nivetha Thomas
-
బీచ్ ఒడ్డున నివేదా.. బిగ్ బాస్ దివి చిల్
బీచ్ ఒడ్డున నివేదా థామస్..చిల్ అవుతోన్న బిగ్బాస్ దివి..యోగాసనాలతో బిజీగా మంచు లక్ష్మి..ఆధ్యాత్మిక యాత్రలో రేణు దేశాయ్..గోవాలో ఎంజాయ్ చేస్తోన్న కల్యాణి ప్రియదర్శన్..లండన్లో బాలీవుడ్ భామ నోరా ఫేతేహి.. View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by renu desai (@renuudesai) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) -
హాలీడే ట్రిప్లో పాలక్ తివారీ.. ఖుషీ కపూర్ స్టన్నింగ్ లుక్స్!
హాలీడే ట్రిప్లో చిల్ అవుతోన్న పాలక్ తివారీ..నివేదా థామస్ షాకింగ్ లుక్..రెడ్ డ్రెస్లో ఖుషీ పాప స్టైలిష్ పోజులు..ఐశ్వర్య రాజేశ్ బర్త్ డే పోస్ట్.. View this post on Instagram A post shared by Prashun Prashanth Sridhar (@prachuprashanth) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Palak Tiwari (@palaktiwarii) -
తమిళ్లో మెప్పిస్తున్న తెలుగు చిన్న సినిమా
తెలుగులో చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయాన్ని సాధించిన చిత్రం '35 చిన్న కథ కాదు'.. నివేదా థామస్, అరుణ్దేవ్ పోతుల, విశ్వదేవ్, గౌతమి, ప్రియదర్శిని, దర్శకుడు కే.భాగ్యరాజ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి నంది కిశోర్ ఇమాని దర్శకత్వం వహించారు. సృజన్ వాల్టైర్ ప్రొడక్షన్న్స్ పతాకంపై సృజన్ వరబోల, సిద్ధార్థ్ రాళ్లపల్లి, కలసి నిర్మించిన ఈ చిత్రం గత సెప్టెంబర్లో విడుదల మంచి విజయాన్ని సాధించింది. మధ్య తరగతి కుటుంబం నేపథ్యంలో రూపొందిన బలమైన కథ, కథనాలతో తెరకెక్కించిన చిత్రం ఇది. ముఖ్యంగా పిల్లల విద్య, వారి ఇష్టాఇష్టాలు వంటి సున్నితమైన అంశాలతో కూడిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. నివేద థామస్ సహజత్వంతో కూడిన నటన చిత్రానికి అదనపు బలంగా నిలిచింది. ఆమె ఇందులో ఇద్దరు పిల్లల తల్లిగా నటించడం విశేషం. తెలుగులో విమర్శకులను సైతం మెప్పించిన చిత్రం ఇప్పుడు '35 చిన్న విషయం ఇల్లై' పేరుతో తమిళంలోకి అనువాదమై క్రిస్మస్ సందర్భంగా కోలీవుడ్లో విడుదలైంది. దీన్ని తెలుగులో నిర్మించిన నిర్మాతలే తమిళంలోనూ విడుదల చేశారు. దీనికి నికేశ్ బొమ్మి చాయాగ్రహణం, వివేక్సాగర్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రానికి తమిళంలో కూడా మంచి ఆదరణ దక్కడం విశేషం. తెలుగు వర్షన్ ఆహా తెలుగు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. -
క్రిస్మస్ సెలబ్రేషన్స్.. టాలీవుడ్ హీరోయిన్స్ గ్లామర్
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా క్రిస్మస్ (Christmas 2024) పండగని ప్రతిఒక్కరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. టాలీవుడ్ హీరోయిన్లు కూడా రాత్రి నుంచే సెలబ్రేషన్స్ షురూ చేశారు. క్రిస్మస్ టోపీలు పెట్టుకుని, కేకులు కట్ చేస్తూ ఫొటోలకు పోజులిచ్చారు. వీళ్లలో నమ్రత, నివేదా థామస్, కృతిశెట్టి (Krithi Shetty), కావ్య కల్యాణ్ రామ్, ప్రగ్యా జైస్వాల్, ఈషా రెబ్బా, మౌనీ రాయ్, రమ్య పాండియన్, ఆకాంక్ష సింగ్, మంచు విష్ణు (Manchu Vishnu) ఉన్నారు. ఆ ఫొటోలపై మీరు ఓ లుక్కేయండి.(ఇదీ చదవండి: మోహన్ లాల్ 'బరోజ్' సినిమా రివ్యూ) View this post on Instagram A post shared by Nandini Rai (@nandini.rai) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Vishnu Manchu (@vishnumanchu) View this post on Instagram A post shared by POOJA BEDI (@poojabediofficial) View this post on Instagram A post shared by SriRamya Paandiyan (@actress_ramyapandian) View this post on Instagram A post shared by Aakanksha Singh (@aakankshasingh30) View this post on Instagram A post shared by Mithila Palkar (@mipalkarofficial) View this post on Instagram A post shared by Rithu Manthra (@rithumanthra_) View this post on Instagram A post shared by Samyuktha Shan (@samyuktha_shan) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Mirnaa (@mirnaaofficial) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Malavika C Menon (@malavikacmenon) View this post on Instagram A post shared by Nussrat Jahan (@nusratchirps) View this post on Instagram A post shared by Siri Hanumanthu (@sirihanmanth) View this post on Instagram A post shared by Malvika Sharma (@malvikasharmaofficial) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Meera Jasmine (@meerajasmine) -
ఓటీటీలోకి ఫీల్ గుడ్ మూవీ.. ప్రతి తల్లిదండ్రులు చూడాల్సిందే!
ఇప్పుడంతా ఎక్కువగా మాస్, యాక్షన్ మూవీస్కే ఓటేస్తున్నారు. అదే టైంలో ఫీల్ గుడ్ మూవీస్ తీసినా సరే ఆదరిస్తున్నారు. అలా రీసెంట్ టైంలో అద్భుతమైన ప్రశంసలు దక్కించుకున్న చిత్రం '35'. నివేదా థామస్ లీడ్ రోల్ చేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఫీల్ గుడ్ కాన్సెప్ట్తో తీసిన ఫ్యామిలీ డ్రామా ఏ ఓటీటీలో ఉంది? ఎందుకు చూడాలి?ప్రస్తుతం పిల్లలు చదువు వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారు. అయితే చదువు విషయంలో తల్లిదండ్రులు పిల్లలకు సపోర్ట్ చేయడం ఎంత ముఖ్యమనే విషయాన్ని ఈ మూవీలో చాలా చక్కగా చూపించారు. పిల్లల చదువుపై మధ్య తరగతి పేరెంట్స్కి ఉండే ఆలోచన, వారి కుటుంబ పరిస్థితులని అందరికీ కనెక్ట్ అయ్యేలా చూపించారు. పిల్లలో ఉండే సందేహాలని కూడా పట్టించుకోవాలనేది కూడా చర్చించారు. '35' పేరుతో తీసిన ఈ చిత్రం ఆహా ఓటీటీలోకి ఇప్పుడు వచ్చేసింది.(ఇదీ చదవండి: సోనియాలా మారిపోతున్న యష్మీ.. బక్వాస్ గేమ్ అని చాడీలు)'35' స్టోరీ విషయానికొస్తే.. తిరుపతిలో మ్యాథ్స్ సబ్జెక్టులో వెనుకపడిన విద్యార్థిని.. ఉపాధ్యాయుడు జీరో అని పిలుస్తుంటాడు. స్కూల్లో ఉండాలంటే ఆ సబ్జెక్టులో ఆ పిల్లాడు తప్పక 35 పాస్ మార్కులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. కొడుకు కోసం తల్లి మ్యాథ్స్ నేర్చుకుంటుంది. తర్వాత కొడుక్కి మ్యాథ్స్ నేర్పిస్తుంది. చివరకు పిల్లాడు కావాల్సిన మార్కులు తెచ్చుకున్నాడా? అనేది మెయిన్ పాయింట్.ఇందులో పిల్లాడి నటన ఎంత హైలైటో.. తల్లిగా నివేధా థామస్ కూడా అంతే అద్భుతంగా నటించింది. చూస్తున్నంతసేపు చాలామంది తమని తాము రిలేట్ అయ్యేంతలా జీవించేసింది. ప్రియదర్శి, విశ్వదేవ్ రాచకొండ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రానా నిర్మాతగా వ్యవహరించారు. ఎలానూ గాంధీ జయంతితో పాటు వీకెండ్ టైమ్ చేయాలనుకుంటే ఈ మూవీని అస్సలు మిస్సవ్వొద్దు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్) -
మా సినిమాకు డిస్టింక్షన్ మార్కులు వేశారు : విశ్వదేవ్
‘‘35–చిన్న కథ కాదు’ సినిమా కథ విన్నప్పుడే అందులోని ప్రసాద్ పాత్ర చేయాలనుకున్నాను. సినిమా విడుదల తర్వాత నా పాత్రకి వచ్చిన స్పందన చాలా ఆనందాన్ని ఇచ్చింది’’ అని విశ్వదేవ్ అన్నారు. నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘35–చిన్న కథ కాదు’. నందకిశోర్ ఈమాని దర్శకత్వం వహించారు. రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా విశ్వదేవ్ మాట్లాడుతూ– ‘‘విమర్శకులు, ప్రేక్షకులు ముక్త కంఠంతో మా సినిమాని ప్రశంసించడంతో పాటు డిస్టింక్షన్ మార్కులు వేయడం సంతోషంగా ఉంది. నంద కిశోర్ సినిమాని చక్కగా తీశాడు. నా కెరీర్లో అన్ని విషయాల్లో సంతృప్తి ఇచ్చిన చిత్రం ఇది. పెద్దలు, పిల్లలు, గ్రాండ్ పేరెంట్స్ కలిసి చూడాల్సిన అందమైన సినిమా ఇది’’ అన్నారు. -
#NivethaThomas : నిండైన చందమామలా నివేదా థామస్ (ఫొటోలు)
-
#NivethaThomas : టాలీవుడ్ హీరోయిన్ ఇలా అయిపోయిందేంటి? (ఫోటోలు)
-
'ఇది చిన్న కథ కాదు'.. రిలీజ్ ఎప్పుడంటే?
నివేదా థామస్, ప్రియదర్శి పులికొండ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం '35-చిన్న కథ కాదు'. నంద కిషోర్ ఈమని దర్శకత్వం వహించిన ఈ మూవీని రానా దగ్గుబాటి సమర్పణలో సురేశ్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ విషయాన్ని టాలీవుడ్ హీరో రానా ట్విటర్ ద్వారా షేర్ చేశారు.ఈ చిత్రం సెప్టెంబర్ 6న థియేటర్లలో విడుదల కానున్నట్లు వెల్లడించారు. ప్రియదర్శి బర్త్ డే కావడంతో రిలీజ్ తేదీతో పాటు స్పెషల్ పోస్టర్ను పంచుకున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్ చూస్తే ఈ సినిమాను ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎమెషన్స్ కథాంశంతో ఈ సినిమాను రూపొందించారు. ఈ మూవీలో విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ కీలక పాత్రలు పోషించారు. Get ready to experience the heartwarming Story of every household ❤️ ✨️ "Chinna Katha Kaadu"#35Movie in Theatres on SEPTEMBER 6th!#35CKK @i_nivethathomas @imvishwadev @PriyadarshiPN @gautamitads #NandaKishore @nikethbommi #VivekSagar @siddharthr87 @srujanyarabolu1… pic.twitter.com/aanB0IcZq5— Rana Daggubati (@RanaDaggubati) August 25, 2024 -
కథ వినగానే మా అమ్మ గుర్తొచ్చింది- రానా
‘‘పాఠశాలలో చదువుతున్నప్పుడు 35 నంబర్ నాకు పెద్ద పర్వతంలాంటిది (నవ్వుతూ). నందు ‘35–చిన్న కథ కాదు’ చెప్పినప్పుడు నాకు నేను గుర్తొచ్చాను, మా అమ్మ గుర్తొచ్చింది. ఈ కథని మా అమ్మకు చెప్పాను. ఇది మన అందరి కథ. ఈ కథని అందరూ రిలేట్ చేసుకుంటారు’’ అని హీరో రానా దగ్గుబాటి అన్నారు. నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘35–చిన్న కథ కాదు’. నంద కిశోర్ ఈమాని దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. బుధవారం హైదరాబాద్లో నిర్వహించిన ఈ చిత్రం టీజర్ లాంచ్ ఈవెంట్లో రానా మాట్లాడుతూ– ‘‘వాణిజ్య సినిమాలు చాలా వస్తుంటాయి. కానీ ఇలాంటి ప్యూర్ హార్ట్ వార్మింగ్ స్టోరీలు రావడం చాలా అరుదు. ఇలాంటి మంచి కథలు సురేష్ ప్రొడక్షన్లో చేయాలనేది మా ఉద్దేశం. థియేటర్స్లో ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు. ‘‘35–చిన్న కథ కాదు’లో తల్లి పాత్రలో కనిపిస్తాను. ఇప్పటివరకూ నేను చేసిన పాత్రల్లో చాలా డిఫరెంట్ క్యారెక్టర్ని ఈ సినిమాలో చేశాను’’ అన్నారు నివేదా థామస్. ‘‘35–చిన్న కథ కాదు’ చాలా పెద్ద సినిమా’’ అన్నారు నంద కిశోర్. ‘‘ఈ సినిమా గొప్ప అనుభూతినిస్తుంది. మాకు మైలురాయిగా నిలిచి΄ోతుంది’’ అన్నారు సృజన్ యరబోలు. ఈ కార్యక్రమంలో నటుడు విశ్వదేవ్ మాట్లాడారు. -
‘35’ (చిన్న కథ కాదు) మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'35 చిన్న కథ కాదు'.. ఆసక్తి పెంచుతోన్న టీజర్!
నివేదా థామస్, విశ్వదేవ్ ఆర్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం '35 చిన్న కథ కాదు'. ఈ సినిమాకు నందకిశోర్ ఇమాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 15న థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు.కాగా.. తిరుపతి నేపథ్యంలో జరిగే ఈ కథలో నివేదా థామస్ తల్లి పాత్ర పోషించారు. పరీక్షల్లో పాస్ మార్కులు కూడా రానందుకు తండ్రి మందలించగా.. కొడుకు ఇంటి నుంచి వెళ్లిపోతాడు. కుమారుడి కోసం తల్లి ఆరాటపడటం లాంటి సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీని తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. -
పెళ్లి రూమర్స్.. క్లారిటీ ఇచ్చేసిన హీరోయిన్ నివేతా థామస్
హీరోయిన్ నివేతా థామస్ పెళ్లి చేసుకోబోతుందా? సోషల్ మీడియా అంతా ఒకటే గోల. జస్ట్ ఇన్ స్టాలో ఓ స్టోరీ పెట్టిందో లేదో రూమర్స్ తెగ వచ్చాయి. వచ్చే వారం నిశ్చితార్థం అని కొందరు, ఇప్పటికే పెళ్లి అయిపోయిందని మరికొందరు మాట్లాడుకున్నారు. కానీ పలువురు ఊహించినట్లే అది పెళ్లి గురించి కాదు. అందుకు సంబంధించి నివేతా క్లారిటీ ఇచ్చేసింది.(ఇదీ చదవండి: మొదటిసారి ప్రెగ్నెన్సీ.. స్టార్ హీరో భార్యకు అలాంటి అనుభవం!)జెంటిల్మేన్, నిన్ను కోరి, బ్రోచెవారెవరురా, వకీల్ సాబ్ తదితర చిత్రాలతో తెలుగు హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న నివేతా పేతురాజ్.. తెలుగులో చివరగా 'శాకినీ డాకినీ' మూవీ చేసింది. ఇది రిలీజై రెండేళ్లకు పైనే అయిపోయింది. గతేడాది ఓ మలయాళ మూవీ చేసింది. ఆ తర్వాత పెద్దగా బయటకు కనిపించలేదు. దీంతో నివేతా ఏం చేస్తుందా అని అందరూ అనుకున్నారు. కొంపదీసి పెళ్లి ఏమైనా చేసేసుకుందా అని మాట్లాడుకున్నారు.సోమవారం సాయంత్రం 'ఫైనల్లీ' అని చెప్పి లవ్ సింబల్ ఏమోజీని ఇన్ స్టా స్టోరీలో పెట్టడంతో గుడ్ న్యూస్ ఏమైనా చెబుతుందేమో అనుకున్నారు. కానీ అది తను లీడ్ రోల్ చేస్తున్న '35 చిన్న కథ కాదు' మూవీ కోసమని చెప్పి క్లారిటీ ఇచ్చింది. హీరో రానా నిర్మిస్తున్న ఈ మూవీలో నివేతాతో పాటు ప్రియదర్శి, గౌతమి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నట్లు ప్రకటించారు. 'పుష్ప 2' కోసం అనుకున్న ఆగస్టు 15న దీన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?) View this post on Instagram A post shared by Nanda Kishore Emani (@emaninandakishore) -
పెళ్లికి రెడీ అయిన టాలీవుడ్ హీరోయిన్.. వైరలవుతోన్న పోస్ట్!
టాలీవుడ్ హీరోయిన్ నివేదా థామస్ గురించి పరిచయం అక్కర్లేదు. బాలనటిగా తెరంగేట్రం చేసిన కేరళ కుట్టి తెలుగులోనూ స్టార్ హీరోల సరసన అలరించింది. జెంటిల్మేన్ నుంచి వకీల్ సాబ్ వరకు తనదైన నటనతో మెప్పించింది. నిన్నుకోరి, బ్రోచేవారెవరురా, జై లవకుశ, 'జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్' యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ 118, వీ లాంటి టాలీవుడ్ సినిమాల్లో మెరిసింది. తెలుగుతో పాటు మలయాళం, తమిళ భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.తాజాగా ఈ ముద్దుగుమ్మ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాను ప్రేమలో పడినట్లు ట్విటర్లో లవ్ సింబల్ను పోస్ట్ చేసింది. 'కొంత కాలం గడిచింది... కానీ...ఫైనల్లీ' అంటూ లవ్ సింబల్ను పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు ఎంగేజ్మెంట్ చేసుకున్నారా? అని కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు నివేదా థామస్కు అభినందనలు చెబుతున్నారు. ఇంతకీ నివేదా ప్రియుడు ఎవరా? అని కొందరు ఆరా తీస్తున్నారు. అయితే మరికొందరేమో ఏదైనా మూవీ అప్డేట్ అయి ఉంటుందేమో అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిపై ఆమె క్లారిటీ ఇస్తే కానీ ఫ్యాన్స్కు డౌటానుమానాలు క్లియర్ అవుతాయి. It’s been a while….. but. Finally! ❤️— Nivetha Thomas (@i_nivethathomas) June 24, 2024 -
ఆ ఫోటోలోని క్యూట్ బేబీ టాలీవుడ్లో స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా?
బాల్యంలోనే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి.. నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంది. సీరియల్స్తో పాటు సినిమాల్లోనూ నటించింది. టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఆమె వరుస సినిమాలతో అదరగొట్టింది. ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. పై ఫోటోలో తన తండ్రి చేతిలో క్యూట్గా కనిపిస్తోన్న ఆ చిన్నారి తెలుగులో స్టార్ హీరోయిన్. ఇంతకీ ఎవరో మీరు గుర్తు పట్టారా? (ఇది చదవండి: డబ్బుల కోసం పెళ్లి చేసుకుంటే ఇలానే ఉంటుంది: కంగనా కౌంటర్) ఆ ఫోటోలోని క్యూట్ చిన్నారి ఎవరంటే.. మలయాళీ ముద్దుగుమ్మ నివేదా థామస్. నేచురల్ స్టార్ నాని జెంటిల్మెన్ మూవీతో హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ.. ఆ తర్వాత నిన్నుకోరి, జై లవ కుశ, 118, బ్రోచేవారెవరురా, వి, జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్, వకీల్ సాబ్ చిత్రాల్లో నటించింది. అంతేకాకుండా శాకిని డాకిని లాంటి లేడీ ఓరియంటెడ్ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించింది. అంతకుముందే ఓరుతే వేరు భార్య చిత్రంలో మలయాళ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి.. తమిళంలోనూ చాలా సినిమాల్లో నటించింది. (ఇది చదవండి: అవతార్-2ను మించిన టికెట్ ధరలు.. ఆ సినిమాకు ఎందుకంత క్రేజ్!) కాగా.. ఈ ఏడాది ‘ఎంతడా సాజి’ అనే మలయాళ మూవీలో కనిపించిన భామ.. ప్రస్తుతం ఎలాంటి సినిమాలో నటించడం లేదు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అభిమానులతో టచ్లో ఉంటోంది. View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) -
అందమైన నవ్వుతో అట్రాక్ట్ చేస్తున్న కేరళ కుట్టి నివేదా థామస్ (ఫొటోలు)
-
‘శాకిని డాకిని' మూవీ ట్విట్టర్ రివ్యూ
రెజీనా కసాండ్రా, నివేదా థామస్ లీడ్ రోల్స్లో సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శాకిని డాకిని'.డి.సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్వూ థామస్ కిమ్ నిర్మించిన ఈ సినిమా నేడు(శుక్రవారం)విడుదలయ్యింది. యాక్షన్, డ్రామా, హాస్యం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇద్దరు మహిళా ట్రైనీ పోలీసులు ఒక నేరాన్ని ఎలా పరిష్కరించగలిగారు? అనేది ఈ చిత్ర కథ. కొరియన్ చిత్రం 'మిడ్నైట్ రన్నర్స్' రీమేక్ అయిన ఈ సినిమా నేడు(శుక్రవారం)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్కు మంచి స్పందన వచ్చింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో ‘శాకిని డాకిని' చిత్రంపై హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఆ రివ్యూ ఏంటో మీరే చూసేయండి. అయితే ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’బాధ్యత వహించదు. కొన్ని సన్నివేశాల విషయంలో లాజిక్ మిస్ అయ్యిందని నెటిజన్లు పేర్కొన్నారు. అలాగే ఎమోషనల్ సన్నివేశాల్లో ఆకట్టుకోలేక పోయారని,సెకండ్ హాఫ్ ఇంకాస్త బెటర్ గా ప్లాన్ చేసి ఉండవచ్చనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. #SaakiniDaakini Movie Review: ⭐⭐⅓ A Decent 1st Half & A Disappointing 2nd Half Comedy Worked in Parts, But if failed in making audience engaging - Runtime less than 2hrs A Below Par Watch #SaakiniDaakiniReview@i_nivethathomas @ReginaCassandra — Thyveiw (@Thyveiw) September 16, 2022 #SaakiniDaakini Ok Ok Sunday Show Confirm 🥲 — Chandra Sekhar ᥫ᭡ (@kvvcsr1432) September 16, 2022 Showtime @i_nivethathomas @ReginaCassandra starrer #SaakiniDaakini Playing with subs pic.twitter.com/8EyKPZnxGB — வன்மமொழிவர்மன் (@naveenversion2) September 16, 2022 -
‘శాకిని డాకిని’ చిత్రంలో ఆ క్రైమ్ గురించి చెబుతున్నాం
‘‘ప్రస్తుతం సమాజంలో మహిళలపై జరుగుతున్న ఓ పెద్ద నేరం గురించి ఇండియాలో ఎవరూ మాట్లాడటం లేదు. మా ‘శాకిని డాకిని’ చిత్రంలో ఆ క్రైమ్ గురించి చెబుతున్నాం కాబట్టి ప్రతి మహిళ ఈ చిత్రం చూడాలి’’ అని నిర్మాత సునీత తాటి అన్నారు. రెజీనా కసాండ్రా, నివేదా థామస్ లీడ్ రోల్స్లో సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శాకిని డాకిని’. డి.సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్వూ థామస్ కిమ్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా సునీత తాటి మాట్లాడుతూ– ‘‘గురు ఫిల్మ్స్పై నిర్మించిన 7వ చిత్రం ‘శాకిని డాకిని’. మహిళల సమస్యలపై మహిళలే మాట్లాడితే ఇంకా బాగా కనెక్ట్ అవుతారని లీడ్ రోల్స్లో రెజీనా, నివేదలను తీసుకున్నాం. ఇద్దరు మహిళా ట్రైనీ పోలీసులు ఒక నేరాన్ని ఎలా పరిష్కరించగలిగారు? అనేది ఈ చిత్ర కథ. ఇదొక యూనివర్శల్ కథ.. అందరికీ నచ్చుతుంది. సుధీర్ వర్మ వేరే షూటింగ్లో ఉండటం వల్లే ‘శాకిని డాకిని’ ప్రమోషన్స్లో పాల్గొనలేదు.. నేటి నుంచి పాల్గొంటారు. సురేశ్ బాబుగారితో అసోసియేట్ అవడం చాలా హ్యాపీ. మన చిత్రాలు కొరియన్, జపాన్ భాషల్లో చాలా రీమేక్ అవుతున్నాయి. థియేటర్లో సినిమా చూసినప్పుడు అందరం నవ్వుతాం.. ఏడుస్తాం. అదే ఓటీటీలో అయితే ఇంట్లో పర్సనల్గా అనుభూతి పొందుతాం. థియేటర్ అనుభూతే వేరు. మా బ్యానర్లో మరో నాలుగు కొరియన్ సినిమాలు రీమేక్ చేయనున్నాం.. వాటిలో సమంతతో ఓ సినిమా ఉంటుంది. డైరెక్టర్ బాపుగారంటే నాకు ఇష్టం. ఆయనలాంటి మూవీస్తో పాటు, ‘అవతార్’ లాంటి ఫ్యాంటసీ సినిమాలు డైరెక్ట్ చేయాలనుంది.. చేస్తాను’’ అన్నారు. -
బ్లాక్ డ్రెస్లో నివేదా.. భలే ఉంది (ఫొటోలు)
-
ఆకట్టుకుంటున్న ‘శాకిని-డాకిని’ టీజర్
రెజీనా కసాండ్రా, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘శాకిని డాకిని’. దక్షిణ కొరియా చిత్రం ‘మిడ్నైట్ రన్నర్’కి తెలుగు రీమేక్ ఇది. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. డి. సురేశ్ బాబు, సునీత తాటి, హ్యూన్వూ థామస్ కిమ్ నిర్మాతలు. సెప్టెంబర్ 16న ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం టీజర్ని విడుదల చేశారు మేకర్స్. (చదవండి: క్యూట్నెస్ ఓవర్లోడెడ్..మెరుపు తీగలా తయారైన హన్సిక!) టీజర్ ప్రకారం శాలిని(నివేదా థామస్) ఫుడ్ లవర్కాగా, దామిని(రెజీనా)కి ఓసీడీ సమస్యతో ఉంది. ఇద్దరు పోలీసు అకాడమీలో ట్రైనీలుగా జాయిన్ అవుతారు. శిక్షణా శిబిరంలో ఇద్దరు తక్కువ పనితీరు కనబరుస్తున్నారు. అంతేకాదు అనవసరమైన విషయాల్లో తగాదాలు పెట్టుకుంటున్నట్లు టీజర్లో చూపించారు. ఓ నేరస్థుడు ఒక అమ్మాయిని తలపై కొట్టినట్లుగా ప్రధాన కథ ను చూపించడం జరిగింది. ఈ అమ్మాయిలు తగిన సమయంలో తమ నైపుణ్యాలను ఎలా చూపిస్తారనే దాని గురించి టీజర్ ఉంది. టీజర్ను బట్టి చూస్తే, సినిమాలో వినోదం, యాక్షన్, బలమైన కథ, డ్రామా ఉన్నట్లు తెలుస్తోంది. థ్రిల్లర్లను హ్యాండిల్ చేయడంలో దిట్ట అయిన సుధీర్ వర్మ ఈ సబ్జెక్ట్ని డీల్ చేయడంలో తనదైన మార్క్ చూపించాడు. ఈ చిత్రానికి రిచార్డ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ కాగా, మైకీ మెక్క్లియరీ సంగీతం అందిస్తున్నారు. -
లేడీ ఓరియంటెడ్ మూవీస్లో ఇద్దరు హీరోయిన్లు, ఇప్పుడిదే ట్రెండ్!
లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి. ఆ చిత్రాల్లో ఒకే ఒక్క హీరోయిన్ ఉంటారు. కానీ ఇప్పుడు ‘లేడీస్ ఓరియంటెడ్’ సినిమాలు ఎక్కువ అవుతున్నాయి. ఒకే సినిమాలో ఇద్దరు ముగ్గురు కథానాయికలు నటిస్తున్నారు. ఈ లేడీస్ ఓరియంటెడ్ సినిమాలపై ఓ లుక్కేద్దాం. బాలీవుడ్ అగ్ర తారలు ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్, ఆలియా భట్ ఓ రోడ్ ట్రిప్ ప్లాన్ చేశారు. నటుడు, దర్శకుడు, రచయిత ఫర్హాన్ అక్తర్ ఈ రోడ్ మ్యాప్కు డిజైనర్. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే.. ప్రియాంక, కత్రినా, ఆలియాలది పర్సనల్ ట్రిప్ కాదు.. ప్రొఫెషనల్ ట్రిప్. ఈ ముగ్గురూ కలిసి రోడ్ ట్రిప్ నేపథ్యంలో ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమాకు ‘జీ లే జరా’ అనే టైటిల్ ఖరారు చేశారు. విశేషం ఏంటంటే.. పదేళ్ల తర్వాత ఫర్హాన్ అక్తర్ ‘జీ లే జరా’తో మళ్లీ దర్శకుడిగా మెగాఫోన్ పట్టారు. షారుక్ ఖాన్ హీరోగా వచ్చిన ‘డాన్ 2: ది కింగ్ ఈజ్ బ్యాక్’ తర్వాత ఫర్హాన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇదే. ఇక ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్, ఆలియా భట్ల రోడ్ ట్రిప్ను ఫర్హాన్ అక్తర్ ప్లాన్ చేస్తే.. హీరోయిన్లు దియా మిర్జా, సంజనా సాంఘీ, రత్నా పాఠక్ షాల రోడ్ ట్రిప్ మ్యాప్ను రైటర్ తరుణ్ దుడేజా రెడీ చేశారు. ఈ ట్రిప్కు ‘ధక్ ధక్’ అని టైటిల్ పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా బైక్స్పై ప్రయాణం చేయాలనుకునే ఈ ‘ధక్ ధక్’ టీమ్కు హీరోయిన్ తాప్సీ ఓ నిర్మాతగా సపోర్ట్ చేస్తుండటం విశేషం. భిన్న వ్యక్తిత్వాలు కలిగిన నలుగురు మహిళలు ఓ రోడ్ ట్రిప్లో కలుసుకున్నప్పుడు వారి ప్రయాణం ఏ విధంగా సాగింది? వారి అనుభవాలు ఏంటి? అనే అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. ‘జీ లే జరా’, ‘ధక్ ధక్’ రోడ్ ట్రిప్ నేపథ్యంలో సాగే సినిమాలైతే.. ‘కరుంగాప్పియమ్’ సినిమా కథానాయికలు కాజల్ అగర్వాల్, రెజీనా, జనని, రైజా విల్సన్, ఇరాన్ దేశ అమ్మాయి నోయిరికాలు హారర్ స్టోరీతో ప్రయాణం చేస్తున్నారు. డీకే దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నలుగురు మహిళలు ఓ కామన్ పాయింట్తో కలుస్తారు. అయితే వారిలో ఒకరికి అతీంద్రియ శక్తులు ఉంటాయి. ఒకరికి అతీంద్రియ శక్తులు ఉన్న విషయం మిగతావారికి తెలిసినప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? వారికి వచ్చిన సమస్యలను పరిష్కరించడానికి ఈ శక్తులు ఎంత ఉపయోగపడ్డాయి? అనే అంశాల నేపథ్యంలో ‘కరుంగాప్పియమ్’ చిత్రకథ సాగుతుంది. తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఇంకోవైపు కిడ్నాపర్లను పట్టుకునేందుకు ప్లాన్ వేస్తున్నారు శాకిని అండ్ డాకిని. నివేదా థామస్, రెజీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘శాకిని–డాకిని’. సుధీర్ వర్మ ఈ సినిమాకు దర్శకుడు. సౌత్ కొరియన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ‘మిడ్నైట్ రన్నర్స్’ చిత్రానికి ఇది తెలుగు రీమేక్. ఇద్దరు లేడీ ట్రైనీ పోలీసాఫీసర్లు కిడ్నాపింగ్ అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా ఆటకట్టించడంలో ఎలా భాగస్వామ్యమయ్యారు అన్నదే కథ. ఇవే కాదు.. మరికొన్ని ‘లేడీస్ ఓరియంటెడ్’ చిత్రాలు సెట్స్పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాయి. చదవండి: కొడుకు ఫొటోను షేర్ చేసిన కాజల్.. ఈసారి ముఖం కనిపించేలా కోవిడ్కు ముందు 2020లో చివరిసారిగా కలిశాను: హీరోయిన్ -
నవ్వులతో నవరాగాలు ఒలికిస్తున్న నివేదా థామస్ (ఫోటోలు)
-
గ్లామర్ అంటే స్కిన్ షో కాదు : నివేదా థామస్
నివేదా థామస్.. గ్లామర్ కన్నా అభినయతారగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటి వరకు తెలుగులో చేసిన సినిమాలు కొన్నే అయినా.. ఇక్కడ సంపాదించుకున్న అభిమానం మాత్రం ఘనమే. అందం కన్నా అభినయం మీద ఆమెకున్న శ్రద్ధ అలాంటిది. తనలోని గ్లామర్ను ఆమె అశ్రద్ధ చేసినా ఈ బ్రాండ్స్ మాత్రం తీర్చిదిద్దుతున్నాయి.. సొబారికో దర్జా, విలాసం, సౌకర్యం .. ఈ మూడింటినీ ఒకేసారి ఆస్వాదించాలంటే సొబారికో బ్రాండ్ను ఎంచుకోవాలి. దేశంలోని ఏ మూలలో ఏ చేనేత ప్రత్యేకత ఉన్నా.. ఏ కళాకారుడి.. ఏ కళాకారిణి చేతిలో సృజన ఉన్నా అది ఈ బ్రాండ్లో ప్రతిబింబిస్తుంది. అందుకే సొబారికో అవుట్ ఫిట్స్ను ఇష్టపడని వాళ్లు లేరు సెలబ్రిటీల నుంచి సామాన్యుల దాకా. ఈ అభిమానాన్నే బ్రాండ్ వాల్యూగా స్థిరపరచుకుంది. దాన్నే వారసత్వంగానూ మలచుకుంది ఏళ్లుగా. ఫ్యాబ్రిక్, డిజైన్ను బట్టి ధరలు. ఆన్లైన్లోనూ లభ్యం. డ్రెస్ బ్రాండ్ : సొబారికో అనార్కలీ సెట్ ధర: 37,500 జ్యూయెలరీ బ్రాండ్: అమెథిస్ట్ అండ్ ఆమ్రపాలి ధర: డిజైన్పై ఆధారపడి ఉంటుంది. అమెథిస్ట్ ఇది కిరణ్ రావు మానస పుత్రిక. అమూల్యమైన కళాఖండాల నిలయం.. ఈ బ్రాండ్. 2000 సంవత్సరంలో ప్రారంభమైంది. దుస్తులు, జ్యూయెలరీ, ఫుట్ వేర్ నుంచి ఇంటి అలంకరణ వస్తువులు.. కాఫీ షాప్ వరకు అన్నిటికీ ఈ అమెథిస్ట్ కేరాఫ్. ఈ బ్రాండ్ రిచ్నెస్కు తగ్గట్టే ధరలు ఉంటాయి. ఆమ్రపాలి నిజానికి ఇదొక మ్యూజియం. అంతరించిపోతున్న గిరిజన సంప్రదాయ ఆభరణాల కళను కాపాడేందుకు ఇద్దరు స్నేహితులు రాజీవ్ అరోరా, రాజేష్ అజమేరా కలసి జైపూర్లో ‘ఆమ్రపాలి’ పేరుతో మ్యూజియాన్ని స్థాపించారు. నచ్చిన వాటిని కొనుగోలు చేసే వీలు కూడా ఉంది. అయితే, వీటి ధర లక్షల్లో ఉంటుంది. అందుకే, అలాంటి డిజైన్స్లో ఆభరణాలు రూపొందించి తక్కువ ధరకు అందించేందుకు ‘ఆమ్రపాలి జ్యూయెలరీ’ ప్రారంభించారు. ఒరిజినల్ పీస్ అయితే మ్యూజియంలో, మామూలు పీస్ అయితే ఆమ్రపాలి జ్యూయెలరీలో లభిస్తుంది. చాలామంది సెలబ్రిటీస్కు ఇది ఫేవరెట్ బ్రాండ్. ఆన్లైన్లో కూడా ఆమ్రపాలి జ్యూయెలరీని కొనుగోలు చేయొచ్చు. -
అలాంటి ప్రదేశం అంటే చాలా ఇష్టం: హీరోయిన్ నివేదా
నివేదా థామస్కి నచ్చే విషయాలేంటి? ‘ది బెస్ట్’గా ఉండేందుకు ఆమె ఏం చేస్తారు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరికింది. ‘మీరు అడిగితే నేను చెబుతా’ అంటూ సోషల్ మీడియాలో తనను ఫాలో అవుతున్నవారికి ఓ ఆఫర్ ఇచ్చారు నివేదా. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు నివేదా టక టకా సమాధానాలు చెప్పేశారు. ఆ విశేషాలు.. ► మీరు ది బెస్ట్గా ఉండేందుకు మీలో స్ఫూర్తిని నింపే అంశాలు ఏంటి? ప్యాషన్. మనం ఏ పని చేసినా పూర్తి శక్తి సామర్థ్యాలతో చేయాలి. ఒకవేళ అలా చేయకపోతే నా వర్క్కి అన్యాయం చేశాననే ఫీలింగ్ నాకు కలుగుతుంది. పని పట్ల నాకు ఉన్న ప్యాషన్తో పూర్తి స్థాయిలో కష్టపడతాను. ► ఈ మధ్యకాలంలో మీకు నచ్చిన ఓ వెబ్ సిరీస్? మారే ఆఫ్ ఎస్టోన్ (అమెరికన్ క్రైమ్ థ్రిల్లర్). ► మీ ఫేవరెట్ ప్లేస్? చల్లని వాతావరణంతో రాత్రి నిశ్శబ్దంగా ఉండాలి. ఆకాశం నిండా నక్షత్రాలు ఉండాలి... ఇలా ఉండే ఏ ప్లేస్ అయినా నాకు ఇష్టమే. ► మీకు బాగా ఇష్టమైన తమిళ సినిమా? నా ఫేవరెట్ మూవీస్లో ‘దళపతి’ ఉంది. ఈ సినిమాలో సంతోష్ శివన్గారి సినిమాటోగ్రఫీ మ్యాజిక్లా ఉంటుంది. ► రాత్రివేళ ఎక్కువ సేపు మేల్కొని ఉంటారా? అలా ఏం లేదు. కానీ నేను నిద్రపోయే సమయాలను మునుపటిలా ట్రాక్లో పెట్టాలనుకుంటున్నాను. ► మీకు ఇష్టమైన ఆహారం? ఇది చెప్పడానికి ఎక్కువసేపు అవుతుంది. ఎందుకంటే లిస్ట్ చాలా పెద్దది. ► హిందీలో మాట్లాడగలరా? నహీ తో (మాట్లాడకపోతే అని హిందీలో చెప్పి చమత్కరించారు). ► ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూస్తారా? హండ్రెడ్ పర్సెంట్ చూస్తా. ► ఐపీఎల్లో మీ ఫేవరెట్ జట్టు? చెన్నై సూపర్ కింగ్స్. ► డ్యాన్స్ చేయడం, పాటలు పాడటం... వీటిలో మీకు ఎక్కువగా ఏ విషయంలో నైపుణ్యం ఉంది? నిజం చెప్పాలంటే డ్యాన్సింగ్, సింగింగ్లో నేను జస్ట్ ఓకే. ఇంప్రూవ్ చేయాల్సింది చాలా ఉంది. మళ్లీ క్లాసులకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నాను. -
'జై బాలయ్య' పాటకు నివేదా థామస్ స్టెప్పులు.. సీన్ కాస్తా రివర్స్
Nivetha Thomas Dance Video On Jai Balayya Song: అఖండ సినిమాతో తన నట విశ్వరూపాన్ని చూపించాడు నందమూరి బాలకృష్ణ. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి వచ్చిన చిత్రం అఖండ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను కొల్లగొట్టింది. చాలా కాలం తర్వాత తెరచుకున్న థియేటర్లకు గ్రాండ్ ఓపెనింగ్ ఇచ్చింది ఈ సినిమా. తమన్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు మరో హైలెట్గా నిలిచింది. సాంగ్స్, బీజీఎంతో మాస్ ప్రేక్షకులను కిర్రాక్ అనిపించాడు తమన్. అఖండలో రెండు షేడ్స్లో అలరించిన బాలకృష్ణ ఒకే ఒక్క పాటలో మాస్ బీట్కు స్టెప్పులేసి అదరగొట్టాడు. జై బాలయ్య అనే సాంగ్ సినిమా రిలీజ్కు ముందే సూపర్ హిట్ అయింది. ఈ పాట విడుదలవడంతోనే నెటిజన్లు సోషల్ మీడియాలో తమదైన శైలిలో రీల్స్, వీడియోస్ చేసి ఆకట్టుకున్నారు. ఆ పాటకు స్టెప్పులేయడం ట్రెండ్గా కూడా మారింది. తాజాగా ఈ ట్రెండ్ను కొనసాగిస్తూ జై బాలయ్యకు పాటకు స్టెప్పులేసింది బ్యూటిఫుల్ హీరోయిన్ నివేదా థామస్. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ భిన్నమైన పోస్ట్లు, వీడియోలు పెడుతూ సోషల్ మీడియాలో సందడి చేస్తుంది నివేదా. అందుకే జై బాలయ్య సాంగ్లోని స్టెప్పులను వదల్లేదు. పాటలో డ్యాన్స్ మూమెంట్స్ వేస్తుండగా షర్ట్స్ మారే స్పెప్పు వేసింది నివేదా. అయితే మొదటి షర్ట్ మారేవరకూ బానే ఉంది. రెండో షర్ట్ మారేప్పుడు సీన్ రివర్స్ అయింది. స్టెప్పు వేసేప్పుడు రెండో షర్ట్ సరిగా రాకపోవడంతో తాను కూడా నవ్వుతూ ఫన్ క్రియేటే చేసింది నివేదా. ఈ వీడియోను షేర్ చేస్తూ 'ఏదేమైనా అఖండ ఎక్స్పీరియెన్స్ అదిరిపోయింది' అని క్యాప్షన్ ఇచ్చింది. View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) -
అందాల నివేదా బర్త్డే ఫోటోలు
-
నివేదా థామస్ బర్త్డే స్పెషల్ : ఇంట్రెస్టింగ్ విషయాలు
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్కు దొరికిన మరో అందాల హీరోయిన్ నివేదా థామస్. బాలనటిగా తెరంగేట్రం చేసి హీరోయిన్గా ఎదిగిన ఈ కేరళ కుట్టి తెలుగులో కూడా తన ప్రత్యేకతను చాటుకుంటోంది. జెంటిల్మేన్ నుంచి వకీల్ సాబ్ దాకా అటు నటనతో, ఇటు అందంతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ డింపుల్ బ్యూటీకి హ్యాపీ బర్త్డే అంటోంది సాక్షి. కామ్. కేరళ కుట్టి 1995, నవంబర్ 2న జన్మించింది నివేదా థామస్. నివేదా థామస్ తండ్రి తామస్ ఇయన బిజినెస్ మేన్. తల్లి పేరు లిల్లీ. నివేదాకు నిఖిల్ అనే తమ్ముడున్నాడు . నివేదాను ఇంట్లో అందరూ బేబీ అని పిలుస్తారట. పుట్టింది కేరళలోనే అయినా విద్యాభ్యాసం మొత్తం తమిళనాడులోని చెన్నలోనే. బాలనటిగా తన కెరీర్ని స్టార్ట్ చేసిన ఈ అమ్మడు హీరోయిన్ కావాలనే కలలు కనేదిట. అలా మోడల్గా రాణిస్తూ మలయాళం, తెలుగు, తమిళ భాషల్లో సినిమా అవకాశాలను దక్కించుకుంది. బాలనటిగా ఎంట్రీ, అవార్డు 2002లో మలయాళ చిత్రం ఉత్తరతో బాలనటిగా తెరంగేట్రం చేసింది నివేదా. సన్ టీవీలో ప్రసారమయ్యే బాలల సీరియల్ మై డియర్ బూతంలో కూడా నటించింది. మలయాళం సినిమా 'వెరుథె ఒరు భార్య' సినిమాలో జయరాం కుమార్తెగా నటించింది. అలాగే చాలా తమిళ, మలయాళ చిత్రాల్లో సహాయ నటిగా నటించింది. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ తన దైన నటనతో ప్రశంసలందుకుంది. ఆ తరువాత నివేదా చాప్పా కురిష్, తట్టతిన్ మరయతు వంటి విజయవంతమైన సినిమాల్లో పాపులర్ అయింది. మలయాళ చిత్రం వెరుథె ఒరు భార్య సినిమాకు గాను విమర్శకుల ప్రశంసల మాత్రమే కాదు, కేరళ రాష్ట్ర ఉత్తమ యువ నటి పురస్కారం అందుకుంది. ఇక టాలీవుడ్ డెబ్యూ మూవీతో జెంటిల్మేన్లో కూడా బాగా ఆకట్టుకుంది. డైరెక్టర్ ఇంద్రగంటి మోహన కృష్ణ రూపొందించిన జెంటిల్మెన్ సినిమా ద్వారా నివేదాథామస్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తరువాత నిన్నుకోరి, బ్రోచేవారెవరురా, జై లవకుశ, 'జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్' యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ 118, వీ తదితర సినిమాలతో కర్రకారు మనసు దోచుకుంది. ఇక తన లేటెస్ట్ హిట్ వకీల్ సాబ్లో అద్భుతంగా నటించి ఫ్యాన్స్ను ఖుషీ చేసింది. దాదాపు తను నటించిన ప్రతీ మూవీ హిట్ టాక్ దక్కించుకోవడం నివేదాకు ప్లస్ పాయింట్ అని చెప్పాలి. (Aishwarya Rai Bachchan Birthday Special: తన పిచ్చి సెంటిమెంట్పై ఐశ్వర్య కామెంట్స్) ఎత్తైన శిఖరం కిలిమంజారో అధిరోహణ తన అందం, అభినయంతో యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇటీవల ఓ అరుదైన ఘనతను సాధించింది. ఆఫ్రికాలోనే ఎత్తైన పర్వతం కిలిమంజారోను అధిరోహించింది. చాలా తక్కువ మంది సెలబ్రిటీలు ఇలాంటి సాహసానికి పూనుకుంటారు. ఈ ఘనత సాధించడం పట్ల ఫ్యాన్స్తో పాటు, పలువురు ప్రముఖులు అభినందనలు కురిపించారు. ప్రస్తుతం మీట్ క్యూట్, మిడ్నైట్ రన్నర్స్ రిమేక్గా తెరకెక్కుతున్న మరో మూవీలో కూడా నివేదా నటిస్తోంది. చిన్న వయసునుంచే హీరోయిన్ కావాలన్న కోరిక నేపథ్యంలో అటు చదువును, ఇటు కరియర్ను బ్యాలెన్స్ చేసుకుంటూ హీరోయిన్గా ఎదిగింది. ఈ నేపథ్యంలో కొన్నిసార్లు షూటింగ్ వెళ్లి ఆ మేకప్తోనే నే క్లాస్కు హాజరైన సందర్భాల చాలా ఉన్నాయని ఒక ఇంటర్వ్యూలో నివేద థామస్ తెలిపింది. -
Nivetha Thomas Biography In Telugu: డింపుల్ క్యూటీ
-
కిలిమంజారోపై జెండా పాతిన టాలీవుడ్ భామ.. ఫోటో వైరల్
Mount Kilimanjaro: ఎత్తయిన శిఖరాలను అధిరోహించడమంటే పెద్ద సాహసమే అని చెప్పాలి. ఈ పనిలో ప్రాణాలను సైతం పణంగా పెట్టాలి. అలాంటి సాహసాన్ని తక్కువ వ్యవధిలోనే సాధించి, నలుగురికి ఆదర్శంగా నిలిచింది హీరోయిన్ నివేదా థామస్. ఆఫ్రికా ఖండంలో అత్యంత ఎత్తయిన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి ఔరా అనిపించింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ ఓ ఫోటోని షేర్ చేసింది. నివేదాకు ట్రెక్కింగ్ అంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా కిలిమంజారో పర్వాతాన్ని అధిరోహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం ఆరు నెలలపాటు ట్రెక్కింగ్లో శిక్షణ తీసుకుంది. తాజాగా తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంది. ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ బ్యూటీ ఇటీవల ‘వకీల్ సాబ్’ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరిచింది. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో.. నివేదా ఓ కీలక పాత్రలో నటించి, మెప్పించింది. ప్రస్తుతం ఆమె ‘మీట్ క్యూట్’లో నటిస్తుంది. . ఈ చిత్రానికి నాని సోదరి దీప్తి ఘంటా దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో నివేదా థామస్తో పాటు మరో నలుగురు హీరోయిన్స్ నటించబోతున్నారు. I made it 😊 To the top of the tallest free standing mountain in the world. Mount Kilimanjaro pic.twitter.com/InPptVTjit — Nivetha Thomas (@i_nivethathomas) October 23, 2021 -
ఆవు పాలు పితికిన హీరోయిన్... వీడియో వైరల్
సెలబ్రిటీలు ఏ పని చేసినా.. అదో వైరల్ న్యూస్ అవుతున్న రోజులివి. ముఖ్యంగా సినీ తారల విషయంతో ఇది చాలా ఎక్కువ. వాళ్లు ఎక్కడికి వెళ్లినా, ఏ పని చేసినా.. వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. ఇక ఆ వీడియోలు చూసి అభిమానులు మురిసిపోతుంటారు. తాజాగా హీరోయిన్ నివేదా థామస్కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. (చదవండి: నేహాకక్కడ్: అత్యధిక ఫాలోవర్స్ ఉన్న వుమెన్ సింగర్..) ఇంతకీ ఆ వీడియోలో ఏముందనేగా మీ ప్రశ్న. అందులో నివేదా బ్లాక్ కలర్ జాకెట్ ధరించి ఆవు పాలు పితికింది. డైరీ ఫామ్కి వెళ్లిన నివేదా.. స్వయంగా తానే ఆవు దగ్గరకు వెళ్లి పాలు పితికి చక్కటి కాఫీ పెట్టుకుంది. దీన్ని ఓ వీడియో రూపంలో తన సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేస్తూ 'జాయ్' అని ట్యాగ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. కొంతమంది వాటి దగ్గరకు వెళ్లడానికే భయపడతారు.. కానీ నువ్వు వెళ్లడమే కాకుండా పాలు పితికే సాహసం చేశావంటే నువ్వు చాలా గ్రేట్ అక్కా’అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' మూవీలో కీలకపాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న నివేదా ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో రెండు మూడు సినిమాల్లో నటిస్తోంది. -
‘మిడ్నైట్ రన్నర్స్’ గా రెజీనా, నివేదా థామస్
సౌత్ కొరియన్ హిట్ ఫిల్మ్ ‘మిడ్నైట్ రన్నర్స్’ (2017) తెలుగులో రీమేక్ అవుతోంది. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రెజీనా, నివేదా థామస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డి. సురేశ్బాబు, సునీత తాటి, హ్యూన్యూ థామస్ కిమ్లు ‘మిడ్నైట్ రన్నర్స్’ తెలుగు రీమేక్ను నిర్మిస్తున్నారు. ‘‘ఈ ఏడాది మార్చిలో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. ఆగస్టు కల్లా పూర్తి చేయాలనుకుంటున్నాం. ఈ సినిమా కోసం రెజీనా, నివేదా థామస్ తొలిసారిగా డిఫరెంట్ స్టంట్స్ చేస్తున్నారు’’ అని చిత్రయూనిట్ వెల్లడించింది. ఇద్దరు కాబోయే పోలీసాఫీసర్లు కిడ్నాపర్ల ముఠాను ఎలా పట్టుకున్నారన్నదే ‘మిడ్నైట్ రన్నర్స్’ కథాంశం. -
హీరోయిన్ నివేథా థామస్లో ఈ టాలెంట్ కూడా ఉందా?
హీరోయిన్ నివేదా థామస్. ఈ ఏడాది వకీల్సాబ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ చిత్రంలోని పల్లవి పాత్రలో నివేథా నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇదిలా ఉండగా, తాజాగా గిటార్ వాయిస్తూ తన సింగింగ్ టాలెంట్ను కూడా బయటపెట్టేసింది. 2008లో విడుదలైన “జానే తు యా జానేనా” అనే సూపర్ హిట్ మూవీలోని కభీ కభీ అధితీ జిందగీ అనే పాటను పాడుతూ తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో నెటిన్లను ఆకట్టుకుంది. పాటలో ఆమె లీనమైన తీరు చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మీలో ఈ టాలెంట్ కూడా ఉందా అంటూ నెటిజన్లు షాకవుతున్నారు. ప్రస్తుతం నివేదా పాడిన ఈ పాట నెట్టింట వైరల్ అవుతోంది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సుధీర్ వర్మ డైరెక్షన్లో ‘శాకిని ఢాకిని’ అనే మూవీలో నటిస్తుంది. ‘మిడ్ నైట్ రన్నర్స్’ అనే కొరియన్ చిత్రానికి రీమేక్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రెజీనా కసాండ్ర మరొక హీరోయిన్గా నటిస్తుంది. lekin raat ke baadh he tho savera hota hai 🌸 pic.twitter.com/r0e7cUPqqe — Nivetha Thomas (@i_nivethathomas) June 29, 2021 చదవండి : హీరోయిన్ను ఆ విషయం గురించి డైరెక్ట్గా అడిగేసిన నెటిజన్ మోనాల్ని అఖిల్ ముద్దుగా ఏమని పిలుస్తాడో తెలుసా? -
‘వకీల్ సాబ్’ మూవీ రివ్యూ
టైటిల్ : వకీల్ సాబ్ జానర్: లీగల్ డ్రామా నటీనటులు : పవన్ కల్యాణ్, శృతిహాసన్, ప్రకాశ్ రాజ్, అంజలి, నివేధా థామస్, అనన్య నాగళ్ళ తదితరులు నిర్మాణ సంస్థ : శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాతలు : దిల్ రాజు, శిరీష్ సమర్పణ : బోనీ కపూర్ దర్శకత్వం : శ్రీరామ్ వేణు సంగీతం : తమన్ సినిమాటోగ్రఫీ : పీఎస్ వినోద్ ఎడిటింగ్ : ప్రవీన్ పూడి విడుదల తేది : ఏప్రిల్ 09, 2021 అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ తర్వాత దాదాపు మూడేళ్లు గ్యాప్ తీసుకొని ‘వకీల్ సాబ్’గా ఈ శుక్రవారం (ఏప్రిల్ 9) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు పవన్. పవన్ రీఎంట్రీ మూవీ కావడం.. అందులోనూ అమితాబ్ నటించి బాలీవుడ్ బ్లాక్ బ్లస్టర్ పింక్ సినిమాకు రీమేక్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ఇటీవల విడుదల చేసిన పాటలు, టీజర్, ట్రైలర్కు మంచి స్పందన రావడంతో ‘వకీల్ సాబ్’పై అంచనాలు మరింత పెరిగాయి. మరి ఆ అంచనాలను ఈ వకీల్ సాబ్ ఏ మేరకు అందుకున్నాడు? పవన్ రీఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. కథ పల్లవి(నివేధా థామస్), జరీనా బేగం(అంజలి), దివ్య నాయక్(అనన్య నాగళ్ళ )వేరు వేరు ప్రాంతాలకు చెందిన మధ్యతరగతి యువతులు. ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్కు వచ్చి ఒకే ఇంట్లో అద్దెకు ఉంటారు. డ్యూటీకి వెళ్లడం, వచ్చిన డబ్బులు ఇంటికి పంపించడం వీరి కర్తవ్యం. ఇలా హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటున్న ఈ ముగ్గురు ఒక రోజు పార్టీ కోసం బయటకు వెళ్లి రాత్రి క్యాబ్లో ఇంటికి వెళ్తూ అనుకోకుండా ఎంపీ రాజేందర్(ముఖేష్ రిషి) కొడుకు వంశీ(వంశీకృష్ణ) గ్యాంగ్తో రిసార్ట్కి వెళ్తారు. అక్కడ జరిగిన ఓ సంఘటన ఈ ముగ్గురి జీవితాలను మలుపుతిప్పుతుంది. ఈ ముగ్గురిపై హత్యాయత్నం కేసు నమోదు అవుతుంది. పల్లవిని అరెస్ట్ చేస్తారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన ఈ ముగ్గురు యువతులకు సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాని క్రమంలో సస్పెండ్కు గురైన లాయర్ సత్యదేవ్ అలియాస్ వకీల్ సాబ్( పవన్ కల్యాణ్) అండగా నిలబడతాడు. అసలు సత్యదేవ్ ఎందుకు సస్పెండ్ అయ్యాడు? అతని చరిత్ర ఏంటి? మధ్యతరగతి కుటుంబానికి చెందిన ముగ్గురు ఆడపడుచులకు వకీల్ సాబ్ ఎలా న్యాయం చేశాడు? రాజకీయ నేపథ్యం ఉన్న వంశీని, డబ్బులకు అమ్ముడుపోయే లాయర్ నందా(ప్రకాశ్ రాజ్)ని సత్యదేవ్ ఎలా ఢీకొన్నాడు? అనేదే మిగతా కథ. నటీనటులు అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవన్ కల్యాణ్ వెండితెరకు దూరమయ్యాడు. దాదాపు మూడేళ్ల తర్వాత మళ్లి తెరపై కనిపించాడు. వకీల్ సాబ్ పాత్రలో పవన్ పరకాయ ప్రవేశం చేశారు. ముఖ్యంగా కోర్టు సన్నివేశాల్లో పవన్ చెప్పే డైలాగ్స్ అబ్బురపరచడంతో పాటు ఆలోచింపజేసేవిగా ఉంటాయి. ఇక శృతిహాసన్ చనిపోయినప్పుడు వచ్చే ఎమోషనల్ సీన్లో పవన్ కల్యాణ్ జీవించేశాడు. అలాగే మధ్యతరగతి చెందిన యువతుల పాత్రల్లో అంజలి, నివేధా థామస్, అనన్య నాగళ్ళ అద్భుతంగా నటించారు. వకీల్ సాబ్ భార్య పాత్రలో శృతిహాసన్ పర్వాలేదనిపిస్తుంది. ఇక క్రిమినల్ లాయర్ నందా పాత్రలో ప్రకాశ్రాజ్ ఎప్పటిమాదిరే జీవించేశాడు. వంశీకృష్ణతో మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. విశ్లేషణ బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘పింక్’కి రీమేకే ఈ వకీల్ సాబ్ సినిమా. సమాజంలో మహిళల పట్ల కొంతమంది వ్యక్తులకు ఉన్న చులకన భావాన్ని, దానివల్ల స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను కళ్లకు కట్టినట్లు చూపించిన చిత్రం ‘పింక్’. అక్కడ అమితాబ్ బచ్చన్, తాప్సీ, కృతి కల్హరి, ఆండ్రియా ప్రధాన పాత్రల్లో నటించారు. ఇదే సినిమాను అజిత్లో కోలీవుడ్లో రీమేక్ చేశారు. అక్కడా సూపర్ హిట్ అయింది. రెండు చోట్ల సూపర్ హిట్ కావడంతో ఈ కథను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాలని భావించాడు నిర్మాత దిల్ రాజు. పవర్స్టార్ పవన్కల్యాణ్ స్టార్డమ్ని దృష్టిలో ఉంచుకుని మూలకథలో ఎలాంటి మార్పులు చేయకుండా, దానికి కొన్ని కమర్షియల్ హంగుల్ని చేర్చాడు దర్శకుడు వేణు శ్రీరామ్. బాలీవుడ్, కోలీవుడ్లో చూపించని విధంగా ఇందులో పవన్ని యంగ్ లుక్లో చూపించారు. అలాగే హీరోకి ప్లాష్ బ్యాగ్ కూడా పెట్టాడు. అయితే అది మాత్రం వర్కౌట్ కాలేదు. సినిమా కథకు అది కాస్త అడ్డంకిగా అనిపిస్తుంది. అలాగే శ్రుతీహాసన్, పవన్ కల్యాణ్ మధ్య వచ్చిన లవ్ సీన్స్కూడా అంతగా ఆకట్టుకోవు. ఫస్టాఫ్లో కొన్ని చోట్ల అనవసరమైన సీన్స్ కూడా ఉండటం కొంతమేర ప్రతికూల అంశమే. అలాగే ఇంటర్వెల్ వరకు అసలు కథ ముందుకు సాగదు. ఇక సినిమాకు ప్రధాన బలం కోర్టు సీన్స్ . కోర్టు సన్నీవేశాల్లో వచ్చే డైలాగ్స్ ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసేవిగా ఉంటాయి.‘అడుక్కునోళ్లకి అన్నం దొరుకుంది. కష్టపడినోడికి నీడ దొరుకుంది కానీ పేదోడికి మాత్రం న్యాయం దొరకదు’, ‘ఆడది అంటే బాత్రుంలో ఉండే బొమ్మ కాదు నిన్ను కన్న అమ్మ’ లాంటి డైలాగ్స్ హృదయాలను హత్తుకుంటాయి. అయితే సెకండాఫ్ మొత్తం కోర్టు సన్నివేశాలే ఉండడం పవన్ ఫ్యాన్స్కు నచ్చినా.. సాధారణ ప్రేక్షకుడికి కాస్త ఇబ్బందిగా అనిపించే అవకాశం ఉంది. అలాగే కొన్ని డైలాగ్స్ పవన్ రాజకీయ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టి రాసినట్లుగా అనిపిస్తాయి. ఇక ఈ సినిమాకు మరో ప్రధాన బలం తమన్ సంగీతం. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా అదిరిపోయింది. పలు సన్నివేశాలను తన నేపథ్య సంగీతంతో ఓ రేంజ్కి తీసుకెళ్లాడు. ముఖ్యంగా కోర్టు సన్నివేశాలకు తనదైన బీజీఎం ఇచ్చి తమన్ అదరగొట్టాడు. పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫి బాగుంది. కోర్టు సన్నివేశాలను కళ్లకుకట్టినట్లు చూపించాడు. పవీన్ పూడి ఎడిటింగ్ పర్వాలేదు. ఫస్టాఫ్లో కొన్ని సీన్లకు కత్తెరపడితే బాగుండనిపిస్తుంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ పవన్ కల్యాణ్, ప్రకాశ్రాజ్ నటన తమన్ సంగీతం కోర్టు సీన్స్ మైనస్ పాయింట్స్ ఫస్టాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ -
వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
మాటల మాంత్రికుడు, అల్లు అరవింద్కు కరోనా!
దేశంలో మరోసారి మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మహమ్మారి టాలీవుడ్కు సైతం వ్యాపించింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్లు కరోనా పాజటివ్గా పరీక్షించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరు హోం క్వారంటైన్లో ఉన్నారని వినికిడి. అయితే దీనిపై ఇప్పటికి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే అల్లు అరవింద్, త్రివిక్రమ్లు డాక్టర్ల సలహా మేరకు సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నారని, కరోనా నివారణకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా హీరోయిన్ నివేదా థామస్ సైతం తాజాగా కరోనా బారిన పడ్డారు.ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఆమె ట్వీట్ చేస్తూ.. ‘అందరికి నమస్తే.. నేను కరోనా పాజిటివ్గా పరీక్షించాను. డాక్టర్ సలహాతో అన్ని విధాల మెడికల్ ప్రోటోకాల్ పాటిస్తూ ఐసోలేషన్కు వెళ్లాను. ఇటీవల నన్ను కలిసి వారంత దయచేసి హోం క్వారంటైన్కు వెళ్లండి. ఈ కష్టకాలంలో నాకు సపోర్టుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా నా మెడికల్ టీంకు. నాపై ప్రత్యేక శ్రద్ధా చూపిస్తున్నా వారికి నిజంగా రుణపడి ఉంటాను’ అంటూ ఆమె ట్వీట్ చేశారు. pic.twitter.com/S6kh4filk3 — Nivetha Thomas (@i_nivethathomas) April 3, 2021 చదవండి: అయాన్ బర్త్డే: అల్లు అర్జున్ స్పెషల్ విషెస్ ఖమ్మంలో ‘బేబమ్మ’ సందడి.. ‘ఉప్పెన’లా ఎగసిపడ్డ జనం త్రివిక్రమ్ డైరెక్షన్లో ఎన్టీఆర్; మొత్తం 60 ఎపిసోడ్లు! -
నివేదాకు వకీల్ సాబ్ టీమ్ స్పెషల్ గిఫ్ట్
తెలుగు, తమిళ, మలయాళంలో పలు సూపర్హిట్ సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులు అందుకున్న నటి నివేదా థామస్. నిన్ను కోరి, జెంటిల్మేన్, బ్రోచేవారెవరురా, దర్బార్ లాంటి సూపర్హిట్ సినిమాలు ఇప్పటికే ఆమె ఖాతాలో ఉన్నాయి. 2008లో వచ్చిన మలయాళం సినిమా 'వెరుతే ఒరు' భార్యతో వెండితెరకు పరిచయమైన నివేదా తను తమిళంలో చేసిన మొదటి చిత్రం 'కురువి'తో మంచి పేరు సాధించారు. మలయాళంలో బ్లాక్బస్టర్ అయిన దృశ్యం సినిమాకు తమిళ రీమేక్గా వచ్చిన పాపనాశం సినిమాతో నివేదాకు అసలైన బ్రేక్ వచ్చింది. ఇందులో కమల్ హాసన్ సుయంబులింగం పాత్ర పోషించగా, నివేథా ఆయన కూతురు సెల్వి సుయంబులింగంగా నటించారు. ప్రస్తుతం పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న వకీల్ సాబ్ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్న నివేదా షూటింగ్లో బిజీబిజీగా గడిపేస్తున్నారు. ఈ రోజు నివేదా థామస్ పుట్టినరోజు సందర్భంగా వకీల్ సాబ్ ఆమెకు బహుమతిగా ఒక స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. (కాజల్ వెడ్డింగ్ లెహెంగా తయారీకి 30 రోజులు) Team #VakeelSaab wishes @i_nivethathomas, a very Happy Birthday! pic.twitter.com/OpARfbLZsI — Sri Venkateswara Creations (@SVC_official) November 2, 2020 కాగా.. పరిమిత సిబ్బందితో ఈ సినిమా షూటింగ్ జరుగుతండగా నివేదా ఇటీవల షూటింగ్లో భాగమయ్యారు. పలు జాగ్రత్తలు పాటిస్తూ నివేదా షూటింగ్లో పాల్గొంటున్నారు. 7 నెలల లాక్డౌన్ తర్వాత షూటింగ్ను తిరిగి ప్రారంభించారు. కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కుతున్న వకీల్ సాబ్కు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా.. నివేదా థామస్ ఓ కీలక రోల్లో నటిస్తున్నారు. -
ఆ గేమ్లోకి వెళ్లను
నాని, సుధీర్బాబు, అదితీ రావు హైదరీ, నివేదా థామస్లు ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘వి’. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం నివేదా థామస్ చెప్పిన విశేషాలు. ► నిజానికి ఈ సినిమాని థియేటర్ రిలీజ్ కోసం తీశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనందరం పక్కనే ఉన్న షాప్కి వెళ్లటానికి కూడా ఆలోచిస్తున్నాం. ఇప్పట్లో థియేటర్లు ఓపెన్ అయినా ప్రేక్షకులు వస్తారని గ్యారెంటీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో డిజిటల్ ప్లాట్ఫామ్లో విడుదల సరైన నిర్ణయమే. ఒక మంచి సినిమాలో భాగం అయినందుకు ఆనందంగా ఉంది. ► ‘వి’ సినిమా చేయడం వెనక నా స్వార్థం కూడా ఉంది. నా పాత్ర నచ్చడం, నానీతో మూడోసారి సినిమా చేయడం, ఇంద్రగంటి సార్తో రెండో సినిమా, ‘దిల్’ రాజుగారి బేనర్లో కంటిన్యూస్గా సినిమాలు చేయడం.. ఇవన్నీ నేను ‘వి’ చేయడానికి కారణాలు. ఈ సినిమాలో నా పాత్ర పేరు అపూర్వ. తను క్రైమ్ థ్రిల్లర్స్ రాసే నవలా రచయిత. ఇప్పటివరకు నేను చేసిన మంచి పాత్రల్లో ఇదొకటి. ► స్వతహాగా నేను ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతాను. ఫస్ట్ టైమ్ ఫ్యామిలీతో చాలారోజులు ఇంట్లో స్పెండ్ చేశాను. 17 ఏళ్లుగా మా నాన్న దుబాయ్లో వర్క్ చేస్తున్నారు. ఆయన ఎప్పుడన్నా అలా వచ్చి ఇలా వెళ్లేవారు. కానీ ఆరు నెలలుగా ఆయనతో బెస్ట్ టైమ్ గడుపుతున్నాను. ఈ లాక్డౌన్లో ఎంతోమంది కొత్త దర్శకులు చెప్పిన కథలు విన్నాను. ప్రతి కథ ఒక కొత్త అనుభూతినిచ్చింది. కానీ ఫైనల్గా నాకు సూట్ అయ్యేవే ఎన్నుకుంటాను. ► వెబ్ సిరీస్లో నటించాలనుకోలేదు. మంచి క్యారెక్టర్ వస్తే చేస్తానేమో. ప్రస్తుతానికి నేను మంచి పొజిషన్లో ఉన్నాను. స్టార్డ్డమ్ అంటూ నంబర్ గేమ్లోకి రావటం నాకిష్టంలేదు. నేను ఆ బాక్స్లో ఉండను. స్టార్డమ్ కంటే కూడా ‘ఈ అమ్మాయి మంచి క్యారెక్టర్స్ చేస్తుంది’ అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. -
‘పుష్ప’ సర్ప్రైజ్: బన్నీకి లవర్గా నివేదా
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రేజీ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘పుష్ప’. రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్నారు. లాక్డౌన్ కారణంతో సినిమా షూటింగ్కు కొంత గ్యాప్ ఏర్పడటంతో చిత్ర యూనిట్ ప్రీ ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్నారు. పనిలో పనిగా రష్మికా రాయలసీమ యాస నేర్చుకుంటున్నారు. సినిమాలో ఈ భామ అటవీశాఖ అధికారిగా కనిపించనున్నారు. ఇటీవల బన్నీ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. సినిమాలో రాయలసీమ లుక్లో కనిపించే బన్నీ స్టైల్కు అభిమానులు ఫిదా అయిపోయారు. ఆర్య, ఆర్య-2 తర్వాత బన్నీ, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ పుష్ప. (పుష్ప కోసం రష్మిక ట్రైనింగ్) ఇక ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి నటించనున్నారు. తాజాగా సినిమాకు సంబంధించిన మరో ఆసక్తిర విషయం తెలిసింది. పుష్పలో నివేదా థామస్ ఓ కీలక పాత్ర పోషించనున్నారు. ఇటీవల దర్బార్ సినిమాలో నటించిన నివేదా ఈ సినిమాలో రెండో హీరోయిన్గా నటించనున్నారు. అల్లు అర్జున్ లవర్గా ఆమె పాత్ర ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నివేదా పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘వకీల్సాబ్’లో నటిస్తున్నారు. కాగా సునీల్ శెట్టి, నివేదా థామస్ ఇటీవల దర్బార్ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. (థాంక్యూ తమన్.. మాట నిలబెట్టుకున్నావ్ : బన్నీ) -
‘జెంటిల్మన్’ మర్చిపోలేని అనుభవం: నివేదా
అప్పుడే ఎంతో ఫన్ అంటోంది నటి నివేదా థామస్. ఈ మలయాళ చిన్నది ఒక పక్క హీరోయిన్గా నటిస్తూనే, స్టార్ హీరోలకు వెండితెర కూతురిగా మారిపోతోంది. అలా మలయాళంలో మోహన్లాల్కు, తమిళంలో కమలహాసన్, రజనీకాంత్లకు ముద్దుల కూతురిగా మారిపోయింది. లక్కీగా ఈ మూడు చిత్రాలు నివేదా థామస్కు మంచి పేరు తెచ్చి పెట్టాయి, ముఖ్యంగా దర్బార్లో రజనీకాంత్కు కూతురుగా కీలక పాత్రను పోషించి మెప్పించింది. ఇంకా చెప్పాలంటే దర్బార్ చిత్రంలో హీరోయిన్ నయనతార పాత్ర కంటే నివేదా పాత్రకే అధిక ప్రాముఖ్యత ఉంది. ఈ సందర్భంగా నటిగా నివేదా థామస్ అనుభవాలను చూద్దాం. చదువుకునే రోజుల్లోనే నటిగా రంగప్రవేశం చేశాను. అయినా నటనతో పాటు చదువుకు ప్రాముఖ్యతనిచ్చాను. అలా గత ఏడాదే చదువులో ఆర్కిటెక్చర్ పూర్తి చేశాను. దర్బార్ చిత్రంలో రజనీకాంత్తో నటించిన అనుభవం గురించి చెప్పాలంటే చాలానే ఉంది. ఆ చిత్ర షూటింగ్కు ముందే ఏవీఎం స్టూడియోలో ఫొటో షూట్ నిర్వహించారు. అప్పుడే రజనీకాంత్ను దగ్గరగా చూశాను. అదీ ఆదిత్య అరుణాచలం (దర్బార్ చిత్రంలోని పాత్ర) గెటప్లో చూశాను. అప్పుడే ఆయన సూపర్స్టార్ కంటే కూడా ఒక తండ్రిగా నా మనసులో నిలిచిపోయారు. ఇక దర్బార్ చిత్ర షూటింగ్లో కామెడీ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో రజనీకాంత్లో ప్రత్యేక ఎనర్జీని చూశాను. ఆయన్ని ఆట పట్టించే సన్నివేశాల్లో నటించడానికి నటుడు యోగిబాబు చాలా సంకటపడ్డారు. అప్పుడు రజనీ సార్ను చూడొద్దు. స్క్రిప్ట్లో ఉన్నది నువ్వు చెయ్యి కన్నా అని ఆయన ఎంకరేజ్ చేశారు. కామెడీ సన్నివేశాల్లో తమతో జాలీగా ఎంగేజ్ అయి చాలా సూచనలిచ్చేవారు. దాన్ని అవుట్పుట్ చూస్తే వేరే లెవల్గా ఉండేది. నిజం చెప్పాలంటే దర్బార్ చిత్ర షూటింగ్లో చాలా ఖుషీగా ఉన్నాను. కారణం పాపనాశం తరువాత చాలా గ్యాప్ తరువాత తమిళంలో మాట్లాడి నటించాను. అంతగా తమిళ చిత్రాలను మిస్ అయ్యాను. నా పాత్రకు ప్రాముఖ్యత ఉంటే ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధం. కథానాయకిగా మాత్రమే నటిస్తానని, పలాన భాషలోనే నటిస్తానని నిబంధనలు లేవు. రజనీకాంత్లో కామెడీ సెన్స్ నాకు చాలా ఇష్టం. అలాంటి సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు ఆయన ఖుషీ అవుతూ మమ్మల్ని జాలీ పరిచేవారు. ఇకపోతే కమలహాసన్ను తొలిసారిగా పాపనాశం చిత్రంలో నాన్న గెటప్లోనే చూశాను. చిత్రం బాగా రావాలని ఆయన చూపే సిన్సియారిటీ నాకు చాలా నచ్చింది. అదే విధంగా విజయ్ కెమెరా వెనుక చాలా ప్రశాంతంగా ఉంటారు. అదే కెమెరా ముందుకు వచ్చే ఎలా ఉంటారో అందరికీ తెలిసిందే. నాకు సినిమా చేయాల్సింది ఇంకా చాలా ఉంది. తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో చాలా చిత్రాల్లో నటించాలి. భాషను నేర్చుకోవడం అంటే నాకు చాలా ఆసక్తి. ఏ భాషనైనా చాలా త్వరగా సెట్ అయిపోతాను. అందుకే ఇతర భాషా చిత్రాల్లోనూ నటించాలని కోరుకుంటున్నాను. ఇక సినిమాలో మరచిపోలేని అనుభవం అంటే తెలుగులో నటించిన జెంటిల్మెన్ చిత్రమే. ఆ చిత్రం కోసం ఒక సారి కంటిన్యూగా రెండు రోజులు విరామం లేకుండా నటించాను. షూటింగ్ పూర్తి అయిన తరువాత 16 గంటల పాటు నిద్రపోయాను. ఆ సంఘటన ఎప్పటికీ మరచిపోలేను. డబ్బు మాత్రమే సంతోషాన్నివ్వదన్నది నమ్మే వ్యక్తిని నేను. ఖాళీ సమయం లభిస్తే నేను ఉండేది ఇంట్లోనే. అమ్మకు ఇంటి పనుల్లో సహాయం చేస్తాను. -
దర్బార్ : మూవీ రివ్యూ
టైటిల్: దర్బార్ జానర్: యాక్షన్ ఎంటర్టైనర్ నటీనటులు: రజనీకాంత్, నయనతార, నివేదా థామస్, యోగిబాబు, సునీల్ శెట్టి, సంగీతం: అనిరుద్ కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: ఏఆర్ మురుగదాస్ బ్యానర్: లైకా ప్రొడక్షన్ సూపర్స్టార్ రజనీకాంత్ తనదైన స్టైల్లో బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సంబరాలను ప్రారంభించాడు. దర్బార్ సినిమాతో బాక్సాఫీస్ బరిలో పందెంకోడిలా దూకాడు. ఇది డబ్బింగ్ సినిమా అయినా.. తెలుగులో రజనీకాంత్కు ఉన్నఛరిష్మా, స్టామినాను చూసుకుంటే పెద్ద సినిమాగానే పరిగణించాలి. గతంలో కబాలి, కాలా, 2.0, పెట్టా వంటి సినిమాలతో తెలుగువారిని పలుకరించిన ఈ సూపర్స్టార్ తన స్టామినాకు తగ్గ హిట్ను అందుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో స్టార్ దర్శకుడు మురగదాస్ దర్శకత్వంలో తొలిసారి రజనీకాంత్ నటిస్తున్న సినిమా కావడం.. సంక్రాంతి బరిలో దిగుతుండటంతో ‘దర్బార్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికితోడు రజనీ సరసన నయనతార నటిస్తుండటం.. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్, ట్రైలర్లో ఆదిత్య అరుణాచలంగా రజనీ తనదైన లుక్స్తో మెస్మరైజ్ చేయడం సినిమాపై అంచనాలను పెంచింది. సంక్రాంత్రి కానుకగా తాజాగా ప్రేక్షకుల ముందుకు ‘దర్బార్’ ఏమేరకు ప్రేక్షకుల మెప్పించిందో తెలుసుకుందాం పదండి... కథ: ముంబై పోలీసు కమిషనర్ అయిన ఆదిత్య అరుణాచలం (రజనీకాంత్) ఒక్కసారిగా ఆవేశానికిలోనై.. రౌడీలను, గ్యాంగ్స్టర్లను విచ్చలవిడిగా కాల్చిచంపుతుంటాడు. అతని ఎన్కౌంటర్లపై విచారణ జరపడానికి వచ్చిన మానవహక్కుల కమిషన్ సభ్యులను కూడా బెదిరిస్తాడు. ఏదైనా పని చేపడితే.. దానిని కంప్లీట్గా క్లీన్ చేసే వరకు వదిలిపెట్టని ఆదిత్య అరుణాచలం ముంబైలో డ్రగ్స్, హ్యుమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్లను ఏరివేసే క్రమంలో కిరాతకుడైన విక్కీ మల్హోత్రా కొడుకు అజయ్ మల్హోత్రాను అరెస్టు చేస్తాడు. ఆదిత్య అరుణాచలం వ్యూహాలతో అనూహ్య పరిస్థితుల నడుమ జైల్లోనే అజయ్ హతమవ్వాల్సి వస్తోంది. దీంతో డ్రగ్లార్డ్, మొబ్స్టర్ అయిన హరిచోప్రా (సునీల్ శెట్టి) ప్రతీకారానికి తెగబడతాడు. ఆదిత్య కూతురితోపాటు విక్కీని కూడా చంపుతాడు. అతనెందుకు ఈ హత్యలు చేశాడు. గతంలో పోలీసులను సజీవదహనం చేసి ముంబై పోలీసుల ప్రతిష్టను దెబ్బతీసిన హరిచోప్రా అసలు ఎవరు? ఈ చిక్కుముడులను ఆదిత్య అరుణాచలం ఎలా విప్పాడు? ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్నది మిగతా కథ.. నటీనటులు: దక్షిణాది వెండితెరపై ఇప్పటికీ తిరుగులేని సూపర్స్టార్ రజనీకాంత్. ఆయనకు వయస్సు పెరుగుతున్నా.. రోజురోజుకు స్టామినా మాత్రం తగ్గడం లేదు. తనదైన స్టైల్, గ్లామర్, యాక్టింగ్, పంచ్ డైలాగులతో రజనీ ఇప్పటికీ వెండితెరమీద ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూనే ఉన్నాడు. తాజా సినిమా ‘దర్బార్’ కూడా పూర్తిగా రజనీ స్టైల్, మ్యానరిజమ్స్, పంచ్ డైలాగుల మీద ఆధారపడింది. ముంబై పోలీసు కమిషనర్గా రజనీ లుక్, స్టైల్, మ్యానరిజమ్స్ ఫ్యాన్స్తో అదరహో అనిపిస్తాయి. పోలీసు కమిషనర్గా రౌడీ మూకలను రప్ఫాడిస్తూనే.. ఇటు నయనతారతో మనస్సు గెలిచేందుకు ప్రయత్నించే పాత్రలో రజనీ అదరగొట్టాడు. తన ఏజ్కు తగ్గట్టు నడి వయస్సు పాత్ర పోషించిన రజనీ.. నయనతారతో మాట్లాడేందుకు, ఆమె ప్రేమ గెలిచేందుకు పడే పాట్లు ప్రేక్షకులను నవిస్తాయి. ఇక, హీరోయిన్గా నయనతార పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. ఇది ప్రధానంగా తండ్రీ-కూతురు మధ్య సెంటిమెంట్ కథ. తండ్రిగా రజనీ, కూతురిగా నివేదా థామస్ తెరపై అద్భుతంగా ఒదిగిపోయారు. స్నేహితుల్లా ఉండే తండ్రీ-కూతురు మధ్య సీన్లు ప్రేక్షకులను అలరిస్తాయి. సెంకడాఫ్లో ఇద్దరి పాత్రలు, అభినయం ప్రేక్షకులతో కంటతడి పెట్టిస్తుంది. ఇక, విలన్గా సునిల్ శెట్టి ఓ మోస్తరుగా నటించాడు. రజనీ స్థాయికి తగ్గ విలన్ అయితే కాదు. యోగిబాబు కామెడీ అంతంతమాత్రమే ఉండగా.. ముంబై నేపథ్యం కావడంతో ఎక్కువశాతం నటులు కొత్తవాళ్లు, బాలీవుడ్ వాళ్లు సినిమాలో కనిపిస్తారు. విశ్లేషణ: రజనీకాంత్ను మరోసారి తెరమీద పోలీసు ఆఫీసర్గా చూపిస్తూ మురగదాస్ తీసుకొచ్చిన ‘దర్బార్’ సినిమాలో కథ అంత బలంగా కనిపించదు. ఇలాంటి రివేంజ్ డ్రామా కథలతో ఇప్పటివరకు చాలా సినిమాలే వచ్చాయి. ఈ సినిమాలో స్పెషాలిటీ ఏమిటంటే అది కచ్చితంగా రజనీకాంత్. ప్రతి ఫ్రేములోనూ రజనీని స్టైలిష్గా చూపించడంలో, రజనీ స్టైల్స్, మ్యానరిజమ్స్ ఉపయోగించుకోవడం దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కానీ, కథ కొత్తది కాకపోవడం, క్లైమాక్స్ రోటిన్గా ఉండటంతో కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా కొంత బోర్ కొట్టవచ్చు. ఇక, సెకండాఫ్లో కథ కొంచెం నెమ్మదించినట్టు అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ వరకు సినిమా బాగున్నా.. క్లైమాక్స్ రోటిన్గానే అనిపిస్తుంది. ఈ సినిమాకు ప్రధాన బలం అనిరుద్ అందించిన నేపథ్య సంగీతం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో చాలా సీన్లను అనిరుద్ ఓ రేంజ్కు తీసుకెళ్లాడు. ముఖ్యంగా రైల్వేస్టేషన్లో వచ్చే ఫైట్ సీన్లో ఫైట్ స్టైలిష్గా ఉండటంతోపాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్బ్గా అనిపిస్తుంది. అయితే, డబ్బింగ్ సినిమా కావడంతో పాటలు చాలావరకు రణగొణధ్వనుల్లా అనిపిస్తాయి. ఇక, సినిమాటోగ్రఫి బాగుంది. సినిమా నిర్మాణ విలువలూ రిచ్గా ఉన్నాయి. మొత్తానికీ ఈ సినిమా రజనీ ఫ్యాన్స్కు పండుగే అని చెప్పవచ్చు. బలాలు రజనీకాంత్ స్టైలిష్ లుక్, మ్యానరిజమ్ కూతురిగా నివేదా థామస్ నటన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బలహీనతలు రజనీ స్థాయికి తగ్గట్టు కథ బలంగా లేకపోవడం ఒకింత రోటిన్ కథ కావడం, రోటిన్ క్లైమాక్స్ - శ్రీకాంత్ కాంటేకర్ -
తక్కువగా ఆశ పడితే సంతోషంగా ఉంటాం
‘‘1976లో తెలుగులో నా ‘అంతులేని కథ’ సినిమా విడుదలైంది.. ఇçక్కడున్న వారిలో 99శాతం మంది అప్పుడు పుట్టి ఉండరు. తమిళ ప్రేక్షకులు నన్ను ఎంతగా ప్రేమిస్తారో తెలుగు ప్రేక్షకులు కూడా అంతే ప్రేమించడం నా పూర్వజన్మ సుకృతం’’ అన్నారు రజనీకాంత్. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్, నయనతార జంటగా రూపొందిన చిత్రం ‘దర్బార్’. ఎ. సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్వీ ప్రసాద్ విడుదల చేస్తున్నారు. ఈ నెల 9న ‘దర్బార్’ విడుదల కానుంది. శుక్రవారం హైదరాబాద్లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో రజనీకాంత్ మాట్లాడుతూ– ‘‘ఎన్వీ ప్రసాద్గారు నాకు 20ఏళ్లుగా తెలుసు.. సినిమా ఆడినా, ఆడకున్నా ఒకేలా ఉంటారాయన. మామూలుగా ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ను ఆయన కొంచెం లో ప్రొఫైల్లో చేసేవారు. కానీ ‘దర్బార్’ సినిమా హిట్ అని తెలిసిపోయినట్టుంది ఆయనకు.. అందుకే ఇంత భారీ వేడుక ప్లాన్ చేశారు. నా వయసు 70 ఏళ్లు.. ఇంకా నేను హీరోగా నటిస్తున్నానంటే ప్రేక్షకుల అభిమానం, ప్రోత్సాహమే కారణం.. అవే నా ఎనర్జీ. ఈ వయసులోనూ మీరు ఇంత సంతోషంగా, ఉత్సాహంగా ఎలా ఉన్నారని కొందరు అడుగుతారు.. నేను వారికి చెప్పేది ఒక్కటే. తక్కువగా ఆశ పడండి.. తక్కువ ఆలోచనలు పెట్టుకోండి.. తక్కువగా భోజనం చేయండి, తక్కువగా నిద్రపోండి.. తక్కువగా వ్యాయామాలు చేయండి.. ఇవన్నీ చేస్తే సంతోషంగా ఉంటాం (నవ్వుతూ). తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాని ఎప్పుడూ ప్రోత్సహిస్తారు. ‘పెదరాయుడు, బాషా, నరసింహా, చంద్రముఖి, రోబో’ వంటి సినిమాలు రజనీ ఉన్నాడని బాగా ఆడలేదు.. ఆ సినిమాలు బాగున్నాయి.. వాటిల్లో రజనీ ఉన్నాడంతే. అందరూ సక్సెస్ఫుల్ సినిమా తీయాలి, బాగా ఆడాలని తీస్తారు. సినిమా తీసేటప్పుడు ఓ మ్యాజిక్ జరుగుతుంది, ఆ సినిమా బాగా వస్తుంది. అయితే అది మన చేతుల్లో ఉండదు. ‘దర్బార్’ చేసేటప్పుడు ఆ మ్యాజిక్ మాకు తెలిసిపోయింది. మురుగదాస్గారితో పని చేయాలని 15ఏళ్లుగా చూశాను కానీ కుదర్లేదు.. ఇప్పుడు కుదిరింది. సుభాస్కరన్గారు పెద్ద వ్యాపారవేత్త. సినిమాలంటే ఇష్టంతో తీస్తున్నారు.. ఇప్పుడు మన ‘బాహుబలి’లాగా ‘పొన్నియిన్ సెల్వన్’ అనే ప్యాన్ ఇండియన్ ఫిల్మ్ తీస్తున్నారు’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం ట్రైలర్ చివరలో రజనీసార్ నడుచుకుంటూ వచ్చే షాట్కి నేను ఫిదా అయిపోయా. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఇరగదీస్తున్న మురుగదాస్గారికి సెల్యూట్. రజనీ సార్ ‘జీవన పోరాటం’ సినిమా టైమ్లో నేను పిల్లాణ్ణి.. ఆ సినిమాలో ఆయన స్టైల్ చూసి, అలా చేయాలని ప్రయత్నించా. కానీ, రాలేదు’’ అన్నారు. మురుగదాస్ మాట్లాడుతూ–‘‘నా కెరీర్లో ఇది చాలా ముఖ్యమైన సినిమా.. ఎందుకంటే రజనీగారితో నేను చేసిన తొలి మూవీ. అలాగే నేను తీసిన తొలి పోలీస్ స్టోరీ. పదిహేనేళ్ల క్రితం రజనీగారిని ప్రేక్షకులు ఎలా చూశారో ఆ స్టైల్, ఆ మాస్ అంశాలన్నీ ‘దర్బార్’లో ఉన్నాయి. ఇలాంటి ప్యాన్ ఇండియన్ సినిమా చేయడానికి అవకాశం ఇచ్చిన సుభాస్కరన్ సార్కి ధన్యవాదాలు. సుభాస్కరన్గారు నిజమైన హీరో. భవిష్యత్లో ఆయన లైఫ్ స్టోరీ ఒక బయోపిక్గా రావొచ్చు. అంత మంచి లైఫ్ స్టోరీ ఆయనది. రజనీగారికి ప్రత్యర్థిగా ఉండే బలమైన పాత్రని సునీల్శెట్టిగారు బ్యాలెన్స్ చేశారు’’ అన్నారు. నివేదా థామస్ మాట్లాడుతూ– ‘‘ఇంత పెద్ద సినిమాలో ఈ పాత్రకి నేను సరిపోతానని అవకాశం ఇచ్చిన మురుగదాస్గారికి చాలా థ్యాంక్స్. షూటింగ్లో రజనీ సార్ ఎలా మాట్లాడుతున్నారు? ఎలా నటిస్తున్నారని చూస్తూనే ఉండేదాన్ని. విజయ్, అజిత్, మహేశ్బాబు, అల్లు అర్జున్, నాని.. ఇలా అందర్నీ మనం అభిమానిస్తాం. వాళ్లందరికీ కామన్గా నచ్చే ఒక యాక్టర్ రజనీ సార్’’ అన్నారు. పాటల రచయిత భాస్కరభట్ల మాట్లాడుతూ– ‘‘రజనీకాంత్గారి ‘2.ఓ’కి ఓ పాట, ‘పేట’కి ఓ పాట రాసే అవకాశం వచ్చింది. ఇప్పుడు ‘దర్బార్’లో రెండు పాటలు రాశా’’ అన్నారు. సంగీత దర్శకుడు అనిరుద్ మాట్లాడుతూ–‘‘ఈ సినిమా నాకు ప్రత్యేకం.. ఎందుకంటే నా మనసుకు బాగా దగ్గరైన చిత్రమిది. ఈ అవకాశం ఇచ్చిన రజనీసార్కి, తన కలల చిత్రంలో చాన్స్ ఇచ్చిన మురుగదాస్కి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘రజనీగారిని అందరూ సూపర్స్టార్ అని పిలుస్తారు. కానీ, నా వరకు ఆయన గాడ్ ఆఫ్ సినిమా. ఆయన నుంచి ఎంతో కొంత నేర్చుకోవచ్చు. సెట్లో మురుగదాస్గారు మా అందరికీ గురువు’’ అన్నారు బాలీవుడ్ నటుడు సునీల్శెట్టి. ‘‘రజనీకాంత్గారితో తొలిసారి ‘దళపతి’ సినిమాకు చేశాను. ఆయన ఎనర్జీలో మార్పు లేదు’’ అన్నారు కెమెరామేన్ సంతోష్ శివన్. ఈ వేడుకలో నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్, కేకే రాధామోహన్, దర్శకులు వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్, మారుతి, ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్, పాటల రచయిత కృష్ణకాంత్, గాయకుడు శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నన్ను పెళ్లి చేసుకుంటావా? నువ్వు వర్జినా?
