new app
-
IRCTC సూపర్ యాప్: అన్నీ సేవలు ఒకేచోట
ఇండియన్ రైల్వే 'సూపర్ యాప్' పేరుతో ఓ సరికొత్త యాప్ను ప్రారంభించనున్నట్లు గత ఏడాదే వెల్లడించింది. చెప్పినట్లుగానే ఐఆర్సీటీసీ 'స్వరైల్' (SwaRail) పేరుతో ఓ కొత్త యాప్ తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా టికెట్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం, పీఎన్ఆర్ స్టేటస్ వంటి అన్నీ సేవలను పొందవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.రైల్వే సేవలన్నింటినీ.. ఒకే చోట సులభంగా నావిగేట్ చేయగల ప్లాట్ఫామ్ను తీసుకురావాలనే ఉద్దేశ్యంతో.. రైల్వే మంత్రిత్వ శాఖ జనవరి 31, 2025న "స్వరైల్" సూపర్ యాప్ను ప్రవేశపెట్టింది. ఈ యాప్ ప్రస్తుతం బీటా దశలో ఉంది. దీనిని ఆపిల్ యాప్ స్టోర్ & గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇది ప్రస్తుతం పరిమిత యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.స్వరైల్ యాప్ ద్వారా లభించే సేవలుటికెట్ బుకింగ్: ప్రయాణికులు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.ప్లాట్ఫామ్ & పార్శిల్ బుకింగ్: వినియోగదారులు ప్లాట్ఫామ్ టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. పార్శిల్ డెలివరీకి సంబంధించిన సేవలను బుక్ చేసుకోవచ్చు.రైలు & పీఎన్ఆర్ స్టేటస్: ట్రైన్ షెడ్యూల్, పీఎన్ఆర్ స్టేటస్ వంటి వాటికి సంబంధించిన విషయాలను తెలుసుకోవచ్చు.ఫుడ్ ఆర్డర్: రైలులో ప్రయాణించే సమయంలో.. ప్రయాణికులు ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు.రైల్ మదద్: ఫిర్యాదులు దాఖలు చేయడానికి మరియు సహాయం పొందడానికి ఒక హెల్ప్డెస్క్ మాదిరిగా కూడా ఉపయోగపడుతుంది.ఇదీ చదవండి: 2025లో బెస్ట్ స్మార్ట్ఫోన్స్: రూ.10 వేలకంటే తక్కువే..ఐఆర్సీటీసీ స్వరైల్ యాప్ అందుబాటులోకి వచ్చిన తరువాత.. ఇప్పుడు రైల్వే సేవల కోసం ఉపయోగిస్తున్న అనేక యాప్స్ కనుమరుగవుతాయి. ఇది మొబైల్ స్టోరేజ్ పెంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ప్రత్యేకంగా.. ఒక్కో సర్వీస్ కోసం ఒక్కో యాప్ ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. -
రైల్వే శాఖ కొత్త యాప్.. అన్ని సర్వీసులు ఒకే చోట..
రైల్వే శాఖ ‘స్వరైల్’ (SwaRail app) అనే కొత్త మొబైల్ యాప్ను ప్రారంభించింది. పలు రకాల సేవలకు వన్-స్టాప్ సొల్యూషన్గా ఈ యాప్ను రూపొందించింది. స్వరైల్ యాప్ ప్రస్తుతానికి టెస్టింగ్ కోసం ప్లేస్టోర్లో అందుబాటులోకి తెచ్చినట్లు రైల్వే (Railway) అధికారి ధ్రువీకరించారు.“ఈ యాప్ను ప్రస్తుతానికికి 1,000 మంది వినియోగదారులు మాత్రమే డౌన్లోడ్ చేసుకోగలరు. వీరి నుంచి వచ్చే ప్రతిస్పందన, అభిప్రాయాలను పరిగణించి ఆ తర్వాత, తదుపరి సూచనలు, వ్యాఖ్యల కోసం మరో 10,000 డౌన్లోడ్లకు అందుబాటులో ఉంచుతాం” అని రైల్వే బోర్డు అధికారి ఒకరు తెలిపారు.రిజర్వ్, అన్రిజర్వ్ టిక్కెట్ బుకింగ్లు, ప్లాట్ఫామ్, పార్శిల్ బుకింగ్లు, రైలు ఎంక్వయిరీలు, పీఎన్ఆర్ తనిఖీలు, రైల్మదాద్ ద్వారా అందించే సేవలు వంటివాటికి స్వరైల్ యాప్ సౌకర్యవంతమైన యాక్సెస్ను అందిస్తుంది.“అతుకులు లేని క్లీన్ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడమే ఈ యాప్ ప్రధాన ప్రాధాన్యత. ఇది ఒకే చోట అన్ని సేవలను మిళితం చేయడమే కాకుండా, భారతీయ రైల్వే సేవల పూర్తి ప్యాకేజీని వినియోగదారులకు అందించడానికి అనేక సేవలను ఏకీకృతం చేస్తుంది” అని రైల్వే బోర్డులో ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ పేర్కొన్నారు.రైల్వే మంత్రిత్వ శాఖ తరపున సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) తాజాగా బీటా పరీక్ష కోసం సూపర్ యాప్ను విడుదల చేసిందనని ఆయన తెలిపారు. వినియోగదారులు ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి స్వరైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు. -
జెప్టో కేఫ్ దూకుడు.. ప్రత్యేక యాప్
క్విక్ కామర్స్ మార్కెట్లో జెప్టో దూకుడు ప్రదర్శిస్తోంది. జెప్టో కేఫ్ను ప్రత్యేక యాప్గా అందుబాటులోకి తీసుకు రానున్నట్టు క్విక్ కామర్స్ కంపెనీ జెప్టో సహ వ్యవస్థాపకుడు ఆదిత్ పాలిచా తెలిపారు. కేఫ్ సేవలకు ఆదరణ పెరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.నెలకు 100కుపైగా కేఫ్లను ప్రారంభిస్తున్నామని, ఇప్పటికే రోజుకు 30,000 పైచిలుకు ఆర్డర్లను అందుకుంటున్నామని వివరించారు. జెప్టో వేదికగా 2022 ఏప్రిల్లో జెప్టో కేఫ్ ప్రారంభం అయింది. ముంబై, ఢిల్లీ, బెంగళూరులో ఉన్న స్టోర్లలో 120 కంటే ఎక్కువ కేఫ్ల ద్వారా ప్రధాన నగరాలకు తన కేఫ్ సేవను విస్తరించనున్నట్లు గత నెలలో కంపెనీ ప్రకటించింది.హైదరాబాద్, చెన్నై, పుణే సైతం విస్తరణ జాబితాలో ఉన్నాయని వివరించింది. వార్షిక ప్రాతిపదికన జెప్టో కేఫ్ వ్యాపారం ప్రస్తుతం రూ.160 కోట్ల స్థాయిలో నమోదవుతోందని వెల్లడించింది. కొత్త నగరాల్లో విస్తరణ కారణంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.1,000 కోట్ల వార్షిక సగటు రేటు సాధిస్తామని కంపెనీ ధీమా వ్యక్తం చేసింది.ఇదిలా ఉండగా సంస్థలో మరో కీలక పరిణామం జరిగింది. చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ మార్టిన్ దినేష్ గోమెజ్ తన పదవికి రాజీనామా చేశారు. కంపెనీలో చేరిన ఏడాదిలోపే ఆయన నిష్క్రమించడం గమనార్హం. జనవరిలో చీఫ్ బ్రాండ్ ఆఫీసర్గా చేరిన చందన్ మెండిరట్టా అక్టోబర్ నెలాఖరు నుండి చీఫ్ కల్చర్ ఆఫీసర్ బాధ్యతలతోపాటు హోచ్ఆర్ అధిపతిగానూ కొనసాగుతారని కంపెనీ ప్రకటించింది. -
రైల్వే కొత్త యాప్.. ఎవరి కోసమంటే..?
ఇండియన్ రైల్వే ఫ్రంట్లైన్ భద్రతా సిబ్బంది కోసం భద్రతా శిక్షణ, సామర్థ్యాన్ని పెంపొందించే మొబైల్ అప్లికేషన్ 'సంరక్ష'ను ప్రారంభించింది. లక్షలాది మంది రైల్వే ఫ్రంట్లైన్ సిబ్బందికి క్లిష్టమైన కార్యాచరణ శిక్షణను అందించడమే లక్ష్యంగా ఈ యాప్ను రూపొందించినట్లు సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే తెలిపింది.ఈ 'సంరక్ష' యాప్ను సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నాగపూర్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ రూపొందించారు. రైల్వే ఉద్యోగుల శిక్షణ, సామర్థ్యాన్ని పెంపొందించే సమర్థవంతమైన వ్యవస్థను అందించడానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డేటా అనలిటిక్స్, ఏఐ భవిష్యత్తులో సాధ్యాలతో, రైల్వే డొమైన్ పరిజ్ఞానంతో ఈ యాప్ అనుసంధానమై ఉంటుందని డీఆర్ఎం నమితా త్రిపాఠి పేర్కొన్నారు.రైల్వే రూపొందించిన ఈ యాప్ స్మార్ట్ లెర్నింగ్, ఫీడ్బ్యాక్ మెకానిజమ్లను కలిగి ఉంటుంది. ఇది మల్టీ లెవల్, రియల్ టైమ్ ఫీడ్బ్యాక్, పర్యవేక్షణను సాధ్యం చేస్తుంది. -
జొమాటో కొత్త యాప్ లాంచ్: ఇదెలా ఉపయోగపడుతుందంటే..
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ 'జొమాటో' ఎట్టకేలకు కొత్త సేవలకు శ్రీకారం చుట్టింది. దీనికోసం డిస్ట్రిక్ట్ (District) పేరుతో ఓ కొత్త యాప్ లాంచ్ చేసింది. యూజర్లు సినిమాలు, స్పోర్ట్స్, లైవ్ ఈవెంట్స్ వంటి వాటి కోసం టికెట్స్ బుక్ చేసుకోవడానికి.. డైనింగ్, షాపింగ్ వంటి వాటికోసం కూడా ఈ యాప్ ఉపయోగించుకోవచ్చు.డిస్ట్రిక్ట్ యాప్ను ప్రారంభిస్తున్నట్లు గతంలోనే దీపీందర్ గోయల్ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఈ యాప్ యాపిల్ ఐఓఎస్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు సమాచారం. రాబోయే రోజుల్లో ఇది ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా అందుబాటులో ఉండనుంది.ఇదీ చదవండి: కొత్త స్కామ్.. రూటు మార్చిన కేటుగాళ్లుఫుడ్ డెలివరీలో ముందు వరుసలో దూసుకెళ్తున్న జొమాటో.. టికెటింగ్ వ్యాపారంలో కూడా తన ఉనికిని విస్తరించడానికి 2024 ఆగష్టులో పేటీఎం నుంచి టికెటింగ్ బిజినెస్ కొనుగోలు చేసింది. దీనికోసం జొమాటో రూ. 2048 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. కాగా ఇప్పుడు డిస్ట్రిక్ట్ యాప్ లాంచ్ చేసింది. ఇది ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకొనే వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. -
సిద్దమవుతున్న సూపర్ యాప్: ఐఆర్సీటీసీ సర్వీసులన్నీ ఒకే చోట..
ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలంటే ఒక యాప్.. ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలనుంటే మరో యాప్, ఇలా ప్రతి ఒక్కదానికీ ఒక్కో యాప్. ఈ విధానానికి ఐఆర్సీటీసీ మంగళం పడనుంది. ఇండియన్ రైల్వే 'సూపర్ యాప్' పేరుతో ఓ సరికొత్త యాప్ను ప్రారంభించనుంది.ఐఆర్సీటీసీ ప్రారంభించనున్న ఈ సూపర్ యాప్ను.. రైల్వేకు సంబంధించిన అన్ని సర్వీసులకు ఉపయోగించుకోవచ్చు. ఇది 2024 డిసెంబర్ చివరి నాటికి అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. ప్రయాణికులకు సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ యాప్ను తీసుకువస్తున్నారు.ఇండియన్ రైల్వే లాంచ్ చేయనున్న సూపర్ యాప్ను సీఆర్ఐఎస్ (సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టం) అభివృద్ధి చేస్తోంది. దీనికి యాప్ టికెట్ బుకింగ్, ప్లాట్ఫామ్ పాస్లు, ఫుడ్ డెలివరీ వంటి వాటిని అనుసంధానిస్తోంది. అంటే ఈ ఒక్క యాప్లోనే టికెట్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్, ప్లాట్ఫామ్ పాస్ వంటివన్నీ కూడా పొందవచ్చు. అంతే కాకుండా ట్రైన్ జర్నీ స్టేటస్ కూడా ఇందులోనే తెలుసుకోవచ్చని సమాచారం.ఇండియన్ రైల్వే సూపర్ యాప్ అందుబాటులోకి వచ్చిన తరువాత థర్డ్ పార్టీ యాప్ల మీద ఆధారపడే అవసరం ఉండదు. ట్రైన్ జర్నీ చేసేవారు ఎక్కువ యాప్స్ ఉపయోగించాల్సిన అవసరం తీరిపోతుంది. ఇది ప్రయాణాన్ని సులభతరం చేయడం మాత్రమే కాకుండా.. వినియోగదారు అనుభవాన్ని కూడా మెరుగుపరుస్తుందని పలువురు భావిస్తున్నారు. -
జియోఫైనాన్స్ కొత్త యాప్.. ఇక మరిన్ని ఫీచర్లు
న్యూఢిల్లీ: జియోఫైనాన్స్ యాప్ను మరింత మెరుగ్గా ప్రారంభించినట్టు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రకటించింది. రుణాలు, పొదుపు ఖాతాలు, యూపీఐ బిల్లు చెల్లింపులు, రీఛార్జ్లు, డిజిటల్ ఇన్సూరెన్స్తో సహా అనేక రకాల సేవలను ఈ యాప్ అందిస్తోంది.జియోఫైనాన్స్ యాప్ బీటా వెర్షన్ 2024 మే 30న ప్రారంభమైంది. 60 లక్షలకు పైగా వినియోగదారులు ఉన్నారు. బీటా అందుబాటులోకి వచ్చినప్పటి నుండి అనేక రకాల ఆర్థిక ఉత్పత్తులు సేవలు జోడించామని, మ్యూచువల్ ఫండ్లపై రుణాలు, గృహ రుణాలు (బ్యాలెన్స్ బదిలీతో) సహా ఆస్తిపై రుణాలు వీటిలో ఉన్నాయని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ తెలిపింది. -
దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా దివ్యాంగ సురక్ష యాప్
-
టెస్టింగ్ దశలో కొత్త ఫీచర్.. నచ్చిన ధరకే ఉబర్ రైడ్!
చాలామంది తమ నిత్యజీవితంలో ఎక్కడ ఏం కొనాలన్నా కొంత బేరమాడుతూ ఉంటారు, ఇక ఆటోలో ప్రయాణించాలంటే మాత్రం డ్రైవర్తో కొంత బేరమాడకుండా ఉండలేరు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ క్యాబ్ సర్వీస్ కంపెనీ 'ఉబర్' ఓ కొత్త ఫీచర్ తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు క్యాబ్ బుక్ చేసుకోవాలంటే సంస్థ యాప్లో ఎంత రేటు చూపిస్తే అంత చెల్లించాల్సి వచ్చేది, దీంతో బేరమాడే అవకాశం లేకుండా పోయింది. ఉబర్ పరిచయం చేయనున్న కొత్త ఫీచర్ 'ఉబర్ ఫ్లెక్స్’లో మనకు నచ్చిన రేటుకే క్యాబ్ ఎంచుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలోనే ఉంది. త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఉబర్ పరిచయం చేయనున్న కొత్త ఫీచర్ ఒక రేటును కాకుండా.. యూజర్ ప్రయాణించే దూరం, సమయం వంటి వాటిని ఆధారంగా తీసుకుని తొమ్మిది ధరలను చూపిస్తుంది. ఇందులో వింభియోగదారుడు తనకు నచ్చిన రేటుని ఎంచుకోవచ్చు, అయితే ఆ రేటు డ్రైవర్కి నచ్చితే యాక్సెప్ట్ చేయొచ్చు, లేదా రిజెక్ట్ చేయొచ్చు. ఇదీ చదవండి: చైనాను దాటేసిన భారత్.. త్వరలో అమెరికా! - ఆనంద్ మహీంద్రా ట్వీట్ ఒకే రేటు దగ్గర నిలిచిపోకుండా.. కస్టమర్ తనకు నచ్చిన రేటును ఎంచుకునే అవకాశాన్ని ఉబర్ కల్పిస్తోంది. ఇది వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది, అదే సమయంలో తక్కువ ధరకే ప్రయాణం చేసే వెసులుబాటుని పొందవచ్చు. ఈ ఫీచర్ను ఉబర్ కంపెనీ భారతదేశంలో ఔరంగాబాద్, ఆజ్మీర్, బరేలీ, చండీగఢ్, కోయంబత్తూర్, దేహ్రాదూన్, గ్వాలియర్, ఇందౌర్, జోధ్పుర్, సూరత్ ప్రాంతాల్లో టెస్ట్ చేస్తున్నట్లు సమాచారం. భారత్ మాత్రమే కాకుండా లాటిన్ అమెరికా, కెన్యా దేశాల్లో కూడా సంస్థ ఈ ఫీచర్ను అమలుచేసే అవకాశం ఉంది. -
గూగుల్ పే నుంచి యూపీఐ లైట్ - ఇలా యాక్టివేట్ చేసుకోండి!
న్యూఢిల్లీ: పేమెంట్ యాప్ గూగుల్ పే తాజాగా స్వల్ప మొత్తాల డిజిటల్ చెల్లింపు లావాదేవీలను సులభతరం చేసేందుకు తమ ప్లాట్ఫాంపై యూపీఐ లైట్ సర్వీసును ఆవిష్కరించింది. దీనితో యూజర్లు రూ. 200 వరకు చిన్న మొత్తాలను యూపీఐ పిన్ను ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండానే చెల్లించవచ్చు. తక్షణ లావాదేవీల కోసం ఒక రోజులో రూ. 4,000 వరకు లోడ్ చేసుకోవచ్చు. యూజర్లు తమ గూగుల్ పే యాప్లోని ప్రొఫైల్ పేజ్లో 'యాక్టివేట్ యూపీఐ లైట్' ఆప్షన్ను ట్యాప్ చేయడం ద్వారా దీన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇప్పటికే పేటీఎం, ఫోన్పే, భీమ్ యాప్లతో పాటు 15 బ్యాంకులు ఈ తరహా సర్వీసును అందిస్తున్నాయి. -
Twitter vs Threads: అసలేంటీ మెటా థ్రెడ్స్? ట్విటర్ కంటే ఎందుకంత స్పెషల్?
