లి చేసుకుని కొడుకుతో అన్యోన్యంగా ఉన్న ఒక కుటుంబంలో ప్రియుడు చిచ్చుపెట్టాడు. అతని మోజులో పడి భార్య కట్టుకున్న భర్తనే కాటికి పంపింది. ఈ ఘోరం మండ్య తాలూకాలోని హనకెరెలో ఆలస్యంగా వెలుగు చూసింది. మండ్య గ్రామీణ పోలీసులు తెలిపిన మేరకు... గ్రామానికి చెందిన ప్రదీప్ (35), భార్య శిల్ప (30) 13 ఏళ్ల కిందట ప్రేమించుకుని పెళ్లాడారు. వారికి 12 ఏళ్ల కొడుకు ఉన్నాడు. దంపతులు సంతోషంగా ఉన్నారు. ఇంతలో మూడేళ్ల కిందట మధు నాయక్ (34) అనే వ్యక్తి శిల్పకు పరిచయమయ్యాడు. ఇతను కేఆర్ నగరవాసి. స్వయం సేవా సంఘాల వారికి రుణాలను ఇప్పించడం వంటి దళారీ పనులు చేసేవాడు. శిల్ప, మధుల పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది. శిల్ప భర్త ఇంట్లో లేని సమయంలో నేరుగా ఇంటికే వచ్చివెళ్లేవాడు. బయట షికార్లు సరేసరి. ఇది తెలిసి ప్రదీప్ భార్యను తీవ్రంగా మందలించగా ఎన్నోసార్లు గొడవలూ జరిగాయి. చదవండి: (పెళ్లయిన తొమ్మిది నెలలకే...) బంధువులకు అనుమానం ఇలా తమ ఆనందానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలని ప్రేయసీప్రియులు పథకం వేశారు. నవంబర్ 18వ తేదీన రాత్రి గుట్టుగా భోజనంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. దీంతో మత్తులోకి జారుకున్న భర్తను ప్రియునితో కలిసి గొంతు నులిమి చంపింది. తెల్లవారుజామున గుండెపోటుతో చనిపోయాడని శిల్ప ఉత్తుత్తి ఏడుపు ఏడ్చి అనుమానం రాకుండా అంత్యక్రియలు జరిపించింది. అప్పటినుంచి ప్రియుడు మధుతో జల్సాలు చేస్తుండడం చూసి ప్రదీప్ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపి నిజాలు చెప్పించారు. తామే హత్య చేశామని శిల్ప, మధు అంగీకరించారు. అరెస్టు చేసి జిల్లా జైలుకు తరలించారు. -
ముగ్గురు పూజారుల దారుణ హత్య
బెంగళూరు: కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ముగ్గురు పూజారులను అత్యంత పాశవికంగా హత్య చేశారు. బండరాళ్లతో తలలను ఛిద్రం చేసి కర్కశంగా వ్యవహరించారు. ఈ ఘటన మండ్య పట్టణ శివారులో గల ఓ ఆలయంలో చోటుచేసుకుంది. కాగా శుక్రవారం ఉదయం గుడి ప్రాంగణంలో పడి ఉన్న మృతదేహాలను చూసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. దర్యాప్తు చేపట్టారు. వివరాలు.. స్థానిక గుట్టలు ప్రాంతంలోని శ్రీ అరకేశ్వర ఆలయంలో గణేష్, ప్రకాశ్, ఆనంద్ పౌరోహిత్యం చేస్తున్నారు. వీరు ముగ్గురు బంధువులు. భద్రతా కారణాల దృష్ట్యా రోజూ ఆలయ ప్రాంగణంలోనే నిద్రిస్తారు. ఈ క్రమంలో శుక్రవారం గుడికి వెళ్లిన భక్తులకు విగతజీవులుగా కనిపించారు. (చదవండి: ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య) ఇక హుండీలు పగులగొట్టి ఉండటం చూస్తుంటే డబ్బు, నగలు, కానుకల కోసమే దొంగలు ఈ ఘాతుకానికి పాల్పడ్డారా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. సదరన్ రేంజ్ ఐజీపీ ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితులను పర్యవేక్షించారు. కాగా ఇప్పటివరకు హంతకులకు సంబంధించి ఎలాంటి ఆధారం దొరకలేదని పోలీసులు వెల్లడించారు. జాగిలాలను రంగంలోకి దింపామని, ఫోరెన్సిక్ నిపుణులు కూడా క్రైంసీన్లో సాక్ష్యాలు సేకరించే పనిలో ఉన్నారని తెలిపారు. కాగా ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి యడ్యూరప్ప మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. -
మొబైల్ మత్తులో తల్లిని చంపిన డిగ్రీ విద్యార్థి
సాక్షి, మండ్య: మొబైల్ ఫోన్ వ్యసనం ఓ యువకున్ని హంతకునిగా మార్చింది. ఎప్పుడూ ఫోనేనా, బుద్ధిగా చదువుకో, ఇంట్లో పనులు చేయవచ్చు కదా అని బుద్ధిమాటలు చెప్పిన తల్లిని అంతమొందించాడో తనయుడు. మొబైల్ మత్తులో ఏం చేస్తున్నాడో కూడా తెలియని క్రూరునిగా మారాడు. గత గురువారం మండ్యలోని విద్యా నగరలో ఇంట్లోనే ఒక మహిళ హత్యకు గురైంది. కత్తిపోట్లతో రక్తపుమడుగులో పడి ఉన్న మృతదేహం ఫోటోలు తీవ్ర కలకలం సృష్టించాయి. హతురాలిని శ్రీలక్ష్మి (45)గా గుర్తించారు. విచారణలో నేరం రట్టు ఇంత దారుణంగా ఎవరు చంపి ఉంటారని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమె కుమారుడు మను శర్మ (21)నే హంతకుడని శనివారం గుర్తించడంతో అందరూ నిశ్చేష్టులయ్యారు. తల్లి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో చాకుతో పొడిచి ఇంటి నుంచి వెళ్ళియాడు. పోలీసులు ఇంటికి వచ్చి హత్యాస్థలిని పరిశీలిస్తున్న సమయంలో తిరిగి వచ్చిన మను శర్మ ఏమీ తెలియనివాడిలా నటించాడు. పోలీసులు కుటుంబ సభ్యులను పిలిపించి విచారణ చేపట్టారు. విచారణలో దొరికిపోయిన మనుశర్మ తానే తల్లీని హత్య చేసినట్లు ముందు ఒప్పుకున్నాడు. (చెంపలు వాయించింది) ఏం జరిగిందంటే మధుసూదన్, శ్రీలక్ష్మి దంపతుల చిన్న కుమారుడు అయిన మను శర్మ బీఎస్సి చివరి ఏడాది చదువుతున్నాడు. ఇతను ఎప్పుడూ మొబైల్ఫోన్లో లీనమయ్యేవాడు. యువతితో కూడా ఫోన్లో మాట్లాడేవాడు. ఇది మంచిది కాదు అని తల్లి మనుశర్మను మందలించేది. అతడు బయటకి వెళ్లకుండా కట్టడి చేసేది. గురువారం అతని కోసం స్నేహితుడు రాగా, బటయకు వెళ్ళవద్దని తల్లి హెచ్చరించింది. తరువాత తల్లీ కొడుకు మధ్య గొడవ మొదలైంది. ఆగ్రహంతో తల్లి అతని తలపైన గట్టిగా కొట్టడంతో మనుశర్మ వంటగదిలోకి వెళ్ళి చాకు తీసుకొని వచ్చి తల్లి మీద దాడికి దిగాడు. కత్తితో విచ్చలవిడిగా పొడిచి వెళ్లిపోయాడు. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. హత్య జరిగిన కొంత సమయానికి భర్త మధుసూదన్, మరో కుమారుడు ఆదర్శ వచ్చి చూడగా శ్రీలక్ష్మి మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు పరిశీలన చేస్తున్న సమయంలో మను శర్మ వచ్చాడు. పోలీసుల విచారణలో చిక్కుముడి వీడింది. నిందితున్ని అరెస్టు చేసి జైలుకు తరలించారు. -
తల్లిని హతమార్చిన డిగ్రీ విద్యార్థి
బెంగళూరు: మొబైల్ ఫోన్ వ్యసనం ఓ యువకుడిని హంతకునిగా మార్చింది. ఎప్పుడూ ఫోనేనా, బుద్ధిగా చదువుకో, ఇంట్లో పనులు చేయవచ్చు కదా అని బుద్ధిమాటలు చెప్పిన తల్లిని అంతమొందించాడో తనయుడు. మొబైల్ మత్తులో ఏం చేస్తున్నాడో కూడా తెలియని క్రూరునిగా మారాడు. మండ్యలోని విద్యా నగరలో గత గురువారం ఇంట్లోనే ఒక మహిళ హత్యకు గురైంది. కత్తిపోట్లతో రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహం ఫోటోలు తీవ్ర కలకలం సృష్టించాయి. హతురాలిని శ్రీలక్ష్మి (45)గా గుర్తించారు. విచారణలో నేరం రట్టు ఇంత దారుణంగా ఎవరు చంపి ఉంటారని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమె కుమారుడు మను శర్మ (21)నే హంతకుడని శనివారం గుర్తించడంతో అందరూ నిశ్చేష్టులయ్యారు. తల్లి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో చాకుతో పొడిచి ఇంటి నుంచి వెళ్ళియాడు. పోలీసులు ఇంటికి వచ్చి హత్యాస్థలిని పరిశీలిస్తున్న సమయంలో తిరిగి వచ్చిన మను శర్మ ఏమీ తెలియనివాడిలా నటించాడు. పోలీసులు కుటుంబ సభ్యులను పిలిపించి విచారణ చేపట్టారు. విచారణలో దొరికిపోయిన మనుశర్మ తానే తల్లీని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. మధుసూదన్, శ్రీలక్ష్మి దంపతుల చిన్న కుమారుడు మను శర్మ బీఎస్సీ చివరి ఏడాది చదువుతున్నాడు. అతను ఎప్పుడూ మొబైల్ ఫోన్లో లీనమయ్యేవాడు. స్నేహితురాలితో గంటల కొద్దీ ఫోన్లో మాట్లాడేవాడు. ఇది మంచిది కాదు అని తల్లి మనుశర్మను మందలించేది. అతడు బయటకి వెళ్లకుండా కట్టడి చేసేది. గురువారం అతని కోసం స్నేహితుడు రాగా, బయటకు వెళ్ళవద్దని తల్లి హెచ్చరించింది. దీంతో తల్లీ కొడుకు మధ్య గొడవ మొదలైంది. ఆగ్రహంతో తల్లి మనుశర్మ తలపైన గట్టిగా కొట్టింది. దీంతో మనుశర్మ వంటగదిలోకి వెళ్ళి చాకు తీసుకొని వచ్చి తల్లి మీద దాడికి దిగాడు. కత్తితో విచ్చలవిడిగా పొడిచి వెళ్లిపోయాడు. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. హత్య జరిగిన కొంత సమయానికి భర్త మధుసూదన్, మరో కుమారుడు ఆదర్శ వచ్చి చూడగా శ్రీలక్ష్మి మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు పరిశీలన చేస్తున్న సమయంలో మను శర్మ వచ్చాడు. పోలీసుల విచారణలో చిక్కుముడి వీడింది. నిందితున్ని అరెస్టు చేసి జైలుకు తరలించారు. -
ఆ కుటుంబానికి కరోనా ఎలా సోకింది?
