Navdeep Saini
-
దులీప్ ట్రోఫీ.. సైనీ ఆల్రౌండ్ ప్రదర్శన
బెంగళూరు: భారత్ ‘ఎ’ జట్టుతో జరుగుతున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో భారత్ ‘బి’ జట్టు 116 ఓవర్లలో 321 పరుగులకు ఆలౌటైంది. ముషీర్ ఖాన్ (373 బంతుల్లో 181; 16 ఫోర్లు, 5 సిక్సర్లు) తన ఓవర్నైట్ స్కోరుకు మరిన్ని పరుగులు జోడించగా...పేసర్ నవ్దీప్ సైనీ (144 బంతుల్లో 56;8 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధ శతకంతో సత్తా చాటాడు. చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ పోరులో 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన దశలో ఈ ఇద్దరూ ఎనిమిదో వికెట్కు 205 పరుగులు జోడించి భారత్ ‘బి’ని గట్టెక్కించారు. డబుల్ సెంచరీ చేసేలా కనిపించిన ముషీర్ ఖాన్ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేశాడు. ఆ తర్వాత భారత్ ‘బి’ ఇన్నింగ్స్ ఎక్కువసేపు సాగలేదు. భారత్ ‘ఎ’ జట్టు బౌలర్లలో ఆకాశ్ దీప్ 4, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ‘ఎ’ జట్టు శుక్రవారం ఆట ముగిసే సమయానికి 35 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. కెప్టెన్ శుబ్మన్ గిల్ (25), మయాంక్ అగర్వాల్ (36; 8 ఫోర్లు) ఔట్ కాగా.. రియాన్ పరాగ్ (27 బ్యాటింగ్), కేఎల్ రాహుల్ (23) క్రీజులో ఉన్నారు. ఈ రెండు వికెట్లూ నవదీప్ సైనీకే దక్కాయి. చేతిలో 8 వికెట్లు ఉన్న భారత్ ‘ఎ’ జట్టు... ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 187 పరుగులు వెనుకబడి ఉంది. -
‘జఫ్పా’తో మాయచేసిన సైనీ.. గిల్ బౌల్డ్!.. స్కోరెంతంటే?
టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్ దులిప్ ట్రోఫీ-2024లో శుభారంభం అందుకోలేకపోయాడు. ఇండియా-‘ఏ’ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న ఈ ఓపెనింగ్ బ్యాటర్.. ఇండియా- ‘బి’తో మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో తేలిపోయాడు. కేవలం 25 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.నిరాశపరిచిన గిల్క్రీజులో నిలదొక్కుకుని భారీ స్కోరు సాధిస్తాడనుకున్న అభిమానులను పూర్తిగా నిరాశపరిచాడు. ఇండియా-‘బి’ పేసర్ నవదీప్ సైనీ సంధించిన ‘జఫ్ఫా(పర్ఫెక్ట్ బాల్)’ ధాటికి బౌల్డ్ అయ్యాడు. దులిప్ ట్రోఫీ తొలి రౌండ్లో భాగంగా ఇండియా-ఏ, ఇండియా-బి జట్ల మధ్య గురువారం తొలి మ్యాచ్ ఆరంభమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో టాస్ గెలిచిన శుబ్మన్ గిల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు.ముషీర్ ఖాన్ శతకం కారణంగా ఇండియా-బి మెరుగైన స్కోరుఈ క్రమంలో ఇండియా-బి తరఫున అరంగేట్ర బ్యాటర్ ముషీర్ ఖాన్ అద్భుత శతకం(181)తో ఆకట్టుకోగా.. పేసర్ నవదీప్ సైనీ సైతం సంచలన ఇన్నింగ్స్(56) ఆడాడు. వీరిద్దరు రాణించిన కారణంగా 321 పరుగుల వద్ద రెండోరోజు ఇండియా-బి తొలి ఇన్నింగ్స్ ముగిసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇండియా-ఏ జట్టుకు ఓపెనర్ మయాంక్ అగర్వాల్ శుభారంభం అందించాడు.సైనీ జఫ్ఫా.. గిల్ బౌల్డ్ఈ కర్ణాటక బ్యాటర్ 45 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 36 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. నఅయితే, మరో ఓపెనర్ శుబ్మన్ గిల్ 43 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్ల సాయంతో 25 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇండియా-ఏ తొలి ఇన్నింగ్స్ 14వ ఓవర్లో నవదీస్ సైనీ అవుట్సైడ్ ఆఫ్ దిశగా వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమయ్యాడు. ఫలితంగా బంతి స్టంప్ను ఎగురగొట్టడంతో గిల్ తొలి వికెట్గా వెనుదిరిగాడు.వీడియో వైరల్అనంతరం నవదీప్ సైనీ బౌలింగ్లో వికెట్ కీపర్ రిషభ్ పంత్కు క్యాచ్ ఇవ్వడంతో మయాంక్ ఇన్నింగ్స్కు తెరపడింది. దీంతో రెండో రోజు ఆటలో ఇండియా-ఏ రెండో వికెట్ కోల్పోయింది. ఆట పూర్తయ్యే సరికి రియాన్ పరాగ్ 27, కేఎల్ రాహుల్ 23 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా గిల్ అవుటైన దృశ్యాలకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే.. ఇటీవలే టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్ వైస్ కెప్టెన్గా ఎంపికైన గిల్.. తదుపరి బంగ్లాదేశ్తో స్వదేశంలో టెస్టు సిరీస్ ఆడే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు. దులిప్ ట్రోఫీ ప్రదర్శన ఆధారంగా భారత జట్టు ఎంపిక నేపథ్యంలో గిల్ తనను తాను మరోసారి నిరూపించుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. చదవండి: బ్యాట్ ఝులిపించిన శ్రేయస్ అయ్యర్.. ఎట్టకేలకు..Terrific delivery 🔥Excellent catch 👌Navdeep Saini bowled a peach to dismiss Shubman Gill and Rishabh Pant pulled off a superb diving catch to remove Mayank Agarwal.#DuleepTrophy | @IDFCFIRSTBankFollow the match ▶️ https://t.co/eQyu38Erb1 pic.twitter.com/z1cCHONjCI— BCCI Domestic (@BCCIdomestic) September 6, 2024 -
Duleep Trophy: ఆ ముగ్గురు దూరం.. బీసీసీఐ ప్రకటన
టీమిండియా స్టార్ క్రికెటర్లు రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ దులిప్ ట్రోఫీ- 2024 టోర్నీకి దూరమయ్యారు.ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. హైదరాబాదీ పేసర్ సిరాజ్, కశ్మీరీ ఎక్స్ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని.. టోర్నీ మొదలయ్యే నాటికి వీరిద్దరు అందుబాటులో ఉండే పరిస్థితి లేదని తెలిపింది.సిరాజ్, ఉమ్రాన్ స్థానాల్లో వీరేఫిట్నెస్ కారణాల దృష్ట్యా సిరాజ్, ఉమ్రాన్ దులిప్ ట్రోఫీ తాజా ఎడిషన్ మొత్తానికి దూరం కానున్నట్లు పేర్కొంది. మరోవైపు.. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను టీమ్-బి నుంచి విడుదల చేస్తున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. అయితే, ఇందుకు గల కారణం మాత్రం తెలపలేదు. ఇక టీమ్-బిలో భాగమైన సిరాజ్ దూరం కావడంతో.. అతడి స్థానంలో హర్యానా రైటార్మ్ పేసర్ నవదీప్ సైనీని ఎంపిక చేసినట్లు బీసీసీఐ పేర్కొంది.అదే విధంగా.. టీమ్-సిలో ఉమ్రాన్ మాలిక్ స్థానాన్ని పాండిచ్చేరి ఫాస్ట్ బౌలర్ గౌరవ్ యాదవ్తో భర్తీ చేసినట్లు తెలిపింది. అయితే, జడ్డూ రీప్లేస్మెంట్ను మాత్రం బీసీసీఐ ప్రకటించలేదు. ఇక టీమ్-బిలో ఉన్న ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి సైతం పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధిస్తేనే ఈ టోర్నీలో పాల్గొంటాడని తెలిపింది.కాగా నాలుగు రోజుల ఫార్మాట్లో జరిగే దులిప్ ట్రోఫీ 2024-25 ఎడిషన్ సెప్టెంబరు 5 నుంచి మొదలుకానుంది. ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.దులిప్ ట్రోఫీ- 2024 రివైజ్డ్ టీమ్స్ఇండియా-ఏశుబ్మన్ గిల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, తనూష్ కొటియన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్, విద్వత్ కావేరప్ప, కుమార్ కుషాగ్రా, శస్వత్ రావత్.ఇండియా-బిఅభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ముషీర్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి*, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైనీ, యశ్ దయాళ్, ముకేష్ కుమార్, రాహుల్ చహర్, ఆర్. సాయి కిషోర్, మోహిత్ అవస్థి, ఎన్ జగదీశన్ (వికెట్ కీపర్).ఇండియా-సిరుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, బి ఇంద్రజిత్, హృతిక్ షోకీన్, మానవ్ సుతార్, గౌరవ్ యాదవ్, వైషక్ విజయ్కుమార్, అన్షుల్ ఖంబోజ్, హిమాన్షు చౌహాన్, మయాంక్ మార్కండే, ఆర్యన్ జుయాల్ (వికెట్ కీపర్), సందీప్ వారియర్.ఇండియా-డిశ్రేయస్ అయ్యర్(కెప్టెన్), అథర్వ తైడే, యశ్ దూబే, దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రికీ భుయ్, శరణ్ జైన్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, ఆదిత్య థాకరే, హర్షిత్ రాణా, తుషార్ దేశ్పాండే, ఆకాశ్ సేన్గుప్తా, కేఎస్ భరత్(వికెట్ కీపర్), సౌరభ్ కుమార్.చదవండి: టీ20 వరల్డ్కప్ కోసం భారత జట్టు ప్రకటన -
గంభీర్ కీలక నిర్ణయం.. 3 ఏళ్ల తర్వాత ఆ ప్లేయర్ రీ ఎంట్రీ! ఎవరంటే?
శ్రీలంక పర్యటనకు భారత జట్టును గురువారం బీసీసీఐ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. జూన్ 18 (గురువారం) సాయంత్రం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ వర్చువల్గా సమావేశం కానుంది. ఈ మీటింగ్లో భారత కొత్త హెడ్ కోచ్ గౌతం గంభీర్ సైతం పాల్గోనున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్లలో తలపడనుంది.ఈ రెండు సిరీస్లకు వేర్వేరు జట్లను అగార్కర్ అండ్ కో ఎంపికచేయనున్నారు. అయితే లంకతో వన్డేలకు టీమిండియా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా దూరం కానున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి . తొలుత భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా లంకతో వన్డే సిరీస్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. కానీ హిట్మ్యాన్ తన నిర్ణయాన్ని మార్చుకుని శ్రీలంక పర్యటనకు అందుబాటులో ఉంటానని సెలక్టర్లకు తెలియజేసినట్లు వినికిడి. అదేవిధంగా శ్రీలంకతో టీ20ల్లో భారత కెప్టెన్గా హార్దిక్ పాండ్యా వ్యహరించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.నవ్దీప్ సైనీ రీ ఎంట్రీశ్రీలంక టూర్కు భారత జట్టు ఎంపిక ముందు కొత్త హెడ్కోచ్ గౌతం గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత మూడేళ్లగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న ఫాస్ట్ బౌలర్ నవ్దీప్ సైనీకి తిరిగి పిలుపునివ్వాలని సెలక్టర్లకు గంభీర్ సూచించినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. లంకతో వన్డే జట్టులో సైనీ భాగం చేయాలని గంభీర్ భావిస్తున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్స్ను పెంచుకునే విధంగా గంభీర్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా నవ్దీప్ సైనీ చివరగా 2021లో ఆర్. ప్రేమదాస స్టేడియంలో శ్రీలంకతో జరిగిన వన్డేలో భారత తరపున ఆడాడు. ఆ తర్వాత అతడికి జాతీయ జట్టులో చోటు దక్కలేదు. అతడు ప్రస్తుతం ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అదే విధంగా ఇటీవల దేశీవాళీ క్రికెట్తో పాటు ఇంగ్లండ్ కౌంటీల్లో కూడా అద్భుతంగా రాణించాడు. ఈ క్రమంలోనే అతడికి పిలుపునివ్వాలని గంభీర్ నిర్ణయించుకున్నట్లు వినికిడి. -
Navdeep Saini : శ్రీవారిని దర్శించుకున్న టీమిండియా క్రికెటర్ (ఫొటోలు)
-
Navdeep Saini-Swati Asthana Marriage: స్వాతిని పెళ్లాడిన నవదీప్ సైనీ.. హీరోయిన్లకు తక్కువేమీ కాదు!(ఫొటోలు)
-
యూట్యూబర్ను పెళ్లాడిన టీమిండియా పేసర్.. సిరాజ్ విషెస్
Navdeep Saini Gets arried to Girlfriend: టీమిండియా పేసర్ నవదీప్ సైనీ వివాహ బంధంలో అడుగుపెట్టాడు. చిరకాల ప్రేయసి స్వాతి ఆస్తానాను పెళ్లాడాడు. ఈ శుభవార్తను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు నవదీప్. ఈ మేరకు.. ‘‘నీతో ఉంటే ప్రతిరోజూ నేను ప్రేమలో పడుతూ ఉంటా.. ఈరోజు నుంచి మేమిద్దరం కలకాలం కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం. జీవితంలో కొత్త అధ్యాయం ఆరంభించిన మాకు మీ ప్రేమ, ఆశీర్వాదాలు కావాలి’’ అని నవదీప్ సైనీ గురువారం తన పెళ్లి ఫొటోలను షేర్ చేశాడు. ఈ క్రమంలో మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్, రాహుల్ తెవాటియా, సాయికిషోర్, చేతన్ సకారియా, మన్దీప్ సింగ్, మొహ్సిన్ ఖాన్ తదితర భారత క్రికెటర్లు నవదీప్- స్వాతి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కర్నాల్ కుర్రాడు హర్యానాకు చెందిన నవదీప్ సైనీ 2019లో టీమిండియా తరఫున అంతర్జాతీయ టీ20, వన్డేల్లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత రెండేళ్లకు టెస్టుల్లోనూ అరంగేట్రం చేశాడు. ప్రఖ్యాత సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో పటిష్ట ఆస్ట్రేలియా జట్టుతో తన టెస్టు ప్రస్థానం మొదలుపెట్టాడు. ఇక ఇంటర్నేషనల్ కెరీర్లో ఇప్పటి వరకు మొత్తంగా 8 వన్డేలు, 11 టీ20లు, 2 టెస్టులు ఆడిన ఈ 31 ఏళ్ల రైటార్మ్ పేసర్.. ఆయా ఫార్మాట్లలో 6, 13, 4 వికెట్లు పడగొట్టాడు. కాగా నవదీప్ సైనీ టీమిండియా తరఫున చివరిసారిగా.. శ్రీలంకతో టీ20 సిరీస్ సందర్భంగా మైదానంలో దిగాడు. ఇక ఐపీఎల్లో అతడు గతేడాది రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిథ్య వహించాడు. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(టీ20) సందర్భంగా ఢిల్లీకి ఆడాడు. ఎవరీ స్వాతి ఆస్తానా?! నవదీప్ను పెళ్లాడిన స్వాతి ఆస్తానా ఫ్యాషన్, ట్రావెల్, లైఫ్స్టైల్ వ్లాగర్. ఆమెకు సొంతంగా యూట్యూబ్ చానెల్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో 84 వేల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇక తమ వివాహ వేడుకలో స్వాతి- నవదీప్ పేస్టల్ కలర్ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. View this post on Instagram A post shared by Navdeep Saini (@navdeep_saini10_official) చదవండి: ఐపీఎల్-2024కు ముందు చెన్నై సూపర్ కింగ్స్కు బిగ్ షాక్.. -
అస్సలు ఊహించలేదు.. అప్పుడెప్పుడో!ఈసారి తుది జట్టులో చోటు ఖాయం!
India West Indies tour 2023: టీమిండియాకు తిరిగి ఎంపికవుతావని అస్సలు ఊహించలేదని ఢిల్లీ పేసర్ నవదీప్ సైనీ అన్నాడు. రెండోసారి వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుండటం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశాడు. గతంలో తనకు తుది జట్టులో చోటు దక్కలేదని, ఈసారి మాత్రం పూర్తి నమ్మకంతో ఉన్నానని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్తో అరంగేట్రం కాగా హర్యానాలోని కర్ణాల్లో జన్మించిన నవదీప్ సైనీ.. 2019లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. వెస్టిండీస్తో వన్డే సిరీస్తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత రెండేళ్లకు జనవరిలో ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2021 సందర్భంగా టెస్టుల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. ఇక శ్రీలంకతో 2021లో ఆడిన టీ20 మ్యాచ్ టీమిండియా తరఫున నవదీప్నకు ఆఖరి మ్యాచ్. కౌంటీల్లో ఆడేందుకు ఈ క్రమంలో దాదాపు మూడేళ్ల విరామం తర్వాత మరోసారి టీమిండియా సెలక్టర్ల నుంచి నవదీప్ సైనీ పిలుపు అందుకున్నాడు. ఇంగ్లండ్లో కౌంటీల్లో ఆడేందుకు సిద్ధమైన అతడు అనూహ్య రీతిలో జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. విండీస్తో టెస్టు సిరీస్ ఆడే జట్టులో చోటు దక్కించుకున్నాడు. కాగా వార్సెస్టర్షైర్ కౌంటీ క్లబ్కు ఆడాల్సిన సైనీ.. వెస్టిండీస్తో సిరీస్ నేపథ్యంలో ఇంగ్లండ్లో కొన్ని మ్యాచ్లకు దూరం కానున్నాడు. ఇదిలా ఉంటే.. సుదీర్ఘ విరామం తర్వాత పునరాగమనం చేయనుండటంపై స్పందిస్తూ నవదీప్ సైనీ ఉద్వేగానికి లోనయ్యాడు. అస్సలు ఊహించలేదు ‘‘నేను కౌంటీ క్రికెట్ ఆడేందకు లండన్కు వచ్చాను. ఎయిర్పోర్టు నుంచి బయటకు వస్తున్న సమయంలోనే నేను వెస్టిండీస్లో పర్యటించే జట్టుకు ఎంపికయ్యానన్న వార్త తెలిసింది. నిజాయితీగా చెప్పాలంటే... నేను ఇది అస్సలు ఊహించలేదు. ఐపీఎల్ ఆడుతున్న సమయంలో డ్యూక్ బాల్స్తో ప్రాక్టీస్ చేశా. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ నేపథ్యంలో నన్ను కనీసం స్టాండ్బై ఎంపిక చేస్తారనే ఆశతోనే అలా చేశా. కానీ అది జరుగలేదు. ఇప్పుడు మాత్రం ఊహించని విధంగా మళ్లీ జట్టుతో చేరబోతున్నా’’ అని లండన్లో ఇండియన్ ఎక్స్ప్రెస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సైనీ పేర్కొన్నాడు. వెస్టిండీస్ పిచ్లపై తనకు అవగాహన ఉందన్న ఈ ఫాస్ట్ బౌలర్.. వెస్టిండీస్ పర్యటనకు ముందు ఒక్క మ్యాచ్ ఆడినా కావాల్సినంత ప్రాక్టీస్ దొరుకుతుందన్నాడు. కాగా 30 ఏళ్ల నవదీప్ సైనీ.. టీమిండియా తరఫున ఇప్పటి వరకు 2 టెస్టులు, 8 వన్డేలు, 11 టీ20లు ఆడి వరుసగా.. 2, 6, 13 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్-2023లో అతడు రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిథ్య వహించిన విషయం తెలిసిందే. వెస్టిండీస్తో టెస్టు సిరీస్కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్, నవదీప్ సైనీ. చదవండి: లెజండరీ ఓపెనర్ దిల్షాన్.. డీకే మాదిరే! ఉపుల్ తరంగతో భార్య ‘బంధం’.. అతడినే పెళ్లాడి! కోహ్లి లేకుంటే జట్టులోకి వచ్చేవాడినే కాదు.. ధోని నా కళ్లు తెరిపించాడు: యువీ -
నక్క తోక తొక్కిన భారత ఆటగాడు! మూడేళ్ల తర్వాత రీ ఎంట్రీ.. అస్సలు ఊహించలేదు!
వెస్టిండీస్ పర్యటనకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. తొలుత టెస్టు, వన్డే సిరీస్లకు మాత్రమే జట్లను భారత సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. అయితే సెలక్టర్లు ఎంపిక చేసిన జట్టులో కొన్ని అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ఐపీఎల్లో అద్భుతమైన అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన యశస్వీ జైశ్వాల్, రుత్రాజ్ గైక్వాడ్కు తొలిసారిగా టెస్టు జట్టులో చోటు దక్కగా.. వెటరన్ ఆటగాడు ఛతేశ్వర్ పుజారాపై వేటు పడింది. మరోవైపు మూడేళ్ల నుంచి జట్టుకు దూరంగా ఉన్న పేసర్ నవదీప్ సైనీకి సెలక్టర్లు పిలుపునిచ్చారు. 2021లో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో టెస్టు క్రికెట్లోకి సైనీ అరంగేట్రం చేశాడు. అయితే తన డెబ్యూ సిరీస్లో రెండు మ్యాచ్లు ఆడిన సైనీ.. ఇప్పటివరకు టెస్టుల్లో మరి కన్పించలేదు. సైనీ 4 ఇన్నింగ్స్లో 4.11 ఏకానమీతో 4 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా ఇప్పటివరకు 8 వన్డే, 11 టీ20ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహించిన సైనీ కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే ఆడి 3 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడేందుకు వోర్సెస్టర్షైర్ క్రికెట్ క్లబ్తో ఒప్పందం కుదుర్చుకున్న వెంటనే సైనీకి సెలక్టర్లు నుంచి పిలుపు రావడం గమానర్హం. జూలై 12 నుంచి భారత పర్యటన ప్రారంభం కానుంది. విండీస్తో టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కెఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, ఆర్ జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ. భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, మొహమ్మద్. సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్. చదవండి: IND vs WI: అతడేం నేరం చేశాడు.. ప్రతీసారి ఇంతే! నిజంగా సిగ్గుచేటు! -
స్థిరత్వం లేని బ్యాటింగ్.. పైగా వెకిలి నవ్వొకటి!
ఐపీఎల్ 16వ సీజన్లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్న లియామ్ లివింగ్ స్టోన్ స్థిరత్వం లేకుండా ఆడుతున్నాడు. ఒక మ్యాచ్లో భారీ స్కోరు చేస్తే మరుసటి మ్యాచ్లో తక్కువ స్కోరుకే వెనుదిరగడం అలవాటుగా చేసుకున్నాడు. తాజాగా శుక్రవారం రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో లివింగ్స్టోన్ 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ సీజన్లో 8 మ్యాచ్లాడిన లివింగ్స్టోన్ 270 పరుగులు చేశాడు. రెండు అర్థశతకాలు ఉన్నాయి. ఇక రాజస్తాన్తో మ్యాచ్లో లివింగ్స్టోన్ ఆడిన దానికంటే ఔటైన తీరు ఆశ్చర్యపరిచింది. నవదీప్ సైనీ వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో మూడో బంతి ఫుల్లెంగ్త్ డెలివరీ వేశాడు. అయితే లివింగ్స్టోన్ కనీసం బంతి ఎలా వస్తుందో కూడా చూడకుండా గుడ్డిగా బ్యాట్ను ఉపాడు. ఇంకేముంది సైనీ వేసిన బంతి నేరుగా వికెట్లను గిరాటేసింది. అయితే క్లీన్బౌల్డ్ అయ్యానన్న బాధ లివింగ్స్టోన్ మొహంలో కనిపించలేదు కదా వెకిలినవ్వుతో పెవిలియన్ చేరడం అందరిని ఆశ్చర్యపరిచింది. Navdeep Saini doesn't miss 🎯#PBKSvRR #IPLonJioCinema #TATAIPL #IPL2023 pic.twitter.com/QosEBqIkrB — JioCinema (@JioCinema) May 19, 2023 Liam Livingstone cleaned up by Navdeep Saini! 😱#PBKSvsRR #IPL2023 #Cricket pic.twitter.com/jkNg3u1zGg — OneCricket (@OneCricketApp) May 19, 2023 చదవండి: కోహ్లి '18' వెంటపడడం లేదు.. అతని వెనకే '18' వస్తోంది -
Ind Vs Ban: రోహిత్తో పాటు అతడు కూడా అవుట్.. బీసీసీఐ ప్రకటన
Bangladesh vs India, 2nd Test: బంగ్లాదేశ్తో రెండో టెస్టుకు కూడా టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. అతడితో పాటు పేసర్ నవదీప్ సైనీ కూడా ఈ మ్యాచ్కు అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి మంగళవారం ధ్రువీకరించింది. రోహిత్ శర్మ గాయం నుంచి ఇంకా కోలుకోలేదని, ప్రస్తుతం అతడు బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో రెండో టెస్టుకు కూడా కేఎల్ రాహుల్ కెప్టెన్గా వ్యవహరిస్తాడని పేర్కొంది. ఇక నవదీప్ సైనీ పొట్ట కండరాల నొప్పితో బాధపడుతున్నట్లు పేర్కొన్న బీసీసీఐ.. అతడు జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లనున్నట్లు తెలిపింది. నవదీప్ సైనీ రాహుల్ సారథ్యంలో.. కాగా బంగ్లాదేశ్తో వన్డే సిరీస్లో భాగంగా రెండో మ్యాచ్ సందర్భంగా రోహిత్ శర్మ గాయపడ్డ విషయం తెలిసిందే. ఎడమచేతి బొటనవేలికి గాయమైనప్పటికీ బ్యాటింగ్ చేసిన హిట్మ్యాన్.. నొప్పి తీవ్రతరం కావడంతో స్వదేశానికి తిరిగివచ్చాడు. ఈ క్రమంలో మొదటి టెస్టుకు దూరమైన రోహిత్.. రెండో మ్యాచ్ నాటికి అందుబాటులోకి వస్తాడనుకున్నా అలా జరుగలేదు. ఇక కేఎల్ రాహుల్ సారథ్యంలో తొలి టెస్టులో బంగ్లాను చిత్తు చేసిన టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో చోటు దక్కించుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇదిలా ఉంటే ఫాస్ట్బౌలర్ నవదీప్ సైనీకి టెస్టు జట్టులో చోటు దక్కినా మొదటి మ్యాచ్లో ఆడే అవకాశం రాలేదు. బంగ్లాదేశ్తో రెండో టెస్టుకు భారత జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుబ్మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, అభిమన్యు ఈశ్వరన్, సౌరభ్ కుమార్, జయదేవ్ ఉనద్కత్. చదవండి: Kylian Mbappe: నిండా పాతికేళ్లు లేవు.. ప్రపంచమే సలాం కొట్టింది; ఎవరీ ఎంబాపె Babar Azam: ఇంగ్లండ్ చేతిలో ఘోర ఓటమి.. బాబర్ ఆజం చెత్త రికార్డు! మొదటి పాక్ కెప్టెన్గా.. -
శతక్కొట్టిన టీమిండియా ఓపెనర్లు.. రెచ్చిపోయిన యశస్వి జైస్వాల్
IND A VS BAN A 1st Unofficial Test: బంగ్లాదేశ్-ఏతో జరుగుతున్న తొలి అనధికారిక నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్లో భారత-ఏ జట్టు పట్టు బిగించింది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన టీమిండియా.. తొలి రోజు (నవంబర్ 29) ప్రత్యర్ధిని 45 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూల్చింది. సౌరభ్ కుమార్ (4/23), నవదీప్ సైని (3/21) బంగ్లా పతనాన్ని శాశించారు. అనంతరం నిన్ననే తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 36 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 120 పరుగులు చేసింది. తొలి రోజే అర్ధసెంచరీలు పూర్తి చేసుకుని జోరు మీదుండిన భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (61 బ్యాటింగ్), అభిమన్యు ఈశ్వరన్ (53 బ్యాటింగ్) రెండో రోజు మరింత రెచ్చిపోయారు. ఇద్దరు భారీ సెంచరీలు సాధించి జట్టును పటిష్ట స్థితిలో ఉంచారు. జైస్వాల్ (145; 20 ఫోర్లు, సిక్స్), ఈశ్వరన్ (142; 11 ఫోర్లు, సిక్స్) తొలి వికెట్కు రికార్డు స్థాయిలో 283 పరుగులు జోడించారు. ఫలితంగా రెండో రోజు టీ విరామం సమయానికి భారత్.. 3 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. యశ్ ధుల్ (20) ఔట్ కాగా.. తిలక్ వర్మ (6), సర్ఫరాజ్ ఖాన్ (0) క్రీజ్లో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 213 పరుగుల ఆధిక్యంలో కొనసాగతుంది. కాగా, భారత-ఏ జట్టు బంగ్లాదేశ్ పర్యటనలో రెండు టెస్ట్ మ్యాచ్లు ఆడుతుంది. వీటి అనంతరం టీమిండియా 3 వన్డేలు, 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ కోసం ఆ దేశంలో పర్యటిస్తుంది. -
భారత బౌలర్ల విజృంభణ.. కుప్పకూలిన బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ ‘ఎ’ జట్టుతో తొలి టెస్టులో మొదటి రోజు భారత్ ‘ఎ’కు ఎనిమిది పరుగుల ఆధిక్యం దక్కింది. కాక్స్ బజార్లో జరుగుతున్న ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 45 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లు సౌరభ్ కుమార్ (4/23), నవదీప్ సైని (3/21) రాణించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఆట ముగిసే సమయానికి 36 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 120 పరుగులుచేసింది. యశస్వి (61 బ్యాటింగ్), ఈశ్వరన్ (53 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. -
అదరగొట్టిన సౌరభ్, నవదీప్.. 112 పరుగులకే కుప్పకూలిన బంగ్లాదేశ్
Bangladesh A vs India A, 1st unofficial Test: బంగ్లాదేశ్- ఏతో అనధికారిక టెస్టులో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శనతో మెరిశారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ సౌరభ్ 4 వికెట్లతో చెలరేగగా.. పేసర్ నవదీప్ సైనీ 3 వికెట్లు కూల్చాడు. వీరిద్దరికి తోడు ముకేశ్ కుమార్ రాణించడంతో బంగ్లా జట్టు 112 పరుగులకే కుప్పకూలింది. కాగా టీమిండియా కంటే ముందు భారత- ఏ జట్టు బంగ్లాదేశ్కు పయనమైన విషయం తెలిసిందే. ఈ టూర్లో భాగంగా బంగ్లాదేశ్- ఏ జట్టుతో రెండు అనధికారిక టెస్టు(నాలుగు రోజుల మ్యాచ్)లు ఆడనుంది. ఇందులో భాగంగా ఇరు జట్ల మధ్య మంగళవారం మొదటి టెస్టు ఆరంభమైంది. టాస్ గెలిచి కాక్స్ బజార్ వేదికగా ఆరంభమైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ అభిమన్య ఈశ్వరన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. సారథి నమ్మకాన్ని నిలబెడుతూ భారత బౌలర్లు విజృంభించారు. నవదీప్ సైనీ, ముకేశ్ కుమార్ చెలరేగడంతో బంగ్లా బ్యాటింగ్ ఆర్డర్ కకావిలకమైంది. ఓపెనర్లు మహ్మదుల్ హసన్ జాయ్ 1, జాకిర్ హసన్ 0 పరుగులకే అవుట్ కాగా.. వన్డౌన్లో వచ్చిన షాంటో 19 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత మొమినుల్ 4 పరుగులకే అవుట్ కాగా.. కెప్టెన్ మహ్మద్ మిథున్ డకౌట్గా వెనుదిరిగాడు. మొసద్దెక్ ఒంటరి పోరాటం ఈ క్రమంలో ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన మొసద్దెక్ హొసేన్ 63 పరుగులు చేసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే సౌరభ్ కుమార్ అతడిని పెవిలియన్కు పంపడంతో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ముగింపునకు చేరుకుంది. ఈ క్రమంలో 45 ఓవర్లలో కేవలం 112 పరుగులు మాత్రమే చేసి బంగ్లా- ఏ జట్టు ఆలౌట్ అయింది. సౌరభ్కు 4, నవదీప్నకు మూడు, ముకేశ్ కుమార్కు రెండు, అతిత్ షేత్కు ఒక వికెట్ దక్కాయి. చదవండి: 6 Sixes In An Over: ఒకే ఓవర్లో 6 సిక్స్లు కొట్టింది వీళ్లే! ఇక రుతు 7 సిక్సర్లు బాదితే.. అతడు ఏకంగా 8! SL Vs AFG: ఒకేరోజు పెళ్లి చేసుకున్న ముగ్గురు లంక యువ క్రికెటర్లు! ఓవైపు సిరీస్ ఆడుతూనే.. -
అరంగేట్రంలోనే అదుర్స్! ద్రవిడ్ తర్వాత ఆ ఘనత సైనీదే.. కానీ పాపం..
County Championship 2022: టీమిండియా పేసర్ నవదీప్ సైనీ కౌంటీ చాంపియన్షిప్ ఎంట్రీలోనే అదరగొట్టాడు. కెంట్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు అరంగేట్రంలోనే ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్లోని బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా కెంట్.. వార్విక్షైర్తో తలపడుతోంది. ఈ మ్యాచ్ ద్వారా కౌంటీల్లో అడుగు పెట్టిన సైనీ.. వార్విక్షైర్ మొదటి ఇన్నింగ్స్లో బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఐదు వికెట్లు తీసి సత్తా చాటాడు. క్రిస్ బెంజమిన్, డాన్ మూస్లే, మిచెల్ బర్గ్స్ , హెన్రీ బ్రూక్స్, క్రెయిగ్ మిల్స్లను అవుట్ చేశాడు. Five wickets on debut: @navdeepsaini96 🏎 pic.twitter.com/6wzYjE8N1d — Kent Cricket (@KentCricket) July 20, 2022 ద్రవిడ్ తర్వాత ఆ ఘనత సైనీదే! టెస్టు స్పెషలిస్టు ఛతేశ్వర్ పుజారా సహా పలువురు టీమిండియా క్రికెటర్లు కౌంటీ చాంపియన్షిప్-2022లో ఆడుతున్న విషయం తెలిసిందే. పుజారా ససెక్స్కు, ఉమేశ్ యాదవ్ మిడిల్సెక్స్ తరఫున, వాషింగ్టన్ సుందర్ లంకాషైర్ తరఫున ఆడుతున్నారు. కాగా వాషింగ్టన్ సుందర్ సైతం తొలి మ్యాచ్లోనే ఐదు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. ఇక సైనీ కెంట్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కాగా గతంలో టీమిండియా వాల్, ప్రస్తుత హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ ఈ జట్టుకు ఆడాడు. ఆ తర్వాత కెంట్కు ఆడుతున్న ఘనత నవదీప్ సైనీకే దక్కింది. ఇదిలా ఉంటే.. రాయల్ వన్డే చాంపియన్షిప్లో భాగంగా కృనాల్ పాండ్యా వార్విక్షైర్కు ఆడనున్నాడు. పాపం.. బౌలర్లు రాణించినా.. మ్యాచ్ విషయానికొస్తే.. జూలై 19న కెంట్తో ఆరంభమైన మ్యాచ్లో టాస్ గెలిచిన వార్విక్షైర్ తొలి ఇన్నింగ్స్ను 225 పరుగుల వద్ద ముగించింది. కెంట్ బౌలర్లలో సైనీ ఐదు వికెట్లు తీయగా.. మ్యాట్ హెన్రీ రెండు, మిల్న్స్ మూడు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. అయితే, బ్యాటర్లు విఫలం కావడంతో 165 పరుగులకే కెంట్ కుప్పకూలింది. వర్షం కారణంగా మూడో రోజు ఆట ఆలస్యమైంది. చదవండి: Ind Vs WI ODI Series: వీళ్లతో అంత వీజీ కాదు! ఏమరపాటుగా ఉంటే మూల్యం చెల్లించకతప్పదు! -
‘కెంట్’ తరఫున కౌంటీల్లో నవదీప్ సైనీ
ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో మరో భారత పేస్ బౌలర్కు అవకాశం దక్కింది. 29 ఏళ్ల ఢిల్లీ పేసర్ నవదీప్ సైనీ ‘కెంట్’ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. ఈ సీజన్లో 3 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు, 5 వన్డేలలో అతను ‘కెంట్’కు ప్రాతినిధ్యం వహిస్తాడు. రాహుల్ ద్రవిడ్ తర్వాత ఈ టీమ్కు ఆడనున్న రెండో భారత క్రికెటర్ సైనీ. తాజా సీజన్లో కౌంటీలు ఆడుతున్న భారత ఆటగాళ్ల సంఖ్య ఐదుకు చేరింది. ఇప్పటికే పుజారా, సుందర్, కృనాల్, ఉమేశ్ యాదవ్ ఒప్పందాలు చేసుకున్నారు. భారత్కు 2 టెస్టులు, 8 వన్డేలు, 11 టి20ల్లో ప్రాతినిధ్యం వహించిన సైనీ మూడు ఫార్మాట్లలో కలిపి 23 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టాడు. అతను జాతీయ జట్టు తరఫున ఆడి దాదాపు ఏడాదవుతోంది. చరిత్రాత్మక ‘బ్రిస్బేన్ టెస్టు’ విజయం తర్వాత సైనీకి మళ్లీ టెస్టు మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. -
శభాష్ సైనీ.. తలకు దెబ్బ తగిలిన క్యాచ్ వదలలేదు.. వీడియో వైరల్
ఐపీఎల్-2022లో భాగంగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు నవదీప్ సైనీ సంచలన క్యాచ్తో మెరిశాడు. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ 13 ఓవర్ వేసిన ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్లో.. కిషన్ డిప్ స్వేర్ లెగ్ దిశగా పుల్ షాట్ ఆడాడు. ఈ కమ్రంలో స్వేర్ లెగ్లో ఫీల్డింగ్ చేస్తున్న సైనీ పరిగెత్తుకుంటూ వచ్చి అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. అయితే క్యాచ్ పట్టే సమయంలో అతడి తలకు గాయమైంది. అయినప్పటికీ సైనీ క్యాచ్ విడిచి పెట్టలేదు. కాగా నొప్పితో ఫీల్డ్లో కొద్ది సేపు బాధ పడ్డాడు. అయితే ఫిజియో వచ్చి పరిశీలించగా గాయం అంత తీవ్రమైనది కాదని తెలింది. దీంతో ఫీల్డ్లో సైనీ కొనసాగాడు. కాగా ముంబై ఇన్నింగ్స్ అఖరి ఓవర్ వేసిన సైనీ కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్లో3 ఓవర్లు వేసిన సైనీ.. 36 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు సాధించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముంబై ఇండియన్స్ పై రాజస్తాన్ రాయల్స్ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇక 194 భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 7 వికెట్లు కోల్పోయి 170 పరుగులకే పరిమితమైంది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ(61), ఇషాన్ కిషన్(54) పరగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. చదవండి: Tilak Varma: మ్యాచ్ ఓడినా మనసులు గెలుచుకున్న తెలుగు కుర్రాడు Navdeep Saini Injured. pic.twitter.com/i56oSR49WW — Jalaluddin Sarkar (Thackeray) 🇮🇳 (@JalaluddinSark8) April 2, 2022 -
IND VS SL: తగ్గేదేలేదంటున్న ఆ ముగ్గరు టీమిండియా క్రికెటర్లు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ "పుష్ప" కేవలం సినిమా ప్రపంచాన్నే కాకుండా యావత్ జగత్తును ఉర్రూతలూగిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ మూవీ విడుదలై నెలలు గడుస్తున్నా దీనికున్న క్రేజ్ ఏమాత్రం తగ్గడంలేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అంతా పుష్ప మత్తులోనే ఉన్నారు. టీమిండియా క్రికెటర్లనైతే పుష్ప ఫోబియా వదలనంటుంది. ముఖ్యంగా ఇందులోనే 'తగ్గేదేలే' డైలాగ్ను భారత క్రికెటర్లు ఇంకా జపిస్తూనే ఉన్నారు. View this post on Instagram A post shared by Yuzvendra Chahal (@yuzi_chahal23) తాజాగా టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ సహచర క్రికెటర్లైన నవ్దీప్ సైనీ, హర్ప్రీత్ బ్రార్తో కలిసి బస్సుల్లో ప్రయాణిస్తూ తగ్గేదేలా హిందీ డైలాగ్కు రీల్స్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. తగ్గేదేలే డైలాగ్కు క్రికెటర్ల హావభావాలు అభిమానలును తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియోను చహల్ ఇన్స్టా పోస్ట్ చేయగా లైక్లు , కామెంట్ల వర్షం కురుస్తుంది. శ్రీలంకతో సిరీస్లోనూ ఏ మత్రం తగ్గొద్దంటూ అభిమానులు కామెంట్ల ద్వారా క్రికెటర్లను ఎంకరేజ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, లంకతో టీ20 సిరీస్ ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. లక్నో వేదికగా తొలి టీ20, ఫిబ్రవరి 26, 27 తేదీల్లో ధర్మశాల వేదికగా రెండు, మూడు టీ20లు జరగనున్నాయి. అనంతరం మార్చి 4-8 వరకు మొహాలీలో తొలి టెస్టు, మార్చి 12-16 వరకు బెంగళూరు వేదికగా రెండో టెస్టు(డే అండ్ నైట్) జరగనుంది. చదవండి: Ind Vs SL: జట్టులోకి తిరిగి రావడం సంతోషంగా ఉంది: టీమిండియా ఆల్రౌండర్ -
IND vs SA ODI Series: వన్డే సిరీస్కు జయంత్ యాదవ్, నవదీప్ సైనీ ఎంపిక
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ నేపథ్యంలో జయంత్ యాదవ్ భారత జట్టుకు ఎంపికయ్యాడు. యువ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్థానంలో జట్టులో చోటు దక్కించుకున్నాడు. కాగా జనవరి 19 నుంచి ప్రొటిస్తో టీమిండియా వన్డే సిరీస్ మొదలు కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా జట్టుకు దూరం కాగా.. అతడి స్థానంలో కేఎల్ రాహుల్కు బీసీసీఐ సారథ్య బాధ్యతలు అప్పగించింది. అదే విధంగా సుదీర్ఘ విరామం తర్వాత శిఖర్ ధావన్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. యువ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ కూడా తొలిసారి వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. అయితే, వాషింగ్టన్ సుందర్ కోవిడ్ కారణంగా ఈ సిరీస్కు దూరమయ్యాడు. దీంతో ఆలిండియా సీనియర్ సెలక్షన్ కమిటీ అతడి స్థానంలో జయంత్ యాదవ్ను ఎంపిక చేసింది. అదే విధంగా నవదీప్ సైనీని కూడా జట్టులో చేర్చింది. దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు సందర్భంగా గాయపడ్డ మహ్మద్ సిరాజ్కు బ్యాకప్గా సైనీకి అవకాశం ఇచ్చింది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు భారత జట్టు: కేఎల్ రాహుల్(కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, యజువేంద్ర చాహల్, ఆర్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్, ప్రసిద్ క్రిష్ణ, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, జయంత్ యాదవ్, నవదీప్ సైనీ. చదవండి: SA vs IND: అత్యంత చెత్త రికార్డు నమోదు చేసిన దక్షిణాఫ్రికా ఓపెనర్.. -
Navdeep Saini: కసితో వేశాడు.. స్టంప్ ఎగిరి గాల్లో పల్టీలు
Navdeep Saini Sends Off Stump Wicket Cartwheeling.. ఇండియా-ఏ, దక్షిణాఫ్రికా-ఏ మధ్య జరుగుతున్న మ్యాచ్లో స్పీడస్టర్ నవదీప్ సైనీ అద్భుత బంతితో మెరిశాడు. అతని బౌలింగ్ దాటికి స్టంప్ ఎగిరి గాల్లో పల్టీలు కొట్టి మూడు నుంచి నాలుగు అడుగు దూరంలో పడింది. దక్షిణా ఇన్నింగ్స్ 92 వ ఓవర్లో ఇది చోటు చేసుకుంది. అప్పుడే క్రీజులోకి వచ్చిన కొత్త బ్యాటర్ హెండ్రిక్స్ క్రీజులో కుదురుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. తన 21వ ఓవర్ వేయడానికి వచ్చిన నవదీప్ సైనీ ఓవర్ తొలి బంతినే 100 కిమీవేగంతో విసిరాడు. పొరపాటున దాన్ని అంచనా వేయని హెండ్రిక్స్ వదిలేయడంతో బంతి ఆఫ్స్టంప్ను గిరాటేసింది. ఇంకేముంది స్టంప్ ఎగిరి గాల్లో పల్టీలు కొడుతూ కింద పడింది. అయితే పక్కనే ఉన్న మిడిల్ స్టంప్, లెగ్ స్టంప్లు మాత్రం ఇంచుకూడా కదలకపోవడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: IND Tour Of SA Delayed: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. టీమిండియా పర్యటన వాయిదా! ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సర్ఫరాజ్ ఖాన్ (94 బంతుల్లో 71 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్లు), హనుమ విహారి (164 బంతుల్లో 54; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. దీంతో 198/5 ఓవర్నైట్ స్కోరుతో గురువారం ఆట ప్రారంభించిన భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్లో 74.5 ఓవర్లలో 276 పరుగుల వద్ద ఆలౌటైంది. సర్ఫరాజ్, విహారి ఆరో వికెట్కు 60 పరుగులు జోడించారు. తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా ‘ఎ’కు 21 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆడిన దక్షిణాఫ్రికా మూడో రోజు ఆట నిలిచే సమయానికి 5 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. చదవండి: IND VS NZ: అతడు టీమిండియా ఓపెనర్గా రావాలి... Truly one of the most beautiful sights in cricket as Navdeep Saini uproots Beuran Hendricks' off stump. Marco Jansen however has been the 1st SA A batsmen to score 50 and is desperately hoping for the number 11 to just stay with him. SA A: 249/9#SAAvINDA pic.twitter.com/xPj1OlFJUq — Shaun (@Shaun_Analytics) December 1, 2021 -
తొలి రోజు భారత్పై చెలరేగి ఆడిన దక్షిణాఫ్రికా...
India A bowlers toil on opening day against South Africa A: భారత్ ‘ఎ’తో ఆరంభమైన తొలి అనధికారిక టెస్టులో దక్షిణాఫ్రికా ‘ఎ’ మొదటి రోజు చెలరేగింది. ఓపెనర్ పీటర్ మలాన్ (258 బంతుల్లో 157 నాటౌట్; 18 ఫోర్లు), టోని డి జోర్జి (186 బంతుల్లో 117; 18 ఫోర్లు) శతకాలు సాధించడంతో మంగళవారం ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 90 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 343 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ఉమ్రాన్, అర్జాన్, సైనీ ఒక్కో వికెట్ తీశారు. చదవండి: ఆటలో దూకుడు పెంచాను చతేశ్వర్ పుజారా వ్యాఖ్య -
ఆఖరి టీ20కి ముందు ధవన్ సేనకు మరో షాక్..!
కొలంబో: నిన్న శ్రీలంకతో జరిగిన రెండో టీ20 సందర్భంగా టీమిండియా స్టార్ పేసర్ నవదీప్ సైనీ గాయపడ్డాడు. ప్రస్తుతం అతను బీసీసీఐ వైద్య బృందం అబ్జర్వేషన్లో ఉన్నాడు. నిన్నటి మ్యాచ్లో ఎక్స్ట్రా కవర్లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో సైనీ గాయపడ్డాడు. కరుణరత్నే కొట్టిన బంతిని గాల్లోకి ఎగిరి పట్టుకునే ప్రయత్నంలో బలంగా కిందపడ్డాడు. దీంతో అతడి భుజానికి గాయమైంది. వెంటనే అప్రమత్తమైన వైద్య బృందం అతడిని మైదానం నుంచి తీసుకెళ్లి చికిత్స అందించింది. గాయం తీవ్రంగా ఉండడంతో నేటి నిర్ణయాత్మక మ్యాచ్ నుంచి అతను తప్పుకున్నట్లు తెలుస్తోంది. అసలే ఆటగాళ్లు అందుబాటులో లేక సతమతమవుతున్న సమయంలో సైనీ గాయం టీమిండియాను మరింత ఇబ్బంది పెడుతోంది. కనీసం పదకొండు మంది ఆటగాళ్లు కూడా అందుబాటులో లేని పరిస్థితి ప్రస్తుతం భారత జట్టులో నెలకొంది. కాగా, ఆల్రౌండర్ కృనాల్ పాండ్యాకు కరోనా సోకడంతో అతనితో పాటు ఎనిమిది మంది భారత క్రికెటర్లు ఐసోలేషన్ను తరలించబడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్నటి మ్యాచ్కు స్టాండ్ బై ప్లేయర్లతో బరిలోకి దిగిన టీమిండియా ఘోరంగా ఓటమిపాలైంది. సిరీస్ డిసైడర్ అయిన నేటి మ్యాచ్లో ఎలాగైనా గెలిచి పరువు కాపాడుకోవాలని భావిస్తున్న భారత్కు సైనీ గాయం తలనొప్పిగా మారింది. ఈ మ్యాచ్లో సైనీ స్థానంలో తమిళనాడు లెఫ్టార్మ్ స్పిన్నర్ సాయి కిషోర్కు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. సాయి కిషోర్తో పాటు అర్షదీప్ సింగ్ మాత్రమే ప్రస్తుతం టీమిండియా బెంచ్పై ఉన్నారు. -
దుమ్మురేపాడు.. నెటిజన్లచే చివాట్లు తిన్నాడు
న్యూఢిల్లీ: టీమిండియా యువ పేసర్ నవ్దీప్ సైనీ ట్విటర్ వేదికగా ట్రోలింగ్కు గురయ్యాడు. తాజాగా అతను చేసిన ట్వీట్ నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. సైనీ.. తన హార్లీ డేవిడ్సన్ బైక్పై షర్ట్ లేకుండా కూర్చొని ఓ మట్టి రోడ్డులో దుమ్మురేపుతున్న వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. భయాన్ని చూడాలంటే నాతో పాటు బైక్ మీద కూర్చోండి అంటూ క్యాప్షన్ జోడించాడు. ఈ పోస్టుకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది. ఆ స్టంట్ చూసిన కొందరు సైనీని మెచ్చుకోగా మరికొందరు తీవ్రంగా దుయ్యబట్టారు. Accompany me on my bike to feel the fear @harleydavidson pic.twitter.com/iosa8wS2ya — Navdeep Saini (@navdeepsaini96) May 30, 2021 క్రికెటర్ అయి ఉండి ఇంత బాధ్యాతారాహిత్యంగా వ్యవహరిస్తావా? అని కొందరు ఆగ్రహం వ్యక్తం చేయగా.. కుర్రాళ్లు నిన్న ఆదర్శంగా తీసుకొని ప్రమాదాలు గురైతే బాధ్యులెవరని మరికొందరు మండిపడ్డారు. టీమిండియాకు ఎంపికై రెండేళ్లు కూడా కాలేదు.. కాస్త ఓవరాక్షన్ తగ్గించుకుంటే మంచిదని మరికొందరు చివాట్లు పెట్టారు. మరికొందరు స్పందిస్తూ.. ఎవరైనా సాధారణ యువకులు ఇలా చేస్తే ఊరుకుంటారా?' అని ఘాటుగా విమర్శలు గుప్పించారు. కాగా, కొందరు నెటిజన్లు మాత్రం స్టంట్ అదిరిపోయిందంటూ సైనీని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అతని సిక్స్ ప్యాక్ బాడీ అదిరిపోయిందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే, గతేడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన సైనీ.. ఆ తర్వాత జట్టులో చోటు కోల్పోయాడు. ఐపీఎల్లో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న అతను.. అక్కడ కూడా తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. తాజా ఇంగ్లండ్ పర్యటనలో కూడా సైనీకి మొండి చెయ్యే ఎదురైంది. చదవండి: టీమిండియా ఆ 42 రోజులు ఏం చేస్తుంది..? -
అజింక్య భాయ్ అడిగాడు.. నేను వెంటనే సరేనన్నా!
న్యూఢిల్లీ: సిడ్నీ టెస్టుతో అరంగేట్రం చేసిన పేస్ బౌలర్ నవదీప్ సైనీ... తన రెండో మ్యాచ్ బ్రిస్బేన్కు వచ్చేసరికి గాయపడిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 7.5 ఓవర్లు బౌలింగ్ చేసిన అనంతరం గజ్జల్లో గాయంతో బౌలింగ్ నుంచి తప్పుకున్నాడు. అయితే ప్రధాన పేసర్ ఒకరు లేకపోతే సమస్య రావచ్చని భావించిన కెప్టెన్ రహానే... రెండో ఇన్నింగ్స్లో సైనీ బౌలింగ్ చేస్తే బాగుంటుందని భావించాడు. కెప్టెన్ కోరడంతో వెంటనే సిద్ధమయ్యానని సైనీ చెప్పాడు. ‘నేను బాగానే బౌలింగ్ చేస్తున్న దశలో ఒక్కసారిగా గాయపడ్డాను. ఇంత కాలం తర్వాత అవకాశం వస్తే ఇలా జరిగిందేమిటని అనుకున్నాను. రెండో ఇన్నింగ్స్ సమయంలో గాయంతో బౌలింగ్ చేయగలవా అని అజింక్య భాయ్ అడిగాడు. నేను వెంటనే సరేనని చెప్పేశాను. మళ్లీ బౌలింగ్ చేస్తే గాయం తీవ్రత పెరిగే అవకాశం ఉందని తెలిసినా... అప్పటి పరిస్థితులను బట్టి చూస్తే కెప్టెన్ అడిగితే కాదనగలమా. ఇందులో ఇక ఆలోచించడానికేమీ లేదనిపించింది. పైగా జట్టు కోసం ఆడే ఇలాంటి అవకాశం మళ్లీ రాదు. అందుకే నొప్పి బాధిస్తున్నా జట్టు కోసం నేను చేయగలిగింది చేద్దామని నిర్ణయించుకున్నా’ అని సైనీ వెల్లడించాడు. -
నటరాజన్కు నిరాశ.. అతడి అరంగేట్రం
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగనున్న మూడో టెస్టుకు టీమిండియా తుదిజట్టును ప్రకటించింది. స్టార్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ ద్వారా తిరిగి జట్టుతో చేరగా.. బౌలర్ నవదీప్ సైనీ టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడు. రోహిత్ రాకతో మయాంక్ అగర్వాల్పై వేటు పడగా.. నవదీప్ ఎంట్రీతో నటరాజన్కు మొండిచేయి ఎదురైంది. కాగా ఆసీస్- టీమిండియా మధ్య గురువారం మూడో టెస్టు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానే సారథ్యంలోని టీమిండియా ఆసీస్ను ఢీకొట్టేందుకు అన్నివిధాలుగా సన్నద్ధమవుతోంది. ఇక తొలి టెస్టు తర్వాత రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి స్వదేశానికి తిరిగి రాగా.. మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, కేఎల్ రాహుల్ గాయాల బారిన పడి జట్టుకు దూరమైన విషయం తెలిసిందే.(చదవండి: సిడ్నీలో రేపటి నుంచి మూడో టెస్టు) తుదిజట్టు: అజింక్య రహానే(కెప్టెన్), రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, హనుమ విహారి, రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, నవదీప్ సైనీ (చదవండి: నాలుగో టెస్టు: ముంబైలో అయినా ఓకే: ఆసీస్ కెప్టెన్) -
టీమిండియాకు మరో ఎదురు దెబ్బ
అడిలైడ్: తొలి టెస్టులో ఘోర ప్రదర్శనకు తోడు భారత్కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ప్రధాన పేసర్ మొహమ్మద్ షమీ మణికట్టు గాయంతో సిరీస్లోని మిగిలిన మూడు టెస్టులకు దూరమయ్యాడు. రెండో ఇన్నింగ్స్లో కమిన్స్ బంతిని ఆడే క్రమంలో షమీ చేతికి గాయమైంది. అతను బ్యాటింగ్ చేయలేక వెంటనే నిష్క్రమించాడు. మ్యాచ్ తర్వాతి జరిపిన స్కానింగ్లో షమీ మణికట్టుకు ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. అతని స్థానంలో తదుపరి మ్యాచ్ల్లో నవదీప్ సైనీ లేదా హైదరాబాద్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్లలో ఒకరికి అవకాశం దక్కవచ్చు. -
తప్పు నాదే.. క్షమించండి : గిల్క్రిస్ట్
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ అడమ్ గిల్క్రిస్ట్ పెద్ద పొరపాటు చేశాడు. ఇటీవలే టీమిండియా ఆటగాడు మహ్మద్ సిరాజ్ తండ్రి మహ్మద్ గౌస్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా సిరాజ్ తండ్రి అంత్యక్రియలకు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో సిరాజ్కు భారత జట్టు ఆటగాళ్లతో పాటు ఆసీస్ క్రికెటర్లు కూడా సానుభూతి ప్రకటించారు. (చదవండి : రాహుల్కు క్షమాపణ చెప్పా: మ్యాక్స్వెల్) శుక్రవారం ఇరు జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో గిల్క్రిస్ట్ కామెంటేటర్గా వ్యవహరించాడు. కామెంటరీ సమయంలో సిరాజ్ తండ్రి చనిపోయిన విషయం గురించి మాట్లాడిన గిల్క్రిస్ట్ పొరపాటున సిరాజ్ బదులు నవదీప్ సైనీ పేరును ప్రస్తావించాడు. 'తండ్రి చనిపోయిన వెంటనే బీసీసీఐ సైనీకి ఇంటికి వెళ్లేందుకు అవకాశమిచ్చింది. కానీ జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అతను వెళ్లలేదు' అని పేర్కొన్నాడు. అయితే గిల్క్రిస్ట్ చేసిన వ్యాఖ్యలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. (చదవండి : హార్దిక్ బౌలింగ్ ఇప్పట్లో లేనట్లేనా?) గిల్లీ వ్యాఖ్యలను గుర్తించిన న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ మెక్లీన్గన్తో పాటు కొంతమంది అభిమానులు ట్విటర్ ద్వారా అతని పొరపాటును ట్యాగ్ చేశారు. చనిపోయింది సిరాజ్ తండ్రి.. నవదీప్ సైనీ తండ్రి కాదంటూ తెలిపారు. విషయం గ్రహించిన గిల్లీ వెంటనే ట్విటర్లో స్పందించాడు.' నా పొరపాటును గ్రహించాను. సిరాజ్కు బదులు పొరపాటుగా సైనీ పేరు వాడాను. ఈ సందర్భంగా సిరాజ్, సైనీలకు ఇవే నా క్షమాపణలు. నేను పొరపాటుగా చేసిన వ్యాఖ్యలను గుర్తించిన మెక్లీన్గన్కు ధన్యవాదాలు తెలుపుతున్నా.. మరొకసారి మీ అందరిని క్షమాపణ కోరుతున్నా' అంటూ గిల్లీ ట్వీట్ చేశాడు. Yes, thanks @anshu2912 I realize I was mistaken in my mention. Huge apologies for my error, to both @navdeepsaini96 and Mohammed Siraj. 🙏😌 https://t.co/618EUIEyNU — Adam Gilchrist (@gilly381) November 27, 2020 Yep, thanks @Mitch_Savage My huge apologies again to all. https://t.co/F8rYsD6fxm — Adam Gilchrist (@gilly381) November 27, 2020 -
నవదీప్ సైనీ అనుమానమే?
అబుదాబి: ఈ సీజన్లో ప్లేఆఫ్స్ రేసుకు స్వల్ప దూరంలో నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఆ జట్టు పేసర్ నవదీప్ సైనీ గాయం కలవర పరుస్తోంది. ఆదివారం సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో సైనీ గాయపడటంతో అతను తదుపరి మ్యాచ్లకు ఉంటాడా.. లేదా అనేది అనుమానంగా మారింది. నిన్నటి మ్యాచ్లో సీఎస్కే ఇన్నింగ్స్లో భాగంగా 18వ ఓవర్ వేస్తున్న సందర్భంలో సైనీ కుడి చేతి బొటన వేలికి గాయమైంది. దాంతో సైనీ మైదానాన్ని వీడాడు. ఎంఎస్ ధోని స్టైట్గా కొట్టిన షాట్ను ఆపే ప్రయత్నంలో సైనీ బొటన వేలు మధ్యలో చీలిక వచ్చింది. ఇదే ఇప్పుడు ఆర్సీబీని డైలమాలోకి నెట్టేసింది. కీలక మ్యాచ్లకు ముందు సైనీ గాయపడటంతో శిబిరంలో ఆందోళన నెలకొంది. (ధోని ఈజ్ బ్యాక్: సెహ్వాగ్) ఆర్సీబీ జట్టులో ప్రధాన పేసర్ సైనీ కావడంతో తదుపరి మ్యాచ్లకు అతను అందుబాటులో ఉంటాడో..లేదా అనేది చర్చనీయాంశమైంది. దీనిపై ఆర్సీబీ చీఫ్ ఫిజియోథెరపిస్ట్ ఇవాన్ స్పీచ్లీ మాట్లాడుతూ.. ‘సైనీ కుడి చేతి బొటన వేలి మధ్యలో చీలిక వచ్చింది. మాకు మంచి సర్జన్ ఉండటంతో సైనీకి కుట్లు వేశాడు. అతని గాయాన్ని పర్యవేక్షిస్తూనే ఉన్నాం. ఆర్సీబీ ఆడబోయే తదుపరి మ్యాచ్ల్లో సైనీ ఆడతాడా.. లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. దీనిపై త్వరలోనే క్లారిటీ వస్తుంది. గాయం నయమవుతుందనే అనుకుంటున్నాం’ అని స్పీచ్లీ తెలిపాడు. అదే సమయంలో నాలుగేళ్ల క్రితం జరిగిన ఐపీఎల్లో కూడా విరాట్ కోహ్లి ఇదే తరహాలో గాయపడ్డాడని, ఆ గాయం మానిన తర్వాత బరిలోకి దిగిన కోహ్లి సెంచరీ కూడా చేశాడని స్పీచ్లీ తెలిపాడు. ఆ గాయానికి ఈ గాయానికి కొద్దిపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని, ఈ రెండింటిని ఒకే తరహాలో ట్రీట్ చేయాలేమన్నాడు. సైనీకి అయిన గాయం బౌలింగ్ చేతికి కావడంతో ఒత్తిడి ఎక్కువగా పడుతుందన్నాడు. దాంతోనే అతను తదుపరి మ్యాచ్ల్లో పాల్గొనే విషయం ఇంకా చెప్పలేకపోతున్నామని తెలిపాడు. ఈ నెల 28వ తేదీన ముంబై ఇండియన్స్తో అబుదాబి వేదికగా ఆర్సీబీ తలపడనుంది. (శభాష్ అనిల్ కుంబ్లే: గావస్కర్) -
‘వారి డెత్ ఓవర్ల బౌలింగ్ను ఎప్పటికీ నమ్మరు’
న్యూఢిల్లీ: ముంబై ఇండియన్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య అత్యంత నాటకీయ పరిణామాల మధ్య జరిగిన మ్యాచ్ చివరకు సూపర్ వరకూ వెళ్లింది. మరి సూపర్ ఓవర్లో ముంబై బ్యాట్ ఝుళిపించి హిట్టింగ్కు దిగుతుందని అంతా అనుకుంటే వారి ఏడు పరుగులే చేశారు. ఆర్సీబీ పేసర్ నవదీప్ సైనీ వేసిన సూపర్ ఓవర్లో ముంబై స్టార్ ఆటగాళ్లు పొలార్డ్-హార్దిక్లు తడబడ్డారు. తొలి బంతినే యార్కర్తో ఆరంభించిన సైనీ ఓవర్ మొత్తం కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. సూపర్ ఓవర్లో ఒకే ఒక్క ఫోర్ ఇచ్చి నిజంగా సూపర్ అనిపించాడు. దాంతో ఆర్సీబీ ఎనిమిది పరుగుల టార్గెట్ను ఛేదించి విజయం సాధించింది.(చదవండి: 402 పరుగుల్లో 12 పరుగులే అంటే..) ఇప్పడు సైనీ సూపర్ ఓవర్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. టీమిండియా మాజీ డాషింగ్ బ్యాట్స్మన్ వీరేంద్ర సెహ్వాగ్.. ఆర్సీబీని కొనియాడుతున్నాడు. ప్రత్యేకంగా సైనీ వేసిన సూపర్ ఓవర్ను కొనియాడుతున్నాడు. ‘నువ్వు ఎవర్ని నమ్మొచ్చో.. ఎవర్ని నమ్మకూడదో అది నువ్వు ఎంచుకోవచ్చు. కానీ జీవితంలో నమ్మకూడదని ఏదైనా ఉందంటే అది ఆర్సీబీ డెత్ ఓవర్ల బౌలింగ్. ఈ మ్యాచ్ను ముంబై ఈజీగా గెలుస్తుందని అనుకున్నా. కానీ దాన్ని వారు సూపర్ ఓవర్ వరకూ తీసుకెళ్లారు. ఈ మ్యాచ్లో క్రెడిట్ ఎవరికైనా ఇవ్వాలంటే తొలుత నవదీప్ సైనీకి ఇవ్వాలి. డెత్ ఓవర్లలో సూపర్గా బౌలింగ్ చేశాడు. ఇక సూపర్ ఓవర్లో ఇరగదీశాడు. అదే సమయంలో 12 పరుగులే ఇచ్చిన వాషింగ్టన్ సుందర్ కూడా ఆర్సీబీ విజయంలో ప్రధాన పాత్రధారి. వీరిద్దరూ రాణించకపోతే ఆర్సీబీ కచ్చితంగా ఓడిపోయేది. ఆర్సీబీ డెత్ ఓవర్ల బౌలింగ్ను మాత్రం ఎప్పటికీ ఎవరూ నమ్మరు’ అని సెహ్వాగ్ తెలిపాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ మూడు వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. ఆర్సీబీ స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్, శివం దూబేలు మెరుపులు మెరిపించారు. స్లాగ్ ఓవర్లలో వీరిద్దరూ ధాటిగా ఆడటంతో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. డివిలియర్స్ 24 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 55 పరుగులు చేశాడు. కోహ్లి ఔటైన తర్వాత క్రీజ్లోకి వచ్చిన డివిలియర్స్ భారీ షాట్లతో అలరించాడు. ఈ క్రమంలోనే 23 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. బుమ్రా, బౌల్ట్ వంటి బౌలర్లున్నా 360 డిగ్రీల ఆటతో అదరగొట్టాడు. ఆఖరి ఓవర్లో దూబే(27 నాటౌట్; 10 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్లు) బ్యాట్ ఝుళిపించడంతో ఆర్సీబీ 202 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. ఇషాన్ కిషన్(99; 58 బంతుల్లో 2 ఫోర్లు, 9 సిక్స్లు), పొలార్డ్(60 నాటౌట్; 24 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్లు) చెలరేగడంతో మ్యాచ్ టై అయ్యింది. 20 ఓవర్ చివరి బంతికి ఐదు పరుగులు చేయాల్సిన దశలో పొలార్డ్ ఫోర్ కొట్టాడు. దాంతో స్కోరు సమం అయ్యింది. దాంతో సూపర్ ఓవర్ తప్పలేదు. ఈ ఉత్కంఠ పోరులో ఆర్సీబీ విజయం సాధించింది. -
నేను చాలా ఫీలయ్యా: సైనీ
ఆక్లాండ్: భారత్తో శనివారం జరిగిన రెండో వన్డేలో 22 పరుగులతో గెలిచిన కివీస్ మూడు వన్డేల సిరీస్ను 2–0తో సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. మార్టిన్ గప్టిల్ (79), రాస్ టేలర్ (73 నాటౌట్) అర్ధసెంచరీలు సాధించారు. అనంతరం భారత్ 48.3 ఓవర్లలో 251 పరుగులకే ఆలౌటైంది. రవీంద్ర జడేజా ( 55), శ్రేయస్ అయ్యర్ (52;, నవదీప్ సైనీ (45) రాణించినా జట్టును మాత్రం గట్టెక్కించలేకపోయారు.భారత ఇన్నింగ్స్లో జడేజా-సైనీలు ఆడుతున్నంతసేపు టీమిండియా అభిమానులు మ్యాచ్పై గెలుపు ఆశలు పెంచుకున్నారు. ఈ జోడి మంచి బంతుల్ని సమర్ధవంతంగా ఎదుర్కోగా, చెడ్డ బంతుల్ని బౌండరీలకు తరలిస్తూ మ్యాచ్పై ఆశలు రేకెత్తించింది. అసలు ఎంతమాత్రం ఊహించని సైనీ 5 ఫోర్లు, 2 సిక్స్లు కొట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలవడమే కాదు.. అవసరమైన సందర్భాల్లో బ్యాట్ ఝుళిపిస్తాడనే భావన కల్గింది. మ్యాచ్ తర్వాత సైనీ మాట్లాడుతూ.. తాను కడవరకూ క్రీజ్లో ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అంటున్నాడు. ‘ నేను ఔట్ కాకుండా ఉంటే ఫలితం కచ్చితంగా మరోలా ఉండేది. జడేజాతో పాటు నేను కూడా కడవరకూ ఉంటే మ్యాచ్ను ముగించే వాళ్లం. వికెట్ చాలా ఫ్లాట్గా ఉంది. దాంతో బంతి బ్యాట్పైకి బాగా వస్తుంది. టాపార్డర్ స్వింగ్కు పెవిలియన్ చేరితే, మిడిల్ ఆర్డర్ అనవసరమైన షాట్లతో వికెట్లను సమర్పించుకుంది. 113 బంతుల్లో 121 పరుగులు కొట్టాల్సిన సందర్భంలో చేతిలో మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఆ సమయంలో 76 పరుగులు చేశాం. సైనీ బ్యాట్తో మెరుస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. నేను బ్యాటింగ్ చేయగలనని ఎవరూ వినికూడా ఉండరు. అయితే టీమిండియా త్రోడౌన్ స్పెషలిస్టు రఘు నాలోని బ్యాటింగ్ స్కిల్స్ను గుర్తించాడు. నువ్వు బ్యాటింగ్ కూడా చేయగలవని పదే పదే అంటుండేవారు. (ఇక్కడ చదవండి: మ్యాచ్తో పాటు సిరీస్ కూడా... ) రఘు మాటలు నాలో స్ఫూర్తిని నింపాయి. హోటళ్ల రూమ్లో కూడా నా బ్యాటింగ్ కోసం మాట్లాడేవారు. అదే నన్ను బ్యాటింగ్ చేయడానికి దోహం చేసింది. కివీస్తో రెండో వన్డేలో నేను బ్యాటింగ్కు వెళ్లే సమయానికి చాలా పరుగులు చేయాలి. మ్యాచ్ను కడవరకూ తీసుకెళ్లాలని జడేజా నాతో అన్నాడు. అక్కడ వరకూ వెళితే గెలిచే అవకాశం ఉంటుందని అనుకున్నాం. ఒకవేళ బౌండరీ కొట్టాల్సిన బంతి అయితే హిట్ చేయమని జడేజా నాతో చెప్పాడు. ప్రధానంగా సింగిల్స్-డబుల్స్పై దృష్టి పెట్టాం. అలా స్టైక్ రొటేట్ చేశాం. నేను బంతిని ఫోర్ కొట్టిన తర్వాత కాస్త ఆశ్చర్యానికి లోనయ్యా. బ్యాట్పైకి బంతి బాగా రావడంతో సులువుగా షాట్లు ఆడా. కాకపోతే నేను ఔట్ కావడం చాలా బాధించింది. మ్యాచ్ అయిన తర్వాత వీడియో చూసి చాలా ఫీలయ్యా. నేను ఔట్ కాకపోయి ఉంటే మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేది. కీలక సమయంలో ఔట్ కావడం నిరుత్సాహానికి గురి చేసింది’ అని సైనీ పేర్కొన్నాడు. -
కివీస్తో రెండో వన్డేలో భారత్ ఓటమి
-
షమీని ఎందుకు తీసినట్లు?
ఆక్లాండ్: న్యూజిలాండ్తో జరుగుతున్న కీలకమైన రెండో వన్డేలో రెండు మార్పులతో బరిలోకి దిగింది టీమిండియా. కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీలను రెండో వన్డే నుంచి తప్పించి వారి స్థానాల్లో చహల్, సైనీలకు అవకాశం ఇచ్చింది. కివీస్తో జరిగిన తొలి వన్డేలో కుల్దీప్ రెండు వికెట్లు సాధించినా 10 ఓవర్లలో 84 పరుగులు సమర్పించుకుని చెత్త గణాంకాలను నమోదు చేశాడు. ఒక వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులిచ్చిన మూడో స్పిన్నర్గా చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. దాంతో కుల్దీప్కు రెండో వన్డేలో ఉద్వాసన తప్పదని ముందే ఊహించారు. అయితే ఇక్కడ ప్రధాన పేసర్ మహ్మద్ షమీని రిజర్వ్ బెంచ్కే పరిమితం చేయడం ఏమిటనేదే ప్రశ్న. గత మ్యాచ్లో షమీ 9.1 ఓవర్లలో 63 పరుగులిచ్చి ఒక వికెట్ సాధించాడు. ఇక్కడ శార్దూల్ ఠాకూర్ కంటే షమీ ప్రదర్శనే మెరుగ్గా ఉంది. శార్దూల్ 9 ఓవర్ల బౌలింగ్లో వికెట్ తీసి 80 పరుగులిచ్చాడు. ఆ మ్యాచ్ భారత్ ఇన్నింగ్స్లో కుల్దీప్ తర్వాత భారీగా పరుగులు ఇచ్చింది శార్దూలే. మరి శార్దూల్ను రెండో వన్డేలో కొనసాగించడానికి మొగ్గుచూపిన మేనేజ్మెంట్.. షమీని మాత్రం పక్కకు పెట్టింది. శార్దూల్ కంటే ఎంతో అనుభవం ఉన్న షమీకి తుది జట్టులోకి తీసుకోలేదు. శార్దూల్ను తప్పించి నవదీప్ సైనీకి అవకాశం కల్పిస్తే భారత్ బౌలింగ్ మరింత పటిష్టంగా ఉండేది. ఇది టీమిండియాకు ఎంతో ముఖ్యమైన మ్యాచ్. ఇందులో గెలిస్తేనే రేసులో నిలుస్తోంది. అటువంటిది షమీకి విశ్రాంతి ఇచ్చారు. టెస్టు సిరీస్ను దృష్టిలో పెట్టుకునే షమీకి విశ్రాంతి ఇచ్చామని కెప్టెన్ విరాట్ కోహ్లి చెప్పినప్పటికీ ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్లో భారత్ వెనుకబడే ఉంది. దాంతో షమీని తప్పించడం కచ్చితంగా కీలక నిర్ణయమే. షమీ స్థానంలో జట్టులోకి వచ్చిన సైనీ, గత మ్యాచ్లో భారీ పరుగులిచ్చిన శార్దూల్లు మేనేజ్మెంట్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడితే ఫర్వాలేదు కానీ వీరిద్దరూ ఎటువంటి ప్రభావం చూపకపోయి మ్యాచ్ను చేజార్చుకుంటే మాత్రం విమర్శలు వర్షం కురిసే అవకాశం ఉంది. -
ఆసీస్కు బూమ్రా, సైనీ హెచ్చరికలు..!
కీలకమైన ఆస్ట్రేలియాతో పోరుకు టీమిండియా సిద్ధమైంది. బలమైన బ్యాటింగ్, బుల్లెట్లాంటి బౌలింగ్ దళంతో బరిలోకి దిగేందుకు ఆతృతగా ఎదురుచూస్తోంది. అయితే ఇటీవల పునరాగమనం చేసిన భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై అందరి దృషి ఉంది. అతన్ని ఎదుర్కోవడం ఎంత కష్టమో ప్రత్యర్థి బ్యాట్స్మెన్కు బాగా తెలుసు. ఈ నేపథ్యంలో కీలకమైన ఆసీస్తో పోరుకు ముందు ఇండియన్ పేసర్లు బూమ్రా, నవదీప్ సైనీ బౌలింగ్కు మరింత పదును పెట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఆసీస్ ఆటగాళ్లను బోల్తా కొట్టించేందుకు పదునైన అస్త్రాలు సిద్ధంచేస్తున్నారు. వికెట్ల ముందు షు పెట్టి నెట్స్లో యార్కర్లు సాధన చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. ఇదికాస్తా వైరల్గా మారింది. (అసలు సమరానికి సై) ప్రత్యర్థికి హెచ్చరికలుగా.. బూమ్రా బుల్లెట్లు వస్తున్నాయాంటూ క్రికెట్ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ మ్యాచ్లో ఆసీస్ ఆటగాళ్లను ఈ ద్వయం ఏ మేరకు కట్టడి చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మూడు వన్డేల సిరీస్లో నేడు వాంఖడే మైదానంలో జరిగే తొలి మ్యాచ్లో భారత్, ఆస్ట్రేలియా తలపడనున్న విషయం తెలిసిందే. ఇరు జట్లు కూడా పూర్తి స్థాయి బలగంతో బరిలోకి దిగుతుండటంతో మ్యాచ్లు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. -
ఐదో పేసరా! మూడో స్పిన్నరా!
ఐదు టి20లు, 3 వన్డేలు, 2 టెస్టులు... ఈ నెల 24నుంచి ప్రారంభమయ్యే న్యూజిలాండ్ పర్యటనలో భారత జట్టు తలపడే మ్యాచ్ల సంఖ్య ఇది. మూడు ఫార్మాట్లలోనూ టీమిండియా ఇటీవలి ఫామ్ను బట్టి చూస్తే సెలక్టర్లకు జట్ల ఎంపిక పెద్దగా కష్టం కాకపోవచ్చు. ఒకటి, రెండు స్థానాల విషయంలోనే ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని కమిటీ ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది. ఇప్పటికే ‘షాడో టూర్’ రూపంలో పలువురు ప్రధాన ఆటగాళ్లు న్యూజిలాండ్లోనే ఉండటంతో కొత్త ఆటగాళ్ల గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా టీమ్ మేనేజ్మెంట్కు లేదు. ఈ నేపథ్యంలో ఒకేసారి మూడు ఫార్మాట్ల కోసం జట్లను నేడు ప్రకటించనున్నారు. ముంబై: సొంతగడ్డపై వరుస విజయాల ఉత్సాహంలో ఉన్న భారత క్రికెట్ జట్టు 2020లో కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు న్యూజిలాండ్ విమానం ఎక్కనుంది. ఈ నెల 24 నుంచి న్యూజిలాండ్తో భారత జట్టు సిరీస్ ప్రారంభమవుతుంది. మూడు ఫార్మాట్లలో జరిగే ద్వైపాక్షిక సిరీస్ల కోసం జట్లను ఎంపిక చేసేందుకు సీనియర్ సెలక్షన్ కమిటీ ఆదివారం సమావేశమవుతోంది. ఇటీవలి విండీస్ సిరీస్తోనే ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని కమిటీ పదవీకాలం ముగిసిందని భావించినా... బీసీసీఐలో పరిణామాల నేపథ్యంలో వారికి మరోసారి జట్టును ఎంపిక చేసే అవకాశం లభించింది. రాహుల్ లేదా శుబ్మన్ గిల్... ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో భాగంగా న్యూజిలాండ్తో భారత్ రెండు టెస్టులలో తలపడనుంది. ఇప్పటికే ఆడిన 7 టెస్టుల ద్వారా 360 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో ఉన్న జట్టు ఈ సిరీస్ కూడా గెలిస్తే వచ్చే ఏడాది జరిగే టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్కు దాదాపుగా అర్హత సాధించినట్లే! టెస్టు జట్టులో మూడో ఓపెనర్ను ఎంపిక చేయాల్సి ఉంది. లోకేశ్ రాహుల్, శుబ్మన్ గిల్ ఈ స్థానం కోసం పోటీ పడుతున్నారు. స్వదేశం లో సిరీస్లకు జట్టులో ఉన్న గిల్కు మ్యాచ్ ఆడే అవకాశం దక్కలేదు. ప్రస్తుతం అతను ‘ఎ’ జట్టు తరఫున న్యూజిలాండ్లోనే ఉన్నాడు. రాహుల్ వెస్టిండీస్ గడ్డపై చివరి టెస్టు ఆడాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్లో అతని అద్భుత ఫామ్ టెస్టుల్లో మళ్లీ అవకాశం కల్పించవచ్చు. ఓపెనింగ్తో పాటు ఎక్కడైనా ఆడగల సామర్థ్యం అతని అదనపు బలం. గాయం కారణంగా ముంబై యువ సంచలనం పృథ్వీ షా పేరు పరిశీలించడం లేదు. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లు అశ్విన్, రవీంద్ర జడేజాలకు తోడు మూడో స్పిన్నర్ను ఎంపిక చేయాలా వద్దా అనే సందిగ్ధత సెలక్టర్లలో ఉంది. గత కొన్నేళ్లుగా న్యూజిలాండ్లో పిచ్లు నెమ్మది ంచడం కీలక పరిణామం. అలా అయితే కుల్దీప్ యాదవ్ అందరికంటే ముందుంటాడు. నలుగురు రెగ్యులర్ పేసర్లతో పాటు అదనంగా మరో పేసర్ను కూడా టెస్టు జట్టులోకి తీసుకోవాలనేది ఆలోచన. అదే జరిగితే బుమ్రా, ఇషాంత్, షమీ, ఉమేశ్లతో పాటు నవదీప్ సైనీకి అవకాశం దక్కవచ్చు. కేదార్కు చోటుంటుందా! వన్డేలు, టి20ల విషయంలోనూ తాజా ఫామ్ను తీసుకుంటే పెద్దగా మార్పులు కనిపించడం లేదు. జట్టులో అవకాశం లభించిన ప్రతీ ఒక్కరు వాటిని సమర్థంగా వినియోగించుకుంటేనే ఉన్నారు. ముఖ్యంగా ఈ ఏడాది జరిగే టి20 ప్రపంచ కప్ను దృష్టిలో ఉంచుకొనే టి20 జట్టును ఎంపిక చేయడం ఖాయం. శ్రీలంకతో సిరీస్లో ఒక్క రవీంద్ర జడేజాకు తప్ప అందరికీ మ్యాచ్ అవకాశం దక్కింది. అయితే వన్డే, టి20ల్లో అతని ఆల్రౌండ్ నైపుణ్యం జట్టుకు ఎప్పుడైనా అదనపు బలమే కాబట్టి అతడి స్థానానికి ఢోకా ఉండకపోవచ్చు. పాండ్యా దూరం కావడంతో శివమ్ దూబే తన స్థానాన్ని నిలబెట్టుకున్నట్లే. రోహిత్ మళ్లీ వస్తాడు కాబట్టి సంజు సామ్సన్నే తప్పించవచ్చు. భువనేశ్వర్, దీపక్ చాహర్ గాయాల నుంచి కోలుకోకపోవడంతో పేస్ బృందంలో కూడా మార్పులు ఉండవు. అయితే ఇటీవల తరచుగా కేదార్ జాదవ్ స్థానంపై తీవ్ర చర్చ జరుగుతోంది. గతంలోలాగా ‘ట్రంప్ కార్డు’ బౌలింగ్ ప్రదర్శనలు అతని నుంచి రావడం లేదు. పైగా బ్యాటింగ్లోనూ ఆరో స్థానంలో గుర్తుంచుకోదగ్గ స్కోర్లు కూడా లేవు. అతను ఆడిన గత 15 వన్డేల్లో రెండు సార్లు మాత్రమే కనీసం ఐదు ఓవర్లు వేశాడు. అయితే స్వదేశంలో ఆడినప్పుడు 15 మంది తరహాలో కాకుండా విదేశీ సిరీస్కు 16 లేదా 17 మందిని ఎంపిక చేసుకునే సౌలభ్యం బీసీసీఐకి ఉండటంతో ఎవరిపైనా వేటు వేయకుండా కొత్త ఆటగాళ్లను అదనంగా చేర్చినా ఆశ్చర్యం లేదు. -
ఒక్కసారిగా 146 స్థానాలు ఎగబాకాడు..
దుబాయ్: శ్రీలంకతో జరిగిన మూడు టీ20 సిరీస్లో మ్యాన్ ఆప్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్న టీమిండియా పేసర్ నవదీప్ సైనీ.. తాజాగా అంతర్జాతీయ క్రికెట మండలి(ఐసీసీ) విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్లో టాప్-100లోకి దూసుకొచ్చాడు. శ్రీలంకతో టీ20 సిరీస్లో సైనీ ఐదు వికెట్లు సాధించాడు. తొలి టీ20లో రెండు వికెట్లు సాధించిన సైనీ.. రెండో టీ20లో మూడు వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా ఒక్కసారిగా టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్లో 146 స్థానాలు ఎగబాకి 98వ స్థానానికి చేరుకున్నాడు. ఇక మరొక బౌలర్ శార్దూల్ ఠాకూర్ 92వ స్థానంలో నిలిచాడు.ఈ సిరీస్లో ఐదు వికెట్లు సాధించడమే కాకుండా మూడో టీ20లో 8 బంతుల్లో 22 పరుగులు చేశాడు. ఇక బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో కేఎల్ రాహుల్ 6వ స్థానాన్ని కాపాడుకున్నాడు. లంకేయులతో సిరీస్లో 45, 54 పరుగులతో రాణించిన రాహుల్ 26 పాయింట్లను సాధించాడు. దాంతో 760 రేటింగ్ పాయింట్లతో ఆరో స్థానాన్ని నిలుపుకున్నాడు. ఇక్కడ విరాట్ కోహ్లి 683 రేటింగ్ పాయింట్లతో 9వ స్థానానికి ఎగబాకాడు. శిఖర్ ధావన్ ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని 15వ స్థానానికి చేరుకున్నాడు.ఈ జాబితాలో పాకిస్తాన్ బ్యాట్స్మన్ బాబర్ అజామ్(879 రేటింగ్ పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఆసీస్ క్రికెటర్ అరోన్ ఫించ్(810 రేటింగ్ పాయింట్లు) రెండో స్థానంలో ఉన్నాడు. -
‘ఆ బంతితో బౌలింగ్ కష్టమనిపించేది’
పుణె: శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరీస్ను టీమిండియా కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన పేసర్ నవదీప్ సైనీ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. రెండో టీ20లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్న సైనీ.. మూడో టీ20లో కూడా మెరిశాడు. రెండో టీ20లో రెండు వికెట్లు, మూడో టీ20లో మూడు వికెట్లతో సత్తాచాటాడు. 145 నుంచి 150 కి.మీ వేగంతో బంతుల్ని సునాయాసంగా సంధిస్తున్న సైనీ.. ప్రత్యర్థి శ్రీలంకను హడలెత్తించాడు. శుక్రవారం చివరి టీ20లో భారత్ గెలిచి సిరీస్ను 2-0తో గెలిచిన తర్వాత మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డును అందుకునే క్రమంలో మాట్లాడిన సైనీ.. తన బౌలింగ్లో వేగం అనేది సహజంగానే వచ్చిందన్నాడు.(ఇక్కడ చదవండి: అందులో వాస్తవం లేదు: కోహ్లి) ‘నేను వైట్ బాల్ బంతితో ఆడటానికి ముందు రెడ్ బాల్తో ఎక్కువగా ఆడేవాడిని. ఎర్రబంతితో బౌలింగ్ చేయడం కష్టంగా అనిపించేది కాదు.. కానీ వైట్ బాల్తో బౌలింగ్ చేయడానికి మాత్రం ఎక్కువ శ్రమించే వాడిని. వైట్ బాల్తో ఎక్కువ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇప్పుడు సులువుగానే అనిపిస్తోంది. నా బౌలింగ్ను మెరుగుపరుచుకున్న తర్వాత వైట్ బాల్తో బౌలింగ్ ఎటువంటి ఇబ్బంది పెట్టడం లేదు. నా సీనియర్లు నుంచి తీసుకున్న సలహాలు ఎక్కువగా ఉపయోగపడ్డాయి. ఏయే పరిస్థితుల్లో ఎలా బౌలింగ్ చేయాలో వారు నాకు చెబుతున్నారు. నా జిమ్, నా డైట్ తర్వాత భారత్కు క్రికెట్ ఆడటం అనేది నా గోల్. దాదాపు నాలుగైదేళ్ల నుంచి రెడ్ బాల్తో ఆడుతున్నా. అంతకుముందు టెన్నిస్ బాల్తో ప్రాక్టీస్ చేసేవాడిని’ అని సైనీ పేర్కొన్నాడు.(ఇక్కడ చదవండి: సామ్సన్ చాలా మిస్సయ్యాడు..!) -
మెయిడిన్ వికెట్ హెట్మెయిర్..
కటక్: వెస్టిండీస్తో జరుగుతున్న సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డే ద్వారా ఈ ఫార్మాట్లో అరంగేట్రం చేసిన టీమిండియా పేసర్ నవదీప్ సైనీ తన మెయిడిన్ వికెట్గా హెట్మెయిర్ వికెట్ను సాధించాడు. నవదీప్ సైనీ వేసిన 30 ఓవర్ రెండో బంతిని హెట్మెయిర్ పుల్ చేయగా అది కాస్తా క్యాచ్గా గాల్లోకి లేచింది. దీన్ని కుల్దీప్ యాదవ్ క్యాచ్గా అందుకోవడంతో హెట్మెయిర్ ఇన్నింగ్స్ 37 పరుగుల వద్ద ముగిసింది. దాంతో విండీస్ 132 పరుగుల వద్ద మూడో వికెట్ను నష్టపోయింది. కాగా, సైనీ వేసిన తదుపరి ఓవర్లో రోస్టన్ ఛేజ్(38)ని బౌల్డ్ చేయడంతో వెస్టిండీస్ కష్టాల్లో పడింది. స్వల్ప విరామాల్లో సైనీ రెండు వికెట్లు సాధించి మంచి బ్రేక్ ఇవ్వడంతో టీమిండియా మ్యాచ్పై పట్టుబిగించింది. అంతకుముందు షాయ్ హోప్(42) రెండో వికెట్గా పెవిలియన్ చేరగా, ఎవిన్ లూయిస్(21) తొలి వికెట్గా ఔటయ్యాడు.(ఇక్కడ చదవండి: సెన్సేషనల్ క్యాచ్.. జస్ట్ మిస్) ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో విండీస్ బ్యాటింగ్ను లూయిస్, హోప్లు ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్కు 57 పరుగుల జత చేసిన తర్వాత లూయిస్ ఔట్ కాగా, కాసేపటికి హోప్ కూడా పెవిలియన్ చేరాడు. లూయిస్ను జడేజా పెవిలియన్కు పంపగా, హోప్ను మహ్మద్ షమీ ఔట్ చేశాడు. ఆపై రోస్టన్ ఛేజ్కు హెట్మెయిర్ జత కలిశాడు. ఈ జోడి 62 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత సైనీ బౌలింగ్లో హెట్మెయిర్ ఔటయ్యాడు.. మరో 12 పరుగుల వ్యవధిలో చేజ్ను సైతం సైనీ బౌల్డ్ చేసి భారత్ శిబిరంలో ఆనందం నింపాడు. 35 ఓవర్లు ముగిసే సరికి విండీస్ నాలుగు వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. -
అరంగేట్రం చేసిన సైనీ
కటక్: వన్డే సిరీస్ను డిసైడ్ చేసే కీలక మ్యాచ్కు ఆతిథ్య టీమిండియా పర్యాటక వెస్టిండీస్ జట్లు సమయాత్తమయ్యాయి. నిర్ణయాత్మకమైన ఈ చివరి వన్డే ద్వారా యువ పేస్ బౌలర్ నవీదప్ సైనీ వన్డే ఫార్మాట్లో అరంగేట్రం చేశాడు. సారథి విరాట్ కోహ్లి టీమిండియా క్యాప్ను సైనీకి అందించి ఆల్దబెస్ట్ చెప్పాడు. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీపక్ చాహర్ గాయం కారణంగా చివరి వన్డేకు దూరమవడంతో అతడి స్థానంలో సైనీ జట్టులోకి వచ్చాడు. ఈ ఒక్కటి మినహా టీమిండియాలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. ఇక విండీస్ జట్టు కూడా విశాఖ జట్టునే కొనసాగించింది. ఇక ఇప్పటికే టీ20 సిరీస్ గెలిచిన ఉత్సాహంలో ఉన్న టీమిండియా ఇదే ఊపులో వన్డే సిరీస్ కూడా కైవసం చేసుకోవాలనే ఆలోచనలో ఉంది. అంతేకాకుండా ఈ ఏడాదిని విజయంతో ముగించాలని కోహ్లిసేన తహతహలాడుతోంది. ఇక ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్తో పాటు పరువు నిలుపుకోవాలనే ఉవ్విళ్లూరుతోంది. తుదిజట్లు: వెస్టిండీస్: కీరన్ పొలార్డ్(కెప్టెన్), ఎవిన్ లూయిన్, షై హోప్, హెట్మైర్, రోస్టన్ చేజ్, నికోలస్ పూరన్, హోల్డర్, కీమో పాల్, అల్జారి జోసెఫ్, క్యారీ పైర్, షెల్డన్ కాట్రెల్ టీమిండియా: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యార్, రిషభ్ పంత్, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, నవదీపై సైనీ -
టీమిండియాకు మరో ఎదురుదెబ్బ
కటక్: ఇప్పటికే గాయాల బారిన పడి పలువురు టీమిండియా స్టార్ క్రికెటర్లు వెస్టిండీస్తో సిరీస్కు దూరమైతే ఇప్పుడు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల కాలంలో తన బౌలింగ్తో ఆకట్టుకుంటున్న టీమిండియా పేసర్ దీపక్ చాహర్.. సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డేకు దూరమయ్యాడు. విశాఖలో జరిగిన రెండో వన్డేలో వెన్నుగాయంతో సతమతమైన చాహర్.. చివరి వన్డేకు అందుబాటులో ఉండటం లేదని టీమిండియా మేనేజ్మెంట్ స్పష్టం చేసింది. మహ్మద్ షమీతో కలిసి బౌలింగ్ పంచుకుంటున్న చాహర్ లేకపోవడం భారత్కు గట్టి ఎదురుదెబ్బగానే చెప్పాలి. కాగా, చాహర్ స్థానంలో నవదీప్ షైనీని ఎంపిక చేసినట్లు సెలక్షన్ కమిటీ పేర్కొంది. ‘ రెండో వన్డేలో చాహర్ను వెన్నుగాయం వేధించింది. దాంతో అతన్ని బీసీసీఐ మెడికల్ టీమ్ పరీక్షించి విశ్రాంతి అవసరమని చెప్పింది. ఈ క్రమంలోనే చాహర్కు చివరి వన్డేకు అందుబాటులో ఉండటం లేదు. చాహర్ స్థానంలో మరో యువ పేసర్ షైనీ జట్టులో ఎంపిక చేశాం’ అని సెలక్షన్ కమిటీ తెలిపింది. ఆదివారం కటక్లో భారత్-విండీస్ జట్ల మధ్య తుది వన్డే జరుగనుంది. భారత మూడో వన్డే జట్టు ఇదే.. విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, రిషభ్ పంత్, శివం దూబే, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, యజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్, నవదీప్ షైనీ -
రోహిత్కు చిర్రెత్తుకొచ్చిన వేళ..
బెంగళూరు: మైదానంలో సహచర ఆటగాళ్లపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అసహనం ప్రదర్శించిన సందర్భాలు చాలానే ఉంటాయి. అయితే రోహిత్ శర్మ ఇందుకు కాస్త భిన్నంగానే ఉంటాడు. ఒకవేళ ఏ ఆటగాడికైనా చెప్పాలకున్నా కూల్నే విషయాన్ని చేరవేస్తాడు. అయితే ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో రోహిత్ టెంపర్ను కోల్పోయాడు. విరాట్ కోహ్లి ఫీల్డ్ను విడిచి వెళ్లిన సమయంలో రోహిత్ తాత్కాలిక బాధ్యతలు చేపట్టాడు. ఈ తరుణంలో యువ పేసర్ నవదీప్ సైనీ వేసిన ఒక ఓవర్ రోహిత్కు కోపం తెప్పించింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్లో భాగంగా 12వ ఓవర్ ఐదో బంతిని సైనీ లెగ్ స్టంప్పైకి ఫుల్టాస్ వేశాడు. దానికి క్రీజ్లో ఉన్న బావుమా ఫోర్తో సమాధానమిచ్చాడు. అంతకుముందు బంతిని కూడా బావుమా ఎక్స్ట్రా కవర్ మీదుగా ఫోర్గా కొట్టడంతో చిర్రెత్తుకొచ్చిన రోహిత్.. కాస్త బుర్ర పెట్టి బౌలింగ్ చేయమంటూ సైనీకి సైగలు చేశాడు. ఆ సమయంలో బావుమాకు జతగా కెప్టెన్ డీకాక్ క్రీజ్లో ఉన్నాడు. ఇలా సైనీపై రోహిత్ అసహనం వ్యక్తం చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ మ్యాచ్లో భారత్ 9వికెట్ల తేడాతో పరాజయం చెందింది. సైనీ రెండు ఓవర్లు వేసి వికెట్ సాధించకపోగా 25 పరుగులిచ్చాడు. -
వారెవ్వా.. కోహ్లి వాటే క్యాచ్!
మొహాలి: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా సారథి విరాట్ కోహ్లి కళ్లు చెదిరే రీతిలో క్యాచ్ అందుకొని ఔరా అనిపించాడు. కీలక సమయంలో ప్రమాదకరంగా మారుతున్న బ్యాట్స్మన్ను తన సూపర్బ్ క్యాచ్ ఔట్ చేశాడు. ఇది టీమిండియాకు టర్నింగ్ పాయింట్ అని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. హాఫ్ సెంచరీతో అదరగొడుతున్న డికాక్ నవదీప్ సైనీ వేసిన 12 ఓవర్ రెండో బంతిన స్ట్రేట్ డ్రైవ్ ఆడాడు. అది కాస్తా గాల్లోకి లేవడంతో మిడాఫ్లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లి చిరుతలా పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేసి ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్నాడు. దీంతో డికాక్ షాక్ గురై భారంగా క్రీజు వదిలి వెళ్లాడు. టీమిండియా ఆటగాళ్లతో సహా అభిమానులు ఆనందంతో కేరింతలు కొట్టారు. అప్పటివరకు సాఫీగా సాగుతున్న సఫారీ ఇన్నింగ్స్ కోహ్లి క్యాచ్తో కకలావికలం అయింది. డికాక్తో పాటు బవుమా రాణిస్తుండటంతో సఫారీ జట్టు భారీ స్కోర్ సాధిస్తుందనుకున్నారు. అయితే డికాక్ ఔటైన తర్వాత మిగతా బ్యాట్స్మెన్ తడబడటంతో టీమిండియా ముందు ఓ మోస్తారు లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇక ప్రస్తుతం కోహ్లి అందుకున్న క్యాచ్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. నెటిజన్లు కోహ్లిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. -
‘అలాంటి భారత బౌలర్ని చూడలేదు’
మొహాలీ: టీమిండియా యువ పేసర్ నవదీప్ షైనీపై దక్షిణాఫ్రికా అసిస్టెంట్ బ్యాటింగ్ కోచ్ లాన్స్ క్లూసెనర్ ప్రశంసలు కురిపించాడు. భారత్ జట్టుకు అతను భవిష్య ఆశాకిరణమని కొనియాడాడు. ప్రధానంగా షైనీ 150 కి.మీ వేగంతో బంతులు వేయడాన్ని ప్రస్తావించిన క్లూసెసర్.. ఈ తరహా వేగంతో బౌలింగ్ చేసే భారత బౌలర్ని ఎన్నడూ చూడలేదన్నాడు. గతంలో డీడీసీఏతో కలిసి పని చేసిన క్లూసెనర్.. ఢిల్లీ బౌలర్ అయిన షైనీ ప్రతిభను ఎప్పుడో గుర్తించిన్టుల పేర్కొన్నాడు. దాంతో ప్రస్తుతం షైనీ బౌలింగ్ ఏమీ తనను ఆశ్చర్యానికి గురి చేయడం లేదని క్లూసెనర్ చెప్పుకొచ్చాడు. ‘నాకు తెలిసి షైనీది ఒక అద్భుతమైన బౌలింగ్ యాక్షన్. అతని యాక్షన్ చాలా క్లియర్గా ఉంటుంది. దాంతో వేగవంతమైన బౌలింగ్ చేయడానికి ఫిట్ అయ్యాడు. నేను అతనితో ఎప్పుడు మాట్లాడినా ఫాస్టెస్ట్ బౌలింగ్కే మొగ్గుచూపేవాడు’ అని క్లూసెనర్ పేర్కొన్నాడు.వెస్టిండీస్తో ఇటీవల జరిగిన టీ20 సిరీస్ ద్వారా ఈ ఫార్మాట్లో అరంగేట్రం చేసిన షైనీ ఆకట్టుకున్నాడు. దాంతో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్కు సైతం షైనీని ఎంపిక చేశారు. కాకపోతే దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్కు మాత్రం షైనీకి చోటు దక్కలేదు. దీనిపై షైనీ మాట్లాడుతూ.. ‘ టెస్టు ఫార్మాట్లో మా బౌలింగ్ యూనిట్ చాలా బలంగా ఉంది. వెస్టిండీస్తో సిరీస్ జరిగినప్పుడు ఈ విషయాన్ని నేను గమనించా. నాకు టెస్టు జట్టులో చోటు దక్కాలంటే మరింత శ్రమించాల్సి ఉంది. అప్పుడే నాకు అవకాశం వస్తుంది’ అని షైనీ పేర్కొన్నాడు. -
అరంగేట్రంలోనే డిమెరిట్ పాయింట్
లాడర్హిల్(అమెరికా): తన అంతర్జాతీయ అరంగేట్రం మ్యాచ్లోనే సత్తాచాటిన టీమిండియా పేసర్ నవదీప్ సైనీ దూకుడుగా ప్రవర్తించి ఐసీసీ మందలింపుకు గురయ్యాడు. వెస్టిండీస్తో జరిగిన తొలి టీ20లో నికోలస్ పూరన్ను ఔట్ చేసిన క్రమంలో సైనీ అతిగా ప్రవర్తించాడు. పూరన్కు సెండాఫ్ ఇస్తూ పెవిలియన్కు దారి చూపించాడు. ఇది ఐసీసీ ఆర్టికల్ 2.5 నియమావళికి విరుద్ధం కావడంతో సైనీకి మందలింపుతో పాటు ఒక డిమెరిట్ పాయింట్ ఇచ్చారు. ఈ విషయాన్ని సోమవారం ఐసీసీ ఒక ప్రకటనలో స్సష్టం చేసింది. తన తప్పును సైనీ అంగీకరించడంతో ఎటువంటి విచారణ లేకుండా ఒక డిమెరిట్ పాయింట్ కేటాయించామని మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో పేర్కొన్నారు. 24 నెలల కాలంలో ఒక ఆటగాడు ఖాతాలో నాలుగు అంతకంటే ఎక్కువ డిమెరిట్ పాయింట్లు చేరితే అతనిపై సస్పెన్షన్ వేటు తీవ్రంగా ఉంటుంది. సదరు ఆటగాడిని నిషేధించే అధికారం ఐసీసీకి ఉంది. రెండు డిమెరిట్ పాయింట్లు చేరితే మాత్రం ఒక టెస్టు కానీ రెండు వన్డేలు కానీ, రెండు టీ20లు కానీ నిషేధం విధిస్తారు. తొలి టీ20లో సైనీ మూడు వికెట్లతో సత్తాచాటాడు. తన తొలి ఓవర్ నుంచి విండీస్ ఆటగాళ్లపై నిప్పులు చెరిగే బంతులు సంధించాడు. దాంతో సైనీని ఎదుర్కోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డ విండీస్ 95 పరుగులు మాత్రమే చేసింది. -
సైనీని వద్దన్నారు.. ఇప్పడేమంటారు బాస్!
న్యూఢిల్లీ: టీమిండియా యువ పేసర్ నవదీప్ సైనీ ప్రదర్శనతో ఢిల్లీ, డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) సభ్యులు బిషెన్ సింగ్ బేడీ, చేతన్ చౌహాన్ల వికెట్లు పడ్డాయని మాజీ ఓపెనర్, భాజపా ఎంపీ గౌతమ్ గంభీర్ పేర్కొన్నారు. శనివారం రాత్రి వెస్టిండీస్తో జరిగిన తొలి టీ20లో కోహ్లి సేన నాలుగు వికెట్లతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన సైనీ 17 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు సాధించాడు. అయిదో ఓవర్లో బంతి అందుకొని వరుస బంతుల్లో పూరన్ (20), హెట్మయర్ (0)లను ఔట్ చేయగా ఆఖరి ఓవర్లో పొలార్డ్ (49)ని ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. ఈ సందర్భంగా అతడి సలహాదారు గౌతమ్ గంభీర్ ట్విటర్ వేదికగా సైనీని మెచ్చుకోవడంతో పాటు డీడీసీఎ సభ్యులను తీవ్రంగా విమర్శించారు. ‘సైనీ నువ్వు బౌలింగ్ చేయకముందే బిషన్ బేడీ, చేతన్ చౌహన్ల వికెట్లు తీశావు. నీ అరంగేట్రం మ్యాచ్ చూసి వారిద్దరి మిడిల్ స్టంప్స్ ఎగిరిపడ్డాయి’ అని పేర్కొన్నారు. ఢిల్లీ క్రికెటరైన నవదీప్ సైనీని గతంలో దిల్లీ రంజీ జట్టు తరఫున ఆడించాలని గంభీర్ ప్రతిపాదించాడు. అయితే సైనీ క్రికెట్కు పనికిరాడని పేర్కొంటూ వీరు బీసీసీఐకి నివేదించారు. అయినప్పటికీ గంభీర్ పట్టు వదలకుండా ఢిల్లీ పేసర్కు అండగా నిలిచి వెలుగులోకి తీసుకొచ్చాడు. ఆపై సైనీ ఐపీఎల్లో రాణించడంతోపాటు దేశవాళీ క్రికెట్లోనూ సత్తా చాటాడు. అలాగే ఇటీవల వెస్టిండీస్ ఎ జట్టుతో జరిగిన అనధికార వన్డే సిరీస్లోనూ రాణించాడు. తాజాగా విండీస్తో మ్యాచ్లో అద్వితీయ ప్రదర్శనతో ఆకట్టుకన్నాడు. సైనీ రాణించడంతో విండీస్ 95 పరుగులు మాత్రమే చేయగల్గింది. ఆపై లక్ష్య ఛేదనలో భారత్ 17.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.( ఇక్కడ చదవండి: శభాష్ సైనీ..) -
శభాష్ సైనీ..
లాడర్హిల్ (అమెరికా): వెస్టిండీస్తో ఫ్లోరిడాలో జరిగిన తొలి టీ20లో టీమిండియా విజయం సాధించడంలో పేసర్ నవదీప్ సైనీ కీలక పాత్ర పోషించాడు. 4 ఓవర్లలో 17 పరుగులే ఇచ్చి మూడు ప్రధాన వికెట్లను సాధించాడు ఆసాంతం 140 కి.మీ. పైగా వేగంతో సాగిన అతడి బౌలింగ్ ఆకట్టుకుంది. తన తొలి ఓవర్లో వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసిన సైనీ... తర్వాత సైతం కట్టుదిట్టంగా బంతులేశాడు. అతడి నాలుగు ఓవర్ల స్పెల్లో ఏకంగా 19 డాట్ బాల్స్ ఉండటమే దీనికి నిదర్శనం. జట్టులో అత్యధిక డాట్ బాల్స్ వేసింది కూడా సైనీనే. అన్నింటికి మించి చివరి ఓవర్ను సైనీ వేసిన తీరు ముచ్చటగొలిపింది. పొలార్డ్ వంటి హిట్టర్కు వరుసగా రెండు డాట్స్ వేయడంతో పాటు మూడో బంతికి ఔట్ చేసి అతడి అర్ధసెంచరీని అడ్డుకున్నాడు. మిగతా మూడు బంతులకూ పరుగివ్వకుండా విండీస్ను 100లోపే పరిమితం చేశాడు. టి20ల్లో సాధారణంగా మెయిడిన్ వేయడమే అరుదంటే... ఏకంగా ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ను వికెట్ మెయిడిన్గా ముగించి భళా అనిపించాడు. తన అరంగేట్రపు తొలి అంతర్జాతీయ మ్యాచ్లోనే సైనీ ఆకట్టుకోవడంపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. అరంగేట్రం మ్యాచ్లో ఈ తరహా అద్భుత ప్రదర్శన చేయడం అరుదుగా జరుగుతుందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కొనియాడాడు. వైవిధ్యమైన బంతులతో ప్రత్యర్థిని తక్కువ పరుగులకే కట్టడి చేయడంలో సైనీ ప్రధాన పాత్ర పోషించాడన్నాడు. ఇక సహచర పేసర్ భువనేశ్వర్ కుమార్ సైతం సైనీ ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు. తనలోని సత్తా ఏమిటో తొలి అంతర్జాతీయ టీ20లోనే నిరూపించుకున్నాడన్నాడు. ఈ వికెట్పై బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదని, సైనీ మాత్రం తన అద్భుతమైన బౌలింగ్తో ఆకట్టకున్నాడన్నాడు.145-150కి.మీ వేగంతో బౌలింగ్ చేయడమంటే మాటలు కాదన్నాడు. కట్టుదిట్టమైన బౌలింగ్తో మిగతా బౌలర్లలో ఆత్మవిశ్వాసం నింపాడన్నాడు. తనకు అవకాశం ఎక్కడ వచ్చినా దాన్ని నిలబెట్టుకుంటూనే సైనీ ముందుకు సాగుతున్నాడన్నాడు. అటు దేశవాళీ క్రికెట్తో పాటు ఐపీఎల్, భారత్-ఎ మ్యాచ్ల్లో సైనీ తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నాడని భువీ పేర్కొన్నాడు. టెన్నిస్ బాల్తో క్రికెట్ మొదలుపెట్టి.. సైనీ క్రికెట్ కెరీర్ టెన్నిస్ బంతులతో ఆరంభమైంది. కర్మల్ ప్రీమియర్ లీగ్లో ద్వారా అతని క్రికెట్ అరంగేట్రం జరిగింది. సైనీ తండ్రి హర్యానా రాష్ట్రంలో ఒక డ్రైవర్గా పనిచేశాడు. ఇదిలా ఉంచితే, 2013లో తొలిసారి సైనీని అదృష్టం తలుపు తట్టంది. ఆ ఏడాది రంజీ ట్రోఫీలో ఢిల్లీ నెట్ బౌలర్గా బ్యాట్స్మన్కు బంతులు వేసే అవకాశం సైనీకి వచ్చింది. దాంతో అప్పటి భారత ఓపెనర్, ఢిల్లీ మాజీ కెప్టెన్ గౌతం గంభీర్కు నెట్ బౌలింగ్ చేశాడు. అతని బౌలింగ్లో వేగాన్ని గమనించిన గంభీర్.. ఆ సీజన్లో ఆడే అవకాశం దక్కించుకున్నాడు. దాంతో పాటు ఆ సీజన్ ఆసాంతం ఓపెనింగ్ పేస్ అవకాశం రావడం మరొక విశేషం. విదర్భతో జరిగిన ఆనాటి మ్యాచ్లో సైనీ రెండు వికెట్లతో మెరిశాడు. అలా తన ఫస్ట్క్లాస్ క్రికెట్ను ఆరంభించిన సైనీ.. ఇప్పుడు భారత్ తరఫున ఆడిన తొలి మ్యాచ్లోనే మూడు వికెట్లు సాధించడం అరుదైన ఘనతగా చెప్పవచ్చు. -
కష్టపడి నెగ్గిన టీమిండియా..
ఫ్లోరిడా: వెస్టిండీస్తో జరిగిన తొలి టీ20లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. స్వల్ప స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్లో విజయం కోహ్లిసేన వైపే మొగ్గుచూపింది. దీంతో విండీస్ పర్యటనను కోహ్లి సేన విజయంతో ఆరంభించింది. విండీస్ నిర్దేశించిన 96 పరుగుల లక్ష్యాన్ని 17.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి భారత్ పూర్తి చేసింది. ఛేదనలో రోహిత్ శర్మ(24), విరాట్ కోహ్లి(19), మనీష్ పాండే(19)లు పర్వాలేదనిపించారు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి భారత్ తీవ్రంగా కష్టపడింది. భారత ఆటగాళ్లలో శిఖర్ ధావన్(1), రిషభ్ పంత్ (గోల్డెన్ డక్)లు ఘోరంగా విఫలమయ్యారు. విండీస్ బౌలర్లలో కాట్రెల్, సునీల్ నరైన్, కీమో పాల్లు తలో రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్కు బౌలర్లు అదిరే ఆరంభాన్ని అందించారు. ముఖ్యంగా యువ బౌలర్ నవదీప్ సైనీ(3/17) విండీస్ బ్యాట్స్మెన్కు వణుకుపుట్టించాడు. సైనీతో పాటు మిగతా బౌలర్లు తలో చేయి వేయడంతో విండీస్ను కట్టడి చేశారు. విండీస్ ఆటగాళ్లలో కీరన్ పొలార్డ్(49; 49 బంతుల్లో 2ఫోర్లు, 4 సిక్సర్లు) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. నికోలస్ పూరన్(20) ఫర్వాలేదనిపించాడు. దీంతో విండీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. భారత్ బౌలర్లలో భువనేశ్వర్ రెండు వికెట్లు పడగొట్టగా.. ఖలీల్, వాషింగ్టన్ సుందర్, కృనాల్, రవీంద్ర జడేజాలు తలో వికెట్ తీశారు. విండీస్ పతనాన్ని శాసించిన నవదీప్ సైనికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
‘ఆ క్రెడిట్ అంతా గంభీర్దే’
న్యూఢిల్లీ: తనలోని టాలెంట్ను గుర్తించి ప్రోత్సహించినందుకు గౌతం గంభీర్కు జీవితాంతం రుణపడి ఉంటానని టీమిండియా యువ పేసర్ నవదీప్ షైనీ పేర్కొన్నాడు. తన కెరీర్ ఎదుగుదలలో గంభీర్ భయ్యా చేసిన సాయాన్ని ఎప్పటికీ మరువలేని తాజాగా తెలిపాడు. విండీస్ పర్యటనకు ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కించుకున్న షైనీ మాట్లాడుతూ.. తన టాలెంట్ను గంభీర్ గుర్తించడమే కాకుండా ఎంతో అండగా నిలిచాడన్నాడు. ‘నా కెరీర్లో గంభీర్ భయ్యా సహకారాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. ఈ స్థాయిలో నేను ఇక్కడ ఉన్నానంటే అందుకు కారణం అతడే. నేను ఏమైనా సాధిస్తే, అందులో గంభీర్ పేరు తప్పక ఉంటుంది. నా ఎదుగుదల క్రెడిట్ అంతా గంభీర్ భయ్యాదే’ అని షైనీ పేర్కొన్నాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్లో సైతం నవదీప్ షైనీ తన పదునైన బంతులతో ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్మెన్కు చుక్కలు చూపించాడు. ఐపీఎల్లో అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన రెండో ఆటగాడిగా నవదీప్ షైనీ 152.85 కి.మీ వేగంతో రికార్డు నెలకొల్పాడు. దేశవాళీ క్రికెట్లో గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. -
విండీస్ సిరీస్కు సై
ముంబై: ప్రపంచ కప్ సాధించలేకపోయిన బాధను అధిగమిస్తూ వెస్టిండీస్ సిరీస్కు టీమిండియాను ఎంపిక చేసింది జాతీయ సెలక్టర్ల బృందం. విడివిడిగా కాకుండా మూడేసి టి20లు, వన్డేలతో పాటు రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్కు ఒకేసారి జట్లను ప్రకటించింది. చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలో ఆదివారం ఇక్కడ సమావేశమైన సెలక్టర్లు పరిమిత ఓవర్ల ఫార్మాట్కు 15 మంది చొప్పున, టెస్టులకు 16 మంది సభ్యుల పేర్లను వెల్లడించారు. వీరిలో పేసర్ నవదీప్ సైనీ (ఢిల్లీ), స్పిన్నర్ రాహుల్ చహర్ (రాజస్తాన్) పూర్తిగా కొత్త ముఖాలు. విశ్రాంతి ఊహాగానాలను తోసిరాజంటూ కెప్టెన్ విరాట్ కోహ్లి మొత్తం పర్యటనలో పాల్గొననున్నాడు. వన్డే ప్రపంచ కప్ జట్టులో ఉన్న వికెట్ కీపర్ బ్యాట్స్మన్ దినేశ్ కార్తీక్పై వేటు పడింది. పనిభారం రీత్యా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాను టెస్టులకే పరిమితం చేయగా, ఫిట్నెస్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను పరిగణనలోకి తీసుకోలేదు. ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 3 వరకు జరిగే కరీబియన్ పర్యటనలో భారత్ 3 టి20లు, 3 వన్డేలు, 2 టెస్టులు ఆడుతుంది. హార్దిక్ది గాయయా? విశ్రాంతా? మూడు ఫార్మాట్లలోనూ కీలకమైన పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను మొత్తం విండీస్ టూర్కే ఎంపిక చేయలేదు. ప్రపంచ కప్లో బాగానే రాణించిన హార్దిక్... సెమీస్కు వచ్చేసరికి ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడ్డాడు. కొంతకాలంగా అతడిని వేధిస్తున్న వెన్నునొప్పి తిరగబెట్టకుండా సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. పృథ్వీ షా మళ్లీ మిస్... అరంగేట్రంలోనే సెంచరీతో అదరగొట్టిన యువ సంచలనం పృ థ్వీ షాను ఆ తర్వాత దురదృష్టం వెంటాడుతున్నట్లుంది. పట్టిం చుకోనవసరం లేని ప్రాక్టీస్ మ్యాచ్లో క్లిష్టమైన క్యాచ్ అందుకోబోయి పాదం గాయానికి గురై, కెరీర్కు కీలకమైన ఆస్ట్రేలియా పర్యటనకు దూరమైన పృథ్వీ... ఇప్పుడు మరో గాయంతో వెస్టిండీస్ సిరీస్నూ చేజార్చుకున్నాడు. రెండు నెలల క్రితం ముంబై టి20 లీగ్లో ఆడుతూ గాయం బారినపడ్డ అతడు ప్రస్తుతం కరీబియన్ దీవుల్లో ఆడుతున్న భారత ‘ఎ’ జట్టులో స్థానాన్ని కోల్పోయాడు. విండీస్తో టెస్టులకు కొంత సమయం ఉన్నా సెలక్టర్లు పృథ్వీని పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో విదేశాల్లో సత్తా చాటేందుకు అతడు ఇంకొంత కాలం ఆగక తప్పలేదు. టెస్టు జట్టు: సభ్యులు 16 ఎంపిక తీరు: మయాంక్ అగర్వాల్, రాహుల్, పుజారా, కోహ్లి, రహానే, హనుమ విహారి, రోహిత్ శర్మ, రిషభ్ పంత్, సాహా, అశ్విన్, జడేజా, కుల్దీప్, షమీ, ఇషాంత్ శర్మ, బుమ్రా, ఉమేశ్ యాదవ్. ఎంపిక తీరు: స్పెషలిస్ట్ మూడో ఓపెనర్గా ఎవరినీ తీసుకోలేదు. మయాంక్, రాహుల్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారు. అవసరమైతే తెలుగు ఆటగాడు విహారిని ఓపెనింగ్కు పరిశీలించే వీలుంది. ఈ కారణంగానే దేశవాళీ, ‘ఎ’ జట్ల తరఫున సెంచరీలతో దుమ్మురేపుతున్న ప్రియాంక్ పాంచాల్ (గుజరాత్), అభిమన్యు ఈశ్వరన్ (బెంగాల్)లకు పిలుపు అందలేదు. ప్రపంచ కప్ టాప్ స్కోరర్ రోహిత్ శర్మకు మళ్లీ అవకాశం దక్కింది. రోహిత్ ఆస్ట్రేలియాలో పర్యటించిన జట్టులోనూ సభ్యుడు. ఏడాదిగా గాయంతో అంతర్జాతీయ క్రికెట్కు దూరమైన వృద్ధిమాన్ సాహాను రెండో వికెట్ కీపర్గా తీసుకున్నారు. ఆసీస్ టూర్లో జట్టులో ఉన్న మిగతా నలుగురు పేసర్లకూ స్థానం కల్పించిన సెలెక్టర్లు పేసర్ భువనేశ్వర్ను పక్కన పెట్టారు. స్పిన్ బాధ్యతలను అశ్విన్–జడేజా–కుల్దీప్ త్రయం మోయనుంది. వన్డే జట్టు: సభ్యులు 15 ఎంపిక తీరు: రోహిత్ శర్మ, ధావన్, కోహ్లి, రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే, పంత్, జడేజా, కుల్దీప్, చహల్, కేదార్ జాదవ్, షమీ, భువనేశ్వర్, ఖలీల్ అహ్మద్, నవదీప్ సైనీ. ఎంపిక తీరు: వేలి గాయంతో ప్రపంచ కప్ నుంచి తప్పుకొన్న ఓపెనర్ శిఖర్ ధావన్ ఫిట్నెస్ సాధించడంతో అందుబాటులోకి వచ్చాడు. బ్యాటింగ్ ఆర్డర్లో నంబర్–4 స్థానం సమస్య పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. దీంతో నిఖార్సైన బ్యాట్స్మెన్ అయ్యర్, పాండేలకు అవకాశం దక్కింది. సీనియర్ దినేశ్ కార్తీక్పై వేటుతో రిషభ్ పంత్ ఏకైక కీపర్గా వ్యవహరించనున్నాడు. ఆల్రౌండర్ కేదార్ జాదవ్ను తప్పిస్తారని ఊహించినా అతడిపై భరోసా ఉంచారు. ఎడంచేతి వాటం పేసర్ ఖలీల్ పునరాగమనం చేస్తున్నాడు. గాయం నుంచి ఇంకా కోలుకోని ఆల్రౌండర్ విజయ్ శంకర్ పేరు ప్రస్తావనకు రాలేదు. టి20 జట్టు: సభ్యులు 15 ఎంపిక తీరు: రోహిత్, ధావన్, కోహ్లి, రాహుల్, అయ్యర్, పాండే, పంత్, కృనాల్ పాండ్యా, జడేజా, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చహర్, దీపక్ చహర్, ఖలీల్, భువనేశ్వర్, నవదీప్ సైనీ. ఎంపిక తీరు: జాతీయ జట్టు సభ్యులుగా సోదర ద్వయం రాహుల్ చహర్ (స్పిన్), దీపక్ చహర్ (పేసర్) తొలిసారి మైదానంలో దిగే వీలుంది. దీపక్ గతంలో ఒక వన్డే, ఒక టి20 ఆడాడు. ఐపీఎల్, ‘ఎ’ జట్టు తరఫున అదరగొట్టిన 19 ఏళ్ల రాహుల్ చహర్ తన ప్రతిభకు గుర్తింపుగా టీమిండియా గడప తొక్కాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్లకు పట్టించుకోని వాషింగ్టన్ సుందర్కు తిరిగి పిలుపొచ్చింది. మణికట్టు ద్వయం కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్ను ఎంపిక చేయకపోవడం గమనార్హం. బుమ్రా అందుబాటులో లేని నేపథ్యంలో షమీని పొట్టి ఫార్మాట్కు పరిగణించలేదు. అద్భుత ఫామ్లో ఉన్నప్పటికీ అతడిపై మరింత భారం మోపకుండా ఖలీల్, దీపక్, సైనీ వంటి యువ పేసర్లను పరీక్షించనున్నారు. భువీ ప్రధాన పేసర్గా వ్యవహరిస్తాడు. -
షైనీకి పిలుపు.. ఇంగ్లండ్కు పయనం
మాంచెస్టర్: కండరాల నొప్పితో బాధపడుతున్న టీమిండియా పేసర్ భువనేశ్వర్కు స్టాండ్ బై ప్లేయర్గా నవ్దీప్ షైనీకి భారత క్రికెట్ జట్టు మేనేజ్మెంట్ నుంచి పిలుపు అందింది. భారత జట్టు నుంచి పిలుపు అందిన మరుక్షణమే అతను ఇంగ్లండ్ విమానం ఎక్కేశాడు. సోమవారం జట్టుతో కలిసిన షైనీ ప్రాక్టీస్లో నిమగ్నమయ్యాడు. ఈ నెల 16వ తేదీన పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ సందర్భంగా భువనేశ్వర్ కుమార్ గాయపడ్డ విషయం తెలిసిందే. బౌలింగ్ చేస్తున్న సమయంలో అతని కాలి కండరాలు పట్టేశాయి. దీనితో ఓవర్ మధ్య నుంచే భువనేశ్వర్ కుమార్ అర్ధాంతరంగా తప్పుకొన్నాడు. అఫ్గానిస్తాన్తో మ్యాచ్కు కూడా దూరం అయ్యాడు. భువనేశ్వర్ కుమార్ గాయం పరిస్థితిపై భారత క్రికెట్ జట్టు మేనేజ్మెంట్ నుంచి ఎలాంటి అప్డేట్స్ కూడా లేవు. అయినప్పటికీ అతను కోలుకుంటాడని, ఈ నెల 30వ తేదీన ఇంగ్లండ్తో జరిగే మ్యాచ్ నాటికి అందుబాటులోకి వస్తాడని ఆశిస్తున్నారు అభిమానులు. ఈలోగా స్టాండ్ బై ఫాస్ట్ బౌలర్గా ఉన్న నవ్దీప్ షైనీకి టీమిండియా మేనేజ్మెంట్ నుంచి పిలుపు అందింది. దీనితో అతను హుటాహుటీన ఇంగ్లండ్కు బయలుదేరి వెళ్లాడు. కాగా, నవ్దీప్ షైనీని కేవలం నెట్ బౌటర్గా సేవలను అందించడానికి మాత్రమే పిలిపించుకున్నట్లు టీమ్ మేనేజ్మెంట్ చెబుతోంది. భువనేశ్వర్ కుమార్ అందుబాటులో లేకపోవడం వల్ల నెట్ ప్రాక్టీస్ సమయంలో టీమిండియా బ్యాట్స్మెన్లు కాస్త ఇబ్బందులకు గురి అవుతున్నారు. సరైన ఫాస్ట్ బౌలర్ లేకపోవడం వల్ల ఆ విభాగం బలహీన పడినట్లు భావిస్తున్నారు. సరైన టెక్నిక్తో బంతులను సంధించే ఫాస్ట్ బౌలర్ అందుబాటులో ఉంటే నెట్ ప్రాక్టీస్ సులువుగా ఉంటుందని నిర్ణయానికి వచ్చారు. ఒకవేళ భువనేశ్వర్ కుమార్ మిగిలిన మ్యాచ్లకు కూడా దూరంగా ఉండాల్సి వస్తే.. నవ్దీప్ షైనీని ఆడించే అవకాశాలను మాత్రం కొట్టి పారేయట్లేదు. స్పెషలిస్ట్ పేస్ బౌలర్గా షైనీని ప్రపంచకప్ మ్యాచుల్లో ఆడించే అవకాశాలు ఉన్నాయని టీమ్ మేనేజ్మెంట్ సూచనప్రాయంగా చెబుతోంది. భువనేశ్వర్ కుమార్ స్థానాన్ని ఇంకా ఏ ఆటగాడితోనూ భర్తీ చేయలేదు. అతని స్థానంలో ఆల్రౌండర్ విజయ్ శంకర్ను తుది జట్టులోకి తీసుకున్నారు. కొన్ని రోజుల క్రితం శిఖర్ ధావన్ గాయపడటంతో రిషభ్ పంత్ను స్టాండ్ బైగా ఎంపిక చేశారు. ఆ తర్వాత ధావన్ పూర్తిగా టోర్నీ నుంచి వైదొలిగినా, పంత్కు ఆడే అవకాశం ఇంకా రాలేదు. -
ఐపీఎల్లో వారి బౌలింగ్ భేష్: బ్రెట్ లీ
న్యూఢిల్లీ: ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో భారత యువ పేసర్లు ప్రసిధ్ కృష్ణ, నవ్దీప్ సైనీ బౌలింగ్ తననెంతో ఆకట్టుకుందని ఆసీస్ మాజీ స్పీడ్స్టర్ బ్రెట్లీ అన్నాడు. ఈ ఇద్దరు యువ బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారని ప్రశంసించాడు. ‘ఐపీఎల్లో ప్రసిధ్ కృష్ణ 145 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు విసురుతున్నాడు. అలాంటి మరో బౌలరే నవ్దీప్ సైనీ. ప్రస్తుతం భారత్లో మంచి పేసర్లు ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రా తరహా పేసర్లు బయటకు రావడం భారత క్రికెట్కు సానుకూల పరిణామం. ప్రస్తుతమున్న భారత బౌలర్లు మంచి వేగంతో బంతులు వేస్తుండటం సంతోషకరం’ అని బ్రెట్లీ అన్నాడు. మరొకవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు నవ్దీప్ సైనీ ప్రధాన బౌలర్గా ఉన్నాడన్నాడు. షైనీ చక్కటి లైన్ అండ్ లెంగ్త్తో పాటు వేగంగా బంతులు విసురుతున్నాడన్నాడు. అదే అతనికి వరల్డ్కప్ భారత స్టాంబ్బై ఆటగాళ్లలో చోటు దక్కేలా చేసిందని బ్రెట్ లీ పేర్కొన్నాడు. -
భారత జట్టులోకి సైనీ.. డీడీసీఏకి గంభీర్ చురకలు
ముంబై: భారత క్రికెట్ జట్టుకు నవదీప్ సైనీ ఎంపికైన వేళ మాజీ క్రికెటర్లు బిషన్ సింగ్ బేడీ, చేతన్ చౌహాన్లకు వెటరన్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ చురకలు అంటించాడు. బయటి వాడనే కారణంతో సైనీని ఢిల్లీ జట్టుకు ఎంపిక కాకుండా అడ్డుపడేందుకు గతంలో వీరిద్దరూ ప్రయత్నించారు. అయితే సైనీకి తొలిసారి భారత జట్టులోకి పిలుపు అందిన వేళ.. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ)కి చెందిన కొందరు సభ్యులతోపాటు బేడీ, చౌహాన్లకు గంభీర్ ‘సంతాపం’ ప్రకటించాడు. మహ్మద్ షమీ ఫిట్నెస్ నిరూపించుకో లేకపోవడంతో అప్ఘాన్తో టెస్టుకి నవదీప్ సైనీని సెలక్టర్లు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ‘నలుపు రంగు చేతి బ్యాండ్లు బెంగళూరులోనూ దొరుకుతాయి. రూ.225 పెడితే ఓ రోల్ వస్తుంది. సర్, ముందుగా నవదీప్ భారతీయుడని గుర్తుంచుకోండి. అతడు ఏ రాష్ట్రం నుంచి వచ్చాడనేది తర్వాతి సంగతి’ అంటూ గంభీర్ మాజీలకు చురకలు అంటించాడు. 2013లో గంభీర్ ప్రోద్భలంతో నవదీప్ సైనీ తొలిసారి ఢిల్లీ రంజీ జట్టుకు ఎంపికయ్యాడు. కానీ ఢిల్లీ జట్టులో సైనీని చేర్చుకోవడాన్ని ప్రశ్నిస్తూ బేడీ డీడీసీఏ ప్రెసిడెంట్ అరుణ్ జైట్లీకి లేఖ రాశారు. కర్నాల్ (హరియాణా)కు చెందిన నవదీప్ను ఢిల్లీ జట్టులోకి ఎలా తీసుకుంటారు? గత ఏడాది కాలంలో అతడు ఢిల్లీ తరపున క్రికెట్ ఆడలేదు. బయటి వ్యక్తిని జట్టులోకి తీసుకోవడం సరైంది కాదు. ఢిల్లీ తరఫున ప్రాతినిధ్యం కోసం చాలా మంది కుర్రాళ్లు ఎదురు చూస్తున్నారంటూ.. సైనీ ఎంపిక పట్ల బేడీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. గంభీర్ చొరవతో సైనీని ఢిల్లీకి ఎంపిక చేయడం పట్ల డీడీసీఏ అధికారులు తీవ్రంగా అసహనానికి లోనయ్యారు. ఈ రచ్చ మొత్తం ఇప్పటికీ మర్చిపోని గంభీర్ ట్వీట్ ద్వారా వారికి చురకలు అంటించాడు. My ‘condolences’ to few DDCA members, @BishanBedi @ChetanChauhanCr on selection of ‘outsider’ Navdeep Saini to India squad. Am told black armbands are available in Bangalore too for INR 225 per roll!!! Sir, just remember Navdeep is an Indian first then comes his domicile @BCCI — Gautam Gambhir (@GautamGambhir) 12 June 2018 -
గౌతం గంభీర్ వల్లే..
బెంగళూరు: అఫ్గానిస్తాన్తో ఏకైక టెస్టుకు టీమిండియా ఆటగాళ్లకు నిర్వహించిన యో యో టెస్టులో సీనియర్ ఫాస్ట్బౌలర్ మహమ్మద్ షమీ ఫెయిలయ్యాడు. దీంతో బీసీసీఐ స్థానంలో ఢిల్లీ యువ ఫాస్ట్ బౌలర్ నవ్దీప్ సైనిని ఎంపిక చేశారు. దీనిపై నవదీప్ సైనీ స్పందిస్తూ...‘ఒకప్పుడు పాకెట్ మనీ కోసం క్రికెట్ ఆడాను. ఎప్పుడైతే నేను గౌతమ్ గంభీర్ కంటపడ్డానో ఒక్కసారిగా నా కెరీర్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. గౌతి నాకు ఒక సలహా ఇచ్చాడు. బౌలింగ్లో ఎలాంటి మార్పులు చేసుకోవద్దన్నాడు. గతంలో ఎలా బౌలింగ్ చేశావో అలాగే చేయాలని సూచించాడు. టెన్నిస్ బాల్తో క్రికెట్ ఆడే నేను ఎరుపురంగు ఎస్జీ టెస్టు బాల్తో ఆడటానికి గంభీర్ ప్రధాన కారణం. గౌతి సలహాతో నేను అలాగే బౌలింగ్ కొనసాగించి అద్భుత ఫలితాలు సాధించా. రంజీ ట్రోఫీ కోసం నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్లో గంభీర్ 15 నిమిషాల పాటు నా బౌలింగ్లో ప్రాక్టీస్ చేశాడు. నా బౌలింగ్లో ఏదో మాయ ఉందని గ్రహించి దిల్లీ క్రికెట్ బోర్డు సభ్యులతో మాట్లాడాడు. రంజీ ట్రోఫీలోఢిల్లీ తరఫున నన్ను ఆడించాలని వాళ్లని కోరాడు. అలా ఢిల్లీ జట్టుకు ఆడాను. కొన్ని మ్యాచ్ల తర్వాత ఓ రోజు గౌతి నా వద్దకు వచ్చి నెట్ సెషన్స్లో బాగా ప్రాక్టీస్ చెయ్. నువ్వు టీమిండియాకు ఆడతావు అని చెప్పాడు. గౌతి మాటలు నిజమయ్యాయి. కేవలం అతని వల్లే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నా. అదేంటో తెలియదు.. గౌతి గురించి ఎప్పుడు, ఎక్కడ మాట్లాడినా భావోద్వేగానికి గురైపోతా’ అని నవదీప్ సైని వివరించాడు.