మెటా వారి ‘థ్రెడ్స్’ ట్విట్టర్–కిల్లర్ అవుతుందా లేదా అనేది తెలియదుగానీ ఈ యాప్పై యువత అమిత ఆసక్తి ప్రదర్శిస్తోంది. ట్విట్టర్ కంటే ‘థ్రెడ్స్’ ఏ రకంగా భిన్నమైనది అనే విశ్లేషణ ఒక కోణం అయితే, కొత్తవాటిపై సహజమైన ఆసక్తి మరో కోణం... మెటా వారి టెక్ట్స్ ఆధారిత సంభాషణ యాప్ ‘థ్రెడ్స్’ ఐవోఎస్, ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. యాప్ మొదలైన రెండు గంటలోనే ఇరవై లక్షల మంది యూజర్లు సైనప్ అయ్యారు. నాలుగు గంటలలో ఆ సంఖ్య యాభై లక్షలకు చేరడం చూస్తుంటే థ్రెడ్స్ ‘ట్విట్టర్’కు గట్టిపోటీ ఇవ్వనుందనే విషయం అర్థమవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా వందకు పైగా దేశాల్లో అందుబాటులోకి వచ్చిన ‘థ్రెడ్స్’ డేటా ప్రైవసీ నిబంధనల కారణంగా యూరప్లో అందుబాటులోకి రాలేదు. థ్రెడ్స్కు సంబంధించి ఇన్స్టాగ్రామ్ యూజర్లు తమ యూజర్ నేమ్ కొనసాగించవచ్చు. ఇన్స్టాగ్రామ్లోని రెడీ–మేడ్ యూజర్ బేస్ వల్ల ‘థ్రెడ్స్’ ట్విట్టర్ని మించిపోతుంది అనే అంచనా ఉంది. ‘థ్రెడ్స్పై యూత్ ఆసక్తి ప్రదర్శించడానికి కారణం ఏమిటి?’ ఈ ప్రశ్నకు దేశంలోని వివిధ నగరాలకు చెందిన యువగళాల మాటల్లోనే జవాబు దొరుకుతుంది. ► ట్విట్టర్ ఎలాన్ మస్క్ అధీనంలోకి వచ్చిన తరువాత ప్రయోజనకరమైన మార్పుల కంటే అవసరం లేని మార్పులే ఎక్కువ జరిగాయి. యూజర్ల ట్వీట్ల మీద ఆంక్షలు, బ్లూటిక్స్ పై కొత్త రూల్స్... మొదలైనవి చిరాకు తెప్పించాయి’ అంటుంది ముంబైకి చెందిన ఎంబీఏ స్టూడెంట్ మనీష. ► థ్రెడ్స్ అనేది ట్విట్టర్కు కాపీ–పేస్ట్’ అనే విమర్శ మాట ఎలా ఉన్నా ‘ట్విట్టర్తో పోల్చితే భిన్నంగా ఉంది’ అని చెప్పుకోవడానికి కొన్ని అంశాలు ఉన్నాయి. ‘జుకర్ బర్గ్ కాపీ–పేస్ట్ విధానాన్ని నమ్ముకొని బాహుబలి లాంటి ట్విట్టర్ను ఢీ కొనడానికి రంగంలోకి దిగుతాడని నేను అనుకోవడం లేదు. ట్విట్టర్తో పోల్చితే థ్రెడ్స్ కచ్చితంగా భిన్నంగా ఉంటుంది. థ్రెడ్స్లో పోస్ట్ చేసే వీడియోల నిడివి అయిదు నిమిషాలు. ట్విట్టర్లో అయితే రెండు నిమిషాల ఇరవై సెకండ్లు. థ్రెడ్స్లో పోస్ట్ పరిమితి అయిదు వందలు. ట్విట్టర్లో రెండు వందల ఎనభై. భవిష్యత్తులో మరిన్ని మార్పులు జరగవచ్చు’ అంటుంది చెన్నైకి చెందిన ఇంజినీరింగ్ స్టూడెంట్ చైత్ర. ► ‘థ్రెడ్స్’లోని వినూత్నమైన ఫీచర్ ‘ఫెడివర్స్’ యూత్కు నచ్చింది. ఆల్టర్నేటివ్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ‘మాస్టడన్’లాంటి వాటితో ‘థ్రెడ్స్’ యూజర్లు ఇంటరాక్ట్ కావచ్చు. ఎప్పటికప్పుడు ప్లాట్ఫామ్ మైగ్రేషన్లో యూత్ చురుగ్గా ఉంటుంది. ► యూనివర్శిటీ ఆఫ్ కొలరాడో బౌండర్’కు చెందిన ప్రొఫెసర్ కేసీ ఫైస్లర్ ఆన్లైన్ కమ్యూనిటీని లోతుగా అధ్యయనం చేసిన ‘ఇన్ఫర్మేషన్ సైంటిస్ట్’గా పేరు తెచ్చుకుంది. ప్లాట్ఫామ్ మైగ్రేషన్స్’ గురించి రీసెర్చ్ ప్రాజెక్ట్ చేసింది. ► ప్లాట్ఫామ్ను ఎందుకు మార్చారు? మార్చడం ద్వారా ఎదురైన సవాళ్లు, అనుభవాలు’ అనే అంశంపై యువతరంలో ఎంతోమందితో మాట్లాడింది. ► ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పడిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు అందులోని ఆన్లైన్ కమ్యూనిటీ తట్టాబుట్టా సర్దుకొని కొత్త ప్లాట్ఫామ్లోకి వెళుతుంది. మైగ్రేషన్కు సంబంధించి తొలి దశలో కొత్త ప్లాట్ఫామ్ గురించి ప్రోత్సాహకరంగా మాట్లాడుకుంటారు. ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. అందరి కంటే ముందు తామే ఉండాలనుకునేవారితోపాటు, స్నేహితులు కదిలేవరకు కదలని వారు కూడా ఉంటారు’ అంటుంది ఫైస్లర్. ► ట్విట్టర్తో పోల్చితే హ్యాష్ట్యాగ్స్, వెబ్ వెర్షన్, ఎడిట్ పోస్ట్లు, డీఎం ఆప్షన్, ఎఐ జనరేటెడ్ ఆల్ట్ టెక్ట్స్, ట్రెండింగ్ టాపిక్స్, క్రోనలాజికల్ ఫీడ్... మొదలైన ఫీచర్స్ ‘థ్రెడ్స్’లో లేవు అనే మాట వినిపిస్తోంది. ►ఎన్నో అంచనాలతో ‘థ్రెడ్స్’లోకి వచ్చిన నవతరాన్ని మెటా నిరుత్సాహ పరుస్తుందా? ఒక మీమ్లో చూపినట్లు వేగంగా వచ్చిన వాళ్లు అంతే వేగంగా వెళ్లిపోతారా? ‘థ్రెడ్స్ ద్వారా జుకర్బర్గ్ కచ్చితంగా అద్భుతాలు సృష్టిస్తాడు’ అనే ఆశావాదంతో ఎంతకాలమైనా ఎదురుచూసే వాళ్లు ఉంటారా అనేది వేచిచూడాల్సి ఉంది. ట్విట్టర్ vs థ్రెడ్స్ ఈ మీమ్స్ చూస్తే పొట్టచక్కలు ట్విట్టర్ వర్సెస్ థ్రెడ్స్ నేపథ్యంలో యువ నెటిజనులు మీమ్స్, జోక్స్ పేలుస్తున్నారు. ‘ఎట్ ది రేట్ ఆఫ్’ సింబల్ని పోలిన ‘థ్రెడ్స్’ లోగో అచ్చం జిలేబిలా ఉందని కొందరు రెండు ఫొటోలను పక్కపక్కన పెట్టి పోస్ట్ చేస్తున్నారు. ఒక మీమ్లో... ట్విట్టర్ ఆఫీస్ కిటికీ నుంచి మార్క్ జుకర్బర్గ్ దొంగచాటుగా తొంగి చూస్తుంటాడు. ‘థ్రెడ్స్లోకి వెళ్లిన వారు కేవలం 5 నిమిషాల తరువాత బ్యాక్ టు ట్విట్టర్ అంటూ ఎలా పరుగెత్తుకు వస్తున్నారో చూడండి’ అంటూ ట్విట్టర్ వీరాభిమానులు వీడియో క్లిప్ పోస్ట్ చేశారు. నసీబ్, గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్, సూర్యవంశ్... మొదలైన బాలీవుడ్ సినిమాల క్లిప్లకు ట్విటర్–థ్రెడ్స్కు సంబంధించి ఫన్నీ కామెంట్స్ జత చేస్తున్నారు. Elon Musk: I am tweeting Mark Zuckerberg: pic.twitter.com/oVciHtsgWU — Sagar (@sagarcasm) July 6, 2023 People right now balancing on twitter and threads😂 pic.twitter.com/njRzO4tayh — Rishabh Kaushik (@RishabhKaushikk) July 6, 2023 They said this was Mark Zuckerberg at Twitter offices coming up with Threads 🤣 pic.twitter.com/AudgcfE7QS — O.T.G (@365OTG) July 7, 2023 Is it just a coincidence ? Jalebi lovers should sue Mark Zuckerberg .. pic.twitter.com/xMHSQKZGfh — Lost in Paradise 🇮🇳 (@Lost_human19) July 7, 2023 -
మెటా థ్రెడ్స్లోకి టాలీవుడ్ హీరోలు.. ఫస్ట్ ఎంట్రీ ఎవరిదంటే?
Meta Threads: ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ 'ట్విటర్' ప్రత్యర్థిగా మెటా ఇప్పుడు కొత్త 'థ్రెడ్స్' (Threads) అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి అందరికి తెలిసిందే. ఇది విడుదలైన అతి తక్కువ సమయంలో మిలియన్ల మంది యూజర్లు దీన్ని డౌన్లోడ్ చేసుకున్నారు. సాధారణ పౌరులు మాత్రమే కాకుండా ఈ యాప్ని సెలబ్రిటీలు సైతం డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ప్రముఖ టాలీవుడ్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ థ్రెడ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న మొదటి సెలబ్రిటీ అని భావిస్తున్నారు. ఆ తరువాత రామ్ చరణ్ కూడా ఈ కొత్త యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్యాన్స్ని ఫిదా చేశారు. దీంతో అభిమానులు కూడా పెద్ద ఎత్తున డౌన్లోడ్ చేసుకుని వారిని ఫాలో అవ్వడం మొదలు పెడుతున్నారు. (ఇదీ చదవండి: ట్విటర్కు పోటీగా మెటా థ్రెడ్స్.. నిమిషాల్లోనే సంచలనం.. ఇలా లాగిన్ అవ్వండి!) నివేదికల ప్రకారం మెటా థ్రెడ్స్ యాప్ కొన్ని గంటల్లోనే ట్విటర్ను షేక్ చేసినట్లు తెలిసింది. దీనిని కేవలం 2 గంటల్లో 20 లక్షలు, 4 గంటల్లో 50 లక్షల మంది డౌన్లోడ్ చేకున్నట్లు సంస్థ సీఈఓ జూకర్ బర్గ్ అధికారికంగా తెలిపాడు. ఈ సందర్భంగా అతడు సుమారు 11 సంవత్సరాల తరువాత ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ చేసాడు. ఇది ఎలాన్ మస్క్ని ఉద్దేశించి చేసినట్లు చాలామంది అభిప్రాయపడ్డారు. -
ట్విటర్కు పోటీగా మెటా థ్రెడ్స్.. నిమిషాల్లోనే సంచలనం.. ఇలా లాగిన్ అవ్వండి!
ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ 'ట్విటర్' పోటీగా సోషల్ మీడియా దిగ్గజం 'మెటా థ్రెడ్స్' (Meta Threads) యాప్ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ యాప్ విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ల సంఖ్యలో యూజర్లు డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిపోయింది. అయితే ఈ యాప్ ఎలా లాగిన్ అవ్వాలి? ఉపయోగాలేంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. మెటా థ్రెడ్స్ లాగిన్ విధానం.. ట్విటర్ ప్రత్యర్థిగా విడుదలైన కొత్త 'మెటా థ్రెడ్స్' వినియోగించాలనుకునే వ్యక్తి ముందుగా గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ ద్వారా థ్రెడ్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తరువాత ఇన్స్టాగ్రామ్తో లాగిన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసి మీ ఆధారాలను నమోదు చేయండి ప్రొఫైల్ ఫోటో, పేరు, బయో, లింక్లు వంటి ఇన్పుట్ వివరాలు ఫిల్ చేయండి.. లేదా ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా తీసుకోవచ్చు. పబ్లిక్ లేదా ప్రైవేట్ ప్రొఫైల్ను ఇక్కడ ఎంచుకోవచ్చు. ఇందులో మీరు ప్రైవేట్ ప్రొఫైల్ ఎంచుకుంటే మిమ్మల్ని ఫాలో అయ్యే వ్యక్తులు మాత్రమే మీ పోస్టులు, ఇతర వివరాలు కనిపిస్తాయి. చివరగా జాయిన్ థ్రెడ్లపై క్లిక్ చేయండి. ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది. మెటా థ్రెడ్స్ ఉపయోగాలు.. మెటా థ్రెడ్స్ యాప్ ద్వారా కంటెంట్ని సృష్టించవచ్చు, లింక్స్ పెట్టవచ్చు, ఫొటోలు, అయిదు నిమిషాల నిడివితో వీడియోలు పోస్ట్ చేయవచ్చు. చాలా ఫీచర్స్ దాదాపు ట్విటర్ ఫీచర్స్ మాదిరిగానే ఉంటాయి. ఇందులో ట్విటర్లో లేని కొన్ని అదనపు ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ యాప్ వినియోగించాలనుకునే వారు అప్పటికి ఉన్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా లాగిన్ అవ్వొచ్చు. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్న అందరూ ఇందులో కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంది. దీని కోసం ప్రత్యేకంగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. (ఇదీ చదవండి: ట్విటర్ను షేక్ చేస్తున్న మెటా థ్రెడ్స్.. లక్షలు దాటుతున్న యూజర్ల సంఖ్య!) మెటా థ్రెడ్స్ యాప్ ఇప్పుడు యూరోపియన్ యూనియన్లోని కొన్ని దేశాల్లో తప్ప ప్రపంచంలోని దాదాపు 100కి పైగా దేశాల్లో ఈ రోజు (గురువారం) నుంచి అందుబాటులో వచ్చింది. ఈ యాప్ ద్వారా వినియోగదారుడు 500 అక్షరాలా వరకు పోస్ట్ చేయవచ్చు. కొత్తగా వచ్చిన ఈ థ్రెడ్స్ యాప్ "ట్విటర్ కిల్లర్" అని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. -
ట్విటర్ను షేక్ చేస్తున్న మెటా కొత్త యాప్! గంటల వ్యవధిలో..
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అధీనంలోని ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ 'ట్విటర్'కి పోటీగా సోషల్ మీడియా దిగ్గజం 'మెటా' ఓ కొత్త యాప్ పరిచయం చేసిన విషయం తెలిసిందే. 'థ్రెడ్స్' (Threads) పేరుతో విడుదలైన ఈ యాప్ ఇటీవలే అందుబాటులో వచ్చింది. దీనిని ప్రస్తుతం ఐఓఎస్, ఆండ్రాయిడ్ వినియోగదారులు ఉపయోగించవచ్చు. ఈ లేటెస్ట్ యాప్కు అతి తక్కువ సమయంలో కనీవినీ ఎరుగని రీతితో స్పందన లభిస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. లక్షలు దాటుతున్న యూజర్లు.. నివేదికల ప్రకారం.. థ్రెడ్స్ యాప్ విడుదలైన కేవలం 2 గంటల్లో 20 లక్షల మంది, 4 గంటల్లో 50 లక్షల మంది అకౌంట్స్ ఓపెన్ చేశారు. ఈ విషయాన్నీ మెటా సీఈఓ 'మార్క్ జుకర్బర్గ్' స్వయంగా వెల్లడించారు. ట్విటర్ మాదిరిగా ఉండే ఫీచర్స్ కలిగిన ఈ మెటా కొత్త యాప్ ఇన్స్టాగ్రామ్కు అనుసంధానంగా ఉంటుంది. కావున ఇన్స్టాగ్రామ్ యూజర్లు తమ యూజర్ నేమ్ కొనసాగించొచ్చు. పరిస్థితులను చూస్తుంటే థ్రెడ్స్ యాప్ ఖాతాదారుల సంఖ్య త్వరలోనే ట్విటర్ను అధిగమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇన్స్టాలో ఫాలో అవుతున్న అకౌంట్స్ కొత్త యాప్లోనూ అనుసరించే అవకాశం ఉంది. కావున తప్పకుండా ఎక్కువమంది ఈ యాప్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ యాప్ ఫోటో లైక్, షేర్ వంటి సౌలబ్యాన్ని కూడా అందిస్తుంది. టెక్స్ట్ మెసేజ్లు చేసుకోవాలనుకునే వారికి ఇది తప్పకుండా కొత్త అనుభవాన్ని అందిస్తుందని, ఆధునిక ప్రపంచంలో ఇలాంటి ఇలాంటి యాప్ అవసరం చాలా ఉందని మెటా చీప్ వెల్లడించారు. (ఇదీ చదవండి: రతన్ టాటా ఎమోషనల్ పోస్ట్! మొదటి సారి ఇలా రిక్వెస్ట్ చేస్తూ..) pic.twitter.com/MbMxUWiQgp — Mark Zuckerberg (@finkd) July 6, 2023 ఎలాన్ మస్క్ స్పందన.. మెటా థ్రెడ్స్ యాప్ మీద ఒక నెటిజన్ స్పందిస్తూ.. ఇది పూర్తిగా Ctrl + C + V ట్విటర్ కాపీ పేస్ట్ అని వ్యంగ్యంగా అన్నాడు. దీనికి స్పందిస్తూ ఒక నవ్వుతున్న ఎమోజీని ఎలాన్ మస్క్ పోస్ట్ చేసాడు. అయితే జుకర్బర్గ్ కొత్త యాప్ ప్రారంభించిన సందర్భంగా 11 సంవత్సరాల తరువాత తన ట్విటర్ అకౌంట్ ద్వారా ఒక పోస్ట్ చేసాడు. ఇందులో ఇద్దరు స్పైడర్ మ్యాన్ ఫోటోలు ఉండటం చూడవచ్చు. ఎలాన్ మస్క్ను ఉద్దేశించి జుకర్బర్గ్ చేసిన పోస్ట్ ఇది చాలామంది భావిస్తున్నారు. (ఇదీ చదవండి: అత్త ఐడియా కోడలి వ్యాపారం.. కళ్ళు తిరిగే సంపాదన, విదేశాల్లో కూడా యమ డిమాండ్!) 😂 — Elon Musk (@elonmusk) July 6, 2023 -
ట్విటర్కి గట్టి పోటీ.. త్వరలో కొత్త యాప్!
ఎలాన్ మస్క్ ట్విటర్ సొంతం చేసుకున్నప్పటి నుంచి అనేక మార్పులు సంభవిస్తూనే ఉన్నాయి. ఈ మార్పులకు సాధారణ వినియోగదారులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు సైతం విసుగెత్తిపోయారు. ఈ తరుణం కోసం ఎదురు చూస్తున్న మెటా యాజమాన్యంలోని ప్లాట్ఫామ్ ట్విట్టర్ యాప్తో పోటీ పడటానికి సిద్ధంగా ఉన్నాయి. ట్విటర్కు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూసే వారికి ఇప్పటికే మాస్టోడాన్, బ్లూ స్కై వంటివి అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా సైతం ట్విటర్కు పోటీగా కొత్త యాప్ తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇన్స్టాగ్రామ్ బ్రాండ్పై కొత్త యాప్ తీసుకొచ్చేందుకు మెటా సిద్ధమవుతున్నట్లు సమాచారం. మెటా సైతం కొత్తగా తీసుకురానున్న ఈ యాప్ పేరు అధికారికంగా ప్రస్తావించనప్పటికీ, కొంత మంది దీనిని పీ92, బార్సిలోనా పేర్లతో పిలుచుకుంటున్నారు. కానీ ఇది ఒక ప్రత్యేకమైన యాప్గా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ ఏడాది జూన్ నాటికి భారతదేశంలో అందుబాటులో రానున్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ కొత్త యాప్ దాదాపుగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మాదిరిగా ఉంటుందని, ఇందులో ఫోటోలు, వీడియోలు మాత్రమే కాకుండా ఇతరత్రా టైమ్లైన్ పోస్టులు పెట్టుకోవచ్చని భావిస్తున్నారు. మెటా విడుదలచేయనున్న ఈ కొత్త యాప్లో సుమారు 500 అక్షరాలతో టెక్స్ట్ రాసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అంతే కాకుండా ఇన్స్టాలో ఫాలో అవుతున్న వారిని కూడా ఒక్క క్లిక్తో ఈ కొత్త యాప్లోనూ ఫాలో అయ్యే విధంగా కంపెనీ ఏర్పాటు చేస్తోంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా భారీగా యూజర్లను సంపాదించుకున్న మెటా ఇప్పుడు త్వరలో విడుదల చేయనున్న కొత్త యాప్ ద్వారా ఎంత వరకు ఆదరణ పొందుతుంది. ట్విట్టర్ యాప్కి ప్రధాన ప్రత్యర్థిగా ఈ యాప్ నిలుస్తుందా.. లేదా? అనే మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
21 నెలలు, రూ. 9000 కోట్లు - జీవితాన్ని మార్చేసిన ఒక్క యాప్!
