Rajasthan Assembly Elections
-
ఇండిపెండెంట్లే కీలకం.. రాజస్థాన్ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
జైపూర్: రాజస్థాన్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోటీ ఉందని రాజస్థాన్ మంత్రి, కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతాప్ సింగ్ ఖచరియావాస్ అన్నారు. 200 మంది సభ్యుల అసెంబ్లీలో రెండు పార్టీలకు 90-100 సీట్లు వస్తే స్వతంత్ర అభ్యర్థులు కీలక పాత్ర పోషిస్తారని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఖచరియావాస్ తాజాగా ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ ‘ఇరు పార్టీలు 90-100 సీట్లు సాధిస్తే, బీజేపీ, కాంగ్రెస్ రెండూ స్వతంత్ర అభ్యర్థులు, ఇతర పార్టీలను గౌరవించాల్సిందే. అప్పుడు ఎవరికి మద్దతు ఇవ్వాలో వారు నిర్ణయిస్తారు. ప్రస్తుతం రాజస్థాన్లో నెక్ టు నెక్ ఫైట్ జరుగుతోందని నేను భావిస్తున్నాను’ అన్నారు. రాజస్థాన్లో తమకు 125 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని బీజేపీ చేసిన వాదనలను పలు ఎగ్జిట్ పోల్స్ తోసిపుచ్చాయని ప్రతాప్ సింగ్ గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ 100 పైగా సీట్లు సాధిస్తుందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చాలా ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నట్లు తెలిపారు. మధ్యప్రదేశ్లో బీజేపీ ఓటమిని తాము ఊహించామని, కానీ ఎగ్జిట్ పోల్స్ ఆ పార్టీ ఆధిక్యంలో ఉన్నట్లు చూపిస్తున్నాయన్నారు. రాజస్థాన్లో గట్టి పోటీ ఉంటుందని చాలా ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. మూడు ఎగ్జిట్ పోల్లు బీజేపీ స్పష్టమైన విజయాన్ని సాధిస్తుందని అంచనా వేయగా, మరో రెండు రాష్ట్రంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ముందంజలో ఉందని పేర్కొన్నాయి. డిసెంబరు 3న ఫలితాలు వెలువడినప్పుడు ప్రభుత్వ ఏర్పాటులో చిన్న పార్టీలు, స్వతంత్రులతో సహా "ఇతరులు" కీలక పాత్ర పోషిస్తారని ఎగ్జిట్ పోల్ అంచనాలు స్పష్టం చేశాయి. 200 స్థానాలున్న రాజస్థాన్ అసెంబ్లీకి 199 స్థానాలకు నవంబర్ 25న ఎన్నికలు జరిగాయి. -
కాంగ్రెస్ –2, బీజేపీ–2, హంగ్–1!
న్యూఢిల్లీ: నెలన్నరకు పైగా సాగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోరు ముగింపునకు వచి్చంది. గురువారంతో అన్ని రాష్ట్రాల్లోనూ పోలింగ్ ప్రక్రియ ముగిసింది. మిజోరంలో నవంబర్ 7న, ఛత్తీస్గఢ్లో నవంబర్ 7, 19 తేదీల్లో రెండు దశల్లో, మధ్యప్రదేశ్లో 19న, రాజస్థాన్లో 25న పోలింగ్ జరగడం తెలిసిందే. తెలంగాణలో కూడా గురువారం ఒకే దశలో పోలింగ్ ముగిసింది. ఐదు రాష్ట్రాల్లోనూ డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెలువడనున్నాయి. తెలంగాణలో పోలింగ్ ముగియగానే ఐదు రాష్టాల్లోనూ ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ను కాంగ్రెస్ ఓడించనుందని దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. ఛత్తీస్గఢ్లో అధికారం నిలబెట్టుకుంటుందని పలు పోల్స్ పేర్కొన్నాయి. ఇక కాంగ్రెస్ పాలిత రాజస్థాన్లో బీజేపీ గెలుస్తుందని చాలావరకు తేల్చాయి. మధ్యప్రదేశ్ను కూడా బీజేపీ నిలబెట్టుకోవచ్చని, మిజోరంలో హంగ్ రావచ్చని తెలిపాయి... మధ్యప్రదేశ్... బీజేపీకే మొగ్గు! మధ్యప్రదేశ్లో బీజేపీ ఘనవిజయం సాధించనుందని ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా, టుడేస్ చాణక్య, ఇండియా టీవీ–సీఎన్ఎక్స్ వంటి పలు సంస్థ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ సీట్లు 230. మెజారిటీ మార్కు 116 కాగా బీజేపీకి ఏకంగా 140 నుంచి 162 సీట్లు వస్తాయని ఇండియాటుడే––యాక్సిస్ మై ఇండియా పేర్కొంది. కాంగ్రెస్ 68 నుంచి 90 సీట్లకు పరిమితం కానుందని చెప్పింది. టుడేస్ చాణక్య కూడా బీజేపీకి 151, కాంగ్రెస్కు 74 స్థానాలిచ్చింది. ఇండియా టీవీ–సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్స్లోనూ బీజేపీకి 140 నుంచి 159 సీట్లు రాగా కాంగ్రెస్ 70 నుంచి 89 సీట్లకు పరిమితమైంది. రిపబ్లిక్ టీవీ కూడా బీజేపీకి 118 నుంచి 130 సీట్లిచ్చింది. కాంగ్రెస్కు 97 నుంచి 107 రావచ్చని పేర్కొంది. టైమ్స్ నౌ–ఈటీజీ మాత్రం కాంగ్రెస్కు 109–125 సీట్లివ్వగా బీజేపీకి 105–117 వస్తాయని పేర్కొంది. ఏబీపీ–సీవోటర్ కూడా కాంగ్రెస్కు 113 నుంచి 137 స్థానాలొస్తాయని, బీజేపీ 88 నుంచి 112కు పరిమితమవుతుందని చెప్పింది. జన్ కీ బాత్ మాత్రం రెండు పారీ్టలూ 100 నుంచి 125 సీట్ల మధ్య గెలుచుకుంటాయని జోస్యం చెప్పింది. రాజస్థాన్లో కమల వికాసమే రాజస్థాన్లో బీజేపీ విజయం ఖాయమని చాలా ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. మూడు మాత్రం కాంగ్రెస్ బహుశా రాజస్థాన్లో నెగ్గే అవకాశముందని అంచనా వేశాయి. రాష్ట్రంలో మొత్తం 200 అసెంబ్లీ సీట్లు కాగా మెజారిటీకి 101 స్థానాలు రావాలి. టైమ్స్ నౌ సర్వేలో బీజేపీకి 108 నుంచి 128, కాంగ్రెస్కు 56 నుంచి 72 సీట్లొచ్చాయి. ఇక బీజేపీ 105 నుంచి 125 స్థానాలు సాధిస్తుందని రిపబ్లిక్ టీవీ పేర్కొంది. కాంగ్రెస్ 69 నుంచి 81కి పరిమితమవుతుందని చెప్పింది. ఏబీపీ–సీవోటర్ బీజేపీకి 94–114, కాంగ్రెస్కు 71–91 సీట్లిచ్చింది. జన్ కీ బాత్ సర్వే కూడా బీజేపీ 100 నుంచి 122 సీట్లు గెలుస్తుందని, కాంగ్రెస్ 62 నుంచి 85కు పరిమితమవుతుందని పేర్కొంది. టుడేస్ చాణక్య బీజేపీకి 101, కాంగ్రెస్ 89 సీట్లిచి్చంది. ఇండియాటుడే––యాక్సిస్ మై ఇండియా బీజేపీకి 86 నుంచి 106, కాంగ్రెస్కు80 నుంచి 100 సీట్లొస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్ 94 నుంచి 104 సీట్లతో అధికారం నిలుపుకుంటుందని, బీజేపీకి 80 నుంచి 90 స్థానాలొస్తాయని ఇండియా టీవీ–సీఎన్ఎక్స్ పేర్కొంది. తెలంగాణలో కాంగ్రెస్ పాగా తెలంగాణలో బీఆర్ఎస్ పాలనకు తెర దించి తొలిసారిగా కాంగ్రెస్ అధికారంలోకి రానుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. 119 స్థానాల అసెంబ్లీలో మెజారిటీకి 60 స్థానాలు కావాల్సి ఉండగా కాంగ్రెస్కు 60 నుంచి 70 దాకా వస్తాయని టైమ్స్ నౌ–ఈటీజీ అంచనా వేసింది. బీఆర్ఎస్ 37 నుంచి 45 సీట్లకు పరిమితమవుతుందని చెప్పింది. బీజేపీకి 6 నుంచి 8, మజ్లిస్కు5 నుంచి 7 రావచ్చని పేర్కొంది. రిపబ్లిక్ టీవీ కూడా కాంగ్రెస్కు 58 నుంకచి 68 సీట్లిచి్చంది. బీఆర్ఎస్కు 46 56, బీజేపీకి 4 నుంచి 9 వస్తాయని, ఇతరులు 5 నుంచి 9 సీట్లు నెగ్గుతారని పేర్కొంది. ఇండియా టీవీ–సీఎన్ఎక్స్ అయితే కాంగ్రెస్కు ఏకంగా 63 నుంచి 79 సీట్లిచి్చంది. బీఆర్ఎస్ 31 నుంచి 47తో సరిపెట్టుకుంటుందని చెప్పింది. బీజేపీకి 2 నుంచి 4, మజ్లిస్కు5 నుంచి 7 వస్తాయని తెలిపింది. టుడేస్ చాణక్య కూడా కాంగ్రెస్కు 71 సీట్లు, బీఆర్ఎస్కు 33, బీజేపీకి 7, ఇతరులకు 8 స్థానాలిచి్చంది. కాంగ్రెస్ 49 నుంచి 65 సీట్లొస్తాయని ఏబీపీ–సీవోటర్ సర్వే పేర్కొంది. బీఆర్ఎస్కు 38 నుంచి 54, బీజేపీకి 5 నుంచి 13 వస్తాయని, ఇతరులు 5 నుంచి 9 సీట్లు నెగ్గుతారని చెప్పుకొచ్చింది. జన్ కీ బాత్ కూడా కాంగ్రెస్కు 48 నుంచి 64, బీఆర్ఎస్కు 40 నుంచి 55 సీట్లిచి్చంది. బీజేపీ 7 నుంచి 13, మజ్లిస్ 4 నుంచి 7 సీట్లు నెగ్గుతాయని చెప్పింది. మిజోరంలో హంగ్ ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) ఈసారి ఎదురీదుతోందని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఎంఎన్ఎఫ్కు ఈసారి జోరాం పీపుల్స్ మూవ్మెంట్ (జెడ్పీఎం) గట్టి పోటీ ఇచి్చనట్టు పేర్కొన్నాయి. బహుశా హంగ్ అసెంబ్లీ ఏర్పడవచ్చని జోస్యం చెప్పాయి. కాంగ్రెస్ మూడో స్థానానికే పరిమితమవుతుందని, బీజేపీకి ఒకట్రెండు స్థానాలు దాటకపోవచ్చని తెలిపాయి. మొత్తం 40 స్థానాలకు గాను రిపబ్లిక్ టీవీ మాత్రం ఎంఎన్ఎఫ్కు 17 నుంచి 22 దాకా ఇచ్చింది. ఏబీపీ సీవోటర్ కూడా దానికి 15 నుంచి 21 స్థానాలు రావచ్చని పేర్కొంది. మిగతా సర్వేలన్నీ అది మెజారిటీకి కొద్ది దూరంలోనే నిలిచిపోతుందని తేల్చాయి. జెడ్పీఎం ఏకంగా 28 నుంచి 35 సీట్లతో ఘనవిజయం సాధిస్తుందని ఇండియాటుడే––యాక్సిస్ మై ఇండియా పేర్కొనడం విశేషం! ఎంఎన్ఎఫ్ కేవలం 3 నుంచి 7 సీట్లకు, కాంగ్రెస్ 2 నుంచి 4 స్థానాలకు పరిమితమవుతాయని అది తేల్చింది. మిగతా సర్వేలన్నీ ఎంఎన్ఎఫ్కు 14 నుంచి 18 సీట్లు, జెడ్పీఎంకు 10 నుంచి 16 సీట్ల చొప్పున ఇచ్చాయి. ఛత్తీస్గఢ్ ‘హస్త’గతం! ఛత్తీస్గఢ్లో భూపేశ్ బఘెల్ సర్కారు పనితీరుకు ప్రజలు మరోసారి పట్టం కడుతున్నట్టు పలు ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్కు 40 50 దాకా వస్తాయని ఇండియాటుడే–యాక్సిస్ మై ఇండియా పేర్కొంది. బీజేపీ 36 నుంచి 46 దాకా గెలుచుకుంటుందని అంచనా వేసింది. టైమ్స్ నౌ–ఈటీజీ కాంగ్రెస్కు 48 నుంచి 56, బీజేపీకి 32 నుంచి 40 సీట్లిచ్చింది. కాంగ్రెస్కు 57, బీజేపీకి 33 సీట్లొస్తాయని టుడేస్ చాణక్య పేర్కొంది. ఇండియా టీవీ–సీఎన్ఎక్స్ సర్వే కాంగ్రెస్కు 46–56, బీజేపీకి 30–40 సీట్లిచి్చంది. రిపబ్లిక్ టీవీ కూడా కాంగ్రెస్44 నుంచి 52 సీట్లు గెలుస్తుందని, బీజేపీ 35 నుంచి 42 సీట్లకు పరిమితమవుతుందని అభిప్రాయపడింది. ఇక రెండు పారీ్టలూ హోరాహోరీగా తలపడ్డట్టు ఏబీపీ–సీవోటర్, జన్ కీ బాత్ తేల్చాయి. కాంగ్రెస్కు 41 నుంచి 53, బీజేపీకి 36 నుంచి 48 సీట్లు రావచ్చని ఏబీపీ చెప్పింది. ఇక జన్ కీ బాత్ సర్వే బీజేపీకి 34 నుంచి 45, కాంగ్రెస్కు 42 నుంచి 53 స్థానాలిచ్చింది. -
‘అది 440 వోల్ట్ల కరెంట్.. కాంగ్రెస్కే షాకిస్తుంది’
జైపూర్: రాజస్థాన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 135 సీట్లు గెలుచుకుంటుందని, రాష్ట్రంలో ఇది అతిపెద్ద విజయాలలో ఒకటిగా ఉంటుందని బీజేపీ నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు రాజేంద్ర సింగ్ రాథోడ్ విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్కు అనుకూలంగా "అండర్ కరెంట్" (లోలోపల అనుకూలత) ఉందని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలపై రాజేంద్ర సింగ్ రాథోడ్ వ్యంగ్యంగా స్పందించారు. "అండర్ కరెంట్ ఉందని గెహ్లాట్ సాబ్ చెప్పింది నిజమే. అది 440 వోల్ట్లు. ఆయన చెబుతున్న అండర్ కరెంట్ కాంగ్రెస్కే షాక్ ఇస్తుంది" అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రజలను ఆకట్టుకోలేదని, రాష్ట్రంలో ఆ పార్టీని గద్దె దించేందుకే ప్రజలు ఓట్లు వేశారని అన్నారు. ‘కాంగ్రెస్ అవమానకరమైన పరాజయం దిశగా అడుగులు వేస్తోంది. గ్రౌండ్ రిపోర్ట్ల ప్రకారం.. ఈ ఎన్నికల్లో బీజేపీ 135 సీట్లకు పైగా సాధిస్తుంది. ఇది అతిపెద్ద ఎన్నికల విజయాలలో ఒకటి’ అని రాథోడ్ పేర్కొన్నారు. నవంబర్ 25న రాజస్థాన్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 74 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలోని 200 స్థానాలకు గాను 199 స్థానాల్లో పోలింగ్ జరిగింది. మరో నాలుగు రాష్ట్రాలతో పాటు రాజస్థాన్ ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది. -
రాజస్థాన్ ఎన్నికల ప్రధాన అధికారికి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక
జైపూర్: రాజస్థాన్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ప్రవీణ్ గుప్తా అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఆయన జైపూర్లోని సవాయ్ మాన్ సింగ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ ప్రతినిధి వెల్లడించారు. అనారోగ్యానికి గురైన ప్రవీణ్ గుప్తా ఆస్పత్రిలో చేరి హెల్త్ చెకప్, ఈసీజీ పరీక్షలు చేయించుకున్నారు. పూర్తి వైద్య పరీక్షల కోసం ఆయన్ను ఐసీయూకి తరలించినట్లు అని ఆసుపత్రి వైద్యుడు తెలిపారు. రాజస్థాన్ కేడర్కు చెందిన 1995 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ప్రవీణ్ గుప్తా రాష్ట్ర ఛీప్ ఎలక్టోరల్ ఆఫీసర్గా అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి కృషి చేశారు. రాజస్థాన్లోని 200 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 199 స్థానాల్లో నవంబర్ 25న ఎన్నికలు జరిగాయి. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ తరుణంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అస్వస్థకు గురవడం అధికార యంత్రాంగానికి ఆందోళన కలిగిస్తోంది. -
రిజర్వ్డ్ స్థానాల్లో గెలిస్తేనే.. ‘రాజ’స్థానం
జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు శనివారం పూర్తయ్యాయి. రాష్ట్రంలోని 200 నియోజకవర్గాలకు గానూ 199 స్థానాలకు పోలింగ్ జరిగింది. ప్రజలు తమ తీర్పును ఓట్ల రూపంలో ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఏ పార్టీకీ రెండోసారి అధికారం ఇచ్చే అలవాటు లేని రాజస్థానీయులు ఈసారి ఏం చేయబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. రాజస్థాన్లో 1998 నుంచి ఏ పార్టీ కూడా రెండోసారి అధికారంలోకి రాలేదు. రాష్ట్రంలోని 200 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 30 శాతం రిజర్వ్డ్ సీట్లు ఉన్నాయి. మొత్తం 59 రిజర్వ్డ్ నియోజకవర్గాలలో 34 ఎస్సీ స్థానాలు కాగా, 25 ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ స్థానాలు గెలుచుకున్నపార్టీనే అధికార పీఠం అధిరోహిస్తోంది. గత మూడు అసెంబ్లీ ఎన్నికలలో రెండింటిలో అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ మధ్య ఉన్న గెలుపు తేడా మొత్తం ఈ రిజర్వ్డ్ సీట్ల సంఖ్యలో సగం కూడా లేదు. 2008 డీలిమిటేషన్ తర్వాత లోక్సభ ఎన్నికలతో సహా రాజస్థాన్లో ఆరు ఎన్నికలు జరిగాయి. ఈ ఆరు ఎన్నికలలో అత్యధిక రిజర్వు స్థానాలను గెలుపొందిన పార్టీనే ఎన్నికల్లో విజయం సాధించినట్లు చారిత్రక గణాంకాలు చెబుతున్నాయి. బీజేపీదే ఆధిక్యం రాజస్థాన్లో 2013 నుంచి లోక్సభ, అసెంబ్లీ సహా మూడు ఎన్నికల్లో బీజేపీ అత్యధిక రిజర్వ్డ్ స్థానాల్లో ఆధిక్యత కనబర్చింది. కాంగ్రెస్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే ఎక్కువ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో గెలుపొందింది. 2013 అసెంబ్లీ ఎన్నికలు, 2014 లోక్సభ ఎన్నికల్లో అయితే ఒక్క ఎస్సీ రిజర్వ్డ్ సీటును కూడా కాంగ్రెస్ దక్కించుకోలేకపోయింది. మొత్తం 34 ఎస్సీ స్థానాల్లో బీజేపీ 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 32 స్థానాలు గెలుచుకోగా, 2014 లోక్సభ ఎన్నికల్లో 33 స్థానాల్లో అత్యధిక ఓట్లు సాధించింది. ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల్లో కూడా ఆ పార్టీ ఆధిక్యంలో ఉంది. ఇక 2019 లోక్సభ ఎన్నికల్లో కూడా 34 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో 32, 25 ఎస్టీ సీట్లలో 19 చోట్ల బీజేపీదే ఆధిపత్యం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం ఒక ఎస్సీ రిజర్వ్డ్ స్థానంలో, ఐదు ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల్లో అగ్రస్థానంలో నిలిచింది. 2018లో కాంగ్రెస్ జోరు రాజస్థాన్లో జరిగిన గత నాలుగు ఎన్నికలలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ దూసుకెళ్లింది. ఈ ఎన్నికల్లో ఎక్కువ రిజర్వ్డ్ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోగలిగినప్పటికీ, దాని విజయం ఇంతకుముందు మూడు ఎన్నికలలో బీజేపీ సాధించినంత ప్రబలంగా లేదు. 2018లో కాంగ్రెస్ 19 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు, 12 ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలను గెలుచుకుంది. బీజేపీకి 12 ఎస్సీ స్థానాలు, 9 ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు దక్కాయి. అయితే ఈ ఆధిక్యాన్ని కాంగ్రెస్ 2019 లోక్సభ ఎన్నికల్లో నిలబెట్టుకోలేకపోయింది. ప్రస్తుతం జరిగిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి రిజర్వ్డ్ సీట్లలో ఆధిక్యం దక్కుతుందన్నది డిసెంబర్ 3న జరిగే ఓట్ల లెక్కింపులో తెలియనుంది. -
వారిని ప్రజలు పట్టించుకోలేదు.. సీఎం గెహ్లాట్ ధీమా!
