prakasam distirct
-
అమెరికా వెళ్లాక గర్ల్ఫ్రెండ్ హ్యాండిచ్చిందని..
ప్రేమ పేరుతో వంచించి తన ఆర్థిక అవసరాలన్నీ తీర్చుకున్న ఓ యువతి తిరస్కరించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం ప్రకాశం జిల్లాలో (Prakasam District) బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు గ్రామానికి చెందిన కందుల ప్రవీణ్ (27) ఇంజినీరింగ్ విద్య పూర్తి చేసి తండ్రికి వ్యాపారంలో తోడుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఒంగోలుకు (Ongole) చెందిన వాకా హరిణి లక్ష్మి అనే యువతి ప్రవీణ్కు ఐదేళ్ల కిందట పరిచయం కావడంతో పరిచయం కాస్తా ప్రేమగా మారి ఇద్దరూ కలిసి హైదరాబాదులో (Hyderabad) కొద్దికాలం పాటు ప్రైవేటు ఉద్యోగం చేశారు.ఈ క్రమంలో యువతి ఈ చిన్న ఉద్యోగాలు తాను చేయలేనని, ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లడానికి సహకరించాలని కోరడంతో ప్రవీణ్ తనకున్న పరిచయాలతో అందినకాడికి డబ్బులు తెచ్చి హరిణి లక్ష్మిని ఏడాదిన్నర క్రితం అమెరికా పంపించాడు. ఆమె అమెరికా వెళ్లిన తరువాత అక్కడ ఆమె మరో స్నేహితురాలు యామిని చౌదరితో కలిసి ప్రవీణ్కు ఫోన్ చేసి ‘నీవంటే నాకిష్టం లేదని.. తనను మరచిపో’ అంటూ చెప్పింది. ఈ క్రమంలో తమ కుమార్తెను ప్రవీణ్ వేధిస్తున్నాడంటూ యువతి తల్లిదండ్రులు రెండు నెలల కిందట ఒంగోలు ఒన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ప్రవీణ్తో పాటు అతని తండ్రి కందుల డానియేలును పోలీస్ స్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు.అనంతరం ఎవరి తీరున వారు ఉన్న క్రమంలో ఇటీవల నుంచి మళ్లీ హరిణి లక్ష్మి, ఆమె స్నేహితురాలు యామిని చౌదరి తిరిగి ప్రవీణ్కు ఫోన్ చేసి డబ్బులు పంపించాలని లేకపోతే వేధింపులు ఆపడం లేదని మళ్లీ ఫిర్యాదు చేస్తామని బెదిరింపులకు దిగడంతో ప్రవీణ్ తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యాడు. ఆ విషయాన్ని యువతి హరిణిలక్ష్మికి చెప్పి మరీ బుధవారం సాయంత్రం ఉప్పుగుండూరు గ్రామంలోని తన ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో గురువారం మధ్యాహ్నం మృతుడి బంధువులు పోలీస్స్టేషన్కు చేరుకుని ఆందోళన చేశారు. కాగా, మృతుడి తండ్రి కందుల డానియేలు ఫిర్యాదు మేరకు యువతి వాకా హరిణి లక్ష్మి, ఆమె తండ్రి తిరుమలరావు, స్నేహితురాలు యామిని చౌదరిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ అజయ్బాబు తెలిపారు.భార్య తనతో డాన్స్ చేయడానికి రాలేదని.. ఉలవపాడు: సంక్రాంతి సంబరాల్లో భార్య తనతో డాన్స్ చేయడానికి రాలేదని మనస్తాపంతో భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన నెల్లూరు జిల్లాలో (Nellore District) బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ఉలవపాడు (Ulavapadu) మండల పరిధిలోని కరేడు పంచాయతీలోని ఇందిరా నగర్ గిరిజన కాలనీలో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. అందరూ డాన్స్లు వేస్తున్న సమయంలో ఇండ్లా బాలసుబ్రహ్మణ్యం (25) తన భార్యను కూడా తనతో డాన్స్ చేయడానికి రమ్మన్నాడు. పిల్లలను పట్టుకుని ఉన్నాను.. తరువాత వచ్చి వేస్తానులే అని చెప్పింది. చదవండి: సంక్రాంతి అల్లుడు మిస్సింగ్దీంతో అతను మనస్తాపానికి గురై ఇంటికి వెళ్లిపోయాడు. ఇంటికే కదా వెళ్లింది అని కార్యక్రమం అయిన తరువాత వెళ్లి చూస్తే ఇంటిలోని వంట గదిలో ఫ్యాన్కు వేసిన కొక్కేనికి చీరతో ఉరేసుకుని కనిపించాడు. వెంటనే స్థానికులు అతడిని ఉలవపాడు వైద్యశాలకు తరలించగా.. అప్పటికే మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 👉ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
ఒంగోలు రిమ్స్ వద్ద ఉద్రిక్తత.. వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు
ప్రకాశం, సాక్షి: ఒంగోలు రిమ్స్ వద్ద ఉద్రక్తత చోటుచేసుకుంది. లైంగిక దాడికి గురైన మైనర్ బాలికను పరామర్శించేందుకు మాజీమంత్రి ఆదిమూలపు సురేష్ , పీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ డాక్టర్ వెంకయ్య , వరికూటి అశోక్ బాబు రిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు.ఈ క్రమంలో వారిని రిమ్స్ ఆస్పత్రిలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వైఖరిని తీవ్రంగా నిరసిస్తూ ఆదిమూలపు సురేష్, వెంకయ్య, అశోక్ బాబు అక్కడే నేలపై బైఠాయించి కొద్దిసేపు నిరసన తెలిపారు. అనంతరం బాలిక తల్లిదండ్రులుతో మాట్లాడేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. టంగుటూరు మండలం కారుమంచిలో నాలుగో తరగతి విద్యార్థినిపై స్కూల్ ఉపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఇటీవల చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అనంతరం మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడారు. ‘‘ టంగుటూరు మండలం కారుమంచి మైనర్ బాలికపై లైంగిక దాడి ఘటన చాలా దారుణం. రాష్ట్రంలో పిల్లలు, మహిళలకు రక్షణ లేదు. మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయి. శాంతి భద్రతలు రోజురోజుకి క్షీణిస్తున్నాయి. ‘దిశ’ను ఎందుకు నీరు గార్చారు. పోలీసులు ఎందుకు నిర్లప్తంగా తయారయ్యారు. ...కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాకుండా ఎందుకు వదిలేశారు. బాధితురాలు.. తనపై హత్యాచారం చేశారని చెబుతుంటే. ఇంకా ఎన్ని రోజులు విచారణ జరుపుతారు. ఏ మంత్రి చెబితే కేసుని తొక్కిపట్టారు?. మేం వచ్చే వరకు పిర్యాదు తీసుకోకపోవడం సిగ్గుచేటు. ప్రభుత్వ అరచకాలపై సోషల్ మీడియా ద్వారా ఎండగడుతాం?. అలాగే సోషల్ మీడియాపై నిర్బంధాన్ని ఎదుర్కుంటాం. సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా వుంటాం’’ అని అన్నారు. -
Memantha Siddham Photos: మండుటెండలోనూ పోటెత్తిన జన ప్రభంజనం (ఫొటోలు)
-
మేమంతా నీ వెంటే.. ఊరూరా అభిమాన వర్షం (ఫొటోలు)
-
పదో రోజు ‘మేమంతా సిద్ధం’: దారి పొడవునా జననేతకు నీరా‘జనం’
Memantha Sidham Day 10 Highlights CM Jagan Bus Yatra Details సీఎం జగన్కు ఘన స్వాగతం పలికిన దర్శి ప్రజలు దర్శిలో పండుగ వాతావరణం దర్శిలో మేమంతా సిద్ధం బస్సుయాత్రకు అపూర్వ స్వాగతం సీఎం జగన్కు ఘన స్వాగతం పలికిన దర్శి ప్రజలు దర్శిలో పండగ వాతావరణం కాసేపట్లో దర్శి చేరుకోనున్న సీఎం జగన్ బస్సు యాత్ర దర్శిలో ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు భారీ స్వాగత ఏర్పాట్లు సిటీ మొత్తం మైక్ సెట్లు ఏర్పాట్లు చేసిన కార్యకర్తలు గజ మాలలు, తోరణాలు, మేళ తాళాలతో భారీ స్వాగతం పలకనున్న దర్శి ప్రజలు సీఎం జగన్ రాక కోసం గంటల తరబడి ఎదురుచూస్తున్న ప్రజలు గడియారం సెంటర్కి భారీగా చేరుకున్న ప్రజలు.. ‘కొనకొనమిట్ల’ సభలో సీఎం జగన్ ప్రసంగం.. ముఖ్యాంశాలు జన సముద్రం కనిపిస్తోంది ఇసుక వేసినా రాలనంతా జనం కనిపిస్తున్నారు చేయి చేయి కలిపిన ప్రజా కెరటంలా మేమంతా సిద్ధం అని వినిపిస్తోంది పేదల వ్యతిరేకులను ఓడించి సంక్షేమాన్ని కొనసాగించేందుకు మీరంతా సిద్ధమేనా ఈ ఎన్నికలు ఎంపీ, ఎమ్మెల్యేలను ఎన్నికలు కావు పిల్లల బడులు, అక్క,చెల్లెల సాధికారత, అవ్వా,తాతల సంక్షేమం,రైతు భరోసా కొనసాగాలా మోసపోయి వెనక్కు వెళ్లాలా అని నిర్ణయించే ఎన్నికలు పేదలకు చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలివి ఈ ఎన్నికలు రాబోయే మీ ఐదేళ్ల భవిష్యత్ నిర్ణయిస్తాయి మీ బిడ్డ ఎప్పుడూ పేదల పక్షమే జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు..బాబుకు వేస్తే ముగింపు చంద్రబాబు దారి ఎప్పుడూ అడ్డదారే చంద్రబాబు పేరు గుర్తుకొస్తే గుర్తుకొచ్చేది వెన్నుపోట్లు, దగా, మోసం, అబద్ధాలు, కుట్రలు చంద్రబాబు తన మనిషి నిమ్మగడ్డ రమేష్తో ఫిర్యాదు చేయించాడు అవ్వాతాతలకు వితంతు అక్క, చెల్లెలకు, పేదవారికి పెన్షన్లు ఇంటికి పోకుండా అడ్డుకున్నాడు వాలంటీర్లతో పెన్షన్లు ఇంటికెళ్లడం నేరమని ఫిర్యాదు చేయించాడు ఈ ఎన్నికలు పేదలు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు వాలంటీర్లు చిక్కటి చిరునవ్వుతో నెల ఒకటో తారీఖున పెన్షన్లు తెచ్చిచ్చారు చంద్రబాబు జన్మభూమి కమిటీలు పెన్షన్లుకు లంచాలు తీసుకున్నాయి వెయ్యి రూపాలయ కోసం రోజుల తరబడి నిలుచున్నా పెన్షన్లు రాలేదు ఎక్కడా లంచాల్లేకుండా వాలంటీర్ వ్యవస్థతో మీ బిడ్డ పెన్షన్లు ఇప్పించాడు వాలంటీర్ వ్యవస్థతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి అందుకే వాలంటీర్లు మన ఇంటికి రాకుండా కట్టడి చేస్తున్నాడు అవ్వా తాతలను చంపిన దిక్కుమాలిన హంతకుడు చంద్రబాబు పెన్షన్లు ఆపిన శాడిస్టు చంద్రబాబు ఒకరికి మంచి జరుగుతుంటే చూడలేనివాడు శాడిస్టు బాబు పేదవాడు పెద్దవాడవుతుంటే చూడలేనివాడు శాడిస్టు బాబు పేదలకు స్థలాలిస్తుంటే అడ్డుకునేవాడిని శాడిస్టు అంటారు వ్యవసాయం దండగ అన్న వ్యక్తే శాడిస్టు ఎస్సీ,ఎస్టీ,బీసీలను కించపరుస్తూ మాట్లాడిన చంద్రబాబు శాడిస్టు ప్రభుత్వ బడులలో ఇంగ్లీష్ మీడియం పెడుతంటే అడ్డుకున్నవాడు శాడిస్టు పేదలకు నగదు అందిస్తే ఏపీ శ్రీలంక అవుతుందన్న బాబు షాడిస్టు కాక ఇంకేంటి వాలంటీర్లను కించపరిచి నీచంగా మాట్లాడిన బాబు అండ్ గ్యాంగ్ మొత్తం శాడిస్టులే మేలు జరిగిందని చెప్పినందుకు గీతాంజలిని సోషల్ మీడియాలో సైకోలతో వేధించిన పెద్ద శాడిస్టు చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా చేసినా ఒక్కటంటే ఒక్క మంచి స్కీమ్ గుర్తుకు రాని చంద్రబాబు మనకు ప్రత్యర్థి ఇది మీ బిడ్డ 58 ఏళ్ల పాలన ప్రోగ్రెస్ రిపోర్టు గ్రామగ్రామాన రైతు భరోసా కేంద్రాలంటే మీ జగన్.. మీ బిడ్డ గ్రామగ్రామానా ఫ్యామిలీ డాక్టర్ అంటే మీ జగన్.. మీ బిడ్డ అవ్వాతాతలకు ఇంటికే వచ్చిన రూ.3 వేల పెన్షన్ అంటే మీ జగన్.. మీ బిడ్డ ఇంటింటికి వాలంటీర్ సేవలంటే మీ జగన్..మీ బిడ్డ పగటి పూటే రైతన్నలకు ఉచిత కరెంటు, ఉచిత పంటబీమా అంటే మీ జగన్..మీబిడ్డ ఆక్వా రైతులకు రూపాయిన్నరకే కరెంటు అంటే మీ జగన్..మీ బిడ్డ అమూల్ను తీసుకువచ్చి పాడి రైతులకు ధరలు పెంచింది మీ జగన్.. మీ బిడ్డ వంద సంవత్సరాల తర్వాత భూముల రీ సర్వే చేయిస్తున్నది మీ జగన్..మీ బిడ్డ ఏకంగా 30 లక్షల ఎకరాల మీద సంపూర్ణ హక్కులు కల్పించింది మీ జగన్..మీ బిడ్డ నాడు..నేడుతో ప్రభుత్వ బడులు రూపు రేఖలు మారాయంటే కారణం మీ జగన్..మీ బిడ్డ అమ్మఒడి ఇచ్చింది మీ జగన్.. మీ బిడ్డ పెద్ద చదువుల కోసం విద్యాదీవెన, విద్యావసతి ఇచ్చింది మీ జగన్..మీ బిడ్డ ప్రభుత్వ ఆస్పత్రులు రూపు మారాయంటే కారణం మీ జగన్.. మీ బిడ్డ అక్కచెల్లెమ్మలకు ఈబీసీ నేస్తం, కాపు నేస్తం అంటే మీ జగన్ అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ కారణం మీ జగన్ అక్క చెల్లెమ్మల ఫోన్లో దిశ యాప్ అంటే మీ జగన్ వాహన మిత్ర అంటే మీ జగన్ లా నేస్తం అంటే మీ జగన్ అక్కచెల్లెమ్మలకు రాజకీయ సాధికరత దక్కించింది మీ జగన్ 58 నెలల కాలంలో 80 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు ఎస్సీ,ఎస్టీ,బీసీ అక్కచెల్లెమ్మలకే దక్కాయి నామినేటెడ్ పోస్టుల్లోనూ ఎస్సీ,ఎస్టీ,బీసీలకు న్యాయం చేశాం రాష్ట్రంలో 4 సీ పోర్టులు నిర్మాణంలో ఉన్నాయి ఎయిర్పోర్టుల నిర్మాణం వేగంగా జరగుతోంది కొత్త మెడికల్ కాలేజీలు శరవేగంగా నిర్మిస్తున్నాం మేనిఫెస్టోలో నూటికి 90 శాతం హామీలు నెరవేర్చాం స్కీములన్నీ గ్రామంలో కళ్లెదుటే కనిపిస్తున్నాయి ఈ కార్యక్రమాలన్నీ మీ బిడ్డ ఎలా చేశాడు..చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు స్కీములన్నీ చూస్తుంటే చంద్రబాబుకు ఐదు జెలుసిల్ ట్యాబ్లెట్లు వేసుకున్నా కడుపుమంట తగ్గట్లేదు ఇందుకే మన జెండా తలెత్తుకోని ఎగురుతూ ఉంది వాళ్ల జెండా 4 జెండాలతో జత కట్టినా కింద పడుతోంది 2014లో చంద్రబాబు ఇదే కూటమితో ముందుకువచ్చారు మళ్లీ అదే చంద్రబాబు,పవన్కల్యాణ్, మోదీ వస్తున్నారు హామీల కరపత్రాలను చంద్రబాబు సంతకం పెట్టి ఇంటింటికి పంపించాడు రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తా అన్నాడు 80 వేల కోట్ల రుణమాఫీ చేశాడా పొదుపు సంఘాల రుణాలు రద్దు చేశాడా ఆడబిడ్డ పుడితే రూ.25వేలు డిపాజిట్ చేస్తానన్నాడు..చేశాడా ఇంటింటికి ఉద్యోగమిచ్చాడా..నిరుద్యోగ భృతి ఇచ్చాడా అర్హులైన వారందరికీ మూడు సెంట్ల స్థలం ఇచ్చాడా పక్కా ఇళ్లు నిర్మించాడా ఏపీని సింగపూర్గా మార్చాడా ప్రతి నగరాన్ని హైటెక్సిటీ చేస్తానన్నాడు చేశాడా ఇప్పుడు మళ్లీ ఇంటింటికి బంగారం,ఇంటింటికి బెంజ్ కారంటూ వస్తున్నాడు చంద్రబాబును నమ్మడమంటే పులినోట్లో తలకాయ పెట్టడమే రాష్ట్ర భవిష్యత్తును కాపాడటానికి మీరు సిద్ధమేనా సిద్ధమయితే సెల్ఫోన్లో టార్చ్ ఆన్ చేసి సిద్ధమే అని నినదించండి 175కు 175 ఎమ్మెల్యే..25కు25 ఎంపీ సీట్లు గెలిపించేందుకు సిద్ధమేనా మన గుర్తు ఫ్యాను.. గుర్తుంచుకుని ఓటేయండి ఎమ్మెల్యే అన్నా రాంబాబు కామెంట్స్ సీఎం జగన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చారు పేదలకు అండగా నిలిచిన నాయకుడు సీఎం జగన్ దమ్మున్న నాయకుడు సీఎం జగన్ కొనకొనమిట్ల ‘మేమంతా సిద్ధం’ సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్ ప్రకాశం జిల్లా, కొనకొనమిట్ల మేమంతా సిద్ధం సభకు చేరుకున్న బస్సు యాత్ర కాసేపట్లో సభలో ప్రసంగించనున్న సీఎం జగన్ సభకు భారీగా హాజరైన జనం పెత్తందారులపై పోరుకు సిద్ధం అని నినాదాలు పెద అరికట్ల చేరుకున్న బస్సు యాత్ర మార్కాపురం నియోజకవర్గం కొనకనమిట్ల మండలం పెద అరికట్ల గ్రామం చేరుకున్న సీఎం జగన్ బస్సు యాత్ర 43 డిగ్రీల మండుటెండలోనూ తగ్గని జనాల ఉత్సాహం రోడ్డుకు రెండువైపులా బారులు తీరి సీఎం జగన్ బస్సుయాత్రకు సంఘీభావం తెలియజేస్తున్న ప్రజలు ముఖ్యమంత్రికి ఆత్మీయ స్వాగతం పలికిన చిన్నారులు, విద్యార్ధులు, యువకులు, మహిళలు, అన్నదాతలు, అవ్వాతాతలు కదిలి వచ్చిన కనిగిరి జగన్ బస్సుయాత్రకు ప్రజల బ్రహ్మరథం పామూరు బస్టాండ్లో సీఎం జగన్కు గజమాలతో స్వాగతం పలికిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు మండుటెండలోనూ కిక్కిరిసిన కనిగిరి రోడ్లు పూలు చల్లుతూ అభిమాన వర్షం కురిపించినమహిళలు సీఎం జగన్తో తమ సంతోషాన్ని పంచుకున్న రామాపురం గ్రామస్తులు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ను కలిసిన రామాపురం గ్రామస్తులు తమ గ్రామంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్మించిన గ్రామ సచివాలయం, ఆర్బీకే, విలేజ్ హెల్త్ క్లీనిక్.. ఇలా ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలందుతున్నాయంటూ రామాపురం గ్రామస్తులు.. సీఎంను కలిసి తమ సంతోషాన్ని పంచుకున్నారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కనిగిరి చేరుకుంది అడుగడునా సీఎం జగన్కు పెద్దఎత్తున స్వాగతం పలుకుతున్న ప్రజలు కనిగిరిలో కొనసాగుతున్న యాత్ర ప్రకాశం జిల్లాలో ‘మేమంతా సిద్దం’ బస్సు యాత్ర మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజల బ్రహ్మరథం సీఎం జగన్కు అడుగడునా జననీరాజనం దారిపొడవునా గజమాలలతో సీఎం జగన్కు ఆపూర్వ స్వాగతం నా స్టార్ క్యాంపెయినర్లతో ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర: సీఎం జగన్ పదో రోజు ప్రకాశం జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కొనసాగుతోంది యాత్రలో కలిసిన పిల్లలు, వృద్ధులు, మహిళలతో సీఎం జగన్ ఆప్యాయంగా మాట్లాడారు వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు With my star campaigners from Day-10 of the Memantha Siddham Yatra. #MemanthaSiddham pic.twitter.com/wl7knYIYUD — YS Jagan Mohan Reddy (@ysjagan) April 7, 2024 జగనన్న కోసం యువ స్టార్ క్యాంపెయినర్ కరోనా మహమ్మరి వల్ల తన తల్లిదండ్రులిద్దరిని కోల్పోయిన ఈ యువకుడి పేరు మునగ అభిరామ్, వయస్సు 18. తాను ఆనాధను కాదని తనకి జగనన్న ఉన్నారంటూ ఇవాళ ప్రకాశం జిల్లాలో జరుగుతున్న మేమంతా సిద్ధం యాత్రలో కనిపించాడు కోవిడ్ తో తన తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు, ఆ విషయం తెలుసుకున్న సీఎం జగన్ చిన్న బిడ్డ ఆనాధగా మిగలకూడదని ఆయన ఆ బిడ్డ జీవితానికి ఒక లైఫ్లైన్గా నిలిచారు. దాదాపు రూ. 10 లక్షల సీఎం నిధులను కేటాయించి ఆ బిడ్డకు అండగా నిలబడ్డారు. ఇప్పుడు, అదే బిడ్డ అభిరామ్ సీఎం జగన్కు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయడానికి తిరిగి వచ్చాడు సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది దారిపొడవునా సీఎం జగన్కు ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు సీఎం జగన్ను చూడటానికి భారీగా తరలివస్తున్న ప్రజానికం పొన్నలూరు మండలం కే అగ్రహారం చేరుకున్న సీఎం జగన్ అగ్రహారంలో భారీ క్రేన్స్తో 10 గజమాలలతో స్వాగతం పలికిన కార్యకర్తలు, ప్రజలు సీఎం జగన్ సమక్షంలో చేరికలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన దెందులూరు నియోజకవర్గం టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీకు చెందిన కీలక నేతలు జువ్విగుంటక్రాస్ స్టే పాయింట్ వద్ద దెందులూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి వైయస్సార్సీపీ కండువాలు వేసిన ముఖ్యమంత్రి వైయస్సార్సీపీలోకి చేరిన టీడీపీ బీసీ సాధికార స్టేట్ కన్వీనర్, ఏపీ గౌడ సంఘం అధ్యక్షులు చలుమోలు అశోక్గౌడ్, క్లస్టర్ ఇన్ఛార్జి భాను ప్రకాష్, సొసైటీ మాజీ అధ్యక్షుడు మేడికొండ శ్రీనివాసరావు, జిల్లా గౌడసంఘం నేత ఎం. వరప్రసాద్లు. వైయస్సార్సీపీలోకి చేరిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ, నియోజకవర్గ ఇన్ఛార్జి డీ వీ ఆర్ కె చౌదరి, డీసీసీ కార్యదర్శి సీహెచ్ కిరణ్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన బీజేపీ పెదవేగి మండల పార్టీ అధ్యక్షులు పొన్నూరు శంకర్ గౌడ్ మరికొద్ది సేపటిలో కె. అగ్రహారానికి చేరుకోనున్న సీఎం వైఎస్ జగన్ సీఎం జగన్కు స్వాగతం పలికేందుకు గ్రామ ఎంట్రన్స్ వద్దకి భారీగా చేరుకున్న గ్రామస్థులు జువ్విగుంట క్రాస్ నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమైంది. రాత్రి బస పాయింట్ జువ్విగుంట క్రాస్ సీఎం జగన్ బస్సు యాత్ర బయలుదేరింది సీఎం జగన్కు పెద్ద సంఖ్యలో ప్రజలు స్వాగతం పలికారు సీఎం జగన్ సమక్షంలో టీడీపీ నేతలు చేరిక జువ్విగుంట రాత్రి బస వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిన గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, టీడీపీ బీసీ సాధికార రాష్ట్ర కన్వీనర్ చలమోలు అశోక్ గౌడ్ పదో రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర కే అగ్రహారం వద్ద 10 గజమాలలతో స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు సీఎం జగన్ను చూడటానికి భారీగా చేరుకుంటున్న ప్రజానికం పదో రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రకాశం జిల్లాలో మేమంతి సిద్ధం బస్సు యాత్ర కాసేపట్లో జువ్విగుంట క్రాస్ నుంచి బస్సు యాత్ర ప్రారంభం పెద్దఅలవలపాడు, కనిగిరి మీదుగా పెద్దఅరికట్ల చేరుకోకున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర అనంతరం చిన్నఅరికట్ల, మూగిచింతల మీదుగా కొనకనమెట్ల క్రాస్ చేరుకోనున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనకనమెట్ల క్రాస్ వద్ద మేమంతా సిద్ధం బహిరంగ సభ బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం వైఎస్ జగన్ అనంతరం బత్తువారిపల్లి, సలకనూతల క్రాస్ , పొదిలి, రాజంపల్లి, దర్శి మీదుగా వెంకటాచలంపల్లికి బస్సు యాత్ర రాత్రికి వెంకటాచలంపల్లిలో బస చేయనున్న సీఎం జగన్ ప్రకాశం జిల్లా సిద్ధమా...? పదో రోజు ‘మేమంతా సిద్ధం’బస్సు యాత్ర కోసం సీఎం జగన్ ట్వీట్ చేశారు. Day-10 ప్రకాశం జిల్లా సిద్ధమా…?#MemanthaSiddham — YS Jagan Mohan Reddy (@ysjagan) April 7, 2024 పదో రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రకాశం జిల్లాలో కొనసాగనుంది. సీఎం జగన్ బస్సు యాత్ర.. జువ్విగుంట క్రాస్ రాత్రి బస చేసిన ప్రాంతం నుంచి ప్రారంభమవుతుంది. మేమంతా సిద్ధం - 10వ రోజు ఆదివారం (ఏప్రిల్ 7) షెడ్యూల్ ఈరోజు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదయం తొమ్మిది గంటలకు జువ్విగుంట క్రాస్లో రాత్రి బస చేసిన ప్రాంతం నుంచి బయలుదేరుతారు. పెద్ద అలవలపాడు, కనిగిరి మీదగా పెద్ద అరికట్ల తరువాత భోజన విరామం తీసుకుంటారు. అనంతరం చిన్న అరికట్ల, మూగచింతల మీదుగా కొనకనమెట్ల క్రాస్ చేరుకుని సాయంత్రం 3:30 గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం బత్తువారిపల్లి, సలకనూతల క్రాస్, పొదిలి, రాజంపల్లి, దర్శి మీదుగా వెంకటాచలంపల్లి రాత్రి బసకు చేరుకుంటారు. Memantha Siddham Yatra, Day -10. ఉదయం 9 గంటలకు జువ్విగుంట దగ్గర నుంచి ప్రారంభం సాయంత్రం 4 గంటలకు కొనకనమెట్ల దగ్గర బహిరంగ సభ వెంకటాచలంపల్లి క్రాస్ వద్ద రాత్రి బస #MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/zqgVFAcXrX — YSR Congress Party (@YSRCParty) April 7, 2024 తొమ్మిదో రోజు సీఎం జగన్ బస్సు యాత్ర సూపర్ సక్సెస్ మీరే మా ఆశ.. మీరే మా శ్వాస అంటూ సీఎం జగన్ను చూసేందుకు పోటెత్తిన జనాలు మండుటెండను సైతం లెక్క చేయక.. కావలి బహిరంగ సభలో జనసునామీ తన కోసం వచ్చిన వారిని సీఎం జగన్ ఆప్యాయంగా పలకరిచి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు చిన్నారులు.. యువతులు.. వృద్ధులు.. ఇలా ప్రతి ఒక్కరితో సెల్ఫీలు దిగి వారిలో ఆనందోత్సాహాలను నింపారు తొమ్మిది రోజుల మేమంతా సిద్ధం బస్సుయాత్రలో అభిమానం ఇలా.. Moments of the Day 💫 Memantha Siddham Yatra, Day -9.#MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/z5dD3NKqk4 — YSR Congress Party (@YSRCParty) April 6, 2024 Memorable moments from Day-8 of the Memantha Siddham Yatra. #MemanthaSiddham pic.twitter.com/2E1E92T1qy — YS Jagan Mohan Reddy (@ysjagan) April 5, 2024 Memorable moments from the Memantha Siddham Yatra, Day-7.#MemanthaSiddham pic.twitter.com/gDPSZ3rQk3 — YS Jagan Mohan Reddy (@ysjagan) April 5, 2024 Memorable moments from the Memantha Siddham Yatra, Day-6.#MemanthaSiddham pic.twitter.com/ilx21YyCAC — YS Jagan Mohan Reddy (@ysjagan) April 5, 2024 Memorable moments from Day-5 of the Memantha Siddham Yatra.#MemanthaSiddham pic.twitter.com/dmCglCUqjC — YS Jagan Mohan Reddy (@ysjagan) April 5, 2024 Memorable moments from Day-4 of the Memantha Siddham Yatra. #MemanthaSiddham pic.twitter.com/xqPvXEB4CW — YS Jagan Mohan Reddy (@ysjagan) April 5, 2024 Memorable moments from the Memantha Siddham Yatra, Day-3.#MemantaSiddham pic.twitter.com/OYKtc0ssb3 — YS Jagan Mohan Reddy (@ysjagan) April 5, 2024 Memorable moments from the Memantha Siddham Yatra, Day-2.#MemanthaSiddham pic.twitter.com/uEx9NXjGRO — YS Jagan Mohan Reddy (@ysjagan) April 5, 2024 Memorable moments from the Memantha Siddham Yatra, Day-1.#MemanthaSiddham pic.twitter.com/MVp6W2q0eM — YS Jagan Mohan Reddy (@ysjagan) April 5, 2024 -