సినిమా: వదంతులను ఇంతకుముందు హీరోయిన్లు లైట్గా తీసుకునేవారు. మరి కొందరైతే వాటిని ఎంజాయ్ చేస్తున్నట్లు చెబుతుండేవారు. ఈ తరం నటీమణులు అలా కాదు. ఎదురుదాడి చేస్తున్నారు. మేమూ మనుషులమే, మాకూ అమ్మనాన్న అంటూ కుటుంబం ఉంటుంది. సగటు మనిషిగా మాతోనూ సభ్యతగా ప్రవర్తించండి. అంటూ ఘాటుగానే చురకలు వేస్తున్నారు. ఇటీవల నటి రష్మిక ఇలానే నెటిజన్లపై మండిపడింది. తాజాగా నటి నివేదాథామస్ తనదైన ధోరణిలో తన అభిమానులకు క్లాస్ పీకింది. ఈ అమ్మడి గురించి చెప్పాలంటే కేరళా కుట్టి అయినా తమిళం, తెలుగు అంటూ దక్షిణాది భాషల్లో నటించేస్తోంది. పాపనాశం చిత్రంలో కమలహాసన్కు పెద్ద కూతురిగా నటించి కోలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఆ తరువాత టాలీవుడ్లో కథానాయకి అయిపోయింది. తాజాగా కోలీవుడ్లో దర్బార్ చిత్రంలో రజనీకాంత్కు కూతురిగా నటించింది. కాగా ఆ అమ్మడు సమీపకాలంలో ఆన్లైన్లో అభిమానులతో ముచ్చటించింది. అయితే అభిమానులడిగిన కొన్ని ప్రశ్నలకే బదులిచ్చింది. చాలా ప్రశ్నలకు కోపాన్ని దిగమింగుకుని మౌనం వహించింది. కొందరు అభిమానులు అడిగిన ప్రశ్నలపై ట్విట్టర్లో స్పందించింది. అందులో తనలో ఆన్లైన్లో మాట్లాడడానికి సమయాన్ని కేటాయించిన వారందరికీ ధన్యవాదాలు. కొందరడిగిన ప్రశ్నలకు బదులివ్వడం జాలీగా అనిపించింది. మరి కొందరు అడిగిన ప్రేమలో పడ్డావా? పెళ్లెప్పుడు? నన్ను పెళ్లి చేసుకుంటావా? నువ్వు వర్జినా? లాంటి ప్రశ్నలకు బదులివ్వలేదు. అలాంటి వారికి నేను చెప్పేది ఒక్కటే ముందుగా మీరు సహ మనిషితో మాట్లాడుతున్నానన్న సంగతిని గుర్తించుకోండి. కొంచెం మర్యాద ఇవ్వండి. నా కోసం సమయాన్ని కేటాయించినందుకు మరోసారి ధన్యవాదాలు. త్వరలో మళ్లీ కలుద్దాం అని పేర్కొంది. దీంతో నటి నివేదాథామస్ జాణతనానికి నెటిజన్లు విస్తుపోతున్నారు. నటీమణులపై చౌకబారుతనంగా ప్రవర్తించే వారికి బాగానే బుద్ధి చెప్పిందని అభినందిస్తున్నారు. ఆరంభంలోనే ఇలా గడుసుగా ప్రవర్తించడం నివేదా థామస్కు అవసరమా అనే వారూ లేకపోలేదు. ఏదేమైనా నివేదా థామస్ అభిమానులపై వేసిన చురకలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
‘బ్రోచేవారెవరురా’ విజయోత్సవ వేడుక
-
`బ్రోచేవారెవరురా` ప్రీ రిలీజ్ వేడుక
-
నా లైఫ్లో ఆ బ్యాచ్ ఉంటే బాగుంటుంది
‘‘స్క్రీన్ టైమ్ కాదు.. కథలో నా పాత్రకు ప్రాముఖ్యత ఉండాలని కోరుకుంటున్నాను. ఎగై్జట్ చేసిన స్క్రిప్ట్స్నే ఒప్పుకుంటున్నాను’’ అన్నారు నివేదా థామస్. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో శ్రీవిష్ణు, నివేదా థామస్ జంటగా నటించిన చిత్రం ‘బ్రోచేవారెవరురా’. మన్యం విజయ్కుమార్ నిర్మించారు. సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను ఈ నెల 28న విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా నివేదా థామస్ చెప్పిన కబుర్లు. ► ఇందులో నా పాత్ర పేరు మిత్రా. క్లాసికల్ డ్యాన్సర్ కావాలన్నది మిత్రా కోరిక. నా రియల్లైఫ్లో నా ఐదేళ్లప్పుడే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నా. హ్యూమన్ రిలేషన్షిప్స్ ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. ప్రస్తుతం సమాజంలో ఏం జరుగుతుందనే విషయాలను ఆసక్తికరంగా చూపించాం. మహిళలపై వేధింపుల అంశాన్ని చర్చించాం. స్క్రీన్ప్లే ఆసక్తికరంగా ఉంటుంది. ► ‘ఆర్ 3’ బ్యాచ్ (శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ) వల్ల మిత్రా లైఫ్లో కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతాయి. ఆ సంఘటనల ప్రభావం ఆర్3 బ్యాచ్పై పడుతుంది. ఈ పరిస్థితుల్లో ఎవరు ఎవర్ని ఎలా కాపాడుకున్నారు అన్నదే కథాంశం. ఇది ఉమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్ కాదు. సినిమాలోని అందరి పాత్రలకు ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సినిమా చేసిన తర్వాత నా లైఫ్లో ఆర్ 3 బ్యాచ్లాంటి వారు ఉంటే బాగుండు అనిపించింది. వివేక్ ఆత్రేయ మంచి డైరెక్టర్. మంచి అవుట్పుట్ ఇచ్చారు. ► నేనేం చేసినా ఒక పద్ధతి ప్రకారం చేయాలనుకుంటాను. సీన్కు అవసరం అయితేనే హోమ్వర్క్ చేస్తాను. రొటీన్ సినిమాలు చేయడం నాకు అంతగా ఇష్టం ఉండదు. ఈ సినిమాకు నేనే డబ్బింగ్ చెప్పాను. ‘జెంటిల్మన్’ అప్పుడే నా పాత్రకు నేను డబ్బింగ్ చెప్పాలనుకున్నాను. కుదర్లేదు. ‘118’ చిత్రం నుంచి నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటున్నా. ► తమిళంలో సినిమాలు చేయకపోవడానికి పెద్దగా కారణం ఏమీ లేదు. ‘జెంటిల్మన్’ తర్వాత తెలుగులో నాకు చాలా మంచి స్క్రిప్ట్స్ వచ్చాయి. చేస్తున్నాను. హైదరాబాద్లో ఇల్లు కొనలేదు. కొనే ఆలోచనలో ఉన్నాను. ► ‘మీటూ’ అనేది మూమెంట్. మహిళలపై వేధింపులనేవి అన్ని రంగాల్లోనూ ఉన్నాయి. యాక్టర్స్ పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి ఈజీగా కామెంట్ చేయొచ్చని కొందరు అనుకుంటారు. సోషల్మీడియాలో నా పై ట్రోల్స్ను పట్టించుకోను. ► ప్రస్తుతం ఇంద్రగంటిగారి ‘వి’లో నటిస్తున్నా. ‘శ్వాస’ సినిమా ప్రీ–ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. రజనీకాంత్గారి ‘దర్బార్’ సినిమాలో నటిస్తున్నానా? లేదా? అనేది నేను చెప్పలేను. చిత్రబృందం అధికారికంగా చెబితే బాగుంటుందన్నది నా అభిమతం. -
డిఫరెంట్ కాన్సెప్ట్తో ‘బ్రోచేవారెవరురా’
వైవిధ్యమైన కథాంశాలతో మెప్పిస్తూ హీరోగా తనకంటూ ప్రత్యేకత గుర్తింపు తెచ్చుకున్న శ్రీ విష్ణు లీడ్ రోల్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘బ్రోచేవారెవరురా’. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. మన్యం ప్రొడక్షన్స్ బ్యానర్పై విజయ్ కుమార్ మన్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాలోని కీలక పాత్రలు శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, నివేదా థామస్ లతో పాటు సత్యదేవ్, నివేదా పేతురాజ్లను టీజర్లో పరిచయం చేశారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా రూపొందుతున్న రెండో చిత్రం ‘బ్రోచేవారెవరురా’. ‘చలనమే చిత్రము.. చిత్రమే చలనము’ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. యువ సంగీత దర్శకుడు వివేక్ సాగర్ సంగీత సారథ్యం అందిస్తున్నాడు. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను మే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
డాటరాఫ్ రజనీకాంత్?
రజనీకాంత్ కొత్త చిత్రం గురించి రోజుకో న్యూస్ బయటకు వస్తోంది. లేటెస్ట్గా ఈ సినిమాలో రజనీ కుమార్తెగా నివేదా థామస్ కనిపించనున్నారని టాక్. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రజనీ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. లైకా ప్రొడ„ న్స్ నిర్మించనున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్. ఇందులో రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారు. ఇందులో సినిమాకి కీలకంగా నిలిచే రజనీకాంత్ కుమార్తె పాత్ర ఉంటుందట. ఈ పాత్ర కోసం నివేదా థామస్ను సంప్రదించారట చిత్రబృందం. ఆల్రెడీ ‘పాపనాశం’ (మలయాళ ‘దృశ్యం’ తమిళ రీమేక్) సినిమాలో కమల్ హాసన్ కుమార్తెగా నివేదా థామస్ కనిపించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా నివేదాకు పెద్ద ప్లస్ అయింది. మరి రజనీ కుమార్తెగా కూడా నటిస్తారా? అనే చర్చ జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల రజనీ లుక్ టెస్ట్ జరిగింది. ఆ స్టిల్స్ కొన్ని ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ఏప్రిల్ 10న ముంబైలో షూటింగ్ స్టార్ట్ కానున్న ఈ చిత్రానికి అనిరుథ్ సంగీత దర్శకుడు. -
118 మూవీ సక్సెస్ మీట్
-
‘118’ మూవీ ప్రెస్మీట్
-
‘118’ మూవీ రివ్యూ
టైటిల్ : 118 జానర్ : థ్రిల్లర్ తారాగణం : కల్యాణ్ రామ్, నివేదా థామస్, షాలినీ పాండే, ప్రభాస్ శ్రీను సంగీతం : శేఖర్ చంద్ర దర్శకత్వం : కేవీ గుహన్ నిర్మాత : మహేష్ ఎస్ కోనేరు కెరీర్ను మలుపు తిప్పే బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న నందమూరి యువ కథానాయకుడు కల్యాణ్ రామ్, హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం 118. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్స్కు మంచి రెస్పాన్స్ రావటంతో సినిమా కూడా మెప్పింస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. మరి ఆ అంచనాలను 118 అందుకుందా.? ఈ సినిమాతో కల్యాణ్ రామ్ మరో సక్సెస్ సాధించాడా? కథ : గౌతమ్ (కల్యాణ్ రామ్) ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. ఏ విషయాన్ని అయినా మొదలుపెడితే మధ్యలో వదిలేసే అలవాటులేని గౌతమ్ను ఓ కల బాగా డిస్ట్రబ్ చేస్తుంది. కలలో ఓ అమ్మాయిని ఎవరో తీవ్రంగా కొట్టడం, ఓ కారును పెద్ద కొండ మీదనుంచి చెరువులో పడేయటం లాంటి సంఘటనలు కనిపించటంతో గౌతమ్ ఆ కల గురించి తెలుసుకోవాలనుకుంటాడు. తనకు కలలో కనిపించిన అమ్మాయి నిజంగా ఉందా? అని వెతికే ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయత్నంలో గౌతమ్కు కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. అసలు గౌతమ్ కలలో వచ్చిన ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయిని ఎవరు, ఎందుకు కొట్టారు? ఈ మిస్టరీని గౌతమ్ ఎలా సాల్వ్ చేశాడు? అన్నదే మిగతా కథ. నటీనటులు : జర్నలిస్ట్ పాత్రలో కల్యాణ్ రామ్ మరోసారి ఆకట్టుకున్నాడు. గతంలో ఇజం సినిమాలో రిపోర్టర్ గా కనిపించిన కల్యాణ్ రామ్ ఈ సారి స్టైలిష్ పాత్రలో మరింతగా మెప్పించాడు. పర్ఫామెన్స్, యాక్షన్ సీన్స్లోనూ సూపర్బ్ అనిపించాడు. థ్రిల్లర్ సినిమా కావటంతో రొమాన్స్, డ్యాన్స్లకు పెద్దగా స్కోప్ లేదు. నివేదా థామస్ నటన సినిమాకే హైలెట్గా నిలిచింది. తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా తన మార్క్ చూపించింది. హీరోయిన్ షాలిని పాండే పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోయినా ఉన్నంతలో మంచి నటనతో మెప్పించింది. ఇతర పాత్రల్లో హరితేజ, ప్రభాస్ శ్రీను, నాజర్ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ : సినిమాటోగ్రాఫర్గా టాలీవుడ్కు సుపరిచితుడైన కేవీ గుహన్, 118 సినిమాతో దర్శకుడిగా మారాడు. 2010 ఓ తమిళ సినిమాను డైరెక్ట్ చేసిన గుహన్ లాంగ్ గ్యాప్ తరువాత తెలుగు సినిమాతో మరోసారి మెగా ఫోన్ పట్టుకున్నాడు. రొటీన్ ఫార్ములా సినిమాకు భిన్నంగా ఓ సైన్స్ఫిక్షన్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇంట్రస్టింగ్ పాయింట్ తో సినిమాను ప్రారంభించిన దర్శకుడు ఎంగేజింగ్ స్క్రీన్ప్లేతో ఆడియన్స్ను కట్టిపడేశాడు. అనవసరమైన సన్నివేశాలను ఇరికించకుండా సినిమా అంతా ఓకె మూడ్లో సాగటం ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ రేసీ స్క్రీన్ప్లే, థ్రిల్లింగ్ సీన్స్తో నడిపించిన దర్శకుడు ద్వితీయార్థంలో కాస్త స్లో అయ్యాడు. ప్రీ క్లైమాక్స్కు వచ్చే సరికి పూర్తిగా లాజిక్ను పక్కన పెట్టి తెరకెక్కించిన సన్నివేశాలు అంత కన్విన్సింగ్గా అనిపించవు. సినిమాటోగ్రఫి పరంగా మాత్రం గుహన్ ఫుల్ మార్క్స్ సాధించాడు. స్టైలిష్ టేకింగ్తో మెప్పించాడు. సినిమాకు ప్రధాన బలం నేపథ్య సంగీతం. ప్రతీ సీన్ను తన మ్యూజిక్తో మరింత ఎలివేట్ చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : కల్యాణ్ రామ్, నివేదా థామస్ నటన నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ : లాజిక్ లేని సీన్స్ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
‘118’ ప్రీ రిలీజ్ వేడుక
-
నో డౌట్.. చాలా నమ్మకంగా ఉన్నాను
‘‘హరేరామ్’ లాంటి డిఫరెంట్ మూవీని పదేళ్ల క్రితమే ట్రై చేశాం. కొత్త తరహా సినిమాలు నా దగ్గరకు వచ్చినప్పుడల్లా చేస్తూనే ఉన్నాను. ‘118’ కథ వినగానే చాలా నచ్చింది. నా బ్యానర్లో చేద్దామనుకున్నాను. దర్శకుడు కేవీ గుహన్ తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను తీసుకొని కథ తయారు చేశారు. నో డౌట్.. ఈ సినిమా సక్సెస్పై చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను’’ అని కల్యాణ్రామ్ అన్నారు. కెమెరామేన్ గుహన్ తెలుగులో దర్శకుడిగా పరిచయం అవుతూ, కల్యాణ్రామ్ హీరోగా తెరకెక్కించిన చిత్రం ‘118’. నివేదా థామస్, షాలినీ పాండే కథానాయికలు. మహేశ్ యస్ కోనేరు నిర్మాత. ఈ చిత్రం మార్చి 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా కల్యాణ్ పలు విశేషాలు పంచుకున్నారు. ఫస్ట్ టైమ్ పూర్తి స్థాయి థ్రిల్లర్లో నటించాను. ట్రైలర్లోనే సినిమా కథంతా చూపించాం. ట్రైలర్ని మూడు నాలుగుసార్లు చూస్తే కథ అర్థం అవుతుంది. ట్రైలర్ బావుందని మంచి రెస్పాన్స్ వస్తోంది. కమర్షియల్ ఎలిమెంట్స్ లేని పూర్తి స్థాయి కమర్షియల్ సినిమా ఇది. కామెడీ కానీ, కమర్షియల్ సాంగ్స్ కానీ ఏవీ కావాలని పెట్టినట్లుగా ఉండవు. గుహన్గారి లైఫ్లో ఒక సంఘటన రిపీటెడ్గా జరిగింది. దీన్నే కథగా ఎంచుకొని హీరో దాన్ని ఛేదించుకుంటూ వెళ్తే ఎలా ఉంటుంది? అనే అంశంతో స్క్రిప్ట్ తయారు చేశారు. మొదట చాలా టైటిల్స్ అనుకున్నాం ‘రక్షణ, అన్వేషణ’ ఇలా.. అయితే కొత్తగా, డిఫరెంట్గా ఉండాలని ‘118’ ఫిక్స్ చేశాం. ఈ సినిమాకు మెయిన్ హైలైట్ స్క్రీన్ప్లే. పరిగెడుతుంది. హీరో కూడా ప్రేక్షకుడిలానే ఉంటాడు. ప్రేక్షకులకు, హీరోకు సర్ప్రైజ్లు ఒకేసారి తెలుస్తుంటాయి. ఈ సినిమా కోసం లుక్ మార్చానంటున్నారు. మరీ రొటీన్గా ఉంటే ప్రేక్షకులు కూడా రొటీన్ ఫీల్ అవుతారు. ‘ఇజం’ నుంచి కొత్త లుక్ ట్రై చేస్తూ వస్తున్నా. ఈ సినిమాలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పాత్ర నాది. మొదట ఈ క్యారెక్టర్లోకి వెళ్లడానికి కొంచెం టైమ్ పట్టింది. ప్రొడక్షన్లో నిర్మాత మహేశ్ కోనేరు కాంప్రమైజ్ కాలేదు. అండర్ వాటర్ సీక్వెన్స్ కూడా ముంబై వెళ్లి మరీ షూట్ చేశాం. నాకు ఈత రాదు. నేర్చుకొని మరీ చేశా. ఈ సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నాను. చివరి 30 నిమిషాలు సినిమాకే హైలైట్. విజువల్గా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. గుహన్గారు లేకపోతే ఈ సినిమా ఇలా ఉండేది కాదని నమ్మకంగా చెబుతున్నాను. నివేదా థామస్ ఎమోషనల్ సీన్స్ బాగా చేయగలుగుతారు. ఈ పాత్రకు ఫస్ట్ ఆప్షన్ ఆమె. షాలినీ పాండే కూడా బాగా చేశారు. హిట్, ఫ్లాప్స్ ఎఫెక్ట్ కచ్చితంగా మా మీద ఉంటుంది. ఫ్లాప్ సినిమాకి బాధపడతాం. ఆ తర్వాత సినిమా వైఫల్యానికి కారణాలేంటో లెక్కలేసుకొని రిపీట్ కాకుండా చూసుకుంటాం. ఇది ట్రై అండ్ ట్రై ప్రాసెస్ అంతే. వరుస హిట్స్ సాధించాలని ఏ నటుడికైనా ఉంటుంది. మంచి సినిమా ఆడియన్స్కు ఇద్దాం అనుకునే సినిమాలు తీస్తాం. రిజల్ట్ మన చేతుల్లో ఉండదు. మనం మళ్లీ హిట్ సాధిస్తాం అనే నమ్మకంతో నిర్మాతలు, దర్శకులు సినిమాలు తీస్తూనే ఉంటారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించడం వెనక ఉన్న ముఖ్యోద్దేశం మంచి సినిమాలు తీయడమే. ‘ఇంత చెత్త సినిమా తీశాడేంట్రా’ అని ప్రేక్షకుడు అనుకోకూడదు. మా బ్యానర్లో పరిచయమైన సురేందర్రెడ్డి, అనిల్ రావిపూడి మంచి హిట్స్ సాధించడం హ్యాపీగా ఉంది. కొన్ని కథలు విన్నాను. ఈ సినిమా రిలీజ్ తర్వాత నెక్స్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తాను. మా బ్యానర్పై వెబ్ సిరీస్లు నిర్మిస్తున్నాం. టీనేజ్ లవ్స్టోరీతో ఆ సిరీస్ సాగుతుంది. ఇదివరకు సినిమా రిలీజైన 6 నెలలకు టీవీలో వచ్చేది. డిజిటల్ ప్లాట్ఫామ్స్ వల్ల నెల రోజులకే అమేజాన్, నెట్ఫ్లిక్స్లో వచ్చేస్తున్నాయి. కనీసం ఓ 2 నెలలు అయినా ఆగితే బావుంటుందన్నది నా అభిప్రాయం. సినిమా వంద రోజులాడే రోజులు పోయాయి. నాలుగు వారాలాడితే సూపర్హిట్. -
‘118’ ట్రైలర్ విడుదల
-
118... ఓ సస్పెన్స్
కల్యాణ్ రామ్ హీరోగా కేవీ గుహన్ దర్శకత్వంలో రూపొందించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘118’. నివేథా థామస్, షాలినీ పాండే కథానాయికలు. మహేశ్ కోనేరు నిర్మించిన ఈ సినిమాను మార్చి 1న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మహేశ్ కోనేరు మాట్లాడుతూ – ‘‘కల్యాణ్రామ్ ఇప్పటి వరకూ చేయని జానర్ ఇది. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ తరహా సస్పెన్స్ ఉంటుంది. యాక్షన్ పార్ట్ సినిమాకు హైలైట్. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, టీజర్స్కు మంచి స్పందన లభిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్ చంద్ర, మాటలు : ‘మిర్చి’ కిరణ్. కథ, కెమెరా, స్క్రీన్ప్లే : కె.వి గుహన్. -
మార్చి 1న కళ్యాణ్ రామ్ ‘118’
నందమూరి కల్యాణ్ రామ్ కథానాయకుడిగా నటిస్తోన్న స్టైలీష్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ `118`. నివేదా థామస్, షాలినీ పాండేలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గుహన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈస్ట్కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్పై మహేశ్ కొనేరు నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 1న విడుదలకానుంది. పటాస్ సినిమాతో బ్రేక్ వచ్చినట్టుగానే కనిపించినా తరువాత మళ్లీ గాడి తప్పాడు కల్యాణ్ రామ్. ఈ మధ్య రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ అండ్ టీజర్కీ మంచి రెస్పాన్స్ వస్తోంది. రీసెంట్గా 118 షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ స్టైలిష్ లుక్ లో కనిపించనుండంతో సినిమాపై అంచానాలు పెరిగాయి. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. -
ఇద్దరు భామలతో శ్రీ విష్ణు..!
అప్పట్లో ఒకడుండేవాడు, నీది నాది ఒకే కథ, మెంటల్ మదిలో లాంటి వైవిధ్యమైన సినిమాలతో అలరించిన శ్రీ విష్ణు మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మెంటల్ మదిలో ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు బ్రోచేవారెవరురా..! అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో శ్రీవిష్ణుకు జోడిగా నివేదా ధామస్తో పాటు నివేదా పేతురాజ్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ సినిమాలో సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మన్యం ప్రొడక్షన్స్ బ్యానర్పై విజయ్ కుమార్ మన్యం నిర్మిస్తున్న ఈ సినిమాకు పెళ్లి చూపులు, సమ్మోహనం లాంటి సూపర్ హిట్ సినిమాలకు సంగీతమందించిన వివేక్ సాగర్ సంగీతమందిస్తున్నాడు. -
తెలియని విషయం వెంటాడుతోంది
కల్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘118’. నివేథా థామస్, షాలినీ పాండే హీరోయిన్లుగా నటించారు. సినిమాటోగ్రాఫర్ కె.వి. గుహన్ ఈ చిత్రం ద్వారా తెలుగు పరిశ్రమకి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈస్ట్కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేశ్ కోనేరు నిర్మించిన ఈ సినిమా టీజర్ని మంగళవారం విడుదల చేశారు. టీజర్లో కల్యాణ్ రామ్ చాలా స్టైలిష్ లుక్తో కనిపించారు. ఏదో తెలియని విషయం ఆయన్ని వెంటాడుతున్నట్లు, ఆ విషయాన్ని తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్లు ఆయన పాత్రను కె.వి.గుహన్ మలిచినట్లుగా టీజర్ చెబుతోంది. మహేశ్ కోనేరు మాట్లాడుతూ –‘‘స్టైలిష్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిన చిత్రమిది. ‘118’ టైటిల్ లోగో, ఫస్ట్ లుక్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. కల్యాణ్ రామ్గారు ఇప్పటివరకు చేయనటువంటి జోనర్లో రూపొందింది. అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిన మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్ చంద్ర, కథ, స్క్రీన్ప్లే, కెమెరా, దర్శకత్వం: కె.వి.గుహన్. -
స్టైలిష్ యాక్షన్
అటు కమర్షియల్ సినిమాలు.. ఇటు వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ తన ప్రత్యేకత చాటుకుంటున్నారు హీరో కల్యాణ్ రామ్. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘118’. నివేథా థామస్, షాలినీ పాండే కథానాయికలు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.వి.గుహన్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా తెలుగుకి పరిచయం అవుతున్నారు. ఈస్ట్కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేశ్ కోనేరు నిర్మించిన ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ను సోమవారం విడుదల చేశారు. మహేశ్ కోనేరు మాట్లాడుతూ– ‘‘స్టైలిష్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిన చిత్రం ‘118’. కథ, కథనంతో పాటు యాక్షన్ పార్ట్కు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కల్యాణ్ రామ్గారు ఇప్పటి వరకు చేయనటువంటి సరికొత్త పాత్రలో ప్రేక్షకులను మెప్పించనున్నారు. కె.వి.గుహన్గారు ఈ చిత్రంతో టాలీవుడ్కి డైరెక్టర్గా పరిచయం కావడంతో పాటు సినిమాటోగ్రఫీ కూడా చేశారు. ప్రస్తుతం మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జనవరి ద్వితీయార్ధంలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్ చంద్ర. -
ఇంట్రస్టింగ్ టైటిల్తో కల్యాణ్ రామ్
నందమూరి కల్యాణ్ రామ్ సక్సెస్ కోసం చాలా రోజలుగా ఎదురు చూస్తున్నాడు. పటాస్ సినిమాతో బ్రేక్ వచ్చినట్టుగానే కనిపించినా తరువాత మళ్లీ గాడి తప్పాడు. ప్రస్తుతం ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గుహన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నివేదా థామస్, షాలినీ పాండేలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాకు ‘118’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారట. కథలో ఈ నెంబర్కు చాలా ఇంపార్టెన్స్ ఉండటంతో అదే టైటిల్గా ఫిక్స్ చేసే ఆలోచనటో ఉన్నారట యూనిట్. ఈస్ట్కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్పై తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కల్యాణ్ రామ్ డిఫరెంట్ లుక్లో కనిపించనున్నాడు. -
కొత్త లుక్లో కల్యాణ్ రామ్
నందమూరి హీరో కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకుడు. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ సరికొత్త లుక్లో కనిపించనున్నాడు. అందుకోసం బాలీవుడ్ స్టైలిష్ట్ హకీం అలీం నేతృత్వంలో ప్రత్యేకంగా మేకోవర్ అయ్యాడు కల్యాణ్ రామ్. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను డిసెంబర్ నెలాఖరునగాని, జనవరి లోగాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కల్యాణ్ రామ్ సరసన నివేదా థామస్, షాలిని పాండేలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను ఈస్ట్కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్పై తెరకెక్కిస్తున్నారు. -
శ్వాస మొదలైంది
నిఖిల్, నివేథా థామస్ జంటగా కిషేన్ కట్టా దర్శకత్వంలో తేజు ఉప్పలపాటి, హరిణికేష్ రెడ్డి నిర్మిస్తున్న ‘శ్వాస’ చిత్రం హైదరాబాద్లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత పి.కిరణ్, సీనియర్ నరేశ్ కెమెరా సిచ్ఛాన్ చేయగా, హీరో శర్వానంద్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు క్రిష్ గౌరవ దర్శకత్వం వహించారు. నిఖిల్ మాట్లాడుతూ– ‘‘నేను సాధారణంగా యువదర్శకులతో సినిమాలు చేస్తుంటాను. ఇప్పుడు మరో యంగ్ డైరెక్టర్ కిషేన్తో కలిసి పని చేయడానికి సిద్ధమయ్యాను. మంచి సినిమాలను తీసుకొచ్చే ప్రయత్నంలో నేను చేస్తున్న మరో మంచి ప్రయత్నమిది. ఈ చిత్రంలో నా పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి’’ అన్నారు. హీరో నిఖిల్తో సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా ఓ మంచి జర్నీలా సాగాలని కోరుకుంటున్నాను’’ అన్నారు కిషేన్. ‘‘కిషేన్ మాకు మంచి మిత్రుడు. మంచి స్క్రిప్ట్ కుదరడంతో ఈ సినిమా చేయడానికి రెడీ అయ్యాం. ఇందులో నిఖిల్గారిని ఛాలెంజింగ్ రోల్లో చూస్తారు’’ అన్నారు నిర్మాతలు. ‘‘ఇండియన్ సినిమాకి చాన్స్ ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు విదేశీ కెమెరామేన్ ఇస్తావస్ లెట్టాంగ్. ఈ చిత్రానికి సంగీతం: హరిణికేష్. -
అప్పుడు తప్పకుండా పెళ్ళి చేసుకుంటా!
క్యారెక్టర్ స్ట్రాంగ్గా ఉంటే.. కాదు.. కాదు.. అదొక్కటే సరిపోదు. వేల్యూస్ గట్టిగా ఉంటే... ఊహూ... ఇదీ సరిపోదు. ఫోకస్ గట్టిగా ఉంటే.. అబ్బా.. ఇది విన్నదే కదా! అమ్మాయి గట్టిగా ఉంటే.. ఆహా.. ఇదండీ విషయం. కుట్టీ గట్టిగా ఉంటే.. నివేథా థామస్లా ఉంటుంది. ఎడ్యుకేషన్ బ్రేక్ అంటూ చిన్న గ్యాప్ తర్వాత ఇప్పుడు రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆ స్మాల్ బ్రేక్ గురించి? దీన్ని నేనసలు బ్రేక్లానే ఫీల్ అవ్వడంలేదు. నేను యాక్టింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చదువు, యాక్టింగ్ రెండూ çసమానంగానే చేస్తూ వస్తున్నాను. రెంటిలో ఏదైనా బాగా ఇంపార్టెంట్ అనిపిస్తే అప్పుడు కచ్చితంగా ఒకదానికి బ్రేక్ ఇస్తాను. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు యాక్టింగ్కి దూరంగా ఉండటం, సినిమాలు చేస్తున్నప్పుడు స్టడీస్ని బ్యాలెన్స్ చేయడం... ఇదంతా కామనే నాకు. ప్రస్తుతం ఆర్కిటెక్చర్ లాస్ట్ సెమిస్టర్లో ఉన్నాను. సో.. సినిమాకు డెడికేట్ చేసేంత టైమ్ లేదనిపించింది. ముందు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఫుల్ ఫోకస్ అంతా సినిమా పైనే. జనరల్గా కెరీర్ కోసం ఎడ్యుకేషన్ అని చాలామంది అంటారు. మీకు ఆల్రెడీ కెరీర్ ఉంది. మరి పేరెంట్స్ ప్రెజర్ చేయడం వల్లా? లేక ఎడ్యుకేషన్ అంటే మీకే ఇంట్రెస్టా? మా పేరెంట్స్ ఇది చెయ్యి, అది చెయ్యి అని ఎప్పుడూ ఫోర్స్ చేయలేదు. నేను చిన్నప్పటి నుంచి మంచి స్టూడెంట్ని. ఎడ్యుకేషన్ అంటే బాగా ఇంట్రెస్ట్. ఆర్కిటెక్ట్ చేస్తున్నప్పుడు ఎంత ఇంట్రెస్ట్గా చదివానో యాక్టింగ్ కూడా అంతే ఇంట్రెస్ట్గా చేస్తాను. ప్రస్తుతం యాక్టింగ్ చేస్తున్నా లాంగ్ రన్లో ఎడ్యుకేషన్ హెల్ప్ అవుతుంది. వేరే ఏదైనా చేయాలనుకుంటే డిగ్రీ కంపల్సరీ. అలాగే డిగ్రీ ఉన్నంత మాత్రాన బ్రెడ్ దొరుకుతుందనుకోవడం కూడా పొరపాటు. నాకు ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్, డాక్టరేట్ చేయాలని ఉంది. ఈ సందర్భంగా ఉమెన్ ఎడ్యుకేషన్ గురించి రెండు మంచి మాటలేమైనా? ఉమెన్కి ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం స్త్రీ, పురుషులు జెండర్ని బట్టి కాకుండా తాము ఎవరనే విషయాన్ని బట్టి గౌరవించుకుంటున్నారు. స్త్రీలకనే కాదు. పురుషులకు కూడా ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఎడ్యుకేషన్ అంటే రాయడం, చదవడం లేదంటే.. చకాచకా ఇంగ్లిష్లో మాట్లాడటమే కాదు. మన బిల్స్ మనమే కట్టుకోగలగటం, మన కార్ టైర్ పంచర్ అయితే మార్చుకోగలగటం, మన లైఫ్ని మనం మ్యానేజ్ చేసుకోగలగటం. జీవితం మన ముందుంచే పజిల్స్ని ఎలా సాల్వ్ చేస్తాం అన్న దానికి ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఉమెన్ అంటే కిచెన్లోనే ఉండాలి. పెళ్లి జరిగిన తర్వాత వర్క్ చేయకూడదు అనేవి ఇంతకు ముందు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఇంట్లో ఇద్దరు వర్క్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇద్దరు పని చేస్తేనే ఇంటికి కావల్సినవి సమకూర్చుకోగలుగుతారనే పరిస్థితి ఉన్నప్పుడు భార్యకు చదువు లేకపోతే ఎలా? అందుకే ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. మీ వయసు 22 ఏళ్లే. వయసు చిన్నదైనా చక్కగా చెప్పారు. మరి.. ఇంత యంగ్ ఏజ్లో నేమ్, ఫేమ్ వచ్చేశాయి. దీనివల్ల కొంచెం అహం పెరిగే అవకాశం ఉంటుందేమో? నేను రిచ్ సర్కిల్లో పెరగలేదు. సాధారణ అమ్మాయిలానే పెరిగాను. యాక్టింగ్లో ఒకలాంటి లగ్జరీ ఉంటుంది. మనకు కావల్సినవి మన దగ్గరకు వచ్చేస్తాయి. 8 ఏళ్ల వయసు నుంచి యాక్ట్ చేస్తున్నాను. లొకేషన్లో యాక్ట్ చేసేసి మామూలు అమ్మాయిలా స్కూల్కి వెళ్లిపోయేదాన్ని. ఇప్పుడూ అంతే. ఎప్పటిలా ఫ్రెండ్స్తో స్పెండ్ చేస్తాను. నేమ్, ఫేమ్ ఊరికే వచ్చేయవు. కష్టపడ్డవాళ్లకే దక్కుతాయి. ఎప్పటికీ అవి మనతో ఉండాలంటే మనం మామూలుగానే ఉండాలనే క్లారిటీ నాకు ఉంది. అందుకే పొగరు, గర్వం ఏదీ తలకు ఎక్కించుకోలేదు. అసలు నన్ను నేను సెలబ్రిటీని అనుకోను. క్యాజువల్గా ఉంటాను. అప్పుడే హ్యాపీగా ఉండగలుగుతాను. షూటింగ్లో జ్యూస్ అడిగితే జ్యూస్.. సూప్ అడిగితే సూప్. కోరినది వచ్చేస్తుంది. ఇంట్లో కూడా అలా జరగాలని కోరుకుంటారా? ఇంట్లో ఉన్నప్పుడు నా పనులన్నీ నేనే చేసుకుంటాను. వంట కూడా చేస్తాను. ఒకవేళ నేను పెళ్లి చేసుకొని వేరే ఇంటికి వెళ్ళినా నా పనులన్నీ నేనే సొంతంగా చేసుకోవాలి కదా. సో ఇండిపెండెంట్గా ఉండటం నేర్చుకోగలగాలి. అలా చేయడం నాకు ఇష్టం. ఇంట్లో గారం చేయడం ఇవన్నీ కూడా నాకు ఇష్టం ఉండదు (నవ్వుతూ). ‘పెళ్లి చేసుకున్నాక...’ అన్నారు కాబట్టి అడుగుతున్నాం. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో పెళ్లికి సరైన ఏజ్ ఏంటి? అసలు పెళ్లికి వయసుతో సంబంధం ఉంటుందా? పెళ్లికి వయసుతో సంబంధం ఉంటుందా? అనే విషయం గురించి నాకు సరిగ్గా తెలియదు. కానీ పెళ్లి చేసుకోవాలనిపించినప్పుడు చేసేసుకోవాలి. వద్దనిపిస్తే వద్దనుకోవడమే. ముందు సెటిల్ అవ్వాలి. నేనైతే జీవితం స్థిరంగా ఉంది అనిపించినప్పుడు తప్పకుండా పెళ్ళి చేసుకుంటాను. పెళ్ళి తర్వాత కెరీర్ని వదిలేస్తారనుకోవచ్చా? అస్సలు లేదు. యాక్టింగ్ నా ప్రొఫెషన్. ఒక టీచర్ను పెళ్లి అయ్యాక మీరు టీచింగ్ మానేస్తారా? అని మనం అడగం కదా. డాక్టర్ని కూడా అడగం. సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అడగం. మరి.. యాక్టర్ని మాత్రం ఎందుకు అడగాలి? ఇది కూడా ఒక ప్రొఫెషనే. యాక్టింగ్ మానేయడం, మానేయకపోవడం అనే నిర్ణయం భార్యాభర్తలది. ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉండే భార్యాభర్తలు ఒకే నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ మీ భర్త సినిమాలు మానేయమంటే? మానను. పెళ్లి తర్వాత కొంచెం బ్రేక్ తీసుకుంటే బాగుంటుందని నాకనిపిస్తే అప్పుడు ఆలోచిస్తాను. కెరీర్ డెసిషన్ పూర్తిగా నాదే. మ్యారేజ్ గురించి ఇప్పుడు డిస్కస్ చేయడం టూ ఎర్లీ అవుతుంది. లవ్ గురించి మాట్లాడుకుందాం.. స్కూల్ డేస్లో ఏమైనా లవ్ లెటర్స్? ఒక్క లవ్ లెటర్ కూడా రాలేదు. స్కూల్లో నాతో మాట్లాడటానికి భయపడేవారు. ఎందుకంటే నేను స్కూల్ లీడర్ని. ఏం చెప్పాలనుకున్నా కట్ షార్ట్గా చెప్పేసి వెళ్లిపోయేదాన్ని. అలా ఉండటంవల్లే రొమాంటిక్ ప్రపోజల్స్ రాలేదనుకుంటున్నా. ప్రస్తుతం మీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి? సింగిల్. మీ ఫ్యామిలీలో ఎవరూ సినిమాల్లో లేరు కదా? లేరు. హీరోయిన్ అవ్వాలని మీరే అనుకున్నారా? హీరోయిన్ అవ్వాలని కాదు. యాక్టర్ అవ్వాలని అనుకున్నాను. అది నా చాయిస్. యాక్టర్గా మీకు ఎవరు ఇన్స్పిరేషన్? కమల్ సార్ అంటే చాలా ఇష్టం. యాక్టర్గా ఆయన్ను రోల్మోడల్గా తీసుకుంటాను. డ్రీమ్ రోల్స్ ఏమైనా? అలాంటివి ఏమీ లేవు. కానీ చేసిన పని, క్యారెక్టర్ శాటిస్ఫ్యాక్షన్ ఇవ్వాలని కోరుకుంటాను. ‘పాపనాశం’ (తెలుగు ‘దృశ్యం’) సినిమాలో మీరు బట్టలు మార్చుకుంటున్నప్పుడు రహస్యంగా సెల్ఫోన్లో ఓ అబ్బాయి వీడియో తీస్తాడు. ఇప్పుడు హీరోయిన్గా షూటింగ్స్ కోసం తెలియని ప్రదేశాలకు వెళ్తుంటారు. రహస్య కెమెరాలుంటాయేమోనని భయంగా ఉంటుందా? సినిమాలో జరిగిన సంఘటనలు బయట జరగాలని రూలేం లేదు. అయితే జరిగే అవకాశం లేకపోలేదు. సినిమాలో ఒక తప్పుడు ఆలోచన ఉన్న వ్యక్తి చేసిన పని అది. నాకు తెలిసి సినిమా యూనిట్స్లో అలా తప్పుడు ఆలోచన ఉన్నవాళ్లు ఉండరు. కార్వాన్ (షూటింగ్స్లో సెలబ్రిటీలు ఉపయోగించే వాహనం)ని పర్ఫెక్ట్గా మెయిన్టైన్ చేస్తారు. మేం బస చేయడానికి ఇచ్చే రూమ్స్ విషయంలో కూడా యూనిట్ తగిన జాగ్రత్తలు తీసుకుంటారని నా నమ్మకం. ఎందుకంటే అలాంటి తప్పులు చేసి, పట్టుబడితే కెరీర్ పోతుంది కదా. లైఫ్ని రిస్క్లో పెట్టుకోవడానికి ఎవరు రెడీగా ఉంటారు? రహస్య కెమెరాల గురించి వదిలేద్దాం.. సెలబ్రిటీలు పబ్లిక్లోకి వచ్చినప్పుడు అనుమతి తీసుకోకుండా ముఖం మీద సెల్ఫోన్ పెట్టి మరీ ఫొటోలు తీస్తే మీకేమనిపిస్తుంది? మాకది పెద్ద ఇబ్బంది. ఎక్కడ కనిపించినా ఫొటోలు క్లిక్ చేస్తారు. ఒకవేళ ఆ ఫొటోలో మేం బాగాలేకపోయినా, మా ఎక్స్ప్రెషన్ కొంచెం డల్గా ఉన్నా ఏదో జరిగింది అని వార్తలు అల్లుతారు. మేం పబ్లిక్ ఫిగర్.. కాదనడంలేదు. కానీ మా ప్రైవసీ మాకు ఉంటుంది కదా. నేను ఏ ప్రెస్మీట్లో పాల్గొన్నా ఎన్ని ఫొటోలు కావాలంటే అన్ని దిగుతాను. అయితే పబ్లిక్లో అనుమతి లేకుండా తీస్తే చిరాకుగా ఉంటుంది. ముఖ్యంగా ఆర్టిస్టులు మేకప్ లేకుండా బయటకు వచ్చినప్పుడు క్లిక్ చేయడం కరెక్ట్ కాదు. మేం ఎక్కడ కనిపించినా స్క్రీన్ మీద కనిపించినట్లే కనిపించాలంటే కుదరదు కదా. మేకప్ లేకుండా మా ఇష్టం వచ్చినట్లు మేం ఉంటాం. షూటింగ్ లేనప్పుడు కూడా మేం వేరే వాళ్ల కోసం బతకలేం కదా. ఏదో సెల్ఫోన్లో ఫొటో తీస్తారు. తీరా ఆ ఫొటోలో మేం బాగాలేకపోతే విమర్శిస్తారు. మీ వయసున్న అమ్మాయిలకు కొన్ని జాగ్రత్తలేమైనా చెబుతారా? తెలియని ప్రదేశాలకు వెళ్లేటప్పుడు ఒంటరిగా వెళ్లకండి. ఒక గ్రూప్గా వెళ్లండి. అపరిచితులను నమ్మకండి. ఎక్కడికి వెళుతున్నారో ఇంట్లో చెప్పి వెళ్లడం బెటర్. ఇది మన సేఫ్టీ కోసం మనం చేయాలి. ఫస్ట్ హ్యాపీగా ఉండండి. వేరే వాళ్లు ఏమనుకుంటారో అని ఆలోచించకుండా మీకు నచ్చినట్టుగా, మీకు తోచినట్లుగా ఉండండి. మీరు కేర్ చేయాల్సింది కేవలం మీ పేరెంట్స్నే. ఎందుకంటే వాళ్లే మీకు జన్మనిచ్చింది, కావల్సినవన్నీ ఇచ్చేదివాళ్లే. వాళ్లను బాధపెట్టే పనులు చేయొద్దు. మలయాళం నుంచి వచ్చిన మిమ్మల్ని తెలుగు అమ్మాయిలానే ట్రీట్ చేయడం ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది. తెలుగులో సినిమాలు చేస్తాను అని ఎప్పుడూ అనుకోలేదు. అది కూడా మోహనకృష్ణ ఇంద్రగంటి సినిమాతో లాంచ్ అంటే అంతకు మించి ఇంకేం కోరుకోలేం. నా ఫస్ట్ మూవీ ‘జెంటిల్మెన్’ నాకు ఎప్పటికీ స్పెషల్గా ఉంటుంది. తెలుగు ఆడియన్స్ చాలా బాగా వెల్కమ్ చెప్పారు. వాళ్లకు నా మనసులో స్పెషల్ ప్లేస్ ఇచ్చేశా. హీరోయిన్స్ అంటే స్లిమ్గా ఉండాలంటారు. మీరు కొంచెం బబ్లీగా ఉంటారు. తగ్గాలనుకుంటు న్నారా? అలా ఎప్పుడూ అనుకోలేదు. నాకెప్పుడూ క్యారెక్టర్స్ ఇంపార్టెంట్. ఒక క్యారెక్టర్ కోసం వెయిట్ లాస్ అవ్వమంటే అవుతాను. పెరగాలంటే పెరుగుతాను. ప్రస్తుతం చేస్తున్న ఓ సినిమాలో కొంచెం స్లిమ్గా కనిపించమన్నారు. బరువు తగ్గాను. మలయాళ సినిమాలు సైన్ చేయలేనంత బిజీ అవుతున్నారు. మదర్ టంగ్ని మిస్ అవుతున్నాను అనే ఫీలింగ్ ఉందా? మాది కేరళ అయినప్పటికీ పుట్టింది, పెరిగింది చెన్నైలోనే. మలయాళం, తమిళం, తెలుగు భాషలు మాట్లాడతాను. మిస్ అవుతున్నానని పించదు. సినిమాకి లాంగ్వేజ్తో సంబంధం లేదు. మీరా జాస్మిన్, మమతా మోహన్దాస్, నిత్యామీనన్, నయనతార, సమంత, అనుపమా పరమేశ్వరన్, మీరు.. మలయాళీ గర్ల్స్ హవా ఎప్పటినుంచో ఇక్కడ ఎక్కువ ఉంది. డబ్బింగ్ చెబుతారు, పాటలు కూడా పాడుతున్నారు. ఏంటి స్పెషాలిటీ? ఏమో. నాకు తెలియదు. మీరన్నట్లు మాకు ఇక్కడ ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. కేరళ కల్చరల్ హబ్. ఏదైనా త్వరగా నేర్చుకోగలం. దేనికైనా అడాప్ట్ అవ్వగలం. హెవీ లిటరేచర్ ఇంపాక్ట్. మాకు ఇక్కడ అవకాశాలు రావడానికి అది ఒక రీజన్ అనుకుంటాను. ఇది బ్యాగ్లో లేకపోతే నేను బయటకు వెళ్లలేను అనిపించే వస్తువులు ఏంటి ? లిప్ బామ్, గ్లాసెస్, కొంచెం క్యాష్ క్యాష్ మర్చిపోయి తికమకలో పడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లేదు. లేదు. ఒక్కదాన్నే వెళ్లేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటాను. ఫ్రెండ్స్తో వెళ్లినప్పుడు మరచిపోయినా నో ప్రాబ్లమ్. ఖర్చు విషయంలో ఎలా ఉంటారు? లావిష్గా ఖర్చుపెట్టను. కానీ అవసరం ఉందనుకుంటే మాత్రం కచ్చితంగా కొంటాను. చిన్న వయసులోనే సంపాదన మొదలుపెట్టేశారు. మీ పేరెంట్స్కి గిఫ్ట్స్ ఇస్తుంటారా? అమ్మ కోసం ఓ కార్ కొన్నాను. కట్ చేస్తే అది నీకే అని తిరిగి నాకే జ్రెంట్ చేశారు మా పేరెంట్స్. డాడ్కి వాచ్ కొనిచ్చాను. గిఫ్ట్స్ ఇవ్వడం నాకు చాలా ఇంట్రస్ట్. అమ్మానాన్నలకు ఏంటేంటో ఇవ్వాలని ఉంటుంది. అయితే ‘మెటీరియల్’ కన్నా నాకు ఇప్పుడు కావాల్సింది ‘టైమ్’. అమ్మానాన్నలతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయలేకపోతున్నాను. అది కొంచెం బాధగా ఉంటుంది. ఫైనల్లీ.. ఇంత బిజీగా ఉండటం అదృష్టమే కదా? నిజంగా అదృష్టమే. మంచి ఫ్యామిలీ దొరకడం, మంచి ఫ్రెండ్స్, నా చుట్టూ ఎప్పుడూ నా మంచి కోరుకునే మనుషులు ఉండటం నిజంగా బ్లెస్సింగ్ అనిపిస్తోంది. – డి.జి. భవాని -
నాని హీరోయిన్... మరో యువ హీరోతో
నాని జెంటిల్మెన్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన కేరళ బ్యూటీ నివేదా థామస్. మొదటి సినిమాతోనే హిట్ కొట్టి, నటిగానూ నిరూపించుకున్నారు నివేదా. ఆ తరువాత నిన్నుకోరి, జై లవకుశ సినిమాలతో హ్యాట్రిక్ కొట్టారు. తరువాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన నివేదా తిరిగి వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు. పాత్ర నచ్చితేనే చేస్తానంటున్న ఈ హీరోయిన్ తాజాగా ఓ చిన్న హీరోతో సినిమా చేసేందుకు రెడీ అవుతోందని సమాచారం. మెంటల్ మదిలో, నీదీ నాదీ ఒకే కథ సినిమాలతో సక్సెస్ను, విమర్శకుల ప్రశంసలు అందకున్న శ్రీవిష్ణు ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్నాడు. శ్రీవిష్ణు, నివేదా కాంబినేషన్ సినిమాను వివేక్ ఆత్రేయ (మెంటల్మదిలో ఫేం) మరో డిఫరెంట్ జానర్లో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. -
అదే బ్యానర్లో మరో సినిమా
త్వరలో నా నువ్వే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న కల్యాణ్ రామ్.. తన తదుపరి చిత్రాన్ని ఓకే చేశాడు. ఏప్రిల్ 25న కొత్త సినిమా ప్రారంభం కానుంది. ఈ సినిమాను కూడా నా నువ్వే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్లోనే నిర్మించనున్నారు. జల్సా, దూకుడు, ఆగడు లాంటి చిత్రాలకు పనిచేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ సరసన నివేదా థామస్, షాలిని పాండేలు హీరోయిన్లుగా నటించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న నా నువ్వే మేలో రిలీజ్కు రెడీ అవుతోంది. తమన్నా హీరోయిన్గా నటించిన ఈ సినిమా జయేంద్ర దర్శకత్వంలో రూపొందుతోంది. -
తెలివైన థామస్
కొంతమంది హీరోయిన్స్ సినిమాల్లోకి రాగానే చదువుని పక్కన పెట్టేస్తారు. కానీ నివేథా థామస్ సినిమాలను పక్కన పెట్టారు. డిగ్రీ కంప్లీట్ చేయాల్సిందే అనుకున్నారు. ‘నిన్ను కోరి, జై లవకుశ’ సినిమాలతో లాస్ట్ ఇయర్ తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ మలయాళీ కుట్టి కేవలం అందంతోనే కాదు.. అభినయంతోనూ మంచి మార్కులు కొట్టేశారు. ఈ సంవత్సరం మూడు నెలలు గడుస్తున్నా ఇంకా ఒక్క సినిమా కూడా సైన్ చేయలేదు. దీనికి కారణం ఏంటి? అని ఫ్యాన్స్ అడుగుతున్నారు. ‘‘నా నెక్ట్స్ సినిమా ఏంటీ అని అందరూ అడుగుతున్నారు. త్వరలో అనౌన్స్ చేస్తాను. ‘జై లవకుశ’ తర్వాత నా గ్రాడ్యుయేషన్ లాస్ట్ సెమిస్టర్ కంప్లీట్ చేశా. ఈ గ్యాప్లో చాలా స్క్రిప్ట్లు చదివాను, విన్నాను. త్వరలోనే ఓ సినిమా డీటైల్స్ షేర్ చేస్తాను’’ అన్నారు నివేథా. చెన్నై ఎస్ఆర్ఎమ్ యూనివర్శిటీలో ఆర్కిటెక్చర్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేశారు. ఎన్ని మంచి ఆఫర్స్ వచ్చినా ‘ఎడ్యుకేషన్ ఈజ్ ఫస్ట్’ అని డిగ్రీ కంప్లీట్ చేశారంటే నివేథా థామస్ బ్యూటీ విత్ బ్రెయిన్ అనే చెప్పాలి. -
జెంటిల్మన్ బ్యూటీతో రోహిత్
జెంటిల్మన్ సినిమాతో టాలీవుడ్కు పరిచయం అయిన నటి నివేదా థామస్. తొలి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ సినిమాల ఎంపికలో చాలా సెలక్టివ్గా ఉంటుంది. జెంటిల్మన్ తరువాత నిన్నుకోరి, జై లవ కుశ సినిమాల్లో నటించింది ఈ భామ. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేసిన తరువాత మరో సినిమా అంగీకరించేందుకు చాలా సమయం తీసుకుంది. తాజాగా ఈ భామ మరో తెలుగు సినిమాకు ఓకె చెప్పిందన్న టాక్ వినిపిస్తోంది. ప్రయోగాత్మక చిత్రాలతో ఆకట్టుకుంటున్న యువ నటుడు నారా రోహిత్ హీరోగా తెరకెక్కుతన్న ‘శబ్దం’ సినిమాలో నివేదాను హీరోయిన్ గా ఫైనల్ చేశారన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో నారా రోహిత్ మూగవాడిగా నటిస్తున్నాడు. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ మాత్రం అధికారిక ప్రకటన చేయలేదు. -
ఫస్ట్ డే ఫస్ట్ షో అంటున్న హీరోయిన్
సొంత సినిమా ప్రమోషన్లకు కూడా హాజరవ్వలేనంత బిజీగా ఉంటున్నారు కొందరు. అలాంటిది తన స్నేహితుడి సినిమా టీజర్పై స్పందిస్తూ సినిమాను ఫస్ట్డే ఫస్ట్షో చూస్తానంటూ ట్వీట్ చేసింది. ఆడోళ్లు భలే కఠినాత్ములు అంటూ వచ్చిన కృష్ణార్జున యుద్ధం టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. టీజర్కు సోషల్ మీడియాలో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. నానితో రెండుసార్లు జతకట్టి హిట్పెయిర్గా నిలిచిన నివేదా థామస్ టీజర్పై ట్విటర్లో స్సందించింది. ‘ఈ టీజర్లో ఏదో ఉంది. నిన్ను చూసి గర్వపడుతున్నాను నాని. మొదటి రోజు మొదటి ఆటకు సినిమాను చూస్తా’ అని ట్వీట్ చేసింది. నాని, నివేధా జెంటిల్మెన్, నిన్ను కోరి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. కృష్ణార్జున యుద్ధం సినిమాలో నానికి జోడిగా అనుపమా పరమేశ్వరన్, రుక్సర్ మీర్ జోడిగా నటిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 12న థియేటర్లలో సందడి చేయనుంది. Damn!! This teaser is something! 😀 Absolutely proud of you @NameisNani 😊 Good luck to the team.. FDFS guaranteed! https://t.co/VDqWFhwlHq — Nivetha Thomas (@i_nivethathomas) March 11, 2018 -
రవితేజ సినిమాలో కాజల్ కూడా..!
ఈ శుక్రవారం ‘టచ్ చేసి చూడు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న రవితేజ, వరుస సినిమాలతో బిజీగా అవుతున్నాడు. ఇప్పటికే కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నేల టికట్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న ఈ మాస్ హీరో తరువాత చేయబోయే సినిమాను కూడా లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే శ్రీనువైట్ల దర్శకత్వంలో తన తదుపరి చిత్రం తెరకెక్కనుందని ప్రకటించారు రవితేజ. అమర్ అక్బర్ ఆంటోని అనే క్లాసిక్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా రవితేజ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా నివేథ థామస్ను ఫైనల్ చేసినట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా మరో హీరోయిన్గా కాజల్ అగర్వాల్ పేరును పరిశీలిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈసినిమా విశేషాలు తర్వలో దర్శకుడు శ్రీనువైట్ల వెల్లడించనున్నారు. -
మాస్ హీరోతో టాలెంటెడ్ హీరోయిన్
రాజా ది గ్రేట్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రవితేజ, త్వరలో టచ్ చేసి చూడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో పాటు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘నేల టికెట్’ సినిమాలో నటిస్తున్నాడు. నేల టికెట్ తరువాత స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాలో రవితేజ సరసన నివేథా థామస్ను హీరోయిన్ గా ఫైనల్ చేసే ఆలోచన ఉన్నారు చిత్రయూనిట్. జెంటిల్మన్, నిన్నుకోరి సినిమాలతో టాలెంటెడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నివేథ.. సినిమాల ఎంపికలో సెలెక్టివ్గా ఉంటోంది. వరుసగా హిట్ సినిమాల్లో నటించిన ఈ భామ ప్రస్తుతం తెలుగులో ఒక్క సినిమా కూడా చేయటం లేదు. రవితేజ సినిమాలో తన క్యారెక్టర్ నచ్చటంతో నటించేందుకు అంగీకరించిందట నివేథ. ఈ సినిమాలో రవితేజ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు ‘అమర్ అక్బర్ ఆంటోని’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. నీ కోసం, వెంకీ, దుబాయ్ శీను లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను అందించిన రవితేజ, శ్రీనువైట్ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కావటంతో ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. కొంతకాలంగా ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్న శ్రీనువైట్ల ఈ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు. -
హిట్టయ్యారు సెట్టయ్యారు!
తెలుగు ఈ ఏడాది కళకళలాడింది! ప్రపంచ మహాసభల సంగతి కాదు. పరభాషా హీరోయిన్లతో తెలుగు స్క్రీన్ ఒక వెలుగు వెలిగింది. కేరళ అమ్మాయిలు నివేథా థామస్ (22), అనూ ఇమ్మాన్యుయేల్ (20), కీర్తీ సురేశ్ (25); తమిళమ్మాయి సాయిపల్లవి (25); జబల్పూర్ బబ్లీ.. షాలినీ పాండే (24).. తెలుగు వెండి తెరకు బంగారు తళుకు బెళుకులు అద్ది, యువహృదయాలపై నాలుగు గుద్దులు గుద్ది.. తమకే పాపం తెలియనట్టు నెక్స్›్ట ప్రాజెక్ట్కి వెళ్లిపోయారు.ఒక్కొక్కరి ముఖాలు చూడండి ఎలా ఉన్నాయో! రోజు మార్నింగ్ లేవగానే పరగడుపున ఓ కప్పు అమృతం, మధ్యాహ్నం లంచ్కి మకరందం కలిపిన తేలికపాటి జ్యూస్లతో చిన్న కునుకు, రాత్రికి సప్పర్లో మైల్డ్గా ఓ గుప్పెడు తిండి గింజలు.. దేవకన్యల రెసిపీని ఎవరో దొంగిలించుకుని వచ్చి వీళ్లకు ఇచ్చినట్లున్నారు! యాక్టింగ్ మాత్రం? క్యారెక్టర్ని కర్కశంగా తొక్కి తైతక్కలాడేస్తున్నారు. కరకర నమిలి మింగేస్తున్నారు. ఎలా ఇంత ఈజ్ సాధించారు? ట్రైనింగ్ కొంతే.. ఇన్పుట్గా. మిగతాదంతా ఇన్బిల్ట్ కావచ్చు. బ్లడ్లో అభినయాన్ని మిక్స్ చేసి బ్రహ్మదేవుడు పై నుంచి నేరుగా కిందికి వీళ్లైదుగుర్నీ జారవిyì చినట్లున్నాడు! అక్కడి నుంచి మన డైరెక్టర్లు తెచ్చేసుకున్నారు. నివేథా థామస్ మూడు సినిమాల్లో; సాయి పల్లవి, అనూ ఇమ్మాన్యుయేల్ రెండ్రెండు సినిమాల్లో, కీర్తి సురేశ్, షాలినీ పాండే ఒక్కొక్క మూవీలో ఈ ఏడాది తెలుగు ఇండస్ట్రీకి కొత్త ఎట్రాక్షన్ అయ్యారు. న్యూ ఇయర్లోనూ కొత్త పాత్రల్లో మెస్మరైజ్ చెయ్యబోతున్నారు. ఎల్లుండే న్యూ ఇయర్. ఈ ఐదుగురు అమ్మాయిల గురించి కాస్త కాస్త అయినా చెప్పుకోకపోతే 2017 కంప్లీట్ అయినట్లు ఉండదు. 2018 మొదలు కాబోతున్నట్లూ ఉండదు. నివేథా థామస్ ఈ ఏడాది.. ‘నిన్ను కోరి’, ౖ‘జె లవ కుశ’, ‘జూలియట్.. లవర్ ఆఫ్ ఇడియట్’ చిత్రాల్లో నటించారు. ‘నిన్ను కోరి’ లవ్ మూవీ. మామూలు లవ్ కాదు. కాంప్లికేటెడ్ లవ్. మనిషొక దగ్గర, మనసొక దగ్గర ఉన్న పల్లవి క్యారెక్టర్లో.. మనిషి దగ్గరే మనసూ ఉండాలన్న ఎమోషన్స్కి ఒబే అవుతూ నివేథ ఇచ్చిన అభినయం ఔట్స్టాండింగ్. నాని హీరో. హీరోకి గట్టి పోటీ ఇచ్చింది నివేథ.రెండో చిత్రం ‘జై లవ కుశ’లో ‘జై’ మీద ప్రతీకారంతో రగిలిపోతుంటుంది నివేథ. ఎందుకంటే జై కారణంగా ఆమె అన్న చనిపోతాడు. అదీ ఆమె కోపం. జై మీద ప్రేమ ఉన్నట్లు నమ్మించి, అతణ్ణి ఫినిష్ చేయాలి. అదీ ఆమె ప్లాన్. పగనీ, ప్రేమనీ ఏకకాలంలో డెలివరీ చేయడం మాటలా! నివేథ చేసింది.మూడో మూవీ ‘జూలియట్.. లవర్ ఆఫ్ ఇడియట్’. హీరో ఒక మెంటల్. మూడ్ స్వింగ్స్ అవుతుంటాయి. ‘నేనిలాగే ఉంటాను’ అంటాడు. వాడు ఆమెను ప్రేమిస్తే ఆమె వాడిని ప్రేమించవలసి వస్తుంది. షాకుల మీద షాకులు ఇస్తుంటాడు నివేథకి. అలాంటి వాడితో వేగడానికి, వేగుతున్నట్లు యాక్ట్ చెయ్యడానికి ఎంత క్యాలిబర్ కావాలి! అంత క్యాలిబర్తోనూ తనేమిటో చూపించింది నివేథ. కిట్టు ఉన్నాడు జాగ్రత్త, ఆక్సిజన్.. ఈ ఏడాది అనూ ఇమ్మాన్యుయేల్ నటించిన తెలుగు సినిమాలు. ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ ఓ తింగరి కామెడీ. రాజ్ తరుణ్ తింగరితనానికి తగినట్టుగా, అతడి ప్రేయసిగా నంగి నంగిగా నటించడం, నవ్వించడం అనూ పార్ట్. చక్కగా యాక్ట్ చేసింది. ‘ఆక్సిజన్’ అయితే అనూకు దాదాపుగా ఒక చాలెంజ్. గోపీచంద్ ఎత్తుగా, బలంగా ఉంటాడు. ఆయన పక్కన అంతే బలమైన హీరోయిన్ రాశీఖన్నా ఉంటుంది. అనూ స్మాల్ బర్డ్. అయినాగానీ చంద్ని చాంద్ కా తుక్డాగా ట్రిమ్ చేసింది. రాశీని ఓవర్టేక్ చేసింది. ఆ కళ్లు.. ఆ చూపు.. అనూకి గిఫ్ట్. కీర్తీ సురేశ్ ఈ ఏడాది తెలుగులో చేసింది ఒకటే మూవీ. ‘నేను లోకల్’లో కీర్తిగా. ఆ ఒక్క దెబ్బతో 2018లో ఆమె రెండు మూవీలు చేయబోతోంది. కథ మామూలే. నాన్న మాట జవదాటని అమ్మాయి, ఆ అమ్మాయిని ప్రేమించే ఓ అబ్బాయి. గొప్ప కాన్ఫ్లిక్ట్. ఈజీగా చేసేసింది కీర్తి. కళ్లతో, బుగ్గల్తో సగం ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేస్తుంది. లవ్లీ ఫేస్ కట్స్. పర్ఫెక్ట్ ఫీలింగ్స్. నాని ఆమెను డిస్టర్బ్ చేయాలని చూస్తుంటాడు. కీర్తి డిస్టర్బ్ కాదు. మూవీ ఎండింగ్కి వస్తున్నప్పుడు మాత్రం తను డిస్టర్బ్ అయి, నానీని డిస్టర్బ్ చేస్తుంది. కష్టమైన క్యారెక్టర్. మనకు ఇష్టమైన క్యారెక్టర్ అయిపోతుంది.. సినిమా అయ్యేలోగా. ‘ఫిదా’ గురించి చెప్పేదేముంది? ఉంది! సాయి పల్లవి యాక్షన్కే కదా ఆడియన్స్ అంతా ఫిదా అయిపోయింది. అందగత్తె అనడానికి లేదు. కాదనీ అనడానికి లేదు. తెలుగురాని ఒక తమిళమ్మాయి తెలంగాణ తెలుగులో కవ్వించడం, కొట్లాడడం, పోట్లాడ్డమే అందం అయింది. ఆ ముఖం మీద ఆ మొటిమలేంటి అని ఎవరూ అనుకోలేదు. లోపల లవ్ ఉంచుకుని, బయటికి లేనట్లుగా నటించడం సాయి పల్లవికే చెల్లిందేమో. ‘వచ్చిండే..’ అని పాటకు సాయి పల్లవి మాత్రమే డ్యాన్స్ చెయ్యగలదు. సాయి పల్లవిదే ఈ ఏడాది ఇంకో సినిమా ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’. లేటెస్ట్ రిలీజ్. తెలంగాణా ఇంటీరియర్స్కి, సాయి పల్లవికీ బాగా సెట్ అయినట్లుంది. ఈ మూవీలోనూ ఆ అమ్మాయి యాటిట్యూడ్ లంగరేసి లాగేస్తుంది. నానీని, మనల్నీనూ. నివేథ, అనూ, కీర్తీ, సాయి, షాలినీ.. ఈ ఐదుగురూ ఒకే కాలేజీలోని క్లాస్మేట్స్లా ఉంటారు. తెలుగు ఇండస్ట్రీకి ఒకే టైమ్లో భలే సెట్ అయ్యారు. అంతా బిలో ట్వెంటీ ఫైవ్. నాలుగు భాషల్లో నటిస్తున్నారు. నాలుగు భాషల్లోనూ మాట్లాడతారు. ఐదుగురిలో ఉన్న ఒకే పోలిక ఏంటంటే.. చూడ్డానికి ఒకేలా ఉన్నా నటనలో ఎవరికీ ఎవరితో పోలిక లేకపోవడం. న్యూ ఇయర్లో రిలీజ్ అవుతున్న ‘అజ్ఞాతవాసి’లో అనూ ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేశ్ నటిస్తున్నారు. ‘మహానటి’లో కీర్తి సురేశ్, షాలినీ పాండే నటిస్తున్నారు. నివేథా థామస్ కేరళలోని కన్ననూర్లో పుట్టింది. ప్రస్తుతం బి.ఆర్క్ ఫైనలియర్ చదువుతోంది. చైల్డ్ ఆర్టిస్ట్గా 3, కథానాయికగా తమిళ, మలయాళ, తెలుగులో 13 సినిమాల్లో యాక్ట్ చేసింది. అనూ ఇమ్మాన్యుయేల్ పుట్టిందీ, ఉంటున్నదీ చికాగోలో. హోమ్ టౌన్ కేరళలోని తళత్తంగyì . హయ్యర్ స్టడీస్ ఇంకా పూర్తి కాలేదు. ఇంతవరకు తెలుగు, తమిళ, మలయాళం కలిపి ఆరు చిత్రాల్లో నటించింది. అజ్ఞాతవాసి, నాపేరు సూర్య, నాగచైతన్యతో చేస్తున్న మూవీ.. మేకింగ్లో ఉన్నాయి. కీర్తి సురేశ్ జన్మస్థలం కేరళలోని త్రివేండ్రం. ఫ్యాషన్ డిజైనింగ్లో డిగ్రీ చేసింది. మోడలింగ్లో కూడా కొన్నాళ్లు ఉంది. మొత్తం 14 సినిమాలు చేసింది. తెలుగులో ప్రస్తుతం అజ్ఞాతవాసి, మహానటి చిత్రాల్లో నటిస్తోంది. సాయిపల్లవి తమిళనాడులోని కోయంబత్తూరులో పుట్టింది. మెడిసిన్ చేసి సినిమాల్లోకి వచ్చింది. ఐదు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం మూడు సినిమాలు చేతిలో ఉన్నాయి. వాటిలో ఒకటి తెలుగు, రెండు తమిళ సినిమాలున్నాయి. షాలినీ పాండే మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో పుట్టింది. యాక్టింగ్ మీద ప్రేమతో ఇంట్లో చెప్పకుండా బయటికి వచ్చేసింది. ఇంజినీరింగ్ సెకండియర్ చదువుతుండగానే సినిమాల్లోకి వచ్చింది. ‘అర్జున్రెడ్డి’ ఆమె ఫస్ట్ మూవీ. ‘మహానటి’.. మేకింగ్లో ఉంది. న్యూ ఇయర్లో వీళ్లవే మరికొన్ని సినిమాలు, కొత్తగా వచ్చేవాళ్లతో మరికొన్ని సినిమాలు రిలీజ్ అయితే మన తెలుగు సినిమాలకు, తెలుగు భాషకు ఢోకా లేనట్లే. షాలినీ పాండే! ‘అర్జున్రెడ్డి’లో ఆమె చేసింది తక్కువ. అర్జున్రెడ్డికి చేసింది చాలా ఎక్కువ. కథని డ్రైÐŒ చేసింది షాలినీనే. తక్కువ మాట్లాడి, ఎక్కువ కవర్ చేయడం తేలికేం కాదు. అర్జున్రెడ్డి ముద్దు పెట్టుకుంటున్నప్పుడు మౌనం, అర్జున్రెడ్డితో గొడవ పడ్డప్పుడు మౌనం, అమ్మానాన్న అర్జున్రెడ్డికి కాకుండా వేరేవాడికిచ్చి పెళ్లి చేస్తుంటే మౌనం.. ప్రతి ఫ్రేమ్లోనూ షాలిని మాటల కన్నా, మౌనమే ఎక్కువగా ధ్వనించింది. భాష లేకుండా భావాలతో నటనని ప్రదర్శించడం అంత ఈజీ ఏం కాదు. కానీ షాలినీ చేసింది. ప్రేమలో ఉన్న ఒక అమ్మాయి.. సొంతవాళ్లకు, తన సొంతం అనుకున్న వాడికీ మధ్య ఎలా నలిగిపోతుందో షాలినీ చూపించింది. బలహీనమైన కథని కూడా బలంగా నడిపించే టానిక్ షాలినీ చిరునవ్వులో ఒలుకుతూ ఉంటుంది. తెలుగు ఇండస్ట్రీకి మరొక ప్రామిసింగ్ యాక్ట్రెస్ షాలినీ. -
స్క్రీన్ టెస్ట్
ఈ ఏడాదిలోఇప్పటివరకు రిలీజైనసినిమాల్లోనిపాటలకుసంబంధించినక్విజ్ ఇది.ఈ వారంస్పెషల్. ► ‘వచ్చిండే పిల్ల మెల్లగ వచ్చిండే.. క్రీము బిస్కెట్ ఏసిండే ’ అంటూ చంగు చంగున గంతులేసిన మళయాల కుట్టి ఎవరు? ఎ) అనుపమా పరమేశ్వరన్ బి) అనూ ఇమ్మాన్యుయేల్ సి) నివేధా థామస్ డి) సాయిపల్లవి ► ‘స్వింగ్ జరా’ అనే స్పెషల్ పాటలో తన స్వింగ్ను 70 యంయం స్క్రీన్పై చూపించిన టాప్ హీరోయిన్ ఎవరు? ఎ) అనుష్క బి) తమన్నా భాటియా సి) కాజల్ అగర్వాల్ డి) అంజలి ► ‘నీ కళ్ల లోన కాటుక ఓ నల్ల మబ్బు కాదా’ అనే పాటను పాడిన అచ్చ తెలుగు పాటగాడెవరో తెలుసా? ఎ) రేవంత్ బి) యస్పీ బాలసుబ్రహ్మణ్యం సి) దీపు డి) హేమచంద్ర ► ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాలో‘వాటమ్మా వాటీస్ దిసమ్మా’ అనే పాటను పాడింది, సంగీత దర్శకత్వం వహించింది ఒక్కరే. ఎవరా సంగీత దర్శకుడు? ఎ) దేవిశ్రీ ప్రసాద్ బి) అనూప్ రూబెన్స్ సి) జిబ్రాన్ డి) ఆర్పీ పట్నాయక్ ► ‘భళి భళి భళిరా భళి సాహోరే బాహుబలి’ అనే పాటను ఆలపించిన ప్రముఖ గాయకుడు? ఎ) దలేర్ మెహందీ బి) కైలాశ్ ఖేర్ సి) యాసిన్ నిజార్ డి) విజయ్ ప్రకాశ్ ► ‘ఓ సక్కనోడా దాడి చేసినావ దడదడ, కస్సు బుస్సు కయ్యాలు ఇంకెంతకాలం’ అని బాక్సర్ రిథికాసింగ్ ఏ హీరో వెంటపడుతుంది? ఎ) నాగార్జున బి) వెంకటేశ్ సి) వరుణ్ తేజ్ డి) సాయిధరమ్ తేజ్ ► ‘పడమటి కొండల్లో వాలిన సూరీడా’ అనే పాటను పాడింది సింగర్ కాలభైరవ. అతను ఏ సంగీత దర్శకుని కుమారుడు? ఎ) యంయం కీరవాణి బి) మణిశర్మ సి) ఇళయరాజ డి) చక్రవర్తి ► ‘డియో డియో డిసక డిసక’ పాటలో దుమ్ము రేపే స్టెప్పులు వేసిన హాట్ గాళ్ ఎవరు? ఎ) రాఖీ సావంత్ బి) సన్నీ లియోన్ సి) బిపాసా బసు డి) మలైకా అరోరా ► ‘అడిగా అడిగా’ అని ‘నిన్ను కోరి’సినిమాలోని సూపర్హిట్ పాటనుపాడిందెవరు? (ఈ పాటను తనేపాడినట్లు నాని ప్రమోషన్ సాంగ్లోకూడా నటించారు) ఎ) శ్రీరామచంద్ర బి) దీపు సి) ఆల్ఫాన్స్ జోసఫ్ డి) సిద్ శ్రీరామ్ ► ‘జోగేంద్ర జోగేంద్ర’ అని ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలో వచ్చే పాటకు సంగీత దర్శకత్వంవహించిందెవరు? ఎ) కళ్యాణి మాలిక్ బి) అనూప్ రూబెన్స్ సి) యం.యం. శ్రీలేఖ డి) సాయికార్తీక్ ► ‘వేయి నామాల వాడ వెంకటేశుడా’ అంటూ ‘ఓం నమో వెంకటేశాయ’ చిత్రంలో కృష్ణమ్మ పాత్రను పోషించిన నటి ఎవరు? ఎ) రెజీనా కసాండ్రా బి) కేథరిన్ థెరిస్సా సి) అనుష్క శెట్టి డి) ప్రగ్యా జైస్వాల్ ► ‘భ్రమరాంభకు నచ్చేశాను’ అనే పాటను నాగచైతన్యఏ హీరోయిన్ని ఉధ్దేశించి పాడతాడు? ఎ) హన్సిక బి) సమంత సి) లావణ్య త్రిపాఠి డి) రకుల్ ప్రీత్ సింగ్ ► ‘నక్షత్రం’ సినిమాలోని స్పెషల్ సాంగ్లో నటించిన టాప్ హీరోయిన్ ఎవరు? ఎ) రాశీ ఖన్నా బి) శ్రియ సి) హెబ్బా పటేల్ డి) చార్మీ ► సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ 2017వ సంవత్సరంలో ఎన్ని తెలుగుసినిమాలకు సంగీతం అందించారు? ఎ) 8 బి) 14 సి) 10 డి) 12 ► ‘రాజుగారి గది 2’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరు? ఎ) యస్.యస్. తమన్ బి) గోపిసుందర్ సి) జిబ్రాన్ డి) మహతి ► చిరంజీవి నటించిన ‘ఖైదీ నంబర్ 150’ చిత్రానికి సంబంధించి పాటల్లో ఏ పాట వివాదం అయింది? ఎ) నీరు నీరు బి) రత్తాలు రత్తాలు సి) అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు డి) యు అండ్ మి ► ‘సిసిలియా సిసిలియా’ అనే పాట‘స్పైడర్’ సినిమాలోనిది. ఈ పాటకుసంగీత దర్శకత్వం వహించిన తమిళ సంగీత దర్శకుడెవరు? ఎ) ఏ.ఆర్. రహమాన్ బి) హారిస్ జయరాజ్ సి) ఇళయరాజ డి) అనిరుద్ ► ‘గున్న గున్న మామిడి’ అనేపాపులర్ ఫోక్ సాంగ్ను ఏతెలుగు కమర్షియల్సినిమాలో వాడారు? ఎ) నిన్ను కోరి బి) నేను లోకల్ సి) రాజా ది గ్రేట్ డి) ఫిదా ► ‘మధురమే ఈ క్షణము’ అనే పాట అర్జున్ రెడ్డి సినిమాలోనిది. ఈ పాట రచయిత ఎవరు? ఎ) చంద్రబోస్ బి) రామజోగయ్య శాస్త్రి సి) శ్రేష్ఠ డి) శ్రీమణి ► ‘బొమ్మోలెగున్నదిర పోరి బొంబొంబాటుగుందిరా నారి’అనే పాటలో నటించిన హీరో ఎవరు? ఎ) శర్వానంద్ బి) మంచు విష్ణు సి) నితిన్ డి) నాగచైతన్య మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) డి 2) బి 3) డి 4) ఎ 5) ఎ 6) బి 7) ఎ 8) బి 9) డి 10) బి 11) సి 12) డి 13) బి 14) సి 15) ఎ 16) సి 17) బి 18) సి 19) సి 20) సి -
శర్వాకు జోడిగా నివేదా..!
మహానుభావుడు సినిమాతో మరో ఘనవిజయాన్ని అందుకున్న శర్వానంద్, తన తదుపరి చిత్ర పనుల్లో బిజీగా ఉన్నాడు. స్వామి రారా ఫేం సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో శర్వానంద్ ద్విపాత్రాభినయం చేయనున్నాడు. శర్వా మార్క్ ఎంటర్ టైన్మెంట్ తో పాటు సుధీర్ వర్మ స్టైల్ సస్పెన్స్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా టాలెంటెడ్ మలయాళీ భామ నివేదా థామస్ నటించనుంది. ప్రస్తుతానికి అధికారిక సమాచారం లేకపోయినా నివేదా నటించటం దాదాపు ఖరారైనట్టేనన్న ప్రచారం జరుగుతోంది. మరో హీరోయిన్ గా కూడా గతంలో శర్వాతో కలిసి నటించని భామ కోసం ప్రయత్నిస్తున్నారట. త్వరలోనే నటీనటుల ఎంపిక పూర్తి చేసి సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. -
హిట్ చేసినందుకు ధన్యవాదాలు
జై లవ కుశ చిత్రం విజయంతో నటి నివేధితా థామస్ తెగసంబర పడుతున్నారు. తాను నటించి మూడు చిత్రాలు హిట్ చేసినందుకు అభిమానులకు ట్విట్టర్లో ఓ లేఖ పోస్ట్ చేసి కృతజ్ఞతలు తెలిపారు. 'ఒక్క సినిమా హిట్ అవ్వడం స్పెషల్. నా మొదటి మూడు చిత్రాలని ఆదరించారు. తెలుగు చిత్రపరిశ్రమలో 'మా అమ్మాయి' అని పిలవడం కన్నా పెద్ద అభినందన ఏమీ ఉండదు. అది నా అదృష్టంగా భావిస్తున్నా. నా అభిమానులు, కుటుంబ సభ్యులు అయిపోయారు. మీకు ఎంత థాంక్స్ చెప్పినా తక్కువే. జై లవ కుశని ఇంత బాగా ఆదరించినందుకు కృతజ్ఞతలు. మరో చిత్రంలో ఓ మంచి పాత్రతో మీ ముందుకు వస్తా' అని ప్రేమతో మీ నివేధితా థామస్ అంటూ లేఖలో పేర్కొన్నారు. Thank you all :) pic.twitter.com/PiwN5n1Xge — Nivetha Thomas (@i_nivethathomas) 23 September 2017 -
అందరూ అలా అనుకుంటే కథ చచ్చిపోతుంది!
‘‘నిన్ను కోరి’ మంచి లవ్స్టోరీ. ఏడాదికి మూడు సినిమాలు చేస్తుండటంతో వరుసగా ప్రేమకథలే చేస్తున్నాననిపించే అవకాశం ఉంటుంది. అసలు లవ్స్టోరీ లేని తెలుగు సినిమా ఏదో చెప్పండి? ప్రతి సినిమాలోనూ ఏదో ఒక చోట ప్రేమకథ ఉంటుంది. దాన్ని మనం ఎలా చెప్పామన్నది ముఖ్యం’’ అని హీరో నాని అన్నారు. నాని, నివేథా థామస్, ఆది పినిశెట్టి ముఖ్య తారలుగా శివ నిర్వాణను దర్శకునిగా పరిచయం చేస్తూ దానయ్య డీవీవీ నిర్మించిన ‘నిన్ను కోరి’ ఈ నెల 7న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాని చెప్పిన విశేషాలు. ►శివ నిర్వాణ కథ చెప్పినప్పుడు నన్ను ఇంప్రెస్ చేయాలనే తాపత్రయం కనిపించలేదు. కథ విన్నంత సేపూ నా మనసుకి దగ్గరైన ట్లు అనిపించింది. ఇంకో పది నిమిషాల్లో కథ అయిపోతుందనగానే ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాను. చెప్పిన కథను యథావిధిగా స్క్రీన్పైకి తీసుకొచ్చాడు. ►‘లైఫ్లో సమస్యలు కామన్. అంత మాత్రాన నా లైఫ్ మొత్తం అయిపోయిందని నిరుత్సాహపడకూడదు. పాజిటివ్గా ఆలోచిస్తే లైఫ్ చాలా బాగుంటుందని చెప్పాం. లైఫ్ మనకి బోలెడు ఛాన్సులిచ్చింది. మనం ఆ లైఫ్కి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దాం’ అన్నదే కథాంశం. ►గతంలో ప్రేక్షకులు సినిమా, కథ గురించి మాట్లాడుకునేవారు. ఇప్పుడు కలెక్షన్ల గురించి మాట్లాడుతున్నారు. అది చూస్తే బాధ అనిపిస్తోంది. కలెక్షన్ల గురించి మాట్లాడితే అందరూ కమర్షియల్ సినిమాలే తీస్తారు. అప్పుడు కథ చచ్చిపోతుంది. ‘నిన్నుకోరి’ చూస్తున్నంత సేపు ప్రేక్షకుల ముఖంలో చిరునవ్వు, కళ్లలో నీళ్లు ఉంటాయి. ►దానయ్యగారు, సహ నిర్మాత కోన వెంకట్గారు ఈ చిత్రానికి వెన్నెముక. నా సినిమాతో నిర్మాత, బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ హ్యాపీగా ఉంటేనే నిజమైన సక్సెస్. వారిలో పదిశాతం మంది అసంతృప్తిగా ఉన్నా అది నిజమైన సక్సెస్ కాదు. నాకు ప్రొడక్షన్ అంటే ఇష్టమే. కానీ, మంచి ఆలోచన వచ్చినప్పుడు వేరే హీరోని పెట్టి నేను ప్రొడ్యూస్ చేస్తా. ►నా ఫ్యాన్స్ వేరే హీరోపై సోషల్ మీడియాలో వల్గర్ కామెంట్లు పెడతామంటే ఒప్పుకోను. అది తప్పని వారికి చెప్పినప్పుడు హర్ట్ అయినా ఫర్వాలేదు. మేమే కరెక్ట్ అనుకునే ఆ తరహా ఫ్యాన్స్ నాకు అవసరం లేదు. అందరు హీరోలూ వారి అభిమానులకు ఇలాగే చెప్పాలి. ∙వేణూ శ్రీరామ్ దర్శకత్వంలో చేస్తోన్న ‘ఎమ్.సీ.ఏ.’ సినిమా 30 శాతం షూటింగ్ పూర్తయింది. ఆ చిత్రం తర్వాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో చేసే సినిమా ఆగస్టులో ప్రారంభమవుతుంది. ►నేనిప్పటి వరకూ చేయని కొత్త జానర్లో ఈ సినిమా ఉంటుంది. ∙ప్రస్తుతం సినిమా, ఫ్యామిలీ ఇవే నా లోకం. మా అబ్బాయికి ఇప్పుడు మూడు నెలలు. షూటింగ్ ఎప్పుడెప్పుడు అయిపోతుందా? ఎప్పుడు ఇంటికెళ్లిపోతామా? అనిపిస్తోంది. మాటలు చెబుతుంటే.. అలా వింటుంటాడు. ఈ వయసులో వాళ్లకు ఏం తెలుస్తుంది? నాకైతే మా బాబుని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. -
‘నిన్నుకోరి’ ప్రీరిలీజ్ వేడుక
-
'బాహుబలి 2 మైండ్ బ్లోయింగ్’
హైదరాబాద్: యావత్తు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'బాహుబలి: ది కంక్లూజన్' సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సినిమా చూసినవారంతా అద్భుతంగా ఉందని చెబుతున్నారు. భావోద్వేగాలు చాలా బాగా పండాయని అంటున్నారు. ‘బాహుబలి 2’ గురించి వర్ణించడానికి మాటలు రావడం లేదని హీరోయిన్ నివేదిత థామస్ ట్వీట్ చేసింది. సినిమా మైండ్ బ్లోయింగ్ అని ఆకాశానికెత్తింది. తామంతా గర్వించేలా ఈ చిత్రం ఉందని ప్రశంసించింది. సినిమా చూస్తున్నంతసేపు భావోద్వేగాలను ఆపులేకపోయానని హీరో నిఖిల్ ట్వీట్ చేశాడు. ‘బాహుబలి’ సిరీస్ కొనసాగాలని ఆకాంక్షించాడు. ప్రతిచోటా బాహుబలి మేనియా కన్పిస్తోందని హీరో వరుణ్ తేజ్ ట్వీట్ చేశాడు. ఈ సినిమా చూడటానికి అమితాసక్తితో ఎదురు చూస్తున్నట్టు పేర్కొన్నాడు. భల్లాలదేవపై శివుడు ఏవిధంగా తలపడతాడో చూడాలనివుంది. ఇలాంటి చిత్రరాజాన్ని అందించినందుకు దర్శకుడు రాజమౌళికి ధన్యవాదాలు తెలిపాడు. కోల్కతాలోనూ బాహుబలి హల్చల్ చేస్తున్నాడని హీరోయిన్ రాధిక ఆప్టే తెలిపింది. ఐనాక్స్ మల్టీఫెక్స్లోని వరుసగా 17 షోలు వేస్తున్నారని వెల్లడించింది. నాలుగు తెరలపైనా బాహుబలిని ప్రదర్శిస్తున్నారని ట్వీట్ చేసింది. ‘ఒక మనిషి విజన్. 500 సాంకేతిక నిపుణుల రక్తం, కన్నీరు చిందించి.. ఆరేళ్లపాటు శ్రమ పడి సృష్టించిన అద్భుతం బాహుబలి 2’ అని హీరో సాయి ధరమ్ తేజ్ ట్విటర్ లో పేర్కొన్నాడు. -
ఐదుగురిలో...ఆ ముగ్గురూ ఎవరు?
ఎన్టీఆర్ కొత్త సినిమా సెట్లో అడుగుపెట్టే ముహూర్తం ఎంతో దూరంలో లేదు. కేయస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కల్యాణ్రామ్ నిర్మించనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయనున్నారని వినికిడి. జనరల్గా స్టార్ హీరోల సినిమాల్లో ఇద్దరు కథానాయికలు ఉండటం ఆనవాయితీ అయింది. ఇద్దరు నాయికలను సెలక్ట్ చేయడమే పెద్ద విషయం. ఇప్పుడు చిన్న ఎన్టీఆర్ చేయనున్న మూడు పాత్రల సరసన ముగ్గురు నాయికలను ఎంపిక చేయడం అంటే చిన్న విషయం కాదు. హీరోయిన్ల లిస్ట్లో మొత్తం ఐదుగురు నాయికల పేర్లు పరిశీలనలో ఉన్నాయట. తమన్నా, రాశీఖన్నా, కీర్తీ సురేశ్, అనుపమా పరమేశ్వరన్, నివేథా థామస్.. ప్రధానంగా వీళ్లను అనుకుంటున్నారని సమాచారం. మరి, ఈ ఐదుగురిలో ఆ ముగ్గురూ ఎవరు అనేది వారం రోజుల్లో తెలిసిపోతుందని ఊహించవచ్చు. ఒకవేళ లిస్ట్లో లేని పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే... ఎన్టీఆర్ పక్కన నటించడానికి పలువురు కథానాయికలు సిద్ధంగా ఉన్నారు. కానీ, దర్శక, నిర్మాతలు బల్క్ డేట్స్ అడుగుతున్నారట. ఇప్పటికే అంగీకరించిన చిత్రాలు చేతిలో ఉండటంతో కథానాయికలు డేట్స్ అడ్జస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఇందులో రాయ్లక్ష్మి ఐటమ్ సాంగ్ చేయనున్నారనేది మరో ఖబర్. వచ్చే నెల 10న పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 15న రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నారు. అప్పటికి ఐటమ్ భామపై కూడా ఓ స్పష్టత వచ్చే అవకాశముంది. -
ఎన్టీఆర్ సరసన మలయాళీ బ్యూటీస్
జనతా గ్యారేజ్ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన ఎన్టీఆర్ తన తరువాతి సినిమా ఎంపిక కోసం చాలా రోజులు ఎదురుచూశాడు. ఫైనల్గా పవర్ ఫేం బాబీ దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఓకె చెప్పిన జూనియర్, ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు నటీనటుల ఎంపిక జరుగుతోంది. జనతా గ్యారేజ్ సినిమాలో ఎక్కువ మంది మలయాళీ నటులతో కలిసి నటించిన ఎన్టీఆర్, కొత్త సినిమా విషయంలో కూడా అదే సెంటిమెంట్ను కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడట. అందుకే హీరోయిన్లుగా ఇద్దరు మలయాళీ ముద్దుగుమ్మలను ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నాడు. కాజల్తో పాటు మరో రెండు కీలక పాత్రలకు నివేదాథామస్, అనుపమ పరమేశ్వరన్లను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. మరి ఈ మలయాళీ సెంటిమెంట్ బుడ్డోడికి ఎంత వరకు కలిసొస్తుందో చూడాలి.