జైపూర్: రాజస్థాన్లో శనివారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు స్పష్టమైన మెజారిటీ వస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విశ్వాసం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. బీజేపీ నేతలు తమ ప్రచారంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, మతం కార్డు వాడేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. అయితే రాష్ట్ర ప్రజలు వాటిని పట్టించుకోలేదని పేర్కొన్నారు. ‘ప్రచారంలో వారు ఎలాంటి రెచ్చగొట్టే భాష ఉపయోగించారో అందరూ చూశారు. మతం కార్డు వాడేందుకు ప్రయత్నించారు. కానీ ప్రజలు వారిని తిరస్కరించారు. రాజస్థాన్లో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీని పొందబోతోంది’ అని గెహ్లాట్ అన్నారు. ‘ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఇక్కడికి వచ్చి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. కానీ రాజస్థాన్ ప్రజలు వాటిని పట్టించుకోలేదు’ అన్నారాయన. రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నారని, తమపై ఎటువంటి వ్యతిరేకత లేదని అశోక్ గెహ్లాట్ పేర్కొన్నారు. రాజస్థాన్లోని 200 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ 199 స్థానాలకు శనివారం పోలింగ్ జరిగింది. ప్రజలు తమ తీర్పును ఓట్ల రూపంలో ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు అనంతరం పార్టీ భవితవ్యం తేలనుంది. -
ఆ ఆరు జిల్లాల్లో అధిక ఓటింగ్.. పార్టీల్లో దడ!
జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు శనివారం ముగిశాయి. మొత్తం 200 స్థానాలకు గానూ 199 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 74.96 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఇది గత 2018 అసెంబ్లీ ఎన్నికల కంటే 1 శాతం ఎక్కువ. ఇక రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో భారీగా ఓటింగ్ నమోదైంది. దీంతో ప్రధాన పార్టీల్లో దడ మొదలైంది. కౌంటింగ్ రోజున ఫలితం గురించి భయం నెలకొంది. 80 శాతానికి పైగా ఓటింగ్ రాజస్థాన్లోని ఆరు జిల్లాల్లో శనివారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 80 శాతానికి పైగా ఓటింగ్ నమోదైందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని బన్స్వారా, జైసల్మేర్, చిత్తోర్గఢ్, హనుమాన్గఢ్, ఝలావర్, ప్రతాప్గఢ్ జిల్లాల్లో 80 శాతానికి పైగా ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. అత్యధికంగా 83 శాతం ఓటింగ్తో బన్స్వారా జిల్లా టాప్లో ఉండగా 80.41 శాతంతో చిత్తోర్గఢ్, 82.52 శాతంతో హనుమాన్గఢ్, 82.32 శాతంతో జైసల్మేర్ జిల్లాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అసెంబ్లీ స్థానాలవారీగా.. రాష్ట్రంలోనే అత్యధికంగా 88.13 శాతం ఓటింగ్తో కుషాల్ఘర్ అసెంబ్లీ నియోజకవర్గం అగ్రస్థానంలో ఉంది. 87.79 శాతంతో పోఖ్రాన్ అసెంబ్లీ సెగ్మెంట్ రెండో స్థానంలో ఉండగా, 86.11 శాతంతో తిజారా, 85.58 శాతంతో నింబహెరా, 85.35 శాతంతో ఘటోల్, 84.22 శాతంతో బారీ, 84.12 శాతంతో మనోహర్తన నియోజకవర్గాలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. -
అలిగిన గ్రామీణం.. ఎన్నికల బహిష్కరణ మంత్రం
Rajasthan elections 2023: ప్రస్తుతం దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో మిజోరాం, ఛత్తీస్గడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో ఇప్పటికే ఎన్నికలు పూర్తవ్వగా తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. ఐదేళ్లకు ఒక సారి వచ్చే ఎన్నికల ద్వారా తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కును రాజ్యాంగం ప్రసాదించింది. అయితే ప్రభుత్వాల ఉదాసీనత, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో విసుగు చెందిన పలు గ్రామాలు ఏకంగా ఎన్నికలనే బహిష్కరిస్తున్నాయి. శనివారం జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలను ఆ రాష్ట్రంలోని అనేక గ్రామాలు బహిష్కరించాయి. తాగునీటి సమస్యపై.. హనుమాన్గఢ్ జిల్లాలోని టిబ్బి తహసీల్ పరిధిలోని దౌలత్పురాలో తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు జిల్లా అదనపు కలెక్టర్ కపిల్ యాదవ్కు మెమోరాండం సమర్పించారు. గ్రౌండ్ లెవల్లో దెబ్బతిన్న వాటర్ ట్యాంక్, ఫిల్టర్లను పునర్నిర్మించకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయబోమని మెమోరాండంలో పేర్కొన్నారు. అలాగే శ్రీగంగానగర్ జిల్లాలోని సూరత్గఢ్ తహసీల్కు చెందిన తుక్రానా పంచాయతీ ఫరీద్సర్ గ్రామ ప్రజలు కూడా తాగునీటి సమస్యపై నిరసనగా ఓటింగ్ను బహిష్కరించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ విషయాన్ని వారు సూరత్గఢ్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ సందీప్ కుమార్కు మెమోరాండం ద్వారా తెలియజేశారు. ప్రజా ప్రతినిధులపై ఆగ్రహం రాష్ట్రంలో చాలా చోట్ల ప్రజా ప్రతినిధులపై ఆగ్రహంతో కూడిన వాతావరణం కనిపిస్తోంది. కొన్ని నెలల క్రితం భిల్వారా జిల్లా నుంచి తొలగించి షాపురా జిల్లాలో చేర్చిన ఎనిమిది గ్రామ పంచాయతీల ప్రజలు ఓటింగ్ను బహిష్కరించాలని నిర్ణయించారు. భిల్వారాను విభజించి షాపురా జిల్లాను ఏర్పాటు చేసినప్పుడు మండల్గర్ సబ్డివిజన్లోని 16 పంచాయతీలు షాపురా జిల్లాలో చేర్చారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనల తరువాత, ప్రభుత్వం వీటిలో ఎనిమిది పంచాయతీలను తిరిగి భిల్వారాలో చేర్చింది. మిగిలిన ఎనిమిది షాపురాలోనే ఉన్నాయి. దీంతో ఆ గ్రామాల ఓటింగ్ను బహిష్కరించాలని నిర్ణయించి రాజకీయ పార్టీల నేతలను గ్రామాల్లోకి రానివ్వకుండా పోస్టర్లు అంటించి నిరసనలు చేపట్టారు. ఏకంగా 50 గ్రామాలు ఇక జైసల్మేర్ జిల్లాలోని సోను గ్రామంలో గత రెండు నెలలుగా సమ్మె చేస్తున్న ట్రక్కు డ్రైవర్లకు సంఘీభావంగా 50 గ్రామాలు ఎన్నికల బహిష్కరణను ప్రకటించాయి. సోను గనుల నుంచి సున్నపురాయిని రవాణా చేయడానికి ఈ ప్రాంతంలో దాదాపు 400 ట్రక్కులు ఉన్నాయి. ట్రక్కు డ్రైవర్లు సరుకు రవాణా ఛార్జీలను టన్నుకు రూ.3 పెంచాలని కోరుతున్నారు. అయితే రాజస్థాన్ స్టేట్ మైన్స్ అండ్ మినరల్స్ లిమిటెడ్ కాంట్రాక్టర్ డిమాండ్ను అంగీకరించడానికి సిద్ధంగా లేరు. ఇప్పుడు సమీపంలోని 50 గ్రామాల ప్రజలు లారీ డ్రైవర్లకు మద్దతుగా నిలిచారు. సికార్ జిల్లాలోని నీమ్ కా థానా తహసీల్కు చెందిన లాడి కా బస్ గ్రామస్థులు తమ గ్రామ పంచాయతీని అజిత్గఢ్ పంచాయతీ సమితి నుంచి తొలగించి పటాన్ పంచాయతీ సమితిలో తిరిగి చేర్చాలని కోరుతూ ఎన్నికల బహిష్కరణ ప్రకటించారు. ఇప్పటి వరకు ఈ డిమాండ్ను లేవనెత్తుతూ గ్రామస్తులు ఆరుసార్లు ఎన్నికలను బహిష్కరించారు. రోడ్డు సమస్య.. ఝలావర్ జిల్లాలోని ఓద్పూర్ గ్రామస్థులు రాష్ట్ర రహదారికి సరైన రహదారిని అనుసంధానం చేయాలని డిమాండ్ చేస్తూ ఓటింగ్ను బహిష్కరించాలని నిర్ణయించారు. అదేవిధంగా కోటా జిల్లాలోని సంగోడ్ తహసీల్లోని లాడ్పురా రైతులు తమను చంబల్ నది నుంచి నీటిని వాడుకునేందుకు అనుమతించకపోవడంతో ఎన్నికలను బహిష్కరించారు. టోంక్ జిల్లాలోని డియోలి గ్రామస్తులు తమ రోడ్డును బాగు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు ప్రధాన మార్గాల్లో కాంక్రీట్ రోడ్లు నిర్మించకపోతే బహిష్కరిస్తామని టోంక్ జిల్లాలోని సీసోలా ప్రజలు హెచ్చరించారు. అదే విధంగా ధోల్పూర్ జిల్లా బసేరి అసెంబ్లీ నియోజకవర్గం చంద్రావళి గ్రామ ప్రజలు దశాబ్ద కాలంగా తమ గ్రామ రహదారికి మరమ్మతులు చేపట్టలేదని బహిష్కరించాలని నిర్ణయించారు. ఇక భిల్వారాలోని 43వ వార్డు ప్రజలు ఎన్నికల బహిష్కరణను ప్రకటించడమే కాకుండా రాజకీయ నేతలను తమ వార్డులోకి రాకుండా అడ్డుకున్నారు. రాజకీయ నేతలను హెచ్చరిస్తూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. జైపూర్ జిల్లాలోని పాలావాలా జతన్ గ్రామస్థులు ఆ ప్రాంతంలోని ప్రజా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్నికలను బహిష్కరించారు. ఒక్క ఓటరు కూడా పోలింగ్ బూత్వైపు కన్నెత్తి చూడలేదు. తమ గ్రామాన్ని సమీపంలోని తూంగా గ్రామంతో కలుపుతూ రోడ్డు వేయాలని పాలావాలా జతన్ గ్రామస్తులు అనేక ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడే కాదు.. గత ఏడు పర్యాయాలుగా ఈ గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరిస్తూనే ఉన్నారు. -
భారత్లో ఓటేసిన పాకిస్థాన్ వలస జంట.. భావోద్వేగంతో..
జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో (Rajasthan Assembly Elections) పాకిస్థాన్కి చెందిన దంపతులు ఓటేశారు. పాకిస్థాన్ నుంచి వలస వచ్చి భారత పౌరసత్వం పొందిన ఈ జంట శనివారం జైపూర్లోని సంగనేర్ నియోజకవర్గంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వైద్యులైన అశోక్, నిర్మలా మహేశ్వరి దంపతులు చివరిసారిగా 2013లో పాకిస్తాన్ జాతీయ ఎన్నికల్లో ఓటు వేశారు. ఈ తర్వాత మతపరమైన వేధింపులతో పాకిస్తాన్లోని హైదరాబాద్ను వదిలి 2014లో విజిటర్స్ వీసాపై తమ ముగ్గురు పిల్లలతో కలిసి భారత్కు వచ్చారు. ఎనిమిది సంవత్సరాల పాటు అధికారిక పరిశీలనలో గడిపిన తర్వాత వీరిద్దరూ 2022లో భారత పౌరసత్వం పొందారు. అయితే వీరి పిల్లలకు మాత్రం ఇంకా భారత పౌరసత్వం లభించలేదు. భారతీయులమని గర్వంగా చెప్పుకొంటాం సంగనేర్లోని విద్యాస్థలి పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో తొలిసారి ఓటేసి బయటకు వచ్చిన అశోక్, నిర్మలా మహేశ్వరి దంపతులు.. తాము ఇప్పుడు భారతీయులమని గర్వంగా చెప్పుకోగలమని భావోద్వేగానికి గురయ్యారు. వచ్చే ఏడాది జరిగే భారత పార్లమెంటరీ ఎన్నికలలోనూ ఓటు వేయడానికి ఉత్సాహంగా ఉన్నామని నిర్మల తెలిపారు. నిర్మల జనరల్ మెడిసిన్లో వైద్యురాలు కాగా అశోక్ అనస్థీషియాలజిస్ట్గా ఉన్నారు. తమను ఓటు వేయడానికి భారత ప్రభుత్వం అనుమతించిందని తెలిసి పాకిస్తాన్లో ఉంటున్న తన తల్లి, సోదరులు సంతోషం వ్యక్తం చేశారని, తమను అభినందించారని నిర్మల పేర్కొన్నారు. ఏదో ఒక రోజు వారు కూడా తమ నిజమైన మాతృభూమి అయిన భారతదేశానికి తిరిగి వస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. అలాగే భారత్లో ఎన్నికల ప్రక్రియను ఆమె ప్రశంసించారు. తమకు పౌరసత్వం ఇచ్చినందుకు కేంద్రానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. -
రాజస్తాన్లో 75% పోలింగ్
జైపూర్: రాజస్తాన్ అసెంబ్లీకి శనివారం జరిగిన ఎన్నికల్లో 75 శాతం పోలింగ్ నమోదైంది. చెదురుమదురు ఘటనలు మినహా మొత్తమ్మీద ప్రశాంతంగా పోలింగ్ ముగిసిందని అధికారులు తెలిపారు. పోలింగ్ బూత్ల నుంచి పూర్తి స్థాయిలో సమాచారం అందాక తుది పోలింగ్ గణాంకాలను వెల్లడిస్తామని చీఫ్ ఎలక్టోరల్ అధికారి ప్రవీణ్ గుప్తా అన్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 74.06% పోలింగ్ నమోదైంది. ఈ దఫా కనీసం ప్రతి నియోజకవర్గంలో 75 శాతం పోలింగ్ను ఎన్నికల కమిషన్ లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర అసెంబ్లీలోని 200 సీట్లకు గాను 199 స్థానాలకు పోలింగ్ జరిపారు. ఓటర్ల సంఖ్య 5.25 కోట్లు. మొత్తం 51వేల పోలింగ్ బూత్లలో ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్, సాయంత్రం 6 గంటలతో ముగిసింది. అప్పటికే క్యూల్లో ఉన్న వారు ఓటు వేసేందుకు అవకాశమిచి్చనట్లు అధికారులు చెప్పారు. సాయంత్రం 5 గంటల సమయానికి 68.2శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా జైసల్మీర్, ఆ తర్వాత హనుమాన్గఢ్, ధోల్పూర్ జిల్లాల్లో భారీ పోలింగ్ నమోదైనట్లు సీఈవో గుప్తా తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆకస్మిక మృతితో శ్రీగంగానగర్ జిల్లాలోని కరణ్పూర్ నియోజకవర్గం ఎన్నిక వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. భద్రత కోసం 1.70 లక్షల మంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దించారు. శనివారం ఉదయం ఓటు హక్కు మొదటగా వినియోగించుకున్న ప్రముఖుల్లో సీఎం అశోక్ గెహ్లోత్, కేంద్రమంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, కైలాశ్ చౌదరి, మాజీ సీఎం వసుంధరా రాజె, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ తదితరులున్నారు. గెహ్లోత్, షెకావత్ జోథ్పూర్లో, చౌదరి బలోత్రాలో, రాజె ఝలావర్లో, పైలట్ జైపూర్లోనూ ఓటేశారు. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న ఉంటుంది. స్వల్ప ఘటనలు.. దీగ్ జిల్లా కమన్ గ్రామంలో రాళ్లు రువ్వుకున్న ఘటనలో పోలీస్ అధికారి సహా ఇద్దరు గాయపడ్డారు. ‘గుమికూడిన గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు 12 రౌండ్ల కాల్పులు జరిపారు. కొన్ని నిమిషాలపాటు పోలింగ్కు అంతరాయం ఏర్పడింది’అని దీగ్ జిల్లా ఎస్పీ చెప్పారు. సికార్ జిల్లా ఫతేపూర్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రాళ్లు రువ్వడంతో ఒక జవాను గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. ధోల్పూర్ బారి నియోజకవర్గంలోని ఓ బూత్ వద్ద పోలింగ్ ఏజెంట్, మరో వ్యక్తికి మధ్య జరిగిన గొడవతో పోలింగ్ కొద్దిసేపు నిలిచిపోయినట్లు కలెక్టర్ అనిల్ కుమార్ చెప్పారు. టోంక్ జిల్లా ఉనియారాలో 40 మంది వ్యక్తులు పోలింగ్ బూత్లోకి ప్రవేశించేందుకు యతి్నంచగా అడ్డుకున్నట్లు ఎస్పీ రాజశ్రీ రాజ్ చెప్పారు. సుమేర్పూర్ స్థానం బీజేపీ అభ్యర్థి తరఫు ఏజెంట్ శాంతి లాల్, ఉదయ్పూర్లో సత్యేంద్ర అరోరా(62) అనే ఓటరు పోలింగ్ బూత్ల వద్దే గుండెపోటుతో చనిపోయారు. కొద్ది చోట్ల రీపోలింగ్ చేపట్టే విషయంలో పరిశీలకుల నివేదిక అందాక నిర్ణయం తీసుకుంటామని సీఈవో గుప్తా వివరించారు. పోలింగ్ ప్రక్రియ నిలిచిపోయినట్లు సమాచారం లేదన్నారు. కొన్ని బూత్లలో ఈవీఎంలు మొరాయించినట్లు ఫిర్యాదులు వచి్చనా అవి చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పారు. ప్రత్యేకించి యువ ఓటర్ల కోసం పోలింగ్ బూత్ల వద్ద సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేశారు. -
ఎడారి రాష్ట్రంలో ఓటింగ్ సునామీ!