బెంగుళూరు : కరోనా వైరస్ ఎప్పుడు ఏ రూపంలో మనషులపై దాడి చేస్తుందనేది ఎవరికి అంతుచిక్కడం లేదు. మనం ప్రయాణం చేసే సమయంలో మన పక్క నుంచి వెళ్లే వారిలో ఎవరికి వైరస్ ఉందనేది తెలియదు. తాజాగా కర్ణాటకలోని మాండ్య జిల్లాకు చెందిన ఓ కుటుంబానికి కరోనా వైరస్ ఎలా సోకిందో తెలియడం లేదు. అసలు ఎవరి ద్వారా కరోనా సోకిందనేది మిస్టరీగా మారింది. వివరాలు.. మాండ్య జిల్లాకు చెందిన ఓ ఆటో రిక్షా డ్రైవర్ ముంబయిలో జీవనం కొనసాగిస్తున్నాడు. అతను గుండెపోటుతో ఇటీవలే మృతి చెందాడు. దీంతో అధికారుల అనుమతి తీసుకుని మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులు సొంత జిల్లా మాండ్యకు తరలించారు. మృతదేహంతో పాటు ఆరుగురు ప్రయాణించేందుకు అనుమతినిచ్చారు.(పోలీసుల సజీవ దహనానికి యత్నం) మార్గం మధ్యలో ఓ మహిళతో పాటు ఆమె కుమారుడికి వీరు లిఫ్ట్ ఇచ్చారు. అయితే డ్రైవర్ అంత్యక్రియలు ముగిసిన తర్వాత.. నిబంధనల ప్రకారం అతని కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆరుగురిలో ముగ్గురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అంతే కాదు.. మధ్యలో వాహనం ఎక్కిన మహిళకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. డ్రైవర్ కుమారుడు ఓ ప్రయివేటు బ్యాంకులో పని చేస్తున్నాడు. అతని ద్వారానే కుటుంబ సభ్యులకు కరోనా సోకి ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక మధ్యలో ఎక్కిన మహిళ ద్వారా వ్యాపించిందా? అనేది తేలాల్సి ఉంది. ఈ ఘటనపై మాండ్య డిప్యూటీ కమిషనర్ డాక్టర్ ఎంవీ వెంకటేశ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో మృతదేహం వెంట ఆరుగురికి ఎందుకు అనుమతిచ్చారని ముంబయి అధికారులను ఆయన ప్రశ్నించారు. వారికి కరోనా పరీక్షలు నిర్వహించకుండా.. కంటైన్మెంట్ జోన్ నుంచి ఎలా బయటకు ఎలా పంపిస్తారని అడిగారు. అంత్యక్రియలకు హాజరైన వారిలో ఎవరెవరికి కరోనా సోకిందో తెలియాల్సి ఉంది. కాగా అంత్యక్రియలకు హాజరైన వారంతా భయంతో వణికిపోతున్నారు. (17దాకా లాక్డౌన్.. సడలింపులివే..!) -
మా ఇంటికాడ కరోనా పరీక్షలా?
మండ్య : మండ్య నగరంలోని అంబేడ్కర్ భవనంలో విలేకరులకు నిర్వహిస్తున్న కరోనా వైద్య పరీక్షలను అడ్డుకోవడంతో పాటు విలేకరులపైన దాడి చేయడానికి ప్రయత్నం చేసిన ఎమ్మెల్సీ కుమారున్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా లాఠీచార్జీ చేసి చెదరగొట్టాల్సి వచ్చింది. విలేకరులకు కోవిడ్ పరీక్షలు చేయాలన్న ప్రభుత్వ ఆదేశం మేరకు శనివారం మండ్య నగరంలో జేడీఎస్ ఎమ్మెల్సీ శ్రీకంఠేగౌడ నివాసానికి దగ్గరిలోని అంబేద్కర్ భవనంలో వైద్య సిబ్బంది విలేకరులకు ఆరోగ్య పరీక్షలు చేయసాగారు. ఇంతలో ఎమ్మెల్సీ కొడుకు కృషిక్ గౌడ అక్కడి అనుచరులతో వచ్చి హల్చల్ ఆరంభించారు. ఇక్కడ కరోనా పరీక్షలు చేయరాదు, అందరూ వెళ్లిపోవాలని అని హెచ్చరించాడు. అతనికి సర్దిచెప్పడానికి వచ్చి విలేకరులను కొట్టడానికి యత్నించాడు. దీంతో పోలీసులు అతన్ని అక్కడి నుంచి తరలించి, అనుచరులపై లాఠీచార్జ్ చేశారు. కరోనా పరీక్షలకు అడ్డు తగిలారని ఎమ్మెల్సీ, అతని కొడుకు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. (సిక్కోలులో కరోనా ఎందుకొచ్చిందంటే..) -
పేగుబంధం 'అన్వేషణ'
పాత తరం చిత్రాల్లో అంటే 70, 80వ దశకంలో వచ్చిన చిత్రాలు ఎప్పుడైనా చూశారా?ఆ చిత్రాల్లో హీరోయిన్ లేదా హీరోలు చిన్నతనంలోనే తల్లిదండ్రుల నుంచి అనుకోని పరిస్థితుల్లో విడిపోవడం, కొన్నేళ్లఅనంతరం పెరిగి పెద్దవుతారు. అనంతరం అనుకోని ఘటనల ద్వారాఅసలైన తల్లితండ్రుల గురించి తెలిసి వారి కోసం అన్వేషిస్తూ ప్రయాణం మొదలుపెట్టడం. అచ్చం ఇటువంటి సంఘటనే మండ్యలో వెలుగు చూసింది. ఆ కథేంటో ఒకసారి తెలుసుకోవాలంటే మండ్యనుంచి స్వీడన్కు వెళ్లాల్సిందే. కర్ణాటక ,మండ్య: 1987వ సంవత్సరంలో మండ్య జిల్లా దేశహళ్లి గ్రామానికి చెందిన జయమ్మ, బోరేగౌడ దంపతులకు ఓ పాప జన్మించింది. ఏడేళ్ల అనంతరం అంటే 1994లో జయమ్మకు కేన్సర్ వ్యాధి రావడంతో చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. చికిత్స కోసం మొత్తం డబ్బులు ఖర్చు చేయాల్సి రావడంతో అసలే పేదరికంలో ఉన్న దంపతులకు కూతురును పెంచడం భారంగా మారింది. దీంతో ఇందిరానగర్లోనున్న ఓ అనాథశ్రమంలో కూతురును వదిలేసి వెళ్లిపోయారు .కొద్ది రోజులకు స్వీడన్ దేశానికి చెందిన ఓ జంట ఈ పాపను దత్తత తీసుకొని జూలిగా నామకరణం చేసి తమతో సాటు స్వీడన్కు తీసుకెళ్లి సొంత కూతురిలా పెంచి వివాహం సైతం చేశారు. కల పరమార్థం తెలిసి అయితే కొద్ది రోజులుగా ఎవరో తన కలలోకి వస్తుండడం, అందులో ఓ మహిళ కాలువలో దూకి ఆత్మహత్యకుచేసుకుంటున్నట్లు కనిపిస్తుండడంతో ఇదే విషయాన్ని పెంపుడు తల్లితండ్రులకు తెలిపింది. దీంతో జూలికి అసలు విషయం తెలపడంతో భర్త ఎరిక్తో కలసి కన్నవారి కోసం మండ్య జిల్లాలోని స్వగ్రామం దేశిహళ్లికి వచ్చి కన్నవారి కోసం వెతకడానికి నిర్ణయించుకుంది. కొద్దిరోజుల క్రితం దేశిహళ్లికి చేరుకొని తల్లిదండ్రుల కోసం గాలించింది. ఎన్నో ఆశలతో వచ్చిన జూలికి నిరాశే ఎదురైంది. జయమ్మ, బోరేగౌడల గురించి ఎవరూ వివరాలు చెప్పలేకపోయారు. అయినప్పటికీ తల్లితండ్రుల ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తానని, తప్పకుండా కన్నవారిని కలుసుకుంటానని నమ్మకం వెలిబుచ్చింది. -
ప్రియునితో కలిసి భర్తను చంపి.. ఆపై ఏఎస్సైతోనూ..!
సాక్షి, మండ్య: ప్రియునితో అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేసిన భార్య, ఆమె ప్రియున్ని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన మండ్య తాలూకాలోని రాజేనదొడ్డి గ్రామంలో వెలుగు చూసింది. హతున్ని టిప్పర్ డ్రైవర్గా పని చేస్తున్న రంగస్వామిగా గుర్తించారు. హత్య జరిగిన సుమారు మూడేళ్ల తరువాత మద్దూరు పోలీసులు ఛేదించడం విశేషం. ఏం జరిగిందంటే.. చామరాజ నగర జిల్లాలోని కొళ్లేగాల తాలూకాలోని పూజారి బావిదొడ్డి గ్రామానికి చెందిన రంగస్వామి, కొన్ని సంవత్సరాలుగా మద్దూరు తాలుకాలోని తోప్పనహళ్ళి భీమనచెరువు వద్ద రాళ్ళ క్వారీలో టిప్పర్ లారి డ్రైవర్గా పని చేస్తున్నాడు. దీంతో భీమనకెరె గ్రామానికి చెందిన రూపా అనే యువతితో పెళ్ళి జరిగింది. దాజెనగౌడన దొడ్డి గ్రామంలో నివాసం ఉంటున్న వీరికి ముగ్గురు పిల్లలు కూడ ఉన్నారు. ముద్దెగౌడ అనే వ్యక్తి కూడా రంగస్వామితో కలిసి టిప్పర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. రూపాతో ముద్దెగౌడకు పరిచయమై అక్రమ సంబంధం వరకు వెళ్ళింది. ఇది రంగస్వామికి తెలిసి భార్యను మందలించాడు. దాంతో ఆగ్రహానికి లోనైన రూపా ఎలాగైన తమ మద్య అడ్డుగా ఉన్న భర్తను హత్య చేయాలని నిర్ణయించుకుంది. (దారుణం: రూ.400 తిరిగి ఇవ్వాలని కోరితే) నిద్రిస్తుండగా దారుణ హత్య 2017 జూలై నెల 4వ తేదిన రాత్రి 10 గంటల సమయంలో రూపా, ముద్దెగౌడ కలిసి రంగస్వామి ఇంట్లో పడికొని ఉండటం చూసి కర్రతో కట్టిగా తలపైనకొట్టి హత్య చేయడం జరిగింది. అనంతరంమృత దేహాన్ని చందహళ్ళి దొడ్డి చెరువు వద్దకు తీసుకోని వెళ్ళిఅక్కడ మట్టి కోసం తవ్విన గుంతలో పడేసి మళ్ళి మట్టి కప్పి వేయడం జరిగింది. అనంతరం రూపా తన భర్త కనిపించకుండా పోయారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగస్వామి కుటుంబ సభ్యులు అతని కోసం గాలించినా ఫలితం లేకపోయింది. దీంతో రంగస్వామి సోదరి.. రూపా, ఆమె ప్రియునిపై అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఖాకీలు ఇద్దరిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం బయట పడింది. దాంతో మంగళవారం ఉదయం రూపా, ముద్దెగౌడను తీసుకుని రంగస్వామిని పాత పెట్టిన స్థలానికి వెళ్ళి మృత దేహాన్ని వెలికితీసి శవ పరిక్షలకు పంపించారు. (పండగ వేళ కిరాతకం..కిటికీలోంచి పెట్రోలు పోసి) రూపాతో ఏఎస్ఐ సంబంధం కేసులో మరో మలుపు కూడా ఉంది. రూపా తన భర్తను హత్య చేసిన విషయం బయటకు రాకుండా ఉండటం కోసం మద్దూరులో ఏఎస్ఐ సిద్ధరాజుతో స్నేహం పెంచుకుంది. అతనితో అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ తతంగం జిల్లా ఎస్పీకి తెలిసి సిద్దరాజు పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశించారు. కేసు లేకుండా చూస్తానని సిద్దరాజు శారీరకంగా వాడుకున్నట్లు బాధితురాలు తెలిపింది. -
నిఖిల్పై తీవ్రంగా పోరాడుతున్న సుమలత!
బెంగళూరు: కర్ణాటక లోక్సభ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం దిశగా సాగుతోంది. అధికార కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి గట్టి షాక్ ఇస్తూ.. కమలం పార్టీ రాష్ట్రంలో ఏకంగా 23 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కర్ణాకటలో 28 లోక్సభ స్థానాలు ఉండగా.. ఎవరూ ఊహించనిరీతిలో బీజేపీ అత్యధిక స్థానాలను సొంతం చేసుకునే దిశగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ కేవలం మూడు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. ఆ పార్టీ మిత్రపక్షమైన జేడీఎస్ ఒకే ఒక్క స్థానంలో లీడింగ్లో ఉంది. జేడీఎస్ ప్రధాన నేతలు, వారసులు సైతం వెనుకంజలో ఉండటం గమనార్హం. జేడీఎస్ అధినేత దేవెగౌడ మనవడు, సీఎం కరుణానిధి కొడుకు నిఖిల్ గౌడ మాండ్య నియోజకవర్గంలో ఎదురీదుతున్నారు. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ప్రముఖ నటి సుమలత ప్రస్తుతం 1200 ఓట్ల మెజారిటీతో స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. దివంగత కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ సతీమణి అయిన సుమలత భర్త మృతి నేపథ్యంలో ఇక్కడ బరిలోకి దిగారు. ఇక, బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రిజ్వన్ అర్షద్, బీజేపీ నుంచి పీసీ మోహన్ మధ్య నువ్వా-నేనా అన్నట్టుగా కౌంటింగ్ సాగుతోంది. -
దెబ్బకు శవాన్ని శ్మశానంలోనే వదిలి పారిపోయారు!
మండ్య : వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు చేస్తున్న సమయంలో తేనెటీగలు దాడి చేయడంతో పది మందికి పైగా గాయపడ్డ ఘటన శుక్రవారం శ్రీరంగపట్టణతాలూకా పీ.హళ్లి గ్రామంలో చోటు చేసుకుంది.గ్రామానికి చెందిన దొళ్లయ్య వయోభారంతో మృతి చెందడంతో భౌతిక కాయానికి అంత్యక్రియలు చేయడానికి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు గ్రామ శివార్లలోని స్మశానికి చేరుకున్నారు. ఈ సమయంలో అక్కడి చెట్టుపై ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేయడంతో దొళ్లయ్య భౌతిక కాయాన్ని అక్కడే వదిలేసి కుటుంబ సభ్యులు ,గ్రామస్థులు దూరంగా పారిపోయారు. అయినప్పటికీ వెంటబడ్డ తేనెటీగలు దాడి చేయడంతో పది మందికి గాయాలయ్యాయి. బాధితులను హుటాహుటిన మండ్య ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
కొంగుపట్టి అర్థిస్తున్నా: సుమలత అంబరీశ్
మండ్య : ‘ఈ నాలుగు వారాల ప్రచారాల్లో ఎన్నో అవమానాలు, అవహేళనలు, బెదిరింపులు ఎదుర్కొన్నా. వాటన్నింటిని మీతో పంచుకోవడానికి మీ ముందుకు వచ్చా. సీఎం కుమారస్వామి అంబరీశ్ మృతిని కూడా రాజకీయాలకు వాడుకుంటూ ఎన్నికల్లో విమర్శలు చేస్తున్నారు’ అని మండ్య స్వతంత్ర అభ్యర్థి సుమలత ఆరోపించారు. ఆమె మంగళవారం మండ్య పట్టణంలో నిర్వహించిన స్వాభిమాన సమ్మేళన ర్యాలీ, సభలో సుమలతతో పాటు సినీ హీరోలు యశ్,దర్శన్లు జేడీఎస్పై తీవ్రస్థాయిలో మాటల తూటాలు పేల్చారు. సీఎం కుమారస్వామి ఆనాడు భద్రతా సమస్యల వల్ల అంబరీష్ భౌతికకాయాన్ని మండ్యకు తీసుకురాకూడదు, 500 బస్సుల్లో అభిమానులను బెంగళూరుకు తీసుకెళ్దాం అంటే తానే వద్దు, మండ్యకు తీసుకు వెళ్లాలని పట్టుబట్టానన్నారు. అంబరీశ్కు శ్రద్ధాంజలి ఘటించే సమయంలో మీకు సోదరుడిగా జీవితాంతం తోడుగా ఉంటామని హామీ ఇచ్చిన మీరు ఇప్పుడు అదే అంబరీశ్ సమాధిపై మీ తనయుడి రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేయడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారంటూ ప్రశ్నించారు. అంబరీశ్ పోటీ చేసిన అన్ని ఎన్నికల్లోనూ అంబరీశ్ను ఓడించడానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత కుట్రలు చేశారంటూ పరోక్షంగా మంత్రి డీకే శివకుమార్పై విమర్శలు గుప్పించారు. తనకు మద్దతిచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలపై కక్షసాధింపునకు పాల్పడుతున్నాన్నారు. స్వాభిమానాన్ని గెలిపించండి మండ్య జిల్లా ప్రజలపై నమ్మకంతో ఎన్నికల్లో నిల్చున్నామని ఎన్నికల్లో మద్దతు తెలిపి స్వాభిమానాన్ని, మీపై పెట్టుకున్న నమ్మకాన్ని గెలిపించాలంటూ సుమలత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజాసేవకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు అంబరీశ్ లేరనే ధైర్యంతో ప్రేలాపనలు చేస్తున్నారంటూ విమర్శించారు. తనకు ఓటేసి గెలిపించాలని భావోద్వేగంతో కొంగుపట్టి అర్థించారు. ఈ కార్యక్రమంలో హీరోలు యశ్, దర్శన్, సుమలత తనయుడు అభిషేక్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ హీరోలు నా ఇంటి పిల్లలు: సుమలత అంబరీశ్
బెంగళూరు : ‘నేను మీ ఊరికి చెందిన హుచ్చేగౌడ కుటుంబం కోడలిని, అంబరీశ్ ధర్మపత్నిని, అభిషేక్కు తల్లిని. మండ్య జిల్లా మహిళగా జిల్లాకు వచ్చాను. ఇప్పుడు చెప్పండి సుమలత అనే నేను మండ్య గౌడను కాదా’అని సుమలత అంబరీశ్ ప్రశ్నించారు. మండ్య లోక్సభ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా ఆమె బుధవారం నామినేషన్ సమర్పించారు. అనంతరం బహిరంగ సభలో ఆవేశంగా ప్రసంగిస్తూ ప్రత్యర్థులపై ఘాటు విమర్శలు చేశారు. ‘అంబరీశ్ మరణం అనంతరం నాలుగు నెలలు ఇంటికే పరిమితమయ్యా. అంబరీశ్ మృతితో కలత చెందిన నాకు అభిమానులు ముఖ్యంగా మండ్య జిల్లా ప్రజలు కొండంత ధైర్యన్నిచ్చారు. ఇంతమంది అభిమానులు, నేతలు, కార్యకర్తల ప్రేమాభిమానాలు కాదనలేక కేవలం వారి కోసమే రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి నిర్ణయించుకున్నా. వారికోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నా. చివరి క్షణం వరకు అంబరీశ్ కాంగ్రెస్ నేతగానే ఉన్నారు. ఆ కారణంగానే లోక్సభ ఎన్నికల్లో టికెట్ కోసం కాంగ్రెస్ తలుపు తట్టాం. అయితే పొత్తు నెపంతో కాంగ్రెస్ టికెట్ తిరస్కరించింది. తప్పనిసరి పరిస్థితుల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నా’ అని ప్రకటించారు. దర్శన్, యశ్లు మా ఇంటి పిల్లలు శాండల్ఉడ్ హీరోలైన దర్శన్,యశ్లతో తమకు చాలా కాలంగా అనుబంధం ఉందని ఇద్దరు హీరోలు మా ఇంటి పిల్లలని సుమలత అన్నారు. వారిద్దరూ తమను తల్లితండ్రుల్లా భావిస్తారని ఈ ఉద్దేశంతోనే దర్శన్,యశ్లు తమ తరపున ప్రచారం చేయడానికి ఆసక్తి చూపారని, అందులో తప్పేంటని ప్రశ్నించారు.తమ తరపున ప్రచారం చేయడానికి ముందుకు వచ్చిన దర్శన్,యశ్లపై కొంతమంది సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేస్తుండడం తమను ఎంతగానో బాధిస్తోందన్నారు. తమకు అధికార దాహం లేదని ఒకవేళ అధికారమే పరమావధిగా పెట్టుకొని ఉంటే ఎమ్మెల్యే,మంత్రి పదవికి అంగీకరించేవాళ్లమని సుమలత అన్నారు. విమర్శలకు భయపడం: యశ్, దర్శన్ తమపై వస్తున్న విమర్శలు,బెదిరింపుల గురించి తాము పట్టించుకోమంటూ హీరో యశ్ తెలిపారు. మేమేమి పాకిస్తాన్ నుంచి రాలేదు, ఇక్కడే పుట్టాం, కావేరి నది నీళ్లు తాగి పెరిగామని అన్నారు. అంబరీశ్ ఇంటి పిల్లలుగా చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకున్నామని, అటువంటిది సుమలత అంబరీశ్ తరపున ప్రచారం చేయడం తమ కర్తవ్యమన్నారు. మండ్య జిల్లా ప్రజల గురించి, కన్నడ చిత్ర పరిశ్రమ గురించి తప్పుగా మాట్లాడితే సహించేది లేదన్నారు.. విమర్శలకు భయపడబోమని, ఎన్ని విమర్శలు,బెదిరింపులు వచ్చిన తగ్గేది లేదంటే హీరో దర్శన్ స్పష్టం చేశారు. ఎందుకమ్మా రాజకీయాలు అన్నా: అభిషేక్ జిల్లా ప్రజలపై ప్రేమతో తల్లి సుమలత ఎన్నికల్లో పోటీ చేయడానికి నిర్ణయించుకున్నారని తనయుడు అభిషేక్ తెలిపారు. రాజకీయాల్లోకి వెళితే ప్రత్యర్థుల దూషణలను అవసరమా అంటూ తమ తల్లిని ప్రశ్నించానన్నారు. అయితే ఇన్నేళ్ల పాటు మన కుటుంబాన్ని ఆదరించిన అభిమానులు, మండ్య జిల్లా ప్రజలకు సేవ చేయడానికి అన్నింటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తనతో చెప్పారన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత రాక్లైన్ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా భారీ భద్రత ఏర్పాటైంది. చాముండేశ్వరికి పూజలు మైసూరు : లోక్సభ ఎన్నికల్లో మండ్య నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నటి సు మలత అంబరీశ్ బుధవారం నామినేషన్కు ముందు చాముండిబెట్టపైనున్న చాముండేశ్వరిదేవి ముందు నామినేషన్ పత్రాలు ఉంచి పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..అంబరీశ్ కూడా ఎన్నికల్లో పోటీ చేసే ప్రతిసారి నామినేషన్ పత్రాలను అమ్మవారి ముందుంచి పూజలు నిర్వహించేవారని తెలిపారు. తానూ అదే విధంగా పూజలు చేసినట్లు తెలిపారు. ఎన్నికల గురించి తమకు ఏమాత్రం భయం లేదని నాకు తోడుగా అభిమానులు,మండ్య జిల్లా ప్రజలు ఉన్నారని అన్నారు. -
ఆ ప్రయత్నాలు ఎప్పటికీ సఫలం కావు: సుమలత
మండ్య: వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా తమను రెచ్చగొట్టి లబ్ది పొందాలని చేస్తున్న ప్రయత్నాలు ఎప్పటికీ సఫలం కావంటూ సుమలత తమపై తరచూ విమర్శలు చేస్తున్న జేడీఎస్ నేతలకు సమాధానమిచ్చారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... రాజకీయాల్లో ఉన్నపుడు ప్రజాప్రతినిధులు తాము మాట్లాడే ప్రతీ మాటను ఆచితూచి మాట్లాడాలని ఎన్నికల్లో గెలుపు కోసం ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తే వారికే చేటని అటువంటి వ్యాఖ్యలు వారి అసలు నైజాన్ని బహిర్గతం చేస్తాయన్నారు. ప్రత్యర్థులు ఎటువంటి విమర్శలు చేసినా అంబరీశ్ లెక్క చేసేవారు కాదని తాము కూడా విమర్శల విషయంలో అంబరీశ్ను అనుసరిస్తున్నామన్నారు. మహిళలతో సంస్కారవంతంగా నడుచుకోవడం భారతీయ సంస్కృతి, సంప్రదాయాలనే విషయాన్ని ప్రజాప్రతినిధులు గుర్తుంచుకోవాలంటూ ఘాటుగా స్పందించారు. చిత్రనటులు సుదీప్, దర్శన్, యశ్లు తమ కుటుంబానికి అత్యంత ఆత్మీయులని తమ కుటుంబం దుఃఖంలో ఉన్న సమయంలో ముగ్గురు తమకు తోడుగా నిలిచారన్నారు.. అంబి–తమ్మణ్ణ కుటుంబాల మధ్య మాటల యుద్ధం.. మండ్య నియోజకవర్గం నుంచి సుమలత–నిఖిల్ కుమారస్వామి దాదాపుగా ప్రత్యర్థులుగా బరిలో దిగనుండడం ఖాయంగా కనిపిస్తున్న నేపథ్యంలో అంబరీశ్–మంత్రి తమ్మణ్ణ కుటుంబాల మధ్య మాటల సమరం మొదలైంది. మంత్రి తమ్మణ్ణ తమపై చేసిన విమర్శలపై స్పందిస్తూ..రాజకీయాల్లో గెలుపోటములు అత్యంత సహజమని రాజకీయాల్లో ఉన్నపుడు రాజకీయపరమైన విమర్శలు చేయాలే కానీ వ్యక్తిగత విమర్శలు చేయడం మీకు గౌరవమనిపించుకోదంటూ అంబరీశ్ కుటుంబ సభ్యులు బదులిచ్చారు. మీకు వయసు పైబడిందనే విషయాన్ని గుర్తుంచుకొని సహనం పాటించాలంటూ తమ్మణ్ణకు ఘాటుగా బదులిచ్చారు. మనమంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్లమని దీన్ని దృష్టిలో పెట్టుకొని తమ్మణ్ణ ప్రవర్తించాలంటూ అంబరీశ్ తమ్ముడి కొడుకు అమర్ మంత్రి తమ్మణ్ణకు సూచించారు. ఎన్ని ఆరోపణలు చేసినా మండ్య జిల్లా ప్రజలు తమ వదిన సుమలతకే మద్దతుగా నిలవనున్నారంటూ ఫేస్బుక్లో స్పష్టం చేశారు. బీజేపీ నేతతో సుమలత సమావేశం.. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సుమలత గురువారం రాత్రి స్థానిక బీజేపీ నేత శివలింగయ్య ఇంట్లో శివలింగయ్యతో దాదాపు గంటసేపు సమావేశమై మంతనాలు జరిపారు. సుమలతకు కాంగ్రెస్ నుంచి టికెట్ ఇచ్చే విషయంలో సందిగ్థత నెలకోవడంతో సుమలత దాదాపుగా స్వతంత్ర అభ్యర్థిగా దిగడం ఖాయంగా కనినిస్తోంది. ఈ నేపథ్యంలో మండ్య నుంచి అభ్యర్థిని నిలపని బీజేపీ సు మలతకు మద్దతు ఇవ్వడానికి నిర్ణయించుకుంది. సుమలత అంగీకరిస్తే బీజేపీలోకి ఆహ్వానించి బీజేపీ తరపున మండ్య నుంచి అభ్యర్థిగా బరిలో దింపడానికి బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో సుమలత,స్థానిక బీజేపీ నేత శివలింగయ్య ఇంట్లో రహస్యంగా మంతనాలు జరపడం ఉత్కంఠ కలిగిస్తోంది. ఇక అంబరీశ్ ఉన్న సమయంలో ఇంటికి వెళ్లిన ఏఒక్కరికీ సుమలత కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదంటూ మంత్రి డీసీ తమ్మణ్ణ ఆరోపించిన నేపథ్యంలో సుమలత మద్దతుదారులు అంబరీశ్ కుటుంబంతో కలసి మంత్రి డీసీ తమ్మణ్ణ కలసి దిగిన ఫోటోలు షేర్ చేసి మంత్రి తమ్మణ్ణకు కౌంటర్ ఇచ్చారు. -
ప్రజల భరోసాతోనే పోటీకి వెళ్తా : సుమలత అంబరీష్
బెంగళూరు : లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి నిర్ణయించుకున్న తమకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉందో లేదో తెలియదని, పార్టీపై నమ్మకంతో కాకుండా, జిల్లా ప్రజలు తోడుగా ఉంటారనే పోటీ చేయడానికి ధైర్యం చేసినట్లు నటి సుమలత అంబరీశ్ తెలిపారు. బుధవారం మండ్య తాలూకా బేవినహళ్లి గ్రామంలో ఎన్నికల్లో పోటీపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో సుమలత మాట్లాడారు. ఎన్నికల్లో తోడుగా ఉంటామని జిల్లా ప్రజలు ఇచ్చే హామీ మేరకే తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. అంబరీశ్కు అందించిన విధంగానే తమకు కూడా జిల్లా ప్రజలు సహకారం అందించాలని కోరారు. మండ్య నుంచి అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారో కాంగ్రెస్ పార్టీ నుంచి స్పష్టమైన ప్రకటన విడుదలయ్యాక తమ నిర్ణయం ప్రకటిస్తామన్నారు. -
సైన్యంలో చేరతా అమర జవాన్ భార్య
కుమారుడు దేశసేవలో ఉన్నాడని గర్వించే తల్లిదండ్రులు, భర్త రాక కోసం మధురానుభూతులతో నిరీక్షించే సతీమణి గుండెల్లో ఇప్పుడు అంతులేని విషాదం తాండవిస్తోంది. కొద్దిరోజుల కిందటివరకు తమ మధ్యనే ఉన్న ఆత్మీయుడు మంచుకొండల నడుమ నుంచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం ఆ కుటుంబాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. నాలుగురోజుల నుంచి అన్నపానీయాలు లేక విలపిస్తూ మంచం పట్టారు. మండ్య: ‘నా భర్త స్వప్నాన్ని ఉగ్రవాదులు ధ్వంసం చేశారు. ఆయన కలను నెరవేర్చడానికి నేను సైన్యంలో చేరడానికి సిద్ధం. దేశ సేవ చేస్తా’ అని అమరవీరుడు గురు సతీమణి కళావతి ప్రకటించారు. పుల్వామా ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన సీఆర్పీఎఫ్ జవాను గురు (33) స్మృతులను తలుచుకొని తల్లిదండ్రులు, భార్య ఇప్పటికీ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సెలవుల్లో ఇంటికి వచ్చిన సమయంలో గురు తమతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకుని పదేపదే ఆవేదన చెందుతున్నారు. 14వ తేదీన మరణవార్త తెలిసిననాటి నుంచి తిండీ నిద్రకు దూరమై గురును స్మరిస్తున్నారు. పాకిస్థాన్ను నాశనం చేయాలి: తండ్రి హన్నయ్య గురు తండ్రి హన్నయ్య మాట్లాడుతూ.. గురు తన కుమారుడని చెప్పుకోవడానికి తమకు ఎంతో గర్వంగా ఉందన్నారు. గురుతో పాటు ఎంతోమంది భారత సైనికులను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులు, ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న పాకిస్థాన్ను సర్వనాశనం చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మనవడిని కూడా భారతసైన్యంలో చేర్పిస్తానని తెలిపారు. గురు భార్య కళావతి మాట్లాడుతూ.. తన భర్త మరో పదేళ్లపాటు సైన్యంలో సేవలు అందించాలని కలలు కనేవారన్నారు. అయితే ఉగ్రవాదులు ఆ కలను సర్వనాశనం చేశారని విలపించారు. భర్త కలను తాను నెరవేర్చుతానని, సైన్యంలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆమె ఆవేశంగా చెప్పారు. ఆస్పత్రిలో చికిత్స నాలుగు రోజులుగా దుఃఖిస్తూ అస్వస్థతకు గురైన ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురును కోల్పోవడంతో గుడిగెరె గ్రామంలో కూడా మౌనవాతావరణం నెలకొంది. గురుతో గడిపిన క్షణాలు తలుచుకొని గ్రామస్థులు, స్నేహితులు కన్నీటి పర్యతంమయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గురు కుటుంబ సభ్యులను ఆదివారం సీఆర్పీఎఫ్ కమాండెంట్ ప్రదీప్ పరామర్శించి భారత సైన్యం అందించిన వీరమరణ పత్రాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం గురు అంత్యక్రియలు నిర్వహించిన ప్రాంతాన్ని సందర్శించారు. పలువురు గురు తండ్రిని కలిసి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గురు కుటుంబానికి ఆర్థిక సహాయం పుల్వామాలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన గురు కుటుంబ సభ్యులను ఆదివారం ప్రముఖులతో పాటు ప్రజలు సాంవత్వన తెలిపి ఆర్థిక సహాయం అందించారు.గురు కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి డీసీ తమ్మణ్ణ కోడలు కవిత సంతోష్ రూ.25 వేల నగదు అందజేశారు. శ్రద్ధాంజలి, పరామర్శలు సరిపోవని, దొంగదెబ్బతో సైనికులను హత్య చేసిన ఉగ్రవాదులను అంతమొందించనపుడే సైనికుల ఆత్మకు శాంతి చేకూరుతుందని ఆమె అన్నారు. బెల్బాటం కన్నడ చిత్రం హీరో హీరోయిన్లు రిషభ్ శెట్టి, హరిప్రియ, డైరెక్టర్ సంతోష్కుమార్లు గురు కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.75వేల ఆర్థిక సహాయం అందించారు. ఆత్మాహుతికి సిద్ధం ఆత్మాహుతి దాడి చేసి భారత సైనికులను హత్య చేసిన ఉగ్రవాదులు,పాకిస్థాన్ సైనికులపై ప్రతీకారం తీర్చుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని అందుకు అదే తరహాలో ఆత్మాహుతి దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ చేతన్ అనే యువకుడు సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేసిన వీడియో వైరల్గా మారింది. సైనికులపై జరిగిన దాడిని జీర్ణించుకోలేకపోతున్నానని శత్రువలపై ప్రతీకారం తీర్చుకోవడానికి మనసు పరితపిస్తోందని వీడియోలో పేర్కొన్నాడు. -
అమర జవాన్ కుటుంబానికి సుమలత సాయం
-
అమర జవాన్ కుటుంబానికి సుమలత సాయం
ప్రముఖ నటి సుమలత అంబరీష్ పెద్ద మనసును చాటుకున్నారు. పుల్వామా ఉగ్రదాడిలో అమరుడైన కర్ణాటకలోని మండ్యకు చెందిన వీర జవాన్ గురు కోసం అర ఎకరం భూమిని ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ప్రస్తుతం తన కుమారుడి తొలి చిత్రం షూటింగ్ కోసం సుమలత మలేషియా వెళ్లారు. తొలుత గురు అంత్యక్రియలకు స్థలం కేటాయింపుల విషయంలో చిన్న సమస్య తలెత్తిందని తెలసుకున్న సుమలత తన కొడుకుతో కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్కడ అతని అంత్యక్రియలు నిర్వహించి, స్మారక చిహ్నాన్ని నిర్మించవచ్చని భావించారు. అయితే ఇంతలో రాష్ట్ర ప్రభుత్వం గురు అంత్యక్రియలను నిర్వహించింది. ఈ విషయం తెలుసుకున్న సుమలత తాను మలేషియా నుంచి తిరిగివచ్చిన అనంతరం.. ఈ అర ఎకరం భూమిని అమర జవాన్ గురు కుటుంబసభ్యులకు అందజేయనున్నట్టు తెలిపారు. మండ్య కోడలిగా ఈ గడ్డపై పుట్టిన వీర జవాన్ కోసం తన వంతు సాయం చేస్తున్నట్టు సుమలత పేర్కొన్నారు. -
పోటీ చేస్తే.. అక్కడి నుంచే: సుమలత అంబరీశ్
రాజకీయాల్లోకి వస్తారా?, రారా?, ఎన్నికల్లో పోటీ చేస్తారా, లేదా? అయితే ఎక్కడి నుంచి? ఇలా తలెత్తిన అనేక ప్రశ్నలకు సుమలత అంబరీశ్ సమాధానం ఇచ్చారు. తమ రాజకీయ ప్రవేశం మండ్య నుంచే కాంగ్రెస్ పార్టీ నుంచి జరుగుతుందని ఆమె తేటతెల్లం చేశారు. దీంతో మండ్య రాజకీయ ముఖచిత్రం మారిపోయే అవకాశముంది. బెంగళూరు: సమయం వస్తే మండ్య లోక్సభ నియోజకవర్గం నుంచే కాంగ్రెస్ తరపున అభ్యర్థిగా పోటీ చేసి రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని సుమలత అంబరీశ్ తెలిపారు. ఆదివారం కుమారుడు అభిషేక్తో కలసి నాగమంగళ తాలూకా ఆదిచుంచనగిరిలోని శ్రీక్షేత్రాన్ని సందర్శించుకొని కాలభైరేశ్వర స్వామి కి పూజలు నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. అంబరీశ్ దూరమైన విషాదం నుంచి తాము ఇంకా పూర్తిగా కోలుకోకముందే తమ గురించి రాజకీయ చర్చలు జరుగుతాయని ఊహించలేదన్నారు. అయితే మండ్య జిల్లా ప్రజలు, అభిమానుల ఒత్తిడి మేరకు రాజకీయపరమైన నిర్ణయం తీసుకోక తప్పడం లేదని, దీనిపై సన్నిహితులు, రాజకీయ సలహాదారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తాము ఎప్పుడు రాజకీయాల్లోకి ప్రవేశించినా మండ్య నుంచేనని ఆమె స్పష్టం చేశారు. తల్లి నిర్ణయానికి అభిషేక్ మద్దతు తాను నటించిన కొత్త చిత్రం అమర్ టీజర్ను ఈ నెల 14న విడుదల కానున్నట్లు సుమలత అంబరీశ్ కుమారుడు అభిషేక్ తెలిపారు. మొదటి చిత్రం అమర్తో పాటు మున్ముందు నటించే ప్రతీ చిత్రంలో కూడా తమ తండ్రి అంబరీశ్ తప్పకుండా ఉంటారన్నారు. రాజకీయాల్లో ప్రవేశించాలని తల్లి సుమలత తీసుకున్న నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నామని రాజకీయాల్లో మాత్రమే కాకుండా తమ చిత్రాల విషయంలో కూడా తల్లి సుమలత నిర్ణయాలు,ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ నిర్మాతలు, ప్రముఖులు పాల్గొన్నారు. -
సుమలత రాజకీయాల్లోకి వస్తారా?
మండ్య: తమ రాజకీయ ప్రవేశం మండ్య నుంచే కాంగ్రెస్ పార్టీ నుంచి జరుగుతుందని సుమలత అంబరీశ్ స్పష్టం చేశారు. సమయం వస్తే మండ్య లోక్సభ నియోజకవర్గం నుంచే కాంగ్రెస్ తరపున అభ్యర్థిగా పోటీ చేసి రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని ఆమె తెలిపారు. ఆదివారం కుమారుడు అభిషేక్తో కలసి నాగమంగళ తాలూకా ఆదిచుంచనగిరిలోని శ్రీక్షేత్రాన్ని సందర్శించుకొని కాలభైరేశ్వర స్వామి కి పూజలు నిర్వహించిన అనంతరం సుమలత మీడియాతో మాట్లాడారు. అంబరీశ్ దూరమైన విషాదం నుంచి తాము ఇంకా పూర్తిగా కోలుకోకముందే తమ గురించి రాజకీయ చర్చలు జరుగుతాయని ఊహించలేదన్నారు. అయితే మండ్య జిల్లా ప్రజలు, అభిమానుల ఒత్తిడి మేరకు రాజకీయపరమైన నిర్ణయం తీసుకోక తప్పడం లేదని, దీనిపై సన్నిహితులు, రాజకీయ సలహాదారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తాము ఎప్పుడు రాజకీయాల్లోకి ప్రవేశించినా మండ్య నుంచేనని ఆమె స్పష్టం చేశారు. తల్లి నిర్ణయానికి అభిషేక్ మద్దతు తాను నటించిన కొత్త చిత్రం అమర్ టీజర్ను ఈ నెల 14న విడుదల కానున్నట్లు సుమలత అంబరీశ్ కుమారుడు అభిషేక్ తెలిపారు. మొదటి చిత్రం అమర్తో పాటు మున్ముందు నటించే ప్రతీ చిత్రంలో కూడా తమ తండ్రి అంబరీశ్ తప్పకుండా ఉంటారన్నారు. రాజకీయాల్లో ప్రవేశించాలని తల్లి సుమలత తీసుకున్న నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నామని రాజకీయాల్లో మాత్రమే కాకుండా తమ చిత్రాల విషయంలో కూడా తల్లి సుమలత నిర్ణయాలు,ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని చెప్పారు. -
కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం
-
కాటేసిన పాము.. ముక్కలుగా నరికి..
కర్ణాటక / మండ్య: పొలంలో గడ్డిని కోస్తున్న రైతును అత్యంత విషపూరితమైన పాము కాటేయగా, ఆ రైతు ఆ పామును ముక్కలుగా నరికి చంపాడు, చికిత్స కోసం వస్తూ మార్గమధ్యలో తానూ ప్రాణాలు విడిచిన సంఘటన సోమవారం మండ్య జిల్లాలోని మళవళ్ళి తాలుకాలో ఉన్న యత్తంబాడి గ్రామంలోని మహాదేవమ్మ తోటలో చోటు చేసుకుంది. పాము కాటుకు మృతి చెందిన రైతు దొడ్డచెన్నిపుర గ్రామానికి చెందిన మాదేగౌడ కుమారుడు పుట్టమాదు (35). ఏం జరిగిందంటే : పుట్టమాదు వ్యవసాయంతో పాటు పట్టు పురుగులను పెంచుతున్నాడు. పట్టు పురుగులకు ఆహారం కోసం తమ ఊరు పక్కన ఉన్న తమ అక్క మహాదెవమ్మ తోటలో గడ్డి కోసుకొని రావడానికి వెళ్లాడు. రైతు గడ్డి కోస్తుండగా కాలిపై రక్తపింజర అనే విషపూరిత పాము కాటు వేసింది. పుట్టమాదు వెంటనే తన చేతిలో ఉన్న కత్తితో ఆ పామును ఆరు ముక్కలుగా నరికిచంపాడు. తన శరీరంలోకి విషం వెళ్ళకుండ కాలుపై భాగంలో దారంతో గట్టిగా కట్టాడు. అతని అరుపులు విన్న పక్కచేనుల్లోని రైతులు అతన్ని అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించాడు. రైతు మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. -
జాతీయ పక్షిగా కాకి!
సాక్షి, బెంగళూర్ : విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి బీజేపీపై విరుచుపడ్డారు. శనివారం మండ్యాలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వస్తే తన ప్రాణాలకు గ్యారెంటీ ఉండబోదన్న ప్రకాశ్ రాజ్.. కాకిని జాతీయ పక్షిగా ప్రకటించాలంటూ వ్యాఖ్యలు చేశారు. ‘బీజేపీ గనుక అధికారంలోకి వస్తే నన్ను ఏదో ఒకటి చేయటం మాత్రం ఖాయం. ఈ మధ్యే కలబురగిలో బీజేపీ నేతలు నాపై దాడికి యత్నించారు. నా కారుపై రాళ్లు రువ్వి బీభత్సం సృష్టించారు. ఇప్పుడే ఇలా ఉంటే రేపు అధికారంలోకి వచ్చాక నన్ను వదిలేస్తారా?. ప్రశ్నించటమే నా తప్పు అయితే ఇది ప్రజాస్వామిక దేశం ఎలా అవుతుంది?’ అని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. భారత్ను హిందూ దేశం అనటాన్ని తాను వ్యతిరేకిస్తానన్న ప్రకాశ్ రాజ్.. కాకిని జాతీయ పక్షిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ‘ హిందువులు ఎక్కువగా ఉన్నారని వాళ్లు(హిందూ అతివాద సంస్థలు) భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటిస్తున్నారు. మరి దేశంలో నెమళ్ల సంఖ్య కన్నా కాకులు కోకోల్లలుగా ఉన్నాయి. అలాంటప్పుడు కాకినే జాతీయ పక్షిగా ప్రకటించటమే ఉత్తమం!. కేవలం ఒక మతం ఆధారంగా దేశానికి ముద్ర వేయటం మూర్ఖత్వమే అవుతుంది’ అని ఆయన అన్నారు. కాగా, ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. -
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, తుమకూరు : కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా దేవుడి దర్శనం కోసం వెళుతుండగా కారు అదుపుతప్పి పల్టీలు కొట్టిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మృతులలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన తుమకూరు జిల్లా కుణిగల్ తాలూకాలో ఉన్న గవిమఠం సమిపంలో సోమవారం చోటు చేసుకుంది. చౌడనకుప్పె గ్రామానికి చెందిన ఒక కుటుంబం ఐదేళ్లుగా మండ్య నగరంలో నివాసం ఉంటున్నారు. వారు కొత్త కారు కొనుగోలుచేశారు. నూతన సంవత్సరం సందర్బంగా దైవ దర్శనంతో పాటు కారుకు పూజ చేయించేందుకు సోమవారం ఉదయం కొరటిగెరె తాలూకాలో ఉన్న గురవనహళ్ళిలోని మహాలక్ష్మి ఆలయానికి వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. గవిమఠం సమీపంలో రోడ్డుపై చిన్నపాప అడ్డంగా రావడంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దాంతో కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న సిద్దూజీరావు(60), ఉషాబాయి(35) కీర్తన(7) హితేష్(3) భువన(16) అక్కడికక్కడే మృతిచెందారు. హరీష్రావు, సతీష్, నవీన్, అశ్విని తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రులను బెంగుళూరు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కుణిగల్ ఎస్ఐ పుట్టెగౌడ, పోలీసు సిబ్బంది సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనలో కారుకు అడ్డంగా వచ్చిన చిన్నారి కూడా తీవ్రంగా గాయపడింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఫ్యామిలీ రెస్టారెంట్ ముసుగులో వ్యభిచారం
మండ్య(కర్ణాటక) : ఫ్యామిలీ రెస్టారెంట్ ముసుగులో హైటెక్ వేశ్యావాటిక నిర్వహిస్తున్న కేంద్రంపై పోలీసులు దాడి చేసి 22 మందిని అరెస్టు చేశారు. మండ్య జిల్లా శ్రీరంగపట్టణం తాలూకా నగువనహళ్లి గేట్ వద్ద మైసూరు, బెంగళూరు జాతీయ రహదారిలో మార్గా ఫ్యామిలీ రెస్టారెంట్ ఉంది. దీని కింద సొరంగం తరహాలో గుహ ఏర్పాటు చేసి కోల్కతా, ముంబై, బంగ్లాదేశ్కు చెందిన యువతులతో ఇక్కడ వేశ్యావాటిక నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారంతో జిల్లా ఎస్పీ జి.రాధిక నేతృత్వంలో పోలీసులు ఆదివారం ఆ హోటల్పై దాడి చేసి 22 మంది విటులను అరెస్టు చేశారు. వ్యభిచార కూపంలో చిక్కుకుపోయిన యువతులకు విముక్తి కల్పించారు. వీరి నుంచి ఐదు బైక్లు, కారు, ఆటో స్వాధీనం చేసుకున్నారు. -
ప్రేమ పేరుతో వంచన..
- గర్భం దాల్చిన యువతి.. విషయాన్ని దాచిపెట్టిన వైనం -మరో యువకుడితో పెళ్లి చేసిన తల్లిదండ్రులు -వరుడు నిలదీయడంతో వెలుగులోకి వచ్చిన వంచన మండ్య : ప్రేమ, పెళ్లి పేరుతో యువతిని వంచించిన యువకుడు ఆమెకు శారీరకంగా దగ్గరయ్యాడు. ఆమె గర్భం దాల్చడంతో ముఖం చాటేశాడు. అయితే బాధితురాలు తనకు జరిగిన అన్యాయాన్ని బయటకు చెప్పుకోలేకపోయింది. ఈ విషయం తెలియని తల్లిదండ్రులు ఆ యువతికి ఇటీవల ఓ యువకుడితో వివాహం చేయగా.. వంచన విషయం వెలుగు చూసింది. ఈ ఘటన కర్నాటకలోని మాండ్య జిల్లా నాగమంగళ గ్రామీణ పోలిస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. నాగమంగళ తాలూకాలోని బిండేనహళ్లి గ్రామానికి చెందిన యువతికి మండ్య తాలూకాలోని దొడ్డగరుడనహళ్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. దీంతో ఇద్దరూ సన్నిహితంగా మెలిగారు. త్వరలోనే పెళ్లి చేసుకుంటానని చంద్రశేఖర్ ఆ యువతికి హామీ ఇచ్చాడు. దీంతో శారీరకంగా ఒక్కటయ్యారు. ఫలితంగా ఆ యువతి గర్భం దాల్చింది. తనను పెళ్లి చేసుకోవాలని యువతి కోరడంతో ప్రియుడు ముఖం చాటేశాడు. ఈ విషయాన్ని ఆ యువతి బయట పెట్టలేకపోయింది. మరో వైపు తల్లిదండ్రులు ఆ యువతికి తాలూకాలోని కసళగెరె గ్రామానికి చెందిన యువకుడి(30)తో ఈ నెల 8న ఆదిచుంచనçగిరిలో పెళ్లి జరిపించారు. యువతిలో వచ్చిన శారీరక మార్పులపై వరుడు, బంధువులు ఆరా తీయగా ఎనిమిది నెలల గర్భవతిగా తేలింది. చంద్రశేఖర్ అనే వ్యక్తి తనను వంచించాడని యువతి పేర్కొనడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు..చంద్రశేఖర్ కోసం గాలింపు చేపట్టారు. -
వింత మొక్కు.. ఆపై తీర్థంలా మూత్రం!
మండ్య: మగబిడ్డ పుడితే డబ్బు బంగారం సమర్పణ, అన్నదానం ఇలా రకరకాలుగా మొక్కులు తీర్చుకోవడం తెలుసు. కానీ కర్ణాటకలోని మండ్య జిల్లా పాండవపుర తాలూకాలోని డింక గ్రామంలో ఇది వెరైటీగా మొక్కు తీర్చుకున్నారు. మొక్కు ద్వారా పుట్టిన మగ బిడ్డకు 5-10 ఏళ్ల వయసులో గ్రామంలో ఆంజనేయ స్వామి పండగ సందర్భంగా నగ్నంగా నిచ్చైన పైన కుర్చోబెట్టి గ్రామంలో ఊరేగింపు జరిపారు. ఆ సమయంలో ఇతన్ని బాల హనుమంతుగా స్తుతిస్తారు. బాలుడికి దిగంబరంగా ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి వంద మీటర్ల దూరంలోని రంగమంటపం వరకు నిచ్చెనపైన కుర్చోబెట్టి ఊరేగింపుగా తీసుకొచ్చారు. అక్కడ జనం నృత్యాలు చేస్తూ బాలుని కోసం ఎదురుచూస్తున్నారు. బాలుడు రాగానే అతని మూత్రాన్ని సేకరించి తీర్థం మాదిరిగా తమపై చల్లుకున్నారు. దీనివల్ల తమకూ మగబిడ్డ పుడతాడనేది వారి విశ్వాసం. ఈ సందర్భంగా గ్రామంలో వర్షాలు ఎలా పడతాయి, పంటలెలా పండుతాయన్న దానిపై బాల హనుమంతుడు భవిష్యవాణి వినిపించాడు. సుమారు 200 ఏళ్ల నుంచీ ఈ సంప్రదాయం ఉంది. దీనికే నిచ్చెన హనుంతు మొక్కు అనే పేరు కూడా ఉంది. -
వా‘నరమేధం’
► పాండవపుర వద్ద 30 కోతుల హత్య మండ్య: అమాయకత్వం, అల్లరి కలగలిపిన చేష్టలతో మనుషులకు ఆనందాన్ని పంచే కోతులపై మృగం లాంటి మనుషులెవరో మారణహోమానికి పాల్పడ్డారు. గుర్తు తెలియని దుండగులు వాటిని చంపి పడేసిన ఘటన ఆదివారం మండ్య జిల్లాలోని పాండవపుర తాలూకాలో జరిగింది. తాలూకాలోని పట్టణగిరి గ్రామ శివార్లలోనున్న కణవే బోరప్ప దేవాలయంలో ఆదివారం గ్రామస్థులు కొంతమంది పూజలు నిర్వహించడానికి వెళ్లగా, దేవాలయ పక్కనున్న ఖాళీ ప్రదేశంలో సుమారు 30 కోతులు విగతజీవులుగా పడి ఉండడాన్ని గమనించారు. వెంటనే అటవీశాఖాధికారులకు సమాచారం అందించగా అక్కడికి చేరుకున్న అటవీశాఖాధికారులు కోతులను ఎవరు హత్య చేశారో, ఎందుకు చేశారో విచారణ చేస్తామంటూ అక్కడి నుంచి వెనుదిరిగినట్లు గ్రామస్థులు తెలిపారు. దీంతో కోతులను అలాగే వదిలివెళ్లడానికి మనసొప్పని గ్రామస్థులు గుడి ఎదురుగా గొయ్యిని తవ్వి శాస్త్రోక్తంగా కోతులకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. పంటల మీద, ఇళ్ల మీద దాడిచేస్తున్నాయని ఎవరైనా తిండిలో పురుగుల మందు పెట్టి చంపి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. బాధ్యులను గుర్తించి శిక్షించాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. -
బాలికపై పెదనాన్న దాష్టీకం
► ఐదు నెలలుగా అత్యాచారం ► గర్భం దాల్చిన వైనం ► కడుపులోనే శిశువు మృతి మండ్య : ఓ బాలికపై పెదనాన్నే అత్యాచారం చేశాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. ఈ ఘటన కర్ణాటకలోని మండ్య జిల్లా మళవళ్లి తాలూకా హలగూరులో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. హలగూరు గ్రామానికి చెందిన రామన్న(50), అతని తమ్ముడు పక్కపక్క ఇళ్లలో నివాసముంటున్నారు. ఈ క్రమంలో తమ్ముడి కుమార్తె (14)పై రామన్న కన్నేశాడు. మాయమాటలతో లోబర్చుకున్నాడు. ఐదు నెలలుగా అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. గురువారం సాయంత్రం బాలికకు కడుపు నొప్పి రావడంతో తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుడు పరీక్షించి బాలిక ఐదు నెలల గర్భిణీ అని, గర్భంలోనే శిశువు మృతి చెందిందని చెప్పారు. దీంతో వారు నిర్ఘాంతపోయారు. ఆ తర్వాత బాలికను మెరుగైన చికిత్స కోసం మండ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (మిమ్స్)కు తరలించారు. సమాచారం అందుకున్న హలగూరు పోలీసులు ఆస్పత్రికి చేరుకొని బాలిక నుంచి వివరాలు సేకరించారు. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. -
దళితుడిని పెళ్లాడిందని మోనికను చంపేశారు!
మాండ్యా: కర్ణాటకలో తాజాగా పరువు హత్య వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దళితుడిని పెళ్లి చేసుకుందన్న కారణంతో 19 ఏళ్ల అమ్మాయిని సొంత కుటుంబసభ్యులే కిరాతకంగా చంపేశారు. బాధితురాలిని మోనికగా గుర్తించారు. కర్ణాటక మాండ్యా జిల్లాలో శనివారం రాత్రి ఆమె పంటపొలాల్లో ఉరితాడుకు వేలాడుతూ కనిపించింది. ఈ వ్యవహారం పోలీసులకు తెలియకూడదనే ఉద్దేశంతో ఆదివారం ఉదయమే గుట్టుచప్పుడు కాకుండా ఆమె దహన సంస్కారాలు నిర్వహించారు. మోనిక కొన్నిరోజుల కిందట తనను ప్రేమించిన దళిత యువకుడితో ఇంటి నుంచి పారిపోయింది. ఆమెను గుర్తించిన కుటుంబసభ్యులు ఇంటికి తీసుకువచ్చారు. ఆ తర్వాత ఆమెను భయపెట్టి ఆత్మహత్య లేఖ రాయించారని, ఆ తర్వాత బలవంతంగా ఆమెకు ఉరివేసి చంపేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలి తండ్రిని, అంకుల్ని పోలీసులు అరెస్టు చేశారు. గత నెలలో తమిళనాడులో పట్టపగలే శంకర్ అనే 21 ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థిని దారుణంగా చంపేసిన చంపేసిన సంగతి తెలిసిందే. దళిత యువకుడైన శంకర్ అగ్రకులం అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో ఆమె కుటుంబసభ్యులు అతికిరాతకంగా ఈ పరువు హత్యకు పాల్పడ్డారు. -
సెల్ఫీ సరదా ప్రాణం తీసింది !
♦ కాలువలో సెల్ఫీ సుకుంటుండగా నీటి ఉధృతికి ♦ ముగ్గురు హౌస్ సర్జన్ల మృతి ♦ సురక్షితంగా బయటపడ్డ మరో ఇద్దరు మండ్య: సెల్ఫీ సరదా ముగ్గురి ప్రాణం తీసింది. విహార యాత్రకు వచ్చిన హౌస్ సర్జన్లలో ముగ్గురు నీటిలో కొట్టుకుపోయి మృతి చెందిన ఘటన కర్ణాటకలోని మండ్యకు 20 కిలోమీటర్ల దూరంలో చోటు చేసుకుంది. నీటి ప్రవాహం ఉన్న కాలువలోకి దిగి సెల్ఫీ తీసుకుంటుండగా ఒక్కసారిగా నీటి ఉధృతి పెరగడంతో ముగ్గురు భావి డాక్టర్లు మృతి చెందారు. వివరాలు... బెగళూరుకు చెందిన శృతి, జీవన్, మైసూరుకు చెందిన గౌతమ్ పటేల్, సింధు, తుమకూరుకు చెందిన గిరీష్లు మండ్యలోని వైద్య కళాశాలలో వైద్య విద్య పూర్తి చేశారు. ఇటీవలే కెరెగోడలోని ప్రభుత్వ ప్రాథమిక వైద్య కేంద్రంలో ‘హౌస్సర్జన్’లుగా శిక్షణలో ఉన్నారు. శిక్షణ పూర్తి కావస్తున్న నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఈ ఐదుగురూ మండ్య తాలూకాలోని హులివాన గ్రామ సమీపంలోని విశ్వేశ్వరయ్య కాలువ వద్దకు ఔటింగ్కి వెళ్లారు. అక్కడ సెల్ఫీ తీసుకుంటుండగా ఉన్నపళంగా ప్రవాహ వేగం పెరిగింది. నీటి ఉధృతికి ఐదుగురు కాలువలోకి జారి కొట్టుకుపోయారు. బెంగళూరుకు చెందిన శృతి, జీవన్తో పాటు తుమకూరుకు చెందిన గిరీష్లు మృతి చెందగా, మైసూరుకు చెందిన గౌతమ్ పటేల్, సింధులు సురక్షితంగా బయటపడి విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శృతి, జీవన్ మృతదేహాలు శుక్రవారం రాత్రి సమయానికి కాలువలో నుంచి బయటికి తీయగలిగారు. గిరీష్ కోసం గాలించినా ఫలితం లేకపోయింది. శనివారం ఉదయం పోలీసులు 15 మంది గజ ఈతగాళ్లను రంగంలోకి దించి స్థానికుల సహాయంతో గాలింపు చేపట్టగా మధ్యాహ్నానికి గిరీష్ మృతదేహం లభ్యమైంది. శృతి, జీవన్ల మృతదేహాలకు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్మార్టమ్ నిర్వహించిన అనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
రమ్యను దెబ్బతీసిన దూకుడుతనం
బెంగళూరు : మండ్య నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మళ్లీ పోటీకి దిగిన నటి రమ్య అనూహ్యంగా ఓటమిని చవి చూశారు. శాసనసభ ఎన్నికల్లో తన తల్లికి కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించి విఫలమైన ఆమె గత ఏడాది ఆగస్టులో జరిగిన ఉప ఎన్నికలోవిజయం సాధించారు. ఈ ఎనిమిది నెలల కాలంలో సొంత పార్టీలోనే వ్యతిరేకతను మూట కట్టుకున్నారు. ఆమె వ్యవహార శైలి, దూకుడుతనాన్ని కార్యకర్తలు సహించలేక పోయారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి, నటుడు అంబరీశ్ కూడా ఆమె వైఖరిని నొచ్చుకున్నారు. చికిత్స కోసం ఆయన సింగపూర్లో చాలా రోజులు ఉండిపోవడం కూడా రమ్యకు నష్టంగా పరిణమించింది. తాను గతంలో ఎంపీగా ఎన్నికైనా ఆరు నెలలు మాత్రమే పదవీ కాలం ఉండటంతో ప్రజల సమస్యలను పరిష్కారానికి సమయం లేకపోయానని ఈ ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదిస్తే అభివృద్ధికి కృషి చేస్తానని రమ్య చెప్పినా ఓటర్లు మాత్రం ఆమె హామీలను విశ్వసించలేదు. దాంతో రమ్య ఎంత త్వరగా ప్రచారంలోకి వచ్చిందో అంతే త్వరగా ఓటర్ల నుంచి తిరస్కరణకు గురయ్యింది. దాంతో గతంలో నటనకు స్వస్తి చెబుతానని ప్రకటించిన ఆమె పరాజయంతో మళ్లీ వెండితెరపై దృష్టి పెడుతుందేమో చూడాలి. -
చిక్కమ్మదేవీ.... ఆశీర్వదించమ్మా...
మాండ్య : మండ్య ఎంపీ, ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి రమ్య ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తాలూకాలోని పుట్టకొప్పలు గ్రామంలో జరిగిన చిక్కమ్మదేవి ఆలయానికి వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రచారాన్ని ప్రారంభించారు. తాను గతంలో ఎంపీగా ఎన్నికైనా ఆరు నెలలు మాత్రమే పదవీ కాలం ఉండటంతో ప్రజల సమస్యలను పరిష్కారానికి సమయం లేకపోయిందన్నారు. ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదిస్తే అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. గ్రామంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, వాటికి మరమ్మతులు చేయించాలని గ్రామస్తులు ఈ సందర్భంగా రమ్యను కోరారు. -
పాదరక్షలు ఉచితం!
అతి చిన్న వయసులోనే పార్లమెంట్ సభ్యురాలై, భేష్ అనిపించుకున్నారు రమ్య అలియాస్ దివ్యస్పందన. కర్ణాటకలోని మాంద్యా నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో నిలబడి, గెలిచారామె. మాండ్యా ప్రజలు తనపట్ల ఆదరాభిమానాలు కనబర్చి, ఎంపీని చేసినందుకు రమ్య వారికోసం ఏదైనా చేయాలనుకున్నారు. మాంద్యా ప్రజలకు వీలైనంతవరకు అందుబాటులో ఉండాలని, వారి అభివృద్ధి కోసం పాటుపడాలని రమ్య బలంగా నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే ఈ నియోజకవర్గానికి సంబంధించిన పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు ఉచితంగా పాదరక్షలు అందేలా చేశారు. ఓ ప్రముఖ షూ బ్రాండ్కి ప్రచారకర్తగా వ్యవహరించారామె. ఆ ఉత్పత్తిదారులతో తనకు పారితోషికం వద్దని, అందుకు బదులుగా మాంద్యా పాఠశాలలకు చెందిన పిల్లలకు ఉచితంగా స్కూల్ షూస్ ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారామె. ఇలా చేయడం చాలా ఆనందంగా ఉందని, ముందు ముందు ప్రజలకు బోల్డన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని రమ్య తెలిపారు. -
బెంగళూరు రూరల్, మాండ్య స్థానాలు కాంగ్రెస్ సొంతం
కర్ణాటకలోని బెంగళూరు రూరల్, మాండ్య లోక్సభ నియోజక వర్గాలు అధికార కాంగ్రెస్ పార్టీ సొంతమైనాయి. బెంగళూరు రూరల్ నియోజకవర్గంలో కాంగ్రెస్పార్టీ అభ్యర్థి డి.కే. సురేశ్ సమీప ప్రత్యర్థి, మాజీ కర్ణాటక సీఎం కుమారస్వామి భార్య అనిత కుమార స్వామిపై లక్షా 37 వేల ఓట్ల అధిక్యంతో గెలుపొందారు. అలాగే మాండ్యలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి, కన్నడ సినీ నటీ రమ్య తన సమీప ప్రత్యర్థి జనతాదళ్ (ఎస్) అభ్యర్థి సీఎస్ పుట్టరాజుపై 67 వేల ఓట్ల అధిక్యంతో విజయం సాధించారు. కాగా గతంలో బెంగళూరు రూరల్ నియోజకవర్గం నుంచి కుమార స్వామి, మాండ్యా నుంచి చెలువరాయస్వామి గెలుపొందారు. అయితే ఈ ఏడాది మేలో ఆ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో వారిరువురు సభ్యులుగా ఎన్నికయ్యారు. దాంతో వారు అయా పార్లమెంట్ స్థానాలకు రాజీనామా చేశారు. దాంతో ఆ రెండు నియోజకవర్గాలకు ఎన్నికల సంఘం బుధవారం ఎన్నికలు నిర్వహించాయి. ఉప ఎన్నికల్లో పోలైన ఓట్లను శనివారం ఇక్కడ లెక్కించారు. అనంతరం ఉన్నతాధికారులు ఫలితాలను ఇక్కడ వెల్లడించారు. కాగా ఆ రెండు నియోజక వర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని తాము మందే ఊహించామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య శనివారం వెల్లడించారు. ఆ ఉప ఎన్నికల్ల ఓడింది జేడీ ఎస్ మాత్రమే కాదని బీజేపీ, కేజీపీలు కూడా అని సిద్దరామయ్య ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.