మనం ఇప్పటి వరకు ఎంతో మంది విజయ గాథలను (సక్సెస్ స్టోరీస్) గురించి తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు అతి తక్కువ కాలంలోనే కోట్ల సామ్రాజ్యం సృష్టించిన 'నిర్మిత్ పారిఖ్' గురించి తెలుసుకుందాం. నిర్మిత్ పారిఖ్ ఎవరు? అయన సక్సెస్ ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో.. ప్రపంచంలోని అతి పెద్ద కంపెనీలలో ఒకటైన ఆపిల్ సంస్థలో ఉన్నత ఉద్యోగాన్ని, లక్షల జీతాన్ని వదులుకుని భారతదేశానికి వచ్చి అతి తక్కువ కాలంలోనే కుబేరుడయ్యాడు. కరోనా మహమ్మారి వ్యాప్తికంటే ముందు స్వదేశానికి వచ్చి ఏదైనా సొంతంగా చేయాలనే పట్టుదలతో జాబ్స్ ప్లాట్ఫామ్ 'అప్నా' (Apna) ప్రారంభించి ఎన్నో కంపెనీలకు మార్గదర్శిగా నిలిచాడు. ఈ యాప్ ప్రారభించిన కేవలం 21 నెలల్లో ధనవంతుల జాబితాలో ఒకడయ్యాడు. నిర్మిత్ పారిఖ్ మొదలు పెట్టిన ఈ జాబ్ ప్లాట్ఫామ్ షాడోఫాక్స్, జొమాటో, ఢిల్లీవేరీ, G4S గ్లోబల్, బర్గర్ కింగ్ వంటి ఎన్నో కంపెనీలు ఉపయోగించుకున్నాయి. టెక్నాలజీలో మార్పు తీసుకురావడమే కాకుండా ఎంతో మందికి ఉపయోగపడాలని ఉద్దేశ్యంతో ప్రారంభించిన ఈ యాప్ అతన్ని కోట్లకు అధిపతిని చేసింది. (ఇదీ చదవండి: జిమ్నీ ప్రియులారా ఊపిరి పీల్చుకోండి.. లాంచ్ ఎప్పుడో తెలిసిపోయింది!) నిర్మిత్ పారిఖ్ 2023 మే నాటికి 1.1 బిలియన్ డాలర్ల సంపదకు నాయకుడయ్యాడు. అంటే ఇది భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 9,000 కోట్లకంటే ఎక్కువ. ఒక్క ఆలోచన అతని జీవితాన్నే మార్చేసింది, అతి తక్కువ కాలంలోనే అతని ఆదాయం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లింది. అప్నా యాప్ 10 కోట్లకు పైగా ఇంటర్వ్యూలను, ఒక కోటికి పైగా డౌన్లోడ్లను కలిగి ఉంది. నిర్మిత్ నిర్మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీర్ అండ్ అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ గ్రాడ్యుయేట్ స్కూల్ ఫర్ బిజినెస్ నుంచి MBA చదివారు. ఈయన కేవలం 21 సంవత్సరాల వయసులోనే ఇన్కోన్ టెక్నాలజీస్ అనే సంస్థను స్థాపించాడు. ఆ తరువాత అనేక సంస్థలలో ఉన్నతమైన పదవుల్లో పనిచేసి తరువాత ఒక యాప్ ద్వారా గొప్ప సక్సెస్ సాధించాడు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుస్కోవడానికిఇ సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ సందేహాలను, అభిప్రాయాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
ఇక ట్విటర్ కనిపించదు.. ఎందుకంటే?
ట్విటర్ కంపెనీని ఎలన్ మస్క్ సొంత చేసుకున్నప్పటి నుంచి అన్ని సమస్యలే! లెక్కకు మించిన ఉద్యోగులను ఇంటికి పంపించేశారు. లోగో విషయంలో కూడా సరైన నిర్ణయం తీసుకోలేకపోయాడు. పక్షి స్థానంలో కుక్కను.. కుక్క స్థానంలో పక్షిని చూపించి వినియోగదారులను సైతం కన్ఫ్యుస్ చేసేసారు. అయితే ఇప్పుడు ఏకంగా ట్విటర్ మాయం కానున్నట్లు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు క్షుణ్ణంగా ఈ కథనంలో చూసేద్దాం.. నివేదికల ప్రకారం, ట్విటర్ను ఎక్స్ అనే 'ఎవ్రీథింగ్ యాప్'లో విలీనం చేసినట్లు సంస్థ సీఈఓ ఎలాన్ మస్క్ వెల్లడించినట్లు తెలుస్తోంది. మంగళవారం ట్విటర్ బాస్ ఎలోన్ మస్క్ ఈ పరిణామాన్ని ధ్రువీకరించే ఉద్దేశంతో ‘ఎక్స్’ ఒకే అక్షరాన్ని ట్వీట్ చేశారు. మస్క్ ట్వీట్ చేసిన ఈ ఒక్క అక్షరం దేనిని సూచిస్తుందనే మీద సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. ఇది ట్విటర్ విలీనం కానున్న X Corp కంపెనీ అని భావిస్తున్నారు. ట్విటర్ కొనుగోలు ప్రక్రియ తుది దశలో ఉండగానే, ఎక్స్ యాప్కు సంబంధించిన ప్రణాళికలను మస్క్ వెల్లడించారు. గతంలో ఎక్స్ యాప్ అనేది నా దీర్ఘకాల వ్యాపార ప్రణాళిక అని, దీని రూపకల్పనను వేగవంతం చేసేందుకు ట్విటర్ చాలా ఉపయోగపడుతుందని, ట్విటర్ను కొనుగోలు చేస్తే ఎక్స్ కంపెనీ ఏకంగా మూడు నుంచి ఐదు ఏళ్ళు ముందుకు సాగుతుందని అక్టోబర్ 2022లో ట్వీట్ చేశారు. అదే ఇప్పుడు నిజం కానుంది. (ఇదీ చదవండి: పేరుకే యూట్యూబర్! నెల సంపాదన రూ. కోటి కంటే ఎక్కువ..) చైనాలో అందుబాటులో ఉన్న వీచాట్ మాదిరిగానే మెసేజింగ్, కాలింగ్ వంటి అనేక కార్యక్రమాలు ఒకే యాప్లో చేసుకునేలా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, అదే మా లక్ష్యం అని మస్క్ వెల్లడించారు. నిజానికి 1999లో ఈయన ఎక్స్ పేరుతో ఒక ఆన్లైన్ బ్యాంకు ఏర్పాటు చేశారు. ఆ తరువాత దానిని పేపాల్లో విలీనం చేశారు. ఆ తరువాత ఎక్స్.కామ్ కొనుగోలు చేశారు, ప్రస్తుతం ట్విటర్ను కొత్త సూపర్ యాప్ రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నారు. X — Elon Musk (@elonmusk) April 11, 2023 -
ఈ-కామర్స్ వ్యాపారంలోకి ఫోన్పే.. కొత్త యాప్ పేరు ఏంటంటే..
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్పే తాజాగా ఈ–కామర్స్ వ్యాపారంలోకి ప్రవేశించింది. పిన్కోడ్ పేరిట షాపింగ్ యాప్ను రూపొందించింది. తొలుత బెంగళూరులో ఈ యాప్ సర్వీసులు అందుబాటులో ఉంటాయని ఫోన్పే వ్యవస్థాపకుడు సమీర్ నిగమ్ తెలిపారు. రోజుకు 10,000 పైచిలుకు లావాదేవీలు సాధించిన తర్వాత ఇతర నగరాలకు కూడా దీన్ని విస్తరిస్తామని చెప్పారు. డిసెంబర్ నాటికి రోజుకు లక్ష లావాదేవీలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. వినియోగదారులకు సంబంధించి గత ఏడేళ్లలో ఫోన్పే నుంచి ఇది రెండో యాప్ అని చెప్పారు. కేంద్రం తీర్చిదిద్దిన ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ) ప్లాట్ఫాం ఆధారంగా పిన్కోడ్ యాప్ను రూపొందించారు. -
ట్విటర్కు పోటీగా బ్లూస్కై.. సరికొత్త ఫీచర్లు!
ట్విటర్కు పోటీగా మరో మైక్రోబ్లాగింగ్ సైట్ వస్తోంది. ట్విటర్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో జాక్డోర్సే ‘బ్లూస్కై’ అనే యాప్ బీటా వర్షన్ను తీసుకొచ్చారు. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ యాప్ యాపిల్ యాప్ స్టోర్లో ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. టెక్క్రంచ్ కథనం ప్రకారం.. బ్లూస్కై ప్రస్తుతం ఇన్వైట్-ఓన్లీ బీటా వర్షన్ అందుబాటులో ఉంది. ఫిబ్రవరి 17న అందుబాటులోకి వచ్చిన ఈ యాప్ను ఇప్పటివరకు 2 వేల మంది ఎంపిక చేసిన యూజర్లు ఇన్స్టాల్ చేసుకున్నట్లు డేటా.ఏఐ అనే యాప్ ఇంటెలిజెన్స్ సంస్థ పేర్కొంది. ట్విటర్ మాదిరిగానే బ్లూస్కై యూజర్ ఇంటర్ఫేస్ను కూడా చాలా సింపుల్గా రూపొందించారు. 256 అక్షరాల వరకు నిడివితో యూజర్లు చాలా తేలికగా పోస్ట్లు చేయొచ్చు. ప్లస్ బటన్ క్లిక్ చేయడం ద్వారా సులువుగా ఫొటోలు జోడించొచ్చు. ట్విటర్లో ఉన్న ‘వాట్ ఈజ్ హాపెనింగ్?’ అన్న ఆప్షన్కు బదులుగా ఇందులో ‘వాట్స్అప్?’ అనే ఆప్షన్ ఉంది. అలాగే బ్లూస్కైలో షేర్, మ్యూట్, బ్లాక్ అకౌంట్స్ వంటి ఆప్షన్స్తో పాటు కొత్తవారిని కూడా యాడ్ చేసే అడ్వాన్స్డ్ ఫీచర్ ఇందులో ఉంది. (ఇదీ చదవండి: లేఆఫ్స్ వేళ ఫ్రెంచ్ కంపెనీ సంచలనం.. కొత్తగా 12 వేల మందికి ఉద్యోగాలు!) యాప్ మధ్యలో ఇచ్చిన డిస్కవర్ ట్యాబ్ ద్వారా.. యూజర్లు ఎవరిని ఫాలో అవ్వాలి, సజెషన్స్, తాజా అప్డేట్స్ ఫీడ్ను తెలుసుకోవచ్చు.అలాగే నోటిఫికేషన్స్ ట్యాబ్ ద్వారా లైక్స్, రిపోర్ట్స్, ఫాలోస్, రిప్లయిస్ వంటివి చూసుకోవచ్చు. అయితే ఇందులో ప్రస్తుతానికి డెరెక్ట్ మెసేజ్ (డీఎం) ఫీచర్ లేదు. ట్విటర్ మాదిరిగానే బ్లూస్కైలో కూడా యూజర్లు సెర్చ్, ఫాలో, తమకు పోస్ట్లకు సంబంధించిన అప్డేట్లను హోం టైమ్లైన్లో చూసుకోవచ్చు. ఈ బ్లూస్కై ప్రాజెక్ట్ను 2019లోనే అభివృద్ధి చేసినప్పటికీ దీనిపై విస్తృతంగా పరిశోధనలు జరిపి, మరింతగా అభివృద్ధి చేసి 2022లో స్వతంత్ర కంపెనీగా ఆవిష్కరించారు. జాక్ డోర్సే ట్విటర్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఈ బ్లూస్కై గురించి ప్రస్తావించారు. ఆ తర్వాత 2022 అక్టోబర్లో ఏ యాప్తో అయినా సరే పోటీ విధింగా బ్లూస్కైని రూపొందిస్తున్నట్లు ట్విటర్ ద్వారా తెలియజేశారు. బ్లూస్కై గతేడాది 13బియన్ డాలర్ల నిధులను సమీకరించింది. -
Apple watch: బ్లడ్ గ్లూకోజ్ ట్రాకింగ్ ఇప్పుడు చాలా సింపుల్.. ఎలా?
మారుతున్న ప్రపంచంలో మనం వినియోగించే వస్తువులు కూడా అప్డేట్ అవుతూనే ఉన్నాయి, ఇప్పటికే అనేక ఆధునిక ఫీచర్స్తో అందుబాటులో ఉన్న యాపిల్ వాచ్ ఇప్పుడు బ్లడ్ గ్లూకోజ్ ట్రాకింగ్ చేయడానికి ఉపయోగపడేలా తయారైంది. నిజానికి షుగర్బాట్ అనేది ఐఫోన్ యాప్. ఇది వినియోగదారులు తీసుకునే ఆహారంలో ఉన్న షుగర్ లెవెల్స్ ట్రాక్ చేస్తుంది. ఎప్పటికప్పుడు షుగర్ లెవెల్స్ ట్రాక్ చేయడం వల్ల ఆరోగ్యం పట్ల మరింత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవచ్చు. వాచ్ఓఎస్ వెర్షన్తో వస్తున్న లేటెస్ట్ అప్డేట్తో ఆపిల్ వాచ్ వినియోగదారులు నేరుగా యాక్సెస్ చేయవచ్చు. ఇక మీరు యాపిల్ వాచ్తో క్యాలరీలు, షుగర్ లెవెల్స్ తెలుసుకోవడంలో షుగర్బాట్ ఎంతగానో సహాయపడుతుంది. తెలియని వారు కూడా సులభంగా షుగర్బాట్ ఉపయోగించవచ్చు. యాప్ ఓపెన్ చేసిన వెంటనే రోజులో తీసుకున్న ఆహారం గురించి ప్రస్తావించాలి, ఇందులో చికెన్ సూప్ నుంచి బిగ్ మ్యాక్ వరకు అనేక ఆహారాల డేటాబేస్ ఉంటుంది. (ఇదీ చదవండి: Zomato Everyday: హోమ్ స్టైల్ మీల్స్.. కేవలం రూ. 89 మాత్రమే) మీరు తీసుకున్న ఆహరం యాప్లో లేకపోతే చింతించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మాన్యువల్గా కూడా మీరు తీసుకున్న ఆహారం గురించి జోడించవచ్చు. ఈ యాప్ క్యాలరీలు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, సూక్ష్మపోషకాలు, విటమిన్లు వంటి డేటాకు సంబంధించిన అన్ని వివరాలు వెల్లడిస్తుంది. -
ఓలా, ఉబెర్కు ఊహించని దెబ్బ, దూసుకుపోతున్న ఆ యాప్
సాక్షి, బెంగళూరు: కర్నాటకలో యాప్ ఆధారిత క్యాబ్ సేవలు అందించే ఓలా, ఉబెర్, ర్యాపిడో ఊహించని దెబ్బపడింది. అధిక చార్జీలు, వ్యవహార తీరుతో తీవ్ర విమర్శల పాలై, అక్కడి సర్కార్ ఆగ్రహానికి గురైన దిగ్గజాలకు అనూహ్యంగా మరో షాక్ తగిలింది. బెంగుళూరు ఆటో రిక్షా డ్రైవర్లు సొంతంగా ఒక యాప్ను రూపొందించుకున్నారు. లాంచింగ్కు ముందే 'నమ్మ యాత్రి' అప్లికేషన్కు భారీ ఆదరణ లభిస్తోంది. బెంగళూరు ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ (ARDU) నవంబర్ 1న తన నమ్మయాత్రి సేవలను షురూ చేయనుంది. అయితే ఈ యాప్ ఇప్పటికే 10,000 డౌన్లోడ్స్ సాధించింది. అలాగే కస్టమర్లను ఆకట్టుకునేలా చార్జీలను నిర్ణయించారు. యూజర్ క్యాన్సిలేషన్ చార్జీలు లేకుండా, 30 రూపాయల కనీస ఫీజు ఫిక్స్ చేశారు. అయితే ప్రస్తుతానికి నగదు మాత్రమే స్వీకరిస్తున్నారు. ప్రత్యర్థులకు సమానమైన ఇంటర్ఫేస్తో 'సరసమైన ధరల' వద్ద సేవలను అందిస్తుండటం విశేషం. దీంతో ఈ యాప్ చాల బావుందంటూ పలువురు ప్రశంసిస్తున్నారు. ఇప్పటికే ఈ యాప్పై సోషల్ మీడియాలో రివ్యూలు వెల్లువెత్తాయి. పికప్, డ్రాప్ లొకేషన్లను సెట్ చేసిన తర్వాత, సమీపంలోని డ్రైవర్లు చార్జీని కోట్ చేస్తారు. సాధారణంగా పికప్ , డ్రాపింగ్ ప్లేస్ దూరాన్ని బట్టి అదనంగా 10-30 రూపాయల వరకు అదీ ప్రభుత్వం నిర్ణయించిన మేరకే చార్జీ వసూలు చేయనుంది చిన్మయ్ ధుమాల్ అనే దీనిపై ట్వీట్ చేశారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఆటో సర్వీసులపై విధించిన నిషేధంపై ఓలా, ఉబెర్, రాపిడోలకు కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది.దీనిపై మధ్యంతర స్టే విధిస్తూ తదుపరి విచారణను 2022, నవంబర్ 7కు వాయిదా వేసిసి సంగతి తెలిసిందే. Bangalore Auto Rickshaw Drivers launched their own application called 'Namma Yatri' to tackle unfair comission charges of Ola/Uber. - ₹30 fixed platform fees - No cancellation charges - Currently, Cash Only The app is beautiful and responsive. Bangalore is built different! pic.twitter.com/8J7OZIXcA1 — Chinmay Dhumal (@ChinmayDhumal) October 27, 2022 -
‘మీ4 టిక్ టిక్’ యాప్ లాంచ్.. టిక్ టాక్ను మరిపిస్తుందా?
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ టిక్ టాక్ ద్వారా యూత్ తమ టాలెంట్ను నిరూపించుకుంటూ ఎంతో పాపులర్ అయ్యేవారు. అయితే కొన్ని భద్రతా కారణాల రీత్యా కేంద్ర ప్రభుత్వం "టిక్ టాక్" ను బ్యాన్ చేసింది. దీంతో యువత ప్రత్యామ్నాయాలను ఎంచుకున్నప్పటికీ ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా "రియోజాన్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి "మీ 4 టిక్ టిక్" యాప్ ను ప్రముఖులు, యువత సమక్షంలో హైదరాబాద్లో ఘనంగా లాంచ్ చేసింది. ట్యాలెంటెడ్ యూత్ కు 'ME 4 టిక్ టిక్' యాప్ ఒక యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందని "ME 4 Tic Tic" యాప్ ఇండియా సీఈవో డీసతీష్ రెడ్డి వెల్లడించారు. అన్ని రకాల కంటెంట్ తో అందరినీ అలరిస్తుందన్నారు. ముఖ్యంగా స్వదేశీంలో భారత ఐటీ యువత రూపొందించిన "ME 4 టిక్ టిక్" హైలీ సెక్యూర్డ్ యాప్ అనీ ఇందులో ఉండే డేటా చాలా సేఫ్ అని కంపెనీ వెల్లడించింది. ఈ యాప్ 150 దేశాలలో అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా అమెజాన్ భాగస్వామ్యంతో అమెజాన్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ ఈ యాప్ ఉంటుందని, ఒక భారతీయుడిగా ఇండియాలో ఈ యాప్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా యాప్ రూపొందించిన టీంకు కృతజ్ఞతలు తెలిపిన పలువురు, యాప్ సక్సెస్ కావాలని కోరుకున్నారు. ఇదివరకు సినిమాలో ఏ క్యారెక్టర్ కు ఎవరు సూట్ అవుతారో ఫోటో షూట్ చూసి సెలెక్ట్ చేసేవారమనీ, సోషల్ మీడియా వచ్చిన తరువాత చాలామంది దర్శక, నిర్మాతలకు ఇపుడు ఆ పని ఈజీ అయ్యిందని సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, సినీ నిర్మాత సురేష్ కొండేటి వ్యాఖ్యానించారు. టిక్ టాక్కు ప్రత్యామ్నాయంగా వచ్చిన "ME4 టిక్ టిక్" యాప్ పెద్ద సక్సెస్ అవ్వాలన్నారు. -
TTD: టీటీడీ సేవలన్నింటికీ ఒకే యాప్
సాక్షి, తిరుమల(చిత్తూరు): తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అందించే సేవల వివరాలన్నీ ఒకే యాప్లో పొందు పరిచేందుకు జియో సంస్థతో దేవస్థానం అవగాహన ఒప్పందం కుదుర్చు కుంది. తిరుమల అన్నమయ్య భవన్లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి సమక్షంలో అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డి, జియో ప్రతినిధి అనీష్ ఒప్పందంపై సంతకాలు చేశారు. అనంతరం సుబ్బారెడ్డి మాట్లాడుతూ, కోవిడ్ పరిస్థితుల్లో శ్రీవారి దర్శనం కోసం ఆన్లైన్ ద్వారా పరిమిత సంఖ్యలో టికెట్లు జారీచేయడంతో ఒకేసారి లక్షలాది మంది భక్తులు ప్రయత్నించడంతో టీటీడీ సర్వర్లలో సమస్యలు తలెత్తాయని చెప్పారు. వీటిని అధిగమించేందుకు జియో సంస్థ సహకారం తీసుకున్నామన్నారు. టీటీ డీకి సంబంధించిన సమస్త సేవలు, సమాచారం ఒకేచోట లభించేలా జియో ప్రత్యేకంగా ఒక యాప్ తయారు చేయడానికి ముందుకొచ్చిందని ఆయన తెలిపారు. ఇందులో భక్తులకు అవసరమైన వసతి, దర్శనం లాంటి సకల సేవలు అందుబాటులో ఉంటాయ న్నారు. రాబోయే వైకుంఠ ఏకాదశి రోజున ఈ యాప్ను ఆవిష్కరించేలా ఏర్పాటు చేయాలని చైర్మన్ కోరారు. ఐదేళ్లుగా టీటీడీకి ఉచితంగా సాంకేతిక సహకారం అందిస్తున్న టీసీఎస్ సమన్వ యంతో జియో సంస్థ ఉచితంగా టీటీడీ ఐటీ విభాగానికి మెరుగైన సేవలు అందిస్తోందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. -
సోనూ సూద్ ‘ట్రావెల్’ యాప్
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న వ్యాపారులకు వ్యాపార అవకాశాలు కల్పించే దిశగా బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ట్రావెల్ యూనియన్ పేరిట బిజినెస్–టు–బిజినెస్ ట్రావెల్ టెక్నాలజీ ప్లాట్ఫాంను ఆవిష్కరించారు. ఐఆర్సీటీసీ దేశవ్యాప్తంగా నిర్వహించే రైళ్లు, దేశ..విదేశ రూట్లలో 500 పైచిలుకు ఫ్లయిట్లు, 10 వేల పైచిలుకు బస్సు ఆపరేటర్ల వాహనాల్లో టికెట్లతో పాటు హోటళ్లలో గదులను దీని ద్వారా బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులు తమ ప్రయాణాలను ముందస్తుగా ప్లాన్ చేసుకునే వెసులుబాటు అంతగా లేదని, ఒక్కో దానికోసం ఒక్కో ఆపరేటరును ఆశ్రయించాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు. ట్రావెల్ యూనియన్తో ఇలాంటి వాటన్నింటినీ చౌకగా ఒకే చోట పొందవచ్చని సోను సూద్ వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యాపారవేత్తలకు ఇది అదనపు ఆదాయ మార్గంగా ఉపయోగపడగలదని ఆయన పేర్కొన్నారు. ఈ ప్లాట్ఫాంలో చేరడానికి కట్టే నామమాత్రపు రుసుము రిఫండ్ అవుతుందని, తద్వారా ఉచితంగానే చేరినట్లవుతుందన్నారు. ట్రావెల్ యూనియన్లో సోనూ సూద్ రెండో అతి పెద్ద వాటాదారుగా ఉన్నారు. -
ఇ–రూపీ వచ్చేసింది..!
న్యూఢిల్లీ: ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల్లో పారదర్శకతను మెరుగుపరచడం, ప్రయోజనాలను నేరుగా లక్ష్యిత సేవలకు అందించడం లక్ష్యంగా కేంద్రం ‘ఇ–రూపీ’ని తీసుకొచ్చిం ది. వ్యక్తులు అలాగే నిర్దిష్ట ప్రయోజనాల కోసం వినియోగించే ఈ డిజిటల్ పేమెంట్ సొల్యూషన్ను సోమవారమిక్కడ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రస్తుతానికి ఇ–రూపీ సదుపాయం ఆరోగ్య సేవలకు అందుబాటులో ఉంటుంది, రానున్న కాలంలో ఇతర విభాగాలకు కూడా దీన్ని విస్తరించనున్నారు. ఆయుష్మాన్ భారత్, ఎరువుల సబ్సిడీ వంటి వాటికి కూడా కూడా దీన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. ‘ఇ–రూపీ ద్వారా డిజిటల్ పాలనలో దేశం సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది. డిజిటల్ లావాదేవీలు అలాగే ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ)ని మరింత సమర్థవంతంగా మార్చడంలో ఇ–రూపీ వోచర్ అద్భుతమైన పాత్రను పోషించబోతోంది. లక్ష్యిత వర్గాలందరికీ పారదర్శకమైన, లీకేజీ రహిత ప్రయోజనాలు అందించడంలో దోహదం చేస్తుంది‘ అని ఇ–రూపీ ప్రారంభం సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు. లీకేజీలకు అడ్డుకట్ట... ప్రభుత్వ ప్రయోజనాలను నిర్దేశిత లబ్ధిదారులకు, వృథా (లీకేజీ) రహితంగా. లక్ష్యిత వర్గాలకు చేరేవిధంగా పలు పథకాలను గత కొన్నేళ్లుగా కేంద్రం ప్రవేశపెడుతూనే ఉంది. ఇప్పుడు అందుబాటులోకి తెచ్చిన ఎలక్ట్రానికల్ వోచర్ అనేది సుపరిపాలన విజన్ను పెంపొందించడంలో మరింత తోడ్పాటును అందించనుంది. ఇది ఒక్క ప్రభుత్వానికి మాత్రమే సంబంధించినది కాదని, ప్రైవేటు సంస్థలు లేదా ఎవరికైనా తమ వైద్య చికిత్సలు, విద్య లేదా ఇతరత్రా ఎలాంటి పనులకైనా సరే సహాయం చేయాలనుకుంటున్న సంస్థలు నగదుకు బదులు ఇ–రూపీ రూపంలో ఇవ్వవచ్చని ప్రధాని వివరించారు. దీనివల్ల ఏ ప్రయోజనం కోసమైతే డబ్బును ఇచ్చారో, అదే పని కోసం కచ్చితంగా అది వినియోగించబడేందుకు వీలవుతుందని ఆయన పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ వంటి నిర్దిష్ట ప్రయోజనాలను అవసరమైన వారికి చేరువ చేసేందుకు ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు ఈ లీకేజీ రహిత యంత్రాంగాన్ని ఉయోగించుకోవచ్చని వివరించారు. రాష్ట్రాలు కూడా సంక్షేమ పథకాలను నిర్దేశిత లబ్ధిదారులకు చేరువ చేసేందుకు ఇ–వోచర్ను వినియోగించుకోవాల్సిందిగా ప్రధాని సూచించారు. ప్రైవేటు రంగం సైతం తమ ఉద్యోగుల సంక్షేమం, కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యకలాపాలకు ఈ డిజిటల్ వోచర్ల ప్రయోజనాలను వాడుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. వంట గ్యాస్, రేషన్ సరుకులు అలాగే ఇతరత్రా సంక్షేమ పథకాలకు సంబంధించి సబ్సిడీ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి వేయడం (డీబీటీ) ద్వారా భారీగా లీకేజీలకు అడ్డుకట్ట వేయగలిగామని, అదేవిధంగా నకిలీ లబ్ధిదారులను ఏరివేయగలిగామని ప్రధాని పేర్కొన్నారు. ప్రభుత్వం రూ.1.78 లక్షల కోట్ల మొత్తాన్ని ఆదా చేయడంలో ఇది ఎంతగానో తోడ్పడిందని ఆయన చెప్పారు. కరోనా లాక్డౌన్ సమయంలో డీబీటీ ఎంతగా ఉపయోగపడిందనేది ప్రధాని వివరిస్తూ... జామ్ (జన్ధన్ ఖాతా, మొబైల్ ఫోన్, ఆధార్ కార్డు)తో డిజిటల్ ఇండియా అనుసంధానం వల్ల ఒక్క క్లిక్తో నేరుగా కోట్లాది మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదును బదిలీ చేసేందుకు తోడ్పడిందని చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఇప్పటికీ దీని కోసం భౌతిక వ్యవస్థను ఉపయోగించుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. డీబీటీ ప్లాట్ఫామ్ ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పటివరకూ కేంద్రం అందిస్తున్న 300కు పైగా స్కీములకు రూ.17.5 లక్షల కోట్లను నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేసినట్లు ప్రధాని వెల్లడించారు. ‘వంట గ్యాస్ సబ్సిడీ, పెన్షన్లు, పీఎం కిసాన్ యోజన, స్కాలర్షిప్లు వంటి వాటి కోసం దాదాపు 90 కోట్ల మంది ఈ డీబీటీ ప్లాట్ఫామ్ ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. దీనివల్ల ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ సొమ్ము అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లకుండా అడ్డుకట్ట వేయడం ద్వారా రూ.1.78 లక్షల కోట్లు ఆదా అయింది’ అని చెప్పారు. సేవల కల్పనలో నవకల్పనలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం విషయానికొస్తే, ప్రపంచవ్యాప్తంగా సంపన్న దేశాలన్నింటితో పాటు భారత్ కూడా ప్రపంచ నాయకత్వాన్ని అందించే సత్తాను సొంతం చేసుకుందని ప్రధాని పేర్కొన్నారు. -
యూట్యూబ్ చేతికి సిమ్సిమ్ యాప్
న్యూఢిల్లీ: వీడియో షేరింగ్ వెబ్సైట్ యూట్యూబ్ తాజాగా భారత్కు చెందిన వీడియో ఈ–కామర్స్ ప్లాట్ఫాం సిమ్సిమ్ యాప్ను కొనుగోలు చేసింది. దేశీయంగా చిన్న వ్యాపార సంస్థలు, రిటైలర్లను కొత్త కస్టమర్లకు చేరువ చేసేందుకు ఈ డీల్ తోడ్పడగలదని యూట్యూబ్ మాతృసంస్థ గూగుల్ తెలిపింది. అయితే, ఇందుకోసం ఎంత వెచ్చిస్తున్నదీ మాత్రం వెల్లడించలేదు. మరికొన్ని వారాల్లో కొనుగోలు లావాదేవీ పూర్తి కాగలదని సంస్థ తెలిపింది. సిమ్సిమ్ యాప్లో ఎటువంటి మార్పులు ఉండవని, ఇకపైనా స్వతంత్రంగానే కార్యకలాపాలు కొనసాగిస్తుందని గూగుల్ పేర్కొంది. సిమ్సిమ్ ఆఫర్లను యూట్యూబ్ వీక్షకులకు ఏ విధంగా చూపవచ్చన్న దానిపై కసరత్తు చేస్తున్నామని తెలిపింది. స్థానిక వ్యాపార సంస్థలు, ప్రభావితం చేసేవారు, కస్టమర్లను సిమ్సిమ్ అనుసంధానిస్తుంది. స్థానిక వ్యాపార సంస్థల ఉత్పత్తుల గురించి క్రియేటర్లు ..ఇందులో వీడియో రివ్యూలు ఉంచుతారు. వీక్షకులు ఆయా ఉత్పత్తులను నేరుగా యాప్ నుంచే కొనుగోలు చేయవచ్చు. ఇందులోని వీడియోలు ప్రస్తుతం హిందీ, తమిళం, బెంగాలీ భాషల్లో ఉంటున్నాయి. యూజర్లు ఆన్లైన్లో సులభతరంగా కొనుగోళ్లు చేసేందుకు, విక్రేతలు తమ ఉత్పత్తులను ప్రదర్శించేందుకు సిమ్సిమ్ను ప్రారంభించినట్లు సంస్థ సహ వ్యవస్థాపకులు అమిత్ బగారియా, కునాల్ సూరి, సౌరభ్ వశిష్ట ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. -
జర్నలిస్టుల కోసం సుప్రీంకోర్టు ప్రత్యేక యాప్
న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో సమావేశాలను జూమ్లో, విద్యార్థులకు చదువులు ఆన్లైన్లో..ఇలా ప్రతీది ఆన్లైన్ బాటలో నడుస్తున్నాయి. ఈ క్రమంలో సుప్రీంకోర్టు వర్చువల్ విధానంలో విచారణలు జరుపుతుండగా...జర్నలిస్టుల కోసం కూడా ఓ ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్ను సీజేఐ జస్టీస్ ఎన్.వి.రమణ ప్రారంభించారు. యాప్ ప్రారంభం అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇది జర్నలిస్టులకు ఎంతో ఉపయోగపడనుందని గతంలోను ఓ జర్నలిస్టుగా బస్సులో తిరుగుతూ వార్తలు సేకరించిన రోజులు గుర్తున్నాయని సీజేఐ ఈ సందర్భంగా అన్నారు. సుప్రీం కోర్టు విచారణలను జర్నలిస్టులకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి సుప్రీంకోర్టు ఇ-కమిటీ చొరవతో ఈ యాప్ని విడుదలు చేస్తున్నామని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి రమణ అన్నారు. కోర్టు విచారణలు ప్రత్యక్ష ప్రసారం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తామని ఆయన అన్నారు. కోర్టు ప్రత్యక్ష కార్యకలాపాలను ప్రసారం చేసేలా ఓ ట్రయల్ ప్రతిపాదనను కూడా సుప్రీంకోర్టు పరిశీలిస్తోందని తెలిపారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కోర్టు విచారణలను పలువురు జర్నలిస్టులు వర్చువల్ ద్వారా జరపాలని కోరిన తరువాత యాప్ను రూపొందించారు. ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ వినియోగదారుల ఈ యాప్ కోసం గూగుల్ ప్లే స్టోర్లోని యాప్ ద్వారా విచారణలను ప్రత్యక్షంగా హాజరయ్యే వీలు కల్పించనున్నారు. ( చదవండి: కోవిడ్ మరణాల్లో మరో రికార్డు ) Breaking: Supreme Court to launch app that will provide links for virtual hearings to media persons#SupremeCourt #VirtualHearings #media https://t.co/xoFpobyCOo pic.twitter.com/I2CKKneZto — Bar & Bench (@barandbench) May 13, 2021 -
సిగ్నల్ యూజర్లకు గుడ్ న్యూస్ : వాట్సాప్కు ఝలక్
సాక్షి,న్యూఢిల్లీ: ఫేస్బుక్ యాజమాన్యంలోని ప్రముఖ మేసేజింగ్ యాప్ వాట్సాప్లో కొత్త నిబంధనలు, గోప్యతా విధానాల మార్పుల ఆందోళనల నేపథ్యంలో మరో మెసేజింగ్ యాప్ సిగ్నల్ కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. దేశీయంగా వాట్సాప్కు ప్రత్యర్థిగా దూసుకొస్తున్న సిగ్నల్ వినియోగదారులను తనవైపు తిప్పుకునేందుకు వాట్సాప్ తరహాలో ఈ ఫీచర్లను తన యూజర్ల సౌలభ్యం కోసం విడుదల చేసింది. తాము ఎలాంటి యూజర్ డేటాను సేకరించమని ఇండియాతో పాటు, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు నిర్భయంగా వాడుకోవచ్చని సిగ్నల్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బ్రియాన్ ఆక్టన్ ప్రకటించారు. ఇంత తక్కువ వ్యవధిలో తమకు లభించిన ఆదరణ దీనికి నిదర్శమన్నారు. సిగ్నల్ యూజర్లు ప్రతీ ఒక్కరి భద్రతకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. కాగా వాట్సాప్ కొత్త ప్రైవసీ విధానాన్ని అమలు చేయనున్న నేపథ్యంలో కోట్లాదిమంది వినియోగదారులు వాట్సాప్పై గుర్రుగా ఉన్నారు. ఫలితంగా ప్రత్యామ్నాయాలపై దృష్టి మళ్లిస్తున్నారు. దీంతో టెలిగ్రామ్, సిగ్నల్ లాంటి యాప్లు ఇప్పటికే మార్కెట్లో ఉన్నప్పటికీ, తాజాగా వీటికి మైగ్రేట్ అవుతున్న క్రమంగా పెరుగుతోంది. వినియోగదారుల డేటాకుఎలాంటి ఢోకా లేదు అని వాట్సాప్ హామీ ఇచ్చినప్పటికీ ఈ పరంపరం కొనసాగుతోంది. దీన్ని క్యాష్ చేసుకునేందుక సిగ్నల్ శరవేగంగా పావులు కదుపుతోంది. వాట్సాప్ పోలీన ఫీచర్లతో దూసుకొస్తోంది. సిగ్నల్లో కొత్త ఫీచర్లు చాట్ వాల్ పేపర్: వాబేటా ఇన్ఫో సమాచారం ప్రకారం తాజా బీటా నవీకరణలో, సిగ్నల్ క్రొత్త ఫీచర్లను విడుదల చేసింది, ఇది వినియోగదారులను చాట్ వాల్పేపర్ను మార్చడానికి వీలు కల్పిస్తుంది. ఈ ఫీచర్ ఇప్పటివరకు సిగ్నల్ యాప్లో అందుబాటులో లేదు. స్టేటస్ అప్డేట్: వాట్సాప్ మాదిరిగానే, సిగ్నల్ ఇప్పుడు స్టేటస్ అప్డేట్ను తీసుకొచ్చింది. యానిమేటెడ్ స్టిక్కర్లు: వాట్సాప్లో లభించే యానిమేటెడ్ స్టిక్కర్లను కూడా సిగ్నల్ లాంచ్ చేసింది. "తాజా నవీకరణ మొదటి అధికారిక యానిమేటెడ్ స్టిక్కర్ ప్యాక్" డే బై డే "తో పాటు యానిమేటెడ్ స్టిక్కర్లను ఫఫ్రెండ్స్తో షేర్ చేసుకోవచ్చు. అలాగే డెస్క్ టాప్ నుండి యానిమేటెడ్ స్టిక్కర్లను క్రియేట్ చేసుకోవచ్చు. గ్రూప్కాల్స్ : సిగ్నల్లో గ్రూప్ కాల్ ఫీచర్ ఉంది, కానీ ఐదుగురు పాల్గొనేందుకుమాత్రమే ఇప్పటిదాకా అనుమతి. ఈ పరిమితిని ప్రస్తుతం వాట్సాప్ మాదిరిగానే ఎనిమిదికి పెంచింది. గ్రూప్ ఇన్వైట్ లింక్: గ్రూపులలో చేరేందుకు, ఇతర సిగ్నల్ వినియోగదారులను ఆహ్వానించడానికి సిగ్నల్ ఇప్పుడు గ్రూప్ ఇన్వైట్ లింక్ యాడ్ చేయడానికి అనుమతిస్తుంది. -
భారత బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల కొత్త ప్రయత్నం
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ క్రీడాకారులు కీలక మ్యాచ్లకు ముందు తీవ్ర ఒత్తిడికి లోను కావడం, మ్యాచ్లో ఒకవేళ ఓటమి ఎదురైతే కుంగిపోవడం తరచుగా జరుగుతుంది. ఎలాంటి ఆందోళనకు లోను కాకుండా ఆటను ఆటగానే చూడాలంటే మానసికంగా ఎంతో దృఢత్వం అవసరం. ఇందు కోసం ధ్యానం ఎంతో సహకరిస్తుందని భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ చెబుతున్నారు. అందు కోసం స్వయంగా తానే మెంటల్ ఫిట్నెస్ ట్రైనర్గా మారి సూచనలివ్వబోతున్నారు. ఇందు కోసం ఆయన ‘ధ్యాన ఫర్ స్పోర్ట్స్’ అనే యాప్ను ప్రత్యేకంగా రూపొందించారు. ఏడాది క్రితం గోపీచంద్ స్వయంగా ప్రారంభమైన ‘ధ్యాన’ యాప్లోనే ఇప్పుడు ప్రత్యేకంగా క్రీడాకారుల కోసం మెడిటేషన్ కార్యక్రమాన్ని సిద్ధం చేశారు. దేశంలోని ప్రఖ్యాత షట్లర్లు ఇప్పటికే దీనిని అనుసరిస్తున్నారని, ఇతర క్రీడాకారులకు కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని గోపీచంద్ వెల్లడించారు. ఒక ఆటగాడిగా తాను అన్ని అంశాలపై అధ్యయనం చేసిన తర్వాత ఈ మెడిటేషన్ యాప్ను రూపొందించామని, చాంపియన్లుగా మారే క్రమంలో మానసిక ప్రశాంతత కీలక పాత్ర పోషిస్తుందని కూడా ఆయన అన్నారు. ‘ధ్యాన ఫర్ స్పోర్ట్స్’లో పది రకాల వేర్వేరు సెషన్లు అందుబాటులో ఉన్నాయి. ‘ధ్యాన’ ద్వారా మెడిటేషన్లో భాగమయ్యేందుకు ఉపయోగించాల్సిన ప్రత్యేక కిట్ అమెజాన్లో లభిస్తుందని గోపీచంద్ చెప్పారు. మీడియా సమావేశంలో గోపీతో పాటు అవంతరి టెక్నాలజీస్ ఎండీ భైరవ్ శంకర్, భారత అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ పాల్గొన్నారు. -
క్రికీతో జియో కొత్త రియాలిటీ గేమింగ్ యాప్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ అగ్మెంట్ రియాలిటీ మొబైల్ గేమింగ్ సంస్థ క్రికీ, జియోతో కలిసి కొత్తగా రియాలిటీ గేమింగ్ యాప్ యాత్రను భారత్లో ప్రారంభించింది. ఇందుకోసం జియో కూడా సిరీస్ ఎ ఫండింగ్ రౌడ్కు నాయకత్వం వహించి దాదాపు 22 మిలియన్ డాలర్లను క్రికీకు ఇచ్చింది. ఈ యాప్లో జియోతో కలిసి భారతదేశంలో ప్రారంభించిన సందర్భంగా క్రికీ వ్యవస్థాపకులు జాన్వీ, కేతకి శ్రీరామ్లు మాట్లాడుతూ.. ‘ఆన్లైన్ గేమింగ్ ప్రియులకు మరింత వినోదాన్ని అందించేందుకు మా క్రికీ యాప్ ప్రేరణ ఇచ్చింది. అందుకే ఆన్లైన్ ఆటగాళ్ల కోసం కొత్తగా యాత్ర యాప్ను ప్రారంభించాం. మీ మొబైల్లో గేమ్ ఆడుతున్నసమయంలో ఈ యాప్ మిమ్మల్ని ఆటలో లీనం చేస్తుంది. ఎ విధంగా అంటే ఈ యాప్ను త్రిడీలో రూపోందించినందున ఇందులో గేమ్ మీకు వాస్తవిక భావన కలిగిస్తుంది. కేవలం మీ మొబైల్ కెమెరాతో ఆటగాళ్లను యాక్షన్, ఆడ్వెంచర్లతో ఫాంటసీ ప్రపంచాన్ని మీ ఇంటికే తీసుకువస్తుంది. అయితే అగ్మెంట్ రియాలిటీ గేమ్లో రాక్షసుడు సైన్యాన్ని ఓడించే ప్రయత్నం చేయడం, బాణం, విల్లు చక్రం, మెరుపు, ఫైర్ బోల్ట్ వంటి ఆయుధాలను ఉపయోగించి ఆటగాళ్లంతా ఇందులో పాల్గొనవచ్చు. ఈ రియాలిటీ గేమ్ అంతా త్రీడిలో ఉన్నందున యాత్ర యూజర్లంతా ఈ ఆటలో వాస్తవంగా పాల్గొన్న అనుభూతిని ఇస్తుంది’ అని వారు చెప్పుకొచ్చారు. ఇక ఆటగాళ్లు తమ ఆటను స్నేహితులతో పంచుకునే ఆప్షన్ కూడా ఉంది. మీ గేమ్ పూర్తి కాగానే వీడియో ఫేరింగ్ ఆప్షన్తో పాటు ఇతరులు పోస్టు చేసిన గేమ్ వీడియోను కూడా చూడటానికి వీడియో ఫీడ్ ఆప్షన్ ఉంటుంది. అలాగే తిరిగి అదే గేమ్ను ఆడేందుకి డిజిటల్ గ్రౌండ్ ఆప్షన్ సౌకర్యం కూడా ఉందని వారు పేర్కొన్నారు. అయితే జియో మొబైల్ యూజర్లకు మాత్రం కొన్ని అదనపు ఫిచర్లను అందిస్తున్నట్లు వారు స్పష్టం చేశారు. అవి: 3డీ అవతార్ ఫీచర్, గెమ్ప్లే టోకెన్లు(అదనపు ఆయుధాలు, పవన్ ఆన్లాక్ చేయడం), గేమ్ ప్లేస్లు. అదే విధంగా దీనిపై జియో డైరెక్టర్ ఆకాష్ అంబానీ మాట్లాడుతూ.. ‘‘ఆగ్మెంటెడ్ రియాలిటీ గేమ్తో క్రికీ ఒక తరం భారతీయులను ప్రేరేపిస్తుందని, ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన అనుభవనాలను భారతీయులకు అందించేందుకు ఈ యాత్ర యాప్ మా దృష్టి ఆకర్షించిందన్నారు. ఈ యాప్ వినియోగాదారులంతా రియాలిటి గేమ్లో మంచి అనుభూతిని పొందుతారని, కాబట్టి ఆన్లైన్ గేమ్ ప్రియులంతా ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకుని ఫాంటసీ అనుభవాన్ని పొందాలని పిలుపునిచ్చారు. ఆగ్మెంటెడ్ రియాలిటీ గేమింగ్తో ఆటగాళ్లంత తమ స్వంత ప్రపంచ అనుభూతిని పొందడానికి యాత్ర యాప్ ఆక్సెస్ను జియో యూజర్లతో పాటు, జియోతర మొబైల్ యూజర్లకు కూడా కల్పిస్తున్నాం’ అని ఆకాష్ తెలిపారు. అయితే ఈ క్రికీ యాప్ ఇప్పడు ఐఓసీ(ios) యాప్ స్టోర్లతో పాటు గూగుల్ ప్లే స్టోర్లలో ఉచితంగా అందుబాటులోకి తెచ్చారు. -
జీహెచ్ఎంసీ: గ్రేటర్ ఓటర్ల కోసం కొత్త యాప్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ ఓటర్లకు శుభవార్త. ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ ఓటు ఓటు హక్కు వినియోగించుకునే వారు తమ ఓటరు స్లీప్తో పాటు పోలీంగ్ బూత్ను అరచేతిలోనే తెలుసుకునేందుకు జీహెచ్ఎంసీ కొత్త యాప్ను రూపొందించింది. దీంతో మీ స్మార్ట్ఫోన్లోనే ఒటరు స్లీప్తో పాటు, పోలింగ్ కేంద్రం ఎక్కడుందో గూగుల్ మ్యాప్తో తెలుసుకునేందుకు జీహెచ్ఎంసీ ఓటర్ల కోసం మైజీహెచ్ఎంసీ యాప్ను ప్రత్యేకంగా రూపొందించింది. ఇప్పటికే నగరంలోని ఓటర్లకు ఓటరు స్లీప్ల పంపిణిని జీహెచ్ఎంసీ చేపట్టింది. అయితే, నగర ఓటర్లలో అధిక శాతం మందికి మొబైల్ ఫోన్లు ఉండడంతో అర చేతిలోనే ఓటరు పోలింగ్ బూత్, ఓటర్ స్లిప్ను డౌన్లోడ్ చేసుకునే విధంగా ఈ మొబైల్ యాప్ను రూపొందించింది. అయితే అది తెలుసుకోవాలంటే మీ ఆండ్రాయిడ్ మొబైల్ యాప్లో మైజీహెచ్ఎంసీ యాప్ను లౌన్లోడ్ చేసుకోవాలి. (చదవండి: ఓటరు కార్డు లేదా.. అయితే ఇవి తెచ్చుకోండి) యాప్లోకి వెళ్లి నో-యువర్ పోలింగ్ స్టేషన్ అప్షన్పై క్లిక్ చేసి ఓటరు పేరు, వార్డు పేరు ఎంటర్ చేస్తే ఓటరు స్లిప్తో పాటు పోలింగ్ బూత్ ఎక్కడుందో గూగుల్ మ్యాప్ లొకేషన్ వస్తుంది. పేరుకు బదులుగా ఓటర్ గుర్తింపు కార్డు నెంబర్, వార్డు పేర్లు ఎంటర్ చేసినా ఓటర్ స్లిప్, పోలింగ్ కేంద్రం గూగుల్ మ్యాప్లో చూపిస్తుంది. ఈ నో-యువర్ పోలింగ్ స్టేషన్ యాప్పై చైతన్యం కలిగించేందుకు జీహెచ్ఎంసీ పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టింది. బస్ షెల్టర్లపైనా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం, ఎఫ్ఎం రేడియోలలో జింగిల్స్ ప్రసారం, టెలివిజన్ చానెళ్లలో స్క్రోలింగ్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే, ఈ యాప్పై స్థానిక కాలనీ సంక్షేమ సంఘాలకు వాట్సాప్ ద్వారా సమాచారం అందిస్తున్నారు. (చదవండి: కేసీఆర్ ‘గ్రేటర్’ సభ : ఎల్బీ స్టేడియం గులాబీమయం) -
ఏపీ పోలీస్ సరికొత్త యాప్
-
ఫేస్బుక్, వాట్సాప్లకు ధీటుగా ‘బిగ్రాఫి’
చెన్నై: ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలకు సవాలు విసిరేలా బిగ్రాఫి అనే యాప్ను తమిళనాడు తేనికి చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి రూపొందించి పలువురి ప్రశంసలు అందుకుంటున్నాడు. తేని, కర్నల్ జాన్ బెన్నిక్విక్నగర్ ప్రాంతానికి చెందిన బాలమురుగన్ (45), జయమణి దంపతుల కుమారుడు మిధున్ కార్తిక్ (13) కుమార్తె కనిష్కాశ్రీ (10). ఇరువురూ ప్రైవేటు పాఠశాలలో ఎనిమిది, ఐదో తరగతి చదువుతున్నారు. కరోనా వైరస్ కారణంగా గత ఐదునెలలుగా పాఠశాలలు తెరవనందున ఇంట్లో ఉన్న మిధున్ కార్తిక్ ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలకు ప్రత్యామ్నాయంగా బిగ్రాఫి అనే కొత్త యాప్ను ఆవిష్కరించాడు. లడాక్ సరిహద్దు వివాదంతో చైనా టిక్టాక్, హలో యాప్ల వినియోగానికి కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో మిధున్ కార్తిక్ బిగ్రాఫి యాప్ను కనుగొన్నాడు. (ఫేస్బుక్ను బీజేపీ నియంత్రిస్తోంది: రాహుల్) దీనిగురించి మిధున్ కార్తిక్ మాట్లాడుతూ పూర్తిగా భద్రతా అంశాలతో రూపొందించబడిన బిగ్రాఫి యాప్లో సంబంధిత వ్యక్తుల అనుమతి లేకుండా ప్రవేశించలేమని అన్నాడు. సమాచారం చోరీ, పేజీ హ్యాకింగ్కు వీలులేని విధంగా రూపొందించినట్లు పేర్కొన్నాడు. మొదటి విడతగా మెసేజ్ షేరింగ్, ఫోటో అప్లోడ్, షేరింగ్, లైక్ చేయడం, అభిప్రాయం వ్యక్తం చేయడం వంటి అంశాలున్నట్లు తెలిపాడు. వినియోగదారులు తమ ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ ప్లేస్టోర్లో బిగ్రాఫి యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చన్నాడు. ప్రస్తుతం ఆరు వేల మందికి పైగా తన యాప్ను వినియోగిస్తున్నట్లు తెలిపాడు. మిధున్ కార్తిక్ తండ్రి బాలమురుగన్ మాట్లాడుతూ మిధున్ కార్తిక్కు చిన్ననాటి నుంచే కంప్యూటర్లో ఆసక్తి అధికమని, దీంతో ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాడని తెలిపారు. యోగా వెబ్సైట్ కూడా రూపొందించినట్లు తెలిపారు. (గురుకుల విద్యార్థులకు వాట్సాప్ క్లాసులు ) -
రైల్వే ప్రయాణికుల టికెట్ తనిఖీ కోసం కొత్త యాప్
ముంబై: కరోనా వైరస్ మానవుని జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చిందనడంలో సందేహం లేదు. అలానే సరికొత్త టెక్నాలజీలను కూడా మానవాళికి పరిచయం చేస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజురోజుకూ కోరలు చాస్తున్న నేపథ్యంలో రైల్వేశాఖ ప్రయాణికుల టికెట్ల తనిఖీ కోసం 'చెక్ఇన్ మాస్టర్' పేరుతో ఓ యాప్ను తీసుకొచ్చింది. ఈ యాప్ను ఉపయోగించి ప్రయాణికుల వద్దనున్న టికెట్ను తాకకుండా టికెట్ కండక్టర్లు వారి మొబైల్ ఫోన్లతో బార్ కోడ్, క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసి తనిఖీ చేస్తారు. ఈ విధానాన్ని తొలుత ప్రయోగాత్మకంగా ముంబైలోని ఛత్రపతి శివాజి మహారాజ్ టెర్మినల్ స్టేషన్లో ప్రారంభించారు. కాగా.. టికెట్ల తనిఖీ సమయంలో రైల్వే సిబ్బందికి కరోనా సోకకుండా ఉండేందుకే ఈ యాప్ను ప్రవేశపెట్టినట్లు ముంబై రైల్వేశాఖ వర్గాలు వెల్లడించాయి. (2023లో మొదటి దశ ప్రైవేట్ రైళ్లు) -
టార్గెట్ టిక్టాక్: యూట్యూబ్ టెస్టింగ్
సాక్షి, న్యూఢిల్లీ : చైనా బ్యాన్, చైనా యాప్స్ తొలగింపు ప్రచారం ఊపందుకున్న సమయంలో యూట్యూబ్ వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు కొత్త ఫీచర్తో యూట్యూబ్ రాబోతోంది. పాపులర్ వీడియో ప్లాట్ఫామ్, చైనాకు చెందిన టిక్టాక్ మాదిరిగానే సరికొత్త ఫీచర్ను యూట్యూబ్ త్వరలోనే లాంచ్ చేయనుంది. గూగుల్ యాజమాన్యంలోని వీడియో ప్లాట్ఫాం క్రొత్త ఫీచర్ను పరీక్షిస్తోంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐవోఎస్ రెండిండిలోనూ దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్టు యూట్యూబ్ వెల్లడించింది. అయితే ఇందులో 15 సెకన్ల వీడియో పోస్ట్ చేయడానికి మాత్రమే అనుమతి ఉంది. తమ వెబ్సైట్లో ఈ ఫీచర్ను పరీక్షిస్తున్నట్లు యూట్యూబ్ ప్రకటించింది. పరీక్షల అనంతరం దీన్ని భారీగా లాంచ్ చేయనున్నామని తెలిపింది. గరిష్టంగా 15 సెకన్ల వరకు వీడియోలను పోస్ట్ చేయవచ్చు. ఒకేసారి ఎక్కువ వీడియోలను అప్లోడ్ చేయాలనుకుంటే, ఫోన్ గ్యాలరీ నుండి నేరుగా అప్లోడ్ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. అయితే టిక్టాక్ మాదిరిగా ఫిల్టర్లు, మ్యూజిక్ సపోర్ట్ లభిస్తుందా అనే దానిపై స్పష్టత లేదు. టిక్టాక్ లేదా ఇతర ఆధునిక చిన్న వీడియో యాప్ లలో కూడా వీడియో కంటెంట్ లిమిట్ ఎక్కువ ఉండటంతోపాటు, ఏఆర్ ఎడిటింగ్ ఎఫెక్టులతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూట్యూబ్ దీన్ని మరింత మెరుగుపర్చకపోతే, స్టోరీస్ ఫీచర్ లాగా మరచిపోవడం ఖాయమని టెక్ పండితులు భావిస్తున్నారు. కాగా షార్ట్స్ పేరుతో టిక్టాక్ లాంటి యాప్ను యూట్యూబ్ త్వరలో తీసుకురానుందని ఏప్రిల్ నెలలో పలు నివేదికలు వెలువడిన సంగతి తెలిసిందే. ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ఫీచర్లను అనుకరించడం యూట్యూబ్కి ఇదే మొదటిసారి కాదు. గతంలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం, స్నాప్చాట్ తరహాలో స్టోరీస్ అప్డేట్ ఫీచర్ రీల్స్ ను ప్రవేశపెట్టింది. కానీ దీనికి పెద్దగా ఆదరణ లభించలేదు. అటు ఫేస్ బుక్ కూడా టిక్ టాక్ మాదిరిగానే లాస్సో అనే యాప్ను తీసుకురానుందని తెలుస్తోంది. చదవండి : గణేష్ విగ్రహాలు కూడా చైనా నుంచేనా: నిర్మలా సీతారామన్ చైనా ఉత్పత్తుల బహిష్కరణ సాధ్యమేనా? -
కరోనా : కొత్త యాప్ ప్రారంభించిన ఢిల్లీ సీఎం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హాస్పిటల్ బెడ్స్, ఇతర సమాచారం కోసం ‘‘ఢిల్లీ కరోనా" యాప్ ను మంగళవారం ప్రారంభించారు. కరోనా కంటే నాలుగు అడుగులు తమ ప్రభుత్వం ముందే ఉందని, ఆందోళన అవసరం లేదని మరోసారి పునరుద్ధాటించారు. తాజా వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఢిల్లీ సీఎం ఈ యాప్ను లాంచ్ చేశారు. కరోనా బారిన పడిన వారి చికిత్స, ఆసుపత్రిలోకావాల్సిన సౌకర్యాలపై అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే.. ఏయే హాస్పిటల్లో ఎన్నెన్ని పడకలు ఖాళీగా ఉన్నాయో లాంటి వివరాలు లభిస్తాయని తెలిపారు. కోవిడ్-19 రోగులకు ఆసుపత్రి పడకలు, వెంటిలేటర్లను ట్రాక్ చేయడానికి ఈ మొబైల్ అప్లికేషన్ను తీసుకొచ్చామని కేజ్రీవాల్ చెప్పారు. ఇది ఢిల్లీ ప్రజలందరికీ ఆసుపత్రి పడకలు, ఇతర అవసరాల లభ్యతమై సమాచారాన్ని అందిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసులు పెరుగుతున్నాయి, కానీ ఆసుపత్రులలో పడకలు, ఐసీయూ, ఆక్సిజన్ సహాయానికి తగిన ఏర్పాట్లు ఉన్నాయి కనుక ఆందోళన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఒకవేళ ఆసుపత్రిలో బెడ్ లభ్యత విషయంలో ఏదైనా సమస్య ఏర్పడితే ప్రజలు హెల్ప్లైన్ నెం. 1031కు కాల్ చేయవచ్చని ముఖ్యమంత్రి వెల్లడించారు. వెంటనే వారికి ఒక ఎస్ఎంఎస్ వస్తుందని వివరించారు. అంతేకాదు యాప్ అందుబాటులో లేనివారికోసం ఒక వెబ్సైట్ కూడా తీసుకొచ్చినట్టు తెలిపారు. దీంతోపాటు వాట్సాప్ నెంబరు ద్వారా కూడా సమాచారాన్ని పొందవచ్చన్నారు. ఢిల్లీలో మొత్తం 302 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయనీ, వీటిలో 210 ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఈ యాప్లో సమాచారాన్ని రోజుకు రెండుసార్లు, ఉదయం 10, సాయంత్రం 6 గంటలకు అప్డేట్ చేస్తామని దీంతో ప్రజలకు తాజా వివరాలు అందుబాటులో ఉంటాయన్నారు. #WATCH If a hospital refuses to provide you bed even when our app shows beds are available in that hospital, then you can call on 1031. Our Special Secretary will take an action immediately and contact the hospital authorities to provide you bed on the spot: Delhi CM. #COVID19 pic.twitter.com/NQebaToCF8 — ANI (@ANI) June 2, 2020 -
సరికొత్త వెర్షన్లో జూమ్ యాప్..
అమెరికాకు చెందిన జూమ్ కంపెనీ కీలక ప్రకటన చేసింది. ఈ యాప్ యూజర్లకు అనుకూలంగా వీడియా సెషన్స్ అందిస్తోంది. ప్రస్తుతం జూమ్ యాప్ యూజర్లకు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో సేవలందిస్తోంది. తాజాగా జూమ్ యాప్పై కొన్ని ఆరోపణలు నేపథ్యంలో సరికొత్త రీతిలో యూజర్లను అలరించడానికి సిద్దమవుతోంది. ఈ క్రమంలో జూమ్ కంపెనీ మే 30, 2020లో ఇన్స్టాల్ అయ్యే నూతన వెర్షన్నే ఉపయోగించాలని కోరింది. ప్రస్తుతం కంపెనీ జూమ్ రూమ్స్, సిస్టమ్స్, వైర్లెస్ సేవలను యూజర్లకు అందిస్తోంది. సరికొత్త రీతిలో జూమ్ రూమ్స్ను నవీకరిస్తున్నందున వీడియో సెషన్స్ అద్భుతంగా కొనసాగుతాయని కంపెనీ స్పష్టం చేసింది. జూమ్ యాప్ తక్కువ ఖర్చుతో యూజర్లకు సేవలందిస్తున్నందున ఈ యాప్ను ఇన్స్టాల్ చేయడానికి ఎక్కువ స్థాయిలో యూజర్లు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. యూజర్లకు అన్ని కొత్త వెర్షన్లు రావాలంటే అడ్మిన్ పోర్టల్కు లాగిన్ అయ్యి జూమ్ రూమ్స్ కంట్రోలర్ సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేసుకోవలని కంపెనీ సూచించింది. మరోవైపు భారతలో వినియోగదారుల గోప్యతకు జూమ్ వీడియో కాలింగ్ యాప్ భంగం కలిగిస్తుందని ఇటవల సుప్రీం కోర్టులో హర్ష్ చుగ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఈ యాప్ వినియోగిస్తున్న పలువురి నుంచి హ్యాకింగ్, సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు వస్తున్నాయని ఫిర్యాదులో పిటిషన్దారుడు పేర్కొన్నారు. -
జియో కొత్త యాప్, రీచార్జ్ చేస్తే కమీషన్
సాక్షి, ముంబై: కొత్త కొత్త ప్లాన్లు, మార్పులతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న రిలయన్స్ జియో మరో సరికొత్త అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా కరోనా వైరస్ మహమ్మారి కష్టాల్లో ఉన్న జియో వినియోగదారులు ఇతరులకు రీచార్జ్ చేయడం ద్వారా కమిషన్ పొందేలా జియోపోస్ లైట్ పేరుతో ఒక యాప్ ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా జియో వినియోగదారులు తమకు తెలిసిన ఇతర జియో కస్టమర్లకు ప్రీపెయిడ్ రీచార్జీలను చేయవచ్చు. ఇలా చేసిన ప్రతి రీఛార్జ్ ద్వారా 4.16శాతం కమీషన్ సంపాదించవచ్చు. ఈ యాప్ ను డైరెక్టుగా గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకోవడం కూడా చాలా సులభం. పైగా ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన పని లేదు. ఇప్పటికే మైజియో యాప్, జియో వెబ్సైట్ ను ఉపయోగించి ఇతర జియో కస్టమర్లకు రీచార్జ్ చేసే అవకాః ఉన్నప్పటికీ, ఆ రీచార్జ్ లపై కమిషన్ చెల్లించదు. తాజా యాప్ ద్వారా వినియోగదారులు కమిషన్ పొందవచ్చు. అంతేకాదు ఇందులో పాస్ బుక్ ఫీచర్ ఉంటుంది. దీని ద్వారా వినియోగదారులు గత 20 రోజుల్లో నిర్వహించిన లావాదేవీలు, వచ్చిన కమీషన్ ను చెక్ చేసుకోవచ్చు. (కరోనా : భారత సంతతి వైద్యురాలు కీలక నిర్ణయం) రిజిస్ట్రేషన్ ఎలా? జియోపోస్ లైట్ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకొని... సంబంధిత అనుమతులు పూర్తయినాక, జియో నెంబరు నమోదు చేయాలి. ఇలా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత వాలెట్ లో రూ .500, రూ .1000, రూ .2000 లాంటి ఆప్షన్లతో డబ్బును నింపమని యాప్ అడుగుతుంది. అలాగే రీఛార్జ్ ప్రణాళికలను చూపుతుంది. దీన్ని ఎంచుకొని రీచార్జ్ చేసినప్పుడు 4.16 శాతం కమీషన్ పొందవచ్చు. అయితే ఆండ్రాయిడ్ ఫోన్లకు మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఐఓఎస్ వెర్షన్ కు ఈ సదుపాయం లేదు. (వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు గుడ్ న్యూస్) కాగా కోవిడ్-19 కరోనా వైరస్, లాక్డౌన్ ఇబ్బందుల మధ్య వినియోగదారులకు జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు పలు సౌలభ్యాలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. అదనపు డేటా ప్రయోజనాలు, ఏటీఎం, ఎస్ఎంఎస్ ద్వారా రీచార్జ్ చేసుకునే అవకాశాన్ని కల్పించాయి. అలాగే జియోపోస్ లైట్ మాదిరిగానే, వొడాఫోన్ ఐడియా కూడా “రీఛార్జ్ ఫర్ గుడ్” ను ప్రారంభించింది. ఇందులో ప్రతీ రీఛార్జికి 6 శాతం కమీషన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. -
నయా ట్రెండ్ సృష్టిస్తోన్న ‘ఆహా’
ఇప్పుడు ఎక్కడ చూసినా ‘ఆహా’ యాప్ సందడే కనిపిస్తుంది. తెలుగు ఎంటర్టైన్మెంట్లో సరికొత్త ట్రెండ్ని సెట్ చేసింది ఈ యాప్. అల్లు అర్జున్ కూతురు అర్హ పేరు మీద ‘ఆహా’ అనే యాప్ను తెరమీదకి తీసుకొచ్చింది అల్లు వారి కుటుంబం. అల్లు అరవింద్, రాము రావ్ జూపల్లి సంయుక్తంగా నిర్మించిన ఈ యాప్ను ఇప్పటికే 10 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. తొలి తెలుగు డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్ గా అరచేతిలొకోచ్చిన ఈ యాప్లో తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్లకు కేరాఫ్గా నిలుస్తూ అదరహో అనిపిస్తుంది. తెలుగు కొత్త సంవత్సరాది అయిన ఉగాది నాడు (మార్చి 25)న ఆహా యాప్ను గ్రాండ్గా లాంఛ్ చేయాలని భావించినప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ‘సిన్’, ‘లాక్డ్’ అనే కొత్త వెబ్సిరీస్లను లాంచ్ చేసి ఎంటర్టైన్మెంట్ విభాగంలో సత్తా చాటుతుంది. కొత్తగా పెళ్లైన జంట మధ్య సాగే కథే ‘సిన్’. శరత్ మారార్ నిర్మించిన ఈ వెబ్సిరీస్కు నవీన్ మేడారం డైరెక్టర్ గా వ్యవహరించారు. బోల్డ్ కంటెంట్తో, డొమెస్టిక్ వయోలెన్స్కి వ్యతిరేకంగా ఒక మెసేజ్ ఓరియంటెంట్తో తీసిన వెబ్సిరీస్ ఇది. ‘మ్యారేజ్ నో ఎక్స్క్యూజ్’ అనే క్యాంపెయిన్ని నిర్వహిస్తుంది ఈ టీమ్. దీంతోపాటు ‘లాక్డ్’ అనే మరో వెబ్సిరీస్ కూడా తీసుకొచ్చింది. కృష్ణ కులశేఖరన్ నిర్మించిన లాక్డ్ సిరీస్లో ప్రముఖ నటుడు సత్యదేవ్ కంచరానా ఓ ముఖ్య పాత్ర పోషించారు. ప్రదీప్ దేవకుమార్ దర్వకత్వం వహించిన ఈ వెబ్సిరీస్ థిల్లర్ ఎంటర్టైన్మెంట్ నేపథ్యంలో సాగుతుంది. ఈ వెబ్సిరీస్ ప్రివ్యూ లాంచ్ సందర్భంగా నటీనటులు.. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రతిపాదించిన సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్ను చేపట్టి ప్రజల్లో అవగాహన కల్పించారు. ఫిబ్రవరి 8న విజయ్ దేవరకొండ ఈ యాప్ను టెస్ట్ లాంచ్ చేశారు. అర్జున్ సురవరం, ఖైదీ, ప్రెజర్ కుక్కర్, చూసి చూడంగానే, సవారి వంటి డిజిటల్ ప్రీమియర్లు ఇప్పటికే ఈ యాప్లో అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు ఆహా సొంతంగా సమర్పించిన వెబ్సిరీస్లైన మస్తీ, కొత్త పోరడు, షిట్ హాప్పెన్స్, గీతా సుబ్రమణ్యం 2020కి తోడు ఇప్పుడు సిన్, లాక్డ్ అనే రెండు కొత్త వెబ్ సిరీస్లు కూడా వచ్చేశాయి. టెస్ట్ లాంచ్ అయిన అతికొద్ది సమయంలోనే తెలుగువాళ్లందరినీ ఫిదా చేసింది ఈ యాప్. ఓటీటీ విభాగంలో తెలుగులో వచ్చిన తొలి ఏకైక్ యాప్ ఇది. ఓటీటీ అంటే ఓవర్ ద టాప్ అని అర్థం. అంటే కేబుల్, టెలివిజన్, శాటిలైట్ అవసరమేమి లేకుండా నేరుగా మీ మొబైల్లోనే నేరుగా సినిమాలు, వెబ్సిరీస్లను ఆ యాప్లో చూడొచ్చు. దేశవ్యాప్త లాక్డౌన్ నేపథ్యంలో ఇంట్లోనే ఉండి ఈ యాప్తో ఎంటర్టైన్మెంట్ని ఆస్వాదించండి. ఆహా యాప్ కోసం ఈ క్రింది లింక్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు Playstore: http://bit.ly/2NYmnpA Appstore: https://apple.co/36wguq5 ► Subscribe to us on YouTube: https://www.youtube.com/c/ahavideoIN/ ► Like us on Facebook: https://www.facebook.com/ahavideoIN/ ► Follow us on Twitter: https://twitter.com/AhavideoIN ► Follow us on Instagram: https://www.instagram.com/ahavideoin/ -
ఫేస్బుక్లో కొత్త యాప్
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ కొత్త యాప్ను విడుదల చేసింది. హాబీ (Hobbi) పేరుతో వచ్చిన ఈ యాప్ పిన్రెస్ట్కు కాపీ లాంటిదే. అంటే హాబీ యాప్లో కూడా యూజర్లు మనకు సంబంధించిన హాబీలను ఫొటోలు, వీడియోలుగా షేర్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా మనకు ఇష్టమైన గార్డెనింగ్, వంట, ఆర్ట్స్, డెకరేషన్ ఇలాంటి హాబీలను ఓ క్రమంలో సెట్ చేసుకోవచ్చు. తమ కలెక్షన్లు, ప్రాజెక్టులను ఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా ఈ యాప్ తోడ్పడుతుందని ఫేస్బుక్ ప్రకటించింది. ఈ కలెక్షన్లు, ప్రాజెక్టులను వాటిని వీడియోగా క్రియేట్ చేసుకుని మరికొందరు యూజర్లతో షేర్ చేసుకోవచ్చు. కాగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా దేశాల్లో మాత్రమే దీన్ని విడుదల చేసింది ఫేస్బుక్. అలాగే ప్రస్తుతానికి ఇది కేవలం ఆపిల్ ఐఫోన్లు, ఐప్యాడ్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్లో కానీ, గూగుల్ ప్లే స్టోర్లో గానీ అందుబాటులో లేదు. త్వరలోనే అన్ని దేశాల వారికి అందుబాటులోకి రానుందని..ఆండ్రాయిడ్ యాప్ను కూడా విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఫేస్బుక్ కంపెనీలో భాగమైన న్యూ ప్రొడక్ట్ ఎక్స్పెరిమెంటేషన్ (ఎన్ పీఈ) టీమ్ ఆధ్వర్యంలో ఈ హాబీ యాప్ రూపొందింది. అయితే ఈ యాప్ను పెద్దగా ప్రచారం లేకుండా విడుదల చేయడం విశేషం. -
ఫేస్బుక్ కొత్త యాప్, ‘థ్రెడ్స్’ చూశారా!
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం తన ప్రత్యర్థి స్పాప్చాట్తో సోషల్ మీడియా సమరానికి సై అంది. తన ఫోటో-షేరింగ్ ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ కోసం ప్రత్యేక కెమెరా-ఫస్ట్ మెసేజింగ్ యాప్ "థ్రెడ్స్" ను లాంచ్ చేసింది. ఈ మేరకు ఫేస్బుక్ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. థ్రెడ్స్ ద్వారా, వినియోగదారులు తమ సన్నిహితులతో ఇన్స్టాగ్రామ్లో స్టేటస్, షేర్ లొకేషన్, బ్యాటరీ స్టేటస్ను అప్లోడ్ చేసుకోవచ్చని ఫేస్బుక్ ఒక బ్లాగ్ పోస్ట్లో తెలిపింది. సన్నిహితులకోసం ప్రత్యేకంగా ఈ యాప్ తీసుకొచ్చినట్టు తెలిపింది. ఫేస్బుక్ దాని వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆదాయాన్ని ఆర్జిస్తున్న ఇన్స్టాగ్రామ్పై దృష్టి సారించింది, ఎందుకంటే దాని ప్రధాన వేదిక గోప్యత , తప్పుడు సమాచారం లేదా నకిలీ వార్తల వ్యాప్తికి సంబంధించి నియంత్రకుల నుండి పరిశీలనలో ఉన్న నేపథ్యంలో కొత్త అప్డేట్స్ ఇస్తోంది. ఈ నేపథ్యంలో థ్రెడ్స్ పేరుతో కొత్త యాప్ను తీసుకొచ్చింది. యాపిల్, గూగుల్-బ్యాక్డ్ ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ ద్వారా నడిచే స్మార్ట్ఫోన్లలో ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఆవిష్కరించింది. ఫేస్బుక్ డేటా లీక్ సృష్టిస్తున్న వివాదం నేపథ్యంలోఈ యాప్ చాలా సురక్షితమైందని ఫేస్బుక్ హామీ ఇచ్చింది. థ్రెడ్స్ ఒక స్వతంత యాప్. ఇతర మెసేజ్ యాప్ల మాదిరిగానే వినియోగదారులు ఫోటోలు, వీడియోలు, సందేశాలు, స్టోరీస్ను షేర్ చేసుకోవచ్చు. విజువల్ మెసేజింగ్ స్టైల్లో ఫోటోలు లేదా వీడియోలను సులభంగా భాగస్వామ్యం చేస్తుంది. అలాగే తమ పోస్ట్లో ఎవరు చూడవచ్చో, చూడకూడదో "క్లోజ్ ఫ్రెండ్స్" ఫీచర్ ద్వారా నియత్రించుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేకమైన ఇన్బాక్స్ , నోటిఫికేషన్లు ఉంటాయి. డైరెక్టుగా కెమెరాతో ఒపెన్ అయ్యి షార్ట్కట్స్తో కేవలం రెండే రెండు క్లిక్స్ తాము అనుకున్న కంటెంట్ను యాడ్ చేయొచ్చు. అలాగే వాట్సాప్ మాదిరిగానే స్టేటస్ ఫీచర్ కూడా ఉంది. -
సెల్ఫీ చాలు
సాక్షి, హైదరాబాద్: ‘పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నారా? అయితే, మీరు బతికే ఉన్నారంటూ సర్టిఫికెట్తీసుకుని రండి. అప్పుడు మీ దరఖాస్తు పరిశీలిస్తాం’ – ఇదీ ఇప్పటివరకు పింఛనుదారులు లేదా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు చాలా సందర్భాల్లో ఎదురైన అనుభవం. కళ్ల ముందే మనిషి కనిపిస్తున్నా.. మీరు బతికే ఉన్నారని, ఫలానా రామారావు మీరే అని కాగితాల ద్వారా రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇందుకోసం కాళ్లరిగేలా ఆ కార్యాలయం, ఈ కార్యాలయం చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వచ్చేది. ఇకపై ఇలాంటి ఇబ్బందులు ఉండవు. కేవలం ఒక్క సెల్ఫీతో ఈ సమస్యలన్నీ పరిష్కారమైపోతాయి. మీరు ఇంట్లోనే ఉండి ఒక్క సెల్ఫీ తీసి పంపిస్తే చాలు.. మీకు రావాల్సిన ప్రయోజనాలు నేరుగా అందుకోవచ్చు. ఎలా పనిచేస్తుంది? ఆధునిక సాంకేతికతతో దూసుకెళ్తున్న మన రాష్ట్రంలో దేశంలోనే తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), మెషీన్ లెర్నింగ్, ఇతర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలను సమ్మిళితం చేసి ఓ యాప్ను అభివృద్ధి చేశారు. మూడు రకాల సాంకేతికతలను ఒకచోట చేర్చి దానిని మొబైల్ యాప్తో అనుసంధానించడం ద్వారా ఈ వినూత్న సాంకేతికతకు రూపునిచ్చారు. ఇప్పటివరకు దేశంలో రెండు రకాల సాంకేతికతలను ఒకచోట చేర్చి ఫలితాలు సాధించగా.. మన దగ్గర మూడురకాల సాంకేతికతలను ఉపయోగించేలా సిద్ధం చేసిన యాప్ను రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ రూపొందించింది. ఒక్క సెల్ఫీతోనే దీని కచ్చితత్వం ప్రస్ఫుటమవుతుంది. ఈ మొబైల్ అప్లికేషన్ను టీ యాప్ ఫోలియోలో అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం దీనిని కొంత మేరకు ట్రెజరీ విభాగంలో రిటైరైన ఉద్యోగుల పెన్షన్ పంపిణీ కోసం వినియోగిస్తున్నారు. రెండు మూడు నెలల్లో దీనిని ఈ విభాగంలో మరింతగా విస్తరించనున్నారు. ఆసరాలో ప్రయోగాత్మకంగా.. ఈ కొత్త యాప్ను ఆసరా పింఛన్ల విషయంలోనూ ప్రయోగాత్మకంగా పరిశీలించారు. పీఆర్శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్రాజ్, సెర్ప్ సీఈవో పౌసమిబసు చొరవతో ఇటీవల సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దుమైలారంలో ఈ మొబైల్యాప్ను పైలెట్ ప్రాజెక్టుగా పరిశీలించి చూశారు. ఈ గ్రామంలో 60 మంది వృద్దాప్య పింఛన్లు పొందుతున్న వారిని మొబైల్ యాప్ ద్వారా పరిశీలించగా 59 మంది వివరాలు సరైనవేనని తేలింది. ఒక్కరి విషయంలోనూ వివరాలు సరిగా లేకపోవడంతో డేటాబేస్లోని సమాచారంతో మ్యాచ్ కాలేదు. ప్రయోజనాలేంటి? పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పింఛనుతో సహా ఆసరా పింఛనుదారులు, వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల లబ్దిదారులు జీవించి ఉన్నారా లేదా నిజమైన లబ్దిదారులకే ఇవి అందుతున్నాయా అని కచ్చితత్వంతో తెలుసుకునేందుకు ఈ మొబైల్ యాప్ ఉపయోగపడనుంది. అలాగే లెర్నింగ్ లైసెన్స్ రెన్యువల్, ఇతర సర్వీసుల కోసం రవాణా కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఇంటి వద్ద నుంచే సెల్ఫీ తీసుకుని ఆయా సేవలను పొందే వెసులుబాటు కలగనుంది. ఇక పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు పింఛను పొందాలంటే ప్రతి ఏడాది ‘వార్షిక పెన్షనర్ లైవ్ సర్టిఫికెట్’ను సమర్పించాల్సి ఉండేది. ఇందుకోసం వారు ట్రెజరీ, పెన్షన్ కార్యాలయాలకు వెళ్లి తాము జీవించి ఉన్నట్టుగా స్వయంగా సర్టిఫికెట్లు సమర్పించాల్సి వచ్చేది. ఇకపై ఆ అవసరం ఉండదు. సొంత లేదా అందుబాటులో ఉన్న స్మార్ట్ఫోన్లో పెన్షనర్లు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని సెల్ఫీ తీసుకుని, అవసరమైన వివరాలను పొందుపరిచి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. వెంటనే ట్రెజరీ డేటాబేస్లో ఉన్న వివరాల ఆధారంగా లైవ్ అథెంటికేషన్ పూర్తయి ఫోన్కు మెసేజ్ వస్తుంది. అదే సమయంలో ట్రెజరీ డిపార్ట్మెంట్కు అథెంటికేషన్ వెళుతుంది. పెన్షనర్ స్వయంగా లైవ్ అథెంటికేషన్ కోసం ట్రెజరీ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.మాన్యువల్ ప్రక్రియలో ఎదురయ్యే చాలా ఇబ్బందులు ఈ యాప్తో తీరనున్నాయి. మనుషుల ప్రమేయం లేకుండానే.. పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్ పొందేందుకు వీలుగా యాప్ను రూపొందించాం. లబ్దిదారుడిని సెల్ఫీ తీయడం ద్వారా లైవ్ అథెంటికేషన్, పేరు, చిరునామా, ఇతర డెమోగ్రాఫిక్ వివరాలతో డేటాబేస్లోని 10, 15 ఏళ్ల క్రితం నాటి ఫోటోతో మ్యాచ్ చేస్తే ఈ వివరాలున్న వ్యక్తి.. సెల్ఫీ దిగిన వ్యక్తి ఒకరే అన్న అథెంటికేషన్ వస్తుంది. ఇందులో మొదటిది ఓకే కాకపోతే రెండో అంశానికి వెళ్లే అవకాశముండదు. మనుషుల ప్రమేయం లేకుండా సిస్టమే అన్నీ చేస్తుంది. డెబిట్ కార్డు వినియోగం కోసం ‘టు ఫాక్టర్ టెక్నాలజీ’ని ఉపయోగిస్తుండగా మేము వినూత్నంగా ‘త్రీ ఫాక్టర్ అథెంటికేషన్’ను ఉపయోగించాం. – జీటీ వెంకటేశ్వరరావు, ఎండీ టీఎస్టీఎస్, కమిషనర్ ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీ కచ్చితత్వం సాధించాం ఎద్దుమైలారంలో ఆసరా పింఛన్ల లబ్దిదారులను ఈ యాప్ ద్వారా పరిశీలించాం. ప్రధానంగా వృద్ధాప్య పింఛను పొందుతున్న వారిని 60 మందిని ఎంపిక చేసి, మా డేటాబేస్లో ఉన్న ఫోటో, ఇతర వివరాలను లబ్దిదారుల సెల్ఫీతో మ్యాచ్ చేసి చూశాం. 59 మంది సమాచారం మ్యాచ్ అయ్యింది. ఒక వ్యక్తి వివరాలు సరిగా లేకపోవడంతో మ్యాచ్ కాలేదు. – సూర్యారావు, సంగారెడ్డి జిల్లా అడిషనల్ డీఆర్డీఒ -
గూగుల్ 'బోలో' : దియా పాఠాలు
సాక్షి, న్యూఢిల్లీ: సెర్చి ఇంజీన్ దిగ్గజం గూగుల్ ఇండియా మరో కొత్త యాప్ను విడుదల చేసింది. పిల్లలకు హిందీ, ఇంగ్లీషు భాష నేర్పే యోచనతో ఈ అప్లికేషన్ను లాంచ్ చేసింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల కోసం దీన్ని తీసుకొచ్చింది. 'బోలో' పేరుతో రిలీజ్ చేసిన ఈ యాప్ స్పీచ్ రికగ్నిషన్, టెక్స్ట్-టు-స్పీచ్ టెక్నాలజీ సాయంతో ప్రాథమిక విద్యార్థుల కోసం రూపొందించినట్టు గూగుల్ వెల్లడించింది. ఈ యాప్లో యానిమేటెడ్ క్యారెక్టర్ 'దియా' పిల్లలకు హిందీ, ఇంగ్లీష్ నేర్పిస్తుంది. అంతేకాదు కథలు చెబుతుంది, మాటలు నేర్పిస్తుంది. గూగుల్ ప్లే ద్వారా దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ బోలో యాప్ ఆఫ్లైన్లో కూడా పనిచేయడం విశేషం. ఇది యాడ్ ఫ్రీ కూడా. యాన్యువల్ స్టేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ సెంటర్ సహాయంతో ఉత్తరప్రదేశ్లోని 200 గ్రామాల్లో కొన్ని నెలలపాటు ఈ యాప్ను గూగుల్ పరీక్షించింది. కేవలం మూడు నెలల్లో 64 శాతం మంది పిల్లల్లో చదివే నైపుణ్యం పెరిగినట్టు గుర్తించినట్టు తెలిపింది. నాణ్యమైన పాఠాలు అందుబాటులో లేకపోవడం వల్ల ఒక్కో రాష్ట్రంలో అక్షరాస్యత శాతం ఒక్కోలా ఉందని పేర్కొంది. బోలో యాప్తో పిల్లల్లో చదివే ఆసక్తి, నైపుణ్యం పెరుగుతుందనే ధీమాను వ్యక్తం చేసింది. -
తప్పించుకు తిరగలేరు..
అవసరం ఉన్నప్పుడు డబ్బు కావాలని తెలిసిన వారొస్తే.. అప్పుగా ఇస్తుంటాం. కానీ తిరిగిచ్చేటప్పుడే మనల్ని మనం పాపం అనుకోవాలి. ఎన్నిసార్లు అడిగినా తప్పించుకు తిరుగుతుంటారు. అందరూ అలా ఉంటారని కాదు.. కొందరు ఉంటారు. ఇంట్లో ఉండి కూడా బయటికి వెళ్లారని భార్య, పిల్లలతో చెప్పిస్తుంటారు కదా..! ఇలాంటివి చాలా సినిమాల్లో చూసి ఉంటాం.. మీకూ వ్యక్తిగతంగా అనుభవం అయ్యే ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ బాధలు ఇక ఉండవు. ఇంట్లో ఉండీ లేరని చెప్పించడం ఇకపై కుదరదు. ఎందుకంటే అప్పు తీసుకున్న వారిని ఇట్టే కనిపెట్టొచ్చు. అందుకోసం చైనా ఓ వినూత్నమైన మొబైల్ యాప్ను రూపొందించింది. ఈ యాప్ వినియోగదారులకు రుణపడి తప్పించుకుని తిరిగేవారు 500 మీటర్ల లోపు ఎక్కడున్నా మొబైల్కు అలర్ట్ వస్తుంది. ఇక వారిని అక్కడికక్కడే కడిగిపారేయొచ్చు. చైనాలోని హెబీ అనే ప్రావిన్స్లోని ప్రభుత్వం ఈ యాప్ను తయారు చేసింది. ‘అప్పు చేసి తిరిగేవాళ్ల మ్యాప్’అనే క్యాప్షన్తో ఈ యాప్ను తయారు చేశారు. అయితే ఎంత అప్పు తీసుకున్న వారు కనిపిస్తారనే విషయంలో ఓ క్లారిటీ లేదు. -
‘ఈ–పెట్టీ’.. నేరాల కట్టడి
సిద్దిపేటటౌన్: నిత్యం రద్దీగా ఉండే సుభాష్రోడ్డులో ఉన్న ప్రతీ దుకాణం నిర్వాహకులు వారి ఎదుట ఉన్న రోడ్డుపై సామాను ఉంచడం, పాదచారులకు ఇబ్బంది కలిగించడం నిత్యకృత్యం. పోలీసులు ఎంత చెప్పినా, ఎన్ని సార్లు జరిమానా వేసిన వ్యాపారులు మాత్రం మారలేదు. ఈ–పెట్టీ యాప్ అందుబాటులోకి వచ్చిన అనంతరం పోలీసులు సుభాష్ రోడ్డులో తిరుగుతూ రోడ్డును ఆక్రమించి వ్యాపారం నిర్వహిస్తున్న దృశ్యాన్ని ఫోటో తీసి యాప్లో అప్లోడ్ చేసి జరిమానా విధించారు. అప్పటి నుంచి ఆ రోడ్డులో వ్యాపారాలు నిర్వహించే దుకాణాదారులు రోడ్డుపై సరుకులు పెట్టడం తగ్గించారు. ఏదైనా సంఘటన జరుగుతోందని పోలీసులకు సమాచారం అందిన వెంటనే అక్కడి పరిస్థితిని నమోదు చేసుకుని నేరం తీవ్రత పెరగకుండా చేయాలన్న లక్ష్యంతో వినియోగంలోకి తెచ్చిన ‘ఈ–పెట్టీ’ కేసుల యాప్తో నేరాలను కట్టడి అవుతున్నాయి. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించడం, ప్రజల జీవనానికి భంగం కలిగించే కేసులను నమోదు చేయడంపై దృష్టి పెడుతున్నారు. నేరం తీవ్రత పెరగకుండా పోలీసులకు సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఈ–పెట్టీ కేసు నమోదు చేస్తున్నారు. అమలులో రాష్ట్రంలోనే రెండవ స్థానం... మారుతున్న సాంకేతిక పరాజ్ఞానాన్ని నేరస్తులు అందిపుచ్చుని కొత్త కొత్త రీతుల్లో నేరాలకు పాల్పడుతున్నారు. వారికి దీటుగా పోలీసు శాఖ సాంకేతికంగా మరింత అడ్వాన్స్గా ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 13న ఈ–పెట్టీ కేసుల యాప్ను వినియోగంలోకి తెచ్చింది. యాప్ను వినియోగంలోకి తెచ్చిన 64 రోజుల్లోనే 1267 కేసులు నమోదు చేయడం గమనార్హం. ఈ–పెట్టీ యాప్ను సమర్థవంతంగా వినియోగిస్తూ రాష్ట్రంలోనే రెండవ స్థానంలో సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ నిలిచింది. బహిరంగంగా దూమపానం, మద్యం సేవించడం, పేకాట ఆడడం, తాగి గొడవలు పెట్టుకోవడం వంటి సంఘటనలు జరిగినపుడు ఎక్కడిక్కడే ట్యాబ్లో సంబంధిత దృశ్యాలు అప్లోడ్ చేయడంతో పాటు పూర్తి వివరాలు నమోదు చేస్తున్నారు. దీంతో నిందితులను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి వారిని కస్టడీలో ఉంచాల్సిన అవసరం లేదు. వివరాలను ట్యాబ్లో ఎంట్రీ చేయగానే కోర్టులో ప్రవేశపెట్టి నేరం పెద్దదైతే శిక్ష వేస్తున్నారు. లేదంటే జరిమానాతో విధిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ–పెట్టీ యాప్ పోలీసులకు ప్రధాన ఆయుధంగా మారింది. టౌన్ న్యూసెన్స్పై ఎక్కువ దృష్టి... ఈ–పెట్టీ యాప్ ద్వారా టౌన్లో న్యూసెన్స్ యాక్డు ప్రకారం ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. వీటిలో ప్రధానంగా బహిరంగ ప్రదేశాల్లో ప్రజాజీవనానికి ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరించడం వంటి ఘటనలపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. నేరస్తుని ఫొటో, నేరం జరిగిన తీరు, సంఘటన స్థలం దృశ్యం, నేరస్తుని పూర్తి వివరాలు ఈ యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. ఒక నేరస్తుడు మళ్లీ ఎప్పుడైనా నేరం చేస్తూ పట్టుబడితే అతని వివరాలు ఇంతకుముందే నమోదు అయి ఉండడంతో మరో కేసు అతని ఖాతాలో నమోదు అవుతుంది. ఇలా పాత నేరస్తులకు సంబంధించిన పూర్తి వివరాలు ఒకేచోట ఉంచుతున్నారు. దీంతో కొన్ని సార్లు నేరం చేసిన వ్యక్తి ఎవరో తెలయికుంటే ఈ యాప్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. 26 స్టేషన్లు...59 ట్యాబ్లు జిల్లాలో ఉన్న 26 పోలీస్ స్టేషన్లలో స్టేషన్ హౌస్ ఆఫీసర్లు (ఎస్హెచ్వోలు), కోర్టు కానిస్టేబుల్లు, బ్లూకోర్ట్ కానిస్టేబుల్స్కు మొత్తం 59 ట్యాబ్లు పంపిణీ చేసారు. ప్రధానంగా ఈ కేసులను ఎస్సైలు, ఏఎస్సైలు, సీఐలు నేరం జరిగిన స్థలంలోనే నమోదు చేస్తున్నారు. దీంతో కేసులు నమోదు చేయడం సులభంగా మారింది. జిల్లాలో ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగడం, జూదం, ప్రజలకు ఇబ్బందులు కలిగించడం, గొడవలు పెట్టుకోవడం, వంటి వాటిలో కేసులు నమోదు అయ్యాయి. ఈ సంఘటనల్లో దొరికిన వారిపై సంఘన స్థలంలోనే కేసులు నమోదు చేస్తూ రశీదులు ఇచ్చి కోర్టుకు హాజరయ్యేలా చేస్తున్నారు. నేర రహిత కమిషనరేట్ దిశగా... ఏ నేరాన్నైనా తొలిదశలోనే అరికట్టడమే ఈ–పెట్టీ యాప్ ప్రధానం లక్ష్యం. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ను నేర రహితంగా తీర్చిదిద్దేందుకు ఈ యాప్ ఎంతో దోహదం చేస్తుంది. సాంకేతికతను ఉపయోగించుకుని నేరాలను అదుపు చేసి కమిషనరేట్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. టౌన్ న్యూసెన్స్ కలిగించే వారి వివరాలు తెలిపితే వారిపై వెంటనే కేసులు నమోదు చేస్తాం. ఆధారాలతో సహా కేసులు నమోదు అవుతుండడంతో నేరస్తులు తప్పించుకోవడానికి అవకాశం ఉండదు. –జోయల్ డేవిస్, సిద్దిపేట పోలీస్ కమిషనర్ -
అరచేతిలో వాతావరణ సమాచారం
సూర్యాపేట : వాతావరణ సమాచారాన్ని ఇకనుంచి సెల్ఫోన్లో ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ నూతన యాప్ను అందుబా టులోకి తీసుకొచ్చింది. టీఎస్ వెదర్ యాప్ను ఇటీవల రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రా జేందర్ ఆవిష్కరించారు. ఆటోమేటెడ్ పరికరాలతో ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులను, తాజా అంచనాలను ఈ యాప్ద్వారా తెలుసుకోవచ్చు. టీఎస్వెదర్ మొబైల్ యాప్ ను ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం కలిగి ఉన్న మొబైల్ పోర్ట్లో గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని ఏ ప్రాంతం వాతావరణ వివరాలైన ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ఆయన ప్రాంతాల్లో నెలకొన్న వర్షపాతం, ఉష్ణోగ్రత, పీడనం, గాలి గమన దిశలు మొదలైన వాతావరణ వివరాలను 24గంటలు అందుబాటులో అందరికి ఉంచడానికి రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ ఈ యాప్ను రూపొం దించింది. మొబైల్ యాప్లో ఉండే వివరాలు.. ఆ ప్రాంతంలో ఆటోమెటిక్ వెదర్స్టేషన్ పం పిన వాతావరణ వివరాలతో పాటు ఆ ప్రాంత సమీపంలో ఉండే ఐదు ఆటోమెటెడ్ వెదర్స్టేషన్లకు సంబంధించిన వివరాలుంటాయి. అదే విధంగా రాష్ట్రంలో నమోదైన వర్షపాతానికి సం బంధించి 10 ప్రాంతాల వివరాలు ఉంటాయి. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో నమోదైన వర్షపాతం, అత్యధిక వర్షపాతానికి చెందిన ఐదు ప్రాంతాల వివరాలు ఉంటాయి. యాప్తో అనేక ప్రయోజనాలు టీఎస్ వెదర్యాప్ అందుబాటులోకి రావడంతో ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని తెలుసుకునే వీలుంటుంది. ముఖ్యంగా రైతులకు వర్ష సూచన తెలియక విత్తనాలు విత్తుకునేవారు. సకాలంలో వర్షాలు కురవక నష్టాల్లో కూరుకుపోతున్నారు. టీఎస్ డీపీఎస్ రూపొందించిన వెదర్యాప్తో ఎప్పుడు వర్షాలు వచ్చే సూచనలు ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఈ నూతన యాప్ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తేవడంతో ఇటు రైతుల్లో, అటు ప్రజల్లో హర్షం వ్యక్తమవుతుంది. - బాదె లింగయ్య,జిల్లా కోఆర్డినేటింగ్ ఆఫీసర్ -
కాంగ్రెస్ పార్టీ.. కొత్త యాప్
వరంగల్ : కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడితో పాటు గ్రామస్థాయి కార్యకర్తలను అనుసంధానం చేసేందుకే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ ‘శక్తి’ పేరుతో యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చారని ఏఐసీసీ అనాలిటిక్ కోఆర్డినేటర్ స్వప్న తెలిపారు. హన్మకొండలోని డీసీసీ భవన్లో పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి అధ్యక్షతన శుక్రవారం ‘శక్తి’ యాప్పై అవగాహన సదస్సు జరిగింది. ఈసందర్భంగా స్వప్న మాట్లాడుతూ ఈ యాప్లో నమోదైన తర్వాత నాయకులు, కార్యకర్తలు తమ అభిప్రాయాలు, సూచనలను రాష్ట్ర, జాతీయ స్థాయి వరకు పంపించవచ్చని అన్నారు. ఇప్పటి వరకు పార్టీకి అనుబంధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సెల్తో పాటు డేటా అనాలిటిక్స్ డిపార్ట్మెంట్ అనే కొత్త విభా గం ఏర్పాటు చేశారని వివరించారు. నాయకులు, కార్యకర్తల పనితీరును గుర్తించి మండల, గ్రామ స్థాయి పదవులను గుర్తుచేస్తామన్నారు. శక్తి యాప్లోకి జులై 17 వరకు లక్ష మందిని చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని శక్తి యాప్ రాష్ట్ర కోఆర్డినేటర్, పరిగి ఎమ్మెల్యే రాంమోహన్రెడ్డి అన్నారు. క్రమేపీ సంఖ్యను మూడు లక్షలకు పెంచి దేశంలోనే తెలంగాణను ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. యువజన కాంగ్రెస్ నేతలు పార్టీలోకి యువతను తీసుకురావాలని కోరారు. సెల్ నెం.7993179961ను శక్తి ఏఐసీసీ నంబర్గా సేవ్ చేసుకోవాలని సూచిం చారు. ఓటర్ ఐడీ నంబర్ను.. శక్తి ఏఐసీసీ నంబర్కు మెసేజ్ చేస్తే ‘సభ్యత్వాన్ని స్వీకరించాం’ అని లేదా ‘ప్రాసెస్లో ఉంది’ అని సందేశం వస్తుందన్నారు. సభ్యత్వాన్ని ఏఐసీసీ స్వీకరించినట్లు శక్తి యాప్లో మెసేజ్ వస్తే.. పార్టీ వివరాలు తెలుసుకోవడంతో పాటు సూచనలు చేయవచ్చన్నారు. గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ విజయరామారావు, కొండేటి శ్రీధర్, డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నమిండ్ల శ్రీనివాస్, మహబూబాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు భరత్చంద్రారెడ్డి, మునిసిపల్ చైర్పర్సన్ భూక్యా ఉమ, అనుబంధ సంఘాల నాయకులు పోశాల పద్మ, కొత్తపల్లి శ్రీనివాస్, అయూబ్, గ్రేటర్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళాసంపత్యాదవ్, నాయకులు పాల్గొన్నారు. -
కొత్త యాప్.. పక్కా లోకల్!