జైపూర్: ఎడారి రాష్ట్రం రాజస్థాన్లో ఈసారి ఓటింగ్ శాతం మునుపటి ఓటింగ్ శాతాన్ని మించిపోనుంది. శనివారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల సమయానికి 68 శాతానికిపైగా ఓటింగ్ నమోదైంది. జైసల్మేర్ జిల్లాలోని పోఖ్రాన్ అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 81.12 శాతం, పాలి జిల్లాలోని మార్వార్ జంక్షన్లో అత్యల్పంగా 57.36 శాతం పోలింగ్ నమోదైంది. 2018లో 74.06 శాతం రాజస్థాన్లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 74.06 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ సారి ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల సమయానికే 68 శాతానికి పైగా పోలింగ్ నమోదైన నేపథ్యంలో సాయంత్రం 6 గంటల తర్వాత కూడా పోలింగ్ స్టేషన్ వెలుపల ఓటర్లు పొడవాటి క్యూలలో నిల్చోవడం చూస్తుంటే, ఓటింగ్ శాతం 75 శాతానికి చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. స్లో ఓటింగ్పై బీజేపీ ఫిర్యాదు ఓటింగ్ శాతం బాగా నమోదవుతుందని భావిస్తున్నప్పటికీ, ప్రతిపక్ష బీజేపీ మాత్రం స్లో ఓటింగ్పై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. స్లో ఓటింగ్ కోసం అధికార యంత్రాంగంపై సీఎం అశోక్ గెహ్లాట్ ఒత్తిడి తెచ్చారని ఆరోపించింది. ఈ మేరకు బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్పర్సన్ నారాయణ్ పంచారియా ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేశారు. దీనిపై రాజస్థాన్ ఎన్నికల ప్రధాన అధికారి ప్రవీణ్ గుప్తా మాట్లాడుతూ, పోలింగ్ ముగిసే సమయంలోపు పోలింగ్ స్టేషన్లోకి ప్రవేశించిన ఓటర్లందరినీ ఓటు వేసేందుకు అనుమతించాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. 5.25 కోట్ల మంది ఓటర్లు రాష్ట్రంలో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలు ఉండగా గాను 199 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అభ్యర్థి మృతితో ఒక నియోజకవర్గంలో పోలింగ్ వాయిదా పడింది. 199 నియోజకవర్గాల్లో 5.25 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరు 1,862 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తమ ఓటు ద్వారా నిర్ణయించారు. నువ్వా.. నేనా.. రాజస్థాన్లో జరుగుతున్న ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య నువ్వా.. నేనా అన్నట్లు ప్రత్యక్ష పోటీ నెలకొంది. వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావాలని బీజేపీ ఉవ్వుళ్లూరుతుండగా.. ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వం మారే సంప్రదాయానికి చెక్ చెప్పి సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. కాగా 2018 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ బీజీపీ నుంచి అధికారాన్ని చేజిక్కించుకుంది. అప్పట్లో కాంగ్రెస్ 100, బీజేపీ 73 సీట్లు గెలుచుకున్నాయి. -
ఓటర్లకు కోపమొస్తే.. పోలింగ్ బూత్వైపు కన్నెత్తిచూడని గ్రామస్తులు!
జైపూర్ : రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 68 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మొత్తం 200 స్థానాలకు గానూ 199 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. రాష్ట్రమంతటా ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఒక గ్రామం మాత్రం ఎన్నికలను బహిష్కరించింది. జైపూర్ జిల్లాలోని పాలావాలా జతన్ గ్రామస్థులు ఆ ప్రాంతంలోని ప్రజా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్నికలను బహిష్కరించారు. ఒక్క ఓటరు కూడా పోలింగ్ బూత్వైపు కన్నెత్తి చూడలేదు. తమ గ్రామాన్ని సమీపంలోని తూంగా గ్రామంతో కలుపుతూ రోడ్డు వేయాలని పాలావాలా జతన్ గ్రామస్తులు అనేక ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఏడు పర్యాయాలు తమ సమస్యలను పరిష్కరించడంలో ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని , ప్రభుత్వాలు, అధికారుల ఉదాసీనత ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించారు. ఉదయం నుంచి ఒక్క గ్రామస్థుడు కూడా ఓటు వేసేందుకు రాకపోవడంతో పోలింగ్ బూత్ వెలవెలబోయింది. అక్కడి అధికారులు తప్ప ఓటర్లలెవరూ కనిపించలేదు. ఇప్పుడే కాదు.. గత ఏడు పర్యాయాలుగా గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరిస్తూనే ఉన్నారు. -
పోలింగ్ బూత్లో కుప్పకూలిన ఏజెంట్.. గుండెపోటుతో మృతి?
జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ పోలింగ్ ఏజెంట్ మృతి చెందాడు. పాలి జిల్లాలో ఓ అభ్యర్థికి సంబంధించిన పోలింగ్ ఏజెంట్ శనివారం ఉదయం పోలింగ్ జరుగుతుండగా కుప్పకూలిపోయాడు. సుమేర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని బూత్ నంబర్ 47లో శాంతిలాల్ అనే పోలింగ్ ఏజెంట్ కుప్పకూలినట్లు పోలింగ్ అధికారి తెలిపారు. వెంటనే అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి జిల్లా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. పోలింగ్ ఏజెంట్ మృతికి గుండెపోటు కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే మృతి చెందిన పోలింగ్ ఏజెంట్ పార్టీకి సంబంధించినవారు అనే వివరాలు వెంటనే తెలియరాలేదు. కాగా రాజస్థాన్లో 200 అసెంబ్లీ స్థానాలు ఉండగా 199 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగున్నాయి. కరణ్పూర్ నియోజకవర్గంలో ఓ అభ్యర్థి మృతి చెందడంతో అక్కడ పోలింగ్ వాయిదా పడింది. -
Rajasthan election 2023: ఒకే ఒక్క కుటుంబం కోసం పోలింగ్ బూత్
సాక్షి, న్యూఢిల్లీ: రాజస్థాన్ అసెంబ్లీకి నేడు జరగనున్న ఎన్నికల్లో ఒకే ఒక్క కుటుంబం కోసం అధికారులు ప్రత్యేకంగా ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న బార్మర్ జిల్లా పార్ గ్రామంలో రాష్ట్రంలోనే అతి చిన్న పోలింగ్ కేంద్రం ఉంది. ఇక్కడ ఒక కుటుంబంలోని 35 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సరిహద్దుకు ఆనుకుని ఉన్న ఈ గ్రామ ప్రజలు గత ఎన్నికల వరకు ఓటేయడానికి 20 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వచ్చేది. ఎడారిలో రోడ్లు లేకపోవడంతో ప్రజలు కాలినడకన, ఒంటెలపై పోలింగ్ బూత్కు చేరుకొనేవారు. పోలింగ్ కేంద్రం చాలా దూరంగా ఉండటంతో వృద్ధులు, మహిళలు పలుమార్లు ఓటు వేయలేకపోయారు. ఈ పరిస్థితిపై సమాచారం అందుకున్న ఎన్నికల కమిషన్ అధికారులు గ్రామంలో ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో మూడు వేర్వేరు ఇళ్లలో నివసించే ఒకే కుటుంబానికి చెందిన 17 మంది మహిళలు, 18 మంది పురుషులు మొత్తం 35 మంది ఓటేయనున్నారు. కాగా, సిరోహి జిల్లాలోని అబు–పింద్వారా అసెంబ్లీ నియోజకవర్గంలో 4,921 అడుగులఎత్తులో ఉన్న షేర్గావ్ ఓటర్లు తొలిసారిగా తమ సొంతూళ్లోనే ఓటు వేయనున్నారు. గ్రామంలోని 117 మంది గిరిజనుల ఓటర్ల కోసం ఎన్నికల సంఘం ఈసారి ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఎన్నికల సిబ్బంది దట్టమైన అటవీప్రాంతంలో దాదాపు 18 కిలోమీటర్లు నడిచి పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. -
Rajasthan elections 2023: రాజస్తాన్ ఎన్నికలకు సర్వం సిద్ధం
జైపూర్: రాజస్తాన్ శాసనసభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల దాకా పోలింగ్ జరుగనుంది. 200 నియోజకవర్గాలకు గాను 199 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అధికారులు సిద్ధమయ్యారు. శ్రీగంగానగర్ జిల్లాలోని కరణ్పూర్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యరి్థ, సిట్టింగ్ ఎమ్మెల్యే గురీ్మత్సింగ్ కూనార్ మరణించడంతో ఇక్కడ పోలింగ్ను వాయిదా వేశారు. రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి 1,862 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రాష్ట్రంలో మొత్తం 5.25 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అన్ని స్థానాల్లోనూ తమ అభ్యర్థులను బరిలోకి దించింది. కాంగ్రెస్ పార్టీ భరత్పూర్ స్థానాన్ని తమ మిత్రపక్షం రాష్రీ్టయ లోక్దళ్(ఆర్ఎల్డీ)కి కేటాయించింది. కాంగ్రెస్, బీజేపీతోపాటు సీపీఎం, ఆర్ఎలీ్ప, భారత్ ఆదివాసీ పార్టీ, భారతీయ ట్రైబల్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఎంఐఎం తదితర పారీ్టలు సైతం పోటీకి దిగాయి. పెద్ద సంఖ్యలో తిరుగుబాటు అభ్యర్థులు బరిలోకి దిగడం కాంగ్రెస్, బీజేపీలకు ఆందోళన కలిగిస్తోంది. బరిలో ఉద్ధండులు.. పోలింగ్ సజావుగా జరగడానికి అన్ని చర్యలు తీసుకున్నామని, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని రాజస్తాన్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ప్రవీణ్ గుప్తా తెలిపారు. ఎన్నికల్లో ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అశోక్ గహ్లోత్, పీసీసీ అధ్యక్షుడు గోవింద్సింగ్, అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషీ, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ తదితరులు మరోసారి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. బీజేపీ నుంచి సీనియర్ నేతలు వసుంధర రాజే, రాజేంద్ర రాథోడ్, సతీష్ పూర్ణియా, ఎంపీలు దివ్యా కుమారి, రాజ్యవర్దన్ రాథోడ్, బాబా బాలక్నాథ్, కిరోడీలాల్ మీనా తదితరులు పోటీపడుతున్నారు. అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. గహ్లోత్, సచిన్ పైలట్ సయోధ్య! రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య విభేదాల సంగతి తెలిసందే. తాము ఐక్యంగా ఉన్నామని చాటేందుకు ఎన్నికల వేళ గహ్లోత్ ప్రయత్నించారు. సచిన్ పైలట్ ప్రజలను ఓట్లు అభ్యరి్థస్తున్న వీడియోను గహ్లోత్ శుక్రవారం సోషల్ మీడియాలో పోస్టుచేశారు. తద్వారా ప్రజలకు సానుకూల సంకేతం ఇచ్చేందుకు ప్రయతి్నంచారు. -
కచ్చితంగా గౌరవప్రదంగా బదులిస్తారు! సుప్రియా సూలే
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి ఎన్నికల సంఘం(ఈసీఐ) షోకాజ్ నోటీసులు పంపిన సంగతి తెలిసింది. దీనిపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) ఎంపీ సుప్రియా సులే స్పందించారు. ఈ మేరకు సూలే మాట్లాడుతూ..రాహుల్ గాంధీ గొప్ప పోరాట యోధుడని. ఆయన మోదీపై చేసిన వ్యాఖ్యలకు నిజాయితీగా, గౌరప్రదంగా తగిన సమాధానం ఇవ్వగలరని ధీమాగా చెప్పారు. ఇలాంటి వాటికి రాహుల్ భయపడడు. ఎందుకంటే? బీజేపీ అతని కుటుంబం గురించి ఎలా మాట్లాడిందో అందరికీ తెలుసు. అందుకు సంబంధించిన ఎన్నో ఉదాహారణలు ఉన్నాయన్నారు. రాహుల్ తాతా, మహోన్నత వ్యక్తి నెహ్రూ నుంచి ఎవ్వరిని వదలకుండా ఎలా కుటుంబ సభ్యులందర్నీ కించరపరిచారో అందరూ విన్నారు. కాబట్టి రాహుల్ అందుకు కౌంటర్గా ఏదైనా మాట్లాడితే.. బీజేపీ ఎందుకు పెడబొబ్బలు పెట్టుకుంటోంది అని మండిపడ్డారు సూలే. అతడి కుటుంబంలోని వ్యక్తులందర్నీ పేరుపేరున అవమానిస్తూ మాట్లాడటం తప్పుగాదా? అని బీజీపీని నిందించారు. ఇదిలా ఉండగా, రాహుల్ గాంధీ రాజస్థాన్లోని బార్మర్ జిల్లా బయాతులో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పనౌటీ, పిక్పాకెట్ వంటి పదాలతో అవమానించాడని బీజేపీ ఈసీఐకి ఫిర్యాదు చేసింది. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తిని అలాంటి పదాలతో దూషించడం.. ఎన్నికల ప్రవర్తన నియావళి(మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎంసీసీ))ని ఉల్లంఘించడమేనని ఈసీఐకి ఫిర్యాదు చేసింది బీజేపి. ఈ నేపథ్యంలోనే ఈసీఐ గురువారం రాహుల్కి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీస్లో ఎన్నికల సంఘం(ఈసీఐ) రాహుల్ తనపై వచ్చిన ఆరోపణలకు ఇంకా ఎందుకు స్పందించలేదో వివరణ ఇవ్వాలని కోరింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎంసీసీ))ని ఉల్లంఘనల ఆరోపణలకు ప్రతిస్పందనగా ఎలాంటి చర్యలు ప్రారంభించకపోవడానికి గల కారణాలను కుడా వెల్లడించాలని పేర్కొంది. అలాగే రాహుల్ని తన వివరణను ఈ నెల 25న 18 గంట్లలోపు సమాధానం ఇవ్వకపోతే తగిన చర్యలు తీసుకుంటామని లేఖలో పేర్కొంది ఈసీఐ. (చదవండి: రగులుతున్న 'పనౌటీ' వివాదం!తెరపైకి నాడు ఇందీరా గాంధీ చేసిన పని..) -
Rajasthan Assembly polls: రాజస్థాన్ ఎవరిదో!