జనసేనల మధ్య పెరుగుతున్న గ్యాప్
జిల్లాలో పొత్తు రాజకీయాల్లో జనసేన చిత్తయిపోయింది. టీడీపీ జిల్లా అధ్యక్షుడి పోకడలు ఆ పార్టీ శ్రేణుల్లో వర్గ రాజకీయాలకు ఆజ్యం పోశాయి. పొత్తు ప్రకటన నుంచి సమన్వయ సమావేశాలు, సీట్ల కేటాయింపులు, ఎన్నికల ప్రచారం వరకు టీడీపీ నేతలు తమను చిన్న చూపు చూస్తున్నారని జనసేనలు మండిపడుతున్నారు. జనసేన అంతర్గత వ్యవహారాల్లో దామచర్ల తలదూర్చి పార్టీ విచ్ఛిన్నం చేసే చర్యలు చేపడుతున్నారని అంటున్నారు. టీడీపీ ఆఫీసులో తమ పార్టీ నేతలతో సమావేశం పెట్టడం ఏమిటని రగిలిపోతున్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో టీడీపీ, జనసేన పార్టీ నేతల మధ్య ఆది నుంచి వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. రెండు పార్టీలు ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించిన తర్వాత జిల్లాలో నిర్వహించిన పలు సమన్వయ సమావేశాలు వివాదాస్పదంగా మారాయి. జిల్లాలో టీడీపీలో కీలకంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వ్యవహార శైలిపై జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొలి సమావేశానికి దామచర్ల దాదాపు మూడు గంటల ఆలస్యంగా రావడమే కాకుండా తమ వారిని కనీసం పట్టించుకోలేదని మండిపడుతున్నారు. ఇక రెండో సమావేశంలో అయితే కూర్చునేందుకు సీట్లు కూడా లేకుండా చేశారని వాపోతున్నారు. తాజాగా గురువారం టీడీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అనేక సందర్భాల్లో తమ పార్టీ నేతలను అవమానించిన నేపథ్యంలో ఈ సమావేశానికి గ్లాస్ పార్టీకి చెందిన కీలక నేతలు, వారి అనుచర వర్గం డుమ్మా కొట్టింది. దామచర్ల తమ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చడమే కాకుండా టీడీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించడం జనసేన నేతలకు మింగుడు పడడంలేదు. ఇదిలా ఉంటే జనసేన సమావేశం టీడీపీ కార్యాలయంలో నిర్వహించడం ఏమిటో అర్థం కావడం లేదని టీడీపీ నేతలు గుసగుసలాడుతున్నారు. రెండు పార్టీల్లోనూ ఈ అంశం హాట్టాపిక్గా మారింది. వర్గ రాజకీయాలకు ఆజ్యం దామచర్ల తమ పార్టీలో రెండు వర్గాలను పెంచిపోషించాడని జనసేన శ్రేణులు ఆరోపిస్తున్నాయి. తమ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చడమేమిటని నిలదీస్తున్నాయి. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ను ప్రోత్సహిస్తూ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అరుణను చిన్న చూపు చూశారని, ఇటీవల ఆమైపె జరిగిన దాడిపై పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. సీట్ల కేటాయింపులో మొండిచేయి ఇక సీట్ల విషయంలో కూడా అన్యాయమే జరిగిందని ఆ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఉమ్మడి జిల్లాల నుంచి రెండు లేదా మూడు సీట్లను జనసేన నేతలు ఆశించారు. అయితే చివరకు ఒక్క సీటూ ఇవ్వకపోవడంపై కూడా గ్లాసు కేడర్ గుర్రుగా ఉన్నారు. ఐదేళ్లుగా పార్టీ అభ్యున్నతికి కష్టపడిన తమను మిత్రపక్షం నేతలు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. అయితే పార్టీలో ముఖ్య నేతలను తనకు అనుకూలంగా పెట్టుకుని మీ అందరికీ న్యాయం చేస్తానని దామచర్ల హామీ ఇచ్చినట్టు తెలిసింది. దీంతో పార్టీ శ్రేణులు మాత్రం రగిలిపోతున్నారు. అయితే ఎన్నికల వేడి మొదలైన తర్వాత కూడా వారిని అసలు పట్టించుకోకపోవడంతో కీలక నేతలు టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. అందులో భాగంగానే గురువారం సమావేశానికి షేక్ రియాజ్, అరుణ వర్గాలు డుమ్మా కొట్టాయని సమాచారం. మొత్తం మీద టీడీపీ అధ్యక్షుడు దామచర్ల గ్లాసులో తుఫాన్ సృష్టించి ఆ పార్టీ పతనానికి బీజాలు వేసినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దామచర్ల తీరుతో మనస్తాపం... ఇచ్చిన మాటను నిలుపుకోవడం అలవాటు లేని దామచర్ల జనార్దన్ సహజంగానే రియాజ్ కు ఇచ్చిన మాటను కూడా మరిచిపోయారు. ఎన్నికల ప్రచారానికి రియాజ్ను, అతడి వర్గాన్ని వాడుకుంటున్నారు. జనసేన ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తల గురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. టీడీపీ కార్యాలయానికి వెళితే అక్కడ ఎవ్వరూ లెక్క చేయడం లేదు. ఇప్పుడే ఇలా ఉంటే ఎన్నికల తరువాత పరిస్థితి ఏంటన్న ఆలోచనలో పడ్డారు జనసేనలు. దీంతో ఆ పార్టీ నేతలు కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. మూడు రోజుల కిందట నగరంలోని ఒక హోటల్లో దామచర్ల..రియాజ్తో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం మీరందరూ సహకరించండి ఎన్నికల తరువాత న్యాయం చేస్తానని జనార్దన్ చెప్పినట్లు తెలిసింది. ఈ విషయం ఎటూ తేలకపోవడంతో రియాజ్ జనసేన సమావేశానికి గైర్హాజరైనట్లు తెలుస్తోంది. మా కార్యకర్తలతో సమావేశమా... అంతేకాకుండా జనసేన కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడాన్ని రియాజ్ అభ్యంతరం చెప్పినట్లు సమాచారం. జనసేన కార్యకర్తలతో సమావేశాన్ని జనసేన కార్యాలయంలో నిర్వహిస్తేనే బాగుంటుందని ఆయన చెప్పినా దామచర్ల లెక్కచేయకపోవడంతో రియాజ్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. దీని వల్ల ప్రజలకు తప్పుడు సంకేతాలు పోతాయని, జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయాన్ని ఉంచుకొని సొంతంగా కార్యకర్తలతో సమావేశాన్ని కూడా నిర్వహించుకోలేని దీనస్థితిలో ఉన్నట్లు ప్రజలు చెప్పుకుంటారని చెప్పినా వినకుండా కావాలనే టీడీపీ కార్యాలయంలో జనసేన కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. దీంతో రియాజ్ వర్గం ఈ సమావేశాన్ని బహిష్కరించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. -
టీడీపీ ఎన్ని కుట్రలు పన్నినా పట్టాలిచ్చి తీరతాం: బాలినేని
సాక్షి, ప్రకాశం జిల్లా: ఈ నెల 20న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒంగోలు పర్యటించనున్నట్లు మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్రెడ్డి తెలిపారు. అదే రోజున నగరంలో 25 వేల మంది పేదల కోసం సిద్ధం చేసిన ఇంటి స్థలాలను సీఎం చేతుల మీదుగా లబ్ధిదారులకు అందిస్తామని బాలినేని తెలిపారు. అర్బన్ లేఔట్ను బాలినేని శుక్రవారం పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతల తీరుపై మండిపడ్డారు. పేదలకు ఇళ్ల పట్టాలు అడ్డుకునేందుకు కోర్టులో పిల్ వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులో పేదలకు పట్టాలు ఇవ్వకుండా టీడీపీ నేతలు పదే పదే కోర్టుకు వెళ్తున్నారని.. వారికి ఇష్టం లేకపోతే పోటీ నుంచి తప్పుకుంటానే తప్ప ఇంటి పట్టాలు ఇవ్వకుండా ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని బాలినేని స్పష్టం చేశారు. ఇప్పటికే ఒకచోట కోర్టుకెళ్లి ఇంటి స్థలాలను అడ్డుకున్న టీడీపీ.. మరోసారి కోర్టులో పిల్ వేయడంపై బాలినేని అసహన వ్యక్తం చేశారు. ఇంత నీచ రాజకీయం నా జీవితంలో చూడలేదు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: చిల్లర పాలిటిక్స్ చేస్తున్న వ్యక్తి వంశీ: ఎంపీ ఎంవీవీ ఫైర్ -
సామాజిక సాధికార బస్సు యాత్ర.. తొమ్మిదోరోజు షెడ్యూల్ ఇదే
సాక్షి, తాడేపల్లి : వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర జైత్రయాత్రలా కొనసాగుతోంది. నేటి(సోమవారం) సామాజిక సాధికారిత బస్సుయాత్ర గాజువాక, కాకినాడ రూరల్, మార్కాపురం నియోజకవర్గాల్లో కొనసాగనుంది. విశాఖపట్నం జిల్లా గాజువాకలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరుగనుంది. గాజువాక సెంటర్లో మధ్యాహ్నం గం. 12.30ని.లకు యాత్ర ప్రారంభం కానుంది. ఒంటి గంటకు టీఎన్ఆర్ కళ్యాణ మండపం వద్ద వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం ఉంటుంది. గం. 1.30 ని.లకు మింది గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వైఎస్సార్సీపీ నాయకులు ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు టీఎన్ఆర్ కళ్యాణ మండపం నుంచి పాత గాజువాక వరకూ భారీ ర్యాలీ కొనసాగనుంది. సాయంత్రం 4 గంటలకు పాత గాజువాకలో భారీ బహిరంగ సభ జరుగనుంది. దీనికి మంత్రులు సీదిరి అప్పలరాజు, ధర్మాన ప్రసాదరావు, బొత్ససత్యనారాయణ తదితరులు హాజరుకానున్నారు. ఇక ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరుగనుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు యాత్ర ప్రారంభం కానుంది. రెండు గంటలకు వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం ఉండగా, మూడు గంటలకు కార్యకర్తలో కలిసి పార్టీ నేతల పాదయాత్ర ప్రారంభం కానుంది. పిల్లల పార్క్ మీదుగా కంభం సెంటర్వరకూ పాదయాత్ర జరుగనుంది. సాయంత్రం గం. 4.30ని.లకు వైఎస్సార్ విగ్రహం వద్ద భారీ బహిరంగ సభ జరుగనుంది. ఈ బహిరంగ సభలో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ తదితరులు పాల్గొననున్నారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సుయాత్ర జరుగనుంది. మధ్యాహ్నం రెండు గంటలకు కాకినాడ ఆర్ అండ్ బీ అతిథి గృహంలో వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం ఉంటుంది. మూడు గంటలకు బస్సు యాత్ర ప్రారంభం కానుంది. నాలుగు గంటలకు సర్పవరంలో భారీబహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు మంత్రులు బూడి ముత్యాల నాయుడు, తానేటి వనిత, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పినిపే విశ్వరూప్, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మిథున్రెడ్డి తదితరులు హాజరుకానున్నారు. -
‘చంద్రబాబు యర్రగొండపాలెం రోడ్ షోపై మూడు కేసులు నమోదు’
సాక్షి, ప్రకాశం జిల్లా : జిల్లాలోని చంద్రబాబు నాయుడు నిర్వహించిన రోడ్ షోలకు సంబంధించి మూడుకేసులు నమోదయ్యాయి. యర్రగొండపాలెంలో అనుమతి లేని చోట సభ ఏర్పాటు చేయటంపై నిర్వహకులపై కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ కిషోర్ కుమార్ స్పష్టం చేశారు. ఈరోజు(శనివారం) మీడియా సమావేశంలో డీఎస్పీ కిషోర్ కుమార్ మాట్టాడుతూ.. ‘అనుమతి లేని చోట సభ ఏర్పాటు చేయటం పై నిర్వాహకులపై కేసు నమోదు చేశాం. మంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద రాళ్ల దాడి చేసిన టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశాం. మంత్రి క్యాంప్ కార్యాలయం పై దాడి చేసిన టీడిపీ కార్యకర్తలను వీడియో ఫుటేజ్ ద్వారా గుర్తించాం. నిన్నటి(శుక్రవారం) చంద్రబాబు సభలో గొడవ పై విచారణ జరువుతున్నాం. ముందుగా అనుమతి పొందిన స్థలంలో కాకుండా వేరే చోట సభ నిర్వహించడం పై కేసు నమోదు చేసాం. విచారణ తర్వాత ఎవరెవరిని కేసులో పెట్టాలో నిర్ణయిస్తాం. యర్రగొండ పాలెం ఘటనలో పోలీసుల వైఫల్యం లేదు.’ అని తెలిపారు. -
గడపగడపకు మన ప్రభుత్వం: శివారు ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం
ఒంగోలు సబర్బన్: నగరంలోని శివారు ప్రాంతాల అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు ఒంగోలు ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. నగరంలోని మూడో డివిజన్లో గురువారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని బాలినేని నిర్వహించారు. తొలుత డివిజన్ ప్రారంభంలోని బలరాం కాలనీలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మహానేత డాక్టర్ వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మూడో డివిజన్ కార్పొరేటర్ గండు ధనలక్ష్మి, మధు దంపతులు, వైఎస్సార్ సీపీ నాయకులు, అభిమానులు బాలినేనికి గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం మిలటరీ కాలనీలో ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయని స్థానికులను అడిగి బాలినేని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడో డివిజన్లో ఎక్కువ భాగం స్లమ్ ఏరియా ఉందన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో మూడో డివిజన్లో రోడ్లు వేశామని ప్రగల్భాలు పలికారంటూ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్పై ధ్వజమెత్తారు. నగరాన్ని అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకున్నారని, కానీ, ఎక్కడా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవని విమర్శించారు. మూడో డివిజన్లో డ్రైనేజీ సమస్య అధికంగా ఉందన్నారు. ఈ డివిజన్లో ఎక్కువ అభివృద్ధి పనులు చేయాల్సి ఉందన్నారు. డివిజన్లోని వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు బాగా పనిచేస్తున్నారని అభినందించారు. వలంటీర్ల పనితీరు కూడా సంతృప్తికరంగా ఉందన్నారు. ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ మళ్లీ సీఎంగా వైఎస్ జగన్, ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని గెలవాలని నినాదాలు చేశారు. మిలటరీ కాలనీలో ఒక మహిళ మంచినీటి ట్యాప్ కోసం దరఖాస్తు చేసుకోగా ఇవ్వలేదని బాలినేని దృష్టికి తీసుకురాగా, ఎంఈ కే మాల్యాద్రిని పిలిచి బాలినేని ప్రశ్నించారు. మూడు రోజుల్లో ట్యాప్ కనెక్షన్ ఇస్తామని ఎంఈ తెలిపారు. ఓ ఇంటి వాకిటికి ఎదురుగా విద్యుత్ స్తంభం ఉండటాన్ని బాలినేని గమనించారు. అక్కడకు వెళ్లినప్పుడు ఆ ఇంటి మహిళ కూడా విద్యుత్ స్తంభం సమస్యను బాలినేని దృష్టికి తీసుకురావడంతో విద్యుత్ ఏఈని పిలిపించిన బాలినేని.. ఆ స్తంభాన్ని పక్కకు మార్చాలని, వారం రోజుల్లో సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. కాలువల నిర్మాణానికి శంకుస్థాపన... గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మిలటరీ కాలనీలో కాలువ నిర్మాణానికి బాలినేని శంకుస్థాపన చేశారు. టెంకాయలు కొట్టి భూమి పూజ చేసి వెంటనే పనులు ప్రారంభించాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. మిలటరీ కాలనీ, మసీదు కాలనీ, బాలినేని భరత్ కాలనీల్లో కాలువల నిర్మాణానికి ఇప్పటికే రూ.30 లక్షలు మంజూరు చేశామని, తొలుత మిలటరీ కాలనీలో కాలువ పనులు ప్రారంభించామని బాలినేని తెలిపారు. కార్యక్రమంలో నగర మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ ఎం.వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, వైఎస్సార్ సీపీ డివిజన్ అధ్యక్షుడు ఎస్కే జాఫర్, కార్పొరేటర్లు ఎందేటి పద్మావతి రంగారావు, చల్లా తిరుమల రావు, తాడి కృష్ణలత, పొగాకు ఉత్పత్తిదారుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు వాకా బసివిరెడ్డి, ఇస్లాంపేట జిలానీ, బేతంశెట్టి శైలజ, యరజర్ల రమేష్, ఊసా మధుబాబు, డివిజన్ నాయకులు సుల్తాన్, రమీజా, కోటయ్య, చిన్నా, పేరిరెడ్డి, రాజేంద్ర, హబీబ్, వెంకట్, సుజాత, డానియేలు, అమర్, తదితరులు పాల్గొన్నారు. -
ఉనికి కోసం..సొంత పార్టీ వాళ్లకే మళ్లీ కండువాలేసి కొత్తగా చేరినట్లు..!
ఎక్కడైనా ఒక పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై వచ్చిన వారిని ఆ పార్టీ కండువాలు కప్పి పార్టీలో చేర్చుకుంటారు. కానీ ఇప్పటికే పార్టీలో ఉన్న వారు మరోసారి కొత్తగా చేరినట్లు కలరింగ్ ఇవ్వడం, పక్క పార్టీకి చెందిన యువకులను మాయమాటలు చెప్పి పార్టీ కార్యాలయానికి పిలిపించి మెడలో పచ్చకండువా వేసి పార్టీలో చేరినట్లు ప్రకటిస్తున్నారు టీడీపీ జిల్లా నేతలు. నానాటికీ దిగజారిపోతున్న పార్టీ ఇంకా ఉనికిలోనే ఉందని జనాలకు చెప్పుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రభుత్వ సంక్షేమ పథకాలతో జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ నానాటికీ పెరుగుతోంది. ప్రతిపక్ష టీడీపీకి ప్రజల్లో నూకలు చెల్లిపోతున్నాయి. పార్టీ కేడర్ క్రమంగా దూరమవుతోంది. దీంతో అధినాయకత్వం మొదలు జిల్లా స్థాయి నాయకుల వరకు ఏమీ పాలుపోవడం లేదు. ఎలాగైనా పార్టీలో కొంత ఉత్సాహాన్ని నింపేందుకు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ దొడ్డిదారి మార్గాన్ని అన్వేషించాడు. వైఎస్సార్సీపీ నుంచి ఎవరిని బయటకు గెంటేస్తారా...వాళ్లను దగ్గరకు తీద్దామని ఎదురుచూస్తూ ఉన్నారు. దీనికి తోడు పార్టీలో ఉండేవాళ్లకే టీడీపీ కండువాలు వేసి వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలో చేరుతున్నట్లు కలరింగ్ ఇస్తున్నారు. వైఎస్సార్సీపీలో నుంచి కాకర్ల ఈశ్వర్ అనే కార్యకర్తను ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు ప్రణీత్ రెడ్డి కొంతకాలంగా పార్టీకి దూరంగా పెట్టాడు. దీనిని గమనించిన దామచర్ల.. కాకర్ల ఈశ్వర్కు వలవేశాడు. ఎలాగూ బాలినేని కుటుంబం తనను దూరంగా పెట్టింది. కాబట్టి ఇక్కడ మంచి ప్యాకేజీ మాట్లాకుంటే పోలా అని ఈశ్వర్ తలచాడు. దీంతో ఈశ్వర్ వైఎస్సార్సీపీలోని కొందరు అనుచరులకు ‘‘బాలినేని ప్రణీత్ అన్న వస్తున్నాడు వెళదాము రండి’’ అంటూ ఆదివారం కబురు పంపాడు. యువకులు కొందరు ద్విచక్ర వాహనాలు వేసుకొని వచ్చారు. వాళ్లందరి వాహనాలకు పెట్రోలు కొట్టించాడు. వీరితో పాటు టీడీపీ కార్యాలయం కూడా పార్టీలోని మరికొందరు యువకులను వాళ్లకు తోడు చేసింది. అయితే ఈశ్వర్ చెప్పింది ఒకటి..చేసింది మరొకటి. బాలినేని నివాసానికి అని చెప్పి పాత గుంటూరురోడ్డులోని టీడీపీ ఆఫీసుకు వాళ్లను తీసుకెళ్లాడు. దీంతో కొందరు ఆ విషయం పసిగట్టి వెనక్కు వెళ్లిపోయారు. కొందరు సన్నిహితంగా ఉండేవాళ్లు టీడీపీ కార్యాలయంలో ఇరుక్కుపోయారు. వాళ్లకు దామచర్ల చేత బలవంతంగా టీడీపీ కండువాలు వేయించాడు. సందట్లో సడేమియా అంటూ టీడీపీలో ఉన్న వాళ్లకు కూడా కొంతమందికి పార్టీ కండువాలు వేసి వైఎస్సార్సీపీ నుంచి వచ్చినట్లు కలరింగ్ ఇచ్చారు. తీరా తేరుకున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు పొరపాటు జరిగిపోయిందని సోమవారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయానికి వెళ్లారు. టీడీపీ కార్యాలయంలో ఈశ్వర్ చేసిన దుశ్చర్య గురించి చెప్పారు. టీడీపీలోకి వెళ్లటం తమకు ఇష్టం లేదంటూ మళ్లీ మేయర్ గంగాడ సుజాతతో పాటు మరికొంతమంది వైఎస్సార్సీపీ నాయకుల వద్ద పార్టీ కండువాలు వేయించుకున్నారు. పార్టీ కండువాలు వేయించుకున్న వారిలో బాపట్ల సాయి, కొప్పెర్ల విజయ్, శేఖర్, షాహిద్తో పాటు పలువురు ఉన్నారు. ఇదే తరహాలో నాలుగు రోజుల క్రితం మూడో డివిజన్లో కూడా మరో తంతు జరిగింది. మెప్మాలో గతంలో ఆర్పీగా పనిచేసిన టీడీపీ చెందిన ముంతాజ్.. గ్రూపు మీటింగ్ ఉందని చెప్పి కొంతమంది మహిళలను డివిజన్లోకి పిలిపించింది. వాళ్లలో పది మంది వరకు టీడీపీ వాళ్లే ఉన్నారు. వైఎస్సార్ సీపీ నుంచి ఏ ఒక్కరూ అక్కడకు వెళ్లలేదు. డివిజన్లో కార్యక్రమం ఏర్పాటు చేసి దామచర్లను పిలిపించింది. వైఎస్సార్సీపీ నుంచి పార్టీలోకి వస్తున్నారంటూ దామచర్లకు చెప్పింది. అంతే ఆయన పచ్చకండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. కండువాల కార్యక్రమానికి ముందే కొంతమంది మహిళలు అక్కడ నుంచి వెళ్లిపోయారు. అసలు మూడో డివిజన్ టీడీపీ అధ్యక్షుడికి గానీ, కార్యదర్శికి కానీ ఈ కండువాల పంచాయితీనే తెలియదు. దీన్ని బట్టి అసలు టీడీపీలో ఎవరు ఉన్నారో కూడా దామచర్లకు తెలియదంటే ఆయనకు పార్టీ మీద ఉన్న పట్టు ఏపాటిదో అట్టే అర్థమవుతోంది. ప్యాకేజీల కోసం వచ్చే వారి కోసం దామచర్ల తివాచీలు పరుస్తున్నట్లు స్పష్టమవుతోంది. -
అటవీశాఖ.. సరికొత్తగా
జిల్లాల పునర్విభజన తరువాత పరిపాలనా సౌలభ్యం కోసం అటవీ శాఖను కూడా రాష్ట్ర ప్రభుత్వం పునర్ వ్యవస్థీకరించింది. వివిధ ఫారెస్టు రేంజ్ల మార్పులతో పాటు సెక్షన్లు, బీట్ల విభజన కూడా చేశారు. మార్కాపురం, గిద్దలూరు వన్యప్రాణి సంరక్షణ ప్రాంతాలను పులుల అభయారణ్యం కిందకు మార్చారు. ఇప్పటి వరకు డీఎఫ్వో కేడర్ పోస్టులు ఉండగా.. వారి స్థానంలో డిప్యూటీ డైరెక్టర్లను కేటాయించారు. ఆ మేరకు అధికారులు బాధ్యతలు స్వీకరించారు. ఒంగోలు సబర్బన్: రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖను పునర్ వ్యవస్థీకరించింది. అందులో భాగంగా రెగ్యులర్ ఫారెస్ట్ (రిజర్వు), వన్యప్రాణి సంరక్షణ విభాగాలుగా ఉన్న వాటిలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెగ్యులర్ ఫారెస్ట్ విభాగాన్ని మొత్తం జిల్లాలోని 28 మండలాలతో కూడిన పరిధిని ఏర్పాటు చేస్తూ కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. రెగ్యులర్ ఫారెస్ట్ డీఎఫ్ఓ కార్యాలయాన్ని గిద్దలూరు నుంచి జిల్లా కేంద్రం ఒంగోలుకు మార్చారు. ఒంగోలు డీఎఫ్ఓగా కే.మోహనరావును ప్రభుత్వం నియమించింది. పునర్ వ్యవస్థీకరణలో భాగంగానే రెగ్యులర్ అటవీ శాఖ విభాగాన్ని మూడు రేంజ్లుగా, వాటి పరిధిలో 13 సెక్షన్లు, 31 బీట్లు ఉండేలా విభజించారు. రెగ్యులర్ ఫారెస్ట్ డీఎఫ్ఓ కార్యాలయం పరిధిలో మొత్తం 28 మండలాల పరిధిలో 1,11,834.140 హెక్టార్ల రిజర్వు ఫారెస్ట్ భూములు ఉన్నాయి. డీఎఫ్ఓ కార్యాలయాన్ని ఒంగోలు దక్షిణ బైపాస్ రోడ్డులోని గతంలో ఒంగోలు రేంజ్ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. సామాజిక అటవీ విభాగానికి (సోషల్ ఫారెస్ట్) ఎలాంటి మార్పులు చేయలేదు. డీఎఫ్ఓ కార్యాలయం యధావిధిగా ఒంగోలులోనే ఉంటుంది. సామాజిక వన విభాగం డీఎఫ్వోగా ఉన్న మహబూబ్ బాషాను బదిలీ చేసి ఆయన స్థానంలో సునీతను నియమించారు. గిద్దలూరు, గిద్దలూరు డీడీలు శ్రీశైలం పులుల అభయారణ్యం పరిధిలోకి... అటవీ విభాగాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా మార్కాపురం, గిద్దలూరు డిప్యూటీ డైరెక్టర్ పులుల అభయారణ్యం కార్యాలయాలు శ్రీశైలంలోని డైరెక్టర్ పులుల అభయారణ్యం కార్యాలయం పరిధిలోకి వెళ్లిపోయాయి. గతంలో వన్యప్రాణి సంరక్షణ డివిజన్గా ఉన్న మార్కాపురాన్ని శ్రీశైలం పులుల అభయారణ్యంలోకి విలీనం చేశారు. ఇప్పటి వరకు మార్కాపురం డీఎఫ్వో కేడర్లో ఉండేది. దానికి డిప్యూటీ డైరెక్టర్ హోదా కల్పించారు. దాంతో పాటు గిద్దలూరులో రెగ్యులర్ ఫారెస్ట్ (అటవీ డివిజన్)ను డీఎఫ్ఓ కార్యాలయాన్ని ఒంగోలుకు తరలించటంతో గిద్దలూరు ప్రాంతాన్ని పులుల అభయారణ్యం పరిధిలో చేర్చారు. గిద్దలూరు కార్యాలయాన్ని కూడా డిప్యూటీ డైరెక్టర్ హోదా కల్పించి శ్రీశైలం టైగర్ ప్రాజెక్టు పరిధిలోకి మార్చారు. గిద్దలూరు టైగర్ ప్రాజెక్టు పరిధిలో కొన్ని మండలాలతో పాటు, నల్లమల అభయారణ్యం ఉంటుంది. ఒంగోలు కార్యాలయంలో సేవలు అందుబాటులో ఒంగోలు నగరంలోని డీఎఫ్ఓ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తాం. గతంలో ఏ పని కావాలన్నా జిల్లాలోని నలుమూలల నుంచి గిద్దలూరు డీఎఫ్ఓ కార్యాలయానికి రావాల్సి వచ్చేది. ప్రజలకు ఎలాంటి అనుమతులు కావాలన్నా ఒంగోలు డీఎఫ్ఓ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. – కే.మోహన రావు, డీఎఫ్ఓ, రెగ్యులర్ ఫారెస్ట్ -
జంగిల్ సఫారీ కొత్త కొత్తగా..!
నల్లమల పర్యావరణ ప్రేమికులకు శుభవార్త..సరికొత్త హంగులతో జంగిల్ సఫారీ కనువిందు చేయనుంది. పులుల సంతానోత్పత్తి కోసం మూడు నెలల పాటు జంగిల్ సఫారీ, ఇష్టకామేశ్వరి యాత్రలకు అధికారులు బ్రేక్ వేశారు. తిరిగి శనివారం నుంచి ఈ యాత్రలు ప్రారంభం కానున్నాయి. విరామ సమయంలో రోబోటిక్ టెక్నాలజీతో మ్యూజియం, లక్షలాది రూపాయలతో విద్యుద్దీకరణ, ఫన్ ఆర్చరీ క్లబ్, పర్యాటకులు విశ్రాంతి తీసుకునేందుకు కొత్తగా పగోడాలు ఇలా పర్యాటకులకు కనువిందు చేసేలా పలు ప్రాంతాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ ప్రయాణం సరికొత్త అనుభూతులను నింపనుంది. పెద్దదోర్నాల(ప్రకాశం జిల్లా):నల్లమల అభయారణ్యం ఈ పేరు వింటేనే ప్రకృతి ప్రేమికుల మనస్సు పులకిస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, ఎత్తైన పర్వతాలు, సుందర మనోహర లోయలు, ఆకాశాన్ని అందేలా మహా వృక్షాలు కనువిందు చేస్తాయి. తుమ్మలబైలు వద్ద ఏర్పాటు చేసిన జంగిల్ సఫారీ ఎన్నో వింతలు విశేషాలను పంచుతుంది. దట్టమైన అటవీ ప్రాంతంలో పచ్చని పచ్చిక బయళ్ల నడుమ వన్యప్రాణులను వీక్షిస్తూ వాహనాలలో అభయారణ్యంలో పర్యటిస్తుంటే ఆ ఆనందమే వేరు. పులుల సంతానోత్పత్తి కాలంలో అవి అడవిలో ప్రశాంతంగా సంచరించేందుకు వీలుగా పర్యాటకానికి మూడు నెలలు బ్రేక్ పడింది. తిరిగి శనివారం నుంచి సఫారీ ప్రారంభం కానుంది. ఈ మూడు నెలల్లో పర్యాటకుల కోసం అడవిలో ముఖ్య ప్రాంతాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రోబోటిక్ టెక్నాలజీతో మ్యూజియం: రోబోటిక్ టెక్నాలజీతో సరికొత్త మ్యూజియాన్ని సిద్ధం చేస్తున్నారు. పెద్దపులులు, చిరుత పులులు, జింకలు, నీల్గాయ్లు, తోడేళ్లు, రైలు ఎలుగులు, వేటకుక్కలు, పాములు ఇలా ఎన్నో వన్యప్రాణుల ఆకృతులను ఏర్పాటు చేయనున్నారు. ఏ వన్యప్రాణి ప్రతిమ ముందు నిలబడితే ఆ వన్యప్రాణికి సంబంధించి పూర్తి వివరాలు, విశేషాలు మనకు రోబోటిక్ టెక్నాలజీ ద్వారా స్పీకర్లలో వినేలా తీర్చిదిద్దుతున్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా విశాఖపట్నం, హైదరాబాద్ల్లో తయారు చేస్తున్నారు. దీంతో పాటు పర్యాటకులు విశ్రాంతి తీసుకునేందుకు సరికొత్తగా పగోడాలను ఏర్పాటు చేశారు. అందులో యాత్రికులు పలహారాలను, మధ్యాహ్న భోజనాలు చేసే అవకాశం ఉంది. సీతాకోక చిలుకలు, తాబేళ్ల ఆకారాల్లో కూర్చునేందుకు ప్రత్యేక సీట్లు, చిన్నారులను ఆకట్టుకునే కొత్త కొత్త ఆకృతులు, అధునాతన టాయిలెట్లు ఇలా ఎన్నో నూతన సొగబులు సిద్ధం చేశారు. జంగిల్ సఫారీలో భాగంగా పులి చెరువు, నరమామిడి చెరువు ప్రాంతాల్లో స్వేచ్ఛగా సంచరించే పెద్దపులితో పాటు, చిరుతలు, కృష్ణ జింకలు, దుప్పులు, నెమళ్లు జిప్సీలలో ప్రయాణించే పర్యాటకులకు అనీర్వచనీయమైన అనుభూతికి ఇస్తాయనటంలో ఎటువంటి సందేహం లేదు. దీంతో పాటు భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారమైన ఇష్టకామేశ్వరి యాత్రను సైతం అధికారులు శనివారం ప్రారంభించనున్నారు. జంగిల్ సఫారీలో ప్రయాణం కొనసాగుతుంది ఇలా.. పెద్దదోర్నాల నుంచి శ్రీశైలం వెళ్లే రహదారిలోని 24వ కిలోమీటరు వద్ద నున్న గొర్లెస్ కాలువగా పిలిచే ప్రాంతం నుంచి రెండు విలాసవంతమైన వాహనాల్లో ఈ ప్రయాణం మొదలవుతుంది. లోతట్టు అటవీ ప్రాంతంలోని నరమామిడి చెరువు, వ్యూపాయింట్, పులిచెరువు తదితర ప్రాంతాల మీదుగా తిరిగి ముఖద్వారం వద్దకు చేరుకోవటంతో పర్యటన ముగుస్తుంది. సుమారు 14 కిలోమీటర్ల మేర 1.30 గంటల పాటు జరిగే ఈ ప్రయాణం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. అడవిలో ప్రయాణించేందుకు ప్రత్యేకంగా జిప్సీ ఏర్పాటు చేశారు. ఆరుగురు మాత్రమే కూర్చునే వీలుంటుంది. జిప్సీకి ఒక ట్రిప్పునకు రూ.2400 వసూలు చేస్తారు. సఫారీకి అధునాతన హంగులు జంగిల్ సఫారీకి అధునాతన హంగులను సమకూరుస్తున్నాం. రోబోటిక్ టెక్నాలజీతో కూడిన వన్యప్రాణుల ఆకృతులను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాం, సందర్శకుల విశ్రాంతికి పగోడాలు, టాయిలెట్లు సిద్ధం చేశాం. చిన్నారుల కోసం ఆకట్టుకునేలా ఎన్నో ఏర్పాట్లు చేశాం. – విశ్వేశ్వరరావు, రేంజి అధికారి, పెద్దదోర్నాల -
జీవనోపాధులను మెరుగుపరుస్తున్న స్త్రీ నిధి రుణాలు
మహిళా సాధికారత సాధించే దిశగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సత్ఫలితాలిస్తున్నాయి. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం ఇస్తున్న స్త్రీ నిధి రుణాలు వారి జీవనోపాధులను మెరుగుపరుస్తున్నాయి. సొంతంగా వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబానికి చేదోడుగా నిలిచేలా చేస్తున్నాయి. తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లిస్తూ మహిళలు ఆర్థికంగా బలపడుతున్నారు. గుజ్జిబోయిన రంగలక్ష్మమ్మ. గిద్దలూరు మండలం దిగువమెట్ట గ్రామం. రెండేళ్ల క్రితం వరకు కూలి పనులకు వెళ్తుండేది. ఆమె భర్త మేదర పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారు. రంగలక్ష్మమ్మ చెన్నకేశవ పొదుపు గ్రూపులో సభ్యురాలిగా చేరి తొలి విడత రూ.50 వేల స్త్రీ నిధి రుణం తీసుకుని సకాలంలో చెల్లిస్తూ తిరిగి రెండోసారి రూ.50 వేల రుణం తీసుకుంది. ఆ నగదుతో ఆరు నెలల క్రితం బుట్టలు, చాటలు, ఇతర వెదురు అల్లికల వస్తువులు పెద్ద మొత్తంలో తయారు చేసి ఇంటి వద్దనే దుకాణం పెట్టుకున్నారు. క్రమంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. కుటుంబ అవసరాలకు ఇబ్బంది లేకుండా ఉందని సంతోషంగా చెబుతోంది. గిద్దలూరు రూరల్: మహిళలు పురుషులపై ఆధారపడకుండా వారి స్వశక్తితో జీవితంలో ముందుకు సాగాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసం స్త్రీ నిధి పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రభుత్వం ఇచ్చే రుణాలతో వివిధ రకాల వ్యాపారాలు కొనసాగిస్తూ నాలుగు రూపాయలు వెనకేసుకుంటూ ఆర్థిక స్వాలంబన దిశగా అడుగులు వేస్తున్నారు. మహిళలు ఒకరి పై ఆధారపడకుండా వారి కాళ్ల మీద వారు నిలబడేలా ప్రభుత్వం వారికి చేయూతనిస్తోంది. జిల్లాలో ని 38 మండలాలకు గాను 6599 పొదుపు గ్రూపులు ఉన్నాయి. అందులో 20,191 మంది సభ్యులైన మహిళలకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.62.8 కోట్లను స్త్రీ నిధి కింద రుణాలిచ్చినట్లు స్త్రీనిధి ప్రాజెక్టు ఏజీఎం హర్షవర్ధన్ తెలిపారు. పొదుపు గ్రూపు సభ్యులందరి సమ్మతితో రుణం తీసుకుని వారి భాగానికి వచ్చే నగదుతో కొందరు బుట్టలు, తట్టలు, చాటలు, విసనకర్రలు, గొర్రెలు, మేకల పెంపకం, మెడికల్ షాపు, చిల్లర వ్యాపారం, చీరల దుకాణం, సప్లయర్స్ సామాన్లు వంటి వివిధ రకాల ఇతర వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. వ్యాపారం చేయగా వచ్చిన డబ్బుతో నెమ్మది నెమ్మదిగా తీసుకున్న రుణాలను తీర్చుకుంటూ రుణవిముక్తులవుతున్నారు. ఒక వైపు కుటుంబ భారాన్ని మోస్తూ మరో వైపు వ్యాపారాలు కొనసాగిస్తూ ఆదర్శనీయంగా నిలుస్తున్నారు. స్త్రీ నిధి పథకం ద్వారా రుణం పొందిన వారు ప్రమాదవశాత్తు మరణిస్తే తిరిగి వారు తీసుకున్న రుణం చెల్లించాల్సిన అవసరం లేదు. పుష్కలంగా ఎరువులు ఖరీఫ్ ఆశాజనకంగా సాగుతోంది. జిల్లాలో అధికంగా వరి సాగు చేశారు. ఎరువులు వాడే తరుణం వచ్చింది. మార్కెట్యార్డులు, సొసైటీల వద్ద క్యూలైన్లు అవసరం లేదు. తెల్లవారుజామునే పరుగులు తీయాల్సిన పనిలేదు. బ్లాక్ మార్కెట్ను ఆశ్రయించాల్సిన పనిలేదు. పడిగాపులు కాయాల్సిన అవసరం అంతకంటే లేదు. పంటకు ఎరువు వేయాల్సిన సమయంలో ఎరువులు చేతికందుతాయో లేదో అనే చింత లేదు. రైతన్న సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన ఆర్బీకేలు చింత తీరుస్తున్నాయి. ప్రస్తుతం అవసరం మేరకు ఎరువులు సిద్ధం చేశారు. దీంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్లో 2,42,314 ఎకరాల్లో సాగు చేశారు. సాధారణ విస్తీర్ణం 3,16,169గా ఉంది. మిగిలిన 73,855 ఎకరాల్లో వరి, మిరప పంటల సాగుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అందులో వరి, పత్తి, మిరప, పసుపు ఇతర అపరాలు ఉన్నాయి. ఎరువులు వాడే తరుణం వచ్చింది. జిల్లాలో ఎరువులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయి. ఇంకా కావాల్సిన ఎరువులకు ఇప్పటికే ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు పంపింది. ఎరువు ఎంత అవసరమంటే.. ఇప్పటి వరకు జిల్లాలో సాగు చేసిన పంటలకు గాను 72,000 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం. ఇప్పటికే 20,048 మెట్రిక్ టన్నుల యూరియా, 10,356 మెట్రిక్ టన్నుల డీఏపీ, 17,500 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్, 1,763 మెట్రిక్ టన్నుల పోటాష్ కలిపి మొత్తం 49,667 మెట్రిక్ టన్నుల ఎరువులు జిల్లాలోని డీలర్లు, సొసైటీలు, ఆర్బీకేల ద్వారా వ్యవసాయ శాఖ రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. సాగునీరు అందుబాటులో.. ఈఏడాది వర్షమేఘాల కోసం ఎదురుచూడాల్సిన పనిలేకుండాపోయింది. జిల్లాలో జూన్, జూలై మాసాల్లో అధిక వర్షపాతం నమోదైంది. ఈ సంవత్సరం అన్ని ముఖ్య పంటలు జూలై చివరి వారం నుంచి సాగు మొదలైంది. దీంతో సెప్టెంబర్లో వాడే డీఏపీ ఎరువు ఈ నెలలోనే అవసరం అయింది. జిల్లాకు 12,850 మెట్రిక్ టన్నుల డీఏపీ అవసరం కాగా, ఆగస్టు 26 నాటికి సుమారు 14,535 మెట్రిక్ టన్నుల డీఏపీ లభ్యతలోకి వచ్చింది. ఇంకా 2,758 మెట్రిక్ టన్నుల డీఏపీ ఆర్బీకేలు, సొసైటీలు, ప్రైవేటు డీలర్ల వద్ద అందుబాటులో ఉంది. ఎరువుల సరఫరా నిరంతర ప్రక్రియ రైతులకు అవసరమైన ఎరువుల ఇండెంట్ మేరకు సరఫరా ప్రక్రియను ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆగస్టు 24వ తేదీ నుంచి నెలాఖరువరకూ 2,650 టన్నుల డీఏపీ జిల్లాకు వచ్చింది. ఆర్బీకేలకు, సహకార సంఘాలకు సరఫరా చేయడం జరిగింది. అలాగే ప్రైవేటు ఎరువుల డీలర్ల వద్ద కూడా ఎరువుల లభ్యత సంవృద్ధిగా ఉంది. జిల్లాకు వచ్చిన డీఏపీ ఎరువులను వ్యవసాయ అధికారుల పర్యవేక్షణలో మాత్రమే రైతులకు అందించాలని, బ్లాక్ మార్కెట్, కొరత రాకుండా చూడాలని జిల్లా వ్యవసాయ అధికారిని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఖరీఫ్లో కొరత లేదు జిల్లాలో ఖరీఫ్కు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయి. కొరత రాకుండా ముందస్తు ప్రణాళికతో అన్ని చర్యలు తీసుకున్నాం. కోటా మేరకు ఎరువులు సరఫరా జరిగేలా కంపెనీ ప్రతినిధులు, డిస్ట్రిబ్యూటర్లు, మార్క్ఫెడ్ అధికారులతో తరచూ సమీక్షిస్తున్నాం. ఖరీఫ్ పూర్తయ్యేలోగా వేసిన పంటలకు జిల్లాకు నిర్దేశించిన ఎరువులు తెప్పిస్తాం. ఇంత వరకు జిల్లాలో ఎక్కడా ఏ రకం ఎరువు కొరతే లేదు. ఆగస్టులో కోటా కంటే ఎక్కువే తెప్పించాం. మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడవద్దు. –నున్న వెంకటేశ్వర్లు, గుంటూరు జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
వాట్సాప్లో మెసేజ్.. అన్నా.. నేను చనిపోతున్నా..!
పెద్దారవీడు(ప్రకాశం జిల్లా): ఇంటర్మీడియెట్లో ఫెయిల్ కావడంతో మనస్థాపం చెందిన ఓ విద్యార్థి వెలిగొండ ప్రాజెక్టు డ్యామ్ పైనుంచి దూకి అర్ధంతరంగా తనువు చాలించాడు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు పుట్టెడు శోకం మిగిల్చిన ఈ విషాద సంఘటన పెద్దారవీడు మండలం పుచ్చకాయలపల్లె గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. మృతుడి బంధువుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన వజ్రాల అశోక్రెడ్డి(17) మార్కాపురం పట్టణంలో ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ఎంపీసీ గ్రూప్ ద్వితీయ సంవత్సరం చదివాడు. చదవండి: కూల్డ్రింక్లో మత్తు మందు కలిపి.. స్నేహితుడి భార్యను లొంగదీసుకుని.. పరీక్షలు రాసిన తర్వాత నంద్యాల పట్టణంలో ఎంసెట్ కోచింగ్ తీసుకుంటున్నాడు. బుధవారం విడుదలైన ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాల్లో అశోక్రెడ్డి ఉత్తీర్ణుడు కాలేదు. గురువారం నంద్యాల నుంచి స్వగ్రామానికి వచ్చి తల్లిదండ్రులు, అన్న, అక్కతో గడిపాడు. అన్న ఆదినారాయణరెడ్డి ట్రాక్టర్ తీసుకుని పొలం పనులకు వెళ్లాడు. ఇంతలోనే అశోక్రెడ్డి గ్రామానికి సమీపంలో ఉన్న వెలిగొండ ప్రాజెక్టు డ్యామ్ పైకి ఎక్కి తన అన్నతో పాటు జమనపల్లె గ్రామంలోని స్నేహితులకు ‘నేను చనిపోతున్నా’ అని వాట్సాప్లో మెసేజ్ పంపించాడు. తన సోదరుడు వచ్చేలోపు అశోక్రెడ్డి డ్యామ్ పైనుంచి దూకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. డ్యామ్ లోతు దాదాపు 400 అడుగులు ఉంటుందని స్థానికులు తెలిపారు. కుమారుడు మరణించడంతో తల్లిదండ్రులు వెంకటరెడ్డి, రమణమ్మ గుండెలవిసేలా విలపించడం అందరినీ కంటతడి పెట్టించింది. -
పవన్.. బీజేపీని రోడ్ మ్యాప్ అడగటం ఏంటి?: మంత్రి బాలినేని
సాక్షి, ప్రకాశం జిల్లా: గత ఎన్నికల్లో చంద్రబాబును తిట్టి ఒంటరిగా పోటీ చేసిన పవన్ కల్యాణ్.. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పొత్తుల కోసం వెంపర్లడటం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబును తిట్టిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు ఆయనతో కలసి పొత్తుపెట్టుకోవడాన్ని ప్రజలు హర్షించరని తెలిపారు. జనసేన పార్టీ పెట్టి.. బీజేపీని రోడ్ మ్యాప్ అడగటం ఏంటని బాలినేని ప్రశ్నించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు భారీ ఎత్తున అమలవుతున్నాయన్నారు. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పవన్ మాట్లాడాలని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హితవు పలికారు. చదవండి: ఏబీ వెంకటేశ్వరరావుకు కేంద్రం షాక్ -
వివాహేతర సంబంధం: గుంటూరులో చంపి.. మృతదేహం మార్టూరులో వేసి..
సాక్షి, ఒంగోలు: జిల్లాలోని మార్టూరు వద్ద మూడు రోజుల క్రితం వెలుగుచూసిన హత్యోందంతంలో కిరాయి హంతకుల పాత్ర ఉందని గుర్తించి వారిని అరెస్టు చేసినట్లు ఎస్పీ మలికాగర్గ్ తెలిపారు. మంగళవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలు వెల్లడించారు. ఎస్పీ కథనం ప్రకారం.. ఈ నెల 4వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో మార్టూరు మండలం కోనంకికి చెందిన ఓ రైతు పొలంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఘటన వెలుగులోకి వచ్చింది. మృతదేహాన్ని పరిశీలించి అది హత్యగా పోలీసులు నిర్ధారించారు. అయితే మృతుడు ఎవరనేది తెలియరాలేదు. కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని 72 గంటల్లోనే ఛేదించి నిందితులను కటకటాల వెనక్కు నెట్టారు. కేసు వివరాలు మీడియాకు వెల్లడిస్తున్న ఎస్పీ మలికాగర్గ్, పక్కన ఇతర పోలీసు అధికారులు ఇదీ..కథ మృతుడు గుంటూరు కొత్తపేట మంగళదాస్నగర్కు చెందిన గోగులపాటి బెన్నీ(41)గా గుర్తించారు. ఆయన సతీమణి బుజ్జికి అన్నం సుబ్బరామయ్య అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఈ వ్యవహారంలో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. చంపుతానంటూ పలుమార్లు భార్యను బెన్నీ హెచ్చరించేవాడు. 2021 సెప్టెంబర్ 1న భార్యతో గొడవపడి ఆమెను చంపేందుకు యత్నించాడు. కత్తిపోటు పక్కింటి వ్యక్తికి తగిలి అతను మృతి చెందాడు. ఈ కేసులో అతడు జైలుకు వెళ్లి ఇటీవల బెయిల్పై తిరిగి వచ్చాడు. సుబ్బరామయ్యకు చెందిన అట్టల పరిశ్రమలో రూ.5 లక్షల విలువైన అట్టలు, ఆటోను తగలబెట్టాడు. ఎప్పటికైనా సుబ్బరామయ్యను చంపుతానని భార్యను అతడు బెదిరించాడు. ఈ విషయాన్ని ఆమె అన్నం సుబ్బరామయ్యకు చెప్పింది. ఇద్దరికీ ప్రాణహాని ఉందని సుబ్బరామయ్య భావించి బెన్నీని అడ్డు తొలగించుకునేందుకు పథక రచన చేశాడు. గుంటూరు వెంకటప్పయ్య కాలనీకి చెందిన చల్లా గోపీతో లక్ష రూపాయలకు బెన్నీని హత్య చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. సుబ్బరామయ్య, గోపీ, గుంటూరు సంగడిగుంటకు చెందిన దొడ్డి వెంకట ప్రసాద్, సాయిబాబా కాలనీకి చెందిన ఇక్కుర్తి ఓంకార్, మంగళదాస్ నగర్కు చెందిన గోగులపాటి బుజ్జి, నల్లచెరువుకు చెందిన దుగ్గిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మరో మైనర్ బాలుడు కలిసి ముందుగా ఒక కారును అద్దెకు తీసుకున్నారు. కారులో బెన్నీ ఇంటికి వెళ్లి కత్తితో పొడిచి, ఇనుప రాడ్తో విచక్షణారహితంగా కొట్టి ముఖంపై దిండు ఉంచి ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని కారులో వేసుకుని కోలలపూడి రోడ్లో కోనంకి సమీపంలో పడేసి వెళ్లిపోయారు. ముఠాగా ఏర్పడిన నిందులు పోలీసులు అరెస్టు చేసిన వారిలో దొడ్డి వెంకట ప్రసాద్ అలియాస్ ప్రసాద్ గతంలో దొంగతనాలు, దోపిడీ, హత్యలు, కిడ్నాప్ కేసుల్లో నిందితుడు. లాలాపేట పోలీసుస్టేషన్ పరిధిలో హిస్టరీ షీట్ కూడా ఉంది. వీరంతా ఒక ముఠాగా ఏర్పడి కిరాయి హత్యకు పాల్పడ్డారు. హత్యకు ఉపయోగించిన టవేరా కారు, ఇరన్రాడ్, కత్తి, పది ఫోన్లు, రూ.21 వేల నగదును పోలీసులు సీజ్ చేశారు. కేసును ఛేదించడంలో కృషి చేసిన చీరాల డీఎస్పీ శ్రీకాంత్, ఇంకొల్లు సీఐ సుబ్బారావు, మార్టూరు, ఇంకొల్లు, జె.పంగులూరు ఎస్ఐలు ఎస్వీ రవీంద్రారెడ్డి, ఎన్సీ ప్రసాద్, పున్నారావు, ఫింగర్ ప్రింట్స్ బ్యూరో ఎస్ఐ పి.శరత్బాబు, హెడ్ కానిస్టేబుళ్లు కోటేశ్వరరావు, జి.సుధాకరరావు, జి.పాపారావు, కానిస్టేబుళ్లు కె.శ్రీను, కె.అనీల్కుమార్, సీహెచ్ రత్నరాజు, బీవీ రమణ, బి.అవినాష్, ఎస్కే మొహ్మద్ రఫీ, హోంగార్డులు ఎం.ప్రభాకర్, టి.నాగరాజులను ప్రశంసపత్రాలు, రివార్డులతో ఎస్పీ మలికాగర్గ్ అభినందించారు. -
రాజన్న ప్రగతి బాట: ప్రతి ఇంటి ముంగిటా ఆ అభివృద్ధి వెలుగులే
ప్రతి ఇంటి ముంగిటా ఆ అభివృద్ధి వెలుగులే... ప్రతి పేద గుండెలో ఆ నిండైన రూపమే... బీడువారిన నేలతల్లికి జలసిరులందించిన భగీరథునిలా... లయతప్పిన పేద గుండెకు ఊపిరిలూదిన దైవంలా... చదువు ‘కొన’లేక పేదింటి అక్షరం చిన్నబోతే... వయసుడిగిన నాడు ఆసరాలేక వృద్ధాప్యం ఉసూరుమంటే... ఇంటికి పెద్ద కొడుకై ఆదుకున్న ఆపన్న హస్తంలా.. ఆ మహానేత వైఎస్సార్ నిలిచారు.. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఆ చెరగని జ్ఞాపకాలతో, జిల్లాకు వైఎస్సార్ అందించిన అభివృద్ధి ఫలాలపై కథనం. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: నిత్యం కరువు కాటకాలతో అల్లాడుతూ.. అభివృద్ధికి నోచుకోని ప్రకాశం జిల్లాపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధికి బాటలు వేశారు. జలయజ్ఞంతో ఇక్కడి దుర్భిక్ష పరిస్థితుల్ని పారదోలేందుకు నడుంకట్టారు. వైఎస్సార్ అధికారంలోకి రాగానే జిల్లాలో 2.60 లక్షల మంది రైతులు తీసుకున్న పంట రుణాలు రూ.480 కోట్లు రుణమాఫీ చేశారు. అందులో 2.17 లక్షల మంది చిన్న, సన్నకారు రైతులు లాభపడ్డారు. 43,572 మంది రైతులకు వారు తీసుకున్న బ్యాంకు రుణాలు ఒకే మొత్తంలో పరిష్కరించుకునే విధానాన్ని అమలు చేశారు. దీంతో రైతులు రూ.97 కోట్ల మేర లబ్ధిపొందారు. కరువుతో అల్లాడిన రైతులు 1,23,147 మందికి ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున రూ.62 కోట్లు రిలీఫ్ స్కీం కింద అందించారు. ఐదేళ్లలో ప్రాజెక్టులకు భారీగా నిధులు ►వైఎస్సార్ జిల్లాలో ప్రాజెక్టులకు భారీగా నిధులిచ్చారు. 24.37 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించేలా చర్యలు చేపట్టారు. ఐదేళ్లలో అన్ని ప్రాజెక్టులకు కలిపి రూ.6,280.11 కోట్లు ఖర్చు చేశారు. ►జిల్లాలోని 63,346 మంది విద్యార్థులకు రూ.30 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారు. రూ.75 కోట్లు పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు అందించారు. ►2004 ముందు జిల్లాలో 2.86 లక్షల మందికి పింఛన్లు ఉన్నాయి. ఇందిరమ్మ మూడు దశల కార్యక్రమాల కింద అదనంగా 1.79 లక్షల మందికి నూతనంగా పింఛన్లు మంజూరు చేశారు. పావలా వడ్డీ కింద రూ.20 కోట్లు పొదుపు గ్రూపులకు రీయింబర్స్మెంట్ ఇచ్చారు. బ్యాంకు లింకేజి రుణాలు రూ.853 కోట్లు మంజూరు చేయించారు. ►జిల్లాలో 7.19 లక్షల మందికి ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులు అందించారు. 10,366 మందికి గుండె ఆపరేషన్లు చేయించారు. జిల్లా కేంద్రం ఒంగోలులో రిమ్స్ మెడికల్ కాలేజీ మంజూరు చేయించారు. 37.46 ఎకరాల్లో దాదాపు రూ.250 కోట్లతో మెడికల్ కళాశాల, వెయ్యి పడకల రిమ్స్ వైద్యశాలల నిర్మాణాలు చేపట్టారు. ►ఐదేళ్లలో 3,22,630 గృహాలు నిర్మించి పేదలకు అందించారు. 19,904 మంది భూమి లేని పేదలకు 31,734 ఎకరాలు పంపిణీ చేశారు. జిల్లాలో రూ.400 కోట్లతో సాగర్ కాలువల ఆధునికీకరణ పనులు చేపట్టటంతో 4.50 లక్షల సాగర్ ఆయకట్టుకు నీరందింది. దీంతో యర్రగొండపాలెం, దర్శి, అద్దంకి, పర్చూరు, సంతనూతలపాడు, మార్కాపురం, ఒంగోలు నియోజకవర్గాల రైతులకు మేలు చేకూరింది. ►కొండపి నియోజకవర్గంలో పొన్నలూరు మండలం చెన్నుపాడు వద్ద పాలేరు నదిపై సంగమేశ్వరం వద్ద రూ.50 కోట్లతో ప్రాజెక్టు మంజూరు చేశారు. ►దర్శి నియోజకవర్గంలో రూ.120 కోట్లతో రక్షిత మంచినీటి పథకం, రూ.2 కోట్లతో మార్కెట్ యార్డు నిర్మించారు. ► కనిగిరి నియోజకవర్గంలో రూ.175 కోట్లతో రక్షిత మంచినీటి పథకం మంజూరు చేశారు. ► కందుకూరులో రూ.110 కోట్లతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మించారు. రూ.80 కోట్లతో రాళ్లపాడు ప్రాజెక్టు అనుసంధానం కోసం సోమశిల ప్రాజెక్టు నుంచి ఉత్తర కాలువ నిర్మించారు. ►గిద్దలూరులో రూ.12 కోట్లతో బైరేనిగుండాల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడంతో పాటు రూ.22 కోట్లతో రామన్న కతువ నిర్మించారు. ► చీరాల, పర్చూరుల్లో కృష్ణా డెల్టా ఆధునికీకరణకు రూ.2 వేల కోట్లు కేటాయించారు. చేనేతలకు 50 ఏళ్లకే పింఛన్ ఇచ్చారు. ► అద్దంకిలో రూ.400 కోట్లతో నార్కెట్పల్లి, అద్దంకి, మేదరమెట్లకు రాష్ట్రీయ రహదారి నిర్మించారు. 5 వేల ఎకరాలకు సాగునీరందించే యర్రం చినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకం మంజూరు చేశారు. ► 2004 మే నెలకు ముందు జిల్లాలో 63,559 మంది రైతుల కరెంట్ బకాయిలు రూ.59.5 కోట్లు వైఎస్సార్ రద్దు చేశారు. ఐదేళ్లలో మొత్తం 86,207 మంది రైతులు ఉచిత విద్యుత్ పొందారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆ సంఖ్య 1.50 లక్షలకు చేరింది. ► 2019 ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తండ్రి బాటలోనే ప్రజా రంజక పాలన సాగిస్తూ వ్యవసాయానికి, మహిళాభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నారు. తండ్రి అడుగుజాడల్లోనే సాగుతూ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకుంటూ నవరత్నాలను ప్రజలకు చేరువ చేస్తున్నారు. -
అక్రమార్కులపై వేటు.. ఆపరేషన్ రెవెన్యూ
జిల్లా రెవెన్యూ శాఖలో ప్రక్షాళన మొదలైంది. అవినీతి తిమింగళాలు, భూ బకాసురులు, అక్రమార్కులపై వేటుపడుతోంది. ఏళ్ల తరబడి కొందరు రెవెన్యూ అధికారులు, సిబ్బంది అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ ప్రతి పనికో రేటు కట్టి రోజువారీ రాబడికి అలవాటుపడ్డారు. అలాంటి కలుపు మొక్కల ఏరివేత యజ్ఞానికి కలెక్టర్ ప్రవీణ్కుమార్ శ్రీకారం చుట్టారు. కలెక్టర్ చర్యలు అక్రమార్కుల వెన్నులో వణుకుపుట్టిస్తున్నాయి. ప్రభుత్వ భూములు కాపాడుతూ రెవెన్యూ యంత్రాంగాన్ని గాడిలో పెట్టే దిశగా అడుగులు వేయడం శుభపరిణామంగా మారింది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: సరిగ్గా రెండు నెలల క్రితం జూన్ 2వ తేదీ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్ కుమార్ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. అధికంగా భూ సమస్యలు ఉండటాన్ని గమనించారు. ప్రభుత్వ భూముల కబ్జాలకు సంబంధించిన వ్యవహారాలను సీరియస్గా తీసుకున్నారు. వాటిలో కొన్నింటిపై విచారణ చేయించారు. అవినీతికి పాల్పడిన ముగ్గురు తహసీల్దార్లతో పాటు రెవెన్యూ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో జిల్లా రెవెన్యూ శాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గంటల వ్యవధిలో ఉద్యోగ విరమణ చేసే తహసీల్దార్ను కూడా సస్పెండ్ చేసి తప్పుచేస్తే ఎవరినీ వదిలిపెట్టేదిలేదన్న సంకేతాలు పంపారు. కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో కలెక్టర్గా ప్రవీణ్కుమార్ బాధ్యతలు చేపట్టారు. సెకండ్ వేవ్ కాస్త తగ్గుముఖం పట్టిన తర్వాత రెండు సోమవారాలు మాత్రమే స్పందన కార్యక్రమాలు నిర్వహించారు. వాటిలో దాదాపు 400కుపైగా రెవెన్యూ పరమైన సమస్యలపై ఫిర్యాదులు అందాయి. దీంతో అవినీతి అధికారులపై చర్యలు చేపట్టే దిశగా కలెక్టర్ వేగంగా అడుగులు వేశారు. గత వారంలో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్షలో సున్నితంగా మందలించారు. తప్పుచేసిన వారిని వదలబోనని, అక్రమాలకు పాల్పడిన వారిని ఎందుకు సస్పెండ్ చేయకూడదో చెప్పాలని నిలదీశారు. వారం తిరగకుండానే అమలుచేశారు. ముగ్గురు తహసీల్దార్లపై సస్పెన్షన్ వేటు... ప్రభుత్వ భూములను రక్షించలేకపోవడం, ఇతరులకు అక్రమంగా కట్టబెట్టడం లాంటి వాటితో పాటు భూ రికార్డులు తారుమారు చేయడం వంటి అక్రమాలకు పాల్పడిన జిల్లాలోని ముగ్గురు తహసీల్దార్లను కలెక్టర్ సస్పెండ్ చేశారు. వారికి సహకరించిన ఆర్ఐలు, వీఆర్వోలను కూడా వదల్లేదు. పొదిలి తహసీల్దార్ ఏవీ హనుమంతరావుతో పాటు ఏఆర్ఐ శివరామ ప్రసన్న, కంబాలపాడు వీఆర్వో కె.కమలాకర్పై సస్పెన్షన్ వేటు పడింది. అదేవిధంగా సిలికా సాండ్ భూముల లీజ్ అంశంలో అక్రమాలకు పాల్పడిన చినగంజాం తహసీల్దార్ కె.విజయకుమారిని కూడా సస్పెండ్ చేశారు. తాజాగా గత శనివారం హనుమంతునిపాడు తహసీల్దార్ ఎన్.సుధాకరరావు, ఆర్ఐ పి.వి.శివప్రసాదు, వేములపాడు వీఆర్వో బి.నరసింహం, సీఎస్ పురం మండలం పెదగోగులపల్లి వీఆర్వో జే నాగేశ్వరరావును సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ భూములను అక్రమార్కులకు కట్టబెట్టి ఆన్లైన్ చేసినట్లు వీరందరిపై ఆరోపణలు ఉండగా, విచారణలో రుజువు కావడంతో కలెక్టర్ కఠినంగా స్పందించారు. ప్రత్యేకంగా రెవెన్యూ ‘స్పందన’కు చర్యలు... జిల్లాలోని ప్రభుత్వ భూములను ఆక్రమణదారులు, కబ్జాదారుల బారి నుంచి కాపాడటంతో వారికి సహకరించిన రెవెన్యూ అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలకు కలెక్టర్ ఉపక్రమించారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఉన్న సచివాలయాల ద్వారా ప్రభుత్వ భూముల వివరాలు సేకరించి కబ్జాలకు గురైన ప్రభుత్వ భూముల వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారితో పాటు వారికి అప్పనంగా కట్టబెట్టిన అవినీతి అధికారులపై విచారణ నిర్వహించి వారందరినీ ఏరివేసేందుకు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా, కొందరు అవినీతి రెవెన్యూ అధికారులు, సిబ్బంది ధనార్జనే ధ్యేయంగా ప్రైవేటు వ్యక్తుల భూములు సైతం సంబంధం లేని వ్యక్తుల పేర్లపై మారుస్తూ రికార్డులు తారుమారు చేస్తున్నారు. రైతులకు సంబంధించిన భూ సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇలాంటి ఫిర్యాదులు కూడా ‘స్పందన’లో కలెక్టర్ దృష్టికి వచ్చాయి. వీటన్నింటి పరిష్కారం కోసం గ్రామాల వారీగా భూ రికార్డులు పరిశీలించి ‘రెవెన్యూ స్పందన’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా మూడు నెలల వ్యవధిలో ప్రైవేటు భూములకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నారు. ఫిర్యాదుల్లో సగానికిపైగా భూ సమస్యలే... ఎన్ని స్పందన కార్యక్రమాలు నిర్వహించినా, ఎన్ని సమస్యలు పరిష్కరించినా.. రెవెన్యూ విభాగంలోని కొందరు అధికారులు, సిబ్బంది చేస్తున్న తప్పుల కారణంగా భూ సమస్యలు అధికంగా వస్తున్నాయని కలెక్టర్ గుర్తించారు. గత సంవత్సరం, ఈ సంవత్సరం రెవెన్యూ పరమైన ఫిర్యాదుల్లో భూ సమస్యలు వేలల్లో ఉన్నాయి. 2020 జూన్ నుంచి అక్టోబర్ వరకు జిల్లా మొత్తం మీద భూ సమస్యలు, రెవెన్యూ అంశాలపై 13,766 అర్జీలు రాగా, 2020 నవంబర్ నుంచి ఇప్పటి వరకు 2,583 ఫిర్యాదులు వచ్చాయి. పాస్ పుస్తకాలు ఇవ్వాలని, వాటిని ఆన్లైన్ చేయాలని, ఒకరి భూమిని మరొకరి పేరుమీద ఆన్లైన్ చేశారని.. ఇలా జిల్లా వ్యాప్తంగా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. అవినీతికి పాల్పడితే ఉపేక్షించం : కలెక్టర్ ప్రవీణ్కుమార్ అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదు. ఎంతటి అధికారినైనా ఉపేక్షించేది లేదు. ప్రజలకు సేవ చేస్తూ మంచి పేరు తెచ్చుకునే అధికారులకు అండగా ఉంటా. అధికారుల సంక్షేమాన్ని ఏ విధంగా చూస్తానో, అవినీతికి పాల్పడే అధికారులపై చర్యలకు కూడా అదేవిధంగా వెనకాడేది లేదు. అన్ని శాఖల అధికారులు దీనిని గుణపాఠంగా తీసుకుని కార్యాలయాలకు వచ్చే ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలి. -
వేటపాలెం సొసైటీ అవకతవకలపై విచారణ
సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లా చీరాల మండలంలోని వేటపాలెం కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో ఆర్థిక అవకతవకలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాబు అధికారులను ఆదేశించారు. ఈ సొసైటీలో పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ పత్రికల్లో వచ్చిన కథనాలపై ఆదివారం ఆయన స్పందించారు. ఏపీ సహకార సంఘాల చట్టం సెక్షన్ 51 ప్రకారం విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. ప్రకాశం జిల్లా సహకార శాఖాధికారి రాజశేఖర్, డీఎస్పీ శ్రీకాంత్, సీఐ రోశయ్య ఇప్పటికే వేటపాలెం సొసైటీలో విచారణ చేపట్టారన్నారు. బాధితుల ఫిర్యాదుతో కార్యదర్శితో పాటు మరికొంత మందిపై కేసులు నమోదు చేశారన్నారు. కాగా ఈ వ్యవహారంపై ఇద్దరు సీనియర్ అసిస్టెంట్ రిజిస్ట్రార్లతో ప్రాథమిక దర్యాప్తుకు ఆదేశించామని, డిపాజిటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నివేదిక ఆధారంగా బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. -
Munna Gang: దారుణాలు.. ఒంగోలు కోర్టు సంచలన తీర్పు
సాక్షి, ప్రకాశం జిల్లా: హైవే కిల్లర్ మున్నాకు ఒంగోలు కోర్టు ఉరిశిక్ష విధించింది. అతడితో పాటు మరో 10 మందికి కూడా మరణ శిక్ష ఖరారు చేసింది. కాగా పోలీసులం అంటూ లారీలను తనిఖీ చేసి పలువురు లారీ డ్రైవర్లు, క్లీనర్లను దారుణంగా చంపిన కేసులో మున్నా దోషిగా ఉన్నాడు. 2008లో వెలుగు చూసిన ఇలాంటి 4 కేసుల్లో మొత్తం 18 మందిపై నేరం నిర్ధారణ అయ్యింది. తనిఖీ పేరిట ఆపి.. మున్నా గ్యాంగ్ పోలీసుల మాదిరి వేషాలు ధరించి హైవేపై వాహనాలను ఆపేవారు చెకింగ్ పేరుతో లారీలోకి డ్రైవర్లు, క్లీనర్ల గొంతులకు తాడు పాశవికంగా హతమార్చేవారని పోలీసుల విచారణలో తేలింది. ఒంగోలు పరిధిలో మొత్తం 4 కేసుల్లో ఏడుగురిని హత్య చేసినట్టు నిరూపణ అయ్యింది. తమిళనాడు లారీ డ్రైవర్ రామశేఖర్, క్లీనర్ పెరుమాళ్ సుబ్రమణిలను ఉలవపాడు సమీపంలో హత్యచేసి అందులోని 21.7 టన్నుల ఇనుమును గుంటూరులోని ఒక ప్రముఖ వ్యాపారికి విక్రయించారు. డ్రైవర్, క్లీనర్ శవాలను గోతాలలో కుక్కి మద్దిపాడు మండలం ఇనుమనమెళ్లూరు గుండ్లకమ్మ వాగు కట్టలో పూడ్చిపెట్టారు. తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్ నుంచి 21.7 టన్నుల ఇనుప రాడ్లతో తమిళనాడులోని కల్పకంకు బయలుదేరిన లారీతోపాటు డ్రైవర్, క్లీనర్ అదృశ్యమయ్యారంటూ 2008 అక్టోబర్ 17న లారీ యజమాని వీరప్పన్ కుప్పుస్వామి ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన పోలీసులు.. సయ్యద్ అబ్దుల్ సమద్ అలియాస్ మున్నా గ్యాంగ్ పనేనని తెలుసుకున్నారు. అతడి కోసం గాలింపు చేపట్టారు. అప్రమత్తమైన మున్నా.. దేశం వదిలి పారిపోయేందుకు యత్నించాడు. అయితే ఎట్టకేలకు కర్ణాటకలోని ఒక మాజీ ఎమ్మెల్యే ఫాంహౌస్లో అతడిని అరెస్టు చేసిన పోలీసులు ఒంగోలుకు తీసుకువచ్చారు. చదవండి: హైవే కిల్లర్ మున్నా గ్యాంగ్ దారుణాలు -
కడుపులో బిడ్డ.. కళ్ల ముందు జీవశ్చవంలా భర్త..
ఒంగోలు టౌన్: బ్లాక్ ఫంగస్ బారిన పడినవారి బతుకు చీకటి మయమవుతోంది. కరోనా నుంచి కోలుకున్నా సంబంధిత వ్యక్తి శరీరంలోని షుగర్ లెవల్స్పై బ్లాక్ ఫంగస్ దాడి చేస్తోంది. ఒంగోలులోని సీతారాంపురంలో నివాసముంటున్న పందిపంట్ల శ్రీను అనే యువకుడు కరోనా నుంచి కోలుకున్న తర్వాత బ్లాక్ ఫంగస్ బారినపడి ఒక కనుగుడ్డును పూర్తిగా తొలగించేశారు. అయితే ఆ ఫంగస్ ఇంకా శరీరంలోనే ఉండటంతో రెండో కంటిపై కూడా ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయిన ఆ వ్యక్తి.. చివరకు ఒక కన్నును కూడా కోల్పోయాడు. ప్రస్తుతం చెన్నైలోని సిమ్స్ హాస్పిటల్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. వైద్యానికి దాదాపు రూ.18 లక్షల వరకు ఖర్చువుతుందని చెప్పడంతో శ్రీను భార్య మాలతి ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం ఆరో నెల గర్భిణి అయిన మాలతి కందుకూరులోని తన తండ్రి వద్ద ఉంటోంది. తల్లి చనిపోవడంతో తండ్రి వద్దనే ఉంటోంది. తిరగని ఆస్పత్రి లేదు... శ్రీను కరోనా బారిన పడటంతో గత నెల 21వ తేదీ కందుకూరులోని ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. వారం రోజుల తర్వాత 28వ తేదీ డిశ్చార్జి చేశారు. ఆ తర్వాత నుంచి కుడి కన్ను వాసి ఎర్రగా ఉండటంతో కందుకూరులోని ఈఎన్టీ ఆస్పత్రికి వెళితే కంటిలో రక్తం గడ్డ కట్టిందని హైదరాబాద్ వెళ్లాలని వైద్యుడు సూచించారు. దీంతో హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్, నిమ్స్ హాస్పిటల్, సరోజినిదేవి హాస్పిటల్, కోఠిలోని ఈఎన్టీ హాస్పిటల్స్ చుట్టూ తిరిగారు. అయితే కరోనా కేసులు ఉండటంతో అక్కడ చేర్చుకోలేదు. చివరకు యశోద హాస్పిటల్లో జాయినై ఎంఆర్ఐ, బ్రెయిన్, సిటీ స్కాన్ చేసిన తర్వాత మెదడుకు ఇన్ఫెక్షన్ పాకిందని, అర్జంట్గా చెన్నై తీసుకువెళ్లాలని వైద్యులు సూచించారు. ఈనెల 12వ తేదీ చెన్నైలోని సిమ్స్ హాస్పిటల్లో చేర్పించారు. బ్లాక్ ఫంగస్ సోకిందని గుర్తించిన వైద్యులు వెంటనే యాంటీ ఫంగస్ ఇంజక్షన్లు చేశారు. ఆ ఫంగస్ బ్రెయిన్కు కూడా పాకడంతో 18వ తేదీ ఆపరేషన్ చేసి కుడి కన్నుగుడ్డును పూర్తిగా తొలగించేశారు. అయితే ఆ ఇన్ఫెక్షన్ ఎడమ కంటిపై కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దానికితోడు బ్రెయిన్కు కూడా ఫంగస్ వ్యాపించడంతో అబ్జర్వేషన్లో ఉంచారు. ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు.. చెన్నైలోని సిమ్స్ హాస్పిటల్లో బ్లాక్ ఫంగస్తో ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన భర్తను కాపాడాలంటూ మాలతి వేడుకుంటోంది. వైద్యానికి మొత్తం రూ.18లక్షల ఖర్చవుతుందని, ఎవరైనా దాతలు సాయంచేసి తన భర్త ప్రాణాలను కాపాడాలని కోరుతోంది. ఆరునెలల గర్భిణి యిన మాలతి పుట్టబోయే బిడ్డ గురించి కలలు కనడం కంటే, కంటి ముందే ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్న భర్త ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో తెలియక నరకయాతన అనుభవిస్తోంది. సాయం చేయాలనుకునేవారు 7794896521 నంబర్ను సంప్రదించవచ్చు చదవండి: గొంతు కోసిన భర్త.. కనికరించిన భార్య మాయమాటలతో బాలికను మభ్యపెట్టి.. -
‘ఆ నలుగురూ’.. స్నేహితులే
కొమరోలు: కరోనా దెబ్బకు బంధాలన్నీ బలహీనమైపోతున్నాయి. కొన్ని రోజుల కిందట వరకు నవ్వుతూ పలకరించిన వారే.. ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. చుట్టుపక్కల ఎవరైనా అనారోగ్యంతో చనిపోతే చాలు.. ఇళ్లకు తాళాలు వేసుకొని వెళ్లిపోతున్నారు. అంత్యక్రియలు చేసేందుకు సైతం ముందుకు రాలేనంతగా హడలిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో కూడా కొందరు ముందుకు వచ్చి సాయం చేస్తూ ‘ఆ నలుగురు’గా నిలుస్తున్నారు. మానవత్వం ఇంకా బతికే ఉందని చాటిచెబుతున్నారు. ప్రకాశం జిల్లా కొమరోలుకు చెందిన ప్రైవేటు ఉపాధ్యాయుడు గాదంశెట్టి గుప్తా(40) వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. 4 రోజుల కిందట రక్త పరీక్ష చేయించగా టైఫాయిడ్ అని తేలింది. దీంతో మందులు వాడుతూ ఇంటి వద్దే ఉంటున్నాడు. సోమవారం తెల్లవారుజామున జ్వరం అధికమై.. పరిస్థితి విషమించి మృతి చెందాడు. వైద్య సిబ్బంది వచ్చి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ అని తేలింది. అయినా కూడా అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులెవరూ ముందుకురాలేదు. ఆయన కరోనాతోనే చనిపోయి ఉంటాడని బంధువులు, చుట్టుపక్కల వాళ్లు ఎవరూ దరిదాపుల్లోకి కూడా వెళ్లలేదు. ఇరుగు పొరుగు వాళ్లు ఇళ్లకు తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. వృద్ధులైన తల్లిదండ్రులేమో కుమారుడికి అంతిమ సంస్కారాలు నిర్వహించే స్థితిలో లేరు. బిడ్డలు కూడా లేరు. భార్య ఏమీ చేయలేక సాయం కోసం రోజంతా ఎదురుచూసింది. చివరకు స్నేహితులే మానవత్వంతో ముందుకు వచ్చి.. అంతిమ సంస్కారాలు నిర్వహించారు. వైఎస్సార్సీపీ నాయకుడు షేక్ మౌలాలి, కొమరోలు, దద్దవాడ గ్రామ పంచాయతీ కార్యదర్శులు రమణయ్య, సుబ్బారావు, మాజీ పోస్టల్ ఉద్యోగి థామ్సన్, ‘సాక్షి’ రిపోర్టర్ కృష్ణారెడ్డి... సోమవారం సాయంత్రం గాదంశెట్టి గుప్తా మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకెళ్లి దహన సంస్కారాలు నిర్వహించారు. అంతేకాకుండా ఆర్థికంగా చితికిపోయిన ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు.. కొంత నగదు సేకరించి అండగా నిలిచారు. చదవండి: కరోనా విషాదం: వలంటీర్లే ఆ నలుగురై -
ప్యాంట్ విప్పి తనిఖీ.. అవమానంతో రైలు కిందపడి
సాక్షి, చీరాల: పరీక్షకు స్లిప్పులు తెచ్చాడని పాలిటెక్నిక్ విద్యార్థిని అందరి ముందు తనిఖీల పేరుతో అవమానించడంతో తీవ్ర మనస్తాపం చెంది ఓ విద్యార్థి రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన చీరాల్లోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం జరిగింది. అందిన వివరాల ప్రకారం.. వేటపాలెం మండలం లక్ష్మీపురానికి చెందిన కమల నాగరాజు, ఇందిర దంపతుల రెండో కుమారుడు ఎలీషా (19) బైపాస్ రోడ్డులోని యలమంచిలి సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న పాలిటెక్నిక్ కళాశాలలో ఈఈఈ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం నుంచి కళాశాలలో పరీక్షలు జరుగుతున్నాయి. స్లిప్పులు తెచ్చి పరీక్ష రాస్తున్నాడని స్క్వాడ్ అధికారులు పరీక్ష కేంద్రం వద్దే ప్యాంట్ విప్పించి తనిఖీ చేశారు. అంతేగాక పరీక్ష రాయకుండా బయటకు పంపించారు. డీబార్ కూడా చేస్తున్నట్లు ప్రకటించడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఎలీషా సాయంత్రం బేరుపేట సమీపంలో రైలు కింద బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. మంగళవారం ఉదయం విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ నాయకులు కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారు. విద్యార్థి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న టూటౌన్ సీఐ పాపారావు, ఎస్ఐలు ఆందోళన చేస్తున్న విద్యార్థులతో పాటు కళాశాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. సాయంత్రానికి ఎలీషా మృతదేహంతో కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని కోరుతూ కళాశాల ఎదుట బైఠాయించారు. అన్యాయంగా తమ బిడ్డను పొట్టన పెట్టుకున్నారని, తమకు న్యాయం చేయాలని, తమ బిడ్డ చావుకు కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న చీరాల డీఎస్పీ పి.శ్రీకాంత్ తన సిబ్బందితో కళాశాల వద్దకు చేరుకుని సంఘటన జరగిన తీరు తెలుసుకున్నారు. బాధితుల ఆందోళన.. విద్యార్థుల నినాదాలతో కళాశాల ప్రాంగణం మార్మోగింది. కళాశాల యాజమాన్యం, అధ్యాపకుల తీరుతో ఎలీషా ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎట్టకేలకు మధ్యవర్తుల హామీతో మృతుడి బంధువులు, విద్యార్థులు ఆందోళన విరమించారు. చదవండి: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. కుమార్తె లవ్ మ్యారేజ్: కానిస్టేబుల్ దంపతుల ఆత్మహత్య -
టీడీపీలో అంతర్మథనం!
రెండేళ్ల క్రితం సాధారణ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన టీడీపీ పరాజయ యాత్రను కొనసాగిస్తోంది. ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో నాలుగు దశల్లోనూ ఉనికి చాటేందుకు ఆ పార్టీ పడరాని పాట్లు పడింది. తమ పార్టీ మద్దతుదారులు కాని వారిని తమ వారేనని చెబుతూ బుకాయించింది. వాస్తవానికి వరుస పరాజయాలు, వైఫల్యాలు టీడీపీ ముఖ్య నేతలను అంతర్మథనంలో పడేశాయి. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా క్షేత్ర స్థాయిలో టీడీపీ పరిస్థితి పూర్తిగా దిగజారింది. త్వరలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలోకి దిగేందుకు అభ్యర్థులు సాహసం చేయలేకపోతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పంచాయతీ ఎన్నికల్లో తన మద్దతుదారులతో కనీస పోటీ ఇవ్వలేకపోయిన టీడీపీ.. మున్సి‘పోల్’ సమరానికి ముందే ఢీలా పడింది! పంచాయితీ ఎన్నికల్లో 80 శాతానికి పైగా స్థానాల్లో సత్తా చాటిన వైఎస్సార్ సీపీ మున్సిపల్ ఎన్నికల్లోనూ విజయదుందుభి మోగించేందుకు దూకుడు పెంచింది. జిల్లాలోని అన్ని పురపాలక సంఘాల్లో వైఎస్సార్ సీపీ ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేయగా టీడీపీ తరఫున పోటీ చేసే వారు కరువయ్యారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడం, గత ఏడాది ఎన్నికల ప్రక్రియ ఎక్కడైతే ఆగిందో అక్కడ నుంచే మొదలుపెట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించిన విషయం తెలిసిందే. జిల్లాలో ఒంగోలు నగరపాలక సంస్థతోపాటు ఆరు పురపాలక సంఘాలకు ఈ నెల 10వ తేదీన ఎన్నికలు నిర్వహించి 14వ తేదీన ఓట్ల లెక్కించనున్నారు. గత ఏడాది జరిగిన నామినేషన్ల ప్రక్రియలో అన్ని మున్సిపాలిటీల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే ఆ సమయంలో అనామకులతో నామినేషన్లు వేయించి పరువు దక్కించుకునేందుకు టీడీపీ ప్రయత్నించింది. ఒంగోలు కార్పొరేషన్తోపాటు అన్ని మున్సిపాలిటీల్లో ఇండిపెండెట్ అభ్యర్థులు భారీగా నామినేషన్లు వేశారు. టీడీపీ తరఫున మాత్రం పోటీలో నిలిచేందుకు అభ్యర్థులు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుని కూర్చున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలు, ఇటీవల పంచాయితీ ఎన్నికల్లోనూ ఘోర ఓటమి తర్వాత భయాందోళనలో ఉన్న టీడీపీకి పురపాలక సంఘాల ఎన్నికలు మూలిగే నక్కపై తాటికాయపడ్డ చందంగా మారాయి. పరువు కాపాడుకునేందుకు అభ్యర్థులను బతిమాలి పురపాలక సంఘాల్లో నామినేషన్లు వేయించినా ఈ నెల 3వ తేదీ వరకు ఉపసంహరించుకోకుండా చూసేందుకు ఆ పార్టీ నేతలు నానాతంటాలు పడుతున్నారు. జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో కనీసం వార్డులకు సైతం అబ్యర్థులను నిలపలేని దుస్థితి టీడీపీకి ఏర్పడింది. టీడీపీ అభ్యర్థులతో పోలిస్తే ఇండింపెండెంట్లే అత్యధికంగా నామినేషన్లు వేశారంటే టీడీపీ పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. నామినేషన్ వేసిన వారు సైతం పోటీ నుంచి తప్పుకోవాలని యోచిస్తుండటంతో టీడీపీ నేతలకు నిద్ర పట్టడం లేదు. ఇక బీజేపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీల పరిస్థితి చెప్పనవసరం లేదు. చీరాల మున్సిపాలిటీలో టీడీపీకి అభ్యర్థులు కరువు చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, ఎమ్మెల్సీ పోతుల సునీత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలకు మద్దతు తెలపడం, కరణం తనయుడు వెంకటేశ్, మాజీ మంత్రి పాలేటి రామారావు టీడీపీని వీడి వైఎస్సార్ సీపీలో చేరడంతో చీరాల టీడీపీ ఖాళీ అయింది. దీంతో అక్కడ టీడీపీకి అభ్యర్థులు కరువయ్యారు. చీరాల మున్సిపాలిటీలో 33 వార్డులు ఉండగా 13 వార్డుల్లో టీడీపీ తరఫున ఎవరూ బరిలోకి దిగలేదు. ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసిన వారు సైతం పోటీ నుంచి తప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఒంగోలు నగరపాలక సంస్థతోపాటు జిల్లాలోని మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, చీమకుర్తి వంటి చోట్ల సైతం టీడీపీకి అభ్యర్థులు దొరకక అనామకులతో నామినేషన్ వేయించారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసేనాటికి సగం మందికి పైగా పోటీ నుంచి తప్పుకుంటారనే విషయం టీడీపీ నేతలకు స్పష్టంగా తెలిసినప్పటికీ ఏమీ చేయలేని దుస్థితిలో ఉన్నారు. చదవండి: బాబు బూతు పురాణం: రెచ్చగొట్టి.. రచ్చచేసి! -
1970లో ఎన్నిక, ఇప్పటికీ పెద్ద దిక్కు ఆయనే!
నాగులుప్పలపాడు: ఐదు దశాబ్దాల క్రితం 1970లో పంచాయతీ బోర్డుకు ఒక యువకుడు ఎన్నికయ్యాడు. వామపక్ష భావజాలం నుంచి వచ్చిన అతడు 17 ఏళ్ల పాటు ఆ గ్రామ సర్పంచ్గా పనిచేశాడు. గ్రామాభివృద్ధికి తన వంతు కృషి చేస్తూ ఈ రోజుకూ గ్రామానికి ‘పెద్ద దిక్కు’గానే కొనసాగుతున్నాడు. అదే ఉత్సాహంతో నేడు మరోసారి సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచాడు. ఈ పర్యాయం ఆయన వయస్సు 80 ఏళ్లు. అయినా ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. ఆయనే ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం కండ్లగుంటకు చెందిన పల్లెర్ల వెంకారెడ్డి. ఇదీ రాజకీయ ప్రస్థానం.. నాడు వామపక్ష భావజాలం బలంగా ఉన్న గ్రామా ల్లో కండ్లగుంట కూడా ఒకటి. అభ్యుదయవాదిగా ప్రజల్లో గుర్తింపు పొందిన వెంకారెడ్డి 1970లో తొలిసారి పంచాయతీ బోర్డుకు ఎన్నికయ్యారు. 1982 వరకు సర్పంచ్ కొనసాగారు. 1983లో మరోసారి సర్పంచ్గా ఎన్నియ్యారు. నాడు పంచాయతీ సమితిలో వర్క్స్ కమిటీ చైర్మన్గానూ విధులు నిర్వహిం చారు. 1990లో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఇక 2005లో కండ్లగుంట సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలోనే తన మద్దతుదారుల ను రెండు పర్యాయాలు గ్రామ సర్పంచ్గా గెలిపిం చుకు న్నారు. ప్రస్తుతం వైసీపీలో క్రియాశీలకంగా ఉన్న వెంకారెడ్డి ఈ పర్యాయం మరోసారి సర్పంచ్గా గెలిచి గ్రామ సచివాలయంలో అడుగు పెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. -
తాపీ మేస్త్రీ నుంచి వెండి తెరకు..
నటుడిగా రాణించాలన్న తపన ఓ తాపీ మేస్త్రీని వెండి తెరకు పరిచయం చేసింది. వృత్తి పరంగా భవనాలు నిర్మిస్తున్నప్పటికీ అతని ప్రవృత్తి మాత్రం రంగస్థలం. సినిమాల్లో నటిస్తూ ఇప్పుడిప్పుడే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. తనకు అన్నం పెట్టిన వృత్తిని వదలకుండానే అవకాశం దొరికినప్పుడు సినిమాల్లో అగ్ర నటుల సరసన తనదైన శైలిలో అభినయం ప్రదర్శిస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు. సాక్షి, పొన్నలూరు(ప్రకాశం) : పొన్నలూరు మండలం చెన్నిపాడు గ్రామానికి చెందిన కరీం వెండి తెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. తండ్రి ఢిల్లీ సాహెబ్, తల్లి కాసింబీకి ఐదుగురు సంతానం కాగా కరీం చిన్నవాడు. 19 ఏళ్ల వయసులోనే రంగస్థలంపై నలతాంగ అనే పౌరాణిక నాటకంలో నటించాడు. పెద్దగా చదువుకోకపోవడంతో ఉపాధి నిమిత్తం నిజామబాద్కు వెళ్లి తన అన్న మహబూబ్ వద్ద తాపీ మేస్త్రీగా పనిచేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన తన్మయి ఆర్ట్స్ వ్యవస్థాపకుడు, ప్రముఖ నాటిక ప్రయోక్త సుదర్శన్ దర్శకత్వంలో ఇందూరు రంగస్థలంపై నటించాడు. 2008లో నిజామబాద్ జిల్లా రాజీవ్గాంధీ ఆడిటోరియంలో గాంధీ జయంతి, అబ్బే ఏంలేదు, నమోనమం, ఆ ఉదయం ఎప్పుడో, ఉప్పెనొచ్చింది తదితర సాంఘిక నాటికల్లో విభిన్న పాత్రలు పోషించాడు. వెండి తెరపై చిరంజీవి, రవితేజ, శ్రీకాంత్, సునీల్, నిఖిల్, సుధీర్బాబు, కళ్యాణ్రామ్, సప్తగిరి, రవిబాబుతోపాటు పలువురు గుర్తింపు కలిగిన నటులతో కలిసి నటించి తన అభినయంతో ఆకట్టుకుంటున్నాడు. జమ్ చిత్రంలో నటిస్తున్న కరీం స్నేహితుడి సహాయంతో సినిమాల్లోకి.. ఒక పక్క బేల్దారి పనులు చేస్తూనే రంగస్థలంపై అనేక నాటికలు ప్రదర్శించి కరీం మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. కరీం స్వస్థలానికి చెందిన మల్లిక్ సినిమా రంగంలో కార్యనిర్వాహక మేనేజర్గా ఉండటంతో.. అతని నటనను గుర్తించి ‘సలాం హైద్రాబాద్’ అనే హిందీ సినిమాలో చిన్న పాత్ర ఇప్పించాడు. అప్పటి నుంచి పలు చిన్న సినిమాల్లో పాత్రలు పోషిస్తూ వస్తున్నాడు. సినీ హీరోలు శ్రీకాంత్ నటించిన నగరం, సేవకుడు, కళ్యాణ్రామ్ ‘ఇజం’, సునీల్ ‘జక్కన’ సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత నిఖిల్ హీరోగా తెరకెక్కిన స్వామిరారా, అలాగే తిమ్మరుసు, అంకుశం(కొత్తది), పోరు తెలంగాణ, గిలిగింతలు, డీకే బోసు, చూసినోడికి చూసినంత, ఖోఖో తెలుగోడి ఆట, చూడాలని చెప్పాలని, దక్షిణ మధ్య రైల్వే జట్టు, చండీ, బిల్లా–రంగా, మెంటల్, కాకతీయుడు, మోసగాళ్లకు–మోసగాడు, శ్రీమతి బంగారం, బ్రేకింగ్ న్యూస్తోపాటు సప్తగిరి ఎక్స్ప్రెస్, ఎక్కడికిపోతావు చిన్నవాడ, ఖైదీ నంబర్ 150, డిస్కోరాజా చిత్రాల్లో నటించాడు. ఇప్పటి వరకు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సుమారుగా 50 సినిమాల్లో విలన్ దగ్గర సహయకునిగా, హాస్యనటుడిగా పాత్రలు పోషించాడు. కరీం ప్రస్తుతం తనీష్ హీరోగా తెరకెక్కిస్తున్న మహాప్రస్థానం, నటుడు శివాజీ రాజా కొడుకు విజయ్ హీరోగా జమ్ అనే చిత్రాల్లో, ఓ వెబ్ సిరీస్లోనూ నటిస్తున్నాడు. హీరో తనీష్, దర్శకుడు పూరీ జగన్నాథ్తో.. మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటా తాపీ మేస్త్రీగా నా సంపాదన బాగున్నా, బాగోలేకపోయినా నటనపై ఉన్న ఆసక్తితో అవకాశం దొరికినప్పుడు రంగస్థలంపై, సినిమాల్లో నటిస్తున్నా . ఇప్పుడిప్పుడే చిన్న చిన్న పాత్రలతో సినిమా రంగంలో అడుగులు వేస్తున్నా. ఇప్పటి వరకు 50 చిత్రాల్లో నటించా. భవిష్యత్లో మంచి పాత్రలు చేయడంతోపాటు గుర్తింపు కలిగిన నటుడిగా ఎదగాలని ఉంది. నన్ను సినీ రంగంలో ప్రోత్సహిస్తున్న భగవాన్, మల్లిక్, కెమెరామెన్ గోల్డ్ అమర్కు రుణపడి ఉంటా. – కరీం వెబ్ సిరీస్లో -
తల్లి ఎదుటే పసికందును చంపిన కిరాతక తండ్రి
సాక్షి, ప్రకాశం : ముక్కుపచ్చలారని పసికందును కన్నతండ్రే కిరాతకంగా కడతేర్చిన ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్లకు చెందిన బాల్రెడ్డి అలియాస్ బాలరాజు.. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన లక్ష్మి అనాథలు. వీరు ప్లాస్టిక్ కాగితాలు, బాటిళ్లు ఏరుకొని విక్రయిస్తూ జీవనం సాగించేవారు. కొంతకాలంగా ఒకరినొకరు ఇష్టపడి సహజీవనం చేస్తున్నారు. ఈక్రమంలో లక్ష్మి గర్భం దాల్చింది. నాలుగు మాసాల క్రితం జూపాడుబంగ్లాకు చేరుకొని బస్టాండు సమీపంలోని కేసీ కాల్వ విశ్రాంతి భవనం ప్రాంగణంలో నివాసముంటున్నారు. రెండు నెలల క్రితం లక్ష్మి పండంటి ఆడబిడ్డ(దుర్గ)కు జన్మనిచ్చింది. ఆమె పాపతో విశ్రాంతి భవనంలో ఉండగా బాల్రెడ్డి ప్లాస్టిక్ బాటిళ్లు ఏరుకొని విక్రయించటం, వ్యవసాయ కూలిపనులకు వెళ్లటం ద్వారా వచ్చే డబ్బుతో లక్ష్మి, బిడ్డను చూసుకుంటూ ఉండేవాడు. చదవండి: ‘నన్ను ఎందుకు వద్దంటున్నావో ఒక్కసారి చెప్పు’ సోమవారం రాత్రి మద్యం మత్తులో బాల్రెడ్డి లక్ష్మిని చితకబాది పసికందును లాక్కొని పైకి ఎత్తి కిందపడేసి పాల డబ్బాను నోట్లో కుక్కాడు. ఊపిరి ఆడక పసిబిడ్డ మృత్యుఒడికి చేరింది. కళ్లెదుటే బిడ్డను చంపటంతో లక్ష్మి కన్నీరు మున్నీరుగా విలపించింది. ఉదయం శిశివు మృతదేహాన్ని పూడ్చిపెట్టేందుకు బాల్రెడ్డి శ్మశానవాటిక వైపు వెళ్తుండగా గ్రామస్తులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. నందికొట్కూరురూరల్ సీఐ ప్రసాదు, ఎస్ఐ తిరుపాలు సిబ్బందితో ఘటనా ప్రాంతానికి చేరుకుని విచారించారు. శిశువు తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. పసికందు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి తల్లికి అప్పగించారు. -
ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమంలో విషాదం
సాక్షి, దర్శి టౌన్: ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో విద్యుదాఘాతానికి గురై టీడీపీ కార్యకర్త మృతి చెందిన ఘటన దర్శి మండలం నిమ్మారెడ్డిపాలెంలో జరిగింది. గ్రామంలో సోమవారం ఎన్టీఆర్ వర్థంతి నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక గ్రంథాలయం ఎదురుగా జెండా దిమ్మె వద్ద ఇనుపరాడ్కు టీడీపీ జెండా ఎత్తుతుండగా బ్యాలెన్స్ తప్పి ఇనుప రాడ్ పక్కనే ఉన్న విద్యుత్ తీగలపై పడింది. రాడ్ పట్టుకొని ఉన్న టీడీపీ కార్యకర్త మద్దినేని వెంకటనారాయణ(36) విద్యుత్ షాక్కు గురై అక్కడిక్కడే మృతి చెందాడు. మరో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. మృతునికి భార్య మహాలక్షి్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఆ పార్టీ నియోజక వర్గ నియోజక వర్గ సమన్వయకర్త పమిడి రమేష్లు మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. ఘటన స్థలాన్ని ఎస్సై రామకోటయ్య సందర్శించి వివరాలు సేకరించారు. హెచ్సీ నారాయణరెడ్డి కేసు నమోదు చేశారు. చదవండి: ఊరంతా ఖాళీ అయ్యింది. ఇంటింటికీ తాళం పడింది -
ప్రకాశంలో బర్డ్ ఫ్లూ కలకలం
సాక్షి, చినగంజాం(ప్రకాశం): బర్డ్ ఫ్లూ వ్యాధి ప్రబలుతోందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో సోమవారం చెట్ల కింద పక్షులు చనిపోయి ఉండటం తీవ్ర కలకలం రేపింది. ఒకే చెట్టు కింద ఎనిమిది పక్షుల కళేబరాలు ఉండటంతో జనం ఆందోళనకు గురయ్యారు. చినగంజాం మండలంలోని పెదగంజాం పల్లెపాలెం సముద్ర తీరం వెంబడి వేప చెట్టు కింద 5 కాకులు, 3 గోరింకలు చనిపోయి ఉండటాన్ని సోమవారం స్థానికులు గమనించారు. గ్రామంలోకి సమాచారం చేరవేయడంతో బర్డ్ ఫ్లూ వల్లే అలా జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తం కావడంతో అధికారులు సత్వరం స్పందించారు. పెదగంజాం గ్రామ కార్యదర్శి భారతి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పక్షుల కళేబరాలను అక్కడి నుంచి తొలగించి వెంటనే పూడ్చి వేయించారు. విషయం తెలుసుకున్న పలు మీడియా చానళ్లు బర్డ్ ఫ్లూ అంటూ.. ప్రచారం చేశాయి. ఈ విషయమై రెవెన్యూ, పోలీసు అధికారులు, పశు వైద్యాధికారులతో ‘సాక్షి’ మాట్లాడి వివరణ తీసుకుంది. తీరం వెంబడి చెట్ల వద్ద పక్షులు నిత్యం నివాసం ఉంటుంటాయని, ఆ సమీప ప్రాంతాలలో వేరుశనగ సాగవుతున్న నేపథ్యంలో రైతులు పంటకు సత్తువ కోసం గుళికల మందు వాడుతుంటారని, అది కలిసిన నీటిని తాగి పక్షులు చెట్టు మీద సేదతీరిన సందర్భల్లోనూ ఇలాంటి సంఘటన చోటు చేసుకొనే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అపోహలు, ఆందోళన వద్దు: డాక్టర్ బసవశంకర్, ప్రాంతీయ పశువైద్య సహాయ సంచాలకులు పల్లెపాలెంలో పక్షులు చనిపోయిన విషయం మా దృష్టికి వచ్చింది. మేం వెళ్లేలోగా అధికారులు వాటిని పూడ్చి పెట్టారు. పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో నుంచి సమాచారం సేకరించాం. గుంటూరు, విజయవాడ, ఒంగోలు ప్రాంతాల్లో పక్షుల కళేబరాలు పరీక్షించే ల్యాబ్ రేటరీలున్నాయి. బర్డ్ ఫ్లూకు సంబంధించి దేశంలో భోపాల్లో నేషనల్ ఇనిస్టిట్యూట్లో మాత్రమే నిర్దారణ చేస్తారు. పరీక్షిస్తేనే ఏవిషయం తెలుస్తుంది. భవిష్యత్లో ఇలా పక్షులు చనిపోతే సత్వరం తమకు సమాచారం ఇవ్వాలని సూచించాం. బర్డ్ ఫ్లూ గురించి ఆందోళన అవసరం లేదు. మన దేశంలో 150 నుంచి 200 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు చికెన్ను ఉడికిస్తారు చికెన్ తినడం వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం లేదు. -
చంద్రబాబు ఉస్కో .. పవన్ డిస్కో: నాని
సాక్షి. కృష్ణా: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. కృష్ణా జిల్లా నందివాడలో బుధవారం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పవన్పై విమర్శలు ఎక్కుపెట్టారు. రాష్ట్రంలో రాజకీయ నాయకులు చాలామంది ఉంటారని, వాళ్ళు ఏం మాట్లాడతారో ప్రజలకు తెలుసని అన్నారు. మైకు పట్టుకొని ఊగిపోతూ తోడలు మెడలు నలపుకుంటూ ఎదో వాగితే వినేందుకు జనం పిచ్చివాళ్ళు కాదని దుయ్యబట్టారు. చంద్రబాబుకు అపద వస్తే కాపాడటానికి మాత్రమే రోడ్డు మీదకు వచ్చి నోటికి వచ్చినట్లు వాగుతావని ఎద్దేవా చేశారు. మేము ఎమైనా అంటే బూతులు తిడుతున్నామని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఒక్కమాట అన్న కూడా మేము పదిమాటలు అంటామని ధీటుగా సమాధానమిచ్చారు. నువ్వు నన్ను బూతులు మంత్రి అంటావో ఇంకా ఎమైనా అంటావో డోంట్ కేర్. ముఖ్యమంత్రిని నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని, దేనికైనా సిద్ధంగా ఉంటామని హెచ్చరించారు. చదవండి: ‘మంత్రులకు పవన్ క్షమాపణ చెప్పాలి’ ‘మాకు వార్నింగ్ ఇచ్చే స్థాయి నీకు లేదు. నువ్వు, నీ పార్ట్నర్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి వచ్చినా ఏం చేయలేదు. ప్యాకేజీ తీసుకుని సొల్లు కబుర్లు చెప్తున్నాడు. చంద్రబాబు ఉస్కో అనగానే.. పవన్ డిస్కో అంటూ వస్తాడు. నువ్వు కొట్టగానే పదిమంది ఎగిరిపడటానికి ఇది సినిమా కాదు. నీ తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరు. నష్టపోయిన రైతులకు ముప్పై అయిదువేలు ఇవ్వాలంటున్నావు. 80లక్షల మంది రైతులకు ఎంత ఇవ్వాలో తెలుసా. చంద్రబాబు నాయుడు ఏదో రాసిస్తే అది పట్టుకొచ్చి పిచ్చోడిలా వాగుతావు. జనం నవ్వు కుంటున్నారు. రైతులకు అప్పులు మాఫీ చేస్తానన్న చంద్రబాబుతో తిరిగావు. అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు మోసం చేస్తే చొక్కా ఎందుకు పట్టుకోలేదు. చంద్రబాబు నాయుడు విధానాల వల్లనే రైతులు నష్టపోయారు తప్ప మా వల్ల కాదు. నష్టపోయిన రైతులకు నెలరోజుల్లో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం. పూర్తిగా తడిసి, రంగుమారి తినటానికి పనికిరాని ధాన్యాన్ని సివిల్ సప్లయ్ శాఖ ద్వారా రైతుల దగ్గర కొంటున్నాం. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం: అర్హులందరికీ సొంతింటి కలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేరుస్తున్నారని మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి అన్నారు. పేదలకు స్థలాలతో పాటు ఇళ్ళు కట్టిస్తామని భరోసానిచ్చారు. ఇళ్ల స్థలాల కోసమే రూ. పదివేల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందని, ఇళ్ళను కూడా ప్రభుత్వమే కట్టిస్తుందన్నారు. రైతుల గురించి మాట్లాడే అర్హత తెలుగు దేశం పార్టీకి లేదని విమర్శించారు. లోకేష్ ఒక పప్పు బాయి అని, లోకేష్కు రైతుల గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. రైతులకు అన్ని రకాలుగా సీఎం జగన్ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని, పొగాకు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తరపున కొనుగోలు చేసిన చరిత్ర సీఎం జగన్ది అని ప్రశంసించారు. గతంలో నా డబ్బులు అయిదు కోట్లు దొరికాయని టీడీపీ ఆరోపించిందని, లీగల్ నోటీసులు ఇస్తే సమాధానం కూడా లేదని అన్నారు. జూమ్లో ఉన్న బాబు పొద్దు పోక మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో దక్షిణ నియోజక వర్గం పేదల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు అధికంగా పాల్గొనగా.. మంత్రి అవంతి శ్రీనివాస్, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ కోలా గురువులు, కమిషనర్ డాక్టర్ సృజన హాజరయ్యారు. కాగా దేశ చరిత్రలోనే ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ సువర్ణ అధ్యాయమని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. పేదల పట్టాల పంపిణీ చూసి టీడీపీ నాయకులు ఓర్వ లేక పోతున్నారన్నారు. -
క్షేత్ర స్థాయిలో ఈజ్ ఆఫ్ లివింగ్ సర్వే
సాక్షి, ఒంగోలు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై క్షేత్ర స్థాయిలో సర్వే కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో గ్రామ పంచాయతీల వారీగా జీవన సౌలభ్యం(ఈజ్ ఆఫ్ లివింగ్) సర్వే చేపట్టారు. ఎంపీడీవోలు, ఈవోఆర్డీల ఆధ్వర్యంలో పంచాయతీ సెక్రటరీలు, డిజిటల్ అసిస్టెంట్లు, వలంటీర్లు సర్వే నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 56 మండలాల్లో 1038 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. దాదాపుగా 36 లక్షల మంది జనాభా ఉన్నారు. మొత్తం 884 గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు సేవలందిస్తున్నారు. పెన్షన్లు, రేషన్ కార్డులను గంటల వ్యవధిలోనే మంజూరు చేస్తున్నారు. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ, కాపు నేస్తం, జగనన్న చేదోడు, ఆటోవాలాలు, టైలర్లు, బార్బర్లకు ఏటా రూ.పది వేలు.. ఇలా అనేక సంక్షేమ పథకాల నగదును నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. అమ్మఒడి, ఫీజు రీయింబర్స్మెంట్, జగనన్న వసతి దీవెన, విద్యాదీవెన పథకాలు పేద కుటుంబాలకు వరంలా మారాయి. రైతులకు ఉచిత బోర్లు వేయించే పథకం ప్రారంభమైంది. అయితే ఈ సంక్షేమ పథకాల ఫలాలు అర్హులకు అందుతున్నాయా లేదా అనే విషయమై క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నారు. 59 శాతంపైగా సర్వే పూర్తి ఈవోఎల్ సర్వేలో భాగంగా ఇంటింటికీ వెళ్లి మొత్తం 17 అంశాలపై 32 ప్రశ్నలకు సమాధానాలు రాబడుతున్నారు. కనీస అవసరాలైన గ్యాస్ కనెక్షన్, కరెంట్, రైస్ కార్డు, జాతీయ గ్రామీణా ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి కల్పన తదితర అంశాలపై సర్వే కొనసాగుతోంది. ఇంకా వైఎస్సార్ పెన్షన్ కానుక, ఆరోగ్యానికి సంబంధించిన పథకాలు, వ్యాధి నిరోధక శక్తిని పెంచే వ్యాక్సిన్లు, మాతా శిశు సంరక్షణ కార్యక్రమాలపై సర్వే జరుగుతోంది. యువతకు జీవనోపాధిని కల్పించే నైపుణ్యా శిక్షణ తరగతులు, జీవిత బీమా, ప్రమాద బీమా, జీవన ప్రమాణాలు పెంచే కార్యక్రమాలు, గృహ నిర్మాణ సదుపాయంపై ప్రజలను ప్రశ్నలు అడుగుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు లబ్ధిదారుల ఫోన్ నంబర్లు కూడా తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు సర్వే 59 శాతంపైగా పూర్తయినట్లు సమాచారం. ప్రస్తుతం అందిస్తున్న సంక్షేమ పథకాలే కాకుండా ఇంకా ఎలాంటి పథకాలు అందిస్తే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయో సరి చూసుకోవడానికి ఈ సర్వే చేపట్టినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నెల 30వ తేదీలోగా సర్వే పూర్తి చేయాలని ఎంపీడీవోలు, ఈవోఆర్డీలు, పంచాయతీ సెక్రటరీలను జిల్లా పరిషత్ సీఈవో కైలాష్ గిరీశ్వర్, జిల్లా పంచాయతీ అధికారి జీవీ నారాయణరెడ్డి ఆదేశించారు. -
భూమి ఒకరిది.. పాస్ బుక్ మరొకరిది..
భూమి నకిలీ.. భూమిని నమ్మించే పాస్ బుక్కు నకిలీ.. నగదు నకిలీ.. కాదేదీ నకిలీకి అనర్హం. మోసం చేయాలనే ఆలోచన మెదడులో మెదిలితే చాలు దేన్నైనా నకిలీ చేయొచ్చు.. ఇంకా చెప్పాలంటే నకిలీ గాళ్లదే ఈ నయా లోకం. కొన్నేళ్లుగా ఈ తరహా మోసాలకు పాల్పడుతుంది ఓ ముఠా. గత ప్రభుత్వాల హయాంలో వెబ్ల్యాండ్ను ఆన్లైన్ చేసేందుకు పూనుకున్నారు. అవకాశాన్ని క్యాష్ చేసుకోవడమే పనిగా ఉన్న కొందరు పొలమే లేకుండా ఓ పాస్ బుక్ను క్రియేట్ చేసి దాంతో బ్యాంక్లను మోసం చేసి కోట్లాది రూపాయలు దోచుకున్నారు. ఈ కుంభకోణం అప్పట్లో ఓ పెద్ద చర్చనీయాంశమైంది. ఇంత జరిగినా ఇంకా ఇలాంటివి కొనసాగుతూనే ఉన్నాయంటూ మోసపోయిన బాధితులు భోరున విలపిస్తున్నారు. తాజాగా కురిచేడు మండలంలో జరిగిన ఇంకొన్ని సంఘటనలతో ‘సాక్షి’ కథనం. కురిచేడు: రైతులను ఎన్నో ఏళ్ల నుంచి వేధిస్తున్న సమస్య భూ రిజిస్ట్రేషన్లు.. నకిలీ పత్రాలు. గత టీడీపీ ప్రభుత్వంలో వెబ్ ల్యాండ్లో పేర్ల నమోదు, పాస్ పుస్తకాల జారీలో అధికారులు ఇష్టానురీతిగా వ్యవహరించడంతో రైతులు ఇరకాట్లలో పడ్డారు. రైతులకు ఇష్టం వచ్చిన సర్వే నంబర్లతో పాస్ పుస్తకాలు జారీ చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో నకిలీ పట్టాలు తయారు చేయడానికి ఓ ముఠా, బ్యాంకులో ఆ పత్రాలు పెట్టించి రుణాలు ఇప్పించడానికి ఇంకో ముఠా మధ్యవర్తుల అవతారాలెత్తి రైతుల ఖాతాల్లో రుణాలు మాయం చేసిన సంఘటనలు కురిచేడు ఆంధ్రాబ్యాంక్, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుల్లో గతంలో వెలుగు చూశాయి. జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఈ ముఠాల గుట్టు రట్టు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకోకపోవడం ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే దీన్ని అలుసుగా తీసుకుని ఇప్పటికీ అలాంటి ముఠాలు నకిలీలు సృష్టిస్తుండటంతో రైతులు నష్టపోతున్నారు. ఇవిగో ఇవే ఇప్పటి సాక్షాలు ►కురిచేడు మండలం కాటంవారిపల్లెకు చెందిన సంగు సుబ్బారెడ్డి తన సాగుభూమిని ఆన్లైన్ చేసి పట్టాదారు పాస్పుస్తకం ఇవ్వాలని వీఆర్వోను ఆశ్రయించాడు. సుమారు రూ. లక్ష తీసుకుని సుబ్బారెడ్డి భూమికి బదులు వేరొకరి భూమిని పుస్తకంలో నమో దు చేయించి ఇచ్చారని సుబ్బారెడ్డి తెలిపారు. సుబ్బా రెడ్డి ఆ భూమిని వేరే వారికి విక్రయించాడు. తీరా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు తమ పేరుపై పట్టాదారు పాస్ పుస్తకానికి దరఖాస్తు చేసుకోగా.. రెవెన్యూ అధికారులు ఆ భూమిని పరిశీలించగా ఆ భూమి మరొకరి సాగులో ఉంది. కొనుగోలు చేసిన వారు సుబ్బారెడ్డిపై కేసు పెడతామని తమ డబ్బు తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో మోసపోయానని గ్రహించిన సుబ్బారెడ్డి డబ్బు వెనక్కు ఇచ్చాడు. ►పడమర గంగవరం గ్రామంలో అన్నెం రామిరెడ్డి అదే గ్రామానికి చెందిన అన్నెం పెదపాపిరెడ్డి వద్ద గ్రామ కంఠం సర్వే నంబర్ 331లోని ఎం0–3.1/2 సెంట్లు ఇంటి స్థలం, మట్టిమిద్దెను 1999లో కొనుగోలు చేసి స్వాధీన అగ్రిమెంట్ చేసుకున్నాడు. అదే స్థలానికి ఓ వీఆర్వో ఇచ్చిన నకిలీ ధ్రువీకరణ పత్రం ఆధారంగా 2019లో పెదపాపిరెడ్డి భార్య రామలక్ష్మమ్మ, పడమర గంగవరం గ్రామానికి చెందిన చినపాపిరెడ్డి కుమారుడు వెంకటరెడ్డికి 2019లో ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చారు. ఆ వీఆర్వో ఇచ్చిన సర్టిఫికెట్ నకిలీదని, ఆ గ్రామానికి ఆయన వీఆర్వో కాదని రెవెన్యూ అధికారులు ధ్రువీకరించడంతో కొనుగోలు చేసిన వారు పోలీస్ స్టేషన్, రెవెన్యూ అధికారులను ఆశ్రయించినా ఫలితం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి నకిలీల ఆట కట్టించాల్సిన అవసరం ఉంది. రెవెన్యూ కార్యాలయంలో గంగవరం వీఆర్వో పై ఇచ్చిన ఎండార్స్మెంట్, పడమర గంగవరం అన్నెం వెంకటరెడ్డికి ఇచ్చిన నకిలీ ధ్రువీకరణ పత్రం లక్ష రూపాయిలిచ్చి నకిలీవి తీసుకున్నా పొలానికి పట్టాదారు పాస్ పుస్తకం కావాలని వీఆర్వోని అడిగితే డబ్బులు కావాలన్నాడు. ఆయన అడిగినంత ఇచ్చాను. నాకు నకిలీ పుస్తకాలు ఇచ్చి మోసం చేశాడని ఆ పొలాన్ని మళ్లీ అమ్మితేకానీ తెలియలేదు. నాలాగా నష్టపోయిన వాళ్లు చాలా మంది ఉన్నారు. ఆయనపై చర్యలు తీసుకుని నాకు న్యాయం చేసి నా పొలానికి పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వాలి. – సంగు సుబ్బారెడ్డి, రైతు, కాటంవారిపల్లె ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాం మండలంలో నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలు, పట్టాలు, సర్టిఫికెట్ల విషయం బయటకు వస్తుంది. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాను. ఉన్నతాధికారులు ఎలాంటి ఆదేశాలు ఇస్తే ఆ మేరకు నడుచుకుంటాం. – అద్దంకి శ్రీనివాసరావు, తహసీల్దార్, కురిచేడు -
సమస్త జీవకోటికి రక్షణ కవచం!
ముచ్చటపడి కొనుక్కున్న చొక్కాకు చిల్లు పడితే ప్రాణం విలవిల్లాడుతుంది కదా.. మరి భూగోళంపై కవచంలా ఉంటూ సమస్త జీవకోటికి రక్షణ కల్పిస్తున్న ఓజోన్ పొరకు రంధ్రం పడితే బాధపడిన వారెందరు? పర్యావరణ ప్రేమికులు తప్ప ఒక్కరు కూడా ‘అయ్యో..’ అని కూడా అనుండరు.! ఓజోన్ పొర మానవాళికి చేసే మేలు గురించి అవగాహన ఉంటే.. దానికి కీడు తలపెట్టే విధంగా ఎవరూ ప్రవర్తించరు!! నేడు ఓజోన్ పరిరక్షణ దినం.. ఈ సందర్భంగా ఓజోన్ విశేషాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. సాక్షి, ఒంగోలు: భూమికి రక్షణ కవచంగా ‘ఓజోన్’ను చెప్పుకుంటాం. భూమి నుంచి వెలువడే అతి శక్తివంతమైన, ప్రభావవంతమైన అతినీలలోహిత కిరణాలను శోషించుకుని సకల జీవకోటికి రక్షణగా నిలిచేది ‘ఓజోన్’. కాలుష్యం కారణంగా భూమిని ఆవరించి ఉన్న ఓజోన్ పొర క్రమంగా దెబ్బతింటోంది. ఏసీలు, ఫ్రిజ్లు, ప్లాస్టిక్, ఫోమ్, దోమల నాశనం కోసం వాడే కాయిల్స్, జెట్ బిళ్లల లాంటి వాటి వినియోగం వల్ల ఏర్పడే పొగ, డిటర్జెంట్ల ఉత్పత్తుల తయారీ వల్ల ఏర్పడే క్లోరోఫ్లోరోకార్బన్లు ఓజోన్ పొరను ధ్వంసం చేస్తున్నాయి. స్ట్రాటోస్పియర్లో ఉన్న ఓజోన్ అతినీలలోహిత కిరణాలను సంగ్రహించుకుంటోందని, క్లోరోఫ్లోరో కార్బన్ల వల్ల స్ట్రాటోస్పియర్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని 1930లోనే శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనివల్ల ఏటా 20 లక్షల మందికి తగ్గకుండా చర్మ క్యాన్సర్ బారిన పడుతున్నారని శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ఓజోన్ను రక్షించుకునేందుకు ఏటా సెప్టెంబర్ 16వ తేదీన వరల్డ్ ఓజోన్ డేను నిర్వహించుకుంటున్నాం. ఓజోన్ పొరకు చిల్లు పడిందని, భవిష్యత్తులో ఇది ప్రమాదకారి కావచ్చని 1980లో పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఓజోన్ అంటే ఆక్సిజన్కు మరో రూపమే. ఆక్సిజన్లో రెండు పరమాణువులు ఉంటే ఓజోన్లో మూడు పరమాణువులు ఉంటాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆక్సిజన్కు పరమాణువు కలవడం ద్వారా ఓజోన్ తయారవుతుంది. భూమిపైన వాతావరణం నాలుగు పొరలుగా ఉంటుంది. అవి వరుసగా ట్రోపో, స్ట్రాటో, మోజో, ఐనో ఆవరణాలు. వీటిలో ఓజోన్ పొర స్ట్రాటో ఆవరణంలో మాత్రమే ఉంటుంది. ఇది పది నుంచి 30 మైళ్ల మందంతో, భూమిచుట్టూ ఆవరించి ఉంటుంది. సూర్యకాంతి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు(అల్ట్రావయెలెట్–యూవీ) భూమిపై ప్రసరించకుండా ఓజోన్ పొర అడ్డుకుంటుంది. ఓజోన్ను దెబ్బతీస్తున్నవి ఇవే.. రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, విమానాల నుంచి వెలువడే క్లోరోఫ్లోరో కార్బన్ కాలుష్య కారకాలు గాలిలోకి విడుదలై భూమిని ఆవరించి ఉన్న ఓజోన్ పొరను దెబ్బతీస్తున్నాయి. ఏసీలు, కాస్మొటిక్స్, స్ప్రేలు, ప్లాస్టిక్ లాంటివి మనం విచ్చలవిడిగా వాడుతున్నాం. వీటిని వినియోగించడం తగ్గిస్తేనే పర్యావరణానికి మేలు జరుగుతుంది. ఓజోన్ పొరకు హాని కలిగించే వస్తువుల వాడకంపై ప్రజల్లో అవగాహన కల్పించటం ద్వారా కూడా మరింత కాలుష్యం తగ్గించవచ్చు. రసాయనాలతోనే ప్రమాదం ఓజోన్ వాయువు పలుచబడటాన్ని ఈ పొరకు రంధ్రంగా పేర్కొంటారు. క్లోరిన్ వాయువు ఓజోన్ పొరను దారుణంగా దెబ్బతీస్తోంది. ఒక్కో క్లోరిన్ పరమాణువు ఓజోన్తో లక్షసార్లు చర్య జరిపి ఆక్సిజన్ను విడగొడుతోందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ప్రధానంగా క్లోరోఫ్లోరో కార్బన్లు(సీఎఫ్సీ), క్లోరోడైఫ్లోరో మీథేన్, ఓలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్లు ఓజోన్ను నాశనం చేస్తున్నాయి. 1995లో ప్రపంచ దేశాలు ‘మాంట్రియల్ ప్రోటోకాల్’(ఒప్పందం)ను రూపొందించాయి. ఈ ప్రోటాకాల్ మీద మొత్తం 140 దేశాలు సంతకాలు చేశాయి. ఐక్యరాజ్య సమితి పర్యావరణ పరిరక్షణ విభాగంతో కలిసి ఓజోన్ సంరక్షణకు కృషి చేస్తామని ప్రతినబూనాయి. 2010 నాటికి ఓజోన్ పొరకు నష్టం కలిగించే రసాయనాల వాడకాన్ని తగ్గించాలని ప్రపంచ దేశాలు నిర్ణయించాయి. కానీ, రసాయనాల వాడకం ప్రణాళికాబద్ధంగా తగ్గించింది అంతంత మాత్రమే. ఇందుకోసం 1994, డిసెంబర్ 19న 49/114 అనే తీర్మానం ద్వారా ఐక్యరాజ్య సమితి సెప్టెంబర్ 16వ తేదీని ప్రపంచ ఓజోన్ పరిరక్షణ దినంగా నిర్వహించాలని ప్రకటించింది. ఓజోన్ పరిరక్షణ ఎలా? గత కొన్నేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు, కరోనాతో ప్రపంచ వ్యాప్తంగా జనజీవనం స్తంభించడంతో ఓజోన్ పొరకు ఉన్న చిల్లులు మూసుకుపోయినట్టు ‘నాసా’ ఇటీవల తీసిన ఫొటోల్లో వెల్లడైంది. లాక్డౌన్ సడలింపులతో ఇప్పుడిప్పుడే భారీ పరిశ్రమలు తెరుచుకుంటున్నాయి. వాహనాల రవాణా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఓజోన్ పొర మళ్లీ దెబ్బతినే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు. ప్లాస్టిక్ తయారీని, వినియోగాన్ని నిషేధించాలి. అసవరమైన మేరకే డియోడ్రెంట్లు, రూమ్ ఫ్రెషనర్ స్ప్రేలు వాడాలి. ఏసీల వాడకం భారీగా తగ్గించాలి. పండ్లు, కూరగాయలు, వస్తువుల కోసం మార్కెట్కు వెళ్లే వాళ్లంతా పాలిథిన్ సంచుల స్ధానంలో వస్త్ర సంచులు వినియోగించాలి. ఏసీలు పెద్దగా ఉండనవసరం లేని కార్యాలయాలు, ఇళ్లు నిర్మించే విధంగా ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు కృషి చేయాలి. రోడ్ల వెడల్పునకు, ఇళ్లకు, పరిశ్రమలకు అడ్డు వస్తున్నాయని చెట్లు నరకడం లాంటి దుశ్చర్యలకు శిక్షలు పడేలా చట్టాలు రూపొందించాలి. రక్షణ కోసం వన మహోత్సవం ఓజోన్ పరిరక్షణలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ సచివాలయాల సిబ్బంది భాగస్వాములయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖ నేతృత్వంలతో వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలో 25 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రామ స్థాయిలో ముందుకొచ్చే స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలకు వలంటీర్ల ద్వారా మొక్కలు పంపిణీ చేయిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులతో స్కూళ్లు, మైదానాలు, ప్రభుత్వ స్థలాల్లో మొక్కలు నాటేలా ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలోనే కాలుష్యానికి చెక్ పెట్టేందుకు ఆర్టీసీకి ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేసేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. డిగ్రీ సిలబస్లో మొక్కల పెంపకాన్ని ప్రత్యేకంగా అప్రెంటిస్షిప్ ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించింది. -
విషాదం: నాన్నా.. మునిగిపోతున్నా!
చినగంజాం(ప్రకాశం జిల్లా): చేపల వేటకు వెళ్లిన తండ్రీకొడుకులను కాలువ బలి తీసుకుంది. ఉపాధినిచ్చే వలే వారిని చుట్టేసి ప్రాణాలు తీసింది. నాన్నా.. మునిగిపోతున్నా కాపాడమంటూ కేకలు వేస్తున్న బిడ్డను చూసి నీటిలో దూకిన తండ్రి కూడా జలదిలోనే కలిసిపోయాడు. భర్త, బిడ్డను పోగొట్టుకుని గుండెలు బాదుకుంటున్న ఆ ఇల్లాలిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. ఈ విషాదకర ఘటన చినగంజాం మండలంలోని మత్స్యకార గ్రామంలో శనివారం జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్లెపాలెం పంచాయతీ పరిధిలో బాపయ్యనగర్కు చెందిన ఐలా జోగియ్య(40), విజయ దంపతులకు ఇద్దరు బిడ్డలు. కుమారుడు రామ్చరణ్ (13) గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. కుమార్తె హారిక 3వ తరగతి చదువుతోంది. శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో జోగియ్య తన కుమారుడిని వెంటబెట్టుకొని సముద్రం తీరంలోని కాలువలో చేపల వేటకు వెళ్లాడు. వలను సమీపంలోని కాలువలో బోటుకు అమర్చి, ఆదివారం ఉదయం అందులో పడిన మత్స్య సంపదను ఇంటికి తీసుకెళ్లాలని భావించారు. కర్ర తెప్పపై వెళ్తూ వలను కాలువలో అమరుస్తుండగా రామచరణ్ బోటు నుంచి ప్రమాదవశాత్తు జారి కాలువలో పడ్డాడు. లోతు ఎక్కువగా ఉండటంతో ఈదలేక నాన్నా.. నాన్నా.. అంటూ పెద్దగా కేకలు వేశాడు. వల సరిచేస్తున్న జోగియ్య మునిగిపోతున్న బిడ్డను కాపాడుకోవాలనే ప్రయత్నంలో చేతిలో ఉన్న వలతో సహా నీటిలో దూకేశాడు. అతడి చేతిలో ఉన్న వల ఇద్దరినీ కమ్మేయడంతో నీటి నుంచి బయటకు రాలేకపోయారు. సమీపంలో వేట చేసుకునే మత్స్యకారులు వచ్చి రక్షించేలోగా ప్రాణాలు వారు కోల్పోయారు. మృతదేహాలను ఒడ్డుకు చేర్చేందుకు సుమారు 2 కి.మీ దూరం తెప్పలోనే ప్రయాణించాల్సి వచ్చింది. సమాచారం అందుకున్న ఏఎస్ఐ శ్రీనివాసరావు ఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం చీరాల వైద్యశాలకు తరలించారు. తండ్రీ కుమారుడి మృతితో బాపయ్యనగర్లో తీవ్ర విషాదం నెలకొంది. -
మొక్కలు కావాలంటూ నమ్మించి దోపిడీ..
ఒంగోలు: ‘పెద్ద మొత్తంలో మొక్కలు కావాలి.. మీరు వచ్చి స్థలం చూస్తే ఎన్ని మొక్కలు అవసరమవుతాయనే విషయం మాట్లాడుకుందాం’ అంటూ పూలమొక్కలు అమ్ముకునే వ్యాపారిని నమ్మకంగా పిలిపించి ఓ బృందం దోపిడీకి పాల్పడింది. ఈ సంఘటన గత నెల 29వ తేదీ స్థానిక కేశవరాజుకుంట ఫ్లైఓవర్ వద్ద చోటుచేసుకోగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ఒంగోలు తాలూకా పోలీసులు బుధవారం నిందితులను అరెస్టు చేశారు. ఒంగోలు రిక్షాబజార్లో నివాసం ఉంటున్న గుళ్లాపల్లి తిరుపతిని కేశవరాజుకుంట వద్దకు రప్పించిన దుండగులు.. అతని వద్ద ఉన్న వీవో మొబైల్, రూ.9 వేల నగదు, ఒక మోటారు బైకుతో అదృశ్యమయ్యారు. బాధితుడి నుంచి ఫిర్యాదు అందుకున్న తాలూకా పోలీసులు.. సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులు చినగంజాం మండలం రాజుబంగారుపాలేనికి చెందిన జగన్నాథం నాగరాజు, అదే మండలం మన్నంవారిపాలేనికి చెందిన చలాకీ రాము, చలాకీ కళ్యాణ్గా గుర్తించారు. త్రోవగుంట ఎనీ్టఆర్ విగ్రహం వద్ద నిందితులు ఉన్నట్లు సమాచారం అందడంతో తాలూకా సీఐ శివరామకృష్ణారెడ్డి సిబ్బందితో వెళ్లి దాడి చేసి అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు మోటారు బైకులు, ఒక సెల్ఫోన్, రూ.5 వేల నగదు స్వాదీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు తోడ్పడిన ఐటీ కోర్టీం ఎస్సై నాయబ్రసూల్, కానిస్టేబుళ్లు మాలిక్, స్టేషన్ సిబ్బంది రామకృష్ణ, రవికుమార్, హనూక్లను సీఐ అభినందించారు. -
ప్రకాశం జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ..
సంతమాగులూరు: మండలంలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. గత కొన్నేళ్లుగా స్థానిక ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్కు అనుచరుడిగా ఉన్న మండలంలోని వెల్లలచెరువు గ్రామానికి చెందిన టీడీపీ నేత, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు చింతా రామారావు సోమవారం వైఎస్సార్ సీపీలో చేరారు. అతని వర్గానికి చెందిన సుమారు 400 కుటుంబాలతో కలిసి విజయవాడలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి బాచిన కృష్ణచైతన్య, మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచుగరటయ్య సమక్షంలో వైఎస్సార్ సీపీ కండువా వేయించుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడై వైఎస్సార్ సీపీలో చేరుతున్నట్లు రామారావు పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనకు అన్ని వర్గాల ప్రజలతో పాటు ప్రతిపక్ష పార్టీ నాయకులు సైతం ఆకర్షితులై వైఎస్సార్ సీపీలో చేరడం అభినందనీయమని అన్నారు. అనంతరం చింతా రామారావు తన వర్గీయులతో కలిసి బాచిన కృష్ణచైతన్య, గరటయ్యలను పూలమాలలతో సన్మానించారు. రామారావు వెంట మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ బొల్లినేని రామకృష్ణ, ఊట్ల నాగేశ్వరరావు, చింతా శ్రీధర్, సూరే రామ్మోహనరావు, పమిడి కోటేశ్వరరావు, బొడ్డుపల్లి మల్లేశ్వరి, రాష్ట్ర బీసీ నాయకులు బల్లిపల్లి కొండలు, లక్ష్మారెడ్డి కోటేశ్వరరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
కరోనాను ‘పల్స్’ పట్టేస్తుంది
కరోనా వైరస్ సోకిన వారికి ఆక్సిజన్ ప్రధాన సమస్యగా మారుతోంది. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా రోగి తీసుకునే ఆక్సిజన్ సరైన మోతాదులో రక్తంలో చేరకపోవడంతో శ్వాస తీసుకునేప్పుడు సమస్య ఉత్పన్నమై మరణాలు సంభవిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రక్తంలో సరైన మోతాదులో ఆక్సిజన్ ఉందా.. లేదా అనే విషయాలు తెలుసుకోవడానికి పల్స్ ఆక్సీమీటర్ ఎంతో కీలకం. కరోనా ముప్పును ముందుగా గుర్తించేందుకు ఉపయోగపడే పల్స్ ఆక్సీమీటర్కు ప్రస్తుతం డిమాండ్ పెరిగింది. ఈ తరుణంలో పల్స్ ఆక్సీమీటర్ ప్రాధాన్యత గురించి ప్రతి ఒక్కరూ తెలుకోవాల్సిందే. పెద్దదోర్నాల/పుల్లలచెరువు/చీరాల అర్బన్: శరీరంలో ఆక్సిజన్ శాతాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ద్వారా కరోనా ముప్పును ముందుగానే గుర్తించవచ్చని వైద్యులు చెబుతున్నారు. అత్యంత సులువుగా వినియోగించే ఈ పరికరం ఇప్పుడు ప్రతి ఇంటిలో ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా సోకి చికిత్స పొందుతూ ముఖ్యంగా హోం ఐసోలేషన్, క్వారంటైన్లో ఉన్న వారు తరచుగా రక్తంలోని ఆక్సీజన్ స్థాయి తెలుసుకోవడం ద్వారా ప్రమాదం నుంచి బయటపడొచ్చు. పల్స్ ఆక్సీమీటర్ పనిచేసే విధానం ఈ పరికరాన్ని ప్రతి ఒక్కరూ చాలా సులువుగా ఉపయోగించొచ్చు. ఏదో ఒక చేతి వేలి కొనకు ఈ మీటర్ పెట్టి బటన్ నొక్కితే చాలు ఆన్ అవుతుంది. కొన్ని సెకన్ల తర్వాత డిస్ప్లేలో ఆక్సిజన్ శాతం పల్స్ రేటును చూపిస్తోంది. ఈ రీడింగ్ ఆధారంగా రోగులను వర్గీకరించి చికిత్స అందించొచ్చు. రక్తంలో ఆక్సిజన్ స్థాయి ఇలా రక్తంలో ఎంత మోతాదులో ఆక్సిజన్ సరఫరా అవుతుందో పల్స్ ఆక్సీమీటర్ గుర్తిస్తుంది. సాధారణంగా ఆక్సిజన్ లెవల్స్ 95–100 వరకు ఉంటుంది. పల్స్ రేటు 60–100 మధ్య ఉండాలి. ఆక్సిజన్ స్థాయి 90 శాతం కన్నా తక్కువ పడిపోయినా, గుండె పల్స్ రేటు 100 కన్నా పెరిగినా రోగి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని భావిస్తారు. కరోనా పాజిటివ్ వ్యక్తుల్లో ఉండే ఆక్సిజన్ లెవల్స్ 95 పైన ఉంటే తక్కువ లక్షణాలు ఉన్నట్లు, వీరిని ఇంటి వద్ద ఉంచి చికిత్సను అందిస్తారు. ఆక్సిజన్ లెవల్స్ 90 నుంచి 94 మధ్య ఉంటే మధ్యస్తంగా ఉన్నట్లు.. వీరిని వైద్యశాలకు తరలించాల్సి వస్తుంది. 90 కన్నా తక్కువ పడిపోతే ఐసీయూకి తరలించి వెంటిలేటర్ వైద్యం అందించాలి. పల్స్ఆక్సీమీటర్ ఎంతో ఉపయోగపడుతుంది ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో పల్స్ఆక్సీమీటర్ ఎంతో ఉపయోగపడుతుంది. శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ ఏ మేరకు ఉన్నాయో తెలియపరుస్తుంది. ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉన్నవారికి పల్స్ ఆక్సీమీటర్ ద్వారా ఆక్సిజన్ లెవల్స్ను అంచనాలు వేసి చికిత్స అందిస్తారు. కరోనా రోగుల్లో ఊపిరి అందకపోవడం అతి పెద్ద సమస్య. రక్తంలోకి చేరే ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది. వేగంగా ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడాన్ని హైపోక్సియా అంటారు. కరోనా రోగులు తరచూ పల్స్ఆక్సీమీటర్ ద్వారా ఆక్సిజన్శాతం సరిచూసుకోవడం మంచిది. డాక్టర్ పి.కమలశ్రీ. పీపీపీ యూనిట్, చీరాల ఏరియా వైద్యశాల హైపోక్సియాను గుర్తిస్తుంది ప్రస్తుత పరిస్థితుల్లో పల్స్ ఆక్సీమీటర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కరోనా రోగుల్లో ఊపిరి అందకపోవడం పెద్ద సమస్య. దీంతో రక్తంలో చేరే ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది. ఇలా వేగంగా ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడాన్ని హైపోక్సియా అంటారు. కరోనా రోగుల్లో చాలా మందికి ఆక్సిజన్ శాతం 87.88 ఉన్నా ఆయాసంగా ఫీలవ్వరు. అలాంటప్పుడు దానిని హ్యాపీ హైపోక్సియా అంటారు. ఇదే పెద్ద ప్రమాదకరం. ఇలాంటప్పుడు పల్స్ ఆక్సీమీటర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీంతో తరచూ పరిశీలించుకోవాలి. ఆరు నిమిషాలు నడిచిన తర్వాత పల్స్ ఆక్సీమీటర్ ద్వారా పరీక్షించుకుంటే 94 శాతం కన్నా తక్కువగా ఉంటే అతనికి ఊపిరితిత్తుల ద్వారా ఆక్సిజన్ అందడం లేదని గుర్తించాలి. అలాంటివారు వెంటనే వైద్యశాలలో చేరాల్సి ఉంటుంది. వారికి ఆక్సిజన్ స్థాయి పడిపోతున్న విషయం తెలియదు. ఫలితంగా ఒకటి రెండ్రోజుల్లో పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది. కరోనా మరణాల్లో ఎక్కువగా ఇలానే జరుగుతున్నాయి. హైపోక్సియాను వెంటనే గుర్తించి వైద్యశాలకు వెళ్లగలిగితే ప్రాణాలు కాపాడుకోవచ్చు. గ్రామాల్లో ప్రతి ఆరోగ్య కార్యకర్త వద్ద ఈ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా పల్స్ రేటును చూసుకుని ముందు జాగ్రత్తలు తీసుకునే విధానం ఉంది. డాక్టర్ గౌతమి,పుల్లలచెరువు, ప్రభుత్వ వైద్యాధికారి -
కురిచేడు శానిటైజర్ ఘటనపై సిట్ దర్యాప్తు ముమ్మరం
-
వారం రోజులుగా శానిటైజర్ తాగుతూ..
సాక్షి, ప్రకాశం: కురిచేడులో శానిటైజర్ తాగి చనిపోయిన అనుగొండ శ్రీను బోయకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. మద్యానికి బానిసైన అతడు తనతో పాటు మరో వ్యక్తికి కూడా గ్లాసులో శానిటైజర్ పోసి ఇచ్చిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా కరోనా లాక్డౌన్ నేపథ్యంలో కురిచేడులో పది రోజులుగా మద్యం దుకాణాలు మూతపడ్డాయి. దీంతో కొందరు స్థానికులు, యాచకులు శానిటైజర్ తాగారు. ఈ ఘటనలో గురువారం అర్ధరాత్రి ముగ్గరు మరణించగా, శుక్రవారం మరో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. (శానిటైజర్ తాగి 9 మంది మృతి ) ఇక ఈ విషాదకర ఘటనపై స్పందించిన జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మద్యానికి బానిసైన మృతులు.. మందు దొరకకపోవడంతో శానిటైజర్లు తాగారని, సీనియర్ అధికారులతో కేసు విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మార్చురీ వద్ద మృతదేహాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే.. దయచేసి ఎవరూ శానిటైజర్లు తాగవద్దని విజ్ఞప్తి చేశారు. -
ఎస్సై విజయ్కుమార్పై సస్పెన్షన్ వేటు
సాక్షి, ఒంగోలు: మాస్క్ వివాదంలో ప్రాణాలు విడిచిన చీరాల యువకుడు కిరణ్ కేసులో ఎస్సై విజయ్కుమార్పై సస్పెన్షన్ వేటుపడింది. కిరణ్పై పోలీసులు దాడి చేయడం వల్లే మృతి చెందాడని ఆరోపణల నేపథ్యంలో చీరాల ఎస్సై విజయ్కుమార్ని సస్పెండ్ చేస్తూ ఎస్పీ గంగాధర్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే.. చీరాలలోని థామస్పేటకు చెందిన ఎరిచర్ల మోహన్రావు, హెప్సీబాల కుమారుడు కిరణ్కుమార్ (26), స్నేహితుడు షైనీ అబ్రహాంతో కలిసి ఈనెల 19వ తేదీన తన పల్సర్ వాహనంపై వెళుతుండగా కొత్తపేట పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న ఔట్పోస్టు వద్ద పోలీసులు ఆపి మాస్కు ఎందుకు వేసుకోలేదని ప్రశ్నించగా, వారు వాగ్వావాదానికి దిగారు. ఎస్ఐ విజయ్కుమార్ వారిని పోలీస్ జీపులో తరలిస్తుండగా, మరోసారి వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు దాడి చేశారని పేర్కొంటూ కిరణ్, షైనీలు ఔట్పోస్టులో ఫిర్యాదు చేశారు. తీవ్ర గాయాలైన కిరణ్ను అదే రోజు గుంటూరు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందిన సంగతి తెలిసిందే. (మాస్కు వివాదం.. యువకుడి బలి) (చీరాల ఘటనపై సీఎం జగన్ సీరియస్) -
జలయజ్ఞంతో ప్రాజెక్టులకు రూపం
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఎన్నో అభివృద్ధి పనులతో జిల్లాకు జవజీవాలిచ్చారు. సీఎం అంటే ఇలా ఉండాలి అనిపించేలా జిల్లాలో అభివృద్ధిని పరుగులు పెట్టించారు. ఆ మహానేత కనుమరుగై దశాబ్దం దాటినా జిల్లా ప్రజలు ఆయన జ్ఞాపకాలను ఇంకా మరువలేకున్నారు. వైఎస్సార్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. బుధవారం వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఆ జ్ఞాపకాలను ఒకసారి నెమరు వేసుకుందాం.. సాక్షి, ఒంగోలు: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా సాగు, తాగునీటి ప్రాజెక్టులకు జీవం పోశారు. రైతులు, రైతు కూలీలు పడుతున్న ఇబ్బందులను తన పాదయాత్రలో కళ్లారా చూసిన ఆయన అధికారంలోకి వచ్చాక జలయజ్ఞంలో భాగంగా జిల్లాలో కూడా పలు ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. వాటిలో ప్రధానమైనది పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు. వెలిగొండ ప్రాజెక్టు.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేసిన వెలిగొండ ప్రాజెక్టు ఆ తరువాత ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అప్పుడు వేసిన శిలాఫలకం కాలగర్భంలో కలిసిపోయింది. 2004లో డాక్టర్ వైఎస్.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి సంకలి్పంచారు. శ్రీశైలం జలాశయం నుంచి 43.58 టీఎంసీల కృష్ణా వరద నీటిని మళ్లించి జిల్లాలోని 23 మండలాల్లో 3,36,100 ఎకరాలకు, వైఎస్సార్ కడప జిల్లాలోని 2 మండలాలకు చెందిన 27,200 ఎకరాలకు, నెల్లూరు జిల్లాలోని 5 మండలాలకు చెందిన 84 వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంగా రూపొందించారు. మొత్తం కలిసి 4,47,300 ఎకరాలకు సాగు నీరు అందించనున్నారు. అదే విధంగా 15.25 లక్షల మంది ప్రజానీకానికి తాగునీరు అందించటానికి ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టు అంచనాలు రూ.8,840 కోట్లకు చేరింది. అప్పట్లో రూ.5,150 కోట్లు కేటాయించి ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించారు. వైఎస్ అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. మళ్లీ 2014లో సీఎం అయిన చంద్రబాబు ప్రజల సొమ్మును కాంట్రాక్టర్ల రూపంలో పిండుకొని వాటాలు వేసుకున్నారే తప్ప ప్రాజెక్టు మాత్రం ముందుకు కదలలేదు. వైఎస్ జగన్తో మళ్లీ పనుల్లో వేగం.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మళ్లీ వెలిగొండ పనులు వేగం పుంజుకున్నాయి. చంద్రబాబుకు చెందిన బినామీ కాంట్రాక్టర్లను తప్పించారు. వెలిగొండ ప్రాజెక్టు టెండర్లలో కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. రివర్స్ టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లను ఆహా్వనించారు. వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని రెండో టన్నెల్కు నిర్వహించిన రివర్స్ టెండర్లో ప్రభుత్వ ఖజానాకు రూ.84 కోట్లు జమయ్యాయి. ఒకటో టన్నల్ తవ్వటం దాదాపు పూర్తయింది. అక్టోబర్ ఆఖరుకు ఆ టన్నెల్ నుంచి వెలిగొండ ప్రాజెక్టుకు చెందిన నల్లమల సాగర్కు నీళ్లు వదలనున్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు... గుండ్లకమ్మ నది నుంచి జలాలు వృథాగా సముద్రం పాలు కావటాన్ని గుర్తించిన వైఎస్సార్ మద్దిపాడు మండలం మల్లవరం గ్రామం వద్ద ప్రాజెక్టు నిర్మించాలని తలచారు. అందు కోసం రూ.543.43 కోట్లు కేటాయించారు. 3.859 టీఎంసీల నీటి సామర్ధ్యంతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూపకల్పన చేశారు. 9 మండలాల పరిధిలోని 80 వేల ఎకరాలకు సాగునీరు, జిల్లా కేంద్రం ఒంగోలుతో పాటు 43 గ్రామాల పరిధిలోని 2.56 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించటమే లక్ష్యంగా గుండ్లకమ్మ ప్రాజెక్టును రూపొందించారు. 2008 నవంబర్ 24న డాక్టర్ వైఎస్సార్ ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. కొరిశపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం: యర్రం చినపోలిరెడ్డి కొరిశపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం కూడా వైఎస్సార్ పుణ్యమే. గుండ్లకమ్మ రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోసి కొరిశపాడు, నాగులుప్పలపాడు మండలాల్లో ప్రజలను ఆదుకునేందుకు ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. రెండు మండలాల్లోని 20 వేల ఎకరాలకు సాగు నీరు అందించేలా 1.33 టీఎంసీల సామర్ధ్యంతో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. మొత్తం రూ.177 కోట్ల వ్యయ అంచనాలతో నిర్మాణం చేపట్టారు. ౖవైఎస్సార్ అకాల మరణం చెందిన తరువాత ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. తిరిగి వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ కొరిశపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభమయ్యాయి. పాలేరు రిజర్వాయర్.. కొండపి నియోజకవర్గ ప్రజల కష్టాలు తీర్చేందుకు వైఎస్సార్ పొన్నలూరు మండలం చెన్నుపాడు గ్రామం వద్ద పాలేరుపై రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 0.584 టీఎంసీల నీటి సామర్ధ్యంతో 9,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 4 మండలాల పరిధిలోని 15 గ్రామాలకు చెందిన 30 వేల మంది ప్రజలకు తాగునీరు అందించటమే లక్ష్యంగా రూ.50 కోట్ల వ్యయ అంచనాలతో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఆ తరువాత వచ్చిన ముఖ్యమంత్రులెవ్వరూ ఈ ప్రాజెక్టు ఊసే పట్టించుకోలేదు. ప్రస్తుత వైఎస్ జగన్ ప్రభుత్వం కాంట్రాక్టర్ను మార్చి పనులు ప్రారంభించే పనిలో నిమగ్నమైంది. రూ.400 కోట్లతో సాగర్ కాలువల అభివృద్ధి: జిల్లాలో ఆయకట్టుకు సాగర్ కాలువలు ప్రధాన ఆధారం. సాగర్ కుడి కాలువ ద్వారా జిల్లాలో దాదాపు 4.40 లక్షల ఎకరాలలో సాగు భూమి ఉంది. వైఎస్సార్ అధికారంలోకి వచ్చిన తరువాత సాగర్ కాలువల అభివృద్ధికి రూ.400 కోట్లు కేటాయించారు. అంతకు ముందు కనీసం లక్ష ఎకరాలకు కూడా సాగర్ నీరు జిల్లాకు వచ్చేది కాదు. అలాంటి సాగర్ కాలువల అభివృద్ధితో సాగర్ ఆయకట్టు చివరి భూముల వరకు నీరు వచ్చేలా ఆధునికీకరణ చేపట్టారు. రూ.250 కోట్లతో ఒంగోలులో రిమ్స్.. జిల్లా ప్రజలు వైద్యం కోసం గుంటూరు, నెల్లూరు, లేకుంటే చెన్నై వెళ్లేవారు. వైఎస్సార్ అధికారం చేపట్టాక జిల్లాకు రిమ్స్ వైద్య కళాశాలను మంజూరు చేశారు. రిమ్స్ ఏర్పాటు కోసం రూ.250 కోట్లు కేటాయించి భవన నిర్మాణాలను ప్రారంభించారు. ఒంగోలు రిమ్స్ రాజన్న చలువే. ఆరోగ్యశ్రీ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి జిల్లాలోని లక్షలాది మంది పేదలకు ఆరోగ్య ప్రదాతగా నిలిచారు. కందుకూరులో రూ.110 కోట్లతో ఎస్ఎస్ ట్యాంకు.. కందుకూరు ప్రజల దాహార్తి తీర్చేందుకు చీమకుర్తి సమీపంలో నిర్మించిన రామతీర్ధం జలాశయం నుంచి కందుకూరుకు నీరు మళ్లించేందుకు రూ.110 కోట్లతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఒంగోలు నగర ప్రజల దాహార్తిని తీర్చటానికి కూడా రామతీర్థం జలాశయం నుంచే నీటిని ఒంగోలు ఎస్ఎస్ ట్యాంకులను నింపుతున్నారు. రూ.80 కోట్లతో సోమశిల ఉత్తర కాలువ అభివృద్ధి: రాళ్లపాడు ప్రాజెక్టు రైతుల కష్టాలు తెలుసుకున్న వైఎస్సార్ ఎగువనున్న నెల్లూరు జిల్లా సోమశిల నుంచి నీటిని రాళ్లపాడుకు నీరు మళ్లించేందుకు అంచనాలు రూపొందించాలని అప్పట్లో అధికారులను ఆదేశించారు. సోమశిల ఉత్తర కాలువను పొడిగించటం ద్వారా దాదాపు రూ.80 కోట్లు ఖర్చవుతాయని వ్యయ అంచనాలు రూపొందించారు. వెంటనే పరిపాలనా అనుమతులు ఇచ్చి ఉత్తర కాలువ పనులను ప్రారంభింపజేశారు. కనిగిరిలో రూ.175 కోట్లతో రక్షిత మంచినీటి పథకం: కనిగిరి ప్రాంతంలో ఫ్లోరైడ్ నీటితో అనారోగ్యం పాలవుతున్నామని అక్కడి ప్రజలు వైఎస్సార్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రూ.175 కోట్ల వ్యయ అంచనాలతో రక్షిత మంచినీటి పథకాన్ని సిద్ధం చేశారు. నిధులు కూడా మంజూరు చేశారు. ఆ పథకం వలన కనిగిరి ప్రాంతంలో కొంతమేర మంచినీటి కష్టాలు తీరాయి. కనిగిరి ప్రాంత ప్రజలు ఫ్లోరైడ్ పీడితులుగా మారుతున్నారని ఫ్లోరైడ్ నివారణ కోసం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రూ.800 కోట్లతో చర్యలు చేపట్టారు. -
‘చిత్తూరు ఘటన సీబీసీఐడీ విచారణకు ఆదేశించాం’
సాక్షి, ప్రకాశం: చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఘటనను సీబీసీఐడీ విచారణకు ఆదేశించామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉద్యోగుల పట్ల పారదర్శకంగా వ్యవహరిస్తోందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య రంగాన్ని గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రయత్నిస్తున్నామని వ్యాఖ్యానించారు. ప్రతీ సచివాలయం పరిధిలో ఓ విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేస్తున్నామని ఆళ్ల నాని తెలిపారు. మారు మూల వైద్యశాలలను కూడా ఆధునీకరిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో వైద్య రంగం భ్రష్టు పట్టిందని మండిపడ్డారు. వైద్యశాలలకు, మెడికల్ కళాశాలలకు కావాల్సిన అన్నీ మౌళిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కావాల్సిన వైద్య ఏర్పాట్లకు అన్నీ ప్రతిపాదనలు సిద్ధం చేశామని ఆళ్ల నాని పేర్కొన్నారు. -
కర్ణాటక నుంచి నడిచివస్తున్న మహిళకు సాయం
చంకన బిడ్డ.. కడుపున నలుసు.. పొట్టకూటి కోసం పొరుగు ప్రాంతం వెళ్లిందా మహిళ.. అంతలోనే కరోనా మహమ్మారి కసిరింది ఉన్న ప్రాంతం వదిలి సొంతూరికి బయల్దేరింది.. బండ్లు తిరగలేదు.. బస్సులు కదలలేదు నెత్తిన భగభగ మండే ఎండ నిప్పుల కొలిమిలా కాలుతున్న నేల భుజాన బిడ్డను ఎత్తుకొని ఆకలి ఎరుగక.. కాలినడకన వడివడిగా అడుగులు వేస్తూ.. స్వగ్రామానికి పయనమైంది దారిపొడవునా కష్టాలే.. ఆ అమ్మను చూసి ‘అయ్యో..’ అనడమే అందరి వంతైది.. అష్టకష్టాలతో అనంత చేరుకోగా.. అధికారి పద్మావతమ్మ సాయంగా నిలిచారుపోలీసుల సాయంతో సొంతూరికి సాగనంపేందుకు ఏర్పాట్లు చేసింది. సాక్షి, మర్రిపూడి: ఉపాధి కోసం పొరుగు రాష్ట్రం కర్ణాటకకు వలస వెళ్లిన ఓ కుటుంబం లాక్డౌన్ నేపథ్యంలో పనుల్లేక స్వగ్రామానికి కాలినడకన బయలుదేరింది. ఆ కుటుంబంలోని మహిళ నిండు గర్భిణి కావడంతో ఆపసోపాలు పడుతూ సుమారు 150 కిలోమీటర్లు నడిచి ఆంధ్రాలో ప్రవేశించిన తర్వాత.. అనంతపురం జిల్లా అధికారులు ఆ కుటుంబానికి అండగా నిలిచి.. స్వగ్రామానికి తరలించారు. రాష్ట్ర అధికారుల ఔదార్యానికి ఆ కుటుంబం ఎంతో ఆనందం వ్యక్తం చేస్తోంది. వివరాలు ఇలా ఉన్నాయి.. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలంలోని చిమట దళితవాడకు చెందిన కొమ్ము కృపానందం, సలోమి దంపతులకు ముగ్గురు సంతానం. ప్రస్తుతం సలోమి 8 నెలల గర్భిణి. చిమట గ్రామంలో కూలీ పనులు దొరక్క.. బేల్దారీ మేస్త్రీ వద్ద పనులు చేయడానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో కర్ణాటకలోని బళ్లారి వద్ద గల చెలికేరికి వెళ్లారు. తమతో పాటు మూడేళ్ల చిన్న కుమారుడిని తీసుకెళ్లారు. లాక్డౌన్ విధించాక బేల్దారీ మేస్త్రీ డబ్బులు ఇవ్వలేదు. దీంతో కుటుంబం గడవడం కష్టంగా మారింది. మరో ముగ్గురుతో కలసి కృపానందం దంపతులు ఈ నెల ఒకటిన కాలినడకన స్వగ్రామానికి బయలుదేరారు. రెండ్రోజుల అనంతరం వారు అనంతపురం జిల్లాలో ప్రవేశించారు. చేతిలో చిల్లిగవ్వలేదు. తెచ్చుకున్న తిండి అయిపోయిన తరుణంలో అనంతపురం జిల్లా సీటీవో కార్యాలయంలో అధికారి పద్మావతమ్మ ఆ కుటుంబ పడుతున్న అవస్థలను గుర్తించి ఆదుకున్నారు. వారికి భోజనం పెట్టించారు. వైద్య పరీక్షలు చేయించి, కలెక్టర్, ఎస్పీల వద్ద నుంచి తరలింపునకు అనుమతి పత్రాలు తీసుకున్నారు. ఆ కుటుంబాన్ని ఆదివారం కారులో స్వగ్రామం చిమటకు తరలించారు. బతిమాలినా బండ్లు ఆపలేదు: సలోమి నడిచి వచ్చేటప్పుడు ఎంతో మందిని బతిమలాడాను. అయినా ఎవరూ వాహనాలు ఆపలేదు. నడిచి వచ్చేటప్పుడు నా బిడ్డను చూసి కనికరించి కొందరు పండ్లు, తినుబండారాలు ఇచ్చారు. చెప్పులు సైతం తెగిపోయాయి. అనంతపురంలో ప్రభుత్వ అధికారి పద్మావతమ్మ భోజనం పెట్టించి వైద్యపరీక్షలు చేయించి కారు మాట్లాడి మా ఇంటికి పంపించారు. ఆవిడకు ప్రత్యేక ధన్యవాదాలు. కంట తడిపెట్టించింది.. కృపానందం కరోనా నేపథ్యంలో మమ్మల్ని కర్ణాటక రాష్ట్రం తీసుకెళ్లిన మేస్త్రీ మాకు కూలి డబ్బులు ఇవ్వలేదు. చేతిలో చిల్లి గవ్వలేక జీవనం కష్టంగా మారింది. నడిచి ఇంటికి వెళ్లాలనుకుని ఈ నెల ఒకటో తేదీన బయలు దేరాం. 8 నెలల నిండు గర్భిణి అయిన నా భార్య సలోమి మాతో నడవడం నాకు బాధేసింది. పైగా మూడు ఏళ్ల వయసున్న నా మూడో కుమారుడు జైపాల్ను ఎత్తుకుని నడవడం మరీ కష్టం అయిపోయింది. -
పేదల కడుపు నింపుతున్న ఏపీ ప్రభుత్వం
-
కరోనా వైరస్: ప్రకాశం భయకంపితం
సాక్షి, చీరాల: జిల్లాలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. మూడు రోజుల క్రితం వరకు లండన్ వెళ్లి వచ్చిన యువకునికి తప్ప అతని కుటుంబ సభ్యులకు సైతం నెగిటివ్ రిపోర్టు రావడంతో జిల్లా ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ తరుణంలో ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన ఓ మతపెద్ద ద్వారా అతని భార్య, కుమారునితోపాటు మరో ఏడుగురికి సైతం కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో జిల్లా అధికారులతోపాటు ప్రజలు భయకంపితులయ్యారు. ఇప్పటి వరకు జిల్లాలో 11 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అందులో 10 కేసులు ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారు, వారితో సన్నిహితంగా మెలిగిన వారే కావడం గమనార్హం. (అమెరికాలో ఒక్కరోజే 865 కరోనా మరణాలు!) జిల్లాలో నమోదైన 11 పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా చీరాలలో 4 కేసులు నమోదు కాగా, కందుకూరులో 3, ఒంగోలు నగరంలో 2, కనిగిరి, కారంచేడులో ఒక్కొక్కటి చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను హైరిస్క్ జోన్లుగా పేర్కొంటూ రెడ్ అలర్ట్ ప్రకటించారు. జిల్లాలో ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన 280 మందిలో సుమారు 100 మందికి పైగా ఆచూకీ తెలియలేదు. వీరందరూ స్వచ్ఛందంగా క్వారంటైన్ కేంద్రాలకు వచ్చి వైద్య చికిత్స పొందాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ కోరారు. అంతే కాకుండా వీరి ఆచూకీ కోసం ప్రత్యేక టాస్్కఫోర్స్ బృందాలు వెతుకులాట ప్రారంభించాయి. (కౌలాలంపూర్ నుంచి అంటుకుందా? ) ఒంగోలు నగరంలో పాజిటివ్ కేసులు నమోదైన వ్యక్తి భార్య ఆ చుట్టు పక్కల పిల్లలకు ట్యూషన్ చెప్పిందని గుర్తించిన అధికారులు ట్యూషన్కు వెళ్లే పిల్లలను గుర్తించి కుటుంబ సభ్యులందరినీ మంగళవారం క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారితో పాటు వైరస్ సోకిన వ్యక్తులతో సన్నిహితంగా ఉన్న వారందరినీ గుర్తించి దగ్గరలోని క్వారంటైన్ కేంద్రాలకు తరలించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. జిల్లాలో ఉన్న 10 క్వారంటైన్ కేంద్రాల్లో ఇప్పటి వరకు 696 మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒంగోలు జీజీహెచ్లో ఐసోలేషన్ వార్డులో ఉన్న వారితోపాటు జిల్లా వ్యాప్తంగా సుమారు 80 మంది అనుమానిత లక్షణాలు ఉన్న వారి శాంపిల్స్ను ల్యాబ్లకు పంపగా వారి రిపోర్టులు రావాల్సి ఉంది. జిల్లాలో ఇప్పటికే 11 కేసులు నమోదు కాగా ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందనే ఆందోళన సర్వత్రా నెలకొంది ఢిల్లీలో ఇస్తిమాకు హాజరైన 14 మందిని క్వారంటైన్కు తరలించడంతో నిర్మానుష్యంగా ఇస్లాంపేట చీరాలలో.. చీరాల ప్రాంతం కరోనా కోరల్లోకి వెళ్లింది. ఢిల్లీలో మతపరమైన కార్యక్రమానికి జిల్లా నుంచి 280 మంది వెళ్లగా వారిలో 80 మంది చీరాల పరిసర ప్రాంత ప్రజలు కావడం విశేషం. చీరాల మండలంలోని సాల్మన్సెంటర్ పంచాయతీ నవాబుపేటలో భార్యభర్తలకు కరోనా పాజిటివ్ రావడంతో జిల్లా యంత్రాంగం ఉలిక్కిపడింది. మార్చి 12 చీరాల మండలం సాల్మన్సెంటర్ పంచాయతీలోని నవాబుపేటకు చెందిన వ్యక్తితో పాటు మరో ఏడుగురు ఇస్తిమాకు చీరాల నుంచి ఢిల్లీ వెళ్లారు. చీరాలలో నాలుగు పాజిటివ్ కేసు నమోదు కావడంతో జిల్లా యాంత్రాంగం చూపు చీరాలపై పడింది. జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు మొత్తం హుటాహుటిన చీరాలకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నవాబుపేటకు చెందిన భార్యభర్తలకు పాజిటివ్ రావడంతో శనివారం ఆయన కుటుంబంతో సహ గృహనిర్భందంలోకి వెళ్లారు. నవాబుపేట, పేరాల ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. రహదారులు మూతపడ్డాయి. చీరాలలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూం నెం. 08594–232327 కు ఎవరైనా అనుమానిత కేసులు ఉంటే సంప్రదించాలన్నారు. అలానే అనుమానిత కేసులు తరలించేందుకు మూడు అంబులెన్స్లు ఏర్పాటు చేశారు. చీరాల ప్రాంతాన్ని కంటోన్మెంట్ జోన్గా ఏర్పాటు చేసి జిల్లా పరిషత్ సీఈఓ, డీవైఎంహెచ్ఓ చీరాలలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. నవాబుపేటలో రాకపోకలపై పూర్తిగా ఆంక్షలు విధించారు. వలంటీర్లు, ఏఎన్ఎంలు సర్వేలు నిర్వహిస్తున్నారు. కందుకూరులో.. కందుకూరు పట్టణలంలో కరోనా కలకలం రేపింది. పట్టణానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో తీవ్ర ఆందోళనకర వాతావరణం నెలకొంది. కరోనా సోకిన ముగ్గురు వ్యక్తులు ఢిల్లీలో ప్రార్థనకు వెళ్లి వచ్చిన వారే కావడం, వారు పట్టణంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో ప్రజలు హడలి పోతున్నారు. ప్రస్తుతం కరోనా సోకిన వ్యక్తులు ఎవరెవరిని కలిశారు, ఏ కార్యక్రమాల్లో పాల్గొన్నారనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తులకు కరోనా పాజిటివ్గా తేలుతుండడంతో రెండు రోజుల క్రితం వీరిని ఒంగోలు రిమ్స్కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఈ ముగ్గురికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో పట్టణంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత దాదాపు 10 రోజులపాటు వీరు పట్టణంలో తిరగడంతోపాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడమే ఇందుకు కారణం. ప్రస్తుతం ఈ ముగ్గురు కుటుంబ సభ్యులను అధికారులు ఒంగోలు రిమ్స్కు తరలించారు. ఆయా ప్రాంతాలను రెడ్జోన్గా ప్రకటించారు. మక్కా మసీద్లో ఇమామ్గా పనిచేసిన వ్యక్తి గత శుక్రవారం మసీదులో జరిగిన నమాజ్లో పాల్గొన్నారు. ఈ నమాజ్లో 80 మంది వరకు పాల్గొన్నట్లు గుర్తించారు. అలాగే బూడిదపాలేనికి చెందిన వ్యక్తి లింగసముద్రంలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. ఈయన 50 మందికి పైగా రక్త పరీక్షలు చేసినట్లు తేలింది. వారిలో 42 మంది క్వారంటైన్కు స్వయంగా వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యే మానుగుంట మహీధర్రెడ్డి మాట్లాడుతూ.. విక్కిరాలపేటరోడ్డు, బూడిదపాలెం, మక్కామసీదు, పోతురాజుమిట్ట ప్రాంతాలను రెడ్ అలెర్ట్ జోన్స్గా ప్రకటిస్తున్నామని తెలిపారు. ప్రజలు అర్ధం చేసుకుని స్వియ నియంత్రణలో ఉండాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కందూరుకు ఇన్చార్జిగా జెడ్పీ సీఈఓ కైలాస్గిరీశ్వర్, ఆర్డీఓ ఓబులేసు, డీఎస్పీ శ్రీనివాసులు, కమిషనర్ మనోహర్, వైద్యాధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. కనిగిరిలో.. ఢిల్లీలో నిజాముద్దీన్ ఇస్తిమాకు వెళ్లి వచ్చిన కనిగిరికి చెందిన ఏడుగురిని క్వారంటైన్ సెంటర్కు తరలించిన సంగతి విధితమే. వారిలో అర్బన్ కాలనీకి చెందిన ఒకరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో అతని కుటుంబంలోని 11 మంది, సన్నిహితులైన నలుగురు మొత్తం 15 మందిని క్వారంటైన్ సెంటర్కు తరలిస్తున్నట్లు కమిషనర్ డీవీఎస్ నారాయణరావు తెలిపారు. అలాగే కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తితో పూర్తిగా దగ్గరగా వ్యవహరించిన ఇద్దరు వ్యక్తులను కూడా ఒంగోలుకు తరలించినట్లు సమాచారం. కరోనా పాజిటివ్ వ్యక్తి నివాసం నుంచి 300 మీటర్ల మేర రెడ్జోన్గా ప్రకటించారు. అ ప్రాంతంలోని అన్ని గృహాల్లో వైద్య, మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులు సర్వే చేపట్టారు. కరోనా బాధితుడు నివాసం ఉంటున్న అర్బన్ కాలనీ ప్రాంతాన్ని ఎమ్మెల్యే బుర్రా మధుసుదన్ యాదవ్తో పాటు, జెడ్పీ సీఈఓ కైలాష్ గిరీశ్వర్, నియోజకవర్గ ప్రత్యేక అధికారి నర్శింహారావు, వైద్యులు, వివిధ శాఖల అధికారులు సందర్శించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి జనతా కర్ఫ్యూ రోజున పోలీసులు, జర్నలిస్టులకు వాటర్ బాటిళ్లు, పండ్లు వగైరా పంపిణీ చేశాడు. ఈ నెల 23 నుంచి ఇప్పటి వరకు అతనికి దగ్గరగా వ్యవహరించిన వ్యక్తులు ఎవరనే దానిపై పూర్తిగా వివరాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కారంచేడులో.. మండలంలోని కుంకలమర్రు గ్రామంలో మంగళవారం కరోనా పాటిజివ్ కేసు నమోదు కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఒంగోలు ఆర్డీఓ ప్రభాకరరెడ్డి హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. రెవెన్యూ, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు తమ సిబ్బందిని అప్రమత్తం చేశారు. వలంటీర్లను, ఆశా, ఏఎన్ఎంలను రంగంలోకి దించారు. మంగళవారం ఆర్డీఓ కారంచేడు ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను అప్రమత్తంగా ఉంచాలన్నారు. గ్రామంలో మొత్తం 12 బృందాలను ఏర్పాటు చేసి గ్రామంలోని ప్రతి ఇంటినీ జల్లెడపడతారన్నారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తితో అతి సన్నిహితంగా ఉన్న వారి పేర్లుతోపాటు, వారి ఆరోగ్య పరిస్థితిని నమోదు చేస్తామన్నారు. గ్రామానికి ఇరువైపులా చెక్పోస్టులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గ్రామంలోకి ఎవరూ రావద్దని, గ్రామస్తులు కూడా ఎవరూ బయటకు వెళ్లవద్దంటూ సూచించారు. గ్రామం మొత్తం సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీవైఎంహెచ్ఓ డాక్టర్ మాధవీలత, ఇన్చార్జి తహసీల్దార్ బ్రహ్మయ్య, ఎంపీడీఓ ప్రద్యుమ్నకుమార్, వైద్య సిబ్బంది, రెవెన్యూ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాకు కోవిడ్ హాస్పిటల్గా నెల్లూరు వైద్యశాల ఒంగోలు: ప్రకాశం జిల్లాలో కోవిడ్ పాజిటివ్ కేసుల ఆరోగ్యం మెరుగుపడకపోతే వారిని నెల్లూరు జిల్లా వైద్యశాలకు తరలించనున్నారు. నెల్లూరు జిల్లా వైద్యశాలను పూర్తిస్థాయి కోవిడ్ వైద్యశాలగా మార్చారు. అక్కడ పూర్తి వెంటిలేటర్ల సౌకర్యంతోపాటు కోవిడ్కు అందించే అధునాతన వైద్య పరికరాలను ప్రభుత్వం సమకూర్చింది. అయితే ఒంగోలు జీజీహెచ్లో ఉన్న కోవిడ్ 19 అనుమానితులందరూ ఆరోగ్యంగానే ఉన్నారు. వీరికి కోవిడ్ 19 జిల్లా నోడల్ అధికారి డాక్టర్ జాన్ రిచర్డ్స్ ఆధ్వర్యంలోని వైద్య బృందం చికిత్స అందిస్తోంది. -
సాహిత్యశీలి అస్తమయం
సాక్షి, ఒంగోలు: ‘డియర్ మరణమా, ప్రియ నేస్తమా, నీ వయసెంతో కానీ, నువ్వొక నిశ్శబ్ధ మేధావివి, నీవే లేకపోతే, ఈ లోకం గతేంకాను? ఒక్క మాట చెప్పు. ఎప్పుడూ నా నీడలోనే నీవుంటావు. ఎందుకు మనకీ దోబూచులాట? ఎట్లైనా అంతిమ విజయం నీదేకదా!’ అంటూ మృత్యువుతో స్నేహం చేసిన ప్రముఖ న్యాయవాది, ప్రకాశం జిల్లా రచయితల సంఘం గౌరవాధ్యక్షుడు బీమనాథం హనుమారెడ్డి(79) ఆదివారం ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘం రాష్ట్ర 9వ మహాసభల మూడో రోజున ఆయన మరణించడంతో సాహిత్య లోకం తీవ్ర దిగ్భ్రాంతికి గురయింది. ఈ నెల 17వ తేదీ నుంచి ఒంగోలు ఏకేవీకే కాలేజీ ప్రాంగణంలో మహాసభలు నిర్వహిస్తుండగా, చివరి రోజైన ఆదివారం ఆయన ముగింపు ఉపన్యాసం ఇవ్వాల్సి ఉంది. పలువురు సాహిత్యవేత్తలను ఆయన సత్కరించాల్సి ఉంది. ఇంతలోనే హనుమారెడ్డి మృతి చెందారన్న వార్త విని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 500 మందికి పైగా కవులు, రచయితలు, సాహిత్యవేత్తలు హతాశులయ్యారు. సభా ప్రాంగణం నుంచి ఒంగోలు వీఐపీ రోడ్డులోని హనుమారెడ్డి స్వగృహం వరకు సంతాప ర్యాలీ నిర్వహించారు. హనుమారెడ్డి పార్థివదేహాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. రచయితల మహాసభ వేదికపై హనుమారెడ్డి మృతికి సంతాపం తెలియజేస్తున్న ప్రముఖులు నివాళులర్పించిన ప్రముఖులు రచయిత, న్యాయవాది హనుమారెడ్డి మృతిపై రాష్ట్రవ్యాప్తంగా పలువురు ప్రముఖ సాహిత్యవేత్తలు, కవులు నివాళులర్పించారు. మహాసభల ప్రాంగణంలో నిర్వహించిన సంతాప సభలో, భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించిన వారిలో మాజీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాదరెడ్డి, కేపీ కొండారెడ్డి, దారా సాంబయ్య, దామచర్ల జనార్దన్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు, పీడీసీసీబీ మాజీ చైర్మన్ మేదరమెట్ల శంకరారెడ్డి, ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు, ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్షుడు సోమేపల్లి వెంకటసుబ్బయ్య, ప్ర.ర.సం జిల్లా అధ్యక్షుడు పొన్నూరి వెంకటశ్రీనివాసులు, అభ్యుదయ రచయితల సంఘం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ, కవి సంధ్య శిఖామణి, చలపాక ప్రకాష్, డాక్టర్ సామల రమేష్బాబు, ఇడమకంటి లక్ష్మీరెడ్డి, గుత్తికొండ సుబ్బారావు, టి.అరుణ, డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ, డాక్టర్ నూనె అంకమ్మరావు, మల్లవరపు ప్రభాకరరావు, పి.శ్రీనివాస్ గౌడ్, శ్రీరామకవచం సాగర్, కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి, పాలూరి శివప్రసాద్తోపాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కవులు, రచయితలు నివాళులర్పించారు. హనుమారెడ్డి పార్థివదేహం వద్ద నివాళులర్పిస్తున్న రచయితలు, శ్రేయోభిలాషులు నేడు అంత్యక్రియలు హనుమారెడ్డి పార్థివదేహంతో సోమవారం ఉదయం 11 గంటలకు అంతిమ యాత్ర నిర్వహిస్తున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు, ప్ర.ర.సం జిల్లా అధ్యక్షుడు పొన్నూరి వెంకట శ్రీనివాసులు, కోశాధికారి యత్తపు కొండారెడ్డి తెలిపారు. ఒంగోలు వీఐపీ రోడ్డులోని హనుమారెడ్డి స్వగృహం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న శ్మశానవాటిక వరకు అంతిమ యాత్ర నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎంపీ మాగుంట సంతాపం న్యాయవాది, రచయిత హనుమారెడ్డి మృతి వార్త తనను ఎంతగానో కలచి వేసిందని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. జిల్లా కోర్టులో ఏపీపీగా ప్రజలకు ఎనలేని సేవలు చేసిన హనుమారెడ్డి రచయితల సంఘం అధ్యక్షుడిగా రాష్ట్రస్థాయి మహాసభలు నిర్వహించడంలో విశేషంగా కృషి చేశారని తెలిపారు. మంచితనానికి, మానవత్వానికి ఆయన నిదర్శనంగా నిలిచారని, న్యాయవాదులకు, రచయితలకు ఆయన లేని లోటు తీర్చలేనిదని పేర్కొన్నారు. హనుమారెడ్డి నేపథ్యం.. 1941 ఏప్రిల్లో అద్దంకి మండలం వెంకటాపురం గ్రామంలో జన్మించిన హనుమారెడ్డి న్యాయవాదిగా పట్టా పొంది వడ్లమూడి గోపాలకృష్ణ, సుంకర దశరథరామిరెడ్డి వద్ద జూనియర్గా ప్రాక్టీస్ ప్రారంభించారు. లాయర్గా జీవితాన్ని ప్రారంభించి 1970 నుంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఆరేళ్లపాటు సేవలందించారు. 1985లో ప్రకాశం జిల్లా లోక్ అదాలత్ కన్వినర్గా పనిచేశారు. 1999లో ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికై తెలుగు భాష, సాహిత్యాల వ్యాప్తికి విశేషంగా కృషి చేశారు. జిల్లా రచయితల సంఘానికి రాష్ట్ర స్థాయిలో పేరు తెచ్చారు. గడిచిన 55 ఏళ్లుగా ఒంగోలులో ప్రముఖ క్రిమినల్ లాయర్గా పేరుప్రఖ్యాతులు పొందారు. ఈ క్రమంలో డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు తర్వాత ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి దాదాపు 20 ఏళ్లకు పైగా విశేషంగా సాహిత్య సేవ చేశారు. వెన్నెలపువ్వు, పల్లెకు దండం పెడతా, మావూరు మొలకెత్తింది, గుజ్జనగూళ్లు, వీక్షణం, వెన్నెల గీతం, పావని, వర్గకవి శ్రీశ్రీ , మహిళ, విద్యార్థి రాజ్యాంగం, రిజర్వేషన్లు, రెడ్డి వైభవం తదితర పుస్తకాలు రచించారు. -
'మద్యం మత్తులో మతిస్థిమితం లేని యువతిపై'
సాక్షి, త్రిపురాంతకం: మతి స్థిమితంలేని యువతిపై మద్యం మత్తులో యువకుడు లైంగికదాడికి పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. త్రిపురాంతకం మండలానికి చెందిన యువకుడు ఎ.కరుణాకరరెడ్డి (23) శుక్రవారం రాత్రి సుమారు 11గంటల సమయంలో మద్యం తాగి ఇంటికొచ్చాడు. ఆ సమయంలో ఇంటికి సమీపంలో ఆరు బయట మంచంపై నిద్రిస్తున్న మతిస్థిమితం లేని 20 ఏళ్ల యువతిని బలవంతంగా పక్కనే ఉన్న ఖాళీ స్థలంలోకి తీసుకెళ్లి లైంగికదాడి చేశాడు. బట్టీ పనులు ముగించుకుని ఇంటికొచ్చిన కుటుంబ సభ్యులకు కుమార్తె కనిపించకపోవడంతో ఇంటి వద్ద వెతగ్గా..పక్కన ఉన్న ఖాళీ స్థలం నుంచి బయటకు వస్తూ కనిపించింది. విషయం తెలుసుకుని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరుణాకరరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా లైంగికదాడికి పాల్పడినట్లు అంగీకరించాడు. -
అధికారులకు ఎస్పీ సిద్ధార్థ్ సెమినార్
సాక్షి, ఒంగోలు: ఆన్లైన్ దర్యాప్తుపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ సూచించారు. శనివారం స్థానిక పోలీసు కల్యాణ మండపంలో సబ్ ఇన్స్పెక్టర్ నుంచి డీఎస్పీ స్థాయి అధికారుల వరకు ఆన్లైన్ దర్యాప్తుపై అవగాహన కల్పించేందుకు సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆన్లైన్ దర్యాప్తు అనగానే సైబర్ క్రైం కాదని గుర్తుంచుకోవాలన్నారు. దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా నేడు సాంకేతిక వినియోగం పెరిగిపోయిందన్నారు. అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలు సాంకేతికతను వినియోగిస్తూ పౌరులకు మెరుగైన సేవలు అందిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఒకచోట నేరం చేస్తూ మరోచోట తలదాచుకునే వారి గుట్టును సులువుగా ఛేదించాలంటే ఆన్లైన్ దర్యాప్తుపై అవగాహన అవసరమని అభిప్రాయపడ్డారు. ఉదాహరణకు ఒక అనుమానితుడి వేలిముద్రను గుర్తించినప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరు యాప్ ద్వారా సులువుగా అతనిపై ఉన్న కేసులను తెలుసుకోవచ్చని, ఫింగర్ ప్రింట్ బ్యూరోకు పంపడం, వారు వాటిని సెర్చి చేసి నివేదిక అందించాల్సి రావడంతో వేగవంతమైన దర్యాప్తుకు ఆటంకం ఏర్పడుతోందన్నారు. ప్రాథమిక అవగాహన కోసమే సెమినార్ ప్రస్తుతం నిర్వహిస్తున్న సెమినార్ కేవలం ప్రాథమిక అవగాహన కోసమేనని, ఇంకా మలిదశలో మరికొన్ని సెమినార్లు నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందని ఎస్పీ అభిప్రాయపడ్డారు. అన్ని దశల్లో శిక్షణ పూర్తి చేసుకుని అవగాహన పెంపొందించుకుంటే మీరే సుశిక్షితులైన సైబర్ ఎక్స్పర్ట్గా ఉంటారని సీనియర్ ఇన్వెస్టిగేషన్ అధికారులకు సూచించారు. ప్రతి ఒక్క ప్రభుత్వ సంస్థ డేటా బేస్ను అందుబాటులో ఉంచితే ఆన్లైన్ దర్యాప్తునకు అవకాశం ఏర్పడిందన్నారు. చాలామంది ఆన్లైన్ దర్యాప్తునకు కేవలం ఈ కాప్స్ మీద ఆధారపడుతున్నారని, ఇది సమంజసం కాదని ఎస్పీ స్పష్టం చేశారు. మారుతున్న కాలానికి తగ్గట్లు మనం కూడా వాటిని అందిపుచ్చుకుంటూ ముందడుగు వేయాలని సూచించారు. ఒక ప్రాంతంలో నేరం చేసిన వ్యక్తి మరో ప్రాంతంలో ప్రభుత్వ పథకాలు పొందే అవకాశాలు లేకపోలేదని, ఆధార్, మొబైల్ నంబర్, బ్యాంకు అకౌంట్, ఏటీఎం కార్డు వినియోగం, రేషన్ కార్డు వినియోగం, డ్రైవింగ్ లైసెన్స్ వినియోగం ఇలా అనేక రకాలైన వాటిలో ఏదో ఒకదాన్ని నేరగాడు తప్పకుండా వినియోగిస్తుంటాడని పేర్కొన్నారు. దర్యాప్తు అంశాలపై సెల్లో శిక్షణ పొందుతున్న పోలీసు అధికారులు క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టం (సీసీటీఎన్ఎస్) ప్రస్తుతం అందుబాటులో ఉన్నా అందులో కొంత సమస్య ఉందని, వాటిని సైతం అధిగమించేలా ప్రతి ఒక్కరు మారాలన్నారు. ఇప్పటి వరకు ఎవరో ఒకరిని ఇన్ఫార్మర్గా పెట్టుకుని నిందితులను అరెస్టు చేసేవారని, ఇక నుంచి ఆన్లైన్ ద్వారా అతడిని ట్రేస్ చేసి ఎప్పుడు ఏ ప్రాంతంలో ఉంటాడో కూడా తెలుసుకోవడం ద్వారా దర్యాప్తు వేగవంతం కావాలని ఎస్పీ వివరించారు. పంజాబ్లో ఇటీవల నేరగాళ్లు మరింత రెచ్చిపోతున్నారన్నారు. ఫలానా సమయంలో ఫలానా హత్య తానే చేశానని, ఎలా చేసింది కూడా వివరంగా సోషల్ మీడియాలో కొందరు పోస్టు చేస్తున్నారని, ఇటువంటి నేరస్తులను అరెస్టు చేయాలంటే సాంకేతి వినియోగంపై నైపుణ్యం తప్పనిసరన్నారు. అద్దంకి సీఐ అశోక్వర్థన్ ఇటీవల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సంచలన కేసులను ఛేదించారని, ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకుని చిత్తశుద్ధితో ప్రాక్టీస్ చేయాలని వివరించారు. ఇక నుంచి నైట్ షిఫ్ట్ల్లో పనిచేసే వారు సాంకేతికతను ఎలా వినియోగించుకుంటున్నారనే దాన్ని పరిశీలించేందుకు ఒక ఐటీ టీమ్ను కూడా నైట్ షిఫ్ట్లో కొనసాగించాలని నిర్ణయించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఏ నేరస్తుడికి సంబంధించిన కేసులు కోర్టులో నడుస్తున్నాయి, వారు ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారనేది కూడా తెలుసుకోగలుగుతామన్నారు. ప్రతి ఒక్కరు తమ నైపుణ్యాలను మెరుగు పరుచుకుని సాంకేతిక నిపుణులుగా మారాలని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆకాంక్షించారు. దశల వారీగా తాము నిర్వహించే కార్యక్రమాల్లో ఎస్ఐ నుంచి డీఎస్పీ స్థాయి వరకు అధికారులు తాము ఏం నేర్చుకున్నామో కూడా అందరికీ వివరించాల్సి ఉంటుందన్నారు. సాయంత్రం వేలిముద్రలు, సైబర్ నేరాలకు సంబంధించిన వాటిపై ఆన్లైన్ ద్వారా ఎలా దర్యాప్తు చేయాలనే దానిపై డెమో ఇచ్చారు. డీఎస్పీ నేతృత్వంలో సంబంధిత సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్ఐలకు పెద్ద మానిటర్ ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. స్పెషల్ బ్రాంచి సీఐలు కె.శ్రీనివాసరావు, శ్రీకాంత్బాబు, ఐటీ కోర్ టీమ్ ఎస్ఐ నాయబ్రసూల్ పాల్గొన్నారు. -
మాయమాటలతో.. వారం రోజులపాటు..!!