ఇరుగు పొరుగు సమాచారం, సందేహాలకు ఎక్కడికక్కడే పరిష్కారం లభించే రీతిలో ఓ కొత్త యాప్ వచ్చేసింది. ఇప్పటికే ముంబైలో ప్రవేశించిన ఈ యాప్ త్వరలోనే దేశంలోని అన్ని నగరాలకు విస్తరించబోతోంది. ఫేస్బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల పోటీలో కాస్త వెనుకబడిన గూగుల్ ఇప్పుడీ కొత్త యాప్తో వివిధ ప్రాంతాల్లో నివసించేవారిని ఇరుగుపొరుగును అనుసంధానం చేయడం ద్వారా పెద్ద ఎత్తున మార్కెట్లోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తోంది. రెండేళ్ల పరిశోధన,సర్వేల ద్వారా రూపొందించిన ఈ యాప్ పేరు ‘నైబర్లీ’. దాని ద్వారా తమ ప్రాంతాలకు సంబంధించిన సమాచారాన్ని అందుబాటులోకి తేవడమే కాకుండా ఎప్పుడు ఏ సందేహం వచ్చినా వెంటనే ఈ యాప్ ద్వారా అవసరమైన సమాచారాన్ని పొందే ఛాటింగ్ సౌకర్యం కూడా అందిస్తోంది. జీపీఎస్ ద్వారా యూజర్ ఏ ప్రాంతంలో ఉన్నారో తెలుసుకుని సమీపంలోనే ఉన్న అవసరమైన సమాచారం అందుబాటులోకి తెస్తుంది. వంటింటి సామాగ్రి నుంచి దుకాణాలు, ఆసుపత్రులు వంటి అన్ని రకాల సమాచారానికి పరిసర ప్రాంతాల్లోనే పొందే సౌలబ్యం కల్పిస్తుంది. ఇటీవల ముంబైలో ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఏ విధంగా ఆదుకోవాలో చెప్పాలంటూ ఓ లోకల్రైలు ప్రయాణీకుడు తన స్మార్ట్ఫోన్లో అడిగిన వెంటనే వచ్చే స్టేషన్లో స్టేషన్మాస్టర్ను కలవాలని, ప్రథమ చికిత్స కోసం టికెట్కలెక్టర్ను అడగాలని, అత్యవసర సహాయం కోసం 138కు ఫోన్ చేయాలంటూ వెంటనే రకరకాల సలహాలు వచ్చేశాయి. గూగుల్ సెర్చ్ ఆప్షన్, డిజిటల్ అసిస్టెంట్, వాయిస్ బేస్డ్ సెర్చ్లకు ఆదరణ పెరగడంతో ఈ యాప్ ద్వారా తమ ప్రాంతీయభాషల్లో ప్రశ్నలు కూడా అడిగే సౌలభ్యముంది. ఫలానా వస్తువు ఎక్కడ లభిస్తుంది ? ఫలానా సాంకేతిక సమస్య ఎవరు సమర్థంగా పరిష్కరిస్తారు ? ఫలానా వస్తువు కోసం ఏమి తీసుకోమంటారు వంటివి యాప్లోనే టైప్ చేసి సిద్ధంగా ఉంచడం వల్ల వెంటనే వాటిని ఎంచుకుని పంపించే ఏర్పాటుంది. ఏమిటీ యాప్...? ఏదైన సమస్యపై లేదా అవసరమైన సమాచారంపై బృంద చర్చల్లో పాల్గొనకుండానే యూజర్లకు సూటిగా సమాధానమిచ్చేందుకు ‘నైబర్లీ’ (పొరుగు) యాప్ ఉపయోగపడుతుందని గూగుల్ చెబుతోంది. దీని యూజర్ల తమ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయకుండానే బ్రౌజ్ చేయడంతో పాటు ప్రశ్నలు వేయొచ్చు లేదా సమాధానాలు ఇవ్వొచ్చు. ఈ యాప్లో వినియోగదారుల ఇంటిపేరు మాత్రమే ఉంటుంది. వారి పూర్తిపేరు, ఫోన్నెంబర్, ఇతర సమాచారం రహస్యంగా ఉంచుతారు. మిగతా యాప్లలో మాదిరిగా యూజర్ ప్రొఫైల్ ఫోటోను పెద్దది చేయడం, స్టోర్ చేసుకునే వీలుండదు. దీనిని ఉపయోగించడం మొదలుపెట్టినపుడు చుట్టుపక్కల వారి భద్రతకు కట్టుబడి ఉంటామని, సంబంధంలేని విషయాలు లేదా స్పామ్ మెసేజ్లు పెట్టమని ప్రతీ ఒక్కరూ వాగ్దానం చేయాల్సి ఉంటుంది.ఇది కేవలం 7 ఎంబీల కంటే తక్కువ సైజులో ఉండడంతో పాత లేదా ధర తక్కువ స్మార్ట్ఫోన్లలో కూడా ఉపయోగించే వీలు ఏర్పడింది. మనదేశంలో దాదాపు 50 కోట్ల మంది స్మార్ట్ఫోన్లు వినియోగిస్తున్నందున సోషల్ నెట్వర్కింగ్, సెర్చ్, పేమెంట్స్లకు (వివిధ సేవలకు ఫోన్ ద్వారా చెల్లింపులు) ఒకే గమ్యస్థానంగా ఈ యాప్ నిలుస్తుందనే ఆశాభావంతో గూగుల్ ఇండియా సంస్థ ఉంది. -
రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ
వేములవాడ: రాజన్నను దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. శివరాత్రి ఉత్సవాలకు ఆలయాన్ని ముస్తాబు చేశారు. సిద్దిపేట కలెక్టర్ పి.వెంకట్రామ్రెడ్డి ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. మహాశివరాత్రి జాతర మహోత్సవాలు– 2018 యాప్ను కలెక్టర్ కృష్ణభాస్కర్ ప్రారంభించారు. వేములవాడ మహాశివరాత్రి జాతర అని టైప్ చేసి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల కోసం గుడి చెరువులో స్టేజీఏర్పాటు చేసినట్లు చెప్పారు. భక్తులు లోకల్గా తిరిగేందుకు నాలుగు మినీబస్సులను ఉచితంగా తిప్పుతున్నట్లు చెప్పారు. శివరాత్రి సందర్భంగా తీసుకోవాల్సిన బందోబస్తుపై ఎస్పీ విశ్వజిత్కంపాటి సమీక్షించారు. -
మద్యం ఎమ్మార్పీ ఉల్లంఘనకు చెక్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఎక్సైజ్ శాఖ సాంకేతికంగా మరో ముందడుగు వేసింది. మద్యం గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ) ఉల్లంఘనను నిరోధించడంతో పాటు, అక్రమ మద్యం, కల్తీ మద్యాన్ని నిరోధించడం కోసం ‘లిక్కర్ ప్రైస్’అనే కొత్త యాప్ను ప్రవేశపెట్టింది. శనివారం ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు గౌడ్, ఎక్సైజ్ కమిషనర్ సోమేశ్కుమార్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్తో కలసి ఈ యాప్ను ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 880 లిక్కర్ బ్రాండ్లను విక్రయిస్తున్నారు. ఒక్కో సీసా మీద ఎంత ఎమ్మార్పీ ఉంది? క్వాటర్కు ఎంత? ఫుల్ బాటిల్కు ఎంత? ఏ డిపో నుంచి తెచ్చారు?.. తదితర విషయాలను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఒక వేళ దుకాణదారు ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం విక్రయిస్తే అదే యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అలాగే వాట్సప్ నంబర్ 7989111222కు గానీ, 18004252523 టోల్ ఫ్రీ నంబర్కుకానీ ఫిర్యాదు చేయవచ్చు. నిర్ణీత సమయం దాటిన తరువాత మద్యం విక్రయించినా, సమయం కంటే ముందే దుకాణం తెరిచినా కూడా ఈ యాప్ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అలాగే ఆయా ప్రాంతాల్లో ఎక్కువగా అమ్ముడయ్యే 25 బ్రాండ్ల మద్యం ధరలను, 5 బీరు బ్రాండ్ల ధరలను దుకాణాలవద్ద ప్రామాణిక పట్టిక ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ యాప్ ద్వారా ఎమ్మార్పీ ఉల్లంఘనలను పూర్తిగా నిరోధించవచ్చని పద్మారావు గౌడ్ అన్నారు. -
చిన్నారుల కోసం ఫేస్బుక్ కొత్త యాప్
శాన్ఫ్రాన్సిస్కో: ఇంటర్నెట్ను వినియోగించే 12 ఏళ్లలోపు చిన్నారుల కోసం ఫేస్బుక్ సరికొత్త యాప్ను తీసుకొచ్చింది. ‘మెసెంజర్ కిడ్స్’గా వ్యవహరిస్తున్న ఈ యాప్ ద్వారా చిన్నారులు తమ స్నేహితులతో వీడియో చాటింగ్తో పాటు మెసేజ్లు పంపవచ్చని ప్రాడక్ట్ మేనేజర్ లోరెన్ చెంగ్ తెలిపారు. ఈ యాప్పై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉంటుందనీ.. తల్లిదండ్రుల అనుమతి లేకుండా చిన్నారులు ఎవరితోనూ మాట్లాడలేరని వెల్లడించారు. ఈ యాప్ను టెస్టింగ్ నిమిత్తం అమెరికాలోని యాపిల్ ఐవోఎస్ పరికరాల్లో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. -
సేవ్ డేటా.. గూగుల్ సరికొత్త యాప్
సాక్షి : గూగుల్ మరో సరికొత్త యాప్ను విడుదల చేసింది. మొబైల్ డేటా వాడకం నియంత్రణ కోసం డేటాల్లీని ప్రవేశపెట్టింది. ఈ యాప్ ద్వారా వినియోగదారుడు ఎంత డేటాను వాడాడో తెలుసుకుని.. తద్వారా డేటాను సేవ్ చేసుకోవచ్చు. పైగా దీనిద్వారా మరో కీలక సమస్య కూడా పరిష్కారం అవుతుందని గూగుల్ ప్రకటించింది. కొన్ని కొన్నిసార్లు వాడకపోయినప్పటికీ.. బ్యాక్ గ్రౌండ్లో కొన్ని యాప్లు డేటాను ఆటోమేటిక్గా వినియోగించుకుంటాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకే డెటాల్లీ యాప్ బాగా సహకరిస్తుంది. తద్వారా దాదాపు 30 శాతం మొబైల్ డేటాను సేవ్ చేసే సదుపాయం కలుగుతుంది. అలాగే ఈ యాప్ ద్వారా దగ్గరలో ఉన్న వైఫై నెట్వర్క్లను కనిపెట్టవచ్చు. నాణ్యమైన ఇంటర్నెట్ వేగాన్ని అందించే నెట్వర్క్లను ఈ యాప్ ద్వారా ఎంచుకోవచ్చు. గూగుల్ సంబంధిత నెక్స్ట్ బిలియన్ యూజర్స్ దీనిని సృష్టించింది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ 5.0 ఆపైన వర్షన్ ఉన్న ఫోన్లలో.. ప్లేస్టోర్లో ఈ యాప్ అందుబాటులో ఉంది. -
అశ్లీలతకు బ్రేక్.. హర హర మహాదేవ!
వారణాసి : బనారస్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఒకాయన కనిపెట్టిన యాప్ అశ్లీల సైట్లకు బ్రేకులు వేస్తుందంట. ఆ యాప్ ఉన్న ఫోన్లలో పోర్న్ సైట్లు ఓపెన్ చేస్తే చాలూ వాటిని బ్లాక్ చేయటమే కాదు.. వెంటనే భక్తి పాటలు మారుమోగుతాయి కూడా. సంస్కారి యాప్గా ఇప్పుడు ఇది ప్రాచుర్యం పొందుతోంది. బనారస్ హిందూ యూనివర్సిటీ న్యూరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ విజయనాథ్ 'హర హర మహదేవ' పేరిట దీనిని రూపొందించారు. అశ్లీల కంటెంట్ లేదా తీవ్ర హింస ఉన్న వీడియోలు, ఫోటోలు ఓపెన్ చేస్తే చాలూ ఇది పని చేస్తుందన్న మాట. ముఖ్యంగా తమ తల్లిదండ్రుల నిఘాకు దొరక్కుండా తప్పించుకుని తిరిగే పిల్లల కోసం దీనిని డెవలప్ చేసినట్లు ఆయన చెబుతున్నారు. ఈ యాప్కు ఉన్న మరో స్పెషాలిటీ ఏంటంటే.. ఇది ఇన్స్టాల్ చేశాక హైడ్లోకి వెళ్లిపోతుంది. తద్వారా దానిని ఇన్స్టాల్ చేశారన్న విషయం కూడా ముందు వారు గుర్తించలేకపోతారన్నమాట. దీనిని harharmahadev.co వెబ్సైట్ నుంచి ఈ వెబ్ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవచ్చని విజయనాథ్ తెలిపారు. ప్రస్తుతం ఈ యాప్ హిందూ భక్తిపాటలను మాత్రమే ప్లే చేస్తోందని, త్వరలో ఇతర మతాల గీతాలను కూడా పొందుపరిచి యాప్ను అభివృద్ధి చేస్తామని ఆయన వెల్లడించాడు. అయితే ల్యాప్ ట్యాప్లు, డెస్క్ టాప్ వర్షన్లకు అందుబాటులో ఉన్న ఈ యాప్ అండ్రాయిడ్ ఫోన్లకు పూర్తిస్థాయిలో రావటానికి కాస్త సమయం పడుతుందని వెబ్ డెవలపర్ అంకిత్ శ్రీవాస్తవ చెబుతున్నారు. -
ఆ యూజర్లకు వాట్సాప్ కొత్త యాప్
శాన్ఫ్రాన్సిస్కో : ఫేస్బుక్ చెందిన మెసేజింగ్ సర్వీసెస్ వాట్సాప్, ఐప్యాడ్ యూజర్ల కోసం ఓ కొత్త యాప్ను లాంచ్ చేసేందుకు సిద్దమవుతుంది. ఈ విషయాన్ని పాపులర్ వాట్సాప్ ఛేంజ్ ట్రాకింగ్ వెబ్సైట్ డబ్ల్యూఏబీటాఇన్ఫో ట్వీట్ చేసింది. ఐప్యాడ్ కోసం అప్లికేషన్ రూపొందించేందుకు వాట్సాప్ సిద్దమవుతుందని పేర్కొంది. ''ఐప్యాడ్ డివైజ్ కలిగి ఉన్న వాట్సాప్ యూజర్లకు గ్రేట్ న్యూస్. ఇతర రూమర్లు వాట్సాప్ బిజినెస్, ఫేస్బుక్ ఇన్ఫ్రాక్ట్ర్చర్ నిజమైన మాదిరి, ఐప్యాడ్ కోసం వాట్సాప్ కొత్త యాప్ కూడా నిజం'' అని డబ్ల్యూబీటాఇన్ఫో ట్వీట్ చేసింది. ఐప్యాడ్ అప్లికేషన్ కోసం వాట్సాప్ డెస్క్టాప్ 0.2.6968 యాప్ సంకేతాలను ట్విట్టర్లో పోస్టు చేసింది. అయితే ఇది స్టాండలోన్ అప్లికేషనా? లేదా క్లయింట్ అప్లికేషనా? అనే విషయాన్ని వాట్సాప్ ట్రాకింగ్ వెబ్సైట్ రివీల్ చేయలేదు. వాట్సాప్ ఇటీవల కొత్త కొత్త ఫీచర్లను యూజర్ల కోసం ప్రవేశపెడుతోంది. డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఫీచర్ను ఇటీవలే వాట్సాప్ కొత్తగా తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా పొరపాటున గ్రూప్లో లేదా ఎవరికైనా మెసేజ్ పంపితే 7 నిమిషాల వ్యవధిలో దాన్ని డిలీట్ చేసుకునే వెసులుబాటు ఉంది. -
ఫిట్నెస్ కోసం సరికొత్త యాప్
-
ఎగ్జామ్ సెంటర్ తెలుసుకునేందుకు ‘ఆప్’
హైదరాబాద్సిటీ: తెలంగాణ సచివాలయంలో ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్ సెంటర్ లొకేటర్ ఆప్ ను విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రంజీవ్ ఆర్ ఆచార్య ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థను పటిష్టం చేస్తోందన్నారు. విద్యార్థులు పరీక్షా సమయంలో సెంటర్ లు దొరక్క ఇబ్బందులు పడుతున్నారని, వాటిని దృష్టిలో ఉంచుకొని ఈ లొకేటర్ ఆప్ ని విడుదల చేశామని తెలిపారు. దేశ చరిత్ర లొనే ఇలాంటి ఆప్ ను రూపొందించడం మొదటిసారని అన్నారు. విద్యార్థులు ఆప్ని ఆండ్రాయిడ్ మొబైల్ లో డౌన్ లోడ్ చేసుకొని, హాల్ టికెట్ నెంబర్ ని ఎంటర్ చేస్తే ఎగ్జామ్ సెంటర్ బిల్డింగ్ తో పాటు లొకేషన్ రూట్ మ్యాప్ చూపిస్తుందన్నారు. ఇంటి నుంచి సెంటర్ కి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందో కూడా ఈ ఆప్ ద్వారా తెలుసుకోవచ్చుని తెలిపారు. -
మిత్రులను కలిసేందుకు ఓ యాప్!
లండన్: మీరు ఫ్రీగా ఉన్నారా? సరదాగా స్నేహితులను కలిసేందుకు బయటికి వెళదామనుకుంటున్నారా? తీరా ఊరి చివర ఉన్న మీ మిత్రులను కలిసేందుకు వెళితే.. వాళ్లు మరో పనిలో బిజీగా ఉంటే.. మీరు వెళ్లినా ప్రయోజనం ఉండదు. ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపేలా 'వూస్ డౌన్' పేరిట గూగుల్ ఒక కొత్తయాప్ను ప్రవేశపెట్టింది. దీన్ని ఉచితంగానే డౌన్లోడ్ చేసుకోవచ్చని 'డెయిలీ మెయిల్' తెలిపింది. మీరు విధులు లేదా పనులు ముగించుకున్న వెంటనే ఇందులో ఆ విషయాన్ని ఎంటర్ చేయాలి. వెంటనే మీకు సమీపంలో మీ మిత్రులు ఎవరెవరు ఫ్రీగా ఉన్నారో యాప్ చూపిస్తుంది. -
జైహింద్ అంటే చాలు జెండాఎగిరేలా యాప్
-
మైక్రోసాఫ్ట్లోనూ ట్రాన్స్లేటర్..
సాక్షి, హైదరాబాద్: ఒక భాషను వివిధ రకాల భాషల్లోకి మార్చుకునేందుకు మనం ఎక్కువగా గూగుల్ ట్రాన్స్లేటర్ను వాడుతుంటాం. ఇకపై మైక్రోసాఫ్ట్లో కూడా ఆ సదుపాయం అందుబాటులోకి రానుంది. మైక్రోసాఫ్ట్ ట్రాన్స్లేటర్ పేరుతో ఆ సంస్థ సరికొత్త యాప్ను విడుదల చేసింది. ఐవోఎస్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, ట్యాబ్, స్మార్ట్ఫోన్, స్మార్ట్వాచీల్లోనూ ఈ లోనూ ఈ యాప్ పనిచేస్తుందని సంస్థ అధికారులు తెలిపారు. గూగుల్ ట్రాన్స్లేటర్ 27 రకాల భాషలు, వాయిస్ కన్వర్జేషన్కు మాత్రమే సహకరిస్తుండగా.. మైక్రోసాఫ్ట్ ట్రాన్స్లేటర్లో 50 రకాల భాషలను అనువదించుకోవచ్చు. అంతేకాకుండా త్వరలో స్కైప్కు కూడా ప్రత్యేక ట్రాన్స్లేటర్ యాప్ను రూపొందించనున్నట్లు సంస్థ వెల్లడించింది. గతంలో మైక్రోసాఫ్ట్ బింగ్ వైబ్సైట్ ద్వారా విండోస్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టం, విండోస్ 10 డెస్క్టాప్ సాఫ్ట్వేర్లో ట్రాన్స్లేటర్ సదుపాయాన్ని అందుబాటులో ఉంచింది. -
టూ కాలర్ నుంచి ట్రూ డయలర్ యాప్
న్యూఢిల్లీ: ఫోన్బుక్లో లేకపోయినప్పటికీ మనం కాల్ చేస్తున్న నంబరుకు సంబంధించిన వారి వివరాలను చెప్పేసే కొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది. ట్రూ డయలర్ పేరిట ఫోన్ డెరైక్టరీ యాప్ సంస్థ ట్రూకాలర్ దీన్ని ఆవిష్కకరించింది. ఈ యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన ఫోన్బుక్లో లేని కొత్త నంబరుకు కాల్ చేయాల్సి వచ్చినప్పుడు సదరు నంబరును ఉపయోగిస్తున్న వారి పేరు, ప్రొఫైల్ ఫొటో వంటి వివరాలను ఈ యాప్ ఆటోమేటిక్గా సెర్చి చేసి, అందిస్తుంది. ఇది పూర్తిగా ఉచిత యాప్. ప్రస్తుతం ట్రూకాలర్కి ప్రపంచవ్యాప్తంగా 8.5 కోట్ల మంది యూజర్లు ఉండగా.. ఇందులో దాదాపు సగభాగం భారత్ నుంచే ఉన్నారు. -
మీ చుట్టూ ఏముందో చెబుతుంది..
మీరెక్కడికైనా వెళితే ఆ ప్రాంతంలో, ఆ సమయంలో ఏం జరుగుతుందో మీకు తెలుసా? మీకు సమీపంలో మీకు అవసరమైన హోటల్లు, ఇతర షాపింగ్ కేంద్రాలు ఎక్కడున్నాయో తెలుసుకోవాలని ఉందా? అయితే సరికొత్త యాప్.. ‘యెటి’ని మీ స్మార్ట్ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సిందే! ఒకే రకమైన హాబీలు, అభిప్రాయాలు ఉన్నవారిని ఒక్కచోటికి చేర్చే ‘ఎట్ ద పూల్’ వెబ్సైట్ యాజమాన్యం ఈ సరికొత్త యాప్ను రూపొందించింది. ‘యెటి’ ద్వారా మీ తరహా హాబీలున్నవారితో అభిప్రాయాలు పంచుకోవచ్చు. మీరు ఏ ప్రాంతానికి వెళ్లినా.. అక్కడ ఉండే మీ స్నేహితుల వివరాలను ఈ యాప్ చూపిస్తుంది. అంతేకాదు అక్కడ మీకు రెస్టారెంట్లు, పెట్రోల్ బంకులు, షాపింగ్ కేంద్రాలు, సినిమా హాళ్లు వంటి అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది. ఈ ‘యెటి’ని ప్రస్తుతం యాపిల్ ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకోవచ్చని, ఆండ్రాయిడ్ వెర్షన్ను త్వరలోనే విడుదల చేస్తామని ఎట్ ద పూల్ ప్రతినిధి డేవిడ్ జిమ్మర్మాన్ తెలిపారు. -
ఫొటోలు, వీడియోల షేరింగ్కి ఫేస్బుక్ కొత్త యాప్
న్యూయార్క్: సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్ తాజాగా స్లింగ్షాట్ పేరిట కొత్త యాప్ను ప్రవేశపెట్టింది. ఇది ఫొటోలు, వీడియోలను షేర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇతరులు పంపిన కంటెంట్ను చూడాలంటే స్లింగ్షాట్ యూజర్లు తాము కూడా ఏదైనా కంటెంట్ను షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది యూజర్లు మరింత సృజనాత్మకంగా ఆలోచించేందుకు, మరిన్ని ఫొటోలూ, వీడియోలు అప్లోడ్ చేసేందుకు తోడ్పడుతుందని సంస్థ ప్రోడక్ట్ డిజైనర్ జోయి ఫ్లిన్ తెలిపారు. అవతలివారు చూసిన తర్వాత సదరు కంటెంట్ సిస్టమ్ నుంచి ఆటోమేటిక్గా తొలగిపోతుంది. ప్రత్యేక ఆప్షన్ని ఎంచుకుంటే తర్వాత కూడా చూసుకునే వీలుంటుంది -
కావాల్సిన వార్తలు ఎంచుకోవడానికి కొత్త యాప్
వాషింగ్టన్: ఆన్లైన్లో మనకు కావాల్సిన వార్తలను ఎంచుకోవడంలో ఎదురయ్యే ఇబ్బందులను తొలగించి సులభంగా మంచి కథనాలను ఎంచుకోవడానికి వీలుకల్పించే ఓ కొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది. ట్రూక్లిక్ అనే పేరుతో ఈ యాప్ను ప్యారిస్కు చెందిన బృందం రూపొందించింది. మనం చదువుతున్న కథనంలో ఏవైనా అసంబద్ధమైన, అవాస్తవమైన అంశాలుంటే ఈ యాప్ మనను అప్రమత్తం చేస్తుంది. మనం చదువుతున్న కథనానికి, ఇతర మీడియాలో వచ్చిన అదే అంశానికి తేడాలున్నా ఇది ఎత్తిచూపిస్తుందని పాయింటర్ డాట్ ఆర్గ్ అనే సైట్ పేర్కొంది. ప్రస్తుతం ఇది వార్తలకు మాత్రమే పరిమితమైందని, త్వరలో సామాజిక సైట్లలో అనువైన వీడియోలను ఎంచుకోవడానికి కూడా అందుబాటులోకి రానుందని ఆ సైట్ వెల్లడించింది.