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగింపునకు వస్తోంది. మిజోరం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పోలింగ్ ఇప్పటికే ముగియగా కీలకమైన రాజస్థాన్ లో ప్రచార పర్వానికి గురువారం సాయంత్రంతో తెర పడింది. శనివారం పోలింగ్ జరగనుంది. అధికార కాంగ్రెస్, బీజేపీ రెండూ గెలుపుపై ధీమాగా ఉన్నా యి. ఏడు హామీలకు తోడు ప్రజాకర్షక పథకాలు కచ్చితంగా గట్టెక్కిస్తాయని ముఖ్య మంత్రి అశోక్ గెహ్లోత్ నమ్ముతున్నారు. దారుణంగా క్షీణించిన శాంతిభద్రతలు కచ్చితంగా సర్కారు పుట్టి ముంచుతాయని, మోదీ మేనియాకు హిందూత్వ కార్డు తోడై ఘనవిజయం సాధించి పెడుతుందని బీజేపీ అంటోంది. నవంబర్ 30న తెలంగాణలో పోలింగ్ ముగిశాక డిసెంబర్ 3న ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు జరిగి ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్తాన్లో గత మూడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఓసారి చూస్తే... 2008పరిశీలకులతో పాటు అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ అధికార బీజేపీ అనూహ్యంగా ఓటమి చవిచూసింది! కాంగ్రెస్ మరోసారి విజయబావుటా ఎగరేసింది. గెహ్లోత్ మళ్లీ సీఎం అయ్యారు. ప్రజల ఆదరణ బీజేపీకే ఉన్నట్టు దాదాపుగా అన్ని సర్వేల్లోనూ తేలినా ఆ పార్టీ ఓడిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యమంత్రిగా వసుంధరా రాజె సింధియా అనుసరించిన లోప భూయిష్టమైన ఎన్నికల వ్యూహమే ఇందుకు ప్రధాన కారణమని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. ఆమె అహంకారపూరిత ప్రవర్తన, సీనియర్లకు ప్రా ధాన్యం ఇవ్వకపోవడం, అభ్యర్థుల ఎంపికలో ఒంటెత్తు పోకడలు పార్టీని ముంచాయంటూ విమర్శలు వెల్లు వెత్తాయి. మొత్తం 200 స్థానా లకుగాను కాంగ్రెస్ 96 చోట్ల నెగ్గగా బీజేపీ 78 స్థానాలకు పరిమితమైంది. కాంగ్రెస్కు 36.8 శాతం ఓట్లు పోలవగా బీజేపీకి 34.3 శాతం పడ్డాయి. ఇతరులకు 21 శాతం ఓట్లు పోలవడం బీజేపీ విజయావ కాశాలను గట్టిగా దెబ్బకొట్టింది. ఎందుకంటే 2003 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్కు ఓట్లు కేవలం ఒక్క శాతం మాత్రమే పెరిగాయి. బీజేపీ ఏకంగా 5 శాతానికిపైగా ఓట్లను నష్టపోయింది! ఇక బీఎస్పీ 7.6 శాతం ఓట్లతో 6 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. 2013 ఆనవాయితీని కొనసాగిస్తూ బీజేపీ ఘనవిజయం సాధించింది. వసుంధరా రాజె మళ్లీ ముఖ్యమంత్రి పీఠమెక్కారు. రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో బీజేపీ 163 సీట్లలో నెగ్గింది. కాంగ్రెస్ కేవలం 21 స్థానాలకు పరిమితమై ఘోర పరాభవం మూటగట్టుకుంది. రాష్ట్ర చరిత్రలో ఒక ప్రధాన పార్టీకి లభించిన అత్యల్ప స్థానాలు ఇవే! 1998 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 33 సీట్లొచ్చాయి. బీజేపీ 45.2 శాతం ఓట్లు సాధించగా కాంగ్రెస్కు 33.1 శాతం దక్కాయి. గుజ్జర్ నేత కిరోరీసింగ్ బైన్స్లా దన్ను కాంగ్రెస్కు పెద్దగా కలిసిరాలేదు. ఎప్పుడూ ఆదరించే మేవార్ ప్రాంతం ఈసారి బీజేపీకే జై కొట్టడంతో ఆ పార్టీ తేరుకోలేకపోయింది. 34 ఎస్సీ స్థానాల్లో కాంగ్రెస్ ఒక్కటి కూడా నెగ్గలేకపోవడం విశేషం. 25 ఎస్టీ సీట్లలో నాలుగే గెలిచింది. 2014 లోక్సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా ప్రధానంగా తెరపైకి వచ్చిన నరేంద్ర మోదీ మేనియానే బీజేపీ ఘన విజయానికి కారణమని సీఎం అశోక్ గెహ్లోత్ అంగీకరించడం విశేషం! బీఎస్పీ సగం అసెంబ్లీ సీట్లు కోల్పోయి మూడింటికే పరిమితమైంది. 2018 ప్రభుత్వాలను పడగొట్టే ధోరణి మరోసారి కాంగ్రెస్కు గెలుపు కట్టబెట్టింది. పీసీసీ చీఫ్గా యువ నేత సచిన్ పైలట్ అంతా తానై ఎన్నికల బాధ్యతలను చూసుకున్నారు. పార్టీ విజయంలో ఒకరకంగా కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ నెగ్గితే ఆయనే ముఖ్యమంత్రి అవుతారన్న ప్రచారం పార్టీకి బాగా లాభించింది. 100 సీట్లతో పార్టీ ఘనవిజయం సాధించింది. 2013లో 59 ఎస్సీ, ఎస్టీ స్థానాలు నెగ్గిన బీజేపీ ఈసారి కేవలం 21 స్థానాలకు పరిమితమైంది. ఆళ్వార్, దౌసా, సవాయ్ మధోపూర్, టోంక్, ధోల్పూర్, కరౌలీ జిల్లాల్లోనైతే ఒక్క ఎస్సీ, ఎస్టీ స్థానం కూడా నెగ్గలేకపోయింది. ఫలితాల అనంతరం పైలట్ సీఎం అవుతారని అంతా భావించారు. కాంగ్రెస్ అధిష్టానం అనూహ్యంగా పాత కాపు మరోసారి గెహ్లోత్కే చాన్స్ ఇచ్చింది. రెండేళ్ల అనంతరం అవకాశమిస్తామంటూ పైలట్ను అనునయించి డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టింది. మాట నిలుపుకోకపోవడంతో 2020లో ఆయన తిరుగుబాటు చేసినా రాహుల్గాంధీ జోక్యంతో రాజీ పడ్డారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎన్నికల ప్రచారానికి తెర
రాజస్థాన్లో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. గురువారం సాయంత్రం 6 గంటల కల్లా ప్రచారాలు ముగించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అన్ని రోడ్షోలు, ర్యాలీలు, సమావేశాలు గురువారం సాయంత్రం 6 గంటలకు నిలిపివేసినట్ల రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ప్రవీణ్ గుప్తా తెలిపారు. రాజస్థాన్లో శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గురువారం సాయంత్రం 6 గంటల కల్లా ప్రచారం ముగుస్తుందని సీఈవో పేర్కొన్నారు. గతంలో 2018 ఎన్నికల సమయంలో పోలింగ్కు ఒకరోజు ముందు సాయంత్రం 5 గంటలకే ప్రచారం ముగిసిందని, ఈసారి ఒక ఒక గంట అదనంగా పొడిగించామని ఆయన చెప్పారు. రూ.682 కోట్లు స్వాధీనం రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 10 నుంచి ఇప్పటివరకు రూ.682 కోట్ల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు. గత ఎన్నికల్లో 65 రోజుల్లో పట్టుబడినదాని కంటే ఈసారి ఎన్నికల్లో 42 రోజుల్లోనే అత్యధికంగా ప్రలోభ సొత్తు, వస్తువులు పట్టుబడినట్లు పేర్కొన్నారు. రాజస్థాన్లో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలు ఉండగా 199 నియోజకవర్గాల్లో మాత్రమే నవంబర్ 25న ఎన్నికలు జరగనున్నాయి. కరణ్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ కూనార్ మరణించడంతో ఆ నియోజకవర్గానికి మాత్రం ఎన్నికలు వాయిదా పడ్డాయి. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ 99 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 73 సీట్లు దక్కించుకుంది. బీఎస్పీ ఎమ్మెల్యేలు, స్వతంత్రుల మద్దతుతో అశోక్ గెహ్లాట్ సీఎం పీఠాన్ని అధిష్టించారు. -
ఆ అంశాలతో కాంగ్రెస్కు కలిసొచ్చేనా?
రాజస్థాన్లో అసెంబ్లీ సమరం తుది అంకానికి చేరుకుంది. మరో రెండు రోజుల్లో అక్కడ పోలింగ్ జరగనుంది. ఇరుపక్షాలు తమ ఆధిపత్యాన్ని చాటుకునేలా ప్రచారాలను హోరెత్తించాయి. ఇప్పటి వరకు రాజస్థాన్లో ఒకదఫా బీజేపీ, మరోదఫా కాంగ్రెస్లు అధికారం చేపడుతూ వచ్చాయి. కానీ, ఆ సంప్రదాయానికి పుల్స్టాప్ వేయాలని కాంగ్రెస్.. ఆ సంప్రదాయామే కొనసాగాలని బీజేపీ కోరుకుంటున్నాయి. కానీ, కాంగ్రెస్ అనుహ్యమైన రీతీలో వ్యవహరించింది. అంతర్గత విభేదాలకు చెక్ పెట్టి.. ప్రజలకు ఎన్నో రకాల వెల్ఫైర్ స్కీమ్లు అందించి మెజార్టీ ఓట్లను కొల్లగొట్టేలా పావులను కదిపింది. మరి కాంగ్రెస్ మళ్లీ అధికారాన్ని దక్కించుకోగలదా? మైనస్గా ఉన్న ప్రతికూల అంశాలు పాజిటివ్గా మారి కాంగ్రెస్కి విజయాన్ని తెచ్చిపెడతాయా? విశ్లేషిస్తే.. రాజస్థాన్లో మరోసారి అధికారంలో పాగావేసేందుకు యత్నిస్తున్న కాంగ్రెస్కు కొన్ని సవాళ్ల తోపాటు అనుకూల అంశాలు కూడా ఉన్నాయి. ప్రతి ఐదేళ్లకొకసారి ప్రభుత్వాలు మారుతున్న రాజస్థాన్లో చరిత్రను తిరిగే రాసేలా.. కాంగ్రెస్ శతవిధాల యత్నించింది. కానీ ఆ ఆ పార్టీకి ప్రతికూలాంశాల నడుమ సవాళ్లు ఎదురయ్యాయి. ఎగ్జామ్ పేపర్ లీకేజ్.. కాంగ్రెస్ నేతృత్వంలోని విద్యామంత్రిగా ఉన్న గోవింద్ సింగ్ దోతస్రా సారథ్యంలో జరిగిన పేపర లీకేజ్లు, పరీక్షల రద్దు, అరెస్టులు తదితరాలు విద్యావ్యవస్థ పరంగా కాంగ్రెస్కి అతి పెద్ద మాయని మచ్చ అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పేపర్ లీక్ కుంభకోణం కాంగ్రెస్ రాజకీయ భవితవ్యాన్ని పూర్తిగా మార్చేసే ప్రమాదం ఉందని అంటున్నారు. ఈ అంశమే కాంగ్రెస్కి మైనస్ అయ్యి..ప్రజలు అధికారం పట్టకట్టాలా? లేదా అనే మీమాంసంలో పడే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతర్గత విభేదాలు.. కాంగ్రెస్లో తరచుగా తెరపైకి అంతర్గత విభేధాలు తారస్థాయిలో వచ్చాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ల మధ్య నువ్వా-నేనా? అనే స్థాయికి వచ్చాయి. ఆఖరికి సొంత పార్టీలో తిరుగుబాటు జెండా ఎగురవేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు సచిన్. ఆఖరికి తమ అధికార పార్టీ పాలనే బాగోలేదంటూ సచిన్ బయటకు వచ్చి మరీ నిరాహారదీక్ష చేపట్టి అందర్నీ విస్తుపోయాలా చేశారు. చివరికి కాంగ్రోస్ అధిష్టానం దిగొచ్చి జోక్యం చేసుకునేంత వరకు అంతర్గత విభేదాలు సద్దుమణగలేదు. ఇది ఒకరంగా ప్రజలకు భరోసా ఇవ్వలేని కాంగ్రెస్ పాలన అనే సందేహాలకు తావిచ్చిందనేది విశ్లేషకుల అభిప్రాయం. అవినీతి, అల్లర్లు, నేరాలు.. ముఖ్యంగా రిక్రూట్మెంట్లో జరిగిన అవతవకలు పాలనలోని డొల్లతనాన్ని చూపాయి. పారదర్శకతకు తిలోదకాలు వదిలి రాష్ట్రంలో అల్లర్లు చెలరేగేందుకు కారణమైంది. పైగా గహ్లోత్ ప్రభుత్వం వాటిని నియంత్రించడంలో విఫలమైంది కూడా. ఇక మహిళలకు భద్రత లేకపోవడం, విపరితంగా పెరిగిన నేరాలు, నిరుద్యోగం, వ్యవసాయ కష్టాలు తదితరాలు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దిగజార్చాయి. ఇవే ప్రజల్లో కాంగ్రెస్ పట్ల తీవ్ర అసంతృప్తిని పెంచేందుకు దోహదం చేస్తుందని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక అనుకూలమైన విషయాల వద్దకు వస్తే ఎన్నికలు సమీపిస్తుండగా ఒకరంటే ఒకరికి పడని గహ్లోత్, సచిన్ పైలట్ ఊహించని రీతిలో ఐక్యతను చాటడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక పైలెట్ కూడా తమ పార్టీ ఐక్యతను చాటి చెప్పలా ఆయన ప్రవర్తన తీరు తోపాటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఊహకందని రీతిలో కాంగ్రెస్ వెల్ఫైర్ స్కీమ్లు, గ్యారంటీలు వంటి హామీలతో రసవత్తరంగా దూసుకొచ్చింది. కాంగ్రెస్పై సానుకూల పవనాలు వీచేలా తన తీరుని మార్చి బీజేపీనే విస్తుపోయేలా చేసింది. ఈ గ్యారంటీ గేమ్, కాంగ్రెస్ వ్యూహం ఎంతవరకు ప్లస్ అవుతుందా? వాటిల్లో కాంగ్రెస్కి ఎంతవరకు సానూకూల అంశాలు ఉన్నాయి అంటే.. సానూకూలమైన అంశాలు యునైటెడ్ ఫ్రంట్ అశోక్ గెహ్లోత్, సచిన్ పైలట్లు తామెప్పుడూ ఒకటేనని పార్టీని నిలబెట్లుకోవడమే లక్ష్యం అని ప్రకటించారు. అలాగే సచిన్ పైలట్ కూడా రాజస్తాన్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలోకి తనను పిలవకపోయినా పట్టించుకోలేదు. గహ్లోత్ ఒక్కరే అన్ని తానై పార్టీని నడిపిస్తున్నట్లు ప్రచారం చేసుకున్న సంయమనాన్ని పాటించి సచిన్ అందర్నీ ఆకర్షించారు. ఇక వరుసగా రాజస్తాన్లో కాంగ్రెస్ ఎందుకు గెలవడం లేదో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని పార్టీకి సూచించారు. అదే సమయంలో తమ పార్టీ గెలుస్తుందని కూడా ధీమాగా చెప్పి తామంత ఐక్యంగా ఉన్నామని చెప్పకనే చెప్పారు. పైగా గతంలో చేసిన వ్యాఖ్యల విషయం కూడా రాజకీయ పరంగా వచ్చినవే "క్షమించడం, మరచిపోవడం" అనే మంత్రాలని పాటిస్తున్నానంటూ నాయకులు ఐక్యతకు పీఠం వేశారు. ఇది ఒకరకంగా కాంగ్రెస్కి ప్లస్ అవ్వొచ్చు. పైగా తన తీరుని మార్చుకుని ప్రజలకు సుపరిపాలన ఇచ్చే దిశగా కాంగ్రెస్ తన గత వైభవాన్ని తీసుకొస్తుందనే ఆలోచన ప్రజలకు కలిగించింది. ఓట్లును కొల్లగొట్టేందుకు ఇది మంచి సానుకూలం అంశమే అని చెబుతున్నారు విశ్లేషకులు. గ్యారంటీల గేమ్ అశోక్ గహ్లోత్ ఓటర్లను ఆకర్షించేలా.. ఏడు గ్యారంటీలు, పాత పెన్షన్ స్కీమ్, మహిళలకు రూ.10 వేల భృతి మొదలుకుని రూ.25 లక్షల వైద్య సాయం దాకా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న, అందించబోయే పథకాలను ముమ్మరంగా ప్రచారం చేశారు. ఓటర్లను ప్రసన్నం చేసుకనేలా సుడిగాలిలో రాష్టం అంతటా పర్యటించారు. తన హామీలు ప్రజల్లో బలంగా నాటుకునేలా చేసే ప్రయత్నాలు కూడా ఓటర్లను ప్రభావితం చేసి కాంగ్రెస్కి గెలుపులో కీలకం అవ్వోచని భావిస్తున్నారు విశ్లేషకులు. కాంగ్రెస్ ఓటర్ల నాడికి తగ్గట్టుగా వ్యూహం మార్చి తన ముందున్న సవాళ్లను సానూకూలంగా మార్చుకుంటూ ప్రత్యర్థులనే షాక్ గురి చేసింది. ఎలాంటి స్కీమ్, హామీలు ప్రజల్లోకి చేరతాయి, ఏ విధంగా పాలనలో మార్పులు చేయాలనే దిశగా అడగులు వేస్తూ గెలుపే లక్ష్యం దూసుకుపోతుంది. బీజేపీ వ్యూహం ఇలా.. ఇదిలా ఉండగా బీజేపీనేమో కాంగ్రెస్ మైనస్లను హైలెట్ చేస్తూ ప్రజల్లో వెళ్లింది. అలాగే రాజస్థాన్లో ఆనవాయితీగా ఒకసారి గెలిచిన పార్టీ మరోసారి గెలవదనే సెంటిమెంట్ను బీజేపీ నమ్ముతూ.. విజయావకాశాలపై ధీమాతో ఉంది. పైపెచ్చు.. తాము అధికారంలో ఉండగా రాజస్థాన్కి చేసిన నిధుల కేటాయింపు ఓటర్లకు గుర్తుచేస్తూ.. వాళ్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించింది. అన్నింటికంటే ముఖ్యంగా.. కాంగ్రెస్లోని ఐక్యత లోపాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని ప్రచారంలో దూసుకెళ్లింది. ఈ తరుణంలో.. ఓటర్ తీర్పు.. అందునా కొత్తగా ఓటు హక్కును వినియోగించుకునే వాళ్ల నిర్ణయం ఎలా ఉండబోతుందా? అనేది తెలియాలంటే డిసెంబర్ 3వ తేదీదాకా వేచి చూడాల్సిందే. (చదవండి: కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలన్నీ బౌండరీలు దాటేశాయి! అమిత్ షా!) -
కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలన్నీ బౌండరీలు దాటేశాయి!
రాజస్తాన్ ఎన్నికల ప్రచారాలు తుది అంకానికి వచ్చేశాయి. నేటితో పార్టీల ప్రచార ర్యాలీలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై తారాస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ అల్లర్లకు ఆధ్యం పోశారే గానీ నియత్రించేలా కఠిన చర్యలు తీసుకోలేదని ఆరోపణలు చేశారు. గహ్లోత్ ప్రభుత్వం హయాంలో బుజ్జగింపు రాజకీయాలు అన్ని హద్దులు దాటాయి. గత ఐదేళ్లలో ఛబ్రా, కరౌలీ, భిల్వారా, జోధ్పూర్, చిత్తోర్గఢ్, నోహర్, వేవాత్, మల్పురా, జైపూర్ తదితర ప్రాంతాల్లో జరిగిన అల్లర్లే అందుకు ఉదాహారణ అని ఆరోపించారు. బుల్డోజర్లతో సలాసర్లోని రామ్ దర్బార్ని, ఆవుల షెడ్డుని ఎలా కూలదోసిందో చెప్పుకొచ్చారు. అలాగే జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కచ్చితంగా విజయం సాధిస్తుందని కేంద్ర మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీయే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని విశ్వాసంగా చెప్పారు. రాజస్తాన్లో తమ పార్టీ ప్రతి మూలన సమూలమైన మార్పు తీసుకువస్తుందని, ముఖ్యంగా నేరాల తీవ్రత తగ్గిస్తామని చెప్పారు. ఇదే క్రమంలో రాహుల్ గాంధీ కూడా చివరి రోజు ర్యాలీలో బీజేపీపై విమర్శల దూకుడును పెంచేశారు. అదాని వంటి ఇష్యులను అస్త్రాలుగా చేసుకుని విమర్శలు ఎక్కుపెట్టారు. పైగా ఇరు పార్టీలో పోటాపోటీగా తమ అగ్ర నాయకులను ప్రచార ర్యాలీల బరిలోకి దింపారు. ఇటు బీజేపీ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వంటిని ప్రచారంలోకి దించితే..అటు కాంగ్రెస్ కూడా పార్టీ కార్యదర్శి ప్రియాంక గాంధీని, రాహుల్ గాంధీని, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేని దింపింది. కాగా, ఈ నెల 25న 200 అసెంబ్లీ స్థానాలున్నా రాజస్తాన్లో ఈసారి 199 స్థానాల్లోనూ ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. (చదవండి: రగులుతున్న 'పనౌటీ' వివాదం!తెరపైకి నాడు ఇందీరా గాంధీ చేసిన పని.) -
రగులుతున్న 'పనౌటీ' వివాదం! తెరపైకి నాడు ఇందీరా గాంధీ..