సాక్షి, బల్లికురవ: ఓ వ్యక్తి పదో తరగతి చదువుతున్న బాలికను మాయమాటలతో లొంగదీసుకుని వారం రోజుల పాటు తన చుట్టూ తిప్పుకుని లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ మేరకు బాధితురాలు గురువారం పోలీసుస్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసింది. ఎస్ఐ పాడి అంకమ్మరావు కథనం ప్రకారం.. కూకట్లపల్లికి చెందిన బాలిక పదో తరగతి చదువుతోంది. గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం శానంపూడికి చెందిన కొత్త ఏసోబుతో నెల క్రితం బాలికకు పరిచయమైంది. తరుచూ ఫోన్లో మాట్లాడుకున్నారు. ఈ నెల ఒకటో తేదీన పాఠశాలకు వెళ్తున్న బాలికను మాయ మాటలతో ఏసోబు బయటకు తీసుకెళ్లాడు చీరాల, నరసరావుపేట, వినుకొండ ప్రాంతాలకు తిప్పి పలుసార్లు లైంగిక దాడికి పాల్పడి చివరకు గ్రామ సమీపంలో వదిలి పెట్టి వెళ్లాడు. బిడ్డ ఏమైందోనని వారం రోజులుగా తల్లిదండ్రులు వాకబు చేశారు. బంధువుల ఇళ్లకు ఫోన్ చేసినా ఫలితం లేదు. చివరకు బాలిక రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. బాలికను వైద్య పరీక్ష కోసం అద్దంకి వైద్యశాలకు పంపినట్లు వివరించారు -
40 ఏళ్ళైనా పూర్తి కాని గుండ్లమోటు డ్యాం నిర్మాణం
-
‘ఉపాధి’లో అక్రమాలు
సాక్షి,రేగులచెలక(ప్రకాశం) : కూలీలకు పనులు కల్పించేందుకు ప్రభుత్వం చేపడుతున్న ఉపాధి హామీ పథకంలో టీడీపీ నాయకులు చేతివాటం చూపిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. మండలంలోని రేగులచెలకలో యంత్రాలతో పనులు చేయించి కూలీలు పనులకు రాకున్నా మస్టర్లు వేసి కూలి నగదు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. ఇందుకు కూలీలు ఒక్కొక్కరు ముందుగా రూ.100 వంతున చెల్లిస్తే ఆరు రోజుల కూలీగా రూ.600 ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. పనికి రాకుండా కూలీ చెల్లించడంతో ఎన్నికలలో ఓటు పరంగా కూడా లబ్ధి పొందొచ్చనేది టీడీపీ నాయకుల ఆలోచన. ఈ ఒప్పందంలో భాగంగా రేషన్ షాపు బినామీ డీలర్ అడియారం తిరుమలకొండయ్య కూలీల నుంచి నగదు వసూలు చేశారు. దాదాపు రూ.25 వేల నగదు కలెక్ట్ చేసినట్లు సమాచారం. ఆపై గ్రామానికి తూర్పు వైపున రాళ్లవాగు సమీపంలో ఉన్న చిట్టోడి కుంటలో యంత్రాల ద్వారా పనులు చేయించారు. పొక్లెయిన్తో నేలనుతవ్వి, ఆపై చదును చేసి మట్టిని కువ్వగా పోసి కూలీలతో పనులు చేయించినట్లు చూపించే ప్రయత్నం చేశారు. యంత్రాలతో తీసుకెళ్లి కుప్పగా పోసిన మట్టి యంత్రాల ద్వారా పని చేయించినందుకు రూ.6 వేలు మాత్రమే ఖర్చు చేశారు. మిగిలిన నగదు టీడీపీ నాయకులు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. దీనిపై కూలీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి అధికార పార్టీ నాయకుల అక్రమాలను నియంత్రించాలని కోరుతున్నారు. ఈ విషయంపై ఏపీఓ జి.రాంబాబును స్థానిక ‘సాక్షి’ విలేకరి వివరణ కోరగా యంత్రాలతో పనులు చేపడితే బిల్లులు చెల్లింపులు నిలిపేస్తామని వివరించారు. -
185 మంది పోలీసులకు స్థాన చలనం
ఒంగోలు: జిల్లాలో పనిచేస్తున్న కానిస్టేబుల్ మొదలు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ వరకు బదిలీల ప్రక్రియను జిల్లా ఎస్పీ బి.సత్యయేసుబాబు శనివారం నిర్వహించారు. ఈ ప్రక్రియ స్థానిక ఎస్పీ కార్యాలయం ఆవరణలోని గెలాక్సీ కాంప్లెక్స్లో జరిగింది. మొత్తం 185 మందిని బదిలీ చేయనున్నట్లు ప్రకటించగా వారిలో 177 మంది మాత్రమే కౌన్సెలింగ్కు హాజరయ్యారు. ఈ బదిలీల ప్రక్రియకు సంబం«ధించి ఎటువంటి ఒత్తిళ్లు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఉద్యోగుల సర్వీసు రికార్డు ప్రామాణికంగా 5 సంవత్సరాల సర్వీసు పూర్తిచేసిన వారిని, స్వస్థలంలో పని చేస్తున్న 11 మంది ఏఎస్సైలు, 61 మంది హెడ్కానిస్టేబుళ్లు, 105 మంది కానిస్టేబుళ్లను కౌన్సెలింగ్కు రావాల్సిందిగా శుక్రవారం వారి మొబైల్ ఫోన్లకు సమాచారం పంపించారు. శనివారం ఉదయం వారిలో 177 మంది మాత్రమే హాజరయ్యారు. నలుగురు హెడ్కానిస్టేబుళ్లు, నలుగురు కానిస్టేబుళ్లు ఆరోగ్య కారణాల రీత్యా దీర్ఘకాలిక సెలవులో ఉండడంతో వారిని వీఆర్కు పంపిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంటే వారు తిరిగి విధుల్లో జాయిన్ అయినప్పుడు వారికి పోస్టింగ్ ఉత్తర్వులు ఇస్తారు. ముందుగానే సూచనలు: కౌన్సెలింగ్కు హాజరైన వారికి ముందుగానే జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు కౌన్సెలింగ్ ప్రక్రియ ఎలా చేపట్టబోతుంది తదితర వివరాలను వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోను నేటివ్ ప్లేస్ను కోరుకోరాదని, అదే విధంగా గతంలో రెండు సంవత్సరాలకు మించి పనిచేసిన స్టేషన్ కోరుకోరాదంటూ పలు సూచనలు చేశారు. అంతే కాకుండా స్టేషన్ ప్రాతిపదికన కాకుండా ప్రాంతం ప్రాతిపదికన బదిలీలు చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో ఒంగోలు , చీరాల ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున సిబ్బంది బదిలీ అయ్యారు. వీరిలో చీరాల సిబ్బంది ఒంగోలుకు, ఒంగోలు సిబ్బంది చీరాలకు బదిలీ కాగా, మిగిలిన వారు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు బదిలీ కాక తప్పలేదు. ఖాళీల ప్రక్రియను స్క్రీన్పై చూపిస్తూ ముందుగా గుర్తించిన ఖాళీలను మాత్రమే కోరుకోవాలని సూచిం చారు. అంతే కాకుండా బదిలీ కోరుకున్న వెంటనే అప్పటికప్పుడు బదిలీ ఉత్తర్వుల కాపీని కూడా సిబ్బందికి కౌన్సెలింగ్ సమయంలోనే అందించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీతోపాటు నాన్ క్యాడర్ ఎస్పీ ఏబీటీఎస్ ఉదయరాణి, డీటీసీ, డీసీఆర్బీ, సీసీఎస్ డీఎస్పీలు, ఎస్బీ, డీటీఆర్బీ, డీటీసీ సీఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఎటువంటి రాజకీయ ఒత్తిడులు లేకుండా కేవలం ఎంచుకున్న ప్రామాణికత ఆధారంగా సిబ్బంది బదిలీల కౌన్సెలింగ్ పట్ల సిబ్బందిలో సంతృప్తి వ్యక్తం అయింది. అయితే స్టేషన్ ప్రామాణికంగా కాకుండా ప్రాంతం ప్రాతిపదికగా తీసుకోవడంతో ఎక్కువ పోలీసుస్టేషన్లు ఉన్న ఒంగోలు, చీరాల తదితర ప్రాంతాల్లోని సిబ్బంది సుదూర ప్రాంతాలకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో వారు కుటుంబంతో సహా సుదూర ప్రాంతంలో పోస్టింగ్ పడడం వారిలో కొంత అసంతృప్తి నెలకొంది. సంవత్సరాల తరబడి రూరల్ ఏరియాలకే పరిమితమవుతూ పట్టణాలకు వద్దామనుకున్న సిబ్బందికి మాత్రం ఈ కౌన్సెలింగ్ వందశాతం వరంగా నిలిచిందని చెప్పవచ్చు. సాధారణంగా ఏ శాఖలో అయినా బదిలీలకు సంబం ధించి ఒకటి రెండు సంవత్సరాలలో రిటైర్ అయ్యేవారు ఉంటే వారికి బదిలీల ప్రక్రియ నుంచి మినహాయింపు ఉండేది. కానీ ఈ బదిలీల్లో మాత్రం రెండు నెలల్లో బదిలీ అయ్యేవారిని కూడా కౌన్సెలింగ్కు ఆహ్వానించారు. -
107వ రోజు పాదయాత్ర డైరీ
-
107వ రోజు పాదయాత్ర డైరీ
08–03–2018, గురువారం వేటపాలెం, ప్రకాశం జిల్లా గంధపు చెట్లను కాపాడతానని గజదొంగ వీరప్పనే ముందుకొచ్చినట్టుంది.. కేంద్ర, రాష్ట్ర తాజా పరిణామాలు.. చంద్రబాబు హైడ్రామా ఆశ్చర్యం కలిగిస్తోంది. వరుస ఘటనలు చూస్తుంటే.. దిగజారుడు రాజకీయానికి చంద్ర బాబు మరోసారి తెరతీశాడనేది సుస్పష్టం. హోదా కోసం వెల్లువెత్తే ప్రజాగ్రహం ఎక్కడ దహించి వేస్తుందోననే భయం ఆయనలో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రత్యేక హోదా ఇవ్వం అని, ప్యాకేజీనే ఇస్తామని కేంద్ర మంత్రి జైట్లీ ఆయనకు ఇప్పుడే దో కొత్తగా చెప్పినట్టు.. దీంతో బీజేపీతో తెగతెంపులకు సిద్ధమైనట్టు టీడీపీ అధినేత తికమక రాజకీయాలను రక్తికట్టిస్తున్నారు. నిజంగా చంద్రబాబు నైజా న్ని చూస్తే.. ఊసరవెల్లి కూడా íసిగ్గుతో తల దించుకుంటుందేమో! అంతు లేని మోసాలకు, అడ్డూ అదుపూ లేని అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన బాబుతో దేశంలో మరెవ్వరూ పోటీపడలేరేమో! ఆయనేంటో, ఆయన డ్రామా లేంటో.. నాలుగేళ్లుగా జనానికి తెలిసిపోయింది. హోదాను ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టిన వంచనను జనం అర్థంచేసుకున్నారు. ప్యాకేజీతో కమీషన్లు బాగా వస్తా యని ప్యాకేజీకి సై అని, ఓటుకు కోట్లు కేసులో ఆడియో, వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు కేంద్రం ముందు ఎలా సాగిలపడిందీ గమనిస్తూనే ఉన్నారు. హోదాపై పూటకో మాట మార్చడాన్ని నిశితంగా పరిశీలి స్తూనే ఉన్నా రు. ఎన్నికలప్పుడు రాష్ట్రానికి హోదానే సంజీవని అంటాడు.. అధికారంలోకి రావడంతోనే నాలుక తిప్పేస్తాడు. హోదా ఏమైనా సంజీవనా? అంటాడు.. లేని ప్యాకేజీని చూపిస్తూ.. ప్యాకేజీనే మేలంటూ గొప్పగా చెబుతా డు. ప్యాకేజీ ప్రకటించిన జైట్లీని పొగడ్తలతో ఆకాశానికెత్తేస్తాడు. జైట్లీకి, వెంకయ్యకు సన్మానాలు, సత్కారాలు చేసి.. ఏదో సాధించానంటూ పోజులిస్తాడు. ఇలా నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి, అవినీతితో కోట్లు కొల్లగొట్టి, హోదా కు సమాధి కట్టేందుకు అనుక్షణం ప్రయత్నించిన చరిత్ర బాబుదే! ఆయనే ఇప్పుడు హోదా కోసం పోరాటం చేస్తానంటే నయవంచన కాక ఇంకేంటి? గజదొంగ వీరప్పనే గంధపు చెట్లను కాపాడతానని ముందుకొచ్చినట్టుగా ఉంది చంద్రబాబు వైఖరి.హోదా విషయంలో వైఎస్సార్ సీపీది మొదటి నుంచీ ఒకే మాట. ఒకే బాట. ప్రత్యేక హోదానే ఆంధ్రావనికి సంజీవని అని భావించింది. నాలుగేళ్లుగా ప్రజల ను జాగృతం చేసింది. ఉద్యమ వేడి రగిల్చింది. హోదా కోసం గల్లీ మొదలు ఢిల్లీ వరకూ పోరాడింది. చంద్రబాబు భూస్థాపితం చేయాలనుకున్న హోదా నినాదానికి ఊపిరిపోసి బతికించింది. దాన్నే జనాయుధంగా మలిచి.. పోరాట బాట పట్టించింది. ఈ ప్రయత్నంలో చంద్రబాబు చేయని కుయుక్తులు లేవు. ఉద్యమించిన ప్రతిసారీ వెన్నుపోటు పొడిచిన చరిత్రే ఆయనది. ఆందోళన చేసిన ప్రతి సందర్భంలోనూ పోలీసు లాఠీలతో అడ్డుకున్న వ్యక్తీ ఆయనే. గేలిచేయడం, ఎగతాళిగా మాట్లాడటం చంద్రబాబుకే చెల్లింది. అయినా వైఎస్సార్ సీపీ మాట తప్పలేదు. మడమ తిప్పలేదు. ఈ పోరాటం నేపథ్యంతోనే తెలుగు ప్రజల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. హోదా సాధించాలంటే వైఎస్సార్ సీపీయే నమ్మకమైన పార్టీ అని జనం విశ్వసిస్తున్నారు. చేయి చేయి కలపి ముందుకొస్తున్నారు. విద్యార్థి, యువజన, మహిళా లోకం ఏకమై కదలడంతో ఉద్యమం తారాస్థాయికి చేరింది. జన నినాదంలో ఎక్కడ కొట్టుకుపోతామోనన్న భయం బాబులో మొదలైంది. అందుకే హఠాత్తుగా కేంద్ర మంత్రులచే నామమా త్రపు రాజీనామాలతో కొత్త నాటకం మొదలు పెట్టాడు. ఇన్నాళ్లూ డ్రామాలాడి నా ఇకపై ప్రతిష్టకు పోకుండా అవిశ్వాసానికి మద్దతిస్తారని, ఆ తర్వాత రాజీనా మాలకు సహకరిస్తారని ఆశిస్తున్నా. అయితే.. అర్థం లేని డ్రామాలతో మోసం చేసే ప్రయత్నాలకు జనాగ్రహమే బుద్ధి చెబుతుందనేది నా విశ్వాసం. ఎవరినై నా, ఎప్పుడైనా మోసం చేయొచ్చు.. ఎల్లకాలం కాదు. విశ్వసనీయత లోపించిన రాజకీయాలను ప్రజలు ఏనాడూ స్వాగతించరని చంద్రబాబుకు అర్థమయ్యే రోజు దగ్గర్లోనే ఉంది. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రత్యేక హోదా తెచ్చేందుకు ఎంతకైనా తెగించి పోరాడాలన్నదే నా ఆశయం. మీడియా సమావేశం ముగించుకుని బయటకొచ్చిన నన్ను అప్పటికే ఎదురు చూస్తున్న అక్క చెల్లెమ్మలు ఆప్యాయంగా పలకరించారు. ‘మహిళా దినోత్సవం’ సందర్భంగా సోదర ప్రేమను పంచారు. కలువ పూలతో స్వాగతం పలికారు. వాళ్లందరి మధ్య మహిళా దినోత్సవం జరుపుకోవడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం అన్నారు.. జాతీయ రాజకీయాల్లో దేశంలోనే అత్యంత సీనియర్ని అన్నారు.. ఎంతోమందిని ప్రధానుల్ని, రాష్ట్రపతుల్ని చేసిన ఘనుడనన్నారు. అంతటి వ్యక్తివి.. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయించుకోలేకపోయారు? 29 సార్లు ఢిల్లీ పర్యటన చేశానంటున్నారు.. మీరు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ మీ పర్యటన ఉద్దేశాన్ని మీడియాకు వెల్లడించారు. ఏ ఒక్కసారైనా ‘హోదా కోసం ఢిల్లీకి వచ్చాను.. ఢిల్లీ పెద్దలతో హోదా విషయం చర్చించాను’ అన్న సందర్భం ఉందా? మీ భాగస్వాములైన బీజేపీ నేతలు.. మీరు ఒక్కసారి కూడా హోదా విషయం ప్రస్తావించలేదంటున్నారు. ఏం సమాధానం చెబుతారు? మీ 29 సార్ల ఢిల్లీ పర్యటన ఏం లాభం ఆశించి చేశారు? -
106వ రోజు పాదయాత్ర డైరీ
-
ఇలాగైతే ఎలా బతకాలన్నా..?
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే గిట్టుబాటు ధర లేక నష్టపోయానన్నా.. అంటూ ఓ పొగాకు రైతు, అప్పు తెచ్చి.. పెట్టుబడి పెట్టి పంట సాగు చేస్తే తుదకు పెట్టుబడి ఖర్చులు కూడా చేతికందలేదని మిర్చి రైతు, శనగ రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నా అని మరో రైతు.. బుధవారం ఇలా దారిపొడవునా అన్నదాతలు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఎదుట వారి కష్టాలు ఏకరువుపెట్టారు. ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో 106వ రోజు ప్రజా సంకల్ప యాత్ర సాగింది. ఇంకొల్లు శివారు నుంచి ప్రారంభమై హనుమోజిపాలెం, జరుబులవారిపాలెం, కొడవలివారిపాలెం, కేశవరప్పాడు, రంగప్పనాయుడుపాలెం క్రాస్రోడ్స్ మీదుగా సంతరావూరు వరకు కొనసాగింది. ఓ వైపు వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యలను జగన్కు విన్నవించగా, మరో వైపు తమ కష్టాలు వినే నాయకుడు వచ్చాడంటూ ఊరూరా జనం స్వాగతం పలికారు. వేలిముద్రలు పడలేదని బియ్యం ఇవ్వలేదు నాలుగు నెలలుగా వేలిముద్రలు పడటం లేదని రేషన్ బియ్యం ఇవ్వకుండా ఆపేశారని నందిగుంటపాలెం గ్రామానికి చెందిన వృద్ధురాలు కందుల సుగుణమ్మ(90) తన బాధను జగన్తో చెప్పుకుంది. తాను ఎన్నో ఏళ్లుగా రేషన్ బియ్యం తీసుకున్నానని, ఇప్పుడే ఈ సాకు చూపుతూ బియ్యం ఆపేయడం దారుణం అని వాపోయింది. చంద్రబాబు పాలన అంతా డాబుసరితోనే ఉంది తప్ప తమ లాంటి వారికి న్యాయం జరగటం లేదంది. అందరి కష్టాలు ఓపికగా విన్న జననేత.. మనందరి ప్రభుత్వం రాగానే నవరత్నాలతో అన్ని వర్గాల వారినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. -
106వ రోజు పాదయాత్ర డైరీ
07–03–2018, బుధవారం సంతరావూరు, ప్రకాశం జిల్లా ఈ పాలకులకు కనీస మానవత్వం లేకపోవడం దౌర్భాగ్యం స్వశక్తితో ఎదిగి అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పతకం సాధించి, ప్రభుత్వ ప్రోత్సాహం కోసం ఎదురుచూసి.. నిరాశ చెందిన గ్రామీణ నిరుపేద కుటుంబానికి చెందిన సురేష్ అనే సోదరుడు కలిశాడు. తాను సాధించిన పతకాలు చూపించాడు. దేశం తరఫున ప్రాతినిధ్యం వహించి 2016లో వియత్నాంలో జరిగిన ఏíషియన్ బీచ్ కబడ్డీ పోటీల్లో పాల్గొన్నాడట. వారి టీం రజత పతకం సాధించిందట. ప్రభుత్వం ఏదైనా సాయం చేస్తుందేమోనని గంపెడాశతో ఎదురు చూశాడట. ఇతర రాష్ట్రాలకు చెందిన తమ టీం సభ్యులకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగావకాశాలు, ఇతర ప్రోత్సాహకాలు ఇచ్చాయట. తనకు మాత్రం నిరాశే మిగిలిందని, తన తండ్రితో పాటు కూలికి వెళ్లడమే శరణ్యమని వాపోయాడు. ఈ ప్రభుత్వానికి గ్రామీణ క్రీడాకారులంటే ఎంత చిన్నచూపు! పబ్లిసిటీకి పనికొచ్చే విషయాల్లో ఉరుకులు పరుగుల మీద స్పందించే బాబుగారు.. ఇలాంటి మట్టిలో మాణిక్యాలను ప్రోత్సహించడం వల్ల నాకేం వస్తుంది.. అని అనుకున్నాడో ఏమో! నందిగుంటపాలెం గ్రామంలో 90 ఏళ్లు పైబడిన కందుల సుగుణమ్మ అనే అవ్వ తన మనవడితో మాట్లాడినట్టు చేతిలో చెయ్యేసి బాధలు చెప్పుకొంది. 40 ఏళ్ల నుంచి చౌక డిపోకు పోయి కోటా బియ్యం తెచ్చుకునేదట. కానీ ఇప్పుడు నాలుగు నెలల నుంచి బియ్యం ఇవ్వడంలేదని బావురుమంది. ఇదేం అన్యాయమయ్యా అని అడిగితే.. నీ వేలిముద్రలు పడటంలేదు పొమ్మంటున్నారని చెప్పింది. పక్క ఊర్లో ఉన్న రేషన్ షాపునకు నెలకు ఐదారు సార్లు తిరిగినా కనికరించడంలేదట. ఈ వయసులో నాకు ఎన్ని తిప్పలయ్యా.. వేలి ముద్రలు లేవని బియ్యం ఆపేస్తే బువ్వ ఎలా తినాలయ్యా.. అంటూ దీనంగా ప్రశ్నించింది. ఆ అవ్వ బాధ చూసి జాలేసింది. ఈ ప్రభుత్వం పేదలు, వృద్ధుల పట్ల నిర్దయగా వ్యవహరిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అరచేతిలో చూపించే చంద్రబాబు సర్కారు.. వేలిముద్రలు పడకపోతే సరిచేయలేదా? నిజంగా ఇచ్చే ఉద్దేశమే ఉంటే వీడియో రికార్డింగ్ ద్వారా ఇవ్వొచ్చు. లేదా భౌతికంగా వేలిముద్రలు తీసుకోవచ్చు. రేషన్ బియ్యానికి కోత పెట్టాలన్న చంద్రబాబు కుయుక్తుల ఫలితమే.. ఆ అవ్వకు ఈ రోజు వచ్చిన కష్టం. ఆదిపూడికి చెందిన దళిత బిడ్డ నాగరాజు ఎమ్మెస్సీ, బీఈడీ పూర్తిచేశాడట. ‘అన్నా.. చదువు పూర్తయి నాలుగేళ్లయింది. ఉద్యోగావకాశాల్లేవు, నిరుద్యోగ భృతీ లేదు. కుటుంబ పోషణ భారమై గత్యంతరం లేక భవన నిర్మాణ పనులకు కూలీగా పోతున్నాను. ఆ కూలి డబ్బులతో అమ్మను, తాతను, అవ్వను పోషించుకుంటున్నాను’అని బాధపడ్డాడు. ‘అన్నా.. వేలకు వేలు అప్పుచేసి ఏపీపీఎస్సీ కోసం కోచింగ్ తీసుకుంటే.. ఆ పరీక్షలే పెట్టడం లేదు. అప్పులే మిగిలాయి. ఈ ప్రభుత్వం ఏపీపీఎస్సీ ఇయర్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. అదంతా ఒట్టి బూటకమన్నా.. అది మాలాంటి నిరుద్యోగులను మోసం చేయడానికే తప్ప.. ఆ క్యాలెండర్లో పేర్కొన్న విధంగా ఒక్క నోటిఫికేషనూ ఇవ్వలేదు. ఒక్క పరీక్షా పెట్టలేదు’అంటూ వాపోయాడు. పోనీ, ఎస్సీ కార్పొరేషన్లో లోన్ తీసుకుని ఏదైనా ఉపాధి చూసుకుందామనుకుంటే.. జన్మభూమి కమిటీలు సైంధవుల్లా అడ్డుపడుతున్నాయట. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ల ఇయర్ క్యాలెండర్ విడుదల చేసి, దానిని అమలు చేయకపోవడం మరింత దారుణం. నిరుద్యోగ యువత ఆ క్యాలెండర్ను నమ్ముకుని నోటిఫికేషన్లు వస్తాయని ఆశగా ఎదురుచూస్తూ, ఆ పరీక్షలకు కోచింగ్లు తీసుకుని ప్రిపేర్ అవుతూ.. సమయానికి పరీక్షలు జరపకపోవడం వల్ల అన్ని రకాలుగా నష్టపోతోంది. నిరుద్యోగ యువతను అన్ని విధాలుగా వంచిస్తున్న ఈ పాలకులకు కనీస మానవత్వం లేకపోవడం దౌర్భాగ్యం. ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. సాంకేతిక పరిజ్ఞానం అనేది ప్రజలకు ఉపయుక్తంగా ఉండాలే తప్ప.. సాంకేతికత సాకుతో పేదలకు చెందాల్సిన సంక్షేమ పథకాల్లో కోత పెట్టడం ఎంతవరకు సమంజసం? -
కత్తితో పోలీస్స్టేషన్కు వెళ్లాడు.. ఆపై..
సాక్షి, ప్రకాశం: వివాహితను కత్తితో పొడిచి చంపిన వ్యక్తి నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన జిల్లాలోని బేస్తవారిపేట మండలం ఖాజీపురం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలివి.. గ్రామానికి చెందిన నాగమణి అనే మహిళను తర్లుపాడు గ్రామానికి చెందిన శ్రీనివాసులు కత్తితో పొడిచి చంపేశాడు. అనంతరం అతను కత్తితో పాటు కంభం పోలీస్ స్టేషన్ వెళ్లి సరండర్ అయ్యాడు. అయితే నిందితుడిని బేస్తవారిపేట పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. మృతదేహం గుర్తించే పక్రియలో భాగంగా అతడ్ని పోలీసులు సంఘటన స్థలానికి తరలించారు. ఈ హత్యకు వారిద్దరి మధ్య అక్రమ సంబంధమేన కారణమని సమాచారం. మృతురాలు నాగమణిని ముగ్గురు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
హోలీ సంబరాల్లో వైఎస్ జగన్
సాక్షి, ఒంగోలు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో జననేత చేపట్టిన పాదయాత్రలో భాగంగా సంతనూతల పాడు నియోజక వర్గంలోని చీమకుర్తిలో ఈ ఉదయం పలువురు విద్యార్థినులు వైఎస్ జగన్ను కలిసి హోలీ వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రంగుల పండుగ ప్రజల జీవితాలను రంగుల మయం చేయాలని, రానున్న రోజుల్లో ప్రజలకు అంతా మంచే జరగాలని ఆయన ఆకాంక్షించారు. కాగా జిల్లాలో పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం వైఎస్ జగన్ చీమకుర్తి నుంచి పాదయాత్రను ప్రారంభించారు. దారిపొడవునా రాజన్న తనయుడికి ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోస్తా ఇస్తూ వైఎస్ జగన్ పాదయాత్రలో ముందుకు సాగుతున్నారు. Wishing everyone a safe and fun-filled Holi. #HappyHoli pic.twitter.com/kTFYNVbLHF — YS Jagan Mohan Reddy (@ysjagan) March 2, 2018 -
101వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర
సాక్షి, ప్రకాశం: వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ప్రకాశం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. శుక్రవారం ఉదయం వైఎస్ జగన్ చీమకుర్తి నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి మంచికలపాడుకు చేరుకుని పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం బండ్లముడి, తొర్రగుడిపాడు క్రాస్, బండ్లముడి కాలనీకి పాదయాత్ర చేరుకుంటుంది. ఇక్కడ వైఎస్ జగన్ భోజన విరామం తీసుకుంటారు. మధ్యాహ్నం 2.45 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభమౌతుంది. అక్కడి నుంచి పల్లమల్లి మీదుగా గడిపత్రివారి పాలెంకు పాదయాత్ర చేరుకుంటుంది. రాత్రి వైఎస్ జగన్ అక్కడే బస చేస్తారు. దారిపొడవునా రాజన్న బిడ్డకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోస్తా ఇస్తూ వైఎస్ జగన్ పాదయాత్రలో ముందుకు సాగుతున్నారు. -
ప్రారంభమైన 96వ రోజు ప్రజాసంకల్పయాత్ర
సాక్షి, ప్రకాశం: వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. శనివారం ఉదయం వైఎస్ జగన్ హాజీస్పురం నుంచి ప్రజాసంకల్పయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి కాంతంవారి పల్లి క్రాస్, చిన్న ఎర్లపాడు క్రాస్, పేరంగుంట కొత్తపల్లి క్రాస్ మీదుగా చింతళ పాలెం చేరుకుంటారు. అనంతరం అక్కడ పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. అక్కడ నుంచి మద్యాహ్నం 12 గంటలకు శంఖవరం చేరుకొని, భోజన విరామం తీసుకుంటారు. మద్యాహ్నం 2. 45 గంటలకు తిరిగి పాదయాత్రను ప్రారంభిస్తారు. వైఎస్ జగన్ మూడు గంటలకు కనిగిరి పట్టణం చేరుకొని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత పాదయాత్ర టకారిపాలెం వరకు కొనసాగుతుంది. అక్కడ ఆయన ప్రజలతో మమేకం కానున్నారు. రాత్రికి వైఎస్ జగన్ ఇక్కడే బస చేస్తారు. రాజన్న బిడ్డకు దారిపొడవునా ప్రజలు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. -
'కేసులు క్లియర్ అయితేనే ఎన్నికలు'
మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రశ్నార్థకం ఒంగోలు కార్పొరేషన్లో విలీన పంచాయతీల కోర్టు కేసులు కందుకూరులో గ్రామాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ తాజాగా కోర్టుకు... డిసెంబర్లోపే ఎన్నికలంటున్న ప్రభుత్వం సాక్షి ప్రతినిధి, ఒంగోలు : జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా చెబుతున్నప్పటికీ జిల్లాలో ఎన్నికలు జరగాల్సిన ఒంగోలు నగరపాలక సంస్థ, కందుకూరు మున్సిపాలిటీలకు సంబంధించి పెండింగ్లో ఉన్న కోర్టు కేసులు అడ్డంకిగా మారుతున్నారుు. ఎన్నికలలోపు కోర్టు కేసులు క్లియర్ అవుతాయా...? క్లియర్ కాకపోతే ఎన్నికల నిర్వహణకు అవకాశం ఉందా.. అన్న విషయం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలకు కోర్టులు అడ్డంకులు చెప్పే అవకాశం తక్కువని, దాదాపు ఎన్నికలు జరగడం ఖాయమని అధికారులు పేర్కొంటున్నారు. నాలుగేళ్లుగా లేని పాలకవర్గం.. ఒంగోలు నగరపాలక సంస్థలో కొప్పోలు, త్రోవగుంట, ముక్తినూతలపాడు, పేర్నమిట్ట, వెంగముక్కపాలెం, చెరువుకొమ్ముపాలెం, పెళ్ళూరు, మంగమూరు, సర్వేరెడ్డిపాలెం, మండువవారిపాలెం పంచాయితీలను విలీనం చేశారు. ఇందులో మంగమూరు, సర్వేరెడ్డిపాలెం, మండువవారిపాలెం పంచాయతీలు విలీనాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకెళ్లాయి. మండువవారిపాలెం పంచాయతీ కోర్టు తీర్పుతో ఏకంగా ఇప్పటికే పంచాయతీ ఎన్నికలను సైతం నిర్వహించుకుంది. ఇప్పటికీ కేసులు కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. ఎప్పటికీ పూర్తవుతాయో తెలియని పరిస్థితి. ఎన్నికల సమయానికి కోర్టు క్లియరెన్స్ వస్తే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అలా జరగని పక్షంలో పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకం. 2012కు ముందే మున్సిపాలిటీగా ఉన్న ఒంగోలు నగరపాలక సంస్థగా మారింది. విలీన పంచాయితీల కోర్టు కేసుల నేపథ్యంలో నగరపాలకకు ఎన్నికలు జరగలేదు. దీంతో అప్పటి నుంచి పాలకవర్గం ఏర్పడలేదు. ఏడు గ్రామాల ప్రజల పోరాటం.. ఇక కందుకూరు మున్సిపాలిటీకి సైతం ఎన్నికలు జరగాల్సి ఉంది. 2012 నాటికి మున్సిపల్ పాలకవర్గం పదవీ కాలం ముగిసింది. అప్పటికే కందుకూరు శివారుల్లోని ఆనందపురం, షామీర్పాలెం, దివివారిపాలెం, దనిగుంట, గల్లావారిపాలెం తదితర ఏడు గ్రామాలను కందుకూరు మున్సిపాలిటీలో విలీనం చేశారు. పై గ్రామాలు కందుకూరు పట్టణానికి 5 కి.మీ. పైబడి ఉండటంతో పరిపాలనకు ఇబ్బందులు తలెత్తుతాయని మున్సిపల్ అధికారులు సైతం ఏడు గ్రామాలు విలీనాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకెళ్లాయి. 2010 నుంచి కోర్టు కేసులు నడుస్తున్నాయి. దీని వెనుక అప్పట్లో మున్సిపల్ శాఖ మంత్రి మహీధరరెడ్డి ప్రోద్బలమే కారణమన్న ప్రచారం ఉంది. కోర్టు కేసులతో కందుకూరు మున్సిపాలిటీకి ఎన్నికలు జరగలేదు. ఆది నుంచి ఏడు గ్రామాలను మున్సిపాలిటీలో కలపాలని ఆయా గ్రామాల ప్రజలు పోరాడుతూనే ఉన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తూనే విలీనాన్ని వ్యతిరేకిస్తూ గతంలో కోర్టుకె ళ్లిన మున్సిపల్ అధికారులు కేసును ఉపసంహరించుకున్నారు. దీంతో ఏడు గ్రామాల విలీనానికి ఆమోదం లభించింది. మున్సిపాలిటీలో విలీనం కోసం పంచాయతీ తీర్మానం సరిపోతుంది.పైగా అధికార పార్టీ మద్ధతుదారులు అధికంగా ఉండటంతో ఏడు గ్రామాల విలీనానికి ఎటువంటి అడ్డంకులు ఉండే పరిస్థితి లేదు. దీంతో కందుకూరు మున్సిపాలిటీకి ఎన్నికలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. మహీధరరెడ్డి మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు మున్సిపాలిటీ సరిహద్దు నుంచి 3 కి.మీ. పరిధిలో ఉన్న గ్రామాలను మాత్రమే విలీనం చేయాలన్న జీవోను తెచ్చారు. ఈ జీవోను అడ్డుపెట్టి ఇటీవల కందుకూరు మున్సిపాలిటీకి చెందిన కొందరు ఏడు గ్రామాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ తిరిగి కోర్టుకె ళ్లినట్లు సమాచారం. ఏది ఏమైనా ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో కోర్టు తీర్పు సైతం ఎన్నికలకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉందని మున్సిపల్ అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అటు ఒంగోలు నగరపాలక సంస్థకు, కందుకూరు మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగే అవకాశం ఎక్కువేనని తెలుస్తోంది. -
లారీ, బైక్ ఢీ : ఒకరి మృతి
టంగుటూరు: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం నాయుడుపాలెం బైపాస్ రోడ్డు వద్ద శనివారం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ.. ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.