Mekathoti Sucharita
-
అవన్నీ అవాస్తవాలే.. ఆ వార్తలు నమ్మొద్దు: సుచరిత
తాడికొండ: మాజీ సీఎం వైఎస్ జగన్తోనే చివరి వరకు తమ ప్రయాణం కొనసాగుతుందని మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత, విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి మేకతోటి దయాసాగర్ తెలిపారు. కొన్ని మీడియా ఛానెళ్లలో తమపై వస్తున్న ఊహాగానాలపై వారు స్పందించారు. అవన్నీ అవాస్తవమన్నారు.గతంలో కూడా తాము టీడీపీలో చేరుతున్నట్లు ప్రచారం జరిగిందని, అప్పుడే తాము వైఎస్సార్సీపీలోనే కొనసాగుతామని స్పష్టం చేశామన్నారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చిన తాను ఆయన మరణానంతరం వైఎస్సార్సీపీలో చేరి నాటి నుంచి నేటి వరకు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా కొనసాగుతున్నానని తెలిపారు. -
ఆ ఒక్క అబద్ధం ఆడుంటే జగనన్న 2014 లోనే సీఎం అయ్యేవాడు కానీ..
-
ఎవరు తప్పు చేసినా ఇంటెలిజెన్స్ రిపోర్టు ఉంటుంది: సుచరిత
సాక్షి, గుంటూరు: పార్టీ మారుతున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వదంతులపై మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఇదే క్రమంలో తప్పుడు ప్రచారాలపై సీరియస్ కామెంట్స్ చేశారు. కాగా, సుచరిత గురువారం గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను పార్టీ మారుతున్నట్టు ప్రచారం చేస్తున్నారు. పార్టీ మారే ఉద్దేశం నాకు లేదు. పార్టీ మారితే నేను ఇంటికే పరిమితమవుతాను. నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే ఉంటాను. ఎక్కడి టికెట్ ఇస్తే అక్కడి నుంచే పోటీ చేస్తాను. ఎవరు తప్పు చేసినా ఇంటెలిజెన్స్ రిపోర్టు ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ పథకాలు అందిస్తున్న పార్టీ వైఎస్సార్సీపీ. విద్యావ్యవస్థలో మార్పులు తీసుకువచ్చి.. సీఎం జగనన్న ప్రభుత్వం అందరికీ విద్య అందిస్తోంది. ప్రజల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మద్దతు ఉంది. గడప గడపకు వెళ్తే ప్రజలు ఎంతో ఆనందంతో ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారు’ అంటూ కామెంట్స్ చేశారు. -
రాజకీయాల్లో ఉన్నంత వరకూ సీఎం జగన్ వెంటే..
పెదనందిపాడు/గుంటూరు రూరల్: ‘నాడు వైఎస్సార్ భిక్షతోనే రాజకీయాల్లోకొచ్చి ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా గెలిచాను. ఆయన మరణానంతరం ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్థాపించిన వైఎస్సార్సీపీలో చేరిన మొట్టమొదటి వ్యక్తిని నేనే’ అని మాజీ హోం మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత చెప్పారు. గుంటూరు జిల్లా నాగులపాడు వ్యవసాయ మార్కెట్ యార్డు అవరణలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ తాను పార్టీ మారుతున్నట్టు చేస్తున్న ప్రచారాలు అవాస్తవమన్నారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు వైఎస్సార్సీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే ఉంటానని స్పష్టం చేశారు. తనపై కొన్ని మీడియా చానళ్లు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయని, ఏమైనా సందేహాలుంటే తనను సంప్రదించాలని, అలా కాకుండా అవాస్తవాలను ప్రచారం చేస్తే ఎలా.. అంటూ అసహనం వ్యక్తం చేశారు. పార్టీ మారే ఆలోచనే లేదని, దుష్ప్రచారాలను మానుకోవాలంటూ ఆయా చానళ్లకు హితవు పలికారు. ‘మా ప్రతి అడుగూ జగనన్నతోనే’.. వైఎస్సార్ ఆశయాలను అమలు చేస్తున్న జననేత సీఎం జగనన్నతోనే మా ప్రతి అడుగూ ఉంటుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మేకతోటి సుచరిత భర్త, ఇన్కంటాక్స్ మాజీ కమిషనర్ మేకతోటి దయాసాగర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. కొందరు కావాలనే దుష్ప్రచారాలు చేస్తున్నారని అందులో వాస్తవం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను స్వచ్ఛంద పదవీ విరమణ చేసి ఇంట్లోనే ఉన్నానని, దానిపై కొందరు అసత్య ప్రచారాలు చేస్తూ సోషల్ మీడియా, ఇతర పద్ధతులు ద్వారా రాజకీయాల్లోకి వస్తున్నారు.. పార్టీ మారుతున్నారు.. అంటూ ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. కేంద్ర సర్వీస్లో ఉద్యోగిగా పనిచేసిన తనకు ఏ పార్టీలోనూ సభ్యత్వం ఉండే అవకాశాలు లేవన్నారు. -
గౌతమ్రెడ్డి మరణాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాం
-
‘ఉద్యోగులకు మేలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది’
గుంటూరు: ఉద్యోగుల సమస్యలు చర్చల ద్వారానే పరిష్కారం అవుతాయని హోంమంత్రి సుచరిత స్పష్టం చేశారు. తాము చర్చలకు అవకాశం ఇవ్వడం లేదనేది అబద్ధమని, ఉద్యోగులు సహకరించాలని సీఎం వైఎస్ జగన్ చెప్పిన విషయాన్ని సుచరిత గుర్తుచేశారు. జిన్నా టవర్ వద్ద సర్వమత ప్రార్థనలు చేసిన సుచరిత.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘కమిటీ కూడా వేశాం. ఉద్యోగులకు మేలు చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉంది. చర్చలకు సహకరించండి’ అని పేర్కొన్నారు. -
మహిళలపై నేరాల్లో.. ఎవరినీ ఉపేక్షించబోం
గుంటూరు రూరల్: విజయవాడలో టీడీపీ నాయకుడు వినోద్ జైన్ లైంగిక వేధింపులకు బలైన 14 ఏళ్ల చిన్నారి ఘటన చాలా బాధాకరమని హోంమంత్రి మేకతోటి సుచరిత తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఘటనలో నిందితుడైన టీడీపీ నాయకుడు వినోద్ జైన్ను వెంటనే అరెస్టు చేశామన్నారు. సీఎం జగన్ పోలీసు శాఖకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి, ఏ కేసులో అయినా పారదర్శకంగా విచారణ జరపి, నేరస్తులకు శిక్షపడేలా చేయాలని ఆదేశాలు ఇచ్చారన్నారు. మహిళల రక్షణ, భద్రత విషయంలో ముఖ్యమంత్రి పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారన్నారు. మహిళలపై నేరాల ఘటనల్లో ఎవరినీ ఉపేక్షించబోమని ఆమె హెచ్చరించారు. బాలిక బలవన్మరణం కేసులో 54 ఏళ్ల వ్యక్తి ఇలా దారుణంగా ప్రవర్తించడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. బాలిక తన బాధను బయటకు చెప్పుకోలేక ఎంత మనోవేదనకు గురైందో, ఆమె సూసైడ్ నోట్ను చూస్తేనే అర్థమవుతుందన్నారు. బాలిక తన బాధను బయటికి చెప్పుకోలేక తనువు చాలించడం అత్యంత బాధాకరమన్నారు. నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. మహిళల భద్రత కోసమే ఈ ప్రభుత్వం దిశ యాప్ తీసుకువచ్చిందని చెప్పారు. ‘దిశ’ యాప్ను ఉపయోగించండి ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు అమ్మాయిలు వెంటనే తల్లిదండ్రులకు చెప్పాలని ఆమె తెలిపారు. తల్లిదండ్రులతో చెప్పుకోలేని సంఘటనలు ఏమైనా ఉంటే కనీసం దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారమివ్వాలన్నారు. అంతేకానీ.. భయాందోళనకు గురై ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. మహిళలపై నేరాలకు పాల్పడే దాదాపు 2 లక్షల మందికి పైగా సెక్సువల్ అఫెండర్స్పై నిఘా పెట్టి, వారి కదలికలను గుర్తించేందుకు వారిని జియో ట్యాగింగ్ చేశామని తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా లైంగిక వేధింపుల కేసుల్లో కేవలం 60 రోజుల్లోనే దర్యాప్తు పూర్తిచేసి నేరస్తులను శిక్షిస్తున్నామన్నారు. రాష్ట్రంలో వారు, వీరు అనే తేడాలేకుండా, ఏ పార్టీ వారు నేరం చేసినా వదిలిపెట్టే ప్రసక్తేలేదని సీఎం జగన్మోహన్రెడ్డి మొదటి నుంచి చెబుతున్నారన్నారు. వ్యభిచార ఘటనలో 46 మంది అరెస్టు గుంటూరు జిల్లా మేడికొండూరులో వ్యభిచార ఘటనలో పోలీసులు వెంటనే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరిపారన్నారు. మొత్తం 46 మందిని అరెస్టు చేసినట్లు మంత్రి సుచరిత వెల్లడించారు. ఈ కేసులో వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు ఉన్నాడని టీడీపీ వాళ్లు ఆరోపణలు చేసినప్పటికీ అతనిని కూడా అరెస్టుచేశామన్నారు. చదవండి: టీడీపీ శ్రేణులు నారీ దీక్ష వినోద్ జైన్ ఇంటి ముందు చేయాలి: ఆర్కే రోజా వినోద్ జైన్పై కఠిన చర్యలు విజయవాడ బాలిక ఆత్మహత్య కేసులో నిందితుడు వినోద్ జైన్పై కఠినచర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. అతనిపై ఐపీసీ సెక్షన్ 306, 354, 354, 354, 509, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు. బాలిక కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరఫున అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇస్తున్నానన్నారు. ఆ ఘటనల్లో ఇప్పటికీ టీడీపీ సమాధానం లేదు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎమ్మార్వో వనజాక్షిని ఆ పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కొట్టిన కేసులో ఏం చర్యలు తీసుకున్నారని సుచరిత ప్రశ్నించారు. దీనిపై ఇప్పటికీ చంద్రబాబు నుంచి సమాధానం లేదన్నారు. టీడీపీ హయాంలోనే జరిగిన కాల్మనీ సెక్స్ రాకెట్ కేసుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందన్నారు. అలాగే, నాగార్జున యూనివర్సిటీ విద్యార్థి రిషితేశ్వరి కేసులో ఏం న్యాయం చేశారంటే టీడీపీ నుంచి ఇప్పటికీ సమాధానం లేదన్నారు. తాజాగా.. టీడీపీ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళలపై నారా లోకేష్ పీఏ లైంగిక వేధింపులకు గురిచేసిన సంఘటనపై కూడా సమాధానంలేదని సుచరిత చెప్పారు. చదవండి: పసి మనసుకు ఎందుకింత కష్టం.. లోపం తల్లిదండ్రులదా? చిన్నారులదా? -
రాజకీయ లబ్ధికే టీడీపీ రాద్ధాంతాలు
గుంటూరు రూరల్: రాష్ట్రంలో జరిగే ప్రతి విషయాన్ని టీడీపీ నాయకులు రాజకీయ లబ్ధి కోసం రాద్ధాంతం చేస్తున్నారని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత మండిపడ్డారు. నగరంలోని క్యాంపు కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. గుంటూరులో బాలిక వ్యభిచారం కేసులో నిందితులందరినీ అరెస్టు చేసిన వారం తర్వాత టీడీపీ మహిళా నాయకులు రాద్ధాంతం చేయటం ఏమిటని ప్రశ్నించారు. సున్నితమైన ఘటనను కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం బాధాకరమన్నారు. ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి మొత్తం 43 మందిని అరెస్టు చేసినట్లు మంత్రి వెల్లడించారు. బాధితురాలు ఆరోపించిన వారితో పాటు సహకరించిన వారిని కూడా పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించినట్లు మంత్రి చెప్పారు. ఈ కేసు విషయంలో తమ పార్టీకి సంబంధించిన వ్యక్తిపైనా ఆరోపణలు వచ్చినప్పటికీ నిష్పక్షపాతంగా విచారణ జరిపి చర్యలు తీసుకున్నామన్నారు. తెలంగాణకు చెందిన ఆరుగురి ప్రమేయం కూడా ఉన్నట్లు తేలడంతో వారినీ అరెస్టు చేసినట్లు సుచరిత తెలిపారు. అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాల విషయంలో సీఎం జగన్ ఎక్కడా రాజీపడకుండా పనిచేస్తుంటే టీడీపీ నేతలు రచ్చచేయడం మంచి పద్ధతి కాదన్నారు. మానవతా దృక్పథంతో బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడాన్ని కూడా తప్పుబట్టడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. టీడీపీ హయాంలో మహిళలపై జరిగిన నేరాల విషయంలో చంద్రబాబు ఏ విధంగా స్పందించారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునన్నారు. చంద్రబాబునాయుడే స్వయంగా దళితుల గురించి, ఆడబిడ్డల పుట్టుక గురించి నీచంగా మాట్లాడి ఇప్పటివరకు కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదని సుచరిత గుర్తుచేశారు. ఇప్పటికైనా టీడీపీ నాయకులు సున్నితమైన మహిళల విషయాలను రాజకీయం చేయడం మానుకుని మహిళల పట్ల గౌరవంగా ఉండాలని, స్వార్థ రాజకీయాల కోసం వారి జీవితాలను రోడ్ల మీదకు లాగడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. -
Guntur: ఆక్సిజన్ ప్లాంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత
-
తండ్రికి తగ్గ తనయుడు సీఎం జగన్: హీరో సుమన్
సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినం సందర్భంగా నిర్మల హృదయ భవన్లో మానసిక వికలాంగులు, పేదలకు.. పండ్లు , స్వీట్స్ , దుప్పట్లు, దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు, హీరో సుమన్ పాల్గొన్నారు. చదవండి: ఓటీఎస్ ద్వారా 52 లక్షల మంది పేదలకు లబ్ధి: శ్రీరంగనాథరాజు ఈ సందర్భంగా హీరో సుమన్ మాట్లాడుతూ, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరుకూ పలు ముఖ్యమంత్రుల పనితీరు పరిశీలించానని.. వైఎస్సార్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని.. ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్ అంతకంటే ఎక్కువ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ, సీఎంగా వైఎస్ జగన్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆయన కుటుంబంపై దేవుడి ఆశీస్సులు మెండుగా ఉండాలన్నారు.పెదకూర పాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ, వైఎస్సార్ తాను అమలు చేసిన పథకాలతో రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. అందకంటే ఎక్కువగా సీఎం వైఎస్ జగన్ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. -
చంద్రబాబు మరో రసం పీల్చే పురుగు.. 2019లో లేవలేని స్థాయిలో..
సాక్షి, గుంటూరు: రాజధాని కోసం భూములా, భూముల కోసం రాజధానియా అన్న అంశంపై చర్చ జరగాలని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రైతులు తామర పురుగుతో నష్టపోయారు. చంద్రబాబు మరో రసం పీల్చే పురుగు. 2019లో లేవలేని స్థాయిలో ప్రజలు పురుగు మందు కొట్టారు. పోగాలం ఎవరికి దాపురించిందో 2019 నుంచి చూస్తున్నాం. సెన్స్ ఉండే చంద్రబాబు మాట్లాడుతున్నారా? బాబు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. రాష్ట్ర ప్రయోజనాలు అంటే రియల్ ఎస్టేట్ ప్రయోజనం అనుకున్నారు. సొంత మనుషుల చేత భూములు కొనిపించి అమరావతి పెట్టారు. తోటలు తగులబెట్టి భూములు లాక్కొన్నారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రజలను ఆదుకోవాలని సీఎం జగన్ పాలన చేస్తున్నారు. భూముల వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బులతో రాజకీయం చేయడం చంద్రబాబుకు అలవాటు. రిటైర్డ్ జస్టిస్ చంద్రు వ్యాఖ్యలపై చంద్రబాబు మండిపడుతున్నారు. చంద్రు వాస్తవాలు మాట్లాడితే తప్పుపడుతున్నారు. చదవండి: (మంత్రి పేర్ని నానికి అదనపు బాధ్యతలు.. ఉత్తర్వులు జారీ..) అచ్చెన్నాయుడు తప్పెటగూళ్లు బ్యాచ్ పులివెందులలో గెలుస్తాం అంటున్నారు. ముందు కుప్పం సంగతి చూసుకోండి. న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్రకు ఎవరు స్పాన్సర్డ్ అనేది అందరికి తెలుసు’ అని మంత్రి కన్నబాబు అన్నారు. ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారు: హోం మంత్రి ప్రజలకు మంచి చేయడం చూసి టీడీపీ తట్టుకోలేకపోతోందని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. 'వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 2019లో అధికారం ఇచ్చారు. సీఎం జగన్ను వ్యక్తగతంగా దూషిస్తున్నారు. కుప్పం ఓటమిపై ఆత్మపరిశీలన చేసుకోకుండా ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబును ఆస్పత్రిలో చూపించాలని కుటుంబ సభ్యులకు చెప్తున్నాను. సామాన్యుడు వెళ్లి రాజధానిలో ఉండలేని పరిస్థితి తీసుకొచ్చారు. రిటైర్డ్ జస్టిస్ చంద్రు వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. న్యాయవ్యవస్థలు ఏవిధంగా ఉన్నాయో ఉన్నది ఉన్నట్లు చంద్రు చెప్పారు' అని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. చదవండి: (ఓబీసీ కులగణనకు 'నో' చెప్పిన కేంద్రం) -
సాయుధ దళాల సేవలు అనిర్వచనీయం
సాక్షి, అమరావతి: శత్రుమూకల నుంచి దేశాన్ని నిరంతరం రక్షిస్తూ ప్రజలు సుఖశాంతులతో జీవించేందుకు సాయుధ దళాలు అందిస్తున్న సేవలు అనిర్వచనీయమని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత కొనియాడారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సాయుధ దళాల పతాక దినోత్సవం–2021 నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. సైనికులు, మాజీ సైనికులకు, వీర మరణం పొందిన సైనిక కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాయుధ దళాల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. గతంలో వీర మరణం చెందిన సైనిక కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇస్తే, తమ ప్రభుత్వం రూ.50 లక్షలు అందజేస్తోందన్నారు. ఇళ్ల పట్టాలతో పాటు కారుణ్య నియామకాల కింద కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్ బ్రిగేడియర్ వి.వెంకటరెడ్డి మాట్లాడుతూ.. పదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సైనికుల ఇళ్ల స్థలాల సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చూపిందన్నారు. ఇప్పటివరకు 140 మందికి 300 చదరపు గజాల చొప్పున ఇళ్ల స్థలాల పట్టాలను అందజేసినట్టు చెప్పారు. ఆర్థిక సాయం అందజేత దేశ రక్షణలో భాగంగా సరిహద్దుల్లో అసువులు బాసిన ప్రకాశం జిల్లాకు చెందిన అమర జవాను హవల్దార్ గుర్రాల చంద్రశేఖర్ సతీమణి మేరీ మంజుల, శ్రీకాకుళం జిల్లాకు చెందిన గోపాల కృష్ణసురపతి భార్య దీపా, విజయనగరం జిల్లాకు చెందిన వీర సైనికుడు నాయక్ పాండ్రంకి చంద్రరావు సతీమణి సుధారాణి, కర్నూలు జిల్లాకు చెందిన సైనికుడు పొలుకనటి శివగంగాధర్ భార్య రాధిక, గుంటూరు జిల్లాకు చెందిన సైనికుడు ఎం.జస్వంత్ కుమార్రెడ్డి భార్య వెంకటేశ్వరమ్మకు సైనిక సంక్షేమ ప్రత్యేక నిధి నుంచి రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని హోం మంత్రి అందజేశారు. 164 సార్లు రక్తదానం చేసిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ సైనికుడు సార్జెంట్ బొడ్డేపల్లి రామకృష్ణారావును సత్కరించారు. గత ఏడాది పతాక దినోత్సవం సందర్భంగా పెద్దఎత్తున విరాళాలను సేకరించిన తూర్పు గోదావరి జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి కెప్టెన్ డాక్టర్ పి.సత్యప్రసాద్ (రిటైర్డ్), కర్నూలు జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి పి.రాచయ్య, పశ్చిమ గోదావరి జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి కేవీఎస్ ప్రసాదరావుకు మంత్రి ట్రోఫీలను అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర హోం శాఖ ప్రధాన కార్యదర్శి కుమార్ విశ్వజిత్, సైనిక సంక్షేమ శాఖ సహాయ సంచాలకుడు వీవీ రాజారావు పాల్గొన్నారు. -
పోలీస్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు
భవానీపురం (విజయవాడ పశ్చిమ): వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పోలీస్ వ్యవస్థలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులతో స్మార్ట్ పోలీసింగ్లో ఏపీ నంబర్ వన్గా నిలిచిందని హోం మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. విజయవాడ హౌసింగ్ బోర్డ్ కాలనీలో నూతనంగా నిర్మించిన భవానీపురం మోడల్ పోలీస్ స్టేషన్ను సోమవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ గతంలో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసేందుకు పోలీసులు 250 రోజులు తీసుకునేవారని, ఇప్పుడు 42 రోజుల్లోనే సమర్పించేలా చర్యలు తీసుకున్నామన్నారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితుల సమస్యలను సత్వరం పరిష్కరించేలా పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. మహిళల కోసం ఉమెన్ హెల్ప్ డెస్క్.. వివిధ సమస్యలపై పోలీస్ స్టేషన్లకు వచ్చే మహిళల కోసం ఆయా పోలీస్ స్టేషన్లలో ఉమెన్ హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశామని, రాష్ట్రంలోని 14,500 మంది మహిళా పోలీసులు వీటిద్వారా సేవలందిస్తారని సుచరిత తెలిపారు. మహిళలు, బాలికల భద్రత, రక్షణ కోసం ప్రభుత్వం తెచ్చిన దిశ చట్టం సత్ఫలితాలను ఇస్తోందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 98 లక్షల మంది మహిళలు తమ మొబైల్స్లో దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో సుమారు రూ.వెయ్యి కోట్ల విలువైన గంజాయిని ధ్వంసం చేశామన్నారు. కార్యక్రమంలో దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, డీజీపీ గౌతమ్ సవాంగ్, నగర పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఎం.చిరంజీవిరెడ్డి, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వెస్ట్ ఏసీపీ డాక్టర్ కె.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదాల్లో డాడీస్రోడ్ యాప్తో రక్షణ
గుంటూరు రూరల్: ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో ప్రాణాపాయ స్థితి నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు డాడీస్ రోడ్ యాప్, క్యూఆర్ కోడ్ స్టిక్కర్ ఎంతో ఉపయోగపడుతుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. శుక్రవారం గుంటూరులోని హోంమంత్రి క్యాంప్ కార్యాలయంలో డాడీస్రోడ్ యాప్ బ్రోచర్ను ఆవిష్కరించారు. హోంమంత్రి మాట్లాడుతూ ఈ యాప్ను ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ప్రమాదం జరిగినపుడు వెంటనే బంధువులకు సమాచారం అందజేస్తుందన్నారు. ఈ యాప్ ద్వారా బ్లడ్ అవసరమైనా, వైద్య సేవలు, వాహనాలు రాంగ్ పార్కింగ్ చేసినా అలర్ట్ వస్తుందన్నారు. ఇటువంటి యాప్ను తయారు చేసిన యాజమాన్యాన్ని అభినందించారు. కార్యక్రమంలో ఈ యాప్ సీఈఎఫ్ అనంతలక్ష్మి తదితరులున్నారు. -
అభివృద్ధి వికేంద్రీకరణకు సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు
-
'ఏ ల్యాండ్మైన్ ఎప్పుడు పేలుతుందో తెలియని పరిస్థితి ఉండేది'
-
‘రాజకీయ లబ్ధి కోసం భయానక వాతావరణం సృష్టించారు’
సాక్షి, గుంటూరు: పక్కా ప్లాన్తోనే టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ నేతలపై దాడి చేశారని హోంమంత్రి మేకతోటి సుచరిత మండిపడ్డారు. పెదనండిపాడు మండలం కొప్పర్రులో హోంమంత్రి మేకతోటి సుచరిత పర్యటించారు. టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడిన వైఎస్సార్సీపీ నేతలను ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొప్పర్రులో వినాయక నిమజ్జనానికి వైఎస్సార్సీపీ నేతలు సహకరించారని తెలిపారు. చదవండి: ‘అమెరికన్ కార్నర్’ కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం జగన్ టీడీపీ నేతలు ముందుగానే ఇంటిపై రాళ్లు సిద్ధం చేసుకున్నారని అన్నారు. బత్తుల శారద ఇంట్లోకి వెళ్లి టీడీపీ నేతలే దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ నేత శ్రీకాంత్పై కూడా టీడీపీ నేతలు దాడి చేశారని ఫైర్ అయ్యారు. రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ నేతలు భయానక వాతావరణ సృష్టించారని దుయ్యబట్టారు. చదవండి: USAID Mission Director Veena Reddy: కోవిడ్ సాయం.. ఐదు కోట్ల మందికి -
రమ్య సోదరికి ఉద్యోగం.. ఇంటి స్థలం, ఐదెకరాల పంట భూమి
-
సంక్షేమంతో సమానంగా అభివృద్ధి
పోడూరు(ఆచంట): రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమంతోపాటు అభివృద్ధికి ప్రాధాన్యమిస్తోందని హోంమంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన సాగుతోందన్నారు. తమది మహిళ, రైతు సంక్షేమ ప్రభుత్వమని తెలిపారు. ‘దిశ’ యాప్ ద్వారా మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని, అన్ని గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి అన్నదాతలకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మల్లిపూడి, జుత్తుగ, భట్లమగుటూరు గ్రామాల్లో సుమారు రూ.3 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ఆదివారం ఆమె ప్రారంభించారు. మంత్రులు శ్రీరంగనాథరాజు, తానేటి వనిత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేదల కల నెరవేరుస్తున్నాం.. రాష్ట్రవ్యాప్తంగా జగనన్న కాలనీల్లో 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలిచ్చి పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నట్లు గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు చెప్పారు. తొలిదశలో 15 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ముఖ్యమంత్రి జగన్ ఆదర్శవంతమైన పరిపాలన అందిస్తున్నారన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలన్నీ సజావుగా అమలు చేస్తూ ముఖ్యమంత్రి జగన్ ఇతర రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలిచారని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత చెప్పారు. మహిళా సాధికారతతో పాటు వారి భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అభివృద్ధి పథకాల ప్రారంభం.. మల్లిపూడిలో రూ.35 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనం, రూ.21.8 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం, జుత్తుగలో దాదాపు రూ.1.40 కోట్ల తో నిర్మించిన 5 సీసీ రహదారులను, రూ.25 లక్షలతో నిర్మించిన సచివాలయం పైఅంతస్తు, రూ.13 లక్షల వ్యయంతో నాడు–నేడు ద్వారా అభివృద్ధి చేసిన ప్రాథమిక పాఠశాలను మంత్రులు ప్రారంభించారు. భట్లమగుటూరులో రూ.16 లక్షలతో చేపట్టిన డిజిటల్ లైబ్రరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.47.2 లక్షల వ్యయంతో నిర్మించిన రెండు సీసీ రహదారులను ప్రారంభించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జస్టిస్ రామస్వామి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు డి.మహాలక్ష్మి, టి.వీర్రెడ్డి, బి.సుగుణమ్మ, తహసీల్దార్ వై.దుర్గాకిషోర్, ఎంపీడీఓ ఆర్.విజయరాజు తదితరులు పాల్గొన్నారు. -
తానేటి వనితకు స్వాగతం పలికిన మంత్రి రంగనాథరాజు
-
రాజ్యాధికారంలో అట్టడుగు వర్గాలకు ప్రాధాన్యం
సాక్షి, అమరావతి: రాజ్యాధికారంలో అట్టడుగు వర్గాలకు సింహ భాగం ఇస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్ర సృష్టించారని వైఎస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు. రానున్న కాలంలో రాజకీయ పదవుల్లో సైతం తమ వాటా సాధించుకునే స్థాయికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల నుంచి నాయకత్వాన్ని తీర్చిదిద్దేలా చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. అన్ని పదవుల్లోనూ సగానికి పైగా మహిళలకు అవకాశం కల్పించి మహిళా సాధికారతకు అసలైన నిర్వచనం చెప్పారని కొనియాడారు. హోం మంత్రి మేకతోటి సుచరిత, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు శనివారం విజయవాడ ఆర్అండ్బీ కార్యాలయంలో రాష్ట్రంలో 47 కార్పొరేషన్లకు 481 మంది డైరెక్టర్ల నియామక జాబితాను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 27 నెలల పాలనలో.. మంత్రివర్గ కూర్పు నుంచి కార్పొరేషన్ డైరెక్టర్ల వరకు నిజాయితీ, నిబద్ధతతో సామాజిక న్యాయాన్ని అమలు చేసి చూపించారన్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు 47 కార్పొరేషన్లకు సంబంధించి 481 మంది డైరెక్టర్ల పేర్లు ప్రకటిస్తున్నామన్నారు. వీరిలో 248 మంది డైరెక్టర్ల (52 శాతం) పదవులను మహిళలకే ఇచ్చి అగ్రపీఠం వేశామని చెప్పారు. మహిళా పక్షపాత ప్రభుత్వం అని చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు. పురుషులకు 233 డైరెక్టర్ల (48 శాతం) పదవులు ఇచ్చామని, మొత్తం డైరెక్టర్లలో 58 శాతం పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇవ్వగా.. 42 శాతం పదవులు ఓసీలకు ఇచ్చామని వివరించారు. వైఎస్సార్సీపీ హయాంలో సామాజిక న్యాయం వైఎస్ జగన్ 2019లో అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని విషయాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పెద్దపీట వేశారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఐదుగురు ఉప ముఖ్యమంత్రుల్లో నలుగురు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే అని, అసెంబ్లీ స్పీకర్ కూడా బీసీనే అని చెప్పారు. రేపు రాబోయే మండలి అధ్యక్షుడు కూడా ఆ వర్గానికి చెందిన వ్యక్తి ఉండే వీలుందన్నారు. ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పదవులు, నామినేషన్ విధానంలో ఇచ్చే పనుల్లో చెప్పిన దానికంటే మిన్నగా ఇస్తున్నారని తెలిపారు. సచివాలయాల ఉద్యోగుల్లో 83 శాతం ఆ వర్గాలకు చెందిన వారున్నారని, ఆ వర్గాలలో ఒక విశ్వాసం పాదుకొల్పేందుకు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో, నిబద్ధతతో కృషి చేస్తోందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అన్నారు. బీసీల కోసం ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల చైర్మన్ల పదవులు, 137 నామినేటెడ్ పోస్టుల్లో సగానికి పైగా పదవులు ఈ వర్గాల వారికే ఇచ్చామని చెప్పారు. 31 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇస్తే, వారిలో 80 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల వారున్నారని వివరించారు. మాట నిలబెట్టుకున్నాం సామాజికంగా, రాజకీయంగా వెనకబడిన వర్గాలకు ప్రాధాన్యం ఇస్తూ వెతికి మరీ అభ్యర్థులను ఎంపిక చేశామని సజ్జల తెలిపారు. కొన్ని కులాల్లో అలా వెతకాల్సి వచ్చిందని, ఇందుకోసం భారీ కసరత్తు చేశామని చెప్పారు. చెప్పిన మాట నిలబెట్టుకుంటూ ఆయా వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చామని, ప్రతి కార్పొరేషన్లో మహిళలకు సగానికి పైగా పదవులు ఇచ్చామన్నారు. కోడి గుడ్డు మీద ఈకలు పీకినట్లు ఒక వర్గం మీడియా అనవసర రాద్ధాంతం చేసే వీలుంది కాబట్టి, అన్నీ స్పష్టంగా చెబుతున్నామని తెలిపారు. 2014–19 మధ్య టీడీపీ కేవలం మాటలే చెప్పిందని.. బీసీ, ఎస్సీలను అస్సలు పట్టించుకోలేదని విమర్శించారు. ఒక నాయకుడికైతే పదవి ఇచ్చామని చెబితే, ఆయన కారులో బయలుదేరితే, మధ్యలోనే మొండిచేయి చూపారని గుర్తు చేశారు. ఇది బీసీల ప్రభుత్వం: మంత్రి చెల్లుబోయిన చంద్రబాబు ఎప్పుడూ బీసీల తోకలు కత్తిరిస్తానని, తోలు తీస్తానని చులకనగా చూసేవారని.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతల్లో సామాజిక న్యాయం చూపిస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. సీఎంకు సామాన్యుడికి మధ్యలో ఎవరూ లేకుండా నేరుగా సంక్షేమ పథకాల లబ్ధిని అందిస్తున్నారని చెప్పారు. ఏది చేయగలమో అదే చెప్పాలని, చెప్పింది చేయాలని ఆచరించి చూపిస్తున్న సీఎం వైఎస్ జగన్ ఈ దేశానికి ఒక మార్గదర్శిగా నిలుస్తున్నారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఈరోజు ఒక భరోసా లభించిందని చెప్పారు. ఈ వర్గాలకు వివిధ పథకాల ద్వారా రూ.లక్షా 40 వేల 438 కోట్ల మేర లబ్ధి కలిగిందన్నారు. ఎమ్మెల్యే మేరుగు నాగార్జున మాట్లాడుతూ అంబేడ్కర్ కోరుకున్న పాలన రాష్ట్రంలో సాగుతోందన్నారు. ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. గొప్ప మనసున్న సీఎం వైఎస్ జగన్ ఎప్పుడూ ప్రజల కోసమే పని చేస్తారన్నారు. సీఎం మహిళా పక్షపాతి : హోం మంత్రి సుచరిత సీఎం జగన్ మహిళా పక్షపాతి అని డైరెక్టర్ పదవుల కేటాయింపు ద్వారా మరోసారి నిరూపించారని హోం మంత్రి సుచరిత అన్నారు. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అణచివేతకు గురయ్యారని, సీఎం వైఎస్ జగన్ మాత్రం ఆ వర్గాలకు చాలా ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. మహిళలను రాజకీయంగా అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టడమే కాకుండా, వారు ఎదిగేలా ప్రోత్సాహిస్తున్నారన్నారు. ఇళ్ల పట్టాలు, ఇళ్ల ద్వారా మహిళల పేరు మీద ఒక తోబుట్టువులా స్థిరాస్తి కల్పిస్తున్నారని, తద్వారా మహిళా లోకం ఆయన్ను అన్నగా భావిస్తోందని తెలిపారు. -
మాజీ సైనికులకు అండగా సీఎం జగన్: హోం మంత్రి సుచరిత
-
మహిళల భద్రత కోసం దిశ చట్టాన్ని తీసుకొచ్చాం: హోంమంత్రి సుచరిత
-
రమ్య కుటుంబానికి ఇంటి పట్టా
సాక్షి, గుంటూరు : ప్రేమోన్మాది చేతిలో ఇటీవల హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబానికి ప్రభుత్వం ఇంటి స్థలం పట్టాను అందజేసింది. గుంటూరు పరమాయకుంటలోని రమ్య ఇంటికి రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, జిల్లా కలెక్టర్ వివేక్యాదవ్, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు శుక్రవారం వెళ్లి ఇంటి నివేశన స్థలం పట్టాను అందజేసి పరామర్శించారు. ఈ సందర్భంగా హోం మంత్రి సుచరిత మాట్లాడుతూ రమ్య కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తిస్థాయిలో అండగా నిలిచారని చెప్పారు. రమ్య కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం చేశామన్నారు. ఏటుకూరులో ఇంటి స్థలాన్ని కేటాయించడంతోపాటు రమ్య సోదరి మౌనికకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని వివరించారు. వేధింపులకు గురయ్యే యువతులు, మహిళలు వెంటనే దిశ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ టీడీపీ నాయకులు శవ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, షేక్ మహ్మద్ ముస్తఫా, మద్దాల గిరిధర్, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ లాల్పురం రాము, తదితరులు పాల్గొన్నారు. చదవండి : అమరుల త్యాగాన్ని స్మరించడమే మొహర్రం : సీఎం జగన్ -
రమ్య హత్య ఘటన చాలా బాధాకరం: హోంమంత్రి సుచరిత
సాక్షి, గుంటూరు: జీజీహెచ్లో బీటెక్ విద్యార్థిని రమ్య మృతదేహాన్ని హోంమంత్రి మేకతోటి సుచరిత పరిశీలించారు. తర్వాత మంత్రి సుచరిత.. రమ్య కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బీటెక్ విద్యార్థిని రమ్యను హత్య చేయడం బాధాకరమని అన్నారు. హంతకుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారని తెలిపారు. ఘటనకు సంబంధించి కొన్ని ఆధారాలు కూడా సేకరించారని పేర్కొన్నారు. హత్య చేసిన వ్యక్తి కోసం పోలీసు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నారని వెల్లడించారు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన వ్యక్తిని కఠినంగా శిక్షిస్తామని, మహిళను హత్య చేసే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. రమ్య కుటుంబానికి న్యాయం చేస్తామని, రమ్య హత్య విషయం తెలియగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చలించిపోయారని తెలిపారు. రమ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. హత్య చేసిన వ్యక్తికి ఉరి వేయాలని అందరూ అంటున్నారని, కచ్చితంగా అలాంటి శిక్షలు పడేటట్లు చర్యలు తీసుకుంటామని మంత్రి సుచరిత తెలిపారు. నిందితుడ్ని కఠినంగా శిక్షిస్తాం: వాసిరెడ్డి పద్మ బీటెక్ విద్యార్థిని రమ్య మృతదేహాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ జీజీహెచ్లో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రమ్య హత్య ఘటన చాలా బాధాకరమని, నిందితుడ్ని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. -
దిశ యాప్ను మహిళలంతా డౌన్లోడ్ చేసుకోవాలి: మేకతోటి సుచరిత
-
గుంటూరు: యువతి అత్యాచార కేసులో పురోగతి
సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లా యువతి అత్యాచారం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఘటనకు సంబంధించి అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. ఇప్పటికే పోలీసులు చాలా మందిని విచారించారని, ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. బాధితురాలి స్టేట్మెంట్ కూడా రికార్డు చేస్తామని, దర్యాప్తు అనంతరం నిందితులను మీడియా ముందు ప్రవేశపెడతామని ఆమె పేర్కొన్నారు. కాగా గుంటూరు జిల్లా తాడేపల్లి రూరల్ మండలం సీతానగరం పుష్కర ఘాట్ సమీపంలో శనివారం రాత్రి(జూన్ 19) నర్సింగ్ విద్యార్థినిపై అత్యాచారం జరిగిన విషయం విదితమే. నిందితుల గొంతు విన్నా గుర్తు పడతానని బాధితురాలు చెబుతుండటంతో అనుమానితుల వాయిస్ బాధితురాలికి వినిపించి నిందితులను నిర్ధారణ చేసుకోవాల్సి ఉందని మంత్రి సుచరిత అన్నారు. ప్రతిపక్షాలు ఇప్పటివరకు నిందితులను పట్టుకోలేదని కామెంట్ చేస్తున్నాయని, తమ ప్రభుత్వం నిజమైన నిందితుల్ని పట్టుకొని కఠిన శిక్ష పడేలా చూస్తుందని స్పష్టం చేశారు. ఎవరిని పడితే వారిని అమాయకుల్ని కేసులో ఇరికించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని అన్నారు. మహిళల భద్రతపై ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారని పేర్కొన్నారు. ఇక ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. అత్యాచార ఘటన తన మనసును కలచివేసిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో ఎక్కడా జరగకూడదన్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం తన క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకుని ఘటనపై ఆరా తీశారు. నిందితులు ఎంతటి వారైనా సరే ఉపేక్షించకూడదని.. కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను నియమించి దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించారు. మరోవైపు బాధితురాలిని పరామర్శించి ప్రభుత్వం తరఫున భరోసా ఇవ్వాలని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరితను, స్త్రీ శిశు సంక్షేమ శాఖ తానేటి వనితను ముఖ్యమంత్రి ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు బాధితురాలికి ప్రభుత్వం తరఫున 5 లక్షల రూపాయల పరిహారం అందజేస్తున్నట్లు ఏపీ మంత్రులు సుచరిత, తానేటి వనిత ప్రకటించారు. చదవండి: అత్యాచార ఘటనపై సర్కారు సీరియస్ ఆ ఘటన నా మనసును కలచివేసింది: సీఎం జగన్ -
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా సీఎం జగన్ ముందుకెళ్తున్నారు
-
కోవిడ్ కట్టడికి అన్ని చర్యలు: హోంమంత్రి మేకతోటి సుచరిత
సాక్షి, గుంటూరు: కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. కరోనా బాధితులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని, నిర్లక్ష్యంగా ఉండకుండా అందరూ కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ మేరకు నంబూరులోని కల్వరి టెంపుల్లో కోవిడ్కేర్ సెంటర్ను మేకతోటి సుచరిత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఎంపీ నందిగామ సురేష్, ఎమ్మెల్యేలు కిలారి వెంకట రోశయ్య, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మొండితోక జగన్మోహన్ , కల్వరి టెంపుల్ వ్యవస్థాపకులు డాక్టర్ సతీష్ కుమార్ దంపతులు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం హోంమంత్రి మేకతోటి సూచరిత మాట్లాడుతూ.. కరోనాతో ప్రపంచ మానవాళి అంతా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుందని, సెకండ్ వేవ్లో అనేక కుటుంబాలు కోవిడ్ బారిన పడుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో బైబిల్లో చెప్పిన మాటను ఆదర్శంగా తీసుకుని ఇలా సేవ చెయ్యడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇందుకు కల్వరి టెంపుల్ బ్రదర్ సతీష్ను అభినందించారు. జాగ్రత్తగా ఉండాలి పేదవారికి ఉచిత మందులు, ఆహారం అందించేందుకు ముందుకు రావడం చాలా గొప్ప విషయమన్నారు. ఇక్కడ ప్రార్ధించడంతోపాటు సేవ చెయ్యడం అభినందనీయమన్నారు. కరోనా పాజిటివ్ కేసులు ప్రతి రోజు 25వేలకు పైగా పెరుగుతున్నాయని, కర్ఫ్యూ పెట్టినా కొంత మంది నిర్లక్ష్యం వల్ల మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. అందరూ జాగ్రత్తగా ఉండడం ఇతరులకు మంచి చేసినట్లే అవుతుందని, ప్రభుత్వం కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారికి అన్ని రకాల సదుపాయాలు అందిస్తుందన్నారు. వివక్ష చూపవద్దు.. అండగా ఉందాం బ్రదర్ సతీష్ కుమార్ మన వంతు ఏమి చెయ్యాలి అని ఆలోచించి కల్వరి టెంపుల్లో కోవిడ్ సెంటర్ను ఏర్పాటు చేశారని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ పేర్కొన్నారు. కోవిడ్ వల్ల మనకు తెలిసిన వాళ్ళ చాలా మంది చనిపోతున్నారని, కోవిడ్ వచ్చిన బాధితులపై వివక్షత చూపవద్దని, వారికి మానసిక అండగా ఉందామని సూచించారు. కోవిడ్ వచ్చిన వారి పట్ల ప్రేమగా వ్యవహరించాలని, కోవిడ్ వచ్చిన వారిని దూరంగా పెట్టొద్దని హితవు పలికారు. అందరం కలిసి కట్టుగా ఈ కోవిడ్ మహమ్మరిని తరిమి కొడదామని, బ్రదర్ సతీష్ చేసే మంచి పనులుకు అందరం సహకరిస్తామని తెలిపారు. ఇక్కడ ప్రాణాలు పణంగా పెట్టి సేవ చేసే నర్సులకు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: ఏపీ: కోవిడ్ పేషెంట్ల కోసం ఆక్సిజన్ బస్సులు పోలవరం ప్రాజెక్ట్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం -
పోయేటప్పుడు ఏం తీసుకుపోం కదా: సుచరిత
గుంటూరు : కరోనా నియంత్రణపై హోంమంత్రి మేకతోటి సుచరిత కలెక్టర్, డాక్టర్లు, ఇతర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా పేరుతో ఎక్కువ డబ్బులు వసూలు చేసే ప్రైవేట్ హాస్పిటల్స్పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ హాస్పిటల్స్లో కరోనా పేరుతో డబ్బులు ఎక్కువ వసూలు చేస్తే చూస్తూ ఊరుకోం అని హెచ్చరించారు. ప్రభుత్వం సూచించిన రేట్లు మాత్రమే అమలు చేయాలి అని తెలిపారు. పేషెంట్ ఆస్పత్రిలో చేరగానే వెంటనే మూడు లక్షలు కట్టండి.. నాలుగు లక్షలు కట్టండి అని ఒత్తిడి చేస్తే ఎలా అంటూ సుచరిత అసహనం వ్యక్తం చేశారు. ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు మానవత్వంతో వ్యవహరించాలి అని కోరారు. ప్రైవేట్ ఆస్పత్రులు ప్రభుత్వానికి సహకరించాలన్నారు. డబ్బులు సంపాదించి ఏం చేసుకుంటాం.. పోయేటప్పుడు కూడా తీసుకు వెళ్ళం కదా అన్నారు సుచరిత. నిబంధనలు పాటించకపోతే కఠినంగా వ్యవహరించండి: వెల్లంపల్లి సాక్షి విజయవాడ: కలెక్టర్ కార్యాలయంలో కోవిడ్ ఆసుపత్రులపై మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ప్రత్యేక అధికారి సునీత, కలెక్టర్ ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ మాధవిలత, నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆరోగ్యశ్రీ కింద ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా పేషెంట్ల కోసం 50 శాతం బెడ్స్ కేటాయించాలి అన్నారు. నిబంధనలు పాటించని హాస్పిటల్స్పై కఠినంగా వ్యవహరించండి అని మంత్రి వెల్లంపల్లి అధికారులకు సూచించారు. చదవండి: కడుపులో బిడ్డను మోస్తూ... కర్తవ్యాన్ని మరువకుండా..! -
చంద్రబాబు రూటు మార్పు అందుకోసమే: సుచరిత
సాక్షి, అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నక్క జిత్తులను ప్రయోగిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ధ్వజమెత్తారు. అమరావతి ప్రాంతంలో శాంతిభద్రతలకు భంగం కలిగించాలన్నది ఆయన ప్లాన్ అని మండిపడ్డారు. ఈ మేరకు మంత్రి సుచరిత గురువారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. తుళ్లూరులో నేటి చంద్రబాబు సభకు పోలీసులు అనుమతి ఇచ్చారని పేర్కొన్నారు. చంద్రబాబు కాన్వాయ్ రూట్ను కూడా పోలీసులకు ఇచ్చారని, ఆ రూట్లో పోలీసులు అన్ని రకాలుగా నిన్ననే భద్రతా ఏర్పాట్లు చేశారన్నారు. చదవండి: దేశ చరిత్రలో ఇదే తొలిసారి: సీఎం జగన్ ఇప్పుడు ఆకస్మికంగా చంద్రబాబు తన రూట్ను మార్చుకుని వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానులకు మద్దుతుగా కార్యక్రమాలు చేస్తున్న వారి వైపుగా తాను వెళ్లాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దీని ద్వారా ఘర్షణలు జరగాలని, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించాలనేది చంద్రబాబు ఉద్దేశమని అన్నారు. రాష్ట్రంలో ప్రశాంత పరిస్థితులు ఉండకూడదని చంద్రబాబు కంకణం కట్టుకున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలను అందరూ ఖండించాలని సూచించారు. చంద్రబాబు ముందు తన విషపు ఆలోచనలను విడిచిపెట్టాలని, శాంతిభద్రతలను కాపాడటంలో పోలీసులకు సహకరించాలని కోరారు. చదవండి: పండగ వాతావరణంలా బీసీ సంక్రాంతి సభ -
అది ఆ మహనుభావుల భిక్షే: సుచరిత
సాక్షి, కృష్ణా జిల్లా: ప్రపంచ దేశాల్లో బానిసత్వం ఉంటే.. మన దేశంలో అంటరానితనం చూశామని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. అంటరానితనాన్ని నిర్మూలించేందుకు బిఆర్ అంబేద్కర్ ఎంతో శ్రమించారని, దళితుల అభ్యున్నతికి బాబు జగ్జీవన్ రామ్ ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల భవితకు అంబేద్కర్, జగ్జీవన్రామ్లు ఆనాడే పునాదులు వేశారని తెలిపారు. ‘‘నేడు మా లాంటి వారు పదవులు అనుభవిస్తున్నారంటే, దానికి ఆ మహనుభావుల భిక్షే కారణం. అంబేద్కర్ ఆశయాల గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుతుంటారు.. కానీ చేతల్లో చూపించే వారుండరు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంబేద్కర్ ఆశయాలను నెరవేరుస్తున్నారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. (చదవండి: హక్కులను పోరాడి సాధించుకోవాలి: సుచరిత) పథకాల ద్వారా లబ్ధిపొందే వారికి నేరుగా వారి ఖాతాల్లోనే నగదు జమ చేస్తున్నాం. సీఎం చేపట్టిన పథకాల వలన ఎస్సీ, ఎస్టీల ఆర్థిక స్థితిగతులు మారుతున్నాయి. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ అనే మహత్తర కార్యక్రమాన్ని సీఎం తలపెట్టారు. పేదల సొంతింటి కలను సీఎం జగన్ నెరవేరుస్తున్నారు. డిసెంబర్ 25న దాదాపు 30 లక్షలకు పైగా అర్హులకు ఇళ్ల స్థలాలు పంపిణీ జరుగుతోంది. రాష్ట్రంలో ప్రజలందరి బాగు కోరుకుంటున్న ఏకైక సీఎం వైఎస్ జగన్’’ అని పేర్కొన్నారు. అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల ఏర్పాటుకు సహకరించిన స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్కు మంత్రి సుచరిత ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: చంద్రబాబుకు బాధ్యత లేదు: శ్రీరంగనాథరాజు) -
అసెంబ్లీకి కీలక బిల్లులు
సాక్షి, అమరావతి: శాసనసభలో బుధవారం మంత్రులు పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టారు. ఏపీ విద్యుత్ సుంకం సవరణ (ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ అమెండ్మెంట్) బిల్లును మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రవేశపెట్టారు. అనంతరం మహిళలపై జరుగుతున్న అత్యాచారాల నియంత్రణలో భాగంగా తెచ్చిన దిశ బిల్లు సవరణ చట్టాన్ని హోం మంత్రి మేకతోటి సుచరిత, ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైట్లింగ్ బిల్లు – 2020ని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రతిపాదించారు. పలు బిల్లుల ఆమోదం: రాష్ట్రంలో 10 వేల మెగావాట్లతో ఏర్పాటు చేస్తున్న సౌరవిద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన భూమి కోసం ఏపీ అసైన్డ్ భూముల చట్టం సవరణ బిల్లును రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రవేశపెట్టారు. అనంతరం ఈ బిల్లు ఆమోదం పొందింది. వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రవేశపెట్టిన రాష్ట్ర వ్యవసాయ మండలి బిల్లును సభ ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ విలువ ఆధారిత పన్ను (రెండో సవరణ) బిల్లు, వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలపై పన్ను విధింపు సవరణ బిల్లు, విలువ ఆధారిత పన్ను (మూడో సవరణ) బిల్లులను అబ్కారీ, వాణిజ్య పన్నులశాఖ మంత్రి నారాయణస్వామి ప్రవేశపెట్టారు. ఈ బిల్లులు పాస్ అయ్యాయి. పశుసంవర్ధకశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ప్రవేశపెట్టిన పశువుల మేత (తయారీ, నాణ్యత, అమ్మకం, పంపిణీ క్రమబద్ధీకరణ) బిల్లును సభ ఆమోదించింది. వ్యవసాయ భూములను వ్యవసాయేతర ప్రయోజనాలకు వినియోగించే బిల్లును మంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ పెద్ద ఎత్తున సోలార్ ప్రాజెక్టులు వస్తున్న నేపథ్యంలో రైతులు తమ భూములను ఆ ప్రాజెక్టులకు లీజుకు ఇచ్చుకునే వెసులుబాటు లభిస్తుందని చెప్పారు. -
ప్రతి ఇంట సంక్షేమం: ఏకైక సీఎం ఆయనే
సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని.. చేతల ప్రభుత్వమని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరు స్తంబాల గరువులో ఎమ్మెల్యే మద్దాల గిరి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాల గిరిధర్, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మిర్చి యార్డ్ చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం, నగర అధ్యక్షుడు రమేష్ గాంధీ, మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మణ్ రెడ్డి పాల్గొన్నారు. సభకు జనం భారీగా తరలివచ్చారు. (చదవండి: ‘ఆ మాటలు ప్రజలు మరిచిపోలేదు’) ఈ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ ప్రజా సంకల్పయాత్రలో సీఎం వైఎస్ జగన్.. ప్రజల సమస్యలు తెలుసుకున్నారని, అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజాపాలన సాగిస్తున్నారని తెలిపారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డేనని తెలిపారు. ప్రతి పథకానికి ఒక తేదీ ఇచ్చి మరీ... అమలు చేస్తున్నారని తెలిపారు. మహిళలకు వైఎస్ జగన్ అన్నివిధాలుగా అండగా ఉంటూ మహిళా పక్షపాతిగా నిలిచారని ఆమె పేర్కొన్నారు. (చదవండి: అరెస్టయిన 15 రోజుల తర్వాత ఆరోపణలా..!) -
ఏమిటీ చిల్లర ఆరోపణలు?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ను మరిచిపోయి హైదరాబాద్లోనే గడుపుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు జూమ్ మీటింగ్ల్లో ప్రభుత్వంపై, అధికారులపై చిల్లర ఆరోపణలు చేయడం మానుకోవాలని హోంమంత్రి మేకతోటి సుచరిత హితవు పలికారు. నంద్యాలకు చెందిన షేక్ అబ్దుల్ సలాం కుటుంబం సామూహిక ఆత్మహత్య ఘటనను రాజకీయం చేసి లబ్ధి పొందేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను తప్పుపడుతూ శుక్రవారం హోంమంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబుకు సెక్షన్లు తెలియవా? సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితులైన సీఐ, హెడ్ కానిస్టేబుల్పై నాన్ బెయిలబుల్ సెక్షన్ ఐపీసీ 306 ప్రకారం కేసులు నమోదు చేసిన విషయం చంద్రబాబుకు తెలియదా? అని ప్రశ్నించారు. నిందితులకు టీడీపీ న్యాయవాది ద్వారా బెయిల్ ఇప్పిస్తే దాన్ని రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వం అప్పీల్కు కూడా వెళ్లిందని గుర్తు చేశారు. గౌరవ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తే పోలీస్ శాఖను నిందించడం వెనుక చంద్రబాబు ఉద్దేశం ఏమిటో చెప్పాలన్నారు. సీబీఐ విచారణ అప్పుడేమైంది? ఇప్పుడు ప్రతి అంశంపైనా సీఐబీ విచారణకు డిమాండ్ చేస్తున్న చంద్రబాబు ఆయన హయాంలో జరిగిన మహిళా అధికారి వనజాక్షిపై దాడి, విద్యారి్థని రిషితేశ్వరి ఆత్మహత్య, విజయవాడ కాల్మనీ సెక్స్ రాకెట్, గోదావరి పుష్కరాల తొక్కిసలాటలో 29 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం లాంటి ఘటనలపై నాడు ఎందుకు అదే విచారణ కోరలేదని హోంమంత్రి ప్రశ్నించారు. అప్పుడు ఆయనే సీబీఐకి నో ఎంట్రీ అని అడ్డుకోలేదా? అని నిలదీశారు. దయ్యాలు వేదాలు వల్లించినట్లు.. లక్షల మంది ఈఎస్ఐ కార్మీకుల ఇన్సూరెన్స్ సొమ్ము కాజేసిన అచ్చెన్నాయుడిని పార్టీ అధ్యక్షుడిగా నియమించి చంద్రబాబు ఎలాంటి సందేశం ఇస్తున్నారని నిలదీశారు. అతి దారుణమైన హత్య కేసులో నిందితుడిగా ఉన్న కొల్లు రవీంద్ర అరెస్టును కూడా రాజకీయం చేస్తారా? అని మండిపడ్డారు. జైలు, బెయిలు, శిక్షల గురించి చంద్రబాబు మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. ఆయన ఇప్పటికైనా హుందాగా వ్యవహరించి శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని సూచించారు. -
సలామ్ అత్తకు రూ.25 లక్షల పరిహారం
సాక్షి, అమరావతి/నంద్యాల: నంద్యాలకు చెందిన ఆటో డ్రైవర్ షేక్ అబ్దుల్ సలామ్ కుటుంబం ఆత్మహత్యతో ఆసరా కోల్పోయిన అతని అత్త మాబున్నీసాను ఆదుకునేందుకు సీఎం వైఎస్ జగన్ రూ.25 లక్షల పరిహారం ప్రకటించారని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. విజయవాడ ఆర్ అండ్ బీ భవనంలో డీజీపీ గౌతమ్సవాంగ్తో కలిసి సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. సలామ్ కుటుంబం ఆత్మహత్య తమను తీవ్రంగా కలచివేసిందని, దీనికి పోలీసుల వేధింపులే కారణమంటూ సలామ్ సెల్ఫీ వీడియో బయటకు వచ్చిన వెంటనే సీఎం జగన్ తనతోను, డీజీపీ సవాంగ్తోను మాట్లాడి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారని మంత్రి చెప్పారు. తప్పు చేస్తే పోలీసులనూ ఉపేక్షించేది లేదన్నారు. తమది బడుగు బలహీన వర్గాల ప్రభుత్వమని, అణగారిన వర్గాలపై వేధింపులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఎక్కడైనా పోలీసులు వేధింపులకు పాల్పడితే బాధితులెవరూ ప్రాణాలు తీసుకోవద్దని, తక్షణం ఏపీ పోలీస్ సేవా యాప్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. పోలీసుల నుంచి ఇబ్బందులు ఎదురైతే బాధితులు నేరుగా ఫిర్యాదు చేసేలా త్వరలో టోల్ఫ్రీ నంబర్ అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ముస్లింలను రెచ్చగొట్టి లబ్ధి పొందేందుకు చంద్రబాబు యత్నం హత్య కేసులో నిందితుడైన మాజీ మంత్రి కొల్లు రవీంద్రను, ఈఎస్ఐ స్కామ్లో నిందితుడైన అచ్చెన్నాయుడిను అరెస్ట్ చేస్తే బీసీలపై కక్ష సాధింపు అని గగ్గోలు పెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు ముస్లిం, మైనార్టీలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని మంత్రి ధ్వజమెత్తారు. టీడీపీ నేతల అవకాశవాద విధానాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. డీజీపీ గౌతమ్సవాంగ్ మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే పోలీసులనూ ఉపేక్షించవద్దని సీఎం వైఎస్ జగన్ తమకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. సలాం కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న డిప్యూటీ సీఎం అంజాద్బాషా, ఎమ్మెల్యేలు శిల్పా రవి, హఫీజ్ఖాన్ బాధ్యులందరిపైనా చర్యలు అబ్దుల్ సలామ్ కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన అందరిపైనా ప్రభుత్వం చట్టపరమైన చర్యలను తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి అంజాద్బాషా అన్నారు. సోమవారం ఆయన నంద్యాలలోని అబ్దుల్సలామ్ ఇంటికి వెళ్లి అతని అత్త, బంధువులను ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యేలు శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి, హఫీజ్ఖాన్తో కలిసి పరామర్శించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు నంద్యాల ముస్లిం యువకులపై దేశ ద్రోహం కేసు పెట్టిన చరిత్ర చంద్రబాబుదని గుర్తు చేశారు. నంద్యాల సీఐ, హెడ్ కానిస్టేబుల్కు బెయిల్ అబ్దుల్ సలామ్ కుటుంబం ఆత్మహత్య కేసులో అరెస్టయిన నంద్యాల సీఐ సోమశేఖర్, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్లకు నంద్యాల ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ ప్రసన్నలత బెయిల్ మంజూరు చేశారు. వారిద్దరిపైనా పోలీసులు ఐపీసీ 323, 324, 306 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే, న్యాయమూర్తి దీనిని సెక్షన్ 506 (మాటలతో వేధించడం) పరిధిలోకి తీసుకుని వారికి బెయిల్ మంజూరు చేశారు. నిందితుల తరఫున కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, న్యాయవాది వి.రామచంద్రరావు వాదనలు వినిపించారు. న్యాయం జరుగుతుందనుకోలేదు నా అల్లుడు, కుమార్తె, వారి పిల్లల ఆత్మహత్య కేసులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందిస్తారని అనుకోలేదు. ఈ కేసులో విచారణ కమిటీ ఏర్పాటు చేసి.. సీఐ, హెడ్ కానిస్టేబుల్పై కేసు నమోదు చేయడం సంతోషంగా ఉంది. నా కుటుంబానికి అండగా ఉంటున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. నా వాళ్ల చావుకు కారణమైన ఎవరినీ వదిలిపెట్ట వద్దని ముఖ్యమంత్రిని కోరుకుంటున్నా. – మాబున్నిసా, అబ్దుల్ సలామ్ అత్త సీఎం స్పందించిన తీరు మనోధైర్యం నింపింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించిన తీరు ముస్లింలలో మనోధైర్యాన్ని ఇచ్చింది. ప్రభుత్వం విచారణ కమిటీ వేయడమే కాకుండా ఆత్మహత్యకు కారణమైన సీఐ సోమశేఖర్రెడ్డి, హెడ్కానిస్టేబుల్ గంగాధర్లను సస్పెండ్ చేయడం, వారిని అరెస్ట్ చేయడం అభినందించదగ్గ విషయం. – అబ్దుల్ఖాదిర్, మతపెద్ద, నంద్యాల -
ఆ ఘనత సీఎం జగన్దే: సుచరిత
-
ఆ ఘనత సీఎం జగన్దే: సుచరిత
సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు పాలక మండలిలో 50 శాతానికి పైగా మహిళలకు రిజర్వేషన్లు కల్పించినందుకు ధన్యవాదాలు చెబుతూ మహిళలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల అభ్యున్నతి, సాధికారతకు కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డేనని తెలిపారు. నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించారని పేర్కొన్నారు. మహిళల అభ్యున్నతికి అమ్మఒడి, వైఎస్సార్ చేయూత, సున్నా వడ్డీ, వైఎస్సార్ ఆసరా లాంటి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ‘‘బీసీ కార్పొరేషన్లో 50 శాతం పైగా చైర్మన్లు, డైరెక్టర్లగా మహిళలకే అవకాశం కల్పించారు. ఇళ్ల పట్టాలు కూడా మహిళల పేరుతోనే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. మహిళలందరూ సీఎం జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అందిపుచ్చుకుని అభివృద్ధి కావాలని సుచరిత పిలుపునిచ్చారు. (చదవండి: మహిళలపై మమకారం) ప్రజల్లో నాడు- ప్రజల కోసం నేడు.. ‘ప్రజల్లో నాడు-ప్రజల కోసం నేడు’ కార్యక్రమంలో భాగంగా ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఆధ్వర్యంలో చెరుకుపల్లి మండలం కనగాలలో పాదయాత్ర నిర్వహించారు. దుర్గిలో ‘ప్రజల్లో నాడు-ప్రజల కోసం నేడు’ కార్యక్రమంలో భాగంగా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాదయాత్రను ప్రారంభించారు. పెదకూరపాడు మండలం కొర్రపాడులో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు.. యడ్లపాడు మండలం మైదవోలులో ఎమ్మెల్యే విడదల రజిని.. ఫిరంగిపురంలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి.. ఈపూరు మండలం కొండ్రముట్లలో వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పాదయాత్రలు నిర్వహించారు. -
మహిళలపై మమకారం
సాక్షి, అమరావతి: మహిళలపై రాష్ట్ర ప్రభుత్వానికున్న మమకారం మరోసారి రుజువైంది. జైళ్లలో మగ్గిపోతున్న మహిళా జీవిత ఖైదీలను విడుదల చేసేలా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న చారిత్రక నిర్ణయానికి విశేష స్పందన లభిస్తోంది. దేశంలోనే తొలిసారిగా ప్రత్యేకంగా మహిళా ఖైదీలు విడుదల కానుండటం గమనార్హం. కుటుంబానికి మహిళే ఆధారం అనే విషయాన్ని బలంగా విశ్వసిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సత్ప్రవర్తనే గీటురాయిగా దాదాపు 55 మంది మహిళా ఖైదీలకు స్వేచ్ఛ కల్పించాలని నిర్ణయించింది. – రాష్ట్రంలోని జైళ్లలో 147 మంది మహిళా జీవిత ఖైదీలున్నారు. వీరిలో తీవ్రమైన నేరాలు చేసిన వారిని సుప్రీం కోర్టు తీర్పులు, మార్గదర్శకాలకు లోబడి విడుదల చేయడం లేదు. ప్రధానంగా లైంగిక దాడులకు సహకరించడం, బాలలను కిడ్నాప్ చేయడం, చిన్న పిల్లల్ని హత్య చేయడం లాంటి తీవ్ర నేరాల్లో జీవిత ఖైదు పడిన మహిళలను విడుదల చేయరు. – క్షణికావేశంలో నేరాలకు పాల్పడటం, యాధృచ్చికంగా నేరాల్లో పాల్గొనడం, కొన్ని సమయాల్లో పరిస్థితులను బట్టి నేరాల్లో పాలు పంచుకోవడం లాంటి అంశాలను ఖైదీల విడుదలకు పరిగణలోకి తీసుకోనున్నారు. అటువంటి వారు వేగంగా సత్ప్రవర్తనకు అలవాటు పడి పశ్చాతాపంతో మళ్లీ నేరాలు చేసే అవకాశం లేదు. ఈ కోణాల్లో పరిశీలిస్తే మహిళా జీవిత ఖైదీల్లో 55 మంది విడుదలకు అర్హులుగా ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ జాబితాలను ప్రభుత్వం నియమించిన కమిటీ సమీక్షించిన అనంతరం ఖైదీలను విడుదల చేయనున్నారు. –రాజమహేంద్రవరం మహిళా ప్రత్యేక కారాగారం నుంచి 21 మంది, వైఎస్సార్ కడప ప్రత్యేక మహిళా కారాగారం నుంచి 27 మంది, విశాఖపట్నం కేంద్ర కారాగారం నుంచి ఇద్దరు, నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి ఐదుగురు మహిళా ఖైదీలు విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రాథమికంగా తేల్చారు. ఉపాధికి ఢోకా లేదు.. విడుదల కానున్న మహిళా జీవిత ఖైదీల ఉపాధికి ఇబ్బంది లేదని జైలు జీవితంలో వారు సాధించిన నైపుణ్యాలు స్పష్టం చేస్తున్నాయి. వీరిలో దూర విద్య ద్వారా బీఏ (డిగ్రీ) పూర్తి చేసిన వారు ఒకరు కాగా బీఏ మొదటి సంవత్సరం చదువుతున్న వారు ఒకరు, చివరి సంవత్సరంలో ఉన్నవారు ఆరుగురు ఉన్నారు. మిగిలిన మహిళా ఖైదీలు టైలరింగ్, ఎంబ్రాయిడరీ, చీరల పెయింటింగ్, బేకరీ, కాయిర్ మ్యాట్స్, కవర్లు, రుచికరమైన పిండివంటల తయారీలో నైపుణ్యం సాధించారు. వారంలో విడుదల – హోంమంత్రి మేకతోటి సుచరిత సత్ప్రవర్తన కలిగిన మహిళా ఖైదీలను విడుదల చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న చారిత్రక నిర్ణయం పట్ల మహిళా లోకం హర్షం వ్యక్తం చేస్తోందని హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ మహ్మద్ హసన్ రేజాతో కలిసి హోంమంత్రి విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ‘ఐదేళ్లు జైలు శిక్ష అనుభవించిన మహిళా జీవిత ఖైదీలను మానవత్వంతో విడుదల చేసేలా ప్రభుత్వం జీవో ఎంఎస్ 131 విడుదల చేసింది. జీవిత ఖైదు అనుభవిస్తున్న మహిళల్లో 55 మంది వారం రోజుల్లోగా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ జాబితాను కమిటీ పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తుంది. అనంతరం వారిని విడుదల చేస్తాం’ అని పేర్కొన్నారు. -
నేటి వీధి బాలలే రేపటి విద్యావంతులు
సాక్షి, అమరావతి: నేటి వీధి బాలలే రేపటి విద్యావంతులు కావాలనే లక్ష్యంతో మనమంతా కృషి చేయాలని హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వీధి బాలలను కాపాడటానికి ఏపీ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏడు రోజులపాటు చేపట్టిన ‘ఆపరేషన్ ముస్కాన్’ ముగింపు సందర్భంగా బుధవారం వెబినార్ నిర్వహించారు. మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి డీజీపీ గౌతమ్ సవాంగ్ తదితరులు.. 13 జిల్లాల పోలీస్ అధికారులు, వీధిబాలలతో నిర్వహించిన వెబినార్ను గుంటూరు నుంచి హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ బాలకార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పించే ముస్కాన్ గొప్ప కార్యక్రమమన్నారు. బాలలను పనిలో పెట్టుకున్న వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 16,457 మంది బాలలను కాపాడామని చెప్పారు. -
నేరస్తులపై కఠిన చర్యలు
సాక్షి, విశాఖపట్నం: వరలక్ష్మి కేసులో నేరస్తులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, దిశ చట్టం ప్రకారం ఏడు రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీటు వేస్తామని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గాజువాక మండలం చినగంట్యాడ సుందరయ్య కాలనీలో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన వరలక్ష్మి కుటుంబాన్ని మంత్రి సుచరిత సోమవారం పరామర్శించారు. సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన ఆర్థిక సాయానికి సంబంధించిన రూ.10 లక్షల చెక్కును వరలక్ష్మి తల్లిదండ్రులు పద్మప్రియ, సత్యగురునాథ్కు కలెక్టర్ వినయ్చంద్, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డితో కలిసి ఆమె అందించారు. ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని వరలక్ష్మి కుటుంబసభ్యులకు హామీ ఇచ్చారు. అనంతరం సుచరిత మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రంగా పరిగణించినట్లు తెలిపారు. తక్షణమే వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించాలని ఆదేశించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో మహిళల భద్రత కోసం తీసుకొచ్చిన దిశ చట్టం స్ఫూర్తితో నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు చేపడతామన్నారు. నిందితుడు అఖిల్ సాయిని రిమాండ్కు తరలించారని.. అతని తండ్రి, వారి కుటుంబసభ్యులపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు మంత్రి తెలిపారు. వరలక్ష్మి కుటుంబసభ్యులకు రూ.10 లక్షల చెక్కు అందజేస్తున్న హోంమంత్రి సుచరిత దిశ యాప్లో ఫిర్యాదు చేయండి.. చిత్తూరులో చిన్నారిపై హత్యాచారం ఘటనలో నిందితుడికి 7 నెలల్లోనే ఉరిశిక్ష ఖరారైందని.. విజయవాడలో 4 నెలల్లోనే నిందితుడికి ఉరిశిక్ష పడిందని హోం మంత్రి సుచరిత గుర్తు చేశారు. పాఠశాల స్థాయిలోనే మగపిల్లలకు అమ్మాయిలతో ఎలా ప్రవర్తించాలో అవగాహన కల్పించడంతో పాటు చట్టాలను కూడా వివరించేందుకు తగు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థినీ దిశ యాప్, ఏపీ పోలీస్ సేవా యాప్ డౌన్లోడ్ చేసుకునేలా ప్రత్యేక డ్రైవ్ చేపడతామని చెప్పారు. ఇలాంటి ఘటనలపై ఫిర్యాదు వస్తే వెంటనే స్పందించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో విశాఖ సీపీ మనీష్కుమార్ సిన్హా, దిశ చట్టం ప్రత్యేకాధికారులు కృతికా శుక్లా, దీపికా ఎం.పాటిల్, డీసీపీ ఐశ్వర్య రస్తోగి, సౌత్ ఏసీపీ రామాంజనేయరెడ్డి, ఆర్డీవో కిశోర్ తదితరులు పాల్గొన్నారు. -
వరలక్ష్మీ ఘటన చాలా బాధాకరం
-
గాజువాక: వరలక్ష్మి హత్య కేసులో కొత్త ట్విస్ట్
సాక్షి, విశాఖపట్నం: గాజువాకలో హత్యకు గురైన వరలక్ష్మి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు తెలిపిన వివరాలు.. పథకం ప్రకారమే వరలక్ష్మి హత్య జరిగింది. యువతి హత్యకు ఆమె మరొకరితో సన్నిహితంగా ఉండటమే కారణమని తేలింది. వరలక్ష్మిపైన అనుమానంతోనే అఖిల్ ఆమెను సాయిబాబా గుడి వద్దకు పిలిచి దారుణంగా హతమార్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. (మరదలితో రెండో పెళ్లి.. నిప్పంటించిన మొదటి భార్య) కాగా.. సుందరయ్య కాలనీలో ఉంటున్న వరలక్ష్మితో, చిట్టిబాబు కాలనీకి చెందిన అఖిల్ ప్రేమ పేరిట వెంట పడ్డాడు. అదే సమయంలో రాము అనే యువకుడు వరలక్ష్మితో సన్నిహితంగా ఉండటంతో భరించలేక పథకం ప్రకారం హత్య చేసినట్టు వెల్లడైంది. మరో వైపు ఊహించని ఈ పరిణామంతో వరలక్ష్మి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. అమానుషంగా తమ కుమార్తె ప్రాణం తీసిన అఖిల్ను కఠినంగా శిక్షించాలని వరలక్ష్మి తల్లి కోరుకుంటోంది. తాజా ఘటనపై స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటన ఏ కుటుంబానికి ఎదురు కారాదని స్థానికులు బాధిత యువతి కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. (గాజువాకలో ప్రేమోన్మాది ఘాతుకం) నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం: సుచరిత గుంటూరు: విశాఖపట్నం ప్రేమోన్మాది ఘటనపై హోంమంత్రి సుచరిత తీవ్రంగా మండిపడ్డారు. దారుణానికి ఒడిగట్టిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అయితే అంతకు ముందు డీజీపీ, ఇతర ఉన్నాతాధికారులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకున్న హోంమంత్రి.. బాధితురాలి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. (గాజువాక ఘటనపై సీఎం జగన్ సీరియస్) శాంతి ర్యాలీకి మహిళా కమిషన్ పిలుపు ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన ఇంటర్ విద్యార్థిని వరలక్ష్మికి నివాళి అర్పిస్తూ ఆదివారం సాయంత్రం 5 గంటలకు విశాఖపట్నం బీచ్ రోడ్లో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీకి మహిళా కమిషన్ పిలుపునిచ్చింది. వరలక్ష్మికి మద్దతుగా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ విజ్ఞప్తి చేశారు. -
పోలీస్ శాఖలో ఏటా 6,500 ఉద్యోగాల భర్తీ
మన ప్రభుత్వంలో శాంతి భద్రతలు అనేది టాప్మోస్ట్ ప్రయారిటీ. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు లేదు. హింసకు కారకులైన వారిని ఏమాత్రం ఉపేక్షించొద్దు. ప్రత్యేకించి మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధుల రక్షణ.. మొత్తం మీద పౌరులందరి రక్షణ, భద్రత విషయంలో ఏ మాత్రం రాజీ పడొద్దు. బడుగు, బలహీన వర్గాల వారి మీద కుల పరమైన దాడులు, హింస జరుగుతుంటే వాటికి కారకులైన వారిని చట్టం ముందు నిలబెట్టండి. తీవ్రవాదాన్ని, అసాంఘిక శక్తులను, సంఘ విద్రోహ కార్యకలాపాలను అణిచి వేయండి. ఈ విషయంలో పెద్ద, చిన్న అంటూ చూడొద్దని గతంలోనే చెప్పాను. మరోసారి కూడా స్పష్టం చేస్తున్నా. – సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: పోలీసు శాఖలో నాలుగేళ్ల పాటు ప్రతి ఏటా 6,500 ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. పోలీసు సంక్షేమ నిధికి మూడేళ్లుగా ఇవ్వాల్సిన నిధులను కూడా వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. పోలీసు అమర వీరుల సంస్మరణ దినం సందర్భంగా బుధవారం విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పోలీసు అమర వీరుల స్థూపం వద్ద నివాళులర్పించి, పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పోలీసులపై ముద్రించిన ‘అమరులు వారు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘పోలీసు అమర వీరుల కుటుంబాలకు సంపూర్ణ న్యాయం చేస్తామని మాట ఇస్తున్నా. అమరులైన ప్రతి ఒక్కరి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు మంచి జరగాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నా’ అన్నారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం – పోలీసు శాఖలో ఇప్పటి వరకు ఉన్న ఖాళీలు, వీక్లీ ఆఫ్ దృష్ట్యా అదనంగా కావాల్సిన సిబ్బందిని దృష్టిలో ఉంచుకుని ఉద్యోగాల భర్తీకి డిసెంబర్లో నోటిఫై చేసి జనవరి నుంచి షెడ్యూల్ ఇవ్వాల్సిందిగా డీజీపీని కోరాం. నాలుగు దశల్లో ప్రతి ఏటా 6,500 పోస్టులను భర్తీ చేస్తాం. – దేశంలోనే మహిళా భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్రం మనదే. ఆ దిశగా సంకేతాలు ఇచ్చేందుకు మొట్ట మొదటిసారిగా రాష్ట్రంలో నా సోదరి సుచరితమ్మను హోం మంత్రిగా చేశాం. – రాష్ట్రంలో కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే అసాంఘిక శక్తుల మీద పోలీసులు ఉక్కుపాదం మోపాలి. లంచగొండితనం, అవినీతి, రౌడీయిజం, నేర ప్రవర్తన వంటి వాటి మీద పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలి. పోలీసుల కష్టం నాకు తెలుసు – కోవిడ్ సమయంలో గ్రామ, వార్డు సచివాలయాలు మొదలు పోలీసులు, రాష్ట్ర డీజీపీ వరకు విధి నిర్వహణలో బాగా పని చేశారు. ఈ సందర్భంగా అసువులు బాసిన వారికి ప్రత్యేకంగా నివాళులు అర్పిస్తున్నాను. – నిరంతరం ప్రజల్లో ఉండే పోలీసులు ఎండనక, వాననక, రాత్రనక, పగలనక ఎంత కష్టపడతారో నాకు తెలుసు. ఇసుక, మద్యం దొంగదారి పడుతుంటే చట్టం అమలు చేయడానికి పోలీసులు అదనంగా శ్రమిస్తున్నారు. ఇవన్నీ నాకు తెలుసు. నేరాల సంఖ్య తగ్గించేందుకు నిరంతరం కృషి – నేరాల సంఖ్య తగ్గించడానికి మన పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారు. ఒక దేశం అభివృద్ధికి సూచిక తలసరి ఆదాయం. కానీ దానికి మించిన ఇండికేటర్ రాష్ట్రంలో నేరాల సంఖ్య తక్కువగా ఉండటం. – ఫిన్ల్యాండ్, నార్వే, స్విట్జర్లాండ్ వంటి దేశాలు గొప్పగా కనిపిస్తాయి. మానవ అభివృద్ధికి నేరాల రేటు తక్కువగా ఉండడం కూడా ఒక ప్రమాణం. అభివృద్ధి చెందుతున్న మన దేశంలో అలాంటి పరిస్థితి రాత్రికి రాత్రి వస్తుందని అనుకోవడం లేదు. అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచిన అనంతరం సెల్యూట్ చేస్తున్న సీఎం జగన్. చిత్రంలో సీఎస్ నీలం సాహ్ని, హోం మంత్రి సుచరిత, డీజీపీ సవాంగ్ ‘దిశ’ బిల్లుకు త్వరలో ఆమోదం వస్తుందని ఆశిస్తున్నా – దిశ బిల్లు తీసుకు రావడం నుంచి రాష్ట్రంలో ఇప్పటి వరకు 18 దిశ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేశాం. వాటిలో ఎక్కువగా మహిళలనే నియమించాం. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించడం దగ్గర నుంచి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడం కోసం అడుగులు వేస్తున్నాం. – దిశ బిల్లును కేంద్ర ప్రభుత్వ పరిశీలకు పంపించామని అందరికీ తెలుసు. త్వరలో ఆమోదం వస్తుందని ఆశిస్తున్నాం. – ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, సీఎస్ నీలం సాహ్ని, పలువురు ప్రజా ప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నమ్మకానికి నిదర్శనం పోలీసుల క్యాప్పై నాలుగు సింహాలు ఉంటాయి. నాలుగు వైపుల నుంచి ఏ ఆపద వచ్చినా కాపాడతారన్న నమ్మకానికి అవి నిదర్శనం. సారనాథ్ స్థూపం నుంచి తీసుకున్న ధర్మచక్రం, దాని కింద ఉన్న సత్యమేవ జయతే అన్న వాక్యం.. అధికారం అనేది ఎంతటి బాధ్యతో చెబుతుంది. 61 ఏళ్లుగా పోలీసుల త్యాగాలను గుర్తు చేసుకుంటున్నాం. ఈ రోజు పోలీసు అమర వీరులను దేశం యావత్తూ స్మరించుకునే రోజు. విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన ప్రతి పోలీసు, ఆ కుటుంబానికి మన సమాజం జేజేలు పలుకుతుంది. అమరవీరుల కుటుంబాలకు అండగా ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది. మహిళా, బాలికా సంక్షమంతో పాటు భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. పోలీసులకు వీక్లీ ఆఫ్ ప్రకటించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మహిళా సిబ్బందిని ప్రోత్సహించి వారి సాధికారతకు ప్రాధాన్యత ఇచ్చాం. సైబర్ నేరాల పట్ల బాలికలకు అవగాహన కల్పించాం. పోలీస్ సేవా యాప్ అందుబాటులోకి తీసుకొచ్చాం. – మేకతోటి సుచరిత, హోం మంత్రి సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం విధి నిర్వహణలో వీరమరణం పొందిన పోలీసులు అందరికీ ఆదర్శంగా నిలిచారు. కరోనాతో మృతి చెందిన పోలీసులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.50 లక్షలు ప్రకటించారు. హోంగార్డుల జీతాల పెంచారు. టెక్నాలజీ ఉపయోగించడంలో ఏపీకి 27 జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయి. సవాళ్లు ఎదుర్కోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. – గౌతమ్ సవాంగ్, డీజీపీ -
పోలీస్ అమరవీరులకు సీఎం జగన్ నివాళి
-
పోలీస్ అమరవీరులకు సీఎం జగన్ నివాళి
-
తీవ్రవాదాన్ని ఏమాత్రం ఉపేక్షించవద్దు: సీఎం వైఎస్ జగన్
-
పోలీస్ అమరవీరులకు సీఎం జగన్ నివాళి
సాక్షి, విజయవాడ: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు నేటి నుంచి పది రోజులపాటు జరగనున్నాయి. ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న సంస్మరణ దినోత్సవ సభలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి హోం మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్ స్వాగతం పలికారు. ఉదయం 8 గంటలకు స్టేడియానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్ పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం పెరేడ్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్ గౌరవ వందనం స్వీకరించారు. 'అమరులు వారు' పుస్తకాన్ని ఆవిష్కరించారు. దాదాపు గంటపాటు సాగనున్న సీఎం ప్రోగ్రాంకి పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో సీఎంతో పాటు హోం మంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్ పాల్గొన్నారు. (నేడే ‘వైఎస్సార్ బీమా’) -
సీఎం జగన్ను కలిసిన దివ్య తల్లిదండ్రులు
-
సీఎం జగన్ను కలవనున్న దివ్య పేరెంట్స్
సాక్షి, గుంటూరు: విజయవాడలో ప్రేమోన్మాది నరేంద్రబాబు చేతిలో హతమైన దివ్య తేజస్విని తల్లిదండ్రులు మంగళవారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలవనున్నారు. మూడు రోజుల క్రితం హోంమంత్రి సుచరిత దివ్యతేజస్విని తల్లిదండ్రులను పరామర్శించటానికి వెళ్లిన సందర్భంగా, తమకు సీఎంను కలిసే అవకాశం కల్పించమని హోంమంత్రిని కోరారు. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎంను కలవటానికి హోంమంత్రి ప్రత్యేక చొరవ తీసుకొని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్బంగా దివ్య తేజస్విని కుటుంబసభ్యులు సాక్షి టీవీతో మాట్లాడారు. 'సీఎం జగన్ అపాయింట్మెంట్ ఇవ్వడం మా అదృష్టం. మహిళా పక్షపాతిగా ఉండే సీఎం మాకు అవకాశం కల్పిస్తారని తెలుసు. మాకు జరిగిన అన్యాయాన్ని సీఎం జగన్కు వివరిస్తాం. నిందితుడు నాగేంద్రను ఉరితీయాలని కోరతాం' అని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. కాగా విజయవాడకు చెందిన బీటెక్ విద్యార్థిని దివ్య తేజస్విని ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. (అమ్మాయిలు ధైర్యంగా ఉండండి: సుచరిత) -
మహిళలకు రక్షణ కల్పిస్తాం
గుణదల(విజయవాడ తూర్పు): మహిళలకు రక్షణ కల్పించే దిశగా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని హోం శాఖా మంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. విజయవాడ నగరంలోని క్రీస్తురాజపురంలో ప్రేమోన్మాది చేతిలో దారుణహత్యకు గురయిన దివ్య తేజస్విని కుటుంబసభ్యులను శనివారం పరామర్శించారు. అనంతరం మంత్రి సుచరిత మాట్లాడుతూ.. దివ్య కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం దిశ పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేసిందని చెప్పారు. నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ, 302 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో వేధింపులు, హత్యలు గణనీయంగా తగ్గాయన్నారు. టీడీపీ హయాంలో మహిళలపై అత్యాచారాలు అధికంగా ఉండేవని సుచరిత తెలిపారు. దివ్య తల్లిదండ్రుల లేఖ ఆడపిల్లలకు జరుగుతున్న అఘాయిత్యాలను ప్రస్తావిస్తూ మంత్రి సుచరితకు దివ్య తల్లిదండ్రులు లేఖ అందజేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కొంతమంది యువకులు మాదకద్రవ్యాలకు బానిసలై ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా కొండవీడు కోట
-
దేవాలయాల పరిరక్షణకు పటిష్ట చర్యలు
చిలకలూరిపేట: దేవాలయాల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని క్రైస్తవ శ్మశానవాటికను ఎమ్మెల్యే విడదల రజనితో కలిసి శనివారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ప్రభుత్వ సంక్షేమ పథకాలు చూసి విమర్శించేందుకు ఏమీ లేక టీడీపీ వంటి ప్రతిపక్షాలు కులమతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కుట్రలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు అంతర్వేది వంటి ఘటనలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. అందుకే ప్రభుత్వం ఈ కుట్ర కోణాన్ని వెలికి తీసేందుకు అంతర్వేది కేసు విచారణను సీబీఐకి అప్పగించినట్లు చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందు జాగ్రత్త చర్యగా ఆలయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. -
తప్పు చేస్తే ఎవరినైనా ఉపేక్షించం
అనంతపురం సప్తగిరి సర్కిల్: తప్పు చేసిన వారు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. శుక్రవారం అనంతపురం పీటీసీ మైదానంలో నిర్వహించిన స్టైఫండరీ కేడెట్ ట్రైనీ ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే.. ► మా పార్టీ ఎమ్మెల్యేలు తప్పు చేసినా ఉపేక్షించవద్దని సీఎం వైఎస్ జగన్ పోలీసులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అలాగే, తప్పు చేసిన పోలీసు అధికారులపైనా కేసులు నమోదు చేయిస్తున్నాం. ► ‘స్పందన’ ద్వారా 87వేల సమస్యలు మా దృష్టికి వచ్చాయి. వీటిలో 80% వరకు పరిష్కరించాం. ► కొత్తగా తిరుపతి, అమరావతి, విశాఖ ప్రాంతాల్లో ఫోరెన్సిక్ ల్యాబ్లను ఏర్పాటు చేస్తున్నాం. ► 87 పోలీస్ సేవలను ఏపీ పోలీస్ సేవ యాప్ ద్వారా సామాన్య ప్రజలకు అందుబాటులోకి తెచ్చాం. దిశ యాప్ను 11 లక్షల మంది మహిళలు వినియోగించుకుంటున్నారు. అట్టహాసంగా పాసింగ్ అవుట్ పరేడ్ అనంతపురం పీటీసీ మైదానంలో 2019–20 ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. శిక్షణ పూర్తి చేసుకున్న 273 మంది ప్రొబేషనరీ ఎస్ఐలు పరేడ్ నిర్వహించి హోం మంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్లకు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరచిన వారికి పురస్కారాలను ప్రదానం చేశారు. 2019–20 బ్యాచ్లో మొత్తం 273 మంది ఎస్ఐలుగా శిక్షణ పూర్తి చేయగా, ఇందులో సివిల్ 138 మంది, ఏఆర్ 69 మంది, ఏపీఎస్పీ ఎస్ఐలు 66 మంది ఉన్నారు. అన్ని విభాగాల్లో కలిపి ఈసారి 55 మంది మహిళా ఎస్ఐలు ఉండటం గమనార్హం. కార్యక్రమంలో ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
ట్రైనీ ఎస్సైల పాసింగ్ అవుట్ పరేడ్
-
ట్రైనీ ఎస్సైల పాసింగ్ అవుట్ పరేడ్
పోలీస్.. ఈ పదమే వారిని యూనిఫాం వైపు నడిపించింది. ఒక్కొక్కరిదీ ఒక్కో నేపథ్యం.. అందరి కల ఒక్కటే. ఖాకీ యూనిఫాం వేసుకుని చట్టాన్ని రక్షించడం. సామాన్యులకు న్యాయం చేయడం. ఇందుకోసం ఎంతో కష్టపడ్డారు. శిక్షణ సైతం పూర్తి చేసుకున్నారు. చివరగా ప్రజా సేవకు సిద్ధమవుతున్నారు. పీటీసీలో శిక్షణ పూర్తి చేసుకున్న 273 మంది ట్రైనీ ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్ శుక్రవారం నిర్వహించారు. సాక్షి, అనంతపురం: అనంతపురం పోలీసు ట్రైనింగ్ కళాశాల మరో అపురూప ఘట్టానికి వేదికైంది. శుక్రవారం పీటీసీలో 273 మంది స్టైఫండరీ కేడెట్ ట్రైనీ ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, గౌరవ అతిథిగా డీజీపీ గౌతమ్ సవాంగ్ హాజరయ్యారు. పీటీసీ మైదానంలో ఉదయం 7.40 గంటలకు పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమం ప్రారంభం కాగా.. అనంతరం హోంమంత్రి, డీజీపీ గౌరవవందనం స్వీకరించారు. పోలీసు శిక్షణ కళాశాలలో జరిగిన ఎస్సైల పాసింగ్ అవుట్ పరేడ్లో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఎమ్మెల్సీలు వెన్నపూసగోపాల్ రెడ్డి, శమంతకమణి, రాయలసీమ ఐజీ నాగేంద్ర కుమార్, డీఐజీలు వెంకట్రామిరెడ్డి, క్రాంతిరాణాటాటా, ఎస్పీ సత్యయేసుబాబు పాల్గొన్నారు. కార్యక్రమంలో డీజీపీ గౌతం సవాంగ్ మాట్లాడుతూ.. ప్రజల భద్రత కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెద్దపీట వేస్తున్నారు. ఏపీ పోలీసు వ్యవస్థను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతున్న ఘనత సీఎం జగన్దే. దిశా బిల్లు తీసుకొచ్చి మహిళలకు భద్రత కల్పించారు. దిశ చట్టం ద్వారా 21 రోజుల్లో దోషులకు శిక్ష పడేలా చేశారు. ఏపీలోని అన్ని పోలీసు స్టేషన్లను ఉమెన్ ఫ్రెండ్లీ గా మార్చేశాం' అని అన్నారు. ప్రతిభావంతులకు పురస్కారాలు అనంతపురం పోలీసు ట్రైనింగ్ కళాశాలలో దాదాపు సంవత్సరం పాటు శిక్షణ పొందిన 138 మంది సివిల్ ఎస్ఐలు, 9 నెలల పాటు శిక్షణ పూర్తి చేసుకున్న 69 మంది ఏఆర్, 66 మంది ఏపీఎస్పీ ఎస్ఐలు పరేడ్లో పాల్గొన్నారు. శిక్షణలో భాగంగా వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరచిన వారికి పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమం సందర్భంగా హోంమంత్రి మేకతోటి సుచరిత పురస్కారాలను అందజేశారు. అంతకుముందు వారితో ప్రతిజ్ఞ చేయించారు. డీజీపీ సమావేశం డీజీపీ గౌతమ్ సవాంగ్ ఉదయం 11.30 నుంచి 12 గంటల సమయంలో డీపీఓలో జరిగే సమావేశంలో పాల్గొంటారు. జిల్లా పోలీసుల పనితీరు తదితర అంశాలపై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం చిత్తూరు, వైస్సార్ కడప జిల్లా పోలీ సులకు రివార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. హోంమంత్రికి ఘన స్వాగతం సాక్షి, అనంతపురం: ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్లో ముఖ్యఅతిథిగా పాల్గొననున్న హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ సవాంగ్ వేర్వేరుగా గురువారం రాత్రే నగరానికి చేరుకున్నారు. ఆర్అండ్బీ అతిథిగృహం వద్ద హోంమంత్రికి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఐజీ నాగేంద్రకుమార్, ఎస్పీ సత్యయేసుబాబు, జేసీ నిశాంత్కుమార్లు ఘన స్వాగతం పలికారు. అలాగే వైఎస్సార్సీపీ నాయకులు తోపుదుర్తి చంద్రశేఖర్రెడ్డి, గంగుల భానుమతి, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పురుషోత్తం, జిల్లా అధ్యక్షుడు పెన్నోబిలేసు కూడా హోంమంత్రికి బొకేలిచ్చి స్వాగతం పలికారు. -
అనంతపురం : ఎస్ఐల ట్రైనింగ్ పూర్తి.. పరేడ్ రిహార్సల్స్
-
దేశంలోనే మొదటిసారిగా...ఏపీ పోలీస్శాఖ సరికొత్త యాప్
-
త్వరలో నిజాలు నిగ్గు తేలుస్తాం
సాక్షి, ప్రకాశం: అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని రథం అగ్నికి ఆహుతైన ఘటనపై ప్రభుత్వం సీబీఐ ఎంక్వైరీ వేసిందని, త్వరలో నిజాలు నిగ్గు తేలుస్తామని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. రథం తగలపడటం వెనుక కుట్ర కోణం దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రతి పక్షాల విమర్శలు చూస్తుంటే.. ఆ అనుమానాలు మరింత బలపడుతున్నాయన్నారు. ఏది ఏమైనా సీబీఐ ఎంక్వైరీలో అన్నీ తేలుతాయని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంతర్వేది ఘటనపై సీరియస్గా ఉన్నారని చెప్పారు. శుక్రవారం శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా పోలీస్ పాసింగ్ పెరేడ్లో సుచరిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా వైరస్పై సమరంలో పోలీసులు కీలకంగా పనిచేశారని తెలిపారు. వారి కోసం హెల్త్ క్యాంప్లు పెడుతున్నామని, దేశంలోనే తొలి సారిగా పోలీసులకు వీక్లీ ఆఫ్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం తమదేనని పేర్కొన్నారు. ఏపీ పోలీసులు దేశ వ్యాప్తంగా మన్ననలు పొందుతున్నారని చెప్పారు. వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అమరులైన 50 లక్షల మంది పోలీసులకు భీమా కల్పించడం జరిగిందన్నారు. (అంతర్వేది రథం కేసు సీబీఐకి అప్పగింత) -
‘దృష్టిమళ్లించేందుకే చంద్రబాబు కట్టుకథలు’
సాక్షి, అమరావతి : ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి టీడీపీ అధ్యక్షుడు నారాచంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణల నేపథ్యంలో అందుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని కోరి 24 గంటలు గడిచినా ఏ ఆధారాలు సమర్పించలేకపోయారని హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. హోంమంత్రిగా తాను, రాష్ట్ర డీజీపీకి విజ్ఞప్తిచేసి 24 గంటలు గడిచిపోయిందని, అయినా ఈ క్షణం వరకూ ఎటువంటి ఆధారాలూ సమర్పించలేకపోయారని పేర్కొన్నారు. అయితే కొన్ని మీడియా సంస్థలతో కలిసి వారు చేస్తున్న ఒక కుట్రపూరితమైన ప్రచారం వెనుక ఏ వ్యూహం దాగిఉందన్న అంశాన్ని రాష్ట్ర ప్రజలముందు ఉంచటం తన విధిగా భావిస్తున్నానని ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు. (బాబు అక్రమాల కేసు గిన్నిస్ రికార్డు లెవల్లో..) ‘మీ అందరికీ తెలుసు. అమరావతిలో చంద్రబాబునాయుడు, ఆయన బినామీలు, ఆయన సన్నిహితులు ఎంతటి భారీ కుంభకోణానికి పాల్పడ్డారన్నది. అయితే అందుకు సంబంధించి పూర్తిస్థాయి విచారణను మేం అధికారంలోకి రాగానే చేపడతామని చెప్పిన మేరకు రాష్ట్ర పోలీసులోని సంబంధిత విభాగాలు ఈ విషయంపై పూర్తిస్థాయిలో దృష్టిసారించారు. విచారణను ఒక కొలిక్కి తీసుకు వస్తున్న తరుణంలో చంద్రబాబు నాయుడు, ఆయన బినామీలు ఈ నివేదికలో నిజాలను ప్రజలకు తెలియకుండా మరుగుపరచాలన్న దురుద్దేశంతో పెద్ద కుట్రకు తెరతీసినట్టుగా మాకు కనిపిస్తోంది. ఇంటా, బయటా తనకున్న పరిచయాలను, తనకు సహకరించే వారిని ఉపయోగించుకుంటూ, మీడియా సంస్థలతో కలిసి చేస్తున్న ఈకుట్ర వల్ల ఆయన పొందాలనుకుంటున్న ప్రయోజనాలను ఎట్టి పరిస్థితుల్లో పొందలేరని స్పష్టంచేస్తున్నాను.(రాష్ట్రానికి చంద్రబాబు ద్రోహం) అమరావతి భూముల చుట్టూ అసలైన కుంభకోణాన్ని వెలికి తీయకుండా నిరోధించేందుకు, దర్యాప్తు ముందుకు సాగనీయకుండా అడ్డుకునేందుకు, పోలీసు, ప్రభుత్వ యంత్రాంగం మీద ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల ద్వారా వారిని లక్ష్యంగా చేసుకున్నారు. వారి స్థైర్యాన్ని దెబ్బతీయాలనే ఈ కుట్రపూరిత వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో చంద్రబాబు మీడియా భాగస్వాములు, మరికొందరు ఇంటా, బయటా సహకరించే వ్యక్తులు ఉన్నారని అందరికీ అర్థమవుతోంది. కాబట్టి చట్టవిరుద్ధమైన ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందనేది అబద్ధం. ఈ విషయాలు అందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాను. అమరావతి ల్యాండ్ స్కాంనుంచి తప్పించుకునేందుకు ఇటువంటి ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబు, ఆయన బినామీలు, ఆయన సన్నిహితులు తప్పించుకోలేరని, అధికారుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేరని స్పష్టంచేస్తున్నాను’ అని సుచరిత పేర్కొన్నారు.(ఫోన్ ట్యాపింగ్పై విచారణ 20 కి వాయిదా) -
వైఎస్ జగన్ పేదల సంక్షేమానికి పాటుపడుతున్నారు
సాక్షి, నెల్లూరు: నెల్లూరులోని పోలీస్ పెరేడ్ మైదానంలో 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి, శాంతి కపోతాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా మంత్రి సుచరిత మాట్లాడుతూ.. 'నవరత్నాలతో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పేదల సంకేమానికి పాటుపడుతున్నారు. జిల్లాలో రూ.211 కోట్లతో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి వసతి కల్పిస్తున్నాం. జిల్లాలోని సంగం బ్యారేజీ పనులను ఈ ఏడాదిలో పూర్తి చేస్తాం. కరోనా నివారణకు కోవిడ్ ఆసుపత్రుల్లో అధునాతన వసతులు కల్పిస్తున్నాం. సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాం' అని మంత్రి సుచరిత తన ప్రసంగంలో వివరించారు. కార్యక్రమంలో ఎంఎల్ఏ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు, ఎస్పీ భాస్కర్ భూషణ్ పాల్గొన్నారు. (ఆ ఘనత సీఎం జగన్దే: మంత్రి సురేష్) 74th Independence Day Celebrations at Nellore District, Andhra Pradesh. #IndependenceDay pic.twitter.com/DtaPHTowBP — Mekathoti Sucharitha (@SucharitaYSRCP) August 15, 2020 -
'మహిళలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదే'
సాక్షి, తాడేపల్లి : పాదయాత్ర ద్వారా మహిళల కష్టాలు తెలుసుకొని ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించారని హోం మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. తాడేపల్లిలో సుచరిత గురువారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు వైఎస్సార్ చేయూత పథకంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. 23 లక్షల మంది మహిళకు వైఎస్సార్ చేయూత ద్వారా లబ్ది చేకూరిందన్నారు. హోం మంత్రి మాట్లాడుతూ..' అమూల్, రిలియన్స్ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకోవడం ద్వారా మహిళలు ఆర్దికంగా స్థిరపడ వచ్చు. వైఎస్సార్ చేయూత పథకంపై టీడీపీ నేతలు విమర్శలు చేయడం తగదు.మహిళను మోసం చేసిన ఘనత చంద్రబాబుది. డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పి చంద్రబాబు మహిళను మోసం చేశారు. అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో జగన్ మూడవ స్థానం సాధించడం రాష్ట్రానికి గౌరవ ప్రదంగా భావిస్తున్నాము.' అంటూ తెలిపారు. (చంద్రబాబు రహస్య ఎజెండాను హర్షకుమార్..) మహిళలు ఆర్దికంగా స్థిరపడ్డడం కోసం సీఎం వైఎస్ జగన్ అనేక నిర్ణయాలు తీసుకున్నారు. మహిళకు సున్నా వడ్డీ పథకం అమలు చేశారు.డ్వాక్రా రుణాలు నాలుగు విడతల్లో చెల్లించనున్నారు. అమ్మఒడి, చేయుత ద్వారా మహిళకు ఎంతో మేలు జరుగుతుంది.మహిళ పక్షపాతిగా సీఎం జగన్.. నామినేషన్ పదవులు పనుల్లో 50 శాతం మహిళలకు కల్పించారు. 30 లక్షల మంది మహిళలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. మహిళకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు. ఉనికి కోల్పోతామే భయంతో టీడీపీ నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.టీడీపీ మహిళకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేకపోయింది. దళితుల పై దాడి జరిగిన వెంటనే మా ప్రభుత్వం తక్షణమే స్పందించి దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంది. కానీ టీడీపీ మాత్రం కుల రాజకీయాలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటుంది' అంటూ సుచరిత విమర్శించారు. -
'మహిళలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదే'
-
సమగ్ర అభివృద్ధికి కొత్త పాలసీ
-
అగ్నిప్రమాదం: బాధ్యులపై కఠిన చర్యలు..
సాక్షి, విజయవాడ : అగ్ని ప్రమాదానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి సుచరిత, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. ఈ ప్రమాదంపై వారిద్దరూ ఆదివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ...‘జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం రెండు కమిటీలు నియమించింది. ఒక కమిటీ హోంశాఖ , మరొక కమిటీ వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. రెండు కమిటీలు 48 గంటల్లో నివేదిక ఇస్తాయి. నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. విజయవాడలో 15 ప్రయివేట్ కోవిడ్ సెంటర్లు ఉన్నాయి, వాటన్నింటినీ తనిఖీ చేస్తాం. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాథమికంగా ఆస్పత్రి వైఫ్యలం ఉన్నట్లు గుర్తించాం. (చదవండి : మృతుల కుటుంబాలకు రూ.50లక్షల ఎక్స్గ్రేషియా) ప్రమాదం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో జరిగింది. 5 గంటల 9 నిమిషాలకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం వచ్చింది. 5.13 గంటలకు ప్రమాదం జరిగిన స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 31మంది పేషెంట్లు ఉన్న ఆ సెంటర్లో 10మంది చనిపోయారు. ఈ ప్రమాదంపై రెండు కమిటీలు వేశాం. 48 గంటల్లో నివేదిక ఇస్తుంది. ముఖ్యమంత్రి మానవత్వంతో చనిపోయిన ఒక్కొక్క మృతుల కుటుంబానికి 50 లక్షల రూపాయిలు పరిహారం ప్రకటించారు.’ అని తెలిపారు. (అగ్ని ప్రమాదంపై విచారణకు కమిటీ ఏర్పాటు ) ప్రమాదం ఉదయం 4.30 లకు జరిగింది.. అగ్నిప్రమాదంపై ఫైర్ సేఫ్టీ డైరెక్టర్ జయరాం నాయక్ మాట్లాడుతూ ప్రమాద సమాచారం అందిన 4 నిమిషాల్లోనే 6 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నాం. ప్రమాదంలో పదిమంది చనిపోయారు. వారిలో ముగ్గురు మహిళలు, ఏడుగురు పురుషులు ఉన్నారు.వారిలో ఏడుగురు ఊపిరి ఆడక చనిపోయారు. మృతులను ఇప్పటికే గుర్తించారు. ప్రమాదం ఎలా జరిగిందనేది నివేదిక వచ్చిన తర్వాత తెలుస్తుందని అన్నారు. -
రమేష్ ఆస్పత్రి ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు
-
అగ్ని ప్రమాదంపై విచారణకు కమిటీ ఏర్పాటు
-
అగ్ని ప్రమాదంపై విచారణకు కమిటీ ఏర్పాటు : ఆళ్ల నాని
సాక్షి, కృష్ణా: కరోనా పేషెంట్ల కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రి లీజుకు తీసుకుని నిర్వహిస్తున్న స్వర్ణ ప్యాలెస్ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటన బాధాకరమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. ముందుగా ఘటన స్థలాన్ని సందర్శించి అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి మీడియాతో మాట్లాడారు. తెల్లవారుజామున 4:45 గంటలకు అగ్నిప్రమాదం జరిగిందన్నారు. వెంటనే ఉదయం 5:09 గంటలకి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారని తెలిపారు. ఉదయం 5:13 గంటలకు ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి వెళ్లారని చెప్పారు. ప్రమాదం నుంచి 18 మందిని వెంటనే రెస్క్యూ చేశారని తెలిపారు. (అగ్నిప్రమాద ఘటనపై వైఎస్ జగన్కు ప్రధాని మోదీ ఫోన్) ప్రమాదంపై విచారణకు కమిటీ ఏర్పాటు చేశామని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించామని చెప్పారు. రమేష్ ఆస్పత్రి నిర్లక్ష్యం ఉన్నట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందన్నారు. ప్రమాద బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే హోటల్, రమేష్ ఆస్పత్రిపై కేసు నమోదు చేశామని చెప్పారు. 304, 308, రెడ్విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం వెల్లడించారు. అగ్నిప్రమాద ఘటనలో 10 మంది మృతి చెందారని వెల్లడించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారని, మిగిలిన 21 మంది బాధితులకు చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. కరోనాకు138 ఆస్పత్రుల్లో వైద్య సౌకర్యాలు అందిస్తున్నామని తెలిపారు. సాధ్యమైనంత వరకు ప్రభుత్వ ఆస్పత్రులకే కరోనా బాధితులు వెళ్లాలని తెలిపారు. ప్రమాదంపై నివేదిక వచ్చిన తరువాత అన్ని ప్రైవేట్ ఆస్పత్రులపై ఒక డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. విజయవాడలో 15 ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స చేస్తున్నారని తెలిపారు. (విజయవాడ అగ్ని ప్రమాదం.. ప్రభుత్వం సీరియస్) ప్రమాదంపై హోం మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ.. ప్రమాద కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేవలం 48 గంటల్లో ఘటనకు సంబంధించిన నివేదికను కమిటీ ఇస్తుందని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మానవత్వంతో మృతి చెందిన ఒక్కొక్కరికి రూ.50లక్షలు ప్రకటించారని చెప్పారు. మంత్రి ఆళ్ల నానితో పాటు హోం మంత్రులు సుచరిత, వెల్లంపల్లి శ్రీనివాస్, పేర్ని నాని, ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఉన్నారు. (ప్రమాద కారకులపై కఠిన చర్యలు..) -
మేము గంటల వ్యవధిలోనే జైలుకు పంపుతున్నాం
సాక్షి, అమరావతి/రాయదుర్గం: ఏదైనా ఘటన జరిగితే టీడీపీ హయాంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని, తమ ప్రభుత్వ హయాంలో ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్టు చేస్తున్నామని హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. చంద్రబాబు పాలనలో ఎప్పుడైనా ఇలాంటి చర్యలు తీసుకున్నారా? అని ఆమె ప్రశ్నించారు. హైదరాబాద్లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో, రాయదుర్గంలో బుధవారం సుచరిత మీడియాతో మాట్లాడారు. ఆమె ఇంకా ఏమన్నారంటే.. ► గతంలో చంద్రబాబు దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్నారు. ఆ మాటలకు ఇప్పటివరకు దళితులకు క్షమాపణ చెప్పలేదు. చంద్రబాబు దళిత ద్రోహి. ► దళితులు స్నానం చేయరు.. మురికిగా ఉంటారని అప్పటి మంత్రి ఆదినారాయణరెడ్డి మాట్లాడితే చర్యలేవి? ► దళితులను ఉద్దేశించి ‘మీకెందుకురా రాజకీయాలు’ అని దూషించిన చింతమనేని ప్రభాకర్పైనా చర్యలు తీసుకోలేదు. -
సైబర్ సెక్యురిటీ నిపుణులతో కార్యక్రమాల నిర్వహణ: సుచరిత
-
కొత్తగా మరో పన్నెండు ప్రైవేటు ఆసుపత్రులు
-
కొత్తగా మరో పన్నెండు ప్రైవేటు ఆసుపత్రులు : సుచరిత
సాక్షి, గుంటూరు : కరోనా నిబంధనలు పాటించడంలో చాలామంది నిర్లక్ష్యం వహిస్తున్నారని రాష్ర్ట హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. కరోనా నియంత్రణపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆమె ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకి అధికమవుతున్నాయని నిర్లక్ష్యం వహించడం వల్ల కేసుల తీవ్రత పెరుగుందన్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా లక్షా యాభైవేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా పదివేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని సుచరిత పేర్కొన్నారు. మూడు వేల బెడ్స్తో మరో పన్నెండు ప్రైవేటు ఆసుపత్రులను సిద్ధం చేశామని, హాస్పిటల్స్లో సిబ్బంది భయపడకుండా సేవలందించాలిని ఆ సందర్భంగా కోరారు. వైద్యం విషయంలో అక్రమాలకు పాల్పడితే ప్రైవేటు ఆసుపత్రుల లైసెన్సు రద్దు చేస్తామని సుచరిత హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 48,114 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా 8,147 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 80,858 కు చేరింది. వీటిలో ఒక్క గుంటూరు జిల్లాలోనే 703 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. (ఏపీలో కొత్తగా 8147 పాజిటివ్, 44 మంది మృతి) -
50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైఎస్ జగన్ది
-
బాబు.. రాయలసీమకు ఏం చేశారు?
-
బాబు.. రాయలసీమకు ఏం చేశారు?
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చెందాలంటే అధికార వికేంద్రీకరణ జరగాల్సిందే అని హోం మంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. ఆమె శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రెండు వందల దేశాలు అమరావతి రాజధానిగా కోరుకుంటున్నారని చంద్రబాబు చెబుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు బాబు అందరికీ గ్రాఫిక్స్ చూపించారని ఎద్దేవా చేశారు. ఇప్పుడేమో అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. రాజధానిని అభివృద్ధి చేసి ఉంటే ఎందుకు రాజధానిలోని రెండు నియోజకవర్గాల్లో ఓడిపోయారని ప్రశ్నించారు. మంగళగిరిలో లోకేష్ ఎందుకు ఓడిపోయాడని మండిపడ్డారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు సాధించిందిచచని చెప్పడానికి ఇదే దీనికి నిదర్శనం అన్నారు.విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయితే ఎప్పటి నుంచో వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని తెలిపారు. (‘టీడీపీ ఓడిపోవడంతో బీజేపీలో చేరారు’) చంద్రబాబు రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఏం చేశాడని నిలదీశారు. ప్రభుత్వం రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. దీన్ని జీర్ణించుకోలేని ప్రభుత్వంపై చంద్రబాబు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడును అరెస్టు చేస్తే కులం రంగు పూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మర్డర్ కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అరెస్టు చేస్తే గగ్గోలు పెడుతున్నారని దుయ్యబట్టారు. ఈ మర్డర్ కేసులో కొల్లు రవీంద్ర పాత్ర ఉందని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. రాజధాని రైతులకు ప్లాట్లు అభివృద్ధి చేస్తామని సీఎం జగన్ చెప్పారని పదేళ్లు చెల్లించే రైతులకు కౌలును రూ.15 వేలకు పెంచారని తెలిపారు. ఒకసారి రైతులు భూమి ఇచ్చిన తర్వాత అది ప్రభుత్వ భూమే అని దానిని ప్రభుత్వం దేనికైనా ఉపయోగించుకోవచ్చు అని పేర్కొన్నారు. రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రభుత్వం నిర్ణయిస్తే ఎందుకు అడ్డుపడుతున్నారని సూటిగా ప్రశ్నించారు. (‘బాబు రాజకీయ జీవితం ముగింపుకు చేరుకుంది’) -
వాలంటీర్ వ్యవస్థ సేవలు వెలకట్టలేనివి
సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నూతన పరిపాలనకు స్వీకారం చుట్టారని రాష్ట్ర మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం జగన్ అమలు చేశారని తెలిపారు. మేనిఫెస్టోలో లేని హామీలను కూడా నెరవేర్చుతున్నామని ఆయన అన్నారు. ఏడాది కాలంలో 4 లక్షల ఉద్యోగాలను కల్పించామని మోపిదేవి చెప్పారు. ఈ సంవత్సర కాలంలో 46 వేల కోట్లు ఖర్చు చేసి 3 లక్షల మంది లబ్దిదారులకు వివిధ పథకాలు అందించామని ఆయన అన్నారు. జగన్ పాలనను ప్రజలంతా స్వాగతిస్తున్నారని మోపిదేవి వెంకటరమణ తెలిపారు. (నిరూపిస్తే రాజీనామా చేస్తా: ఎంపీ సవాల్) అదే విధంగా హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ.. ఏడాదిలో 3 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూర్చిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిది అని అన్నారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేశామని ఆమె చెప్పారు. కరోనా కాలంలో వాలంటీర్ వ్యవస్థ సేవలు వెల కట్టలేనివని మంత్రి గుర్తు చేశారు. మేనిఫెస్టోలో లేని హామీలను కూడా నెరవేర్చామని మేకతోటి సుచరిత అన్నారు. (సీఎం జగన్ అధ్యక్షతన ‘మన పాలన- మీ సూచన’) ఏడాది పరిపాలనను ప్రజా పరిశీలనలో పెట్టిన ఘనత సీఎం జగన్మోహన్రెడ్డిదే అని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. పరిపాలనలో రాజకీయాలు ఉండవని సీఎం జగన్ ముందు నుంచి చెబుతున్నారని ఆయన తెలిపారు. సీఎం జగన్ అవినీతి, అక్రమాలకు తావు లేకుండా పాలన చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. గ్రామీణ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి జగన్ చరిత్రలో నిలిచిపోయారని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కొనియాడారు. -
లాక్డౌన్కు సహకరించాలి: సుచరిత
-
వ్యక్తిగత పరిశుభ్రతే రక్షణ కవచం
-
మాచర్ల ఘటనకు బాధ్యులైన ముగ్గురిని అరెస్ట్ చేశాం
-
జైలులో స్కిల్ డెవలప్మెంట్ యూనిట్
కడప అర్బన్: దేశంలోనే తొలిసారిగా కడప కేంద్ర కారాగారంలో రూ.4.70 కోట్ల వ్యయంతో స్కిల్డెవలప్మెంట్ మాడ్యులర్ ఫర్నిచర్ యూనిట్ నెలకొల్పుతున్నట్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. కడప కేంద్ర కారాగారంలో శుక్రవారం ఉదయం ఆమె ఈ యూనిట్కు శంకుస్థాపన చేశారు. కేంద్ర కారాగారంలో ఖైదీలతో కాసేపు మాట్లాడారు. మహిళా ప్రత్యేక కారాగారాన్ని సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ స్విట్జర్లాండ్లో తప్ప మరెక్కడాలేని మాడ్యులర్ ఫర్నిచర్ యూనిట్ను కడప కేంద్ర కారాగారంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఖైదీలలో పరివర్తన కోసం చేపట్టిన సంస్కరణల్లో భాగంగా ఈ యూనిట్ నెలకొల్పుతున్నామన్నారు. రాబోయే నాలుగు నెలల్లో ఈ యూనిట్ పూర్తవుతుందన్నారు. ఖైదీల్లో వృత్తి నైపుణ్యం పెంపొందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. దిశ యాప్ను ప్రారంభించిన 12 రోజుల్లోనే లక్షా 50 వేల మంది డౌన్లోడ్ చేసుకున్నారన్నారు. ప్రత్యేకంగా కోర్టుల ఏర్పాటు కోసం ప్రభుత్వం రూ.87 కోట్లు ఇప్పటికే మంజూరు చేసిందన్నారు. స్థానిక ప్రజలు వ్యతిరేకిస్తున్నా మాజీ సీఎం చంద్రబాబు రాజకీయంగా ఉనికిని చాటుకునేందుకు గురువారం విశాఖ వచ్చారన్నారు. బయట వ్యక్తులెవరూ ఆయన్ను అడ్డుకోలేదని, ప్రజలే అడ్డుకున్నారన్నారు. కడప పోలీస్ పేరుతో పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం ఎస్బీ అంజాద్బాషా, ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ప్రభుత్వ చీఫ్విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు, జైళ్ల శాఖ రాష్ట్ర డీజీ హసన్రాజా, జైళ్లశాఖ డీఐజీ వరప్రసాదరావు, జిల్లా కలెక్టర్ హరికిరణ్, ఎస్పీ అన్బురాజన్ పాల్గొన్నారు. అంతకుముందు సుచరిత అమీన్పీర్ దర్గా (పెద్ద దర్గా)ను సందర్శించారు. -
చంద్రబాబు భద్రతను తగ్గించలేదు
-
మహిళల సంరక్షణ కోసమే దిశ చట్టం
-
మహిళల భద్రతే లక్ష్యం
-
ఇన్సైడర్ ట్రేడింగ్పై విచారణకు ఓకే
సాక్షి, ఏపీ అసెంబ్లీ : అమరావతి భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్పై విచారణ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదం తెలిపింది. ఇన్సైడర్ ట్రేడింగ్పై సమగ్ర దర్యాప్తుకు బుధవారం శాసనసభ తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని హోం మంత్రి మేకతోటి సుచరిత సభలో చదివి వినిపించారు. ఇన్సైడర్ ట్రేడింగ్కు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ విచారణలో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ.. 4,070 ఎకరాల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ ఎలా జరిగిందో అన్ని రకాల ఆధారాలతో సభలో చర్చించిన విషయాన్ని గుర్తుచేశారు. స్పీకర్ కూడా విచారణ జరిపించమని ఆదేశించారని చెప్పారు. ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. కంచె చేను మేసే విధంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వ్యవహరించారని విమర్శించారు. కావాల్సిన వాళ్లకు చంద్రబాబు భూములు దోచిపెట్టారని తెలిపారు. రాజధాని ప్రకటన గురించి ముందే తెలుసుకుని.. అక్కడ తక్కువ ధరలకు భూములకు కొనుగోలు చేసి.. తర్వాత ఎక్కువ రేటుకు అమ్ముకుందామని చూశారని విమర్శించారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చిన దోచుకోవాలనే చూస్తారని మండిపడ్డారు. ఇంతకన్నా ఘోరం ఎక్కడా కనపడదని చెప్పారు. ఇన్సైడర్ ట్రేడింగ్పై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కోరారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రాజధాని ప్రాంతం నూజివీడు అని కొందరు.. మరో ప్రాంతమని మరికొందరు లీకులు ఇచ్చారని గుర్తుచేశారు. కానీ చంద్రబాబు, ఆయన అనుచరులు మాత్రం అమరావతి ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారని తెలిపారు. ఒక సీఎంకు కొట్టే బుద్ధి ఉంటే.. మరొక సీఎంకు పెట్టే బుద్ధి ఉంటుందని వ్యాఖ్యానించారు. బాబు దోచుకునే, దాచుకునే విధానానికి అలవాటు పడ్డారని మండిపడ్డారు. ఇన్సైడర్ ట్రేడింగ్ విచారణ జరిపాలని కోరారు. వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. రాజధాని భూ సేకరణను విధ్వంసం సృష్టించే విధంగా చేశారని మండిపడ్డారు. చంద్రబాబు ఒక లీకు వీరుడు అని విమర్శించారు. సొంత మనుషులకు మేలు చేసేలా నిబంధనలు తుంగలో తొక్కారని అన్నారు. అనంతరం ఇన్సైడర్ ట్రేడింగ్పై విచారణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. చదవండి: 'తండ్రి జపాన్,సింగపూర్.. కొడుకేమో అమెరికా అంటున్నాడు' -
మూడు రాజధానులతో రాష్ట్ర భవితకు పునాది
సాక్షి, అమరావతి : పాలన, అభివృద్ధి వికేంద్రీకరణతోనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని.. ఇందుకు సంబంధించిన బిల్లుకు గుంటూరు వాసిగా మద్దతు తెలుపుతున్నానని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. శాసనసభలో ఆమె మాట్లాడుతూ.. ‘‘ఈ బిల్లు ద్వారా రాష్ట్ర భవిష్యత్తుకు చక్కటి పునాది ఏర్పడుతుంది. ప్రభుత్వ సంస్కరణలు, నిర్ణయాలను విమర్శకులు కూడా స్వాగతిస్తున్నారు. వర్గం, కులం, పార్టీలు చూడకుండా.. వివక్ష చూపకుండా ప్రతి ప్రాంతాన్నీ అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఆలోచించడం గొప్ప విషయం. భవిష్యత్తులో గొప్ప అభివృద్ధి సాధించాలంటే మొదట ప్రాంతీయ అసమానతలు లేకుండా చూడాలి. అలా జరగాలంటే అన్ని ప్రాంతాల ఆకాంక్షలను, అభిప్రాయాలను గౌరవించాలి. గొప్ప నిర్ణయాన్ని అమలుచేస్తున్న సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో పనిచేస్తున్నందుకు గర్వంగా ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్న వికేంద్రీకరణ నిర్ణయం చరిత్రలో మేలిమలుపు అవుతుంది. మా ప్రభుత్వం ఏడు నెలల కాలంలోనే 43 లక్షల మంది తల్లులకు అమ్మఒడి పథకం ద్వారా మేలు చేసింది.. 46 లక్షల మంది రైతు సోదరులకు రైతు భరోసా అందించింది.. ఆటో డ్రైవర్లు, మత్స్యకారులు, చేనేతలు.. ఇలా అందరినీ ఆదుకుంది. గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ తీసుకువచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించింది ఈ ప్రభుత్వమే. ఇది చాలా గొప్ప విషయం. మా ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం. ఎక్కడా రైతులకు, రైతు కూలీలకు కష్టం, నష్టం జరగకుండా చూస్తున్నాం’’ అని సుచరిత చెప్పారు. -
అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి: సుచరిత
సాక్షి, అమరావతి: పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు హోంమంత్రి మేకతోటి సుచరిత పూర్తి మద్దతు తెలిపారు. ఇదొక చరిత్రాత్మక రోజు, శతాబ్దాల రాష్ట్ర భవిష్యత్తుకు చక్కని పునాది అని ఆమె కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో పరిపాలన వికేంద్రీకరణ బిల్లుపై సుచరిత మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటైన దగ్గరి నుంచి కులాలు, మతాలు, ప్రాంతాలకతీతంగా అందరి అభివృద్ధి, సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో ప్రజాసంక్షేమం మంచి నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రాంతీయ అసమానతలు, అనుమానాలకు తావులేని అభివృద్ధి జరగాలని, అన్ని ప్రాంతాల ఆకాంక్షలను, అభిప్రాయాలను గౌరవించాలని, అందుకు చట్టసభలు వేదికగా కావాలని, అప్పుడే ప్రజల ఆకాంక్షలు సజీవంగా ఉండి.. అన్ని ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని అన్నారు. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలని, అందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి వైఎస్ జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ.. లబ్ధిదారులకు సేవలన్నీ తమ గడప వద్దకే తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. పరిపాలన వికేంద్రీకరణ దిశగా తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే సరికొత్త విప్లవానికి నాంది పలుకనుందని ధీమా వ్యక్తం చేశారు. ఇలాంటి గొప్ప నిర్ణయాలు అమలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో పనిచేయడం నిజంగా తమకు గర్వకారణంగా ఉందన్నారు. చదవండి: చంద్రబాబుకు సవాల్ విసిరిన కొడాలి నాని రాజధానులు ఎంతెంత దూరం శాసనాలు చేసే రాజధానిగా అమరావతి రాజధాని రైతులకు వరాలు 72 ఏళ్లు గడిచినా రాజధాని కూడా లేదు... స్పీకర్ వినతి.. కచ్చితంగా విచారణ జరిపిస్తాం: సీఎం -
దిశచట్టంలో బాగంగా ప్రతిజిల్లాలో ఫాస్ట్ట్రాక్ కోర్టు
-
దిశ చట్టం: ఫోరెన్సిక్ ల్యాబరేటరీలకు రూ.23 కోట్లు
సాక్షి, అమరావతి : దిశ చట్టం అమలుకు అవసరమైన ఫోరెన్సిక్ ల్యాబరేటరీలకు కోసం రూ. 23 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు హోంశాఖ మంత్రి సుచరిత పేర్కొన్నారు. ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ నియామకం చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. మహిళలు చిన్నారులపై నేరాలను అదుపు చేసేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన దిశ చట్టం అమలుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హోం మంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతరం మంత్రి సుచరిత మాట్లాడుతూ.. మూడు ఫోరెన్సిక్ ల్యాబ్ల ఏర్పాటుకు 176 మంది సిబ్బంది నియామకం కోసం త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నామన్నారు. అదే విధంగా మహిళ స్టేషన్లను మరింతగా బలోపేతం చేస్తామని, సత్వర న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రెండు నెలల్లో నిర్మాణాలు, సదుపాయాలకు పూర్తి నిధులు మంజూరు చేస్తామన్నారు. దిశ చట్టం ద్వారా సీఎం జగన్ ఒక అన్నలా మహిళలకు భరోసా కల్పించారని అన్నారు. దిశ చట్టం పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఐపీఎస్ అధికారిని నియమిస్తున్నామన్నారు. దిశ చట్టాన్ని చట్టసభల్లో ఆమోదించిన తరువాత రాష్ట్రపతికి పంపించామని, అక్కడి నుంచి ఆమోదం రాగానే అమలు చేస్తామన్నారు. దిశ చట్టం అమలుపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, క్యాబినెట్ సమావేశం రేపు జరుగుతుందన్నారు. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులు ఆందోళన విరమించాలని కోరుతున్నామన్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధిచేయాలన్నదే ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. -
‘సీఎం జగన్ నిండు నూరేళ్లు వర్థిల్లాలి’
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించడం చాలా సంతోషదాయకమని హోం మంత్రి సుచరిత అన్నారు. సీఎం జగన్ జన్మదినోత్సవ ముందస్తు వేడుకలను సిమ్స్ కళాశాలల డైరెక్టర్ భరత్రెడ్డి పద్మావతిఘాట్లో ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో సీఎం జగన్కు ఎయిర్ షో విన్యాసాలతో శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ‘దిశ చట్టం’పై అవగాహన కల్పిస్తూ విద్యార్ధినులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న హోంశాఖ మంత్రి సుచరిత మాట్లాడుతూ.. ‘దిశ చట్టం’ ద్వారా సీఎం జగన్ మహిళల్లో భరోసా నింపారని.. ‘దిశ చట్టం’ తీసుకువచ్చినందుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారని ఆమె అన్నారు. రోజురోజుకు దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని.. నేటికి మహిళలు అర్ధరాత్రి తిరిగే స్వాతంత్రo రాలేదన్నారు. ప్రపంచంలోనే మనదేశం.. మహిళపై జరిగే దాడులు, కేసుల్లో ముందున్నదని తెలిపారు. నిర్భయ, దిశ లాంటి ఘటనలు మన రాష్ట్రంలో చోటుచేసుకోకుండా మహిళ పట్ల చిత్తశుద్ధితో సీఎం జగన్ ‘దిశ చట్టం’ తీసుకు వచ్చారని హోంమంత్రి సుచరిత గుర్తు చేశారు. ప్రతి ఏడాది ఏపీలో మహిళలపై దాడులకు సంబంధించి 15వేల కేసులు నమోదు అవుతున్నాయని ఆమె చెప్పారు. చట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలని ఆమె సూచించారు. ‘దిశ చట్టం’ ద్వారా ఏడు రోజుల్లో దర్యాప్తు పూర్తిచేసి.. 21రోజుల్లో శిక్ష ఖరారు అవుతుందని ఆమె వివరించారు. ఫోన్లో అసభ్య సందేశాలు పంపితే రెండేళ్లు, మళ్లీ పాల్పడితే నాలుగేళ్లు శిక్షపడేలా 354(ఈ) చట్టాన్ని తెచ్చామని సుచరిత తెలిపారు. మైనర్లపై హత్యాచార దాడులు చేస్తే 14ఏళ్లు, మరణశిక్ష కూడా పడుతుందని ఆమె పేర్కొన్నారు. జగన్ ప్రవేశపెట్టిన ‘దిశ చట్టం’ అమలుకు ఇతర రాష్ట్రాలు కూడా ఆసక్తి చూపించడం విశేషం అన్నారు. మహిళల పట్ల సోదరిభావంతో మెలగాలని.. లేకుంటే జీవితం నాశనం అవుతుందని హోం మంత్రి సుచరిత వ్యాఖ్యానించారు. మహిళలు రక్షణకోసం ఉన్న 100, 112, 182 నెంబర్లు ప్రతి మహిళ వినియోగించుకోవాలని ఆమె సూచించారు. సీఎం జగన్ నిండు నూరేళ్లు వర్థిల్లాలి అని కోరుకున్నారు. ఈ వేడుకల్లో పాల్గొన్నమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఒక్క రాష్ట్రంలో జరిగిన దారుణం మరోసారి జరగకూడదని సీఎం జగన్ భావించారని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ‘దిశ చట్టం’ తెచ్చారని సీఎం జగన్ను కొనియాడారు. ఈ చట్టాన్ని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేసేందుకు ఆసక్తి చూసిస్తున్నాయని తెలిపారు. వైఎస్సార్ ఫీజు రీయంబర్స్మెంట్ ద్వారా ఉన్నత చదువులు చెప్పించారని పేర్కొన్నారు. వారందరికీ ఇప్పుడు సీఎం జగన్.. ఉద్యోగ అవకాశాలు కల్పించారని గుర్తు చేశారు. స్థానికంగా ఉన్నవారికి ఉద్యోగాలు కల్పిపించేందుకు 75శాతం స్థానికత చట్టం తీసుకువచ్చారని ఆయన తెలిపారు. కాని చంద్రబాబు కేవలం ఓట్ల కోసమే పధకాలు ప్రవేశపెట్టారని ఆయన మండిపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు కోసం సీఎం జగన్ కృషి చేస్తున్నారని వెల్లంపల్లి శ్రీనివాస రావు చెప్పారు. జగన్ వంటి నాయకుని నాయకత్వంలో పని చేయడం తనకు చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ‘దిశ చట్టం’ వివరిస్తూ విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆలోచింపచేసేలా ఉన్నాయని వెల్లంపల్లి శ్రీనివాస రావు అన్నారు. ‘అబ్బాయిలు ఈవ్టీజింగ్కు పాల్పడవద్దు.. జీవితాలను నాశనం చేసుకోవద్దు ’ అని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. దిశ చట్టాన్ని దేశం మొత్తం స్వాగతించిందని అన్నారు. అందరూ చట్టం అమలుకు సానుకూలంగా స్పందించారని తెలిపారు. కానీ చంద్రబాబుకు మాత్రం ‘దిశ చట్టం’ ఉద్దేశం అర్ధం కాలేదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో దిశపై చర్చ పెడితే.. ఉల్లి కోసం లొల్లి చేశారని మండిపడ్డారు. చట్టాలు రావడం కాదు.. వాటిపై అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు. మహిళలు కూడా టోల్ ఫ్రీ నెంబర్లను దగ్గరే ఉంచుకోవాలని మల్లాది విష్ణు చెప్పారు. దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం జగన్ ‘దిశ యాక్ట్’ తీసుకువచ్చారని ఆయన ప్రశంసించారు. ఆడపిల్లల రక్షణ కోసం ధైర్యం ఉన్న నాయకునిగా సీఎం జగన్ నిరూపించారని ఆయన తెలిపారు. టీడీపీ హయాంలో మహిళా తహశీల్దారుపై దాడి చేశారని ఆయన మండిపడ్డారు. కాల్ మనీ వ్యాపారం ద్వారా మహిళలను ఇబ్బందులు పెట్టారని దేవినేని అవినాష్ టీడీపీని దుయ్యబట్టారు. ఆడపిల్లలకు అండగా, అన్నగా సీఎం జగన్ దిశ చట్టాన్ని తెచ్చారని అవినాష్ గుర్తు చేశారు. దిశ చట్టం మహిళలల్లో భరోసా నింపి.. దశ మారుస్తుందని ఆయన పేర్కొన్నారు. భరత్రెడ్డి మాట్లాడూ.. జగనన్న జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా రెండు రోజుల పాటు ఎయిర్ షో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆరు దేశాల ప్రతినిధులు ఈ ఎయిర్ షో పాల్గొన్నారని ఆయన వెల్లడించారు. గత ప్రభుత్వ పాలనలో వైస్సార్ కుటుంబాన్ని విశ్వసించిన వారిపై కేసులు పెట్టి ఇబ్బందులు గురిచేశారని మండిపడ్డారు. ప్రజలకు సంక్షేమపాలన అందించాలన్నదే సీఎం జగన్ లక్ష్యం అని భరత్రెడ్డి పేర్కొన్నారు. తండ్రిని మించిన పాలన అందివాలన్నది సీఎం జగన్మోహన్రెడ్డి ఉద్దేశమని భరత్రెడ్డి పేర్కొన్నారు. -
మహిళల రక్షణకు కట్టుబడి ఉన్నాం
సాక్షి, అమరావతి: మహిళల రక్షణ, భద్రతకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజు సోమవారం మహిళా భద్రత అంశంపై స్వల్పకాలిక చర్చను ఆమె ప్రారంభించారు. మహిళల రక్షణ, కిశోర బాలికలను చైతన్యపరిచి వారికి సాధికారత కల్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. 11,158 గ్రామ మహిళా సంరక్షక కార్యదర్శులు, 3,809 వార్డు మహిళా సంరక్షక కార్యదర్శులు కలిపి మొత్తం 14,967 ఉద్యోగాలు నోటిఫై చేశామన్నారు. మహిళలపై జరుగుతున్న నేరాలను తగ్గించడానికి ‘మహిళా మిత్ర’ కమిటీలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఆపదలో ఉన్న మహిళలను తక్షణమే రక్షించడం కోసం ‘సైబర్ మిత్ర ప్రత్యేక వాట్సాప్ నంబర్ 9121211100’ ఏర్పాటు చేశామన్నారు. మహిళలపై నేరాల కేసులను, జీరో ఎఫ్ఐఆర్ను వెంటనే నమోదు చేసేలా పోలీసులకు సూచనలు ఇచ్చామని చెప్పారు. మహిళలపై నేరాల కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక ఫాస్ట్ట్రాక్ కోర్టులను 13 జిల్లాల్లో ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వీటికి అదనంగా పోస్కో కేసుల పరిష్కారానికి 8 ఫాస్ట్ట్రాక్ కోర్టులు పనిచేస్తున్నాయన్నారు. 100, 112, 181 మహిళా హెల్ప్లైన్లను ఏర్పాటు చేశామని తెలిపారు. గృహ హింస నుంచి మహిళల సంరక్షణ, మహిళా శక్తి కేంద్రాలు, సమగ్ర శిశు సంరక్షణ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. మహిళా భద్రత బిల్లుపై చర్చ జరుగుతుంటే ఏందయ్యా.. ఇది? కాగా, ప్రశ్నోత్తరాల అనంతరం శాసనసభ ఉదయం 11.43 గంటలకు మొదలైంది. మహిళా భద్రత అంశంపై స్వల్ప వ్యవధి చర్చను హోం శాఖ మంత్రి సుచరిత మొదలుపెట్టగా.. విపక్ష సభ్యులు ఉల్లి ధరలపై చర్చను చేపట్టాలని పట్టుబడుతూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. ‘మహిళా భద్రత బిల్లుపై చర్చ జరుగుతుంటే ఏందయ్యా.. ఇది?’ అంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం అసహనం వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ చర్చకు సిద్ధమని ప్రకటించిన తర్వాత పోడియం వద్దకు వచ్చి ఈ విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. అయినా విపక్ష సభ్యులు వినిపించుకోకుండా స్పీకర్ చైర్ వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. అధికార పక్షానికి చెందిన మహిళా సభ్యులంతా పోడియం వద్దకు చేరుకుని మహిళా భద్రత అంశంపై చర్చను అడ్డుకోవడమేంటని నినాదాలు చేశారు. ‘మహిళా వ్యతిరేకి చంద్రబాబు.. రౌడీ ప్రతిపక్షం’ అంటూ అధికార పక్ష సభ్యులు తమ సీట్ల నుంచి లేచి నిరసన తెలిపారు. చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ షాపులో కేజీ ఉల్లి రూ.200 అని.. చిత్తశుద్ధి ఉంటే ధర తగ్గించి విక్రయించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు గత ఐదేళ్ల పరిపాలనలో మహిళల్ని ఎలా వేధించారో బట్టబయలవుతుందనే భయంతో చర్చను అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. -
మహిళల రక్షణ కోసం కొత్త చట్టం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళల రక్షణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. బుధవారం సచివాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘దిశ’ లాంటి ఘటనలు జరిగినప్పుడు నిందితులకు తక్షణం శిక్ష పడేలా కొత్త చట్టాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. నిందితులను ఉరి తీయాలని దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తుంటే.. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బాధ్యతా రాహిత్యంగా చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయని సుచరిత అన్నారు. ఈ దుర్ఘటనపై సీఎం తీవ్రంగా చలించిపోయారని, అందుకనే రాష్ట్రంలో అటువంటి ఘటనలు జరగకుండా కఠినమైన చట్టాలను తీసుకొస్తున్నారని వివరించారు. ఇప్పటికే సైబర్ మిత్ర, మహిళా మిత్ర (9121211100)ను ప్రవేశ పెట్టడంతో పాటు ఈ మధ్యనే ‘బీ సేఫ్’ అనే యాప్ను ప్రవేశ పెట్టామని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసులను నియమించామన్నారు. -
టెక్నాలజీని అవసరానికే వినియోగించాలి
లబ్బీపేట(విజయవాడ తూర్పు): శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సమాజం పురోగతి సాధిస్తుండగా.. మహిళలు, యువత అదే టెక్నాలజీ బారినపడి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తలెత్తుతోందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. టెక్నాలజీని అవసరం మేరకే వినియోగించాలని సూచించారు. ఏపీ పోలీస్శాఖ ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడలో ‘ఉమెన్ సేఫ్టీ ఇన్ సైబర్ స్పేస్’ అనే అంశంపై అవగాహనా సదస్సు నిర్వహించారు. మహిళలు, యువత రక్షణ కోసం ఉద్దేశించిన ‘బీ సేఫ్’ యాప్ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మేకతోటి సుచరిత మాట్లాడుతూ... అత్యవసర ఫోన్ నంబర్లు 100, 181, 112, వాట్సాప్ నంబరు 9121211100పై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అండగా ఉంటుందని, మహిళామిత్ర, సైబర్మిత్ర ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆపదలో ఉంటే పోలీసులను సంప్రదించాలి సైబర్ నేరాలకు గురయ్యే వారిలో మహిళలు, యువతులు, ఉద్యోగినులు ఎక్కువగా ఉంటున్నారని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత చెప్పారు. ఇబ్బందికర పరిస్థితుల్లో అధైర్య పడకుండా అత్యవసర నంబర్ల ద్వారా పోలీసులను సంప్రదించాలని పేర్కొన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ... సైబర్ నేరాలు జరిగితే ఎలా స్పందించాలి, సమాజంలో ఎవరితో ఎలా మెలగాలనే దానిపై యువతులు అవగాహన పెంచుకోవాలని చెప్పారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. ఆపద సమయంలో అత్యవసర ఫోన్ నంబర్ల ద్వారా సంప్రదిస్తే పోలీస్ శాఖ వెంటనే స్పందిస్తుందన్నారు. కార్యక్రమంలో విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు, కృష్ణా జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ పాల్గొన్నారు. -
‘టెక్నాలజీకి రెండు వైపులా పదును ఉంటుంది’
సాక్షి, విజయవాడ : ఆధునిక టెక్నాలజీ ద్వారా అభివృద్ధి ఎంత జరుగుతుందో మోసాలు సైతం అదేవిధంగా పెరిగిపోతున్నాయని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. టెక్నాలజీని తమ పిల్లలు ఎలా ఉపయోగిస్తున్నారో తల్లిదండ్రులు ఓ కంట కనిపెడుతూ ఉండాలని ఆమె సూచించారు. గురువారం విజయవాడలో మహిత ప్లాన్ ఇండియా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ‘మహిళలపై సైబర్ నేరాలు, తీసుకోవాల్సిన చర్యలు’పై రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి సుచరిత, రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘మహిళలపై సైబర్ నేరాలు’ పుస్తకాన్ని హోంశాఖ మంత్రి ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..టెక్నాలజీ పెరిగిపోవడంతో మోసాలు చేసే వారి బారిన పడి మహిళలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మోసగాళ్లు రకరకాల వీడియోలు తీసి పిల్లలను బెదిరిస్తున్నారని, బ్యాంకు అకౌంట్ల ద్వారా మాయ చేస్తున్నారన్నారు. మహిళా మిత్ర ద్వారా మహిళలకు రక్షణ ఏర్పడుతుందని, ఒక ఫోన్కాల్ చేసి వారి సమస్యలను పరిష్కరించే అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు. టెక్నాలజీని మంచికి ఉపయోగించేలా తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలని హితవు పలికారు. మహిళల సమస్యలపై పూర్తిగా సహకరిస్తాం మహిళలపై జరిగే నేరాలు అదుపు చేసేందుకు అనేక చట్టాలు వచ్చినప్పటికీ మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. మహిళా మిత్ర కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబోతున్నట్లు ఆయన తెలిపారు. సైబర్ మిత్ర వల్ల ఏ మహిళ న్యాయం కోసం పోలీస్ స్టేషన్ వరకు రానవసరం లేదని స్పష్టం చేశారు. మహిళల సమస్యలపై పూర్తిగా సహకరిస్తామని, స్పందన కార్యక్రమం ద్వారా 52 శాతం మంది మహిళలు ధైర్యంగా తమకు జరుగుతున్న అన్యాయాల గురించి పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారని పేర్కొన్నారు. వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. టెక్నాలజీకి మంచి, చెడు రెండు వైపులా పదును ఉంటుందని, దురదృష్టవశాత్తు ఎక్కువ నేరపూరిరతవైపే టెక్నాలజీ వాడకం పెరిగిపోయిందని అన్నారు. టెక్నాలజీని ఉపయోగించుకొని సోషల్ మీడియా ద్వారా ఆడవాళ్లపై అత్యాచారాలు పెరుగుతున్నాయని, సైబర్ క్రైం వ్యవస్థ తమ శాయశక్తుల నేరాలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉందని పేర్కొన్నారు. -
మంగళగిరి : 2018 బ్యాచ్ డీఎస్పీల పాసింగ్ అవుట్ పెరేడ్
-
త్వరలోనే ఖాళీలన్నీ భర్తీ చేస్తాం : హోంమంత్రి
సాక్షి,అమరావతి : పోలీస్శాఖలోని సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ, జైలు వార్డన్స్ కానిస్టేబుళ్ల ఫలితాలను గురువారం విడుదల చేసినట్లు హోంమంత్రి మేకతోటి సుచరిత వెల్లడించారు. మొత్తం 2623 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికవగా, అందులో 500 మంది మహిళలు ఉన్నట్లు పేర్కొన్నారు. అర్హత సాధించిన అభ్యర్థులకు త్వరలోనే శిక్షణ ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం త్వరలోనే భారీ రిక్రూట్మెంట్ చేపట్టి పోలీస్ శాఖలో ఉన్న ఖాళీలన్నింటిని భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. పోలీస్శాఖలో అమలు చేస్తున్న వీక్లీఆఫ్ వలన కొత్తగా పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఎస్సై ఫిర్యాదు చేస్తే చర్యలు పల్నాడు ఘటనపై స్పందించిన సుచరిత... టీడీపీ స్వార్థ రాజకీయాలు పల్నాడులో పని చేయలేదని విమర్శించారు. టీడీపీ చేపట్టదలిచిన 'చలో ఆత్మకూరు'లో పెయిడ్ ఆర్టిస్ట్లు ఉన్నారు కాబట్టే వాళ్ల శిబిరం నుంచి కార్యకర్తలు వెళ్లిపోయారని మండిపడ్డారు. దళితుల పట్ల అమితమైన ప్రేమ కురిపిస్తోన్న చంద్రబాబు వారి ప్రభుత్వ హయాంలో ఐపీఎస్ అధికారిణి వనజాక్షిపై జరిగిన దాడిపై ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. విధి నిర్వహణలో భాగంగా ఎస్సైగా తన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తోన్న మహిళను నన్నపనేని రాజకుమారి కులం పేరుతో ధూషించడం తగదని హెచ్చరించారు. ఎస్సై ఫిర్యాదు ఇస్తే చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని హోంమంత్రి స్పష్టం చేశారు. దళితులను అవమానిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సుచరిత పేర్కొన్నారు. -
రాజకీయ లబ్ధి కోసమే ‘టీడీపీ ఛలో ఆత్మకూరు’
-
గురువాచారిని దారుణంగా హింసించారు: సుచరిత
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో రాష్ట్రం ప్రశాంతంగా ఉందని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఎస్పీ కార్యాలయంలో ప్రతీ సోమవారం స్పందన కార్యక్రమం జరగుతోందని... ఫిర్యాదులకు 15 రోజుల్లో పరిష్కారం చూపించాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. వర్షాలు పడి రైతులు, రైతు కూలీలు పనుల్లో నిమగ్నమై.. నిరుద్యోగులు పోటీ పరీక్షలు రాస్తూ రాష్ట్రమంతా ప్రశాంతంగా ఉంటే చంద్రబాబుకు నచ్చడం లేదని ఎద్దేవా చేశారు. అందుకే పల్నాడులో పెయిడ్ ఆర్టిస్టులతో శిబిరాలు పెడుతూ ప్రశాంతతకు భంగం కలిగించాలని చూస్తున్నారని మండిపడ్డారు. డీజీపీ గౌతం సవాంగ్తో కలిసి సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా...2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో రాక్షస పాలన జరిగిందని హోం మంత్రి సుచరిత విమర్శించారు. టీడీపీ నేత యరపతినేని అక్రమ మైనింగ్ గురించి ఫిర్యాదు చేసినందుకు గురువాచారి అనే వ్యక్తిని దారుణంగా హింసించారన్నారు. టీడీపీ పాలనలో గురువాచారిని చిత్ర హింసలకు గురిచేశారని.. ఆయన ఫొటోలను మీడియా ముఖంగా చూపించారు. అదే విధంగా యరపతినేని ఓ వ్యక్తిని కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారని... ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారన్నారు. చంద్రబాబు పాలనలో ఇలాంటి మరెన్నో కేసులు నమోదయ్యాయని హోం మంత్రి తెలిపారు. ఇప్పుడు రాష్ట్రంలో అలాంటి భయానక పరిస్థితులు లేవని, నేరాలు తగ్గి శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయన్నారు.ఇటువంటి సమయంలో చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి గ్రామాల్లో తమను ఉండనివ్వడం లేదంటూ పునారావాస శిబిరాలు పెడుతున్నారని విమర్శించారు. గత ఐదేళ్లలో ఎలాంటి ఘోరాలు జరిగాయో ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారని పేర్కొన్నారు. ‘పిచ్చి కుక్కను రాయితో కొడితే కేసు పెట్టారు. టీడీపీలో లేని వాళ్లపై అక్రమ కేసులు బనాయించారని ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు. కుల, మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంతో పాటు తప్పు చేసిన వారిని ఉపేక్షించకూడదని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. కానీ చంద్రబాబు వంటి సీనియర్ నాయకులు పోలీసు వ్యవస్థ చిన్నబుచ్చుకునేలా.. వాళ్లు ఏకపక్షంగా పనిచేస్తున్నారంటూ విమర్శించడం తగదు. గురజాల ప్రశాంతంగా ఉంది. నిజమైన బాధితులకు తప్పకుండా రక్షణ కల్పిస్తాం. అధికారులు వెళ్లి పరిస్థితులు గమనించి నిజంగా బాధితులు ఉంటే వారిని పోలీసు రక్షణతో గ్రామాల్లోకి తీసుకువెళ్తారు. నిజానికి ఎన్నికలు ముగిసిన తర్వాత పల్నాడులో 79 రాజకీయ కేసులు నమోదయ్యాయి. వాటిలో 43 టీడీపీ, 36 వైఎస్సార్ సీపీ చేశాయి’ అని హోం మంత్రి సుచరిత తెలిపారు. ఇక డీజీపీ గౌతం సవాంగ్ మాట్లాడుతూ.. పల్నాడులో 144 సెక్షన్ విధించామని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఛలో ఆత్మకూరు కోసం ఎవరూ ఎటువంటి అనుమతి అడగలేదని తెలిపారు. -
ఎమ్మెల్యే శ్రీదేవికి ధైర్యం చెప్పిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి మేకతోటి సుచరిత, వైఎస్సార్సీపీ తాటికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వినాయకుడి విగ్రహం వద్ద శ్రీదేవికి జరిగిన అవమానాన్ని సుచరిత ముఖ్యమంత్రికి వివరించారు. అదే విధంగా టీడీపీ నేతల అరాచకాలను సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో అవమానభారంతో ఆవేదన చెందుతున్న శ్రీదేవికి సీఎం జగన్ ధైర్యం చెప్పారు. ఇక హోం మంత్రి సుచరితతో పాటు విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా సీఎం జగన్ను కలిశారు. దళిత మహిళా ఎమ్మెల్యే శ్రీదేవిని దూషించిన కేసులో దోషులెవరూ తప్పించుకోకుండా చర్యలు తీసుకోవాలని విఙ్ఞప్తి చేశారు. టీడీపీ నాయకులు కుల రాజకీయాలు చేస్తుంటే ఆ పార్టీ సీనియర్ నేతలు వర్ల రామయ్య లాంటి వాళ్ళు వాటిని ప్రోత్సహించటం సిగ్గుచేటు అని విమర్శించారు. కాగా రాజధాని ప్రాంతంలో వినాయకుడిని దర్శించుకునేందుకు వెళ్లిన శ్రీదేవిని కులం పేరుతో దూషిస్తూ టీడీపీ నేతలు దాడికి దిగిన విషయం విదితమే. సోమవారం వైఎస్సార్ వర్థంతి సందర్భంగా శ్రీదేవి తుళ్లూరు మండల పరిధిలోని అనంతవరం గ్రామానికి వెళ్లారు. అక్కడ వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్సీపీ గ్రామ అధ్యక్షుడు పోలు రమేశ్ ఆహ్వానం మేరకు వినాయకుడి విగ్రహం వద్దకు కుటుంబంతో కలిసి వెళ్లి పూజ చేస్తుండగా టీడీపీ నేత కొమ్మినేని శివయ్యతోపాటు మరికొందరు పెద్దగా అరుస్తూ.. దళిత మహిళ పూజ చేస్తే వినాయకుడు మైల పడతాడని, పూజ చేయొద్దని ఆమె వైపునకు దూసుకెళ్లారు. అంతటితో ఆగకుండా తీవ్ర పదజాలంతో కులం పేరుతో ఆమెను దూషించారు. ఈ క్రమంలో వారి దౌర్జన్యాన్ని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడటమే కాకుండా అడ్డుకోబోయిన పోలీసులను సైతం టీడీపీ నాయకులు నెట్టిపడేశారు. దీంతో తనను దారుణమైన పదజాలంతో దూషించడంతో ఎమ్మెల్యే శ్రీదేవి తీవ్ర మనస్తాపానికి లోనై కంటతడి పెట్టి అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీనిపై తుళ్లూరు పోలీస్స్టేషన్లో ఎస్ఐ వట్టికూటి గౌతమి కేసు నమోదు చేశారు. మంగళవారం సాయంత్రం నిందితుల్లో కొమ్మినేని శివయ్య, ఒక మైనర్ను అదుపులోకి తీసుకుని వారిని తుళ్లూరు డీఎస్పీ మీడియా ముందు ప్రవేశపెట్టారు. మరో ఇద్దరు కొమ్మినేని రామకృష్ణ, బుజ్జి పరారీలో ఉన్నారు. -
మోడల్ పోలీస్స్టేషన్ను ప్రారంభించిన హోంమంత్రి
సాక్షి, ఆవనిగడ్డ(కృష్ణా) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత శుక్రవారం ఆవనిగడ్డలో మోడల్ పోలీస్ స్టేషన్ను ప్రారంభించారు. ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు పేర్ని నాని, మోపిదేవి వెంకటరమణ, అడిషనల్ డీజీపీ సునీల్ కుమార్, డిఐజి ఏఎస్ ఖాన్లు అతిథులుగా హాజరయ్యారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన హోంమంత్రి మేకతోటి సుచరితకు అధికారుల సమక్షంలో ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. పోలీస్ సిబ్బందికి మౌలిక సదుపాయల కల్పన కోసమే మోడల్ పోలీస్ స్టేషన్లు నిర్మిస్తున్నట్లు సుచరిత పేర్కొన్నారు. ప్రజలకు మరింత చేరువయ్యేలా ఫ్రెండ్లీ పోలీసింగ్ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే మహిళల సమస్యలను పరిష్కరించడానికి ' మహిళా క్రాంతి' కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆమె స్పష్టం చేశారు. ప్రతి పోలీస్ స్టేషన్లో 'మహిళా మిత్ర' పేరిట ఒక మహిళా కానిస్టేబుల్ను ఏర్పాటు చేస్తే మహిళలు తమ సమస్యలను మరింత స్వేచ్ఛగా తెలపడానికి ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు. మహిళా పోలీసులు బందోబస్తుకు వెళ్లినపుడు వారికి కనీస అవసరాలు తీర్చేందుకు మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అవినీతి రహితంగా ఉంటూ, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా లక్ష్యం పెట్టుకోవాలని సుచరిత పిలుపునిచ్చారు. -
వాలంటీర్లు వారధులుగా పనిచేయాలి- హోం మంత్రి
సాక్షి, గుంటూరు: ప్రభుత్వం, ప్రజలకు మధ్య గ్రామ వాలంటీర్లు వారధులుగా ఉండి.. పార్టీలకు అతీతంగా పనిచేయాలని హోంమంత్రి సుచరిత పిలుపునిచ్చారు. సోమవారం గుంటూరులో గ్రామ వాలంటీర్ల శిక్షణ తరగతులను ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శామ్యూల్ ఆనంద్,అధికారులు పాల్గొన్నారు. కొల్లూరులో గ్రామ వాలంటీర్ల శిక్షణా తరగతులను వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి కుటుంబానికి అందేలా వాలంటీర్లు నిబద్ధతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. నరసరావుపేటలో షాదీఖానాలో గ్రామ వాలంటీర్లుకు శిక్షణా తరగతులను ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. విశాఖ జిల్లా: నర్సీపట్నంలో గ్రామ వాలంటీర్లలకు శిక్షణ తరగతులను ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్గణేష్ ప్రారంభించారు. రోలుగుంట,చోడవరం మండల పరిషత్ కార్యాలయాల్లో నిర్వహించిన గ్రామ వాలంటీర్ల శిక్షణ కార్యక్రమంలో చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాల పథకాలు అమలు చేసి.. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. కోవూరులో గ్రామ వాలంటీర్లకు నియామక పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగాది రోజున అర్హులందరికి ఇళ్ల స్థలాలు ఇస్తామని తెలిపారు. వైఎస్సార్ జిల్లా: బద్వేలు మున్సిపాలిటీ మండల కేంద్రాల్లో గ్రామ వాలంటీర్ల శిక్షణా తరగతులను ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి ప్రారంభించారు. విజయనగరం జిల్లా: బోగాపురం నియోజకవర్గం భోగాపురం, డెంకాడ మండలాల్లో గ్రామవాలంటీర్ల శిక్షణా కార్యక్రమంలో నెల్లిమర్ల ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు, మండలపార్టీ నాయకులు ఉప్పాడ సూర్యనారాయణరెడ్డి, బంటుపల్లి వాసుదేవరావు, రావాడ బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా: కందుకూరు ఎండీవో కార్యాలయంలో గ్రామ వాలంటీర్ల శిక్షణ తరగతుల్లో ఎమ్మెల్యే మానుగుంట మహిధర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవరత్నాల పథకాలను ప్రజలందరికి చేరవేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కృష్ణాజిల్లా: జగ్గయ్యపేట లో వార్డు వాలంటీర్ల శిక్షణ తరగతులను ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువయ్యేలా చేయవలసిన బాధ్యత వాలంటీర్ల పై ఉందన్నారు. -
చంద్రబాబు పాలనలో నేరాంధ్రప్రదేశ్
సాక్షి, అమరావతి: ఐదేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున దాడులు, దౌర్జన్యాలు, హత్యాకాండ చోటుచేసుకున్నాయని హోంమంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. శాంతిభద్రతలపై శాసన మండలిలో శుక్రవారం స్వల్పకాలిక చర్చ జరిగింది. సభ్యులు ప్రస్తావించిన పలు అంశాలపై మంత్రి సుచరిత బదులిచ్చారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు పూర్తికాకుండానే నేరాలు, ఘోరాలు జరిగిపోయినట్టు గగ్గోలు పెడుతున్న టీడీపీ నేతలు గడిచిన ఐదేళ్లలో ఎన్ని దారుణాలు జరిగాయో గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. ‘శాంతిభద్రతల విషయంలో గట్టిగా ఉండాలని, పార్టీలు, రాజకీయాలు చూడొద్దని, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి’ అని తనకు హోంమంత్రి పదవి అప్పగించినప్పుడే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారని సుచరిత వివరించారు. ఎన్నికల రోజున రాష్ట్రవ్యాప్తంగా 147 ఘటనలు జరిగాయని, అప్పుడు తాము అధికారంలో లేకపోయినా తమను నిందించడం సరికాదన్నారు. గడిచిన ఐదేళ్ల చంద్రబాబు పాలనలో జరిగిన నేరాలను గమనిస్తే రాష్ట్రం నేరాంధ్రప్రదేశ్గా మారిపోయిందనే ఆందోళన కలుగుతోందని సుచరిత అన్నారు. హత్యా రాజకీయాలకు బాబు ప్రోత్సాహం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి రాజారెడ్డిని చంపిన వారికి చంద్రబాబు నివాసంలో షెల్టర్ ఇవ్వలేదా? అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. హత్యా రాజకీయాలను చంద్రబాబు ప్రోత్సహించారని ఎమ్మెల్సీలు వెన్నపూస గోపాల్రెడ్డి, గోవిందరెడ్డి, జంగా కృష్ణమూర్తి ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలనలో ఒక్క అనంతపురం జిల్లాలోనే 753 హత్యలు జరిగితే అందులో 383 మంది రెడ్లు హత్యకు గురైన విషయం టీడీపీ వాళ్లకు తెలియదా? అని నిలదీశారు. టీడీపీ సభ్యులు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. వాస్తవాలు వినే ఓపిక లేక వాకౌట్ అవాస్తవాలు మాట్లాడటం టీడీపీ సభ్యులకు అలవాటైపోయిందని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తప్పుబట్టారు. శాంతిభద్రతలపై చర్చ సందర్భంగా టీడీపీ సభ్యులు బచ్చుల అర్జునుడు, బుద్దా వెంకన్న, శమంతకమణి, పోతుల సునీత, దీపక్రెడ్డి, డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, శాంతిభద్రతలు లేవని అన్నారు. మంత్రి సుచరిత సమాధానం చెప్పే సమయానికి వారు సభ నుంచి వాకౌట్ చేశారు. దీనిపై మంత్రి సుభాష్ చంద్రబోస్ స్పందిస్తూ.. టీడీపీ సభ్యులు వాస్తవాలు వినకుండా ప్రభుత్వంపై బురద జల్లేందుకే ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా ఉందని విమర్శించారు. మండలిలో రెండు బిల్లులు ఆమోదం శాసన మండలిలో శుక్రవారం రెండు బిల్లులను ఆమోదించారు. ‘ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ లాస్–2019’ బిల్లును విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి ప్రతిపాదించగా సభ ఆమోదించింది. ‘ధార్మి, హిందూమత సంస్థలు, దేవదాయ చట్టం–1987 సవరణ బిల్లును దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. -
కాల్మనీ కేసుల్లో రూ.700 కోట్ల వ్యాపారం
సాక్షి, అమరావతి: కాల్మనీ కేసుల్లో మొత్తం రూ. 700 కోట్ల వ్యాపారం జరిగిందని ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. శాసన మండలిలో కాల్ మనీ కేసులకు సంబంధించిన అడిగిన ప్రశ్నకు ఆమె మంగళవారం సమాధానమిచ్చారు.రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18 కాల్ మనీ కేసులు నమోదయ్యాయని తెలిపారు. విజయవాడలో 14, పశ్చిమ గోదావరిలో మూడు, కడపలో ఒక కేసు నమోదైనట్టు వివరించారు. విజయవాడలో ఈ కేసులకు సంబంధించి మొత్తం 30 మందిని అరెస్టు చేశామన్నారు. వీరిలో ఏడుగురిపై రౌడీషీటు ఓపెన్ చేసినట్టు తెలిపారు. కాల్ మనీ వ్యవహారానికి వ్యతిరేకంగా గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించిన విషయాన్ని హోంమంత్రి గుర్తు చేశారు. గత చంద్రబాబు ప్రభుత్వం కాల్ మనీ కేసుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తెలిపారు. బీసీల కోసం 139 కార్పొరేషన్లు వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం మొత్తం 139 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్నారాయణ తెలిపారు. శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ.. బీసీ సబ్ప్లాన్ను అమలు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాదయాత్ర సందర్భంగా వెనుకబడిన కులాలకు సంబంధించిన అనేక మంది తమ సమస్యలు తెలుసుకున్నారని, వారి సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రాష్ట్ర నూతన గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణస్వీకారం నేపథ్యంలో శాసనమండలి రేపటికి వాయిదా పడింది. శాసన మండలి సభ్యులు గవర్నర్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. -
హోం మంత్రిపై అభ్యంతరకర పోస్టింగ్లు; వ్యక్తి అరెస్ట్
సాక్షి, పట్నంబజారు (గుంటూరు): రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరితపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఫేస్బుక్లో పోస్టింగ్లు పెట్టిన వ్యక్తిని గుంటూరు పట్టాభిపురం పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. వెస్ట్ సబ్డివిజన్ డీఎస్పీ జె.కులశేఖర్ తెలిపిన మేరకు.. రామ్మహారాజ్ అనే ఫేస్బుక్ అకౌంట్తో హోం మంత్రి సుచరితపై అభ్యంతరకర పోస్టింగ్లు వచ్చాయి. పోస్టింగులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దారం అశోక్కుమార్ పట్టాభిపురం పీఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన డీఎస్పీ కులశేఖర్ విశాఖ జిల్లా రోగుగుంట మండలం ఎం.కొత్తపట్నంకు చెందిన సర్వశుద్ధి రాము ఆ పోస్టింగ్లు పెట్టినట్లు దర్యాప్తులో ధృవీకరించారు. మంగళవారం బృందావన్ గార్డెన్స్లోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద తిరుగుతున్న అతడ్ని అరెస్ట్ చేశారు. పలు సెక్షన్లతో పాటు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. -
టీడీపీ నేతలపై మండిపడ్డ హోంమంత్రి సుచరిత
-
అత్యాచార బాధితురాలికి పది లక్షల పరిహారం
సాక్షి, ప్రకాశం: ఒంగోలులో అత్యాచారానికి గురైన బాలికకు రూ.10 లక్షల పరిహారంతో పాటు భద్రత కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. తల్లిదండ్రులు కంటే శ్రేయోభిలాషులు మరొకరు ఉండరని పిల్లలు గుర్తించాలని ఆమె సూచించారు. పాఠశాలల్లో బాలికలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా.. దేశంలో ఉన్న చట్టాల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. మరోవైపు అమలులో ఉన్న చట్టాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అత్యాచారానికి పాల్పడిన నిందితుల్లో స్వపక్షం వారు ఉన్న విపక్షం వారు ఉన్న శిక్ష తప్పదని హోంమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సామూహిక అత్యాచార ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇదివరకే ఆరా తీసిన విషయం తెలిసిందే. పరిహారం విషయంలో ఉదారంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ఒంగోలులో 16 ఏళ్ల బాలికపై ఆరుగురు యువకులు గ్యాంగ్ రేప్కు పాల్పడిన సంగతి తెలిసిందే. 10రోజులు బాలికను నిర్బంధించి దుండగులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. గుంటూరులో పదో తరగతి చదువుతున్న యువతి.. ప్రియుడి కోసం ఒంగోలు వచ్చింది. ఎన్ని సార్లు ఫోన్ చేసినా అతను రాకపోవడంతో.. బస్టాండ్లోనే ఉండిపోయింది. బస్టాండ్లో పనిచేస్తున్న బాజి అనే దివ్యాంగుడు ఆ బాలికను గమనించి.. మాయమాటలు చెప్పి.. సమీపంలోని ఓ గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ స్నేహితుడితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. వైఎస్సార్సీపీ నేతలపైనే దాడులు.. ప్రకాశం జిల్లా చినగంజాం వద్ద టీడీపీ కార్యకర్త పద్మ ఆత్మహత్య ఘటన పట్ల హోంమంత్రి సుచరిత స్పందించారు. రాష్ట్రంలో టీడీపీ వాళ్ళ కంటే అధికారంలోనే వైఎస్సార్సీపీ నేతలపైనే దాడులు ఎక్కువ అయ్యాయన్నారు. మాములు దాడులకు కూడా రాజకీయ రంగు పులుముతున్నారని అభిప్రాపయడ్డారు. -
ఒంగోలు అత్యాచార ఘటనపై సీఎం జగన్ ఆరా
సాక్షి, ప్రకాశం : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒంగోలు సామూహిక అత్యాచార ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. ఈ మేరకు ప్రకాశం జిల్లా ఎస్పీని అడిగి వివరాలు తెలుసుకున్నారు. 24 గంటల్లోగా నిందితులను పట్టుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. త్వరితగతిన నిందితులను అరెస్ట్ చేసినందుకు పోలీసు అధికారులను మెచ్చుకున్న సీఎం జగన్.. బాధితురాలికి నష్టపరిహారం ఇవ్వాలని హోం మంత్రిని ఆదేశించారు. దాంతో రూ. 5 లక్షల పరిహారం అందిస్తున్నామని హోం మంత్రి సుచరిత తెలిపారు. కాగా పరిహారం విషయంలో ఉదారంగా ఉండాలని జగన్ సూచించారు. -
ఒంగోలు ఘటనపై స్పందించిన హోంమంత్రి
-
ఒంగోలు ఘటనపై స్పందించిన హోంమంత్రి
సాక్షి, అమరావతి: ఒంగోలులో 16 ఏళ్ల బాలికపై గ్యాంగ్రేప్ ఘటనపై ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత సీరియస్గా స్పందించారు. ఈ ఘటనపై విచారణ వేగవంతం చేయాలని ప్రకాశం జిల్లా ఎస్పీని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు, ఒంగోలు ఆస్పత్రిలో బాధిత బాలికను మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి పరామర్శించారు. నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టమని ఆయన స్పష్టం చేశారు. బాధితురాలికి ప్రభుత్వం అండగా ఉంటుందననారు. మైనర్ బాలికపై సామూహిక అత్యాచార ఘటనను నిరసిస్తూ ఒంగోలులో మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు ఆందోళనకు దిగాయి. రేప్కేసు నిందితులను కఠినంగా శిక్షించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని మహిళా నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఒంగోలులో 16 ఏళ్ల బాలికపై ఆరుగురు యువకులు గ్యాంగ్ రేప్కు పాల్పడిన సంగతి తెలిసిందే. 10రోజులు బాలికను నిర్బంధించి దుండగులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. గుంటూరులో పదో తరగతి చదువుతున్న యువతి.. ప్రియుడి కోసం ఒంగోలు వచ్చింది. ఎన్ని సార్లు ఫోన్ చేసినా అతను రాకపోవడంతో.. బస్టాండ్లోనే ఉండిపోయింది. బస్టాండ్లో పనిచేస్తున్న బాజి అనే దివ్యాంగుడు ఆ బాలికను గమనించి... మాయమాటలు చెప్పి.. సమీపంలోని ఓ గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ స్నేహితుడితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం మరో గదికి తరలించారు. అక్కడ నలుగురు డిప్లామా విద్యార్థులు కూడా ఆ బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. 10 రోజులు నరకయాతన పడ్డ బాలిక.. శనివారం రాత్రి వారి చెర నుంచి తప్పించుకుని బస్టాండ్కు చేరింది. బాలికను గమనించిన అవుట్పోస్టు కానిస్టేబుల్ వివరాలు ఆరా తీశారు. జరిగిన దారుణం తెలుసుకుని ఒంగోలు వన్టౌన్ పోలీస్స్టేషన్కు తీసుకెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు... నిందితుడు బాజీని అదుపులోకి తీసుకుని విచారించారు. అతను ఇచ్చిన సమాచారంతో మిగిలిన ఐదుగురినీ అరెస్ట్ చేశారు. డిప్లొమా విద్యార్థులు నలుగురూ మైనర్లుగా తెలుస్తోంది. మొత్తంగా గంటల వ్యవధిలోనూ పోలీసులు కేసును ఛేదించారు. బాలికను వైద్యపరీక్షల కోసం ఆస్పత్రిలో చేర్పించారు. -
మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం
-
ఏపీ హోంమంత్రి సుచరిత హెచ్చరికలు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని హోంమంత్రి మేకతోటి సుచరిత హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రిగా సచివాలయంలోని 2వ బ్లాక్లోని చాంబర్లో ఆమె ఆదివారం బాధ్యతలు చేపట్టి ఉదయం ప్రత్యేక పూజల చేశారు. హోంమంత్రి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. దళిత మహిళకు హోంమంత్రి బాధ్యత ఇచ్చారన్న ఆమె... మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని...నేరం చేయాలంటేనే భయపడేలా కఠిన చట్టాలు తీసుకు వస్తామని అన్నారు. శాంతి భద్రతలు కాపాడి ప్రజలకు భరోసా కల్పిస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారు. ర్యాగింగ్, వేధింపులను సమూలంగా నిర్మూలిస్తామని, మహిళలు నిర్భయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసే పరిస్థితి కల్పిస్తామని సుచరిత తెలిపారు. అలాగే మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. పోలీసులకు వీక్లీఆఫ్లు అమలు చేస్తామని, అలాగే 4 బెటాలియన్లు ఏర్పాటు చేస్తామని హోంమంత్రి చెప్పారు. మహిళా బెటాలియన్, గిరిజన బెటాలియన్ ఏర్పాటు చేస్తామన్నారు. మహిళా కానిస్టేబుల్స్ సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని, వాళ్ల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని ఆమె భరోసా ఇచ్చారు. చదవండి: పోలీసులకు వీక్లీఆఫ్లు వచ్చేశాయ్! -
తండ్రి స్పీకర్.. తనయుడు డెప్యూటీ స్పీకర్
ఉత్కంఠ వీడింది.. జిల్లాలో ఇద్దరికి మంత్రి పదవులు, మరొకరికి డెప్యూటీ స్పీకర్ పదవి దక్కాయి. తమ కుటుంబాన్ని నమ్ముకుని కష్టనష్టాలను భరించిన మోపిదేవి వెంకటరమణ, మేకతోటి సుచరితకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రి పదవులు కట్టబెట్టారు. జిల్లాకు రెండు మంత్రి పదవులు దక్కడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తంచేస్తున్నాయి. సాక్షి, గుంటూరు: విశ్వసనీయతకు మరోసారి ఫలితం దక్కింది. వైఎస్ కుటుంబం నమ్మినవారిని వదిలిపెట్టదన్న విషయం మళ్లీ రుజువైంది. నాడు తమకోసం ఎమ్మెల్యే పదవులను త్యజించా రనే కారణంతో ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వడమే కాకుండా ఏకంగా మంత్రి పదవులు కట్టబెట్టారు. సామాజిక న్యాయం పాటిస్తూ జిల్లా నుంచి ఎస్సీ మహిళ మేకతోటి సుచరిత, బీసీ వర్గానికి చెందిన మోపిదేవి వెంకటరమణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనక్యాబినెట్లో చోటు కల్పించి తమను నమ్ముకున్నవారికి ఎప్పుడూ అన్యాయం జరగదనే విషయాన్ని మరోసారి రుజువు చేశారు. ఎవరూ ఊహించని విధంగా ఎన్నికల్లో ఓటమి చెందిన మోపిదేవికి మంత్రి పదవి ఇచ్చి అక్కున చేర్చుకున్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతికి డెప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చి జిల్లాకు సముచిత స్థానం కల్పించారు. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ జిల్లాలో మొదటి నుంచి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి అనుచరుడిగా పేరుపొందారు. 1999లో కూచినపూడి నియోజకవర్గం (ప్రస్తుతం రద్దయింది) నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన మోపిదేవి 2004లో సైతం అక్కడి నుంచే విజయం సాధించారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో ముఖ్యమంత్రి కాగానే మోపిదేవికి తన క్యాబినెట్లో స్థానం కల్పించారు. 2009లో సైతం తన క్యాబినెట్లో మంత్రి పదవి కట్టబెట్టి జిల్లాలో తన అనుచరుడిగా చూసుకుంటూ వచ్చారు. వైఎస్సార్ మరణా నంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో జైలుకు వెళ్లి, ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ వైఎస్సార్ కుటుంబంపై ఉన్న విశ్వాసంతో ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వైఎస్ జగన్ 2019లో సైతం మోపిదేవిని రేపల్లె నుంచి బరిలో నిలిపారు. అనూహ్యంగా జరిగిన పరిణామాల నేపథ్యంలో స్వల్ప తేడాతో ఆయన ఓటమి పాలయ్యారు. జిల్లాలో 15 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలుపొందిన విషయం తెలిసిందే. వీరిలో ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయనే లెక్కలు వేసుకుంటున్న తరుణంలో నమ్ముకున్న వారికి తమ కుటుంబం ఎన్నడూ అన్యాయం చేయదని రుజువు చేస్తూ ఓటమి పాలైన మోపిదేవికి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన క్యాబినెట్లో స్థానం కల్పించారు. బలహీన వర్గానికి చెందిన మోపిదేవికి మంత్రిపదవి దక్కడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మోపిదేవికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తగిన న్యాయం చేశారంటూ అంతా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. తండ్రి ఎమ్మెల్యేని చేస్తే తనయుడు మంత్రిని చేశాడు జిల్లాలో ఎస్సీ మహిళ ఎమ్మెల్యేగా మూడో సారి గెలుపొందిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరితకు తన కేబినెట్లో స్థానం కల్పించి ఆమె చేసిన త్యాగం వృథా కాలేదనే విషయాన్ని ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రుజువు చేశారు. 2006లో రాజకీయాల్లోకి వచ్చి ఫిరంగిపురం నుంచి జెడ్పీటీసీగా గెలిచిన మేకతోటి సుచరిత దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా ఎస్సీ రిజర్వుడ్ స్థానమైన ప్రత్తిపాడు టిక్కెట్టు ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించారు. ఆమె ఎమ్మెల్యేగా గెలిచిన కొద్దినెలలకే ఆయన దుర్మరణం పాలవడంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలన్ని మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీని వదిలి వైఎస్జగన్ బయటకు వచ్చిన మరుక్షణం వైఎస్సార్పై ఉన్న అభిమానంతో సుచరిత ఎమ్మెల్యే పదవికి సైతం తృణప్రాయంగా వదిలేసి ఆయన తనయుడు వైఎస్ జగన్ వెంట నడిచారు. ఆమెపై అనర్హత వేటు వేసినప్పటికీ వైఎస్ జగన్ స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి 2012 ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓటమిపాలైనప్పటికీ 2019 ఎన్నికల్లో మాత్రం విజయఢంకా మోగించారు. మూడుసార్లు గెలిచిన సుచరితకు తన కేబినెట్లో స్థానం కల్పించి తమ కుటుం బాన్ని నమ్మిన వారికి అండగా నిలబడతారనే విషయాన్ని వైఎస్జగన్ చేతల్లో చేసి చూపారు. సుచరితను తండ్రి వైఎస్సార్ ఎమ్మెల్యేను చేస్తే ఆయన తనయుడు వైఎస్ జగన్ ఏకంగా మంత్రిని చేసి విశ్వసనీయతకు నిలువెత్తు నిదర్శనంగా నిలి చారు. ఏ సామాజిక వర్గానికి చెందిన వారైనా తమను నమ్మితే వారికి పెద్ద పీట వేస్తామనే విషయాన్ని రుజువు చేసిచూపారు. సుచరితకు మంత్రి పదవి కట్టబెట్టడంపై ఎస్సీ సంఘాల నేతలు, జిల్లాప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. తండ్రి స్పీకర్.. తనయుడు డెప్యూటీ స్పీకర్ బాపట్ల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన కోన రఘుపతికి డెప్యూటీ స్పీకర్గా అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కోన రఘుపతి 2014, 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కోన రఘుపతి తండ్రి కోన ప్రభాకరరావు 1967, 1972, 1978 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. కోన ప్రభాకరరావు రాష్ట్ర మంత్రిగా, స్పీకర్గా, మహారాష్ట్ర గవర్నర్గా కూడా పనిచేశారు. అప్పట్లో తండ్రి కోన ప్రభాకర్ స్పీకర్గా పనిచేయగా, ప్రస్తుతం వైఎస్ జగన్ మోహన్రెడ్డి కోన రఘుపతికి డెప్యూటీ స్పీకర్గా అవకాశం కల్పించడం విశేషం. మృదుస్వభావి అయిన కోన రఘుపతికి డెప్యూటీ స్పీకర్ పదవి దక్కడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. -
నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నేతగా సుచరిత పేరు
-
తాడికొండలో పుట్టి.. ప్రత్తిపాడులో పోటీ
సాక్షి, ప్రత్తిపాడు : ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఇప్పుడు ఓ అంశం చర్చనీయాంశమవుతోంది. అందరి నోళ్లలోనూ ఇదే నానుతోంది. ఇది ప్రత్తిపాడు నియోజకవర్గమా లేక తాడికొండ నియోజకవర్గమా అంటూ ఓటర్లు ఛలోక్తులు విసురుతున్నారు. కారణం ప్రత్తిపాడు అసెంబ్లీ బరిలో పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులంతా తాడికొండ నియోజకవర్గ వాసులు, ఆ నియోజకవర్గంతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తులే కావడంతో పొలిటికల్ కారిడార్లో చక్కర్లు కొడుతుందీ టాపిక్. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకతోటి సుచరిత స్వగ్రామం తాడికొండ నియోజకవర్గంలోని ఫిరంగిపురం. ఈమె 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలిచి విజయం సాధించారు. ప్రస్తుతం 2019 ఎన్నికల్లో సైతం ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు. జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రావెల కిషోర్బాబుది సైతం తాడికొండ నియోజకవర్గమే. తాడికొండ మండలం రావెల గ్రామం. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించి మంత్రి పదవిని కైవసం చేసుకున్నారు. తాజాగా 2019 ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచిన డొక్కా మాణిక్యవరప్రసాద్ కూడా తాడికొండ నియోజకవర్గానికి సుపరిచితులే. స్వగ్రామం ఆ నియోజకవర్గం కాకున్నప్పటికీ గత కొద్ది సంవత్సరాలుగా అక్కడి ప్రజలతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కూడా. ప్రస్తుతం ఈయన ఎమ్మెల్సీగా కొనసాగుతూ ప్రత్తిపాడు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కూడా తాడికొండ నియోజకవర్గ అల్లుడికే ప్రత్తిపాడు సీటును కేటాయించింది. వృతిరీత్యా వైద్యుడైన డాక్టర్ చల్లగాలి కిషోర్ తాడికొండకు చెందిన డాక్టర్ సబితను వివాహం చేసుకున్నారు. ఈయన ప్రస్తుతం ప్రత్తిపాడు నుంచి బీజేపీ తరఫున బరిలో ఉన్నారు.