రెండు రోజుల్లో రాజస్తాన్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలు పోటాపోటీగా ఎన్నికల ప్రచార ర్యాలీలతో హోరెత్తించారు. ఎవరికి వారు మాటల తుటాలతో ఓటర్లను ఆకర్షించేలా ప్రచారం చేశారు. ఐతే కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఓ ప్రచార ర్యాలీ మోదీని విమర్శిస్తూ చేసిన పనౌటీ వ్యాఖ్య ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోంది. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తిపై అలాంటి వ్యాఖ్యలా అని బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడుతుంది. ఈ వ్యాఖ్యల విషయమై రాహుల్పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఏకంగా ఎలక్షన్ సంఘాన్ని కోరింది. అంతటితో ఆగకుండా 1982లో జరిగిన ఆసియా క్రీడల హాకీ ఫైనల్ మ్యాచ్ని గుర్తు చేస్తూ కాంగ్రెస్పై విమర్శలు ఎక్కిపెట్టింది బీజేపి. ఆ టైంలో ఇందిరాగాంధీ నేరుగా హాకీ మ్యాచ్ని వీక్షించేందుకు స్టేడియంకు వచ్చారని, ఐతే భారత హాకీ జట్టు మ్యాచ్లో వెనుకబడి ఉండటంతో ఆమె మధ్యలో వెళ్లిపోయారంటూ నాటి సంఘటనను గుర్తు చేసింది బీజేపి. అలా మధ్యలో వెళ్లిపోయి ఇందిరా గాంధీ భారత జట్టుని అవమానించారు అని విమర్శించారు. ఇలాంటి ప్రవర్తన నిజంగా క్రీడాకారుల మనోస్థైర్యాన్ని దెబ్బతియడంతో సమానం అంటూ కాంగ్రెస్ని దుమ్మెత్తిపోసింది. కానీ ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీ క్రికెట్ ప్రపంచ వరల్డ్ కప్లో అలా చేయలేదని చివరి వరకు ఉండి, భారత జట్టుని కలిసి ప్రశంసించి, స్టైర్యాన్ని నింపితే ఇలానా వ్యాఖ్యానించేదని చీవాట్లు పెట్టింది. రాహుల్ లాంటి అపరిపక్వత వ్యక్తి కూడా ప్రధాని మోదీని విమర్శించడం సిగ్గు చేటు అంటూ మండిపడింది. ఇదిలా ఉండగా అస్సాం ముఖ్యమంత్రి బీజేపీ నేత హిమంత్ శర్మ టీమ్ ఇండియా ప్రపంచ కప్పు ఫైనల్లో ఓడిపోవడానికి భిన్నమైన వివరణ ఇస్తూ విమర్శలు చేశారు. ఇందిరా గాంధీ జయంతి రోజునే ఫైనల్ మ్యాచ్ జరగడంతోనే టీమ్ ఇండియా ఓడిపోయిందన్నారు. అందువల్ల దయచేసి గాంధీ కుటుంబ సభ్యల పుట్టిన రోజున టీం ఇండియా ఎట్టిపరిస్థితుల్లోనూ మ్యాచ్లు ఆడకూదనే విషయం అవగతమైందంటూ వ్యగ్యంగా మాట్లాడారు. ఏదీఏమైన రాహుల్ గాంధీ పనౌటీ వ్యాఖ్యలపై బీజేపీ చాలా గుర్రుగా ఉంది, ఏకంగా రాజస్తాన్ ఎనికల సంఘానికి ఫిర్యాదు కూడా చేసింది. కాగా, ఈ రోజు సాయంత్రంతో ఇరు పార్టీల ప్రచార ర్యాలీకి తెరపడనుంది. ఈ నెల 25న రాజస్తాన్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగునుంది. (చదవండి: ఆ రెండు భారతదేశానికి రాహు-కేతువులు! అమిత్ షా ఫైర్) -
మేమొస్తే రాజస్తాన్లో కులగణన
జైపూర్: రాజస్తాన్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి అధికారంలోకి రాగానే రాష్ట్రవ్యాప్తంగా కులగణన చేపడతామని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. బుధవారం ధోల్పూర్, భరత్పూర్లలో జరిగిన ప్రచారసభల్లో రాహుల్ పాల్గొని ప్రసంగించారు. ‘ దేశ రక్షణ కోసం పాటుపడేందుకు సైన్యంలో చేరాలని కలలు కనే లక్షలాది మంది యువత ఆశలను మోదీ సర్కార్ అగ్నిపథ్ పథకం తెచ్చి చిదిమేసింది. ఈ ఎన్నికల్లో గెలిచాక రాష్ట్రంలో, సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు తర్వాత దేశవ్యాప్తంగా కులగణన చేపడతాం. దళితులు, వెనుకబడిన తరగతుల జనాభా వంటి సమగ్ర వివరాలు బహిర్గతంకావాలంటే కులగణన జరగాల్సిందే. మోదీ హయాంలో దేశవ్యాప్తంగా ప్రజా సంపద పంపిణీ ఏ విధానంలో జరుగుతోందనేది పెద్ద ప్రశ్నగా మారింది’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. అప్పుడలా.. ఇప్పుడిలా ‘‘తాను ఓబీసీ వర్గానికి చెందిన వ్యక్తినని మోదీ పదేపదే చెప్పుకునేవారు. నేను ఎప్పుడైతే కులగణన డిమాండ్ తెరపైకి తీసుకొచ్చానో అప్పటి నుంచి ఆయన మాట మార్చారు. దేశంలో ఒక్కటే కులం ఉందట. అది పేదకులమట’’ అని రాహుల్ ఎద్దేవాచేశారు. ‘ప్రజాధనం లూటీ చేయడంలో మోదీ, కుబేరుడు గౌతమ్ అదానీ, హోం శాఖ మంత్రి అమిత్ షా బిజీగా మారారు. ముందుగా ప్రధాని మోదీ టీవీల్లో ప్రత్యక్షమై హిందువుల, ముస్లింల గురించి ప్రసంగాలు దంచేస్తూ ప్రజల దృష్టి మరల్చుతారు. వెంటనే గౌతమ్ అదానీ వెనక నుంచి వచ్చి ప్రజల జేబుల్లోని సొమ్ము నొక్కేస్తారు. ఆ తర్వాత ప్రజా వ్యతిరేకత, ఆందోళన అణచివేసేందుకు లాఠీ పట్టుకుని అమిత్ షా సిద్ధంగా ఉంటారు. ఇపుడు దేశంలో ప్రభుత్వం ఇలాగే నడుస్తోంది. మోదీ అనుక్షణం చానెళ్లలో కనిపిస్తూనే ఉంటారు. ఎందుకంటే ఆ చానెళ్లకు అధిపతి అదానీ కదా. మోదీనే ప్రజాధనాన్ని అదానీకి ముట్టజెప్తారు. విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, సిమెంట్ కర్మాగారాలను ధారాదత్తం చేస్తారు. అదానీకి అనుగుణంగా చట్టాలు చేస్తారు. పెద్ద నోట్లను రద్దుచేస్తారు’’ అని రాహుల్ విమర్శించారు. -
నిజం మాట్లాడే సొంత నేతలనూ బహిష్కరిస్తుంది
జైపూర్: రాజస్తాన్లో ఎన్నికల ప్రచారసభల్లో అధికార కాంగ్రెస్పై ప్రధాని మోదీ మరింతగా విమర్శనాస్త్రాలు సంధించారు. బిల్వాడా జిల్లాలోని కోట్రీ గ్రామంలో భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. ‘ కాంగ్రెస్ కుటుంబం ముందు ఎవరైనా నిజం మాట్లాడితే ఇక అంతే. సొంత పార్టీ నేతలు అని కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా పార్టీ నుంచి బహిష్కరిస్తారు. ఒకప్పుడు రాజేశ్ పైలట్ ఆహార సమస్యపై కాంగ్రెస్ కుటుంబాన్నే సవాల్ చేశారు. దీంతో అప్పటి నుంచి రాజేశ్ పైలటే కాదు ప్రస్తుతం ఆయన కుమారుడు సచిన్ పైలట్ సైతం పార్టీ ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది. 1997లో పార్టీ అధ్యక్ష పదవికి సీతారాం కేసరికి పోటీగా ఎన్నికల్లో నిల్చున్నందుకు రాజేశ్ పైలట్పై పార్టీ కన్నెర్రజేసింది. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కోసం అశోక్ గెహ్లోత్తో పోటీపడినా అధిష్టానం దీవెనలు సచిన్కు దక్కలేదు’’ అన్నారు. అసెంబ్లీ సాక్షిగా రేపిస్టులకు క్లీన్ చిట్ ‘‘అసెంబ్లీ సాక్షిగా రేపిస్టులకు రాష్ట్ర మంత్రులే క్లీన్చిట్ ఇస్తున్నారు. ఇలాంటి పాలనలో మన తల్లులు, కూతుళ్లు, అక్కాచెల్లెళ్లకు రక్షణ ఏది? ఈ ఐదేళ్లలో రాష్ట్రాన్ని దోచుకోవడంలో ఏ ఒక్క అవకాశాన్నీ కాంగ్రెస్ వదిలిపెట్టలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనకు ముగింపు పలకాల్సిన సమయమొచ్చింది. కమలానికి మీరు వేసే ఒక్కో ఓటు కాంగ్రెస్ను తుడిచిపెట్టేందుకు దోహదపడుతుంది’’ అని మోదీ అన్నారు. అంతకుముందు దుంగార్పూర్ జిల్లాలోని సాగ్వారా పట్టణంలో ర్యాలీలో మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్పై విమర్శనాస్త్రాలు సంధించారు. మరోవైపు, మోదీ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీతో పాటు సచిన్ పైలట్ కూడా ఖండించారు. ఆయన సొంత పార్టీపై దృష్టి పెడితే మంచిదని సచిన్ సూచించారు. -
Rajasthan Election 2023: హామీలా, హిందుత్వా?
ఎడారి రాష్ట్రం రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికల పోరు చివరి దశకు చేరుకుంది. ఇక్కడ పాలక కాంగ్రెస్, విపక్ష బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. నెల రోజులకు పైగా రాష్ట్రవ్యాప్తంగా పోటాపోటీ ప్రచారంతో ఇరు పార్టీలూ హోరెత్తించాయి. బీజేపీ ప్రచారానికి స్వయంగా ప్రధాని మోదీయే సారథ్యం వహించి కాలికి బలపం కట్టుకుని సుడిగాలి పర్యటనలు చేశారు. కాంగ్రెస్ తరఫున ప్రచార భారాన్ని ప్రధానంగా సీఎం అశోక్ గెహ్లోతే మోశారు. మోదీ మేనియాకు ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చే ఆనవాయితీ తోడై తాము అందలమెక్కుతామని బీజేపీ నమ్మకం పెట్టుకుంది. గెహ్లోత్ వరుసబెట్టి ప్రకటిస్తూ వచి్చన జనాకర్షక పథకాలు ఆ ఆనవాయితీకి ఈసారి అడ్డుకట్ట వేసి తమను మరోసారి గెలిపిస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే పోలింగ్ తేదీ సమీపించినా ఓటరు నాడి మాత్రం ఎవరికీ అందడం లేదు. ఏ పార్టికీ అనుకూలంగా స్పష్టమైన ‘వేవ్’ కనిపించడం లేదు. దాంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇరు పార్టిలూ సర్వశక్తులూ ఒడ్డాయి. కాంగ్రెస్ ప్రధానంగా ఎన్నికల హామీలపై ఆధారపడగా బీజేపీ ఎప్పట్లాగే హిందుత్వ కార్డును వీలైనంతగా ప్రచారంలో పెట్టింది... పథకాలకు థమ్సప్... గెహ్లోత్ ప్రభుత్వ పనితీరుపై క్షేత్రస్థాయిలో పెద్దగా వ్యతిరేకత కన్పించకపోవడం విశేషం. సంక్షేమ పథకాలపై ప్రజల్లో బాగా సంతృప్తి ఉంది. సంక్షేమ పథకాలు పేదలను ఎంతగానో ఆదుకున్నాయని బీజేపీ మద్దతుదారులు కూడా అంగీకరిస్తుండటం విశేషం! చిరంజీవి బీమా యోజన లక్షల మంది పేద, మధ్య తరగతి కుటుంబీకులకు ఎంతో ఆదుకుందని సవాయ్ మధోపూర్లో పవన్ మీనా అనే పాన్ షాప్ యజమాని చెప్పుకొచ్చారు. ‘‘నేను బీజేపీ మద్దతుదారును. కానీ ఈసారి కాంగ్రెస్ పాలనలో ప్రజలకు జరిగిన మంచి కొట్టొచ్చినట్టు కని్పస్తూనే ఉంది’’ అన్నారాయన. కాకపోతే ఇదంతా ఓట్ల రూపంలో బదిలీ అవుతుందా అన్నది చూడాలంటూ ముక్తాయించారు. 10 లక్షల ఉద్యోగాలతో పాటు తక్షణం కులగణన చేపట్టి, మైనారిటీలకు జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కలి్పస్తామని కూడా కాంగ్రెస్ తాజా మేనిఫెస్టోలో చెప్పింది. ఇవన్నీ ఓటర్లను ఏ మేరకు ప్రభావితం చేస్తాయో చూడాల్సిందే. శాంతిభద్రతలపై పెదవి విరుపు... పథకాల సానుకూలతకు శాంతిభద్రతల విషయంలో జనంలో నెలకొన్న తీవ్ర అసంతృప్తి బాగా గండి కొట్టేలా కనిపిస్తోంది. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి మాత్రం దారుణంగా దిగజారిందని మెజారిటీ ప్రజలు వాపోతుండటం ప్రమాద ఘంటికేనంటున్నారు. ముఖ్యంగా ఇస్లాంను కించపరిచాడంటూ గతేడాది ఉదయ్పూర్లో ఓ టైలర్ షాప్ యజమానిని పట్టపగలే తల నరికి చంపిన తీరును ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. దానికి తోడు మహిళలపై అకృత్యాలు ఎన్నడూ లేనంతగా పెరిగిపోయిన తీరుపైనా జనం గగ్గోలు పెడుతున్నారు. పథకాల ఫలాలు అందరికీ అందుతున్నా ప్రాణాలకే భద్రత లేకపోతే ఏం లాభమని కోటాలో బట్టల షాపు నడుపుతున్న వినోద్ చేసిన వ్యాఖ్యలు జనాభిప్రాయానికి అద్దం పట్టేవే. ‘‘గెహ్లోత్ ప్రభుత్వం బాగానే పని చేసింది. కానీ మార్పు అవసరం. బీజేపీ వస్తే బాగుంటుంది’’ అన్నారాయన. బీజేపీకి ఓటేయడం చాలా అవసరమని కోటాకు చెందిన అమృత్ చౌహాన్ అనే ఆటోడ్రైవర్ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ ధోరణినే ప్రతిఫలించాయి. ‘‘శాంతిభద్రతలను చక్కదిద్దాలంటే యూపీ తరహా పాలన కావాల్సిందే. అప్పుడే ప్రధాని మోదీ చెబుతున్న హిందూ రాష్ట్ర స్థాపన సాధ్యం. కాంగ్రెస్ కేవలం ఒక్క సామాజిక వర్గానికే కొమ్ము కాస్తూ వస్తోంది’’ అని చౌహాన్ చెప్పుకొచ్చారు. ఈసారీ 199 సీట్లలోనే పోలింగ్! రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి గురువారం సాయంత్రంతో తెర పడనుంది. పోలింగ్ శనివారం జరుగుతుంది. ఎన్నికల ఫలితాలు మరో నాలుగు రాష్ట్రాలతో కలిపి డిసెంబర్ 3న వెల్లడవుతాయి. అయితే రాష్ట్రంలో 200 అసెంబ్లీస్థానాలకు గాను 199 స్థానాల్లో మాత్రమే పోలింగ్ జరగనుంది! కరణ్పూర్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్సింగ్ కున్నర్ మృతితో అక్కడ పోలింగ్ వాయిదా పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇలా 199 స్థానాల్లోనే పోలింగ్ జరుగుతుండటం రాష్ట్ర చరిత్రలో ఇది వరుసగా మూడోసారి కావడం విశేషం! బీఎస్పీ అభ్యర్థుల మృతి కారణంగా 2018లో, 2013 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇలాగే ఒక అసెంబ్లీ స్థానంలో పోలింగ్ నిలిచిపోయింది. -
ఆ రెండు దేశానికి రాహు-కేతువులు!
రాజస్తాన్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి, బీజేపీ నాయకుడు అమిత్ షా బహిరంగ ప్రచార ర్యాలీలో కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం జరిగిన ఈ బహిరంగ ర్యాలీ అమిత్ షా మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబం భారతదేశాన్ని పట్టి పీడుస్తున్న రాహు-కేతువులని ధ్వజమెత్తారు. భవిష్యత్తులో భారతదేశానికి తలెత్తే కష్టాలన్నింటికీ గాంధీ కుటుంబం, కాంగ్రెస్ల వల్లనే వస్తుందని విమర్శలు గుప్పించారు. భారత ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే మోదీ.. తాను చెప్పినట్లుగానే చంద్రయాన్తో భారత త్రివర్ణ పతాకాన్ని చంద్రునిపై రెపరెపలాడేలా చేశారు. అంతేగాక జీ 20 ఆతిథ్యంతో భారత దౌత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా చేశారు. అలాగే కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించి తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. ఇక 2014లో 11వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను ప్రధాన మోదీ ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చారు. తమ ప్రభుత్వం ఏర్పడితే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రూ. 6 వేలుగా ఉన్నదాన్ని కాస్తా రూ. 12 వేలు చేయాలని నిర్ణయించుకున్నాం అని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం మిల్లెట్ను ఎంఎస్పీకి కొనుగోలు చేస్తోంది. ఇక గ్యాస్ సిలిండర్లను తమ పార్టీ కేవలం రూ. 450/- లకే అందిచింది. ఇలా మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి నుంచి ఎన్నో అభివృద్ధి పనులు చేశారని అన్నారు. ఇదిలా ఉండగా అంతకు మునుపు రాజస్తాన్లోని నసీరాబాద్లో జరిగిన బహిరంగ ర్యాలీలో అమిత్ షా మాట్లాడుతూ..రాహుల్ గాంధీ పదేపదే ఓబీసీ వర్గాల గురించి మాట్లాడుతున్నారు. జవహర్ లాల్ నెహ్రు దగ్గర నుంచి రాహుల్ గాంధీ వరకు సుమారు నాలుగు తరాలు గాంధీలు ఓబీసీ వర్గాల అభివృద్ధికి వ్యతిరేకంగా ఉన్నారని ఆరోపణలు చేశారు. కానీ బీజేపీ జాతీయ వెనుకబడిని తరగతుల కమిషన్(ఎన్సీబీసీ)ని రాజ్యాంగబద్ధంగా మార్చింది. అలాగే తొలి ఓబీసీ ప్రధానమంత్రిని ఇచ్చిన ఘనత కూడా మాదే. ఇలాంటివి కాంగ్రెస్ ఎన్నడూ చేయలేదు. పైగా తప్పుడు వాగ్దానాలు చేస్తోందని మండిపడ్డారు. ఇదే సమయంలో రాజస్తాన్ ముఖ్యమంతి అశోక్ గహ్లోత్ ప్రభుత్వంపై కూడా నిప్పులు చెరిగారు. తన జీవితంలో ఎప్పుడూ ఇంత అవినీతి మయ ప్రభుత్వాని చూడలేదంటూ చిరాకుపడ్డారు. ఇక్కడ తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి..పూర్తిస్థాయిలో విచారణ జరిపించి అవినీతి పరులందరికీ శిక్ష పడేలా చేస్తామని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే పేపర్ లీక్లు జరగకుండా చూడటమే కాకుండా సుమారు 2.5 లక్షల మంది యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. అంతేగాదు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. 2004-14 మధ్య కాలంలో రాజస్తాన్కి కేవలం రెండు లక్షల కోట్ల రూపాయాలు తగ్గించి గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇచ్చిందన్న విషయాన్ని గుర్తు చేశారు. కానీ మోదీ అధికారంలోకి రాగానే రాజస్తాన్కు తొమ్మిదేళ్లలో దాదాపు 6 లక్షల డభైవేల కోట్లు ఇచ్చిందని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కిసాన్ సమ్మాన్ కింద రైతులకు రూ. 12 వేలు వరకు ఇవ్వడమే గాక వైద్య ఖర్చులు దాదాపు 10 లక్షల వరకు భరిస్తామని చెప్పుకొచ్చారు అమిత్ షా. కాగా, రాజస్తాన్లో ఈ నెల 25న ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. 200 అసెంబ్లీ స్థానాలున్న రాజస్తాన్లో ఈసారి 199 స్థానాల్లోనే ఎన్నికలు జరగనుండటం గమనార్హం. (చదవండి: నో డౌట్ గహ్లోత్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాదు! మోదీ జోస్యం) -
నో డౌట్ గహ్లోత్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాదు! మోదీ జోస్యం
రాజస్తాన్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇరు పార్టీలు రసవత్తరంగా ప్రచార దూకుడిని పెంచేశాయి. ఎవరికీ వారు తమ పార్టీ గెలుస్తుందని ప్రగాల్బాలు పలుకుతూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం దుంగార్పూర్లోని సగ్వారాలో జరుగుతున్న ప్రచార ర్యాలీలో కాంగ్రెస్పై తారా స్థాయిలో విరుచుకుపడ్డారు. తాను రాజస్తాన్లో ప్రసిద్ధ "మావ్జీ మహారాజ్ జీ!" ఆశీస్సులతో చెబుతున్నా.. కచ్చితంగా మళ్లీ గహ్లోత్ ప్రభుత్వం రానే రాదని జోస్యం చెప్పారు. ఈ పుణ్యభూమిలో ఉన్న గొప్పశక్తే తనను ఇలా అనేలా డేర్ చేయించిందని అన్నారు. తాను చెప్పిన జోస్యం ఫలించేలా రాజస్థాన్ ప్రజలే తిరగ రాయాలని అన్నారు. ఈ మేరకు మోదీ ఆ బహిరంగ ర్యాలీలో గహ్లోత్ ప్రభుత్వంలో జరిగిన పేపర్ లీక్లను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. విద్యా విషయంలో అనుసరిస్తున్న దారుణమైన విధానల వల్లే యువత కలలు కల్లలయ్యాయని అన్నారు. ప్రభుత్వ నియామకాలన్నింటిలోనూ రాష్ట్ర ప్రభుత్వం స్కామ్లకు పాల్పడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ దుష్టపాలన కారణంగానే మీ పిల్లలకు అన్యాయం జరిగిందన్నారు. ప్రజలు కాంగ్రెస్ గ్యారంటీ హామీల మాయలో పడకుండా ఉన్న తరుణంలోనే మోదీ హామీలన్నీ వేగంగా చేరువవ్వడమే గాకుండా రాజస్తాన్ కూడా వేగంగా అభివృద్ధి పథంలోకి దూసుకుపోగలదన్నారు. అందుకోసం అయినా కాంగ్రెస్ని తరిమికొట్టలాని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనను మార్చే శక్తి ప్రజాస్వామ్యానికి ఉంది. ఈ టైంలో మీరు చేసే ఒక్క చిన్నపాటు ఐదేళ్ల పాటు మీకు కష్టాన్ని తెచ్చి పెడుతుందనే విషయాన్ని గుర్తించుకోండి. అంతేగాదు కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ అందేలా కాంగ్రెస్ని దూరం పెట్టడం అనేది అత్యంత ముఖ్యం అని చెప్పారు. రాజస్తాన్లో తమ పథకాలన్నీ అత్యంత వేగంగా అమలు చేస్తాం అని హామీ ఇచ్చారు. నిజానికి కాంగ్రెస్ నాయకులు ఎక్కడకు వెళ్లి ఓటు వేయమని అడుగుతున్నా..ప్రజల నుంచి..ఓట్లు పడవన్నా!.. ఒకే ఒక్క సమాధానం వస్తుందని విమర్శించారు మోదీ. కాగా మూడు రోజుల్లో రాజస్తాన్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా ద్విముఖ హోరాహోరీ పోరు జరిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కానీ వివిధ ప్రాంతీయ చిన్న చిన్న పార్టీల కూడా ఏదోరకంగా తమ ఆధిక్యతను చాటుకోవాలనే యత్నం చేస్తుండటం విశేషం . (చదవండి: "పనౌటీ" దుమారం! మోదీని 'దురదృష్టం'తో పోలుస్తూ వ్యాఖ్యలు!) -
విజయానికి ఏడు హామీలు
రాజస్థాన్లో గత 30 ఏళ్లలో అధికార పార్టీ నెగ్గిన దాఖలా లేదు. ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రభుత్వం మారుతూ వస్తోంది. ఈసారి మాత్రం వరుసగా రెండో విజయంతో చరిత్రను తిరగరాసేందుకు సీఎం అశోక్ గహ్లోత్ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఈ విషయంలో ‘ఏడు హామీ’లపై బాగా ఆశలు పెట్టుకున్నారు. ఆ పథకాలు తనను కచ్చితంగా గట్టెక్కిస్తాయని నమ్ముతున్నారు...! రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పర్వం క్లైమాక్స్కు చేరుతోంది. అధికార కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. పోలింగ్కు మరో మూడు రోజులే ఉంది. గురువారం సాయంత్రంతో ప్రచారానికి కూడా తెర పడనుంది. ఈ నేపథ్యంలో ప్రచారాన్ని సీఎం గహ్లోత్ టాప్ గేర్లోకి తీసుకెళ్లారు. కాంగ్రెస్ తరఫున అంతా తానై వ్యవహరిస్తున్నారు. రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటనలతో హోరెత్తిస్తున్నారు. ఈ రెండు రోజుల్లో వీలైనన్ని అసెంబ్లీ స్థానాలను కవర్ చేయనున్నారు. ముఖ్యంగా మహిళలకు రూ.10 వేల భృతి మొదలుకుని రూ.25 లక్షల వైద్య సాయం దాకా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న, అందించబోయే పథకాలను ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ప్రతి ప్రచార సభలోనూ అవి ప్రధానంగా ప్రస్తావనకు వచ్చేలా జాగ్రత్త పడుతున్నారు. జీవన్మరణ సమస్య! 72 ఏళ్ల గహ్లోత్కు ఒకరకంగా ఈ అసెంబ్లీ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి. గత అసెంబ్లీ ఎన్నికల విజయంలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ యువ నేత సచిన్ పైలట్ను ఈసారి ఆయన పూర్తిగా పక్కన పెట్టారు. కనుక ఫలితాలు ఏ మాత్రం వికటించినా గహ్లోత్ రాజకీయ జీవితానికి తెర పడవచ్చన్న అభిప్రాయముంది. అందుకే కొద్ది రోజులుగా ఆయన దూకుడు పెంచారు. రోజుకు కనీసం నాలుగైదు సభల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఒక్క రోజు ఏకంగా 800 కిలోమీటర్లు పర్యటిస్తున్నారు! తన ఓబీసీ సామాజిక వర్గ మూలాలను కూడా సమయానుకూలంగా ప్రస్తావిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ప్రచార సభలోనూ ప్రధాని మోదీపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఆయన ప్రసంగాల్లో కాంగ్రెస్ పథకాలనే యథాతథంగా కాపీ కొడుతున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు. తమ ఏడు హామీలకు పోటీగా బీజేపీ తెరపైకి తెచ్చిన ‘మోదీ హామీ’లను ఒక్కొక్కటిగా ప్రస్తావిస్తూ, అవన్నీ కాంగ్రెస్ హామీలకు నకళ్లేనని పదేపదే చెబుతున్నారు. ‘‘ఇది బీజేపీకి బాగా మైనస్గా మారుతోంది. ఈసారి కచ్చితంగా గెలుపు కాంగ్రెస్దే. ఓటర్లు ఈ మేరకు నిర్ణయించుకున్నారు కూడా’’ అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రోజూ క్రమం తప్పకుండా స్వీయ ప్రచార వీడియోలను కూడా విడుదల చేస్తూ, అవి వీలైనంత మందికి చేరేలా జ్రాగత్తలు తీసుకుంటున్నారు గహ్లోత్. అధిష్టానం అనుగ్రహం కోసం... రాష్ట్రస్థాయిలో గెలుపు కోసం శాయశక్తులా ప్రయత్నాలు చేస్తూనే, అధిష్టానంతో సంబంధాలను కూడా సరిదిద్దుకునే పనిలో పడ్డారు గహ్లోత్. గతేడాది కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగాల్సిందిగా సోనియా ఆదేశించినా ఆయన బేఖాతరు చేయడం తెలిసిందే. దీనిపై గాంధీ కుటుంబం గుర్రుగా ఉన్న నేపథ్యంలో, వీలు దొరికినప్పుడల్లా సోనియా, రాహుల్, ప్రియాంకలను ఆయన ఆకాశానికెత్తుతూ వస్తున్నారు. రాష్ట్ర ప్రచార పర్వమంతా రాహుల్, ప్రియాంక కనుసన్నల్లోనే జరుగుతోందని పదేపదే చెప్పుకొస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ రాజస్థాన్లో కాంగ్రెస్ ఏడు హామీలు... 1. కుటుంబ పెద్ద అయిన మహిళకు ఏటా రూ.10,000 భృతి 2. ప్రభుత్వ కాలేజీలో చేరే ప్రతి విద్యార్థికి ల్యాప్టాప్ లేదా ట్యాబ్ 3. చిరంజీవి ఆరోగ్య బీమా పథకం ద్వారా రూ.25 లక్షల దాకా వైద్య సాయం. ఇందులో భాగంగా రూ.15 లక్షల ప్రమాద బీమా 4. అందరికీ ఉచితంగా ఇంగ్లిష్ మీడియం విద్య 5. రాష్ట్రంలో కోటి కుటుంబాలకు రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ 6. పాత పెన్షన్ పథకానికి చట్టబద్ధత 7. రైతుల నుంచి రూ.2కు కిలో చొప్పున పేడ కొనుగోలు -
ఆ సీఎం "మాయగాడు"! అతని 'రెడ్ డైరీ'లో ప్రతీ పేజీ..
ప్రధాని నరేంద్ర మోదీ రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గెహ్లోత్ ఓ మాయాగాడు అంటూ ఫైర్ అయ్యారు. అతను రాష్ట్రంలో తుపాకులకే ఎక్కువ పనిచెప్పాడని విమర్శించారు. అతని రెడ్డైరి తన దగ్గరుందని అందులోని ప్రతి పేజీ గురించి చెబితే.. దెబ్బకు గెహ్లోత్ ముఖం మాడిపోవడం ఖాయం అని ఆరోపణలు చేశారు. ఈ మేరకు రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో నేపథ్యంలో బరాసన్ అంటాలో జరిగిన ప్రచారా ర్యాలీలో మోదీ ముఖ్యమంత్రి గెహ్లోత్పై ఈవిధమైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ రెడ్ డైరీలో..ఐదేళ్ల కాంగ్రెస్ పాలనలో రాజస్తాన్లోని ప్రతి భూమి, నీరు, అడవి ఎలా అమ్ముపోయాయో అనే వివరాలు ఉన్నాయని, అందుకు సంబంధించిన పూర్తి డాక్యుమెంటేషన్ తన దగ్గర ఉందన్నారు. ముఖ్యంగా గెహ్లోత్ పాలనలో జరిగిన నేరారోపణలకు సంబంధించిన సమాచారం అంతా ఉందన్నారు . అందుకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవ్వడం గమనార్హం. ఈ సందర్భంగా మోదీ జూలైలో జరిగిన అసెంబ్లీ సమావేశం గురించి గుర్తుకు తెచ్చుకున్నారు. ఆ సమావేశంలో అప్పటి రాష్ట్ర మంత్రి రాజేంద్ర సింగ్ మహిళల భద్రతా అంశాన్ని లెవనెత్తారు. మణిపూర్లో మహిళలపై జరిగిన నేరాల విషయమై ఆత్మపరిశీలన చేసకోవాలని చురకలంటించారు. అంతే ఆ తర్వాత కొన్ని గంటల్లోనే గెహ్లోత్ ప్రభుత్వం ఆయన్ను తొలగించిందంటూ చెప్పుకొచ్చారు. అంతేగాదు ఆయన హాయాంలో జరిగిన అవినీతి గురించి కూడా ప్రస్తావించారు మోదీ. కాంగ్రెస్ అంటే అవినీతి, రాజవంశం, బుజ్జగింపులకు చిహ్నం అంటూ ఎద్దేవా చేశారు. నిజానికి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయ్యింది. ప్రస్తుతం మన ముందు అభివృద్ధి చెందిన భారత్గా తీర్చిదిద్దడమేనదే లక్ష్యం, కానీ రాజస్తాన్ అభివృద్ధి చెందకుండా అభివృద్ధి చెందిన భారత్గా మార్చడమనే లక్ష్యం ఎలా సంపూర్ణమవుతుందన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్కి చిహ్నం అయినా ఆ మూడే.. దేశానికి అతిపెద్ద శత్రువులని, అవి మన మధ్య ఉన్నంతవరకు అభివృద్ధి చెందిన భారత్గా ఎలా మార్చగలం అని నిలదీశారు. ఇంకా మోదీ మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీలోని ప్రతిఒక్కరూ సంయమనం లేనివారనని తిట్టిపోశారు. అది మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఒకేలా ప్రవర్తిస్తారని, ఈ విషయంలో ప్రజలు సైతం చిరాకుపడుతున్నారంటూ చివాట్లు పెట్టారు. కాగా, కరణ్పూర్ కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ కునార్ అకాల మరణంతో ఆ నియోజక వర్గంలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. అందువల్ల 200 అసెంబ్లీ స్థానాలున్న రాజస్తాన్లో ప్రస్తుతం 199 స్థానాలకే అభ్యర్థులు బరిలోకి దిగారు. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 200 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ 99 సీటులు దక్కించుకోగా, బీజేపీ 73 సీట్లు గెలుపొందింది. దీంతో కాంగ్రెస్ పార్టీ చివరికి బీఎస్పీ ఎమ్మెల్యేలు, స్వతంత్రుల మద్దతు కూడగట్టుకుని గెహ్లోత్ని సీఎంగా ప్రమాణం స్వీకారం చేయించింది . (చదవండి: అసెంబ్లీ ఎన్నికల కోసం ఒకే ఎత్తుగడతో ఇరు పార్టీలు! ఏది హిట్ అవుతుందో?) -
Rajasthan Elections 2023: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వరాల జల్లు!
రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఈ మేరకు ఓటర్లను ఆకర్షించేలా మేనిఫెస్ట్పై గట్టిగా ఫోకస్ పెట్టింది. ఈ సారి మేనిఫెస్టోలో కుల గణనతో సహ కీలక హామీలను ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. మంగళవారం అందుకు సంబధించిన పార్టీ మేనిఫెస్టోని విడుదల చేశారు ఖర్గే. కాంగ్రెస్ కంచుకోట అయిన రాజస్తాన్లో మళ్లీ తమ పార్టీ ఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమగా చెప్పారు. అలాగే తాము ఎన్నికల్లో ఇచ్చే ప్రతీ హామీని నెరవేర్చడమే గాక, తాము ఇవ్వగలిగే వాగ్దానాలనే పొందుపరిచామని చెప్పారు. ముఖ్యంగా మహిళలు, అణగారిన వర్గాల సంక్షేమ పథకాలపైనే దృష్టి పెట్టింది. తాము మళ్లీ అధికారంలోకి వస్తే కచ్చితంగా కుల గణన చేస్తామనే కీలక హామీతో ముందుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాగా, ఈ నెల 25న రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. మేనిఫెస్టోలో కీలక హామీలు స్వామినాథన్ కమిషన్ నివేదిక ప్రకారం.. రైతులకు రూ. 2 లక్షల వరకు వడ్డీ లేని రుణం కొత్త పథకం కింద పంచాయతీ స్థాయిలో నియామకాలు , కులగణన హామీ ఇచ్చిన ఏడు గ్యారంటీ హామీలను నెరవేర్చడం తోపాటు పాత పెన్షన్ స్కీమ్ కింది కుటుంబంలో మహిళా పెద్దకు ఏడాదికి రూ. 10 వేలు, రూ. 500లకే ఎల్పీజీ సిలిండర్ తదితర హామీలు. ఏడాదికి రూ. 15 లక్షల కోట్లుగా ఉన్న రాజస్తాన్ ఎకనామీని 2030 కల్లా రూ 30 లక్షల కోట్లుకు చేరుకునేలా చేయడమే లక్ష్యం అని రాజస్తాన్ సీఎం గహ్లోత్ విడుదల చేసిన మేనిఫెస్టోలో తెలిపారు. చిరంజీవి వైద్య భీమా పథకం కవరేజ్ని రూ. 25 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు పెంచారు. Congress winning Rajasthan 🔥 Manifesto,pic.twitter.com/HshYKEDjyM — Ashish Singh (@AshishSinghKiJi) November 21, 2023 (చదవండి: రాజస్థానీలకు కాంగ్రెస్ ఏడు గ్యారంటీలు) -
Rajasthan Election 2023: కాంగ్రెస్కు అవినీతే పరమావధి
జైపూర్: కాంగ్రెస్ పార్టీకి వారసత్వ రాజకీయాలు, అవినీతి మాత్రమే పరమావధి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలతో కూడిన ‘అహంకార కూటమి’కి మహిళా సాధికారత అంటే ఎంతమాత్రం ఇష్టం లేదని అన్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కలి్పంచేందుకు ఉద్దేశించిన బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందడాన్ని ఆ పారీ్టలు జీరి్ణంచుకోలేకపోయానని, మహిళా సాధికారితకు వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించాయని మండిపడ్డారు. మన తల్లులు, సోదరీమణులు గురించి విపక్ష నాయకులు అభ్యంతకర వ్యాఖ్యలు చేశారని ఆక్షేపించారు. బిహార్ అసెంబ్లీలో సాక్షాత్తూ ముఖ్యమంత్రి మహిళలను కించపర్చేలా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ నోరెత్తలేదని విమర్శించారు. కాంగ్రెస్ అసలు రంగును రాజస్తాన్ ప్రజలు గుర్తించారని తెలిపారు. సోమవారం రాజస్తాన్లోని పాలీ, హనుమాన్గఢ్ జిల్లాలో ప్రధాని మోదీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బహిరంగ సభల్లో ప్రసంగించారు. రాజస్తాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాలు చేసిందని, సనాతన ధర్మాన్ని నిర్మూలించడానికి కుట్రలు పన్నిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ను చిత్తుచిత్తుగా ఓడించాలని, బీజేపీని ఆశీర్వదించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వమే రాష్ట్రానికి ఇప్పుడు అవసరమని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో ప్రజల సొమ్ము లూటీ రాజస్తాన్లో దళితులపై అరాచకాలు, వేధింపులు జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని ప్రధాని మోదీ తప్పుపట్టారు. కళ్ల ముందు ఘోరాలు జరుగుతున్నా స్పందించలేదని అన్నారు. రాష్ట్రంలో గత ఐదేళ్లలో అల్లర్లు, ఉగ్రవాదం పెచ్చరిల్లాయని ఆరోపించారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న ఆలోచన తప్ప ప్రజల సంక్షేమం గురించి ఏనాడూ ఆలోచించలేదన్నారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించడం అంటే రాజస్తాన్ సంస్కృతిని నిర్మూలించడమే అవుతుందని తేలి్చచెప్పారు. దేశంలో కాంగ్రెస్ ఎప్పుడు, ఎక్కడ అధికారంలో ఉన్నా సరే అవినీతి, బంధుప్రీతికే అత్యధిక ప్రాధాన్యం దక్కుతుందని అన్నారు. కేంద్రంలో 2014 కంటే ముందు కాంగ్రెస్ పాలనలో లెక్కలేనన్ని కుంభకోణాలు జరిగాయని గుర్తుచేశారు. ప్రజల సొమ్మును విచ్చలవిడిగా లూటీ చేశారని దుయ్యబట్టారు. -
Rajasthan Elections 2023: రాజస్థానీలకు కాంగ్రెస్ ఏడు గ్యారంటీలు
అనుప్గఢ్, రాజస్థాన్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా రాజస్థాన్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏడు గ్యారంటీలను ప్రకటించింది. రాజస్థాన్లోని అనుప్గఢ్లో సోమవారం జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఈ ఏడు హామీలను ప్రకటించారు. కాంగ్రెస్ సామాజిక పథకాలతోపాటు ఆర్థిక సాధికారత దిశగా ఇప్పుడు ప్రకటించిన ఏడు గ్యారంటీలు రాష్ట్రంలో అసమానతలను తొలగించి రాజస్థాన్ను మరింత సంపన్నంగా మారుస్తాయని ఖర్గే పేర్కొన్నారు. ఖర్గే ప్రకటించిన గ్యారంటీల్లో ప్రధానంగా గృహ లక్ష్మి యోజన హామీ కింద కుటుంబంలో మహిళా పెద్దకు ఏటా రూ. 10వేలు, గౌధన్ పథకం కింద పాడి రైతుల నుంచి కిలోకు రూ.2 చొప్పున చెల్లించి ఆవు పేడ కొనుగోలు, ప్రభుత్వ కాలేజీ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్లు, టాబ్లెట్ల పంపిణీ వంటివి ఉన్నాయి. వీటితో పాటు పేద విద్యార్థులకు ఇంగ్లిషు మీడియం విద్య, రూ.500 కంటే తక్కువ ధరకే గ్యాస్ సిలిండర్లు, ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణ హామీలను మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. అంతకుముందు హనుమాన్గఢ్లో ప్రచార ర్యాలీలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే మాట్లాడుతూ దేశంలో భారీ మౌలిక సదుపాయాలు, విద్యాసంస్థలను నిర్మించిన ఇందిరా గాంధీ, జవహర్లాల్ నెహ్రూలను విస్మరించడంపై ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. దేశంలో పెద్ద డ్యామ్ల నుంచి ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీల వరకు అన్నింటినీ కాంగ్రెస్సే నిర్మించిందన్నారు. కాంగ్రెస్ దేశంలో హరిత విప్లవాన్ని తీసుకొస్తే మోదీ ప్రభుత్వం ఈ దేశాన్ని నాశనం చేస్తోందన్నారు. -
Rajasthan Elections 2023: కోట్లకు పడగలెత్తారు
సాక్షి, న్యూఢిల్లీ: రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థుల్లో ఏకంగా 35 శాతం మంది కోటీశ్వరులే! బరిలో నిలిచిన 1,875 మంది అభ్యర్థుల అఫిడవిట్లను విశ్షించి అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారమ్స్ (ఏడీఆర్), రాజస్తాన్ ఎలక్షన్ వాచ్ ఈ మేరకు తేల్చాయి. వారి ఆస్తులు, క్రిమినల్ కేసుల వివరాలతో శనివారం నివేదిక విడుదల చేశాయి. బీజేపీ, కాంగ్రెస్ల్లో కోటీశ్వరులదే హవా ఏడీఆర్ నివేదిక ప్రకారం రాజస్తాన్లో బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 651 (35%) మంది కోటీశ్వరులున్నారు. ప్రధాన పారీ్టలు కాంగ్రెస్, బీజేపీ కూడా వారికే ఎక్కువగా టికెట్లిచ్చాయి. మొత్తం 200 అసెంబ్లీ స్థానాకలు గాను బీజేపీ నుంచి 176 మంది, కాంగ్రెస్ నుంచి 167 మంది రూ.కోటికి మించి ఆస్తులు ప్రకటించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 29 మంది, బీఎస్పీ నుంచి 36 మంది కూడా కోటీశ్వరులే. చురు కాంగ్రెస్ అభ్యర్థి రఫీక్ మండేలియా రూ.166 కోట్లతో అందర్లోనూ సంపన్నుడిగా నిలిచారు. రూ.123 కోట్లతో నీమ్ కా థానా బీజేపీ అభ్యర్థి ప్రేమ్ సింగ్ బజోర్ రెండో స్థానంలో ఉన్నారు. అయితే 8 అభ్యర్థులు తమకు ఒక్క రూపాయి ఆస్తి కూడా లేదని పేర్కొనడం విశేషం. 922 మంది తమకు అప్పులున్నట్టు వెల్లడించారు. ఇక 326 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులున్నాయి. బీజేపీ 61 మందికి, కాంగ్రెస్ 47, ఆప్ 18, బీఎస్పీ 12 మంది నేర చరితులకు టికెట్లిచ్చాయి. క్రిమినల్ కేసులున్న ముగ్గురు, అంతకంటే ఎక్కువ మంది బరిలో ఉన్న రెడ్ అలర్ట్ నియోజకవర్గాలు రాష్ట్రంలో 45 ఉన్నాయి. 643 మంది, 34 శాతం మంది అభ్యర్థులు 25–40 ఏళ్ల మధ్య వయస్కులు. 80 ఏళ్ల పై చిలుకు అభ్యర్థులు 8 మంది ఉన్నారు. 183 మంది, అంటే 10 శాతం మంది పోటీలో ఉన్నారు. 137 మంది అభ్యర్థులు కేవలం అక్షరాస్యులు కాగా 11 మంది నిరక్షరాస్యులమని ప్రకటించారు. కోటీశ్వరుల్లో చాలామంది కోట్లలో అప్పు కూడా చూపించారు. -
Rajasthan Assembly elections 2023: పతుల కోసం సతుల ఆరాటం
సాక్షి, న్యూఢిల్లీ: రాజస్తాన్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. గెలుపే లక్ష్యంగా పైచేయి సాధించేందుకు అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రచారపర్వంలో కేవలం అభ్యర్థులు మాత్రమే కాకుండా వారి కుటుంబసభ్యులు సైతం ప్రజల మద్దతు కూడగట్టుకొనేందుకు ఇల్లిల్లూ తిరుగుతున్నారు. దక్షిణ రాజస్తాన్లోని ఉదయ్పూర్తో పాటు మేవాడ్, వగడ్ ప్రాంతాలలోని రాజ్సమంద్, చిత్తోడ్గఢ్, దుంగార్పూర్, బాన్స్వాడా, ప్రతాప్గఢ్ల్లోని 28 అసెంబ్లీ స్థానాల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఏడుగురికి ఇద్దరు భార్యలున్నారు. వారంతా భర్తల గెలుపు కోసం ప్రచారంలో బిజీగా ఉన్నారు. ప్రతాప్గఢ్లో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు ఇద్దరేసి భార్యలున్నారు. ఈ అభ్యర్థుల భార్యలిద్దరూ ఇటీవల జరిగిన కర్వా చౌత్ పండుగను కలిసి ఉత్సాహంగా జరుపుకున్నారు. అంతేగాక ఇటీవల దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లోనూ ఈ ఏడుగురు అభ్యర్థులందరూ తమ ఇద్దరు భార్యల గురించి పేర్కొన్నారు. వీరిలో ఉదయ్పూర్ జిల్లాలోని వల్లభ్నగర్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ఉదయ్లాల్ డాంగి, ఖేర్వారా నుంచి కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ దయారామ్ పర్మార్, ఝాడోల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి హీరాలాల్ దరంగి, ప్రతాప్గఢ్ జిల్లాలోని ప్రతాప్గఢ్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి హేమంత్ మీనా, కాంగ్రెస్ అభ్యర్థి రాంలాల్ మీనాల భార్యలు పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో ప్రజల మధ్యకు వెళ్లి తమ తమ భర్తలకు అనుకూలంగా మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంతేగాక వగడ్ ప్రాంతంలోని బాన్స్వాడా జిల్లా గర్హి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి కైలాశ్ చంద్ర మీనా, ఘటోల్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నానాలాల్ నినామాకు కూడా ఇద్దరేసి భార్యలు ఉన్నారు. హిందూ వివాహ చట్టం ప్రకారం ఒక వివాహం మాత్రమే చెల్లుబాటు అయినప్పటికీ, రాజస్తాన్ గిరిజనులలో బహుభార్యత్వం ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. -
Rajasthan Assembly elections 2023: అల్లర్లు, అవినీతిలో రాజస్తాన్ టాప్
జైపూర్: నేరాలు, అవినీతి, అల్లర్లలో రాజస్తాన్ను కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలోనే అగ్రస్థానంలోకి తీసుకెళ్లిందని ప్రధాని మోదీ ఎద్దేవాచేశారు. శనివారం రాజస్తాన్లోని భరత్పూర్, నాగౌర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో మోదీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి గెహ్లాత్పై విమర్శలు ఎక్కుపెట్టారు. ‘ ఓవైపు విశ్వవిజేతగా భారత్ ప్రభవిస్తోంది. మరోవైపు రాజస్తాన్లో ఏం జరుగుతోందో మీకందరికీ తెల్సిందే. అల్లర్లు, నేరాల నమోదులో రాజస్తాన్ అగ్రపథంలో దూసుకుపోతోంది. బుజ్జగింపు రాజకీయాల కారణంగా సంఘ విద్రోహ శక్తులు స్వైరవిహారం చేస్తున్నాయి. అందుకే ఈసారి మీకు ఓట్లు వేయబోము అని మెజీషియన్కు ఓటర్లు చెప్పేశారు. ఈసారి ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అదృశ్యమవుతుంది. డిసెంబర్ మూడున కాంగ్రెస్ మాయమవడం ఖాయం’’ అని గెహ్లోత్నుద్దేశిస్తూ మోదీ విమర్శించారు. చిన్నతనంలో తండ్రికి సాయపడుతూ గెహ్లోత్ మెజీషియన్గా దేశపర్యటన చేసిన సంగతి తెల్సిందే. ఈనెల 25వ తేదీన రాష్ట్రంలో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ మూడో తేదీన ఫలితాలు ప్రకటిస్తారు. వారెక్కడుంటే నేరాలు అక్కడ ‘ ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాలు కొలువుతీరాయో అక్కడ నేరగాళ్లు, ఉగ్రవాదులు, అల్లర్లు పెరిగిపోతున్నాయి. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలకు పెట్టిందిపేరు. ప్రజల జీవితాలను పణంగా పెట్టేందుకు ఎంతగా దిగజారేందుకైనా కాంగ్రెస్ సిద్ధం. అవినీతి పరాకాష్టకు చేరింది. ఈ ఐదేళ్ల కాంగ్రెస్ హయాంలో మహిళలు, దళితులపై నేరాలు ఎక్కువయ్యాయి. హోలీ, శ్రీ రామనవమి, హనుమాన్ జయంతి.. ఏ పర్వదినమైనా సరే రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా పండుగ జరుపుకున్నదే లేదు. ఎప్పుడూ అల్లరిమూకల దాడులు, ఘర్షణలు, వివాదాలు, కర్ఫ్యూ.. ఇవే రాజస్తాన్లో దర్శనిమిచ్చాయి. మహిళలు అబద్ధపు రేప్ కేసులు పెడుతున్నారని స్వయంగా సీఎం వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యక్తి మహిళలను రక్షిస్తారా?. ఈయనకు ఒక్క నిమిషమైనా సీఎం కుర్చీలో కూర్చొనే హక్కు ఉందా?’’ అని మోదీ మండిపడ్డారు. ‘మగాళ్లు ఉన్న రాష్ట్రం కాబట్టే రాజస్తాన్లో రేప్లు ఎక్కువ అంటూ మంత్రి శాంతికుమార్ ధరివాల్ మాట్లాడతారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే నేతలు ఉన్నందుకు కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడాలి. అసెంబ్లీలో ఇంత దారుణంగా మాట్లాడినా ఈ మంత్రిపై ఎలాంటి శిక్షలు లేవు. ఎందుకంటే సీఎం రహస్యాలు ఈయనకు తెలుసు మరి. పైగా ఈయనకు రివార్డ్గా టికెట్ దక్కింది’’ అంటూ మోదీ వ్యాఖ్యానించారు. దళితుడు ఉన్నతాధికారి కావడం ఇష్టం లేదు ‘‘ దళితులపై కాంగ్రెస్ వివక్ష చూపుతోంది. డీగ్ జిల్లాకు చెందిన హీరాలాల్ సమరియా ప్రధాన సమాచార కమిషనర్(సీఐసీ)గా బాధ్యతలు చేపట్టారు. ఆ పదవి స్వీకరించిన తొలి దళితుడు ఆయన. ఈయన ఎంపిక సమావేశాన్ని కాంగ్రెస్ బాయ్కాట్ చేసింది. దళిత అధికారి అంతటి ఉన్నతస్థాయికి చేరుకోవడం కాంగ్రెస్కు ఇష్టంలేదు. రాష్ట్రంలో నిత్యావసర సరకులు, ఇంధన ధరల పెరుగుదలకు గెహ్లోత్ సర్కారే కారణం. పొరుగు ఉన్న రాష్ట్రాల్లో కంటే రాజస్తాన్లో లీటర్ పెట్రోల్ రూ.12 ఎక్కువ ధర. మేం అధికారంలోకి రాగానే ధరలను సమీక్షించి, సవరిస్తాం’’ అని మోదీ హామీ ఇచ్చారు. -
Rajasthan elections 2023: మియో వర్సెస్ ‘రక్షక్’
రాజస్తాన్లోని ఆళ్వార్ జిల్లా ఆవుల స్మగ్లింగ్, సంబంధిత హింసాకాండతో గతంలో చాలాసార్లు వార్తల్లో నిలిచింది. మత ఘర్షణలు కూడా అక్కడ పరిపాటి. ఈ నేపథ్యంలో ఆవులను కాపాడేందుకు అక్కడ కొన్నేళ్లుగా గో రక్షకులు కూడా తెరపైకి రావడంతో పరిస్థితి కాస్తా ముదురు పాకాన పడింది. స్థానిక మియో ముస్లింలు ఆవులను లక్ష్యంగా చేసుకున్నారన్నది వారి ఆరోపణ. కానీ ఆవుల స్మగ్లింగ్, వధతో తమకు ఎలాంటి సంబంధమూ లేదని ముస్లింలు వాదిస్తున్నారు. నవంబర్ 25న రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీల పట్ల వారిలో భిన్న స్పందన వ్యక్తమవుతోంది. నిత్యం తమపై బురదజల్లడం బీజేపీ నైజమని మియో ముస్లింలు ఆవేదన వ్యక్తం చేస్తుండగా కమలం పారీ్టయే రాష్ట్రానికి ఆశా కిరణమన్నది గో రక్షకుల అభిప్రాయంగా కని్పస్తోంది. బీజేపీ అలా.. కాంగ్రెస్ ఇలా...! మియో ముస్లింలకు ప్రధానంగా పశు పోషణే జీవనాధారం. అభివృద్ధి, మెరుగైన ఉపాధి లభిస్తే తప్ప తమ జీవితాల్లో మార్పు రాబోదన్న నిశి్చతాభిప్రాయం వారి మాటల్లో ప్రతిఫలిస్తోంది. ఈ ముస్లిం ప్రాబల్య గ్రామాలు చాలావరకు వెనకబడే ఉన్నాయి. రోడ్ల వంటి మౌలిక వసతులు, స్కూళ్లు తదితర సదుపాయాలకు దూరంగా ఉండిపోయాయి. బీజేపీ నిత్యం తమను దోషుల్లా చిత్రిస్తుందన్నది వారి ప్రధాన ఆవేదన. ‘‘అందుకే మా జీవితాలను ఎంతో కొతం మెరుగు పరుస్తుందని పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేశాం. కానీ ఐదేళ్లయినా ఏ మార్పూ లేదు’’ అంటూ మొహమ్మద్ రఫీక్ వాపోయాడు. ‘‘ఓ 30 ఏళ్ల క్రితం దాకా మతపరమైన సమస్యలేవీ పెద్దగా ఉండేవి కాదు. హిందువులు, మేం కలసిమెలసి బతికేవాళ్లం. కానీ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం మొదలయ్యాక పరిస్థితులు బాగు చేయలేనంతగా పాడయ్యాయి’’ అని అన్సారీ అనే వృద్ధుడు ఆవేదన వెలిబుచ్చాడు. గూండాలన్నా పట్టించుకోం! ఇక గో రక్షకుల వాదన మరోలా ఉంది. సనాతన ధర్మంలో గోవును మాతగా పూజించడం సంప్రదాయం. వాటికి అవమానం, ప్రాణాపాయం జరిగితే ఊరుకునేది లేదు’’ అని ఒక గో రక్షక్ స్పష్టం చేశారు. ‘‘నేను ఎనిమిదేళ్లుగా గో రక్షక్గా ఉంటున్నా. మాపై దొంగలు, బందిపోట్లు అని ముద్ర వేశారు. గూండాలని కూడా నిందిస్తున్నారు. అయినా దేనికీ భయపడేది లేదు’’ అని చెప్పుకొచ్చారు. ‘‘ఆవుల స్మగ్లర్లు పోలీసుల సమక్షంలోనే మాపై దాడులకు దిగుతున్నా అడ్డుకునే దిక్కు లేదు. ఎప్పుడు ఏ కారును ఆపినా ఆవుల కళేబరాలే కని్పస్తున్నాయి. మేమెలా సహించేది?’’ అని ప్రశ్నించారాయన. ముస్లిం సంతుïÙ్టకరణతో కూడిన పేరు గొప్ప సోదరభావం తమకు అక్కర్లేదని మరో గో రక్షక్ స్పష్టం చేశారు. మత రాజకీయాలు ‘వారికి’ అలవాటేనని ఆరోపించారు. పరిస్థితిని చక్కదిద్దాలంటే బీజేపీ రావాల్సిందేనని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్పై అసంతృప్తి అయితే కులమతాలతో నిమిత్తం లేకుండా ఆళ్వార్ ప్రజల్లో చాలామంది కాంగ్రెస్ పాలన పట్ల పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా తమ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలూ జరగలేదన్నది వారి ప్రధాన ఆరోపణ. కాంగ్రెస్ నేతల మాటలు చేతల్లో ఎక్కడా కని్పంచలేదని వారు వాపోతున్నారు. ‘‘అందుకే కాంగ్రెస్కు మరోసారి ఓటేయాలని లేదు. అలాగని చూస్తూ చూస్తూ మమ్మల్ని అడుగడుగునా అనుమానించి అవమానిస్తున్న బీజేపీకి ఓటేయలేం. మా పరిస్థితి అయోమయంగానే ఉంది’’ అని స్థానిక ముస్లిం యువకుడొకరు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఈసారి మియో ముస్లింలు ఎవరికి ఓటేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Rajasthan Assembly elections 2023: బీజేపీ గుండెల్లో రె‘బెల్స్’
రాజస్తాన్లో తిరుగుబాటు నేతలు బీజేపీకి దడ పుట్టిస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి తీవ్ర నష్టం చేసిన చరిత్ర వారిది! ఆ ఎన్నికల్లో చివరి క్షణంలో పార్టీ మొండి చేయి చూపడంతో ఆగ్రహించి డజను మంది నేతలు స్వతంత్రులుగా బరిలో దిగారు. తాము ఓడటమే గాక బీజేపీ అభ్యర్థులను కూడా ఓడించి కాంగ్రెస్ నెత్తిన పాలు పోశారు. అదే సమయంలో 2018లో కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడి తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీ చేసిన 13 మందిలో ఏకంగా 12 మంది విజయం సాధించడం విశేషం. పైగా ఫలితాలు వెలువడగానే వారంతా కాంగ్రెస్ గూటికే చేరుకున్నారు. అలా నికరంగా ఆ పార్టీకి పెద్దగా నష్టమేమీ జరగలేదు. ఈసారి కూడా రెండు పార్టీల నుంచీ రెబెల్స్ రంగంలో ఉన్న నేపథ్యంలో వారు ఎవరికి చేటు చేస్తారోనన్న చర్చ జరుగుతోంది...! రాజస్తాన్లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 830 మంది స్వతంత్రులు పోటీ చేశారు. వారిలో 13 మంది కాంగ్రెస్, 12 మంది బీజేపీ నేతలున్నారు. పార్టీ టికెట్ దక్కకపోవడంతో వారు తిరుగుబావుటా ఎగరేశారు. కాంగ్రెస్ రెబెల్స్లో ఏకంగా 12 మంది గెలవడమే గాక ఆ వెంటనే కాంగ్రెస్లో చేరారు. ఈసారి వారిలో 10 మందికి సీఎం అశోక్ గహ్లోత్ కాంగ్రెస్ టికెట్లు కూడా ఇప్పించారు. మరోవైపు 12 మంది బీజేపీ రెబల్స్లో ఒక్కరు కూడా నెగ్గలేదు. కుల్దీప్ ధన్ఖడ్, దేవీసింగ్ షెకావత్, ధన్సింగ్ రావత్, హేమ్సింగ్ భడానా వంటి పెద్ద నాయకులు కూడా రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. కాకపోతే ఈ 12 మందీ తమ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులందరినీ ఓడించారు. అలా రెబెల్స్ దెబ్బకు బీజేపీ బాగా నష్టపోయింది. బీజేపీకి 73 సీట్లు రాగా కాంగ్రెస్ 100 స్థానాల్లో నెగ్గడం తెలిసిందే. 2013లో కూడా కాంగ్రెస్ రెబెల్స్లో చాలామంది నెగ్గగా బీజేపీ తిరుగుబాటు అభ్యర్థుల్లో అత్యధికులు ఓటమి చవిచూశారు. ఈసారి కూడా రాష్ట్రంలో ఏకంగా 737 మంది స్వతంత్ర అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్నారు. వీరిలో బీజేపీ, కాంగ్రెస్ టికెట్లు ఆశించి భంగపడ్డ వారూ పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. మొత్తమ్మీద 18 మంది బీజేపీ రెబెల్స్, 14 మంది కాంగ్రెస్ రెబెల్స్ స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు. వీరి ప్రభావం ఆ పారీ్టలపై ఎలా ఉంటుందన్నది ఫలితాల అనంతరమే తేలనుంది. రాష్ట్రంలో నవంబర్ 25న పోలింగ్ జరగనుంది. ఫలితాలు మిగతా 4 రాష్ట్రాలతో పాటు డిసెంబర్ 3న వెల్లడవుతాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Rajasthan: బీజేపీ మేనిఫెస్టో విడుదల.. ఇది అభివృద్ధికి రోడ్మ్యాప్: నడ్డా
జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోను ప్రకటించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా 'సంకల్ప్ పత్ర' పార్టీ మేనిఫెస్టోని జైపూర్లో గురువారం విడుదల చేశారు. మేనిఫెస్టోలో ప్రధానంగా ప్రకటించిన హామీలు ఇలా ఉన్నాయి.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి: ఈ పథకం కింద రైతులకు అందించే ఆర్థిక సహాయాన్ని సంవత్సరానికి రూ. 12,000 లకు పెంచుతామని పార్టీ ప్రకటించింది. లాహో ఇన్సెంటివ్ స్కీమ్: ఈ పథకం పేద కుటుంబాల్లో బాలికలకు ఆర్థిక చేయూతను అందిస్తుంది. దీని కింద బాలికలు పుట్టినప్పుడు పొదుపు బాండ్ అందిస్తారు. ఈ బాండ్ కాలక్రమేణా మెచ్యూర్ అవుతూ వస్తుంది. బాలిక ఆరో తరగతికి రాగానే రూ.26,000, తొమ్మిదో తరగతిలో రూ.18,000, పదో తరగతిలో రూ.10,000, 11వ తరగతిలో రూ.12,000, 12వ తరగతిలో రూ.14,000 అందజేస్తారు. ఇక వృత్తి విద్యలోకి అడుగుపెట్టాక రెండేళ్లలో రూ.50,000, 21 ఏళ్లు రాగానే రూ. 1 లక్ష చొప్పున అందిస్తారు. ప్రత్యక్ష నగదు బదిలీ: దీని కింద ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల విద్యార్థులు స్కూల్ బ్యాగ్లు, పుస్తకాలు, యూనిఫాంలను కొనుగోలు చేయడానికి ఏటా రూ. 1,200 ఆర్థిక సాయం అందిస్తారు. భామాషా హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్: ఆరోగ్య మౌలిక సదుపాయాల విస్తరణ, ఆధునీకరణ లక్ష్యంగా ఈ మిషన్లో రూ.40,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు బీజేపీ ప్రకటించింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్: పేపర్ లీక్ కేసులను త్వరితగతిన విచారించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. అభివృద్ధికి రోడ్మ్యాప్ మేనిఫెస్టో విడుదల సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ మేనిఫెస్టో అనేది ఇతర పార్టీలకు నామమాత్రపు వ్యవహారమని, కానీ బీజీపీ మేనిఫెస్టో అభివృద్ధికి రోడ్మ్యాప్గా పనిచేస్తుందని పేర్కొన్నారు. అలాగే గత ఐదేళ్లలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టారు. రాజస్థాన్లో నవంబర్ 25న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 2013 శాసనసభ ఎన్నికల్లో బీజేపీ 163 సీట్లు గెలుచుకుని రాజస్థాన్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 200 మంది సభ్యులున్న సభలో కాంగ్రెస్ 99 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 73 సీట్లు గెలుచుకుంది. చివరికి బీఎస్పీ ఎమ్మెల్యేలు, స్వతంత్రుల మద్దతుతో గెహ్లాట్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. -
భార్యాభర్తల నుంచి బావామరదళ్ల దాకా.. బరిలో బంధువులు
ఒకచోట భార్యాభర్తలు. మరోచోట బావా మరదళ్లు. ఇంకొన్ని స్థానాల్లో బాబాయ్–అబ్బాయ్–అమ్మాయ్. మరో దగ్గరేమో తండ్రీకూతుళ్లు. రాజస్తాన్లో అసెంబ్లీ ఎన్నికల పోరు ఇలాంటి ఆసక్తికర సన్నివేశాలకు వేదికవుతోంది. పలు స్థానాల్లో బంధువుల మధ్య జరుగుతున్న ఈ పోటీలు రసవత్తరంగా మారుతున్నాయి...! రక్త సంబంధీకులు, దగ్గరి బంధువుల పరస్పర పోట్లాటలు రాజస్తాన్లో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ఇటువంటి స్థానాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ఎంతో ఆసక్తి కలిగిస్తున్నాయి. దాంతారాంగఢ్: భార్యాభర్తల పోరు ఈ స్థానం రాష్ట్రవ్యాప్త ఆసక్తికి కారణమైంది. ఇక్కడ కాంగ్రెస్ తరఫున వీరేంద్ర సింగ్ బరిలో ఉన్నారు. ఆయనపై ఏకంగా భార్య రీటా పోటీ చేస్తున్నారు. జన్ నాయక్ జనతా పార్టీ తరఫున ఆమె బరిలో ఉన్నారు. వీరేంద్ర తండ్రి నారాయణ్ సింగ్ కాంగ్రెస్ అగ్రనేత కావడం విశేషం. 2018లో ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారు. కుమారుడికి టికెట్ ఇప్పించి గెలిపించుకున్నారు. అయితే వీరేంద్రకు కొంతకాలంగా భార్యతో గొడవలు ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏడాదిగా వారు విడిగా ఉంటున్నారు. ఎన్నికలు సమీపించగానే రీటా ఏకంగా భర్తపైనే బరిలో దిగారు! ధోల్పూర్: గోదాలో బావామరదళ్లు ఇక్కడ బీజేపీ తరఫున శివచరణ్ కుష్వహా పోటీ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ ఏకంగా ఆయన మరదలు శోభారాణీకి టికెటిచ్చి బరిలో దించింది. చదవండి: ఎన్నికల బరిలో వారసులు ఆళ్వార్ (గ్రామీణ): తండ్రీ కూతుళ్ల సవాల్ ఇక్కడ బీజేపీ జయరామ్ జాటవ్కు టికెటిచ్చింది. ఆయనతో విభేదాల నేపథ్యంలో కుమార్తె మీనాకుమారి ఏకంగా ఇండిపెండెంట్గా బరిలోకి దిగి తండ్రినే సవాలు చేస్తున్నారు! ఇద్దరు పరస్పరం జోరుగా విమర్శల వర్షం కురిపించుకుంటూ ఓటర్లకు యథాశక్తి వినోదం పంచుతున్నారు. బాబాయ్–అబ్బాయ్–అమ్మాయ్ భాద్రా అసెంబ్లీ స్థానంలో బీజేపీ నుంచి సంజీవ్ బెనీవాల్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరఫున ఆయన అన్న కుమారుడు అజిత్ బెనీవాల్ బరిలో దిగి బాబాయ్ని సవాలు చేస్తున్నారు. ఖెత్డీ అసెంబ్లీ స్థానంలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ కాంగ్రెస్ నుంచి మనీషా గుజ్జర్ పోటీలో ఉన్నారు. బీజేపీ తరఫున ఆమె బాబాయ్ ధర్మపాల్ బరిలో దిగారు. నాగౌర్లో బీజేపీ నుంచి జ్యోతీ మీర్ధా పోటీ చేస్తుంటే కాంగ్రెస్ తరఫున ఆమెకు బాబాయ్ వరసయ్యే హరేంద్ర మీర్ధా బరిలో ఉన్నారు. సోజత్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ నుంచి పీసీసీ ప్రధాన కార్యదర్శి నిరంజన్ ఆర్య బరిలో ఉన్నారు. బీజేపీ తరఫున ఆయన బంధువు శోభా చౌహాన్ పోటీలో దిగారు. ఐఏఎస్ వర్సెస్ ఐపీఎస్ బస్సీ అసెంబ్లీ స్థానంలో మరో రకం పోటీ నెలకొంది. మాజీ ఐఏఎస్ చంద్రమోహన్ మీనా బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరఫున ఆయనపై పోటీ చేస్తున్న లక్ష్మణ్ మీనా మాజీ ఐపీఎస్ అధికారి కావడం విశేషం. పైగా వీరిద్దరూ బంధువులే. నా కుమారుడికి ఓటు వేయొద్దు! ఖండార్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ తరఫున అశోక్ బైర్వా బరిలో ఉన్నారు. తండ్రి డాల్చంద్తో ఆయనకు చాలాకాలంగా వివాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘నా కొడుక్కు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటేయకండి’ అంటూ డాల్చంద్ జోరుగా ప్రచారం చేస్తుండటం విశేషం. దాంతో ఏమీ చేయలేక అశోక్ తలపట్టుకుంటున్నారు. -
ఎన్నికల్లో ఓడిపోతే మళ్లీ ఉద్యోగం
జైపూర్: రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రభుత్వ డాక్టర్ దీపక్ ఘోగ్రా(43)కు రాష్ట్ర హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. ఒకవేళ ఎన్నికల్లో ఓడిపోతే ఆయన మళ్లీ ఉద్యోగంలో చేరడానినికి అంగీకరించింది. దీపక్ భారతీయ ట్రైబల్ పార్టీ టికెట్పై దుంగార్పూర్ స్థానం నుంచి పోటీకి దిగుతున్నారు. పరాజయం పాలైతే ఉద్యోగంలో చేర్చుకోవాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు సానుకూలంగా స్పందించింది. ఎన్నికల్లో దీపక్ ఓడిపోతే మళ్లీ ఉద్యోగంలో చేర్చుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. -
Rajasthan Election 2023: గహ్లోత్కు సొంతింట సమస్యలు
సర్దార్పురా. కాంగ్రెస్ పాలిత రాజస్థాన్లో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న స్థానం. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ప్రాతినిధ్యం వహిస్తున్న సర్దార్పురాలో ఎన్నెన్నో సమస్యలు సీఎంను చీకాకు పెడుతున్నట్టు వస్తున్న వార్తలు కాంగ్రెస్ పార్టీని కలవరపరిచేవే. వాటిని హైలైట్ చేస్తూ, సీఎం సెగ్మెంట్లోనే సమస్యల పరిష్కారానికి దిక్కు లేదంటూ బీజేపీ రాష్ట్రమంతటా ప్రచారాన్ని హోరెత్తిస్తోంది.. సర్దార్పురా అసెంబ్లీ స్థానం రాజస్తాన్లో గత పాతికేళ్ల నుంచీ అందరి నోళ్లలోనూ నానుతూ వస్తోంది. సీఎం అశోక్ గెహ్లోత్ ఇక్కణ్నుంచి తొలిసారి 1998లో ఉప ఎన్నికలో నెగ్గారు. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పీసీసీ చీఫ్గా ఆయన సారథ్యంలో కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. 200 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా 153 సీట్లు గెలుచుకుంది. దాంతో గెహ్లోత్ తొలిసారి సీఎం పీఠమెక్కారు. అప్పటినుంచీ ఇక్కడ వరుసగా ఆయనే గెలుపొందుతూ వస్తున్నారు. సర్దార్పురాలో కాంగ్రెస్ మొత్తమ్మీద 8సార్లు నెగ్గగా రెండుసార్లు బీజేపీ గెలిచింది. గెహ్లోత్ తొలిసారి నెగ్గేందుకు ముందు 1990, 1993ల్లో బీజేపీ తరఫున రాజేంద్ర గెహ్లోత్ ఇక్కడ రెండుసార్లు గెలిచారు. 1998 నుంచి అశోక్ గెహ్లోత్ హవాయే సాగుతూ వస్తోంది. 2008లో బీజేపీ నుంచి మరోసారి బరిలో దిగిన రాజేంద్ర గెహ్లోత్ 15 శాతానికి పైగా ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇక 2013, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ శంభుసింగ్ ఖేత్సర్ను బరిలో దించినా లాభం లేకపోయింది. గెహ్లోత్ చేతిలో ఆయన వరుసగా 13 శాతం, 30 శాతానికి పైగా ఓట్ల తేడాతో ఓడారు. అయినా... స్వయంగా సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్నా తమ సమస్యలకు మాత్రం ఎండ్ కార్డు పడటం లేదన్నది సర్దార్పురా వాసుల ఆవేదన. వానాకాలం వస్తే చాలు, ఎక్కడ చూసినా నీరు నిలిచిపోయి తమ బతుకు దుర్భరమవుతుందని శివ్సింగ్ రాథోడ్ అనే స్థానికుడు వాపోయాడు. ‘‘రోడ్లు దారుణంగా ఉన్నాయి. డ్రైనేజీ అవ్యవస్థ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ప్రతి వానాకాలంలోనూ డ్రైనేజీలు పొంగిపొర్లడం, రోడ్లన్నీ నీటితో నిండిపోవడం నియోజకవర్గంలో చాలాచోట్ల సాధారణ దృశ్యం. సీఎం సెగ్మెంట్లోనే ఇలాంటి సమస్యలకు దశాబ్దాలుగా మోక్షం దక్కకపోవడం నిజంగా దారుణం’’అన్నాడాయన. కాలనీలే మునిగాయి...! 2021 వర్షాకాలంలోనైతే డ్రైనేజీలు పొంగి పొర్లి సర్దార్పురా పట్టణంలో కాలనీలకు కాలనీలