Osmania Medical College
-
అనామకంగా ఆరంభమై అభివృద్ధిపథంలో!
అది 1992 అక్టోబర్ 9. కోట్ల విజయ భాస్కరరెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజు. హైదరాబాద్కు ఫోన్ చేస్తే, ఢిల్లీలోనే ఉన్నారని వర్తమానం. పీవీ క్యాబినెట్లో న్యాయశాఖ, కంపెనీ వ్యవహారాల మంత్రిగా ఉన్నారప్పుడు. ఢిల్లీ నివాసానికి ఫోన్ చేస్తే, విజయ భాస్కరరెడ్డి ఫోన్ ఎత్తారు. ‘ఏమిటి సార్ ఈరోజే ప్రమాణ స్వీకారం అన్నారు. మీరింకా ఇక్కడే ఉన్నారేమిటంటే – ‘ఉదయం విమానం అందుకోలేక పోయాను. ప్రత్యేక విమానంలో వెళ్లబోతున్నాన’న్నారు. సరే వారిని అభినందించి, విజయవాడలో దంత వైద్య కళాశాల నెలకొల్పమని సలహా ఇచ్చాను. ‘ఊరుకో శివాజీ! నా ముందున్న ముఖ్యమంత్రి వైద్య కళాశాలల జోలికిపోయి ఉద్యోగం పోగొట్టుకొన్నాడు. నాకు ఈ సలహా ఇస్తున్నావు’ అన్నారు. ‘అది కాదులెండి, నేను హైదరాబాద్ వచ్చి వివరిస్తాను’ అని అప్పటికా సంభాషణ ముగించాను.మూడు నాలుగు రోజుల్లో హైదరాబాదు ముఖ్యమంత్రి కార్యాలయంలో కలిసి సవివరంగా వివరించాను. అప్పటికి అవిభక్త ఆంధ్రప్రదేశ్లో ఉస్మానియా వైద్య కళాశాలలో మాత్రమే దంత వైద్య విద్య ఉంది. దానిలో మొత్తం సీట్లు 32. అందులో 7 సీట్లు జమ్మూ–కశ్మీరుకు కేంద్ర ప్రభుత్వ కోటాలో పోతే... మిగిలిన 25 సీట్లలో ఆంధ్ర, శ్రీవేంకటేశ్వర, ఉస్మానియా విశ్వవిద్యాలయాలకు వరుసగా 11, 6, 8 సీట్లు పంచుతారు. కనుక ‘విజయవాడలో హెల్త్ యూనివర్సిటీలో ఒక కళాశాల నెలకొల్పితే, మరొక 40 సీట్లు వస్తాయి. దానికి పెద్దగా నిధులు కూడా అవసరం ఉండదు కదా! మొదటి, రెండు సంవత్సరాల చదువుకు – అనాటమీ, ఫిజియాలజీ, ప్యాథాలజీ, బాక్టీరియాలజీ, ఫార్మకాలజీలకూ; వాటి నాన్క్లినికల్ సబ్జెక్టులకు వైద్య కళాశాలలోనున్న వసతులు సరిపోతాయి కదా.మూడో సంవత్సరం వచ్చేసరికి కాస్త అవుట్ పేషెంట్ పార్టులో ఓ 10, 15 డెంటల్ థియరీలు, కాస్త ఆపరేషన్ థియేటర్, ఇన్పేషెంట్లకు వసతి వంటివి ఏర్పాటు చేసుకోవడానికి నామమాత్రపు కేటాయింపులు సరిపోతాయ’ని చెప్పాను. వైద్య విశ్వవిద్యాలయం కులపతిగా ఉన్న డాక్టర్ లింగం సూర్యనారాయణను పిలిపించి, దానికి అవసరమైన నివేదిక తయారు చేయమని పురమాయించమని కోరాను. ఇది ప్రభుత్వ రంగంలో నెలకొంటుంది గనక అవినీతి ఆరోపణలకు తావుండదనీ చెప్పాను.ఈ సంగతి డాక్టర్ లింగం గారికి ముందుగానే తెలియజేస్తే – ‘అమ్మో! వారిని కలవడం మాటలా? నావల్ల కాదని’ కంగారుపడ్డారు. తరువాత రెండు, మూడు రోజులకు వారికి ఫోన్ చేసి చెప్పాను... ముఖ్యమంత్రి కార్యాలయం నుండి కబురు వస్తుందనీ, కంగారు పడకుండా సవివరంగా నివేదిక తయారు చేసుకొని వెళ్లమనీ. ‘ఫోను వచ్చింది – శివాజీ ఈరోజే వెడుతున్నాను’ అని సెలవిచ్చారు. ముఖ్యమంత్రి ఆ నివేదిక పరిశీలించి వెంటనే ఐదు లక్షల రూపాయలు కేటాయించి, విజయవాడ పాత ఆర్టీసీ బస్టాండు భవనాన్ని బదలాయించి, కాలేజీ మొదలు పెట్టమన్నారు.ఇకపై, ప్రభుత్వం నుండి నిధుల కోసం ఎదురు చూడకుండా, మీ కాళ్ల మీద మీరు నిలబడి కాలేజీ నడుపుకోవాలని కూడా హెచ్చరించారు. అలా 1992–93లో 40 వార్షిక ప్రవేశాలతో, విజయవాడలో హెల్త్ యూనివర్సిటీ యాజమాన్యంలో ఈ కాలేజీ పురుడు పోసుకుంది. ఇది అవిభక్త ఆంధ్రప్రదేశ్లో, ద్వితీయ దంత వైద్య కళాశాల. హెల్త్ యూనివర్సిటీ మొత్తం అవిభక్త ఆంధ్రప్రదేశ్కు చెందింది కనుక, రాష్ట్ర విభజన చట్టం ప్రకారం దానిలో ప్రవేశాలకు అవిభక్త రాష్ట్రమంతటికీ అన్ని జిల్లాలకూ పది సంవత్సరాల పాటు అర్హత ఉంది. ఇప్పుడు ఆ గడువు ముగిసింది కనుక విభజిత ఆంధ్రప్రదేశ్కే పరిమితమయ్యింది.ఇదిలా ఉండగా, డాక్టర్ లింగం పదవీ విరమణ తర్వాత వారి స్థానంలో డాక్టర్ సీఎస్ భాస్కరన్ వైస్ ఛాన్స్లర్ అయ్యారు. వారు బ్యాక్టీరియాలజీ ప్రొఫెసర్. వారికి హాస్పిటల్ పని, ఆపరేషన్లు, రోగులు, వైద్యం వంటి బాధ్యతలు ఉండవు. దానితో వారు అడ్మినిస్ట్రేషన్ మీద దృష్టి కేంద్రీకరించారు. గతంలో కూడా డాక్టర్ డి. జగన్నాథరెడ్డి, డాక్టర్ డి. భాస్కర్ రెడ్డి, డాక్టర్ హరినాథ్ వంటి వారు వైద్య కళాశాలల ప్రిన్సిపల్స్గాను, వైద్య విద్యాశాఖ సంచాలకులుగాను బాగా రాణించారు. డాక్టర్ భాస్కరన్ విజయవాడలో ప్రైవేట్ ప్రాక్టీసులో ఉన్న సీనియర్ దంత వైద్యులను పిలిచి ‘ఈ కళాశాల అమ్మా, అబ్బా లేని అనాథ. మీరు ఈ ప్రాంతం వారు. ఇవి బతికి, బట్టగట్టేటట్లు కాపాడవలసిన గురుతర బాధ్యత మీ మీద ఉంది. జీతం–భత్యం ఆశించకుండా పని చేయండి’ అని విన్నవించారు. అలాగే పనిచేసి, వారు దాన్ని నిలబెట్టారు. అదే నేడు బీడీఎస్తో పాటుగా ఎమ్డీఎస్ కోర్సుల్లో కూడా తర్ఫీదునిస్తూ రాష్ట్రంలో అత్యుత్తమ కళాశాలగా నిలదొక్కుకుంది.– డా. యలమంచిలి శివాజీ, వ్యాసకర్త, రాజ్యసభ మాజీ సభ్యులు -
రోడ్డెక్కిన స్టాఫ్ నర్సులు
సాక్షి, హైదరాబాద్, సుల్తాన్బజార్: వైద్య ఆరోగ్యశాఖ నిర్వహిస్తున్న హెడ్ నర్సు, స్టాఫ్ నర్సుల కౌన్సెలింగ్లో అవకతవకలు జరిగాయంటూ నర్సులు చేపట్టిన ఆందోళన శుక్రవారం కోఠి ఉస్మానియా మెడికల్ కళాశాల వద్ద ఉద్రిక్తతకు దారితీసింది. తెలంగాణలోని 7 జోన్లకు ఒకేసారి కౌన్సెలింగ్ చేపట్టడంతో కళాశాల ఆడిటోరియంలో గందరగోళం నెలకొంది. డీహెచ్ రవీంద్రనాయక్ నేతృత్వంలో జరిగిన కౌన్సెలింగ్లో గ్రేడ్–1 అధికారి సుజాత రాథోడ్ వేదికపైకి వచ్చి బదిలీల లిస్టును మార్పు చేయించడంతో నర్సులు ఆగ్రహం వ్యక్తం చేశారు.బదిలీల కౌన్సెలింగ్ను పారదర్శంగా నిర్వహించాలని పెద్దపెట్టున నినదించారు. దీంతో డీహెచ్ కౌన్సెలింగ్ను తాత్కాలికంగా వాయిదా వేశారు. దీంతో వివిధ జిల్లాల నుంచి వచ్చిన వేలాది మంది స్టాఫ్నర్సులు ధర్నాకు దిగారు. తమకు ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో కౌన్సెలింగ్ నిర్వహించాలని, డీహెచ్ డౌన్ డౌన్ అని నినదించారు. కొందరు అధికారులు యూనియన్ నేతలుగా చెప్పుకుంటున్న వారితో కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా పోస్టింగులు ఇస్తున్నారని ఆరోపించారు.ఓ యూనియన్ నేత రూ.5 కోట్ల వరకు వసూలు చేశాడని.. ఆ సొమ్ములో రూ. 3 కోట్లు ఒక కీలక అధికారికి కూడా ఇచి్చనట్లు ఆరోపించారు. ఉస్మానియా మెడికల్ కళాశాల ఎదురుగా ఉన్న రోడ్డును గంటసేపు దిగ్బంధనం చేశారు. దీంతో సుమారు రెండున్నర గంటల పాటు కోఠి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పదుల సంఖ్యలో ఉన్న పోలీసులు వేల సంఖ్యల్లో స్టాఫ్ నర్సులను నిలువరించలేకపోవడంతో రాకపోకలు భారీగా నిలిచిపోయాయి. -
రాష్ట్ర వైద్య మండలి ఎన్నికలు షురూ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్యానికి సంబంధించి అనేక కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం ఉన్న తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి (టీఎస్ఎమ్సీ) ఎన్నికలను 17 ఏళ్ల తర్వాత తొలిసారిగా నిర్వహించనున్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ వేదికగా ఆదివారం ఈ ఎన్నికల మేనిఫెస్టోను హెచ్ఆర్డీఏ విడుదల చేసింది. అర్హత లేకుండా వైద్యం చేస్తున్న వారిని ప్రత్యేక కమిటీలు వేసి అరకడతామని ఈ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. నూతన భవనం నిర్మించి, తెలంగాణ వైద్యులకు గౌరవం లభించేలా చూస్తామని, వైద్య విద్య ఫీజు నియంత్రణ దిశగా ప్రయత్నాలు చేస్తామని ప్రకటించారు. 48,405మంది డాక్టర్లకు ఓట్లు ప్రస్తుతం 48,405 మంది తెలంగాణ డాక్టర్లు ఈ ఎన్నికల్లో ఓటు వేసే అర్హత కలిగి ఉన్నారు. ఈ ఎన్నికల్లో 13 మంది వైద్యులు వైద్య మండలికి ఎన్నిక కానుండగా, ఇందుకోసం వందకు పైగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అభ్యర్థులంతా తమ విధివిధానాలతో సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసుకుంటున్నారు. కొందరు స్వతంత్ర అభ్యర్థులుగా నిలబడగా, మరికొందరు ప్యానల్గా ఏర్పడి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికలు పోస్టల్ బాలెట్ ద్వారా జరగనున్నాయి. వచ్చే నెల నుంచి బ్యాలెట్ పేపర్ల పంపిణీ జరగనుండగా, వాటి లెక్క డిసెంబర్ 1న మొదలుకానుంది. కాగా మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో డా.మహేష్కుమార్, డా. ప్రతిభాలక్ష్మీ, డా. కుసుమరాజు రవికుమార్, డా.కిరణ్కుమార్ తోటావర్ తదితరులు పాల్గొన్నారు. -
సివిల్స్లో తెలుగువారి సత్తా
సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: ఆలిండి యా సివిల్ సర్వీసెస్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. ఆలిండియా 20వ ర్యాంకును హైదరాబాద్కు చెందిన పి.శ్రీజ దక్కించుకోగా.. టాప్–100లో 12 మంది నిలిచారు. మొత్తంగా 50 మందికిపైగా తెలుగు విద్యార్థులకు మంచి ర్యాంకులు వ చ్చాయి. ఈ మేరకు సివిల్ సర్వీసెస్–2020 తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శుక్రవారం ఢిల్లీలో విడుదల చేసింది. డాక్టర్ నుంచి సివిల్స్కు.. సివిల్స్లో ఆలిండియా 20వ ర్యాంకు వచ్చిన పి.శ్రీజ స్వస్థలం వరంగల్. హైదరాబాద్లోని ఉప్పల్ సమీపంలోని సాయినగర్లో నివాసం ఉంటున్నారు. తండ్రి శ్రీనివాస్ హబ్సిగూడలోని వాహనాల షోరూంలో సేల్స్ మేనేజర్గా పనిచేస్తుండగా.. తల్లి శ్రీలత నర్సుగా పనిచేస్తున్నారు. శ్రీజ ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదివింది. తాజాగా తన తొలి ప్రయత్నంలోనే సివిల్స్లో 20వ ర్యాంకు సాధించింది. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఎంబీబీఎస్ చేశానని.. పేదలకు మరింత సేవ చేయాలన్న ఆలోచనతో సివిల్స్కు సిద్ధమయ్యానని శ్రీజ తెలిపింది. ‘‘పెద్దగా ఒత్తిడికి గురికాకుండా ఆడుతూపాడుతూ సివిల్స్ పరీక్షలకు సిద్ధమయ్యా. అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవడం వల్ల ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల్లో.. ఇంటర్వూ్యలో ఎలాంటి తడబాటు లేకుండా నిలిచా. కోచింగ్, తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహం నా విజయానికి తోడ్పడ్డాయి..’’ అని పేర్కొంది. రైతుల ఆత్మహత్యలు ఆగేలా పనిచేస్తా.. సివిల్స్ 207 ర్యాంకు సాధించిన వి.సంజనాసింహ నివాసం హైదరాబాద్లోని మలక్పేట. ఐఏఎస్ కావాలన్నది తన కోరిక. ‘‘నేను కలెక్టర్ అయితే రైతుల ఆత్మహత్యలను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తా. మహిళలపై దాడులు జరగకుండా ప్రణాళిక రూపొందించి.. అవగాహన కల్పిస్తా’’ అని తెలిపింది. ఐపీఎస్కు ఎంపికవుతా.. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం భీమవరం హరిజనవాడ పంచాయతీకి చెందిన కోట కృష్ణయ్య – వజ్రమ్మల కుమారుడు కిరణ్కుమార్. దమ్మపేట గురుకుల పాఠశాలలో చదివిన కిరణ్.. ఖరగ్పూర్ ఐఐటీలో ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. కిరణ్ తండ్రి వ్యవసాయం చేస్తారు, తల్లి ఆ గ్రామ సర్పంచ్, సోదరుడు బాబురావు పోలీసు విభాగంలో సీఐగా పనిచేస్తున్నారు. సివిల్స్లో 652వ ర్యాంకు సాధించిన కిరణ్.. ఐపీఎస్కు ఎంపికయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎంతో సంతోషంగా ఉంది సివిల్స్లో 616వ ర్యాంకు సాధించడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని ఆందాసు అభిషేక్ పేర్కొన్నారు. ఏపీలోని విశాఖపట్నా నికి చెందిన అభిషేక్ ముంబై ఐఐటీలో బీటెక్ పూర్తి చేసిన అభిషేక్.. తన మూడో ప్రయత్నంలో సివిల్స్ ర్యాంకు సాధించాడు. మరికొందరు ర్యాంకర్ల వివరాలివీ.. ►66వ ర్యాంకు సాధించిన అనిష శ్రీవాస్తవ నివాసం సికింద్రాబాద్లోని ఆర్కేపురం. కామర్స్లో డిగ్రీ పూర్తిచేసి.. సివిల్స్కు సిద్ధమయ్యారు. ►317వ ర్యాంకు సాధించిన గౌతమి నాగ్పూర్లోని విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ నుంచి ఆర్కిటెక్చర్లో డిగ్రీ చేశారు. తండ్రి గోపాల్ వ్యాపారవేత్త, తల్లి రాధ స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నారు. ►248వ ర్యాంకు సాధించిన శోభిక పాఠక్ నివాసం సికింద్రాబాద్లోని తిరుమలగిరి. ఆర్మీ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న ఆమె.. వరంగల్ ఎన్ఐటీలో ఇంజనీరింగ్ పూర్తిచేశారు. ప్రస్తుతం బెంగళూరులోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. విద్యా వ్యవస్థలో మార్పు తేవాలని విజయవాడకు చెందిన బద్దెల్లి చంద్రకాంత్రెడ్డి సివిల్స్లో 120వ ర్యాంకు సాధించాడు. కరోనా పరిస్థితులతో నేరుగా క్లాసులు వినలేకపోయినా.. సొంతంగా నోట్స్ తయారు చేసుకుని సిద్ధమయ్యానని చంద్రకాంత్రెడ్డి చెప్పాడు. ‘‘ఐఏఎస్ వస్తుందని ఆశిస్తున్నా. ఐఏఎస్ అయితే విద్యా వ్యవస్థలో మార్పులు తేవాలనే ఆలోచన ఉంది. మాతృభాషను మరింత దగ్గర చేసేలా కృషి చేస్తా. ఒకవేళ ఐపీఎస్ వస్తే.. నేరాలను అరికట్టేలా ప్రయత్నిస్తా..’’ అని పేర్కొన్నాడు. మొదటిసారే సాధించా.. హైదరాబాద్లోని తార్నాకలో నివసించే రిచా కులకర్ణి సివిల్స్లో 134వ ర్యాంకు సాధించింది. ‘‘యూపీఎస్సీ రాయడం ఇదే మొదటిసారి. ఇంత మంచి ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. రెండేళ్లుగా కోచింగ్ తీసుకోవడం, తల్లిదండ్రులు ఇచ్చిన స్ఫూర్తి నాకు తోడ్పడింది. ఐఎఫ్ఎస్ వస్తుందన్న ఆశతో ఉన్నాను..’’ అని రిచా పేర్కొంది. మూడో ప్రయత్నంలో.. ఏపీలోని విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన సూరపాటి ప్రశాంత్ ఆలిండియా 498వ ర్యాంకు సాధించాడు. ఆయన తండ్రి బాబూరావు రిటైర్ట్ ఆర్మీ ఉద్యోగి. ఇంజనీరింగ్ పూర్తిచేసిన ప్రశాంత్ తన మూడో ప్రయత్నంలో సివిల్స్ ర్యాంకు సాధించాడు. మహిళలు చదువుకుంటేనే దేశం బాగుపడుతుందన్నది తన అభిప్రాయమని ప్రశాంత్ పేర్కొన్నాడు. ప్రజల జీవితంలో మార్పు తెచ్చేందుకు వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కడుకుంట్లకు చెందిన శ్రీనివాస్గౌడ్, వనజ దంపతుల కుమారుడు పృథ్వీనాథ్గౌడ్. కొత్తకోటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుకున్న పృథ్వీనాథ్.. హైదరాబాద్లోని ఉస్మానియా వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తిచేశాడు. తాజాగా సివిల్స్ ఫలితాల్లో ఆలిండియా 541వ ర్యాంకు సాధించాడు. ‘‘ఎంబీబీఎస్ చదివినా సంతృప్తి అనిపించలేదు. ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావాలంటే పరిపాలనా విభాగంలో ఉండాలన్న పట్టుదలతో సివిల్స్ కోసం సిద్ధమయ్యాను..’’అని పృథ్వీనాథ్ తెలిపాడు. -
ఉస్మానియా వైద్య విద్యార్థులకు ఫుడ్ పాయిజన్
సాక్షి ,సిటీబ్యూరో: ఉస్మానియా వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న19 మంది విద్యార్థులు అస్వసత్థకు గురయ్యారు. సోమవారం మధ్యాహ్నం భోజనం అనంతరం వాంతులు, విరేచనాలతో బాధపడటంతో అందరినీ గాంధీ ఆస్పత్రికి తరలించారు. వీరి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేదని గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. -
కరోనా భయంతో వణికిపోతున్న వైద్య సిబ్బంది
-
ఉస్మానియాలో హెల్త్ ఇన్స్పెక్టర్, నర్సుకు కరోనా
-
వైద్య విద్యార్థులందరికీ కరోనా పరీక్షలు
-
మెడికల్ కాలేజీలో 12 మందికి కరోనా
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఇటీవల ఉస్మానియా వైద్య కళాశాలలో ఇద్దరు పీజీ డాక్టర్లకు కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. స్థానిక వైద్యులు వారిని పరీక్షించి గాంధీ ఆసుపత్రికి తరలించారు. తాజాగా 12 మంది ఉస్మానియా మెడికల్ కళాశాల విద్యార్థులకు కరోనా పాజిటివ్గా తేలింది. ఈ క్రమంలో కాలేజీ యాజమాన్యం ఉస్మానియా మెడికల్ రీడింగ్ రూమ్ను మూసివేసింది. జూనియర్ డాక్టర్లకు కరోనా సోకడంతో కళాశాల మొత్తం శానిటైజింగ్ చేయించినట్లు ప్రిన్సిపల్ శశికళ తెలిపారు. మిగతా మెడికల్ కాలేజీ విద్యార్థులకు కరోనా టెస్టులు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఉస్మానియా మెడికల్ కాలేజీకి అనుసంధానంగా ఉన్న 10 హాస్పిటల్స్ లోని వివిధ విభాగాల్లో జూనియర్ డాక్టర్లు పనిచేస్తున్నారు. కాగా తోటి స్నేహితులకు కరోనా సోకడంతో మిగతా విద్యార్థులంతా భయాందోళనకు గురవుతున్నారు. (‘కరోనాకు మందు కనిపెట్టా.. అనుమతివ్వండి’) ‘కింగ్కోఠి’లో 19 మందికి పాజిటివ్ -
ఉస్మానియా మెడికల్ కాలేజీలో కరోనా కలకలం
సాక్షి, సిటీబ్యూరో: ఇప్పటి వరకు పాతబస్తీ, మలక్పేట్, వనస్థలిపురం, జియాగూడ, కుల్సుంపురలకే పరిమితమైన కరోనా వైరస్ తాజాగా కొత్త కాలనీల్లోనూ విజృంభిస్తోంది. మార్చి నుంచి ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కానీ శివారు కాలనీల్లో ఇటీవల రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆయా ప్రాంత వాసులను ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా ఉస్మానియా మెడికల్ కాలేజీ, పహడీషరీఫ్, హఫీజ్పేట్, సరూర్నగర్ చెరుకుతోట కాలనీ, లింగోజిగూడ సాయినగర్ కాలనీ, మీర్పేట్, లెనిన్నగర్, బడంగ్పేట్, నాదర్గుల్, మల్కాజ్గిరి, రామంతాపూర్లోని కామాక్షిపురం వీధి, మారేడ్పల్లి, గోల్నాక డివిజన్ సుందర్ నగర్, నార్త్లాలాగూడ, గుడిమల్కాపూర్, ఆజంపురా, ఎన్టీఆర్నగర్, లింగోజిగూడ సాయినగర్లలో కరోనా వైరస్ కేసుల పరంపర కొనసాగుతోంది. ఇద్దరు పీజీ డాక్టర్లు సహా క్యాంటిన్ వర్కర్ సుల్తాన్బజార్/ఉస్మానియా ఆస్పత్రి: ఉస్మానియా వైద్య కళాశాలలో ఇద్దరు పీజీ డాక్టర్లకు కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. స్థానిక వైద్యులు వారిని పరీక్షించి గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇతర రూమ్మేట్స్ సైతం అప్పటికప్పుడు తమ రూములు ఖాళీచేసి పరుగులు పెట్టారు. పీజీ వైద్యులు ఎవరెవరితో సమీపంగా ఉన్నారో గుర్తించే పనిలో పడ్డారు. ఇదిలా ఉంటే ఉస్మానియా ఆస్పత్రి క్యాంటిన్లో పనిచేస్తున్న యువకునికి(25) కూడా కరోనా వైరస్ సోకింది. మహబూబ్నగర్ జిల్లా, పెబ్బేరుకు చెందిన ఈ యువకుడు ఆస్పత్రి క్యాంటిన్లో పనిచేస్తున్నాడు. లాక్డౌన్కు ముందే సొంతూరుకు వెళ్లి...ఇటీవలే వచ్చి మళ్లీ విధుల్లో చేరాడు. ఆయన తీవ్రమైన జ్వరం, జలుబుతో బాధపడుతుండడంతో ఉస్మానియా వైద్యులు అతనికి కరోనా పరీక్షలు చేయించారు. శనివారం అతనికి పాజిటివ్గా నిర్ధారణ కావడంతో చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి నాగేందర్ తెలిపారు. క్యాంటీన్లో పని చేసే సిబ్బందికి దశల వారీగా కరోనా పరీక్షలు చేయిస్తామని ఆయన వెల్లడించారు. (ఒక్కరోజులో 8,000 మంది డిశ్చార్జ్) చెరుకుతోట కాలనీలో ఒకరికి పాజిటివ్ హుడాకాంప్లెక్స్: సరూర్నగర్ పరిధిలోని చెరుకుతోట కాలనీ రోడ్ నెంబర్ తొమ్మిదికి చెందిన యువకుడు(36)కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆయన గత నవంబర్లో సౌదీ అరేబియాకు వెళ్లారు. మే 22న హైదరాబాద్ చేరుకున్నాడు. నగరంలోని ఓ హోటల్లో క్వారంటైన్ చేశారు. ఐసీఎంఆర్ నిబంధనల మేరకు ఏడు రోజుల తర్వాత ఇంటికి పంపారు. ఇంట్లో ప్రత్యేక గదిలో ఉన్నాడు. ఆ మరుసటి రోజే తీవ్రమైన జ్వరం, జలుబు, దగ్గు వంటి కరోనా వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో ఆయన స్వయంగా వైద్యులకు సమాచారం ఇచ్చాడు. 108లో ఆయన్ను గాంధీకి తరలించి, వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, కరోనా వైరస్ సోకినట్లు తేలింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులను, ఇదే ఇంట్లో అద్దెకు ఉండే మరో ఏడుగురిని కూడా క్వారంటైన్ చేశారు. (కమ్యూనిటీ వ్యాప్తిపై సర్వే..) -
ఉస్మానియాలోనూ ‘కోవిడ్’ నిర్ధారణ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజీకి అనుబంధంగా కోవిడ్ వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు కేంద్రం అనుమతినిచ్చిందని, అందుకు అవసరమైన పరికరాలు, కిట్లను పంపుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మంగళవారం సచివాలయంలో వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. అంతకుముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు మరో సమావేశం నిర్వహించారు. ఆయా సమావేశ వివరాలన్నింటినీ మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం రాత్రి మీడియాకు వివరించారు. గాంధీ వైరాలజీ ల్యాబ్కు అదనంగా ఉస్మానియాలో ఏర్పాటు చేయబోయే కోవిడ్ నిర్ధారణ కేంద్రం పనిజేస్తుందన్నారు. అలాగే హైదరాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)లోనూ కోవిడ్ పరీక్ష నిర్ధారణ కేంద్రానికి అనుమతి కోరామన్నారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన సాఫ్ట్వేర్ ఇంజనీర్కు తా జాగా పరీక్షలు నిర్వహించామని, నెగటివ్ వచ్చిందన్నారు. మరోమారు పరీక్ష చేసి, నాలుగైదు రోజుల్లో అతన్ని డిశ్చార్జి చేస్తామన్నారు. అంటే ఈ క్షణానికి తెలంగాణలో ఒక్క మనిషికి కూడా కోవిడ్ వైరస్ లేదని మంత్రి సగర్వంగా ప్రకటించారు. విమానాశ్రయంలో 24 గంటలూ స్క్రీనింగ్ చేయడానికి ఏర్పాటు చేశామన్నారు. రెండు స్టాండింగ్ థర్మల్ స్క్రీనింగ్ యంత్రాల కొనుగోలు రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి స్టాండింగ్ థర్మల్ స్క్రీనింగ్ యంత్రాలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామ ని ఈటల తెలిపారు. అయితే అందుకు కేంద్రం సహకరించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రెండు థర్మల్ స్క్రీనింగ్స్ యంత్రాలకు ఆర్డర్ ఇచ్చామన్నారు. తాను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మం త్రి హర్షవర్ధ్దన్తో మంగళవారం మాట్లాడానన్నారు. అన్ని విమానాశ్రయాల్లోనూ కోవిడ్ స్క్రీనింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరానన్నారు. అందుకు అంగీకరించారన్నారు. వివిధ రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మన దగ్గర ఒకవేళ కోవిడ్ కేసులు వస్తే ఏం చేయాలన్నదానిపై తదుపరి చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటివరకు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 41,102 మందికి థర్మల్ స్క్రీనింగ్ చేశామని, 277 మందికి అనుమానిత లక్షణాలున్న కారణంతో పరీక్షలు చేయగా, వారందరికీ నెగిటివ్ వచ్చిందని మంత్రి ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ సూచన... చైనా, హాంకాంగ్, దక్షిణ కొరియా, జపాన్, ఇటలీ, థాయిలాండ్, సింగపూర్, మలేసియా, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ దేశాల నుంచి భారతదేశంలోకి వచ్చే ప్రయాణికులంతా స్వతహాగా 14 రోజులు హోమ్ ఐసోలేషన్లో ఉండాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. కోవిడ్ కట్టడికి సాయం చేస్తాం కోవిడ్ వైరస్ కట్టడిలో సర్కార్కు సాయం అందించేందుకు యశోద ఆసుపత్రి యాజమాన్యం ముందుకొచ్చింది. మంగళవారం వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ను యశోద ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ జీఎస్ రావు, వైస్ ప్రెసిడెంట్ సురేశ్కుమార్ కలసి కోవిడ్ వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, సంస్థ తరఫున అందించే సాయంపై వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 1.20 లక్షల మాస్క్లు అందించామని, మరో 80 వేలు బుధవారంలోగా అందుబాటులోకి తెస్తామన్నారు. అలాగే 60 వెంటిలేషన్తో కూడిన ఐసోలేషన్ పడకలను అందుబాటులో ఉంచుతామన్నారు. వాటిని కేవలం కోవిడ్ వైరస్ చికిత్స కోసం వచ్చే వారికి మాత్రమే వినియోగిస్తామని చెప్పారు. సిక్రింద్రాబాద్, మలక్పేట, సోమాజిగూడలలో 20 చొప్పున బెడ్లను ఏర్పాటు చేశామని యశోద ఆసుపత్రి ఎండీ తెలిపారు. ఈ సందర్భంగా కోవిడ్ వైరస్ వ్యాప్తి కాకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన కొనియాడారు. -
సీనియర్లు వర్సెస్ జూనియర్లు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ బోధనాసుపత్రుల్లోని ప్రొఫెసర్లు, ఇతర అధ్యాపకులు, వాటిల్లోని వైద్యుల విరమణ వయస్సును 58 నుంచి 65 ఏళ్లకు పెంచాలన్న సర్కారు నిర్ణయం సీనియర్లు, జూనియర్ల మధ్య ఘర్షణ వాతావరణానికి దారితీస్తోంది. ఉద్యోగ విరమణ వయస్సు పెంపును సీనియర్ వైద్యులు ఆహ్వానిస్తుండగా, జూనియర్ డాక్టర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో సీనియర్లు, జూనియర్ల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. రెండ్రోజుల క్రితం ఉస్మానియా మెడికల్ కాలేజీలో సీనియర్లు, జూనియర్లు కొట్టుకున్నట్లు అక్కడి వైద్యులు చెబుతున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా విరమణ వయస్సు పెంపుపై వైద్యుల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. సర్కారు మాత్రం విరమణ వయస్సు పెంపుపై తగ్గే పరిస్థితి కనిపించడంలేదు. త్వరలోనే ఆర్డినెన్స్ తీసుకొచ్చే పనిలో నిమగ్నమైంది. కానీ జూనియర్ డాక్టర్లు మాత్రం దీన్ని ఎలాగైనా అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాయి. ఎక్కడికక్కడ నిరసనలు... బోధనాసుపత్రుల్లోని వైద్యుల విరమణ వయస్సు పెంపుపై వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ ఇటీవల అధికారిక ప్రకటన చేయడంతో జూనియర్ డాక్టర్లు, ఇతర వైద్యుల్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. 65 ఏళ్ల వయస్సు పెంచాలని సీనియర్ డాక్టర్లు, త్వరలో రిటైర్ కాబోయే వారు కోరుతున్నారు. దీన్ని కేవలం బోధనాసుపత్రుల్లోని వైద్యులకే కాకుండా ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వైద్యులందరికీ వర్తింపచేయాలని మరికొందరు విజ్ఞప్తి చేస్తున్నారు. కొన్ని ప్రభుత్వ వైద్యుల సంఘాలు కూడా కోరుతున్నాయి. అన్నేళ్లు పనిచేయడం కష్టమని, ఆ వయస్సులో ఆపరేషన్ చేయాలంటే చేతులు వణుకుతాయని, కాబట్టి 61 ఏళ్లు చాలని ఇంకొందరు డాక్టర్లు అంటున్నారు. ఇక జూనియర్ డాక్టర్లేమో ఖాళీలను భర్తీ చేయకుండా ఇలా విరమణ వయస్సు పెంచితే తాము నిరుద్యోగులుగా మిగిలిపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీళ్లే ఇప్పుడు ప్రధానంగా నిరసనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘డాక్టర్ల నిరుద్యోగ సభ’మంగళవారం జరగబోతోంది. హెల్త్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద సభ నిర్వహించనున్నారు. బెంగాల్పై నిరసనలు... ఇదిలా ఉండగా పశ్చిమబెంగాల్లో వైద్యులపై దాడులను నిరసిస్తూ రాష్ట్రంలోనూ పలుచోట్ల వైద్యులు నిరసనలు తెలిపారు. అనేక ఆసుపత్రుల్లో వైద్యులు నిరసన ప్రదర్శనలు చేశారు. త్వరలో ఆర్డినెన్స్... వాస్తవంగా విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచుతూ గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందే ప్రభుత్వం కేబినెట్లో ఆమోదం తెలిపింది. తర్వాత దానిపై వివిధ వర్గాల వైద్యులు, జూనియర్ డాక్టర్లు నిరసన తెలపడం, ఇంతలోనే ఎన్నికలు రావడంతో అడుగు ముందుకు పడలేదు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన జీవోను సర్కారు విడుదల చేయలేకపోయింది. అయితే గతంలోనే కేబినెట్ ఆమోదం తెలిపినందున మరోసారి అవసరంలేదని, ఆర్డినెన్స్ తీసుకొస్తే సరిపోతుందని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. త్వరలోనే ఆర్డినెన్స్ జారీచేసే అవకాశముందని వివరించారు. ఆర్డినెన్స్ తీసుకొస్తే తక్షణమే అమలుకానుంది. దీంతో ఈ నెలలో విరమణ పొందే బోధనాసుపత్రుల్లోని డాక్టర్లు మరో ఏడేళ్ల వరకు పొడిగింపు పొందనున్నారు. -
గాంధీకి 16.. ఉస్మానియాకు 21
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ప్రతిష్టాత్మక ప్రభుత్వ వైద్య కళాశాలలు తమ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. మారిన పరిస్థితులకు అనుగుణంగా అత్యాధునిక మౌలిక సదుపాయాలు, మానవ వనరులను సమకూర్చుకుంటూ అత్యుత్తమ వైద్యవిద్యను అందిస్తూ మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయి. ఏటా అనేక మంది విద్యార్థులను ఉత్తమ వైద్యులుగా తీర్చిదిద్ది సమాజానికి అందిస్తున్నాయి. వైద్యవిద్య బోధనలోనే కాదు.. వైద్యసేవల్లోనూ కార్పొరేట్కు దీటుగా ముందుకు సాగుతున్నాయి. వైద్య విద్యార్థుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ‘ఇండియా టుడే’సంస్థ ఇటీవల దేశవ్యాప్తంగా ఉన్న 503 ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలపై సర్వే నిర్వహించింది. జాతీయస్థాయి ఉత్తమ వైద్య కళాశాలల జాబితాలో ఢిల్లీలోని ఎయిమ్స్కు మొదటి ర్యాంకు, సీఎంసీ వెల్లూరుకు రెండో ర్యాంకు, పుణేలోని ఆర్మ్డ్ ఫోర్స్ వైద్య కళాశాలకు మూడో ర్యాంకు లభించింది. నగరానికి చెందిన గాంధీ మెడికల్ కాలేజీకి 16వ స్థానం లభించగా, ఉస్మానియా మెడికల్ కాలేజీకి 21వ ర్యాంకు దక్కింది. ఎంబీబీఎస్ లో చేరేందుకు నిర్వహించిన ప్రవేశ పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు ఉస్మానియాలో కాకుండా గాంధీ కాలేజీలో చేరేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. గతంలో 21.. ఇప్పుడు 16.. గాంధీ వైద్య కళాశాలకు అనుబంధంగా గాంధీ జనరల్ ఆస్పత్రి కొనసాగుతోంది. 1954లో గాంధీ ఆస్పత్రి ప్రారంభమైంది. 1956లో ఇండియన్ మెడికల్ కౌన్సిల్ (ఎంసీఐ) గుర్తింపు లభించింది. తొలి ఓపెన్హార్ట్ సర్జరీ ఇక్కడే జరిగింది. తొలి కేథల్యాబ్ ఇక్కడే ఏర్పాటు చేశారు. ఇక్కడ డీఎం కార్డియాలజీ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ 43 విభాగాలు ఉన్నాయి. వైద్య కాలేజీకి అనుబంధంగా కొనసాగుతున్న ఆస్పత్రిలో ఓపీ, ఐపీ, అత్యవసర సేవలు సహా రక్తనిధి కేంద్రం కూడా ఉంది. మౌలిక సదుపాయాలు, మానవవనరులు, విద్యాబోధన, ఫలితాలు ప్రతిపాదికన ఇండియా టుడే గతంలో నిర్వ హించిన సర్వేలో 21వ స్థానంలో ఉన్న గాంధీ వైద్య కళాశాల.. ఈ ఏడాది 16వ స్థానానికి చేరుకుంది. ఉస్మానియా వైద్య కళాశాలతో పోలిస్తే ఇక్కడ మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉండటం, కాలేజీ క్యాంపస్లోనే అనుబంధ ఆస్పత్రి కొనసాగుతుండటం, నిపుణులైన అధ్యాపకులు అందుబాటులో ఉండటం వల్ల నీట్లో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు సైతం ఈ కాలేజీలో చదివేందుకు ఇష్టపడుతున్నారు. ఉస్మానియాకు 21వ స్థానం ఉస్మానియా వైద్య కళాశాలకు 1951లో ఎంసీఐ గుర్తింపు లభించింది. ఒకప్పుడు టాప్ ర్యాంకర్లంతా ఈ కాలేజీలో చేరేందుకు ఎక్కువ ఇష్టపడేవారు. అనుబంధ ఆస్ప త్రులు వైద్య కళాశాలకు దూరంగా ఉండటం, ఆయా ఆస్పత్రుల భవనాలు శిథిలావస్థకు చేరుకోవడం వల్ల ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. ఇటీవల ఎంసీఐ ఆదేశాల మేరకు రూ.70 కోట్లతో మెడికల్ ఎడ్యుకేషన్ యూనిట్, ఎండీఆర్యూ, లేడీస్ హాస్టల్, అధునాతన లైబ్రరీ, రెండు హాస్టల్ భవనాలు సహా ఇతర మౌలిక వసతులను మెరుగుపర్చుకుంది. మానవవనరులను సమకూర్చుకుంది. బోధనలోనే కాదు ఫలితాల్లోనూ మెరుగుపడింది. ఫలితంగా ఈ ఏడాది 21వ స్థానంలో నిలిచి పూర్వవైభవాన్ని సంతరించుకుంది. గతేడాది జాబితా లో కనీసం స్థానం కూడా దక్కలేదు. ఈసారి ఏకంగా 21వ స్థానం దక్కడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. -
తెలంగాణకే ఎయిమ్స్ టాప్ ర్యాంకు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు చెందిన వై.జతిన్ ప్రతిష్టాత్మక ఢిల్లీ ఎయిమ్స్ నిర్వహించిన సూపర్ స్పెషాలిటీ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం ప్రవేశ పరీక్షలో దేశవ్యాప్త మొదటి ర్యాంకు సాధించారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో 2014లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన జతిన్.. తర్వాత 2015–18 వరకు చండీగఢ్లో ఎండీ జనరల్ మెడిసిన్ పూర్తి చేశారు. ఇప్పుడు ఎయిమ్స్ నిర్వహించిన ఎంట్రన్స్లో మొదటి ర్యాంకు సాధించడం పట్ల జూనియర్ డాక్టర్లు (జూడా) హర్షం వ్యక్తంచేశారు. కరీంనగర్కు చెందిన ఆయన కుటుంబం ప్రస్తుతం హైదరాబాద్లో నివాసం ఉంటోంది. -
మెడికల్ పీజీ కోటాపై డాక్టర్ల పోరాటం
సాక్షి, హైదరాబాద్: పీజీ మెడికల్ సీట్లలో ఇన్సర్వీస్ కోటాను పునరుద్ధరించాలని దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వ వైద్యుల సంఘం డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ఆ సంఘం కీలక సమావేశం ఆదివారం హైదరాబాద్లో జరగనుంది. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ వైద్యుల సంఘాల ప్రతినిధులు హాజరవుతున్నారు. ఈ సమావేశంలో ఇన్సర్వీస్ కోటా సీట్లను సాధించేందుకు పోరాటం చేయాలని పిలుపు ఇవ్వనున్నారు. ఢిల్లీ వెళ్లి ఎంపీలను, ఇతర కేంద్ర పెద్దలను కలసి విన్నవించాలని తీర్మానించాలని భావిస్తున్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో జరిగే దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వ వైద్యుల సమావేశంలో ఈ ప్రాంత డాక్టర్లకు జరుగుతున్న అన్యాయంపైనా చర్చించే అవకాశముంది. ‘నీట్’తో కోటాకు టాటా.. రాష్ట్రాల్లో పీహెచ్సీ, సీహెచ్సీల్లో వైద్యులు, స్పెషలిస్టులను పెద్ద ఎత్తున నియమించేందుకు ప్రభుత్వాలు అనేక ప్రోత్సాహకాలు అందించారు. అందులో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1975లో ప్రభుత్వంలో పనిచేస్తున్న వైద్యులకు ప్రోత్సాహకాలుగా ఇన్సర్వీస్ పీజీ కోటాను ప్రవేశపెట్టారు. ఇలా దేశంలో 11 రాష్ట్రాలు ఇన్ సర్వీస్ కోటాను ప్రవేశపెట్టాయి. దీనిద్వారా చాలామంది వైద్యులు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో పనిచేసేందుకు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. అయితే నీట్ పరీక్షలతో ప్రభుత్వ వైద్యులకు కల్పిస్తున్న ఇన్సర్వీస్ పీజీ కోటాను రద్దు చేశారు. డిప్లొమా కోర్సులకు మాత్రమే రిజర్వేషన్ కల్పించి మెడికల్ డిగ్రీ కోర్సులకు ఏడాదికి 10 శాతం వెయిటేజీ కల్పించారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వ వైద్యులకు తీవ్రమైన అన్యాయం జరిగిందని దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వ వైద్యుల సంఘం తరపున తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ పి.సుధాకర్ ‘సాక్షి’కి తెలిపారు. సుప్రీం కోర్టులో పిటిషన్.. ఇన్సర్వీస్ కోటా రద్దుపై తమిళనాడు ప్రభుత్వ వైద్యుల సంఘం ఎంసీఐ నిర్ణయంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇన్సర్వీస్ కోటా రద్దు వల్ల ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి నెలకొందని డాక్టర్ సుధాకర్ తెలిపారు. ఇదే పరిస్థితి పదేళ్లు కొనసాగితే దేశంలో ప్రభుత్వ వైద్యరంగంలో పనిచేసేందుకు డాక్టర్లు ముందుకురారని, ప్రభుత్వ వైద్యుల సంఖ్య తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. ఆదివారం కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణల్లో పనిచేస్తున్న ప్రభుత్వ వైద్యుల సంఘ ప్రతినిధులను సంఘటితం చేసి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. -
రాజేష్కు బెయిల్ నిరాకరణ
చిత్తూరు అర్బన్: తొలిరాత్రి శోభనం గదిలో భార్యను చిత్రహింసలకు గురిచేశాడనే ఆరోపణలపై జుడీషియల్ రిమాండులో ఉన్న ఉపాధ్యాయుడు రాజేష్కు బెయిల్ ఇవ్వడానికి న్యాయస్థానం నిరాకరించింది. అతడి బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ చిత్తూరులోని మొదటి అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 1న శోభనం గదిలో భార్య శైలజపై విచక్షణ మరిచి దాడి చేయడంతో చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరుకు చెందిన రాజేష్ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు రాజేష్కు లైంగిక పటుత్వ పరీక్షలు పూర్తి కావడంతో శుక్రవారం అతడిని పోలీసులు హైదరాబాద్ నుంచి చిత్తూరు జిల్లా జైలుకు తరలించారు. లైంగిక పటుత్వ పరీక్షలకు న్యాయస్థానం అనుమతి ఇవ్వడంతో గతవారం అతడిని హైదరాబాద్లోని ఉస్మానియా వైద్య కళాశాలలోని ఫోరెన్సిక్ ల్యాబ్కు తీసుకెళ్లారు. అక్కడ పరీక్షల అనంతరం తిరిగి చిత్తూరు జిల్లా జైలుకు తరలించారు. -
ఉస్మానియా వైద్య కళాశాలలో ‘ఎంసీఐ’ తనిఖీ
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా వైద్య కళాశాలలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) పరిశీలకులు తనిఖీ నిర్వహించారు. గతంలో తనిఖీకి వచ్చినపుడు లోపాలు కనిపించడంతో 50 ఎంబీబీఎస్ సీట్లకు కోతపెట్టిన విషయం తెలిసిందే. దీంతో ఈసారి తనిఖీ నేపథ్యంలో అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా సిబ్బంది క్వార్టర్ల నిర్మాణంలో జాప్యంపై ఎంసీఐ పరిశీలకులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. వీటితోపాటు మరికొన్ని లోపాలను కూడా ప్రస్తావించినట్లు సమాచారం. దీంతో వాటినికూడా సరిచేస్తామని అధి కారులు హామీ ఇచ్చారు. కోతకు గురైన 50 సీట్ల పునరుద్ధరణ త్వరలోనే ఉంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. -
రాష్ట్రానికి మరో 131 పీజీ వైద్య సీట్లు
⇒ అనుమతిస్తూ కేంద్రం ఉత్తర్వులు ⇒ ఉస్మానియాకు ఏకంగా 90 సీట్లు ⇒ నిమ్స్కు 30, గాంధీకి 11 పీజీ సీట్లు ⇒ 2017–18 పీజీ అడ్మిషన్ల నుంచే వీటి భర్తీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి భారీగా పీజీ వైద్య సీట్లకు కేంద్రం అనుమతి ఇచ్చింది. నిమ్స్, ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజీలకు అదనంగా 131 పీజీ వైద్య సీట్లు కేటా యిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఉస్మానియా మెడికల్ కాలేజీకి అధికంగా 90 సీట్లు, నిమ్స్కు 30, గాంధీకి 11 కేటాయిం చింది. ఉస్మానియాలో 279 పీజీ సీట్లుండగా అవి 369కి పెరగనున్నాయి. గాంధీలో 138 నుంచి 149కి, నిమ్స్లో 50 నుంచి 80కి పెరుగుతున్నాయి. పెరిగిన సీట్లన్నింటినీ 2017–18లోనే భర్తీ చేస్తారు. సీట్లు పెంపుపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అదనంగా మరో 100 పీజీ సీట్లు కేటాయించాల్సిందిగా కేంద్రాన్ని కోరనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికా రులు తెలిపారు. కాకతీయ మెడికల్ కాలేజీ కి 50 సీట్లు కోరాలని నిర్ణయించారు. సూపర్ స్పెషాలిటీ సీట్లు కోరనున్నట్లు వైద్య విద్యా సంచాలకులు రమణి ‘సాక్షి’కి తెలిపా రు. పీజీ సీట్లు లేని ఆదిలాబాద్, నిజామా బాద్ మెడికల్ కాలేజీలకు కూడా ఈసారి సీట్లు కోరాలని నిర్ణయించామన్నారు. ఒక్కో ప్రొఫెసర్కు 3 పీజీ సీట్లు ఒక్కో ప్రొఫెసర్ పరిధిలో ప్రస్తుతమున్న రెండు పీజీ వైద్య సీట్లను మూడుకు, ఒక అసోసియేట్ ప్రొఫెసర్ అధిపతిగా ఉండగా ప్రస్తుతమున్న ఒక సీటును రెండుకు పెంచా లని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్ణయించడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్రం దేశవ్యాప్తంగా 4,193 పీజీ వైద్య సీట్లు పెంచింది. వీటిలో భాగంగా రాష్ట్రా నికి 131 సీట్లను అదనంగా కేటాయించింది. మరో 100 సీట్ల దాకా వచ్చే అవకాశం ఉందని రమణి తెలిపారు. ఈ మేరకు ఇప్ప టికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపామ న్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తొలిసారిగా ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్మెంట్కు రెండు పీజీ సీట్లను ఎంసీఐ మంజూరు చేసింది. ప్రైవేట్లో ఒక మెడికల్ కాలేజీలో మాత్రమే ఈ సదుపాయం ఉండగా ప్రభుత్వ రంగంలో నిమ్స్కు మాత్రమే ఈ సదుపాయం కల్పించింది. ఈ విభాగంలో నిమ్స్కు 2 ఎమర్జెన్సీ మెడిసిన్ సీట్లు కేటాయించింది. ► ఉస్మానియా మెడికల్ కాలేజీలో 12 విభాగాలకు సీట్లను పెంచారు. అత్యధికంగా ఎంఎస్ జనరల్ సర్జరీ విభాగంలో 18 సీట్లు, ఎండీ పీడియాట్రిక్లో 17 సీట్లు పెంచారు. ఎంఎస్ ఆప్తమాలజీలో 12, ఎంఎస్ ఆర్థోపెడిక్స్లో 11 సీట్లు పెరిగాయి. ► గాంధీ మెడికల్ కాలేజీలో ఎండీ జనరల్ మెడిసిన్లో 8 పీజీ సీట్లు పెరిగాయి హా నిమ్స్లో ఎండీ జనరల్ మెడిసిన్లో 11 సీట్లు, ఎండీ అనెస్థీషియాలజీలో 8 సీట్లు, ఎండీ రేడియో డయాగ్నసిస్లో 6 సీట్లు పెరిగాయి. -
సీట్లు కాపాడుకునేందుకు పాట్లు!
⇒ నిబంధనలు పాటించకపోవడంతో ⇒ తాజాగా కాకతీయ, మహబూబ్నగర్ మెడికల్ కాలేజీల్లో ఇదే పరిస్థితి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లను కాపాడుకోవడం వైద్య ఆరోగ్య శాఖకు గండంగా మారింది. ప్రతీ ఏడాది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) తనిఖీలకు రావడం.. లోపాల కారణంగా సీట్ల పునరుద్ధరణకు తిరస్కరించడం పరిపాటిగా మారింది. 3 నెలల కిందట ఉస్మానియా మెడికల్ కాలేజీకి చెందిన 50 ఎంబీబీఎస్ సీట్లు, నిజామాబాద్ మెడికల్ కాలేజీలోని 100 సీట్లను 2017–18 సంవత్సరానికి పునరుద్ధరించడానికి ఎంసీఐ నిరాకరించింది. తాజాగా కాకతీయ మెడికల్ కాలేజీలో 50 ఎంబీబీఎస్ సీట్లు, కొత్తగా ఏర్పడిన మహబూబ్నగర్ మెడికల్ కాలేజీలో 150 సీట్లకు ఎంసీఐ అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీట్ల పునరుద్ధరణకు వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే నిజామాబాద్, ఉస్మానియాల్లోని ఎంబీబీఎస్ సీట్ల అనుమతి కోసం లేఖ రాయగా.. తాజాగా తిరస్కరించిన మహబూబ్నగర్, కాకతీయ మెడికల్ కాలేజీల్లోని సీట్ల పునరుద్ధరణకు లేఖ రాయాలని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ ఆయా కాలేజీ ప్రిన్సిపాళ్లను బుధవారం ఆదేశించారు. వారితో ఆయన సమావేశం నిర్వహించారు. తరచూ ఇలాంటి పరిస్థితి ఎందుకు తలెత్తుతోందని అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మౌలిక వసతులు, సిబ్బంది కొరత వల్లే.. కాకతీయ మెడికల్ కాలేజీలో 19.06 శాతం బోధన సిబ్బంది కొరత ఉన్నట్లు గుర్తించారు. వార్డుల్లో వైద్య విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు గదుల్లేవు. కేంద్ర ప్రయోగశాల లేదు. 150 మంది విద్యార్థులు పరీక్ష రాసే సామర్థ్యమున్న గదుల్లో 250 మందిని కూర్చోబెడుతున్నారు. ఇక మహబూబ్నగర్ మెడికల్ కాలేజీలో 30.85 శాతం బోధన సిబ్బంది.. 17.02 శాతం రెసిడెంట్ వైద్యుల కొరత ఉంది. నర్సులు, పారామెడికల్ సిబ్బంది కొరత 10.15 శాతం ఉంది. ఐదేళ్ల అనుభవమున్న వారినే మెడికల్ సూపరింటెండెంట్గా నియమించారు. గతంలో ఉస్మానియా, నిజామాబాద్ మెడికల్ కాలేజీల్లోనూ లేబొరేటరీ, లైబ్రరీ, సిబ్బంది, మౌలిక సదుపాయాల వంటివి లేకపోవడంతో ఎంసీఐ సీట్ల పునరుద్ధరణకు అనుమతి ఇవ్వలేదు. అయితే అప్పట్లో లేఖ నేపథ్యంలో ఎంసీఐ అధికారులు ఉస్మానియా, నిజామాబాద్ కాలేజీ సీట్ల పునరుద్ధరణకు అనుమతిచ్చారు. -
ప్రముఖ వైద్యుడు ఏకే చారి కన్నుమూత
హైదరాబాద్: ఉస్మానియా మెడికల్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్, స్వాతంత్య్ర సమరయోధుడు డాక్టర్ అచ్చి కృష్ణాచారి(87) గుండెపోటుతో బుధవారం కన్ను మూశారు. సికింద్రాబాద్లోని సెయింట్ జాన్స్ రోడ్లో నివాసముండే ఆయన కొంత కాలంగా హృద్రోగంతో బాధపడుతున్నారు. బుధవారం ఉదయం హఠాత్తుగా గుండెనొప్పి రావడంతో మృతిచెందారు. ఆయనకు ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఏకే చారి ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేయడంతో పాటు పాథాలజీ సర్జరీలో గోల్డ్ మెడల్ను సాధించారు. ధూల్పేట్ ప్రాంతంలో వైద్య వృత్తిని ఆరంభించారు. గాంధీ ఆస్పత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరారు. కర్నూల్ మెడికల్ కళాశాలలో సర్జరీ ప్రొఫెసర్గా, గాంధీ ఆస్పత్రిలో సర్జరీ విభాగం హెచ్వోడీగా, ఉస్మానియా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్గా విధులు నిర్వహించి 1983లో గాంధీ ఆస్పత్రిలో పదవీ విరమణ పొందారు. పదవీ విరమణ అనంతరం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనేవారు. పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆయన వైద్య సేవలు అందించారు. ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర ప్రతినిధిగా రష్యా, యూకే, యూఎస్ఏలలో కూడా పర్యటించారు. గురువారం బన్సీలాల్పేటలోని శ్మశానవాటికలో ఏకే చారి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా, భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ఏకే చారి నివాసానికి చేరుకుని ఆయన కుటుంబసభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. -
పేలిన ట్రాన్స్ఫార్మర్..తప్పిన ప్రమాదం
హైదరాబాద్ : కోఠిలోని ఉస్మానియా మెడికల్ కళాశాల సమీపంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ శనివారం మధ్యాహ్నం అకస్మాత్తుగా పేలింది. ఒక్కసారిగా ట్రాన్స్ఫార్మర్ నుంచి మంటలు ఎగసిపడి కాలిపోయింది. అయితే, ఆ సమయంలో సమీపంలో ఎవరూ లేకపోవటంతో పెనుప్రమాదం తప్పింది. స్థానికులు వెంటనే స్పందించి... అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. -
ఒక్కో కుటుంబానికి రూ.7 లక్షలు
♦ బస్సు ప్రమాదంలో మరణించిన మెడికోల కుటుంబాలకు పరిహారం ♦ సీడీఎస్ నిధుల నుంచి చెల్లించనున్నట్టు డీఎంఈ వెల్లడి హైదరాబాద్: ఇటీవల బస్సు ప్రమాదంలో మృతిచెందిన నలుగురు ఉస్మానియా మెడికల్ కాలేజ్ వైద్య విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ(సీడీఎస్) నిధుల నుంచి రూ.7 లక్షల చొప్పున పరిహారంగా అందజేయాలని నిర్ణయిం చినట్టు తెలంగాణ డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ), సీడీఎస్ చైర్మన్ డాక్టర్ రమణి వెల్లడించారు. విద్యార్థుల వరుస ఆందోళనలతో స్పందించిన డీఎంఈ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఉస్మానియా వైద్య కళాశాలలో జరిగిన సీడీఎస్ సమావేశంలో డీఎంఈతో పాటు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రభాకర్, ప్రొఫెసర్లు డాక్టర్ బాబూరావు, డాక్టర్ నాగేందర్, సిబ్బంది, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. సమావేశం ఆనంతరం డీఎంఈ రమణి మాట్లాడుతూ ఈ నెల 14న జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన వైద్య విద్యార్థులు జి.లక్ష్మణ్, మోకా విజయ్తేజ, మచ్చ ప్రణయ్రాజారాం, వదనాల ఉదయ్ కుటుంబాలను ఆదుకోవాలని నిర్ణయించామన్నారు. సీడీఎస్లో తీసుకున్న నిర్ణయాలను సీఎం కేసీఆర్, వైద్య మంత్రి లక్ష్మారెడ్డి, ముఖ్యకార్యదర్శి తివారీ దృష్టికి తీసుకువెళ్లి మంగళవారం సాయంత్రంలోగా విద్యార్థుల కుటుంబ సభ్యులకు చెక్కులు అందజేస్తామని చెప్పారు. ఉస్మానియా వైద్య కళాశాలలో పనిచేస్తున్న టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బంది ఒకరోజు వేతనాలను విరాళంగా ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నామన్నారు. గాంధీ వైద్య కళాశాల, కాకతీయ వైద్య కళాశాల అధ్యాపకులు, సిబ్బంది సైతం విరాళాలు అందజేసేందుకు ముందుకొచ్చారన్నారు. వచ్చే ఏడాది నుంచి కళాశాల టాపర్స్కు మృతిచెందిన విద్యార్థుల పేరు మీద గోల్డ్ మెడల్స్ అంజేస్తామని ప్రకటించారు. కాగా, ఉస్మానియా వైద్య కళాశాల ఎస్పీఎం హెచ్వోడీ డాక్టర్ బాబూరావు విద్యార్థుల కుటుంబాలకు తన వంతుగా లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించి చెక్కును కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రభాకర్కు అందజేశారు. డీఎంఈ రమణి కూడా రూ.10 వేల విరాళాన్ని ప్రకటించారు. కొనసాగిన విద్యార్థుల ఆందోళన.. బస్సు ప్రమాదంలో మరణించిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం కోఠి ఉస్మానియా వైద్య కళాశాల విద్యార్థుల ఆందోళన కొనసాగింది. విద్యార్థులు తరగతులను బహిష్కరించారు. తరగతి గదులకు తాళాలు వేసి కళాశాల ప్రధాన ద్వారం వద్ద మృతిచెందిన విద్యార్థుల చిత్రపటాలను పెట్టి కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు. సీడీఎస్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను డీఎంఈ రమణి విద్యార్థులకు స్వయంగా వివరించడంతో వారు తమ నిరసన విరమించారు. -
వైద్య విద్యార్థుల ఆందోళన
హైదరాబాద్: కోఠిలోని ఉస్మానియా వైద్య కళాశాల విద్యార్థులు సోమవారం తరగతులు బహిష్కరించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మెడికోల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని, ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వారు ఆందోళనకు దిగారు. ఇటీవల విజయవాడ సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో నలుగురు వైద్య విద్యార్థులు చనిపోయిన సంగతి తెలిసిందే. -
సంతాపం.. ఉద్రిక్తం
ఆగ్రహించిన ఉస్మానియా వైద్య కళాశాల విద్యార్థులు డీఎంఈ, ప్రిన్సిపాల్ నిర్బంధం హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో ఇటీవల మృతిచెందిన వైద్య విద్యార్థుల సంతాప సభ ఉద్రిక్తంగా మారింది. ఉద్వేగానికి లోనైన విద్యార్థులు ఉస్మానియా వైద్య కళాశాల డీఎంఈ, ప్రిన్సిపాల్ను నిర్బంధించారు. మీ నిర్లక్ష్యం కారణంగానే తమ స్నేహితులు ప్రాణాలు కోల్పోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన గిరిలక్ష్మణ్, ఉదయ్, విజయ్తేజ, ప్రణయ్రాజారామ్కు నివాళులర్పిస్తూ శనివారం ఉస్మానియా వైద్య కళాశాలలో సంతాప సభ ఏర్పాటు చేశారు. డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ రమణి, కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్, అలుమిని అధ్యక్షుడు గోపాలకృష్ణ, మాజీ డీఎంఈ పి.శ్రీనివాస్, నిమ్స్ మాజీ డెరైక్టర్ రాజిరెడ్డితో పాటు మృతుడు ప్రణయ్రాజారామ్ తల్లిదండ్రులు శ్రీనివాస్మూర్తి, నిర్మల హాజరయ్యారు. మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి, కొవ్వొత్తులు వెలిగించి శ్రద్ధాంజలి ఘటించారు. భగ్గుమన్న విద్యార్థులు... ఈ సందర్భంగా డీఎంఈ రమణి మాట్లాడుతూ... చనిపోయిన విద్యార్థులు తన పిల్లలతో సమానమన్నారు. వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా వచ్చేలా ప్రభుత్వానికి విన్నవిస్తామన్నారు. ఈ బడ్జెట్లో కళాశాల అభివృద్ధికి రూ.63 కోట్లు కేటాయించారని, వాటితో బస్సులు ఇతర అభివృద్ధి పనులు చేపడతామన్నారు. ప్రిన్సిపాల్ ప్రభాకర్ కూడా ఇదే తరహాలో ప్రసంగించడంతో విద్యార్థులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. వారితో పాటు మాజీ డీఎంఈ, అధ్యాపకులను ఆడిటోరియం తలుపులు మూసేసి నిర్బంధించారు. తోటి విద్యార్థులను ఎంతో మిస్సయ్యామని, శవాలపై రాజకీయం చేస్తున్నారే తప్ప వారి కుటుంబాల గురించి ఆలోచించడం లేదని కన్నీరు పెడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తమ స్నేహితులను కోల్పోయామన్నారు. నాడు కోట్ల రూపాయలు కళాశాల అభివృద్ధికి ఖర్చు చేసినవారికి బస్సుల గురించి ఎందుకు గుర్తుకు రాలేదని నిలదీశారు. తమ ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పేవరకూ అధికారులెవరినీ బయటకి కదలనిచ్చేది లేదని పట్టుబట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అక్కడికి వచ్చిన పోలీసులను సైతం విద్యార్థులు వెళ్లిపోవాలని కోరడంతో వారు బయట బందోబస్తుకే పరిమితమయ్యారు. దాదాపు ఐదు గంటలపాటు అధికారులను నిర్బంధించారు. కేసీఆర్కు చికిత్స చేయాల్సిందీ వైద్యులే ప్రణయ్ తల్లిదండ్రులు నలుగురు వైద్య విద్యార్థులు చనిపోతే తెలంగాణ సీఎం కేసీఆర్ కనీసం స్పందించలేదని మృతుడు ప్రణయ్ తల్లిదండ్రులు నిర్మల, శ్రీనివాస్మూర్తి ఆరోపించారు. రేపు ఆయనకేమన్నా అయితే వైద్యులే చికిత్సలందించాలన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి కేవలం ఫొటోలకే ఫోజులిచ్చారని, కనీసం బాధిత కుటుంబాలను పరామర్శించలేదన్నారు. చిన్నచిన్న స్కూళ్లు కూడా మంచి బస్సులు పెట్టుకుంటుంటే దేశంలోనే ప్రతిష్టాత్మక కళాశాలకు బస్సు లేకపోవడం అధికారుల నిర్లక్ష్యమేనన్నారు. ప్రమాదానికి కారణమైన ట్రావెల్స్ యాజమాన్యంపై చర్య లు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాము ఎక్స్గ్రేషియా కోసం రాలేదని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలియజెప్పడానికే వచ్చామన్నారు. -
ఇంతలోనే అంత విషాదమా !
రోడ్డు ప్రమాదంలో ‘ఉస్మానియా’ మెడికోల దుర్మరణం కిమ్స్ మెడికల్ కళాశాలలో విషాదం ఘన నివాళి అర్పించిన వైద్య విద్యార్థులు, వ్యాయామోపాధ్యాయులు విజయవాడ వద్ద సోమవారం అర్ధరాత్రి జరిగిన బస్సు ప్రమాదం అమలాపురం కిమ్స్ కళాశాల వైద్య విద్యార్థుల్లో విషాదాన్ని నింపింది. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వైద్య, దంతవైద్య కళాశాలల విద్యార్థులకు.. కిమ్స్ కళాశాలలో ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకూ క్రీడా పోటీలు జరిగిన విషయం తెలిసిందే. ఈ పోటీల్లో పాల్గొని, తిరుగు పయనమైన హైదరాబాద్ ఉస్మానియా వైద్య కళాశాల విద్యార్థుల బస్సు.. విజయవాడ వద్ద ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ముందు రోజు వరకూ తమతో కలసి ఉత్సాహంగా ఆటలాడిన ‘ఉస్మానియా’ వైద్య విద్యార్థులు ప్రమాదానికి గురయ్యారని.. వారిలో నలుగురు అసువులు బాశారని తెలిసి.. కిమ్స్ విద్యార్థులు విషాదంలో మునిగిపోయారు. మృతుల కుటుంబాలకు కళాశాల యాజమాన్యం ప్రగాఢ సంతాపం తెలిపింది. అమలాపురం/ అమలాపురం రూరల్ : ఐదారు రోజుల పాటు కళ్ల ముందు ఉత్సాహంగా ఆటలాడిన సహచర విద్యార్థులు తిరిగిరాని లోకానికి వెళ్లిపోవడం వైద్య విద్యార్థుల్లో అంతులేని విషాదాన్ని నింపింది. మెడికోలు సొంత ఇళ్లకు సంతోషంగా బయలుదేరిన రోజునే రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడాన్ని కిమ్స్ యాజమాన్యం, వ్యాయామోపా ధ్యాయులు జీర్ణించుకోలేకపోతున్నారు. విజయవాడ సమీపంలో గొల్లపూడి వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజీకి చెందిన నలుగురు వైద్య విద్యార్థులు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. అమలాపురం కిమ్స్లో ఈనెల 10 నుంచి 13 వరకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో 19వ ఉభయ తెలుగు రాష్ట్రాల మెడికల్, డెంటల్ కాలేజీ విద్యార్థుల స్పోర్ట్స్ మీట్ జరిగిన విషయం తెలిసిందే. ఆది వారం మధ్యాహ్నం ఆటలు ముగియడంతో ఉస్మానియా వైద్య కళాశాల విద్యార్థులు కోనసీమ అందాలను తిలకించేందుకు వెళ్లారు. యానాం, ఎదుర్లంకతోపాటు పలు ప్రాంతాలను సందర్శించారు. ఆదివారం రాత్రి బయలుదేరాల్సిన విద్యార్థులు కిమ్స్లోనే బసచేసి సోమవారం ఉదయం బయలుదేరారు. రాత్రి జరిగిన దుర్ఘటనలో వీరు మృత్యువాత పడ్డారని తెలిసి కిమ్స్లో ఒక్కసారిగా విషాదం అలముకుంది. క్రీడాపోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన ‘ఉస్మానియా’ విద్యార్థులు అన్ని పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మృత్యువాత పడిన మేకా విజయతేజ, గిరి లక్ష్మణ్, వి.ఉదయ్, ప్రణయ్రాజారామ్లు వాలీబాల్, బాస్కెట్బాల్ పోటీల్లో పాల్గొన్నారు. బాస్కెట్బాల్లో యూనివర్సిటీ జట్టు రన్నర్గా నిలి చింది. కబడ్డీ పోటీల్లో ఓటమి చెందినా వీరు ఆడిన తీరు క్రీడాభిమానులను ఆకట్టుకుంది. ఇలా కళ్ల ముందు నడియాడిన తమ సహచర విద్యార్థులు మృతి చెందడంతో కిమ్స్ వైద్య విద్యార్థులు కలత చెందారు. విద్యార్థుల మృతికి కిమ్స్ యాజమాన్యం ప్రగాఢ సంతాపం తెలిపింది. కిమ్స్లో మంగళవారం డీన్ ఏఎస్ రాజ్కుమార్ అధ్యక్షతన జరిగిన సంతాపసభలో వైద్య విద్యార్థులు నివాళులర్పించారు. వైస్ ప్రిన్సిపాల్ జీకేవీ ప్రసాద్, డాక్టర్ ఆనందాచార్య, వైస్ ప్రెసిడెంట్ మోహన్రాజు, సీఏవో రఘులు సంతాపం తెలిపిన వారి లో ఉన్నారు. క్రీడా పోటీల్లో అంపేర్లుగా సేవలందించిన వ్యాయామోపాధ్యాయు లు ఈ సంఘటన పట్ల తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. పీఈటీలు పప్పుల శ్రీరామచంద్రమూర్తి (రాంబా బు), వాసంశెట్టి హరిబాబు, గోలకోటి నారాయణరావు, ఉండ్రు ముసలయ్య, కె.నాగరాజు, ఐ.భీమేష్, పి.విఘ్నేశ్వరుడు, కె.సత్యనారాయణ, కె.ఆదిలక్ష్మి, వి.నరసింహారావు, ఎంజీ రామారావు, సత్యానందం, కె.వెంకటేశ్వరరావు, వై.ఎస్.వి.రమణారావు తదితరులు సంతాపం తెలిపినవారిలో ఉన్నారు. -
ప్రణయ్ కళ్లను దానం చేసిన తల్లిదండ్రులు
విజయవాడ: గొల్లపూడి ప్రమాదం ఘటనలో మృతిచెందిన ఉస్మానియా మెడికల్ కాలేజీ విద్యార్థి మచ్చా ప్రణయ్ (సరూర్ నగర్) మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. అనంతరం విద్యార్థి ప్రణయ్ మృతదేహాన్ని అతడి తల్లిదండ్రులకు అధికారులు అప్పగించారు. కొడుకు చనిపోయాడన్న పుట్టెడు దు:ఖంలోనూ ప్రణయ్ కళ్లను ఆ తల్లిదండ్రులు స్వేచ్ఛ ఐ బ్యాంకుకు దానం చేశారు. గొల్లపూడి సమీపంలోని సురయ్యపాలెం వద్ద సోమవారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో హైదరాబాద్లోని ఉస్మానియా మెడికల్ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు, ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మృతి చెందిన విషయం తెలిసిందే. -
ఉస్మానియా వద్ద విద్యార్థులు, వైద్యులు ఆందోళన
హైదరాబాద్ : నగరంలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ వద్ద విద్యార్థులు, వైద్యులు మంగళవారం ఆందోళనకు దిగారు. విద్యార్థుల కోసం కాలేజి బస్సు ఉండగా.... ప్రైవేట్ బస్సులో విద్యార్ధులను అమలాపురం ఎందుకు పంపారని... విద్యార్థులు, వైద్యులు కాలేజీ ప్రిన్సిపల్ను ప్రశ్నించారు. విజయవాడలో ప్రైవేట్ ట్రావెల్స్ ప్రమాదం జరిగి.. నలుగురు మృతి చెందిన ఘటనకు కాలేజీ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్తోపాటు పీడీనే బాధ్యులు అని వారు ఆరోపించారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ... ఉద్యోగాలకు రాజీనామా చేయాలని వారిని విద్యార్థులు, వైద్యులు డిమాండ్ చేశారు. దీంతో ఉస్మానియా మెడికల్ కాలేజీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ అంశంపై కాలేజీ ఉన్నతాధికారులు విజయవాడలో ఉన్న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సీహెచ్.లక్ష్మారెడ్డికి సమాచారం అందించారు. ఆయన వెంటనే స్పందించి.... ఈ ప్రమాద ఘటనపై ప్రభుత్వం విచారణ జరుపుతుందని కాలేజీ విద్యార్థులు, వైద్యులకు హామీ ఇచ్చారు. -
పదేళ్ల అనుభవం ఉందంటూ.. ఢీకొట్టాడు!
విజయవాడ: గొల్లపూడి ప్రమాద ఘటనలో ప్రాణాలతో బయటపడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను మీడియా సంప్రదించింది. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఓ విద్యార్థి మాట్లాడుతూ.. తాను రెండో వరుస సీట్లో కూర్చున్నానని, తన ముందు, పక్కన కూర్చున్న ఇద్దరు చనిపోయారని చెప్పాడు. తన ముందు కొందరు సీనియర్స్ నిల్చున్నారని, వారి వెనకాల తాను రెండో సీట్లో కూర్చున్నా ప్రాణాలతో బయటపడ్డాడని తెలిపాడు. డ్రైవర్ మద్యం తాగి బస్సు నడుపుతున్నట్లు అనిపించిందని, దానిపై అనుమానంతో కొందరు విద్యార్థులు ట్రావెల్స్ యాజమాన్యానికి ఫోన్ చేస్తే.. డ్రైవర్ను మారుస్తామని హామీ ఇచ్చారని.. అయినా మార్చకపోవడంతో సూరయ్యపాలెం వద్ద బస్సును ఆపాలని కోరినా డ్రైవర్ పట్టించుకోలేదని విద్యార్థులు చెబుతున్నారు. తాము ప్రయాణిస్తున్న ధనుంజయ ట్రావెల్స్ బస్సు గొల్లపూడికి రాగానే డ్రైవర్ కంట్రోల్లో లేడని అర్థమయిందన్నాడు. మరో విద్యార్థి మాట్లాడుతూ.. తమ సీనియర్లు డ్రైవర్ ను వేగంగా వెళ్లవెద్దని వారించినా అతడు వినపించుకోలేదని చెప్పాడు. డ్రైవర్ కంట్రోల్ తప్పినట్లు గ్రహించిన సీనియర్స్ ముందుగానే వేరే డ్రైవర్ ను ఏర్పాటుచేసుకున్నారని, కానీ అతడు వచ్చేలోపే ఘోరం జరిగిపోయి తమ కాలేజీ మిత్రులు నలుగురు చనిపోయారని ఆవేదన వ్యక్తంచేశాడు. బస్సును ఆపాలని సీనియర్లు డ్రైవర్ను కోరగా, తనకు పదేళ్ల అనుభవం ఉందంటూ బస్సు వేగాన్ని మరింత పెంచడంతోనే చెట్టును ఢీకొని ఈ ఘటన జరిగిందని చెప్పుకొచ్చాడు. తన మిత్రులు మరికొంత మంది పరిస్థితి ఇప్పటికీ విషమంగా ఉందని వివరించాడు. -
డ్రైవర్ తీరుపై ముందే డౌట్ వచ్చింది..
విజయవాడ: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణించిన ఉస్మానియా మెడికల్ కాలేజీకి చెందిన ఓ విద్యార్థి డ్రైవర్ తాగి ఉన్నాడని చెప్పినట్లు సమాచారం అందింది. ప్రమాదానికి ముందే డ్రైవర్ వ్యవహారంపై తమకు అనుమానం తలెత్తిందని విద్యార్థులు చెబుతున్నారు. శివ్వరూప్ అనే విద్యార్థి డ్రైవర్ తీరుపై అనుమానం వచ్చి ట్రావెల్స్ వాళ్లకు కాల్ చేసినట్లు తెలిపాడు. వేరే బస్సు డ్రైవర్ కోసం తాము కాల్ చేసినట్లు చెప్పాడు. అయితే, తాను పదేళ్ల నుంచి డ్రైవర్ గా చేస్తున్నానని, తాను ఇదే విధంగా డ్రైవ్ చేస్తానని ఏ అనుమానాలు పెట్టుకోవద్దని డ్రైవర్ విద్యార్థులకు సర్దిచెప్పినట్లు విద్యార్థులు తెలిపారు. గొల్లపూడి నుంచి కొంతదూరం వెళ్లగానే బస్సును ఆపివేయాలని తాము అరుస్తున్నా డ్రైవర్ పట్టించుకోలేదని విద్యార్థులు అంటున్నారు. విద్యార్థులు తమ అరుపులను మరింత పెద్దవి చేయగా, ఆ తొందర్లో డ్రైవర్ వేముల శివ మరింత వేగంగా నడపడం మొదలుపెట్టాలని ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని వివరించారు. కృష్ణాజిల్లా గొల్లపూడి సమీపంలోని సురయ్యపాలెం వద్ద సోమవారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో హైదరాబాద్లోని ఉస్మానియా మెడికల్ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు, ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మృతి చెందిన విషయం తెలిసిందే. -
బాధ్యులపై చర్యలు తీసుకుంటాం: మంత్రి లక్ష్మారెడ్డి
విజయవాడ: ఉస్మానియా మెడికల్ కాలేజీ విద్యార్థులు స్పోర్ట్స్ కోసం అమలాపురం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలంగాణ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. గొల్లపూడి సమీపంలోని సురయ్యపాలెం వద్ద సోమవారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో హైదరాబాద్లోని ఉస్మానియా మెడికల్ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు, ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తెలంగాణ మంత్రి లక్ష్మారెడ్డి స్పందించి గొల్లపూడిలోని ఆంధ్రా ఆస్పత్రికి ఆయన వెళ్లారు. క్షతగాత్రులను పరామర్శించారు. విద్యార్థులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు చెట్టుకు ఢీకొని ఈ ఘటన జరిగిందని చెప్పారు. ప్రస్తుతం ఆరుగురు విద్యార్థులు ఐసీయూలో ఉన్నారని, మరో ఇద్దరు విద్యార్థులకు సర్జరీలు జరిగాయని ఆయన వెల్లడించారు. ఇప్పటికీ ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని, చనిపోయిన విద్యార్థులను ఆదుకోవడానకి సీఎం కేసీఆర్ తో మాట్లాడి త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన వివరించారు. స్పోర్ట్స్ ఈవెంట్ సజావుగానే సాగిందని, చివర్లో ట్రావెల్స్ అదుపుతప్పి చెట్టుకు ఢీకొనడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందన్నారు. వైద్యులు అనుమతి విద్యార్థులను హైదరాబాద్ కు తీసుకొచ్చి చికిత్స అందించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. -
గొల్లపూడి ప్రమాదం ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
విజయవాడ: గొల్లపూడి సమీపంలో జరిగిన బస్సు ప్రమాదం ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బస్సు ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని వైఎస్ జగన్ కోరారు. గొల్లపూడి సమీపంలోని సురయ్యపాలెం వద్ద సోమవారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో హైదరాబాద్లోని ఉస్మానియా మెడికల్ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు, ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆరుగురు ఐసీయూలో ఉండగా, ఇద్దరు విద్యార్థులకు శస్త్రచికిత్సలు జరిగాయి. మరికొందరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందింది. -
గొల్లపూడి ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
విజయవాడ: కృష్ణాజిల్లా గొల్లపూడి సమీపంలోని సురయ్యపాలెం వద్ద సోమవారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో హైదరాబాద్లోని ఉస్మానియా మెడికల్ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు, ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మృతి చెందారు. ఈ ప్రమాదం ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి చెందారు. ప్రమాదంలో గాయపడ్డ విద్యార్థులకు మెరుగైన వైద్యం, సహాయక చర్యలను పర్యవేక్షించాలని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు. మృతిచెందిన వైద్య విద్యార్థుల తల్లిదండ్రులకు కేసీఆర్ సానుభూతి తెలిపారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో మరో 17 మంది విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మచ్చా ప్రణయ్ (సరూర్ నగర్), విజయ్ తేజ (కుత్బుల్లాపుర్), ఉదయ్ (కరీంనగర్), గిరి లక్ష్మణ్ (ఆదిలాబాద్), డ్రైవర్ వేముల శివయ్య లను మృతులుగా గుర్తించారు. -
‘పాస్ చేయకుంటే నిప్పుపెట్టుకుంటా’
గాంధీ ఆస్పత్రి : సూపర్ స్పెషాలిటీ కోర్సు ప్రాక్టికల్స్లో కావాలనే తనను ఫెయిల్ చేస్తున్నారని ఆరోపిస్త్తూ కిరోసిన్ బ్యాటిల్, అగ్గిపెట్టె పట్టుకుని సూపరింటెండెంట్ పేషీ వద్ద వైద్యుడు హల్చల్ చేసిన ఘటన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో జరిగింది. బాధితుడు, ఆస్పత్రివర్గాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ట్యూటర్గా విధులు నిర్వహిస్తున్న మహ్మద్ అజాం (45) సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో ఎంఎస్ జనరల్ సర్జన్ సెకెండ్ పీజీ (సూపర్ స్పెషాలిటీ) చదువుతున్నాడు. ఎంబీబీఎస్ నుంచి మంచి మార్కులతో ఉత్తీర్ణుడు అవుతున్న అజాం ఇటీవల జరిగిన సూపర్ స్పెషాలిటీ సెకెండ్ పీజీ ప్రాక్టికల్స్లో మాత్రం ఫెయిలయ్యాడు. దీనిపై ఎగ్జామినేషన్ ఆఫ్ కంట్రోలర్కు ఫిర్యాదు చేయగా దానిపై గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ప్రాక్టికల్స్ ఫెయిల్ కావడాన్ని జీర్ణించుకోలేని అజాం కొంతకాలంగా మానసిక వేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం కమిటీ ముందు హాజరై తన వాదన వినిపించాడు. అనంతరం ముందే తనతో తెచ్చుకున్న కిరోసిన్ బ్యాటిల్, అగ్గిపెట్టె పట్టుకుని గాంధీ సూపరింటెండెంట్ పేషీలోకి దూసుకెల్లాడు. కిరోసిన్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించగా ఆస్పత్రి సిబ్బంది అడ్డుకుని, పోలీసులకు సమాచారం అందించారు. వైద్యాధికారులు, పోలీసులు ఆజాంకు కౌన్సెలింగ్ నిర్వహించారు. కమిటీ నివేదిక ఆధారంగా తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
కోఠి మెడికల్ కాలేజీలో మళ్లీ ర్యాగింగ్
జూనియర్ల దుస్తులు విప్పించిన సీనియర్లు నలుగురు సీనియర్ విద్యార్థుల అరెస్టు.. విడుదల హైదరాబాద్: రాష్ట్రంలోనే పేరొందిన కోఠి ఉస్మానియా మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ భూతం మరోమారు పడగవిప్పింది. ఇటీవల ఈ వైద్య కళాశాలలో హౌస్ సర్జన్లపై లైంగిక వేధింపులు మరువకముందే మరోమారు అదే దారుణం చోటుచేసుకుంది. తమకు మర్యాద ఇవ్వడం లేదని జూనియర్ విద్యార్థుల దుస్తులు విప్పించి మోకాళ్లపై నిలబెట్టి సీనియర్ విద్యార్థులు ఘోరంగా ర్యాగింగ్ చేశారు. దీనిపై బాధిత విద్యార్థులు సుల్తాన్బజార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. సుల్తాన్బజార్ ఇన్స్పెక్టర్ శివశంకర్ కథనం ప్రకారం... కోఠి ఉస్మానియా మెడికల్ కళాశాల సీనియర్ విద్యార్థులు తమకు జూనియర్లు మర్యాద ఇవ్వడంలేదనే అక్కసుతో ఈ నెల 9వ తేదీన వారిని కళాశాలలోని హాస్టల్కు పిలిపించారు. అనంతరం వారి దుస్తులు విప్పించి రెండు గంటలపాటు మోకాళ్లపై నిల్చోబెట్టి ర్యాగింగ్కు పాల్పడ్డారు. ఎవరికైనా చెబితే బాగుండదని హెచ్చరించారు. దీంతో బాధిత విద్యార్థులు ర్యాగింగ్ విషయాన్ని బయటకు వెల్లడించలేదు. కాగా వారిలో కొందరు బుధవారం ఈ విషయమై ఫిర్యాదు చేయడంతో సుల్తాన్బజార్ పోలీసులు ఉస్మానియా మెడికల్ కళాశాల హాస్టల్కు వెళ్లి నలుగురు సీనియర్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్టేషన్ బెయిల్పై విడుదల చేశారు. ర్యాగింగ్కు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ శివశంకర్ హెచ్చరించారు. ఈ కేసులో ఇంకా ఎంతమంది సీనియర్ విద్యార్థులున్నారో పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ఉస్మానియాలో లైంగిక వేధింపులపై విచారణ
హైదరాబాద్ : హౌస్ సర్జన్లు ఇచ్చిన ఫిర్యాదుపై ఉస్మానియా మెడికల్ కళాశాలలో శుక్రవారం విచారణ ప్రారంభమైంది. అసిస్టెంట్ ప్రొఫెసర్లు బాబూరావు, శ్రీధర్లు తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ నెల రోజుల క్రితం హౌస్ సర్జన్లు ఆరోగ్య శాఖ మంత్రికి ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారులు ఏర్పాటు చేసిన కమిటీ ఫిర్యాదుదారులను విచారించింది. ఇద్దరు సభ్యుల ఈ బృందానికి డీఎంఈ రమణి నేతృత్వం వహించారు. -
9న గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర మహాసభ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర మహాసభను ఈ నెల 9న హైదరాబాద్ కోఠిలోని ఉస్మానియా మెడికల్ కళాశాలలో నిర్వహించనున్నారు. ఈ మేరకు గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ప్రకటన విడుదల చేసింది. వీఆర్వోలకు ఆర్ఐలుగా ప్రొబేషన్ డిక్లరేషన్, గ్రామాల్లో వీఆర్వో కార్యాలయాల ఏర్పాటు, ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు, కారుణ్య నియామకాలు తదితర అంశాలపై మహాసభలో చర్చించనున్నట్లు సంఘం పేర్కొంది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోల్కొండ సతీశ్ అధ్యక్షతన జరగనున్న ఈ మహాసభల్లో రాష్ట్ర మంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, ఈటల రాజేందర్, హరీశ్రావు, నిజామాబాద్ ఎంపీ కవితతోపాటు తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్, ఉద్యోగ సంఘాల నేతలు దేవీప్రసాద్, కారం రవీందర్రెడ్డి, కె.భిక్షపతి, రాజేశ్ తదితరులు పాల్గొంటారని తెలిపింది. -
ఆరోగ్య తెలంగాణే లక్ష్యం: మంత్రి లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ‘ఆరోగ్య తెలంగాణ’ లక్ష్యంగా పనిచేస్తోందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్లోని ఉస్మానియా మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో ‘పెంటావలెంట్’ టీకాను ఆయన ప్రారంభించారు. కొందరు చిన్నారులకు మంత్రి సమక్షంలో ఆరోగ్య కార్యకర్తలు టీకాలు వేశారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ శిశు మరణాల రేటును తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇప్పటికే మహబూబ్నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ‘ఇంద్రధనస్సు’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. పేదలకు మంచి వైద్యం ఇవ్వాలనేది సర్కారు ఉద్దేశమని తెలి పా రు. ఐదువ్యాధులకు పెంటావలెంట్ టీకా ఉపయోగపడుతుందని వైద్యఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ చందా అన్నారు. ఇప్పటికే కేరళ, తమిళనాడుల్లో దీన్ని అమలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ప్రజారోగ్య సంక్షేమ కమిషనర్ జ్యోతి బుద్దప్రకాశ్, సంచాలకులు లలిత కుమా రి, డీఎంఈ రమణి, వైద్య విధాన పరిషత్ కమిషనర్ వీణాకుమారి పాల్గొన్నారు. -
చిన్నారుల రక్షణకు ‘పెంటావలెంట్’ టీకా
3న ఉస్మానియా మెడికల్ కాలేజీలో ప్రారంభం సాక్షి, హైదరాబాద్: ప్రాణాంతకమైన కంఠసర్పి, కోరింత దగ్గు, ధనుర్వాతం, హెపటైటిస్-బి, ఇన్ఫ్లూయెంజా.. ఈ ఐదు వ్యాధుల నుంచి చిన్నారులను రక్షించేందుకు ప్రవేశపెట్టనున్న ‘పెంటావలెంట్’ టీకాను ఈ నెల 3న ప్రారంభించడానికి టీ సర్కారు ప్రయత్నాలు ప్రారంభించింది. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు ఉస్మానియా మెడికల్ కళాశాల ఆడిటోరియంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి టీకాను ప్రారంభిస్తారు. పెంటావలెంట్ టీకాపై ప్రభుత్వం రాష్ట్రస్థాయి టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసి దీన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఇప్పటికే జిల్లాస్థాయి అధికారులకు ఈ టీకాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అన్ని జిల్లా, మండల కేంద్రాలు మున్సిపాలిటీలు, మార్కెట్ సెంటర్లు, రైల్వే, బస్స్టేషన్లు, సినిమా థియేటర్లలో పోస్టర్లు, హోర్డింగ్లను ఏర్పాటు చేశారు. తరచుగా వచ్చే సందేహాలపై చిన్నపాటి గైడ్ను తెలుగులో తయారుచేసి జిల్లాలకు పంపిం చారు. వీటిని ఆశ, ఏఎన్ఎం తదితర వైద్య సిబ్బందికి అందజేశారు. రాష్ట్ర అవసరాల కోసం 11 లక్షల డోసుల టీకాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటిని ఇప్పటికే జిల్లాల వారీగా పంపిణీ చేశారు. -
ఉస్మానియా వైద్య కళాశాలలో ఉద్రిక్తత
జూనియర్ డాక్టర్ల అరెస్టు, విడుదల కళాశాల భవనం ఎక్కి ఆందోళన చేసిన జూడాలు హైదరాబాద్: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కోఠిలోని ఉస్మానియా వైద్య కళాశాలలో సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లను గురువారం పోలీసులు అరెస్టు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అరెస్టులను నిరసిస్తూ ప్రభుత్వం, డీఎంఈ లకు వ్యతిరేకంగా జూడాలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నలుగురు జూడాలు కళాశాల భవనం పైకి వెళ్లి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. జూడాల నాయకులు, పోలీసులు సముదాయించడంతో కిందికి దిగారు. అరెస్టులో భాగం గా పోలీసులు తమపై దురుసుగా వ్యవహరించారని సెల్ఫోన్లు లాక్కొని, దీక్ష శిబిరంలో టెంట్లను తొలగించారని మండిపడ్డారు. పోలీసు లు కళాశాల గోడలు దూకి దీక్ష శిబిరంలో నిద్రపోతున్న తమను బలవంతంగా అరెస్టు చేశారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం తమ సమ్మెను భగ్నం చేసేందుకు పోలీసులను ఉసిగొల్పుతుందన్నారు. పోలీసులు 1022 సెక్షన్ను సాకుగా చూపి తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని జూడాల నేతలు స్వప్నిక, నరేశ్ ఆరోపించారు. ఏడాదిపాటు గ్రామీణ ప్రాంతంలో పనిచేయాలనే నిబంధన రద్దు చేయాలని కోరారు. కాగా, శుక్రవారంతో జూడాల నిరసన 26వ రోజుకు చేరింది. -
ఉస్మానియా మెడికల్ కాలేజీ వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్: జీవో 107ను వెంటన రద్దు చేయాలని జానియర్ డాక్టర్లు శుక్రవారం తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవోను నిరసిస్తూ కాలేజీ మెట్లపైనే జూడాలు తమ దీక్షను కొనసాగిస్తున్నారు. దీంతో ఉస్మానియా మెడికల్ కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. భారీగా పోలీసులు మొహరించారు. జూడాల సమ్మెకు ఓయూ జేఏసీ మద్దతు తెలిపింది. జూడాలు గ్రామీణ ప్రాంతంలో విధులు నిర్వర్తించాలని తెలంగాణ ప్రభుత్వం జీవో 107ను జారీ చేసింది. ఆ జీవోను నిరసిస్తూ జూడాలు గత 26 రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. -
ఉస్మానియా మెడికల్ కాలేజీ వద్ద ఉద్రిక్తత
-
ఉస్మానియా మెడికల్ కాలేజీ వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్: కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ వద్ద గురువారం తెల్లవారుజామున ఉద్రిక్తత నెలకొంది. జూడాలు దీక్షా శిబిరాన్ని పోలీసులు తొలగించారు. దీంతో పోలీసుల ప్రయత్నాన్ని జూడాలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో జూడాలు, పోలీసుల మధ్య తీవ్ర తొపులాట చోటు చేసుకుంది. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ 50 మంది జూడాలను పోలీసులు అదుపులోకి తీసుకుని సుల్తాన్ బజార్ పోలీసు స్టేషన్కు తరలించారు. జూడాలు గ్రామీణ ప్రాంతంలో విధులు నిర్వర్తించాలని తెలంగాణ ప్రభుత్వం జీవో 107ను జారీ చేసింది. ఆ జీవోను నిరసిస్తూ జూడాలు గత 25 రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. -
ఆమరణ నిరాహార దీక్షకూ వెనుకాడం
ప్రభుత్వానికి జూనియర్ వైద్యుల హెచ్చరిక కేసీఆర్ స్ఫూర్తితోనే సమ్మె చేస్తున్నామని వ్యాఖ్య జీవో 107ను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ హైదరాబాద్: తమ సమస్యలను పరిష్కరించకపోతే కేసీఆర్ ఇచ్చిన స్ఫూర్తితో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడానికి కూడా వెనుకాడబోమని జూనియర్ డాక్టర్లు హెచ్చరించారు. సోమవారం ఉస్మానియా వైద్య కళాశాలలో ‘నీవే మాకు స్ఫూర్తి’ అంటూ సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు పట్టుకొని నిరసన తెలిపారు. గాంధీ ఆస్పత్రిలోనూ విధులు బహిష్కరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జీవో నెంబర్ 107ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, సుల్తాన్ బజార్, పేట్లబురుజు, ఈఎన్టీ, సరోజినీదేవీ కంటి ఆస్పత్రులకు చెందిన సుమారు 1,700 మంది జూనియర్ వైద్యులు గత 22 రోజుల నుంచి సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. జూడాలంతా సమ్మెలోకి వెళ్లడంతో ఆయా ఆస్పత్రులకు వచ్చిన రోగులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఈ సందర్భంగా జూడాల సంఘం ప్రతినిధులు శ్రీనివాస్, స్వప్నిక, రాఘవేంధ్ర , అనిల్, రామ్చందర్, రమేశ్లు మాట్లాడుతూ తమ విజ్ఞప్తులకు ప్రభుత్వం స్పందించక పోవడం వల్లే గత్యంతరం లేని పరిస్థితుల్లోనే సమ్మెకు దిగాల్సి వచ్చిందన్నారు. జూడాలు ధర్నాకు దిగితే అండగా ఉంటానని కేసీఆర్ గతంలో హామీ ఇచ్చారని, ఆయన స్ఫూర్తితోనే సమ్మె కొనసాగిస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతంలో పనిచేయకుంటే తమకు రిజిస్ట్రేషన్ నిలిపివేస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తోందని, ఇది ఎంసీఐ నిబంధనలకు విరుద్ధమన్నారు. వైద్యశాఖ మంత్రి చర్చల పేరుతో తమను సచివాలయానికి పిలిచి అవమానించడమే కాకుండా సమస్యలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. -
ముగ్గురూ ముగ్గురే!
ఆ ముగ్గురూ ముగ్గురే. ఒకే రక్తం పంచుకుని పుట్టిన ఈ బ్రదర్స్ అండ్ సిస్టర్ ఐక్యూ కూడా ఒకటే రేంజ్లో ఉంది. అందుకే చదువుల్లో అదరగొడుతూ.. ఎంబీబీఎస్ చేరిన ఈ ముగ్గురు ఎక్కడ క్విజ్ పోటీలు జరిగినా ప్రత్యక్షమవుతారు. ఎలాంటి ప్రశ్నలకైనా తడుముకోకుండా సమాధానం చెప్పి కప్పు కొట్టేస్తారు. సిటీకి చెందిన ముస్తఫా హస్మీ, ముర్తుజా హస్మీ, అస్నా హస్మీ హైదరాబాద్లోని ముఫఖంజా కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో శనివారం జరిగిన ‘స్వీడన్ ఇండియా నోబెల్ మెమోరియల్ క్విజ్-2014’లో విజేతలుగా నిలిచారు. న్యూఢిల్లీలో నవంబర్ ఒకటిన జరిగే జాతీయ క్విజ్ పోటీలకు హైదరాబాద్ నుంచి పోటీపడేందుకు అర్హత సాధించారు. ఈ ముగ్గురిలో ముస్తఫా హస్మీ పెద్దవాడు. ఎనిమిదో తరగతి వరకు దుబాయ్, సౌదీ, హైదరాబాద్లో చదివిన ముస్తఫా.. తర్వాత హైదరాబాద్లో చదివాడు. ప్రస్తుతం ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాడు. ఎల్కేజీలో ఉన్నప్పుడే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో గాంధీజీ వస్త్రధారణతో ముస్తఫా తొలి బహుమతి పొందాడు. ఆ స్ఫూర్తితో అన్నిరకాల పోటీల్లో గెలుస్తూ వచ్చాడు. 2007 ‘అక్వారిజియా క్విజ్’లో రెండో స్థానం సాధించి గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నాడు. తర్వాత దక్షిణ కొరియాలో జరిగిన ఇంటర్నేషనల్ బయోలజీ ఒలింపియాడ్లో రజిత పతకం పొందాడు. 2010 ఎంసెట్ మెడిసిన్లో ముస్తఫా పదోర్యాంక్ సాధించాడు. 2012లో అమితాబ్బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘కౌన్ బనేగా కరోడ్పతి సీజన్ -6’లో 50 లక్షల ప్రశ్న వరకు వెళ్లిన ముస్తఫా చిన్న తప్పిదంతో రూ.80 వేలతో సరిపెట్టుకున్నాడు. గతేడాది ముంబైలో జరిగిన ‘టాటా ఫినాన్స్ క్విజ్’లో విజేతగా నిలిచాడు. గత ఫిబ్రవరిలో ఎన్డీటీవీ టెక్ గ్రాండ్ మాస్టర్స్ క్విజ్లో విన్నయ్యాడు. అన్న బాటలో తమ్ముడు, చెల్లి.. ముస్తఫా సోదరుడు ముర్తుజా హస్మీ, సోదరి అస్నా హస్మీలు కూడా ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. వీరు కూడా పలు జనరల్ నాలెడ్జ్, ఉపన్యాస, వక్తృత ్వ పోటీల్లో గెలుపొందారు. ఈ నెల 8న కౌన్ బనేగా కరోడ్పతిలో ముర్తుజా పాల్గొన్నాడు. 2012లో లిమ్కా బుక్ నిర్వహించిన నేషనల్ క్విజ్ విభాగంలో రెండో స్థానంలో నిలిచాడు. అస్నా హస్మీ స్వీడన్ ఇండియా నోబెల్ మెమోరియల్ క్విజ్లో విజయం సాధించింది. పేరెంట్స్ ప్రోత్సాహం.. ‘నాన్న ఖాలీద్ హస్మీ.. కిర్బి కంపెనీ వైస్ ప్రెసిడెంట్, అమ్మ అసీమున్నీస ఎమ్మెస్సీ, బీఈడీ చేసింది. మేము అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని వాళ్లు ప్రోత్సహించారు. ఎక్కడ క్విజ్ పోటీలు జరిగినా తీసుకెళ్లేవారు. మేం వైద్యులు కావాలన్నమా కన్నవారి కలలను నిజం చేస్తున్నాం. జీవితంలో స్థిరపడ్డాక సామాజిక సేవ చేయాలనుకుంటున్నాం. నవంబర్ 1న న్యూఢిల్లీలో జరిగే జాతీయ క్విజ్ పోటీల్లో విజయం సాధించి.. స్వీడన్లో వారం రోజులు పర్యటించే చాన్స్ దక్కించుకుంటాం’ అని అంటున్నారు ఈ ముగ్గురు. ఇంటర్నెట్ సపోర్ట్.. పుస్తకాలు, దినపత్రికలతో పాటు ఇంటర్నెట్ ఎక్కువగా వాడుతుంటామని చెబుతున్నారు. అటు ఎంబీబీఎస్, ఇటు క్విజ్ పోటీలకు చదవడం ఇబ్బందైనా.. ఓ చాలెంజ్గా తీసుకొని రాణిస్తున్నామని తెలిపారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలమని నిరూపిస్తున్నారు ఈ హైదరాబాదీలు. - వాంకె శ్రీనివాస్ -
లెట్స్ ఎంజాయ్
ఉస్మానియా మెడికల్ కళాశాల లో విద్యార్థులు సందడి చేశారు. పుస్తకాలు, చదువులు, రాతలు అన్నీ పక్కన పెట్టారు. సరదాగా కాసేపంటూ రంగులకేళిలో ఆకాశమే హద్దుగా ఎంజాయ్ చేశారు. పసందైన పాటలకు అదిరిపోయే స్టెప్పులతో మస్తీ మజా చేశారు. డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ 2కే10 మ్యాథ్స్ విద్యార్థుల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన బీట్స్-2014 విద్యార్థుల ఆటపాటలతో హుషారుగా సాగిపోయింది. బీట్స్ కేక్ కట్ చేసి స్నేహితులతో ఆనందాన్ని పంచుకున్నారు. ర్యాప్ స్టెప్స్తో ఉల్లాసంగా ఉత్సాహంగా గ డిపారు. వారం రోజులు జరగనున్న ఈ ఈవెంట్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ విద్యార్థులకు రిలాక్సేషన్ కలిగిస్తాయని కార్యక్రమాన్ని ప్రారంభించిన డీ ఎంఈ డాక్టర్ పుట్టా శ్రీనివాసరావు అన్నారు. పరీక్షల ముందు విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించడానికి ఏటా ఇలాంటి ఈవెంట్స్ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రమణి, డాక్టర్ సంధ్య తదితరులు పాల్గొన్నారు. - గజ్జెల వీరేశ్ -
ప్రశాంతంగా టీజీడీఏ ఎన్నికలు
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం(టీజీడీఏ) యూనిట్ల ఎన్నికల ఫలితాలు సోమవారం రాత్రి ప్రకటించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు నిర్వహించారు. అనంతరం రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో ఓట్లు లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. కాగా ఒక్కో యూనిట్లో 19 పోస్టులకు ఎన్నికలు నిర్వహించగా, సుమారు 1500 మంది వైద్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఫలితాలు ఇలా ఉన్నాయి.. యూనిట్-1లో.. ఉస్మానియా యూనిట్-1 పరిధిలో ఉస్మానియా వైద్యకళాశాల, ఉస్మానియా ఆస్పత్రి, సుల్తాన్బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, ఉస్మానియా దంత వైద్య కళాశాల ఉన్నాయి. ఇక్కడ 350 ఓట్లకు గాను 346 ఓట్లు పోలయా ్యయి. నూతన అధ్యక్షుడిగా ఉస్మానియా ఆస్పత్రి సర్జరీ విభాగం అధిపతి డాక్టర్ బి.నాగేందర్ విజయం సాధించారు. ప్రధాన కార్య దర్శిగా మెడిసిన్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి.బాలరాజు, కోశాధికారిగా అనెస్థీయా ఇన్చార్జి డాక్టర్ పాండునాయక్, జనరల్ కౌన్సిల్ మెంబర్గా డాక్టర్ రాజు విజయం సాధించారు. యూనిట్-2లో.. ఉస్మానియా యూనిట్-2 పరిధిలో నిలోఫర్, ఎంఎన్జే క్యాన్సర్ ఆస్పత్రి, సరోజినిదేవి కంటి ఆస్పత్రి, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి, ఎర్రగడ్డలోని ఛాతి, మానసిక చికిత్సాలయం, ఐపీఎం నారాయణగూడ, ఈఎన్టీ ఆస్పత్రి ఉన్నాయి. ఇక్కడ 300 మంది ఓటర్లకు 295 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. నూతన అధ్యక్షుడిగా సరోజినిదేవి కంటి ఆస్పత్రి డాక్టర్ రవీందర్గౌడ్ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ లక్ష్మీనారాయణ, కోశాధికారిగా డాక్టర్ వినోద్కుమార్, జనరల్ కౌన్సిల్ మెంబర్స్గా తరుణి, మురళీధర్రావు, సీఈసీ మెంబర్గా నరహరి గెలుపొందారు. గాంధీ యూనిట్లో.. గాంధీ మెడికల్ కళాశాల, గాంధీ జనరల్ ఆస్పత్రి యూనిట్లో 350 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ మొత్తం 20 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. నూతన అధ్యక్షుడిగా గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం అధిపతి డాక్టర్ శ్రవణ్కుమార్ విజయం సాధించారు. కార్యదర్శిగా డాక్టర్ సిద్ధిపేట రమేష్, కోశాధికారిగా కె.భూమేష్కుమార్, ఉపాధ్యక్షులుగా కె.రాణి, రమేష్బాబు, సంయుక్త కార్యదర్శిగా శోభ, జనరల్ కౌన్సిల్ మెంబర్గా త్రిలోక్ చందర్, జనరల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ప్రశాంత్ ఎన్నికయ్యారు. -
మెడీ కూచిపూడి!
హార్మోనల్ సింఫనీ ఆయన ఉస్మానియా మెడికల్ కాలేజీ ఎండోక్రైనాలజీ విభాగంలో ప్రొఫెసర్. దేహనిర్మాణం, గ్రంథుల పనితీరు, వాటి సమన్వయం గురించి పాఠాలు చెప్పే గురువు. హఠాత్తుగా ఓ రోజు కాలికి గజ్జెకట్టి కూచిపూడి నాట్యం చేశారు. ఆ నృత్యరూపకం కూడా దేహధర్మాల ఇతివృత్తంతోనే. వైద్యశాస్త్రాన్ని, సంప్రదాయ శాస్త్రీయ నృత్యాన్ని కలబోశారు డాక్టర్ జయంతీరమేశ్. కూచిపూడి చరిత్రలోనే ఇదో వినూత్న ప్రక్రియ! కూచిపూడి నాట్యంలో పౌరాణిక, సామాజిక, చారిత్రక ఇతివృత్తాలకు నాట్యరూపం ఇచ్చాను. వైద్యరంగాన్ని నాట్యంతో సమ్మేళనం చేయాలనే ఆలోచన కొత్తది. ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ. ఇది ఒక కథ కాదు. దేహనిర్మాణాన్ని చెప్పాలి. కంటికి కనిపించని హార్మోన్లను పరిచయం చేయాలి. వాటి పనితీరును కళ్లకు కట్టాలి. ఇందుకు కూచిపూడి నాట్యంలో ముద్రలు లేవు. ఇంత కష్టపడ్డా డాక్యుమెంటరీలా తప్ప నాట్యప్రయోగంలా అనిపించదేమోననే సందేహం ఒక పక్క. అయినా సరే శాస్త్రాన్ని, శాస్త్రీయ నృత్యానికి ఆపాదిస్తూ బాలేని రూపొందించాం. ఈ రూపకంలో మేము చెప్పదలుచుకున్న సందేశం చక్కగా ప్రసారమైంది. పధ్నాలుగు మంది పాల్గొన్న ఈ బాలే ప్రేక్షకులను అలరించింది కూడ. - భాగవతుల సేతురామ్, కూచిపూడి నాట్యాచార్యులు, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏప్రిల్ ఆరు ఆదివారం సాయంత్రం. హైదరాబాద్లోని సత్యసాయి నిగమాగమంలో సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతున్నాయి. మర్నాడు అంటే ఏప్రిల్ ఏడున ప్రపంచ ఆరోగ్యదినోత్సవం సందర్భంగా జరుగుతున్న వేడుకలవి. డాక్టర్ జయంతీరమేశ్ బృందం ‘హార్మోనల్ సింఫనీ’ నృత్యరూపకం ప్రదర్శిస్తోంది. ఆద్యంతం రసవత్తరంగా సాగిన వైద్యనాట్యరూపకానికి గొప్ప ప్రశంస లభించింది. ఇదో వినూత్న ప్రయోగమని కితాబిచ్చారు నాట్యకారులు. ఇంతకీ ఈ ప్రయోగం చేయాలనే ఆలోచన ఎలా వచ్చిందని డాక్టర్ జయంతీరమేశ్ని అడిగినప్పుడు ‘నా పేషెంట్లు, వారి అనారోగ్యాలే’ అన్నారాయన. డాక్టర్ జయంతీరమేశ్ది విశాఖపట్నం. బాల్యం విశాఖ, గుంటూరు, తిరుపతిల్లో గడిచింది. స్వతహాగా కళల పట్ల ఆసక్తి ఉండడంతో మెడిసిన్లో చేరడానికి ముందు రెండేళ్లపాటు వైజాగ్లో ‘కూచిపూడి’ నేర్చుకున్నారు. ఆ తర్వాత కొంతకాలం వైద్యవిద్యతోపాటు ఒడిస్సీ సాధన చేసినప్పటికీ దానిని కొనసాగించలేకపోయారు. క్రమంగా వైద్యరంగంలో నిమగ్నమయ్యారు. వృత్తిలో ఎంతగా విలీనమైనప్పటికీ తన కళాభినివేశాన్ని మరవలేదు. అలాంటి స్పందనల్లో ఒకటి ఇలా నాట్యరూపకంగా మనముందుకొచ్చింది. అదే విషయాన్ని చెప్తూ ‘‘మా దగ్గరకు వచ్చే పేషెంట్లను చూస్తుంటే బాధ కలుగుతుంది. స్థూలకాయం, మధుమేహం, గుండెజబ్బులు, మహిళల్లో పీసీఓడీ వంటివన్నీ జీవనశైలిలో చోటు చేసుకున్న విపరీత పరిణామాల వల్ల వస్తున్నవే. ఆ విషయం పేషెంట్లకు చెప్తూనే ఉన్నా... ఎంతమందికని చెప్పగలను? నా దగ్గరకు వచ్చిన వారికి చెప్పగలను. వైద్యనిపుణుడిగా సదస్సులు పెట్టి పవర్పాయింట్ ప్రెజెంటేషన్స్ ద్వారా వివరించవచ్చు. కానీ ఆ ప్రదర్శనకు ఎంతమందిని ఆకర్షించగలననేది మరో ప్రశ్న. అందుకే సాంస్కృతిక మాధ్యమాన్ని ఎంచుకున్నాను’’ అంటారు. రూపకల్పన కోసం... ఈ తరం పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కోసమే ఈ ప్రయత్నం అంటూ తన ప్రయత్నాలను వివరించారు. ‘‘నా ఆలోచనలు, భావాలను పాట రాసుకున్నాను. ఆ గేయానికి తగినట్లు కొరియోగ్రఫీ చేయడానికి చాలామంది ప్రముఖ నాట్యకారులను కోరాను. నా సంకల్పానికి ఆ దేవుడే అన్నీ అమర్చినట్లు భాగవతుల సేతురాం గారిని కలిపారు. ఆయన సంతోషంగా ఆ పనిలో మునిగిపోయారు. నేను ఈ రూపకం కోసం మళ్లీ నాట్యసాధన చేశాను’’ అన్నారు. ఆవిడే యాంకర్! రమేశ్ ప్రయత్నానికి అన్ని విధాలా సహకరిస్తున్నారు ఆయన శ్రీమతి డాక్టర్ శ్రీవల్లి. ఇదో సృజనాత్మకమైన ఆలోచన అంటారామె. ‘‘నేను థైరాయిడ్ సర్జన్ని. హార్మోన్ల అసమతౌల్యతతో వస్తున్న సమస్యలకు వైద్యం చేస్తుంటాను. కాబట్టి రమేశ్ ఈ నాట్యరూపకం గురించి చెప్పినప్పుడు ఎంతగా ఉద్వేగానికి లోనయ్యానంటే... ఇందులో నేను చేయగలిగింది ఏమైనా ఉందా అనిపించింది. రమేశ్ తెలుగులో రాసిన గేయాన్ని ఇంగ్లిష్లోకి తర్జుమా చేశాను. ఈ హార్మోనల్ సింఫనీ రూపకాన్ని మొదట ఫిబ్రవరి ఒకటిన హైటెక్స్లో ఇంగ్లిష్ వెర్షన్లోనే ప్రదర్శించారు. వైద్యరంగానికి సంబంధించిన విదేశీ ప్రముఖులు హాజరైన కార్యక్రమం అది. ‘దేహనిర్మాణం- దాని పనితీరును భారతీయ సంప్రదాయ నాట్యరీతిలో చూడడం చాలా గొప్ప అనుభూతినిచ్చింది’ అని ప్రశంసిస్తూ ఇప్పటి పరిస్థితుల్లో ఇది చాలా అవసరమన్నారు వారంతా’’ అన్నారు శ్రీవల్లి. ఇతివృత్తం! ‘‘ప్రకృతితో మమేకమై మనిషి జీవించాలి. అప్పుడే ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఆస్వాదించగలం. ఆధునికతను స్వాగతించాలి. కానీ ప్రకృతికి దూరంగా వెళ్లకూడదు. ప్రకృతి విరుద్ధంగా సాగే జీవనంలో వికృతం విలయతాండవం చేయకముందే మేలుకో... అనే సందేశం ఉంటుంది. మనం ప్రకృతి క్రమాన్ని నిర్లక్ష్యం చేస్తే హార్మోన్ల విడుదల కూడా క్రమం తప్పుతుంది. హార్మోన్ల విడుదల తీరు నాట్య లయకు తగినట్లు ఉంటుంది. నిర్దిష్టమైన చర్య ఉన్నప్పుడు దానికి ప్రతిచర్య కూడా అంతే నిర్దిష్టంగా ఉంటుంది. ఈ వరుస తప్పకూడదు. ఈ విషయాల పట్ల చైతన్యవంతం చేయడానికి దేశమంతా పర్యటించి ప్రదర్శన ఇవ్వాలనుకుంటున్నాను’’ అన్నారు. -
మరో ఘోరం..!
=అధిక రక్తస్రావంతో బాలింత మృతి =‘నిలోఫర్’లో మార్మోగుతున్న చావుకేకలు సాక్షి, సిటీబ్యూరో: పురిటి నొప్పులు వినాల్సిన చోట చావుకేకలు మార్మోగుతున్నాయి. పండంటి బిడ్డను కనేందుకు వచ్చిన పేదల తల్లలు బతుకులు నిలోఫర్ ఆస్పత్రిలోనే తెల్లారిపోతున్నాయి. వైద్యుల నిర్లక్ష్యం, మౌలిక వసతుల లేమీ వల్ల మంగళవారం షాపూర్నగర్కు చెందిన భారతి(20) అనే బాలింత మృతి చెందగా, తాజాగా, జగద్గిరిగుట్టకు చెందిన ఓ గర్భిణి ప్రసవం కోసం నిలోఫర్ ఆస్పత్రికి వెళ్లింది. బిడ్డ కడుపులోనే కన్నుమూసింది. అధిక రక్తస్రావం అవుతున్న ఆ బాలింతను బుధవారం మధ్యాహ్నం ఉస్మానియాకు తరలించగా, ఆమె సాయంత్రం 4 గంటలకు కన్నుమూసింది. రెండు మాసాల్లో ఏడుగురు మృతి... ఉస్మానియా మెడికల్ కళాశాలకు అనుబంధంగా కొనసాగుతోన్న నిలోఫర్ చిన్నపిల్లల ఆస్పత్రిలో రోజుకు సగటున 20 ప్రసవాలు జరుగుతున్నాయి. ప్రసవ సమయంలో తలెత్తే సమస్యలను నివారించేందుకు అవసరమైన ఏర్పాట్లు ఈ ఆసుపత్రిలో లేవు. అధిక రక్తపోటు, విపరీతమై రక్తస్రావంతో బాధపడుతున్న తల్లులను వెంటనే క్రిటికల్ కేర్ యూనిట్కు తరలించి, వైద్యం అందించాల్సి ఉంది. ఇక్కడ అలాంటి ఏర్పాట్లు లేవు. నిత్యం 20 మంది గర్భిణులు, బాలింతలు ఉండే లేబర్ వార్డులో ఒక్క వెంటిలేటర్ కూడా లేదంటే అతిశయోక్తి కాదు. ఫలితంగా గత 2 మాసాల్లో ఏడుగురు బాలిం తలు చనిపోయినట్టు విశ్వనీయంగా తెలిసింది. అత్యవసర పరిస్థితుల్లో బాలింతలను ఉస్మానియాకు తరలించి చేతులు దులుపుకుంటున్నారు తప్ప.. వీటి ఏర్పాటుకు అధికారులు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. కుర్చీలోంచి కదలని ఆర్ఎంఓలు... నిరుపేదలనే కనికరం లేకుండా ఇక్కడి సిబ్బంది రోగుల బంధువుల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. బాబు పుడితే రూ.1000, పాప పుడితే రూ.500 వసూలు చేస్తున్నారు. చివరకు బాలింతలను పరామర్శించాలన్నా... కొనఊపిరితో ఉన్న నవజాత శిశువు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవాలన్నా....అడిగినంతా ఇ చ్చుకోవాల్సిందే. దీనిపై బాధితులు ఆర్ఎంఓకు ఫిర్యా దు చేసినా పట్టించుకోరు. ఇలా వసూలు చేసిన సొ మ్ములో సదరు ఆర్ఎంకు కూడా వాటాలు అందుతున్నట్లు సమాచారం. ఎప్పటికప్పుడు వార్డుల్లో రౌండ్స్ నిర్వహించి, వైద్యులు, ఇతర సిబ్బంది పని తీరు, రోగుల ఇబ్బందులపై ఆరా తీయాల్సిన ఆర్ఎంఓలు కూర్చున్న కుర్చీలోంచి లేవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అవాస్తవం.. ఆసుపత్రిలో గత రెండు నెలల్లో ఏడుగురు బాలింతలు మృతి చెందినట్టు వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. గర్భిణులకు అవసరమైన సేవలందిస్తున్నాం. మంగళవారం చోటుచేసుకున్న భారతి మృతిపై విచారణ జరిపిస్తున్నాం. - దేవరాజ్ , నిలోఫర్ ఆస్పత్రి, సూపరింటెండెంట్ -
హైదరాబాద్లో 9% మందికి ‘థైరాయిడ్’!
హైపోథైరాయిడిజమ్ పీడితుల్లో భాగ్యనగరమే టాప్ సాక్షి, హైదరాబాద్: దేశంలోని ప్రధాన పట్టణాల్లో థైరాయిడ్ సమస్యలు బాగా పెరుగుతున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. హైదరాబాద్తోపాటు ఢిల్లీ, కోల్కతా, చెన్నై, బెంగళూరు, గోవా, ముంబై, అహ్మదాబాద్లలో నిర్వహించిన ఈ అధ్యయనంలో.. 11 శాతం మంది థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నట్లు తేలింది. ఈ వివరాలను బుధవారం హైదరాబాద్లో ఉస్మానియా మెడికల్ కాలేజీ ఎండోక్రైనాలజిస్ట్ రాకేశ్కుమార్ సహాయ్ మీడియాకు తెలిపారు. 5,360 మంది రక్త నమూనాలను పరీక్షించగా.. 10.95 శాతం మంది హైపో థైరాయిడిజమ్ (థైరాయిడ్ గ్రంథి తక్కువస్థాయిలో పనిచేయడం)తో బాధపడుతున్నారని తెలిసిందని వివరించారు. హైదరాబాద్లో వీరి సంఖ్య 9 శాతం ఉందని.. మిగతా నగరాలతో కంటే ఇక్కడే వీరి సంఖ్య ఎక్కువగా ఉందన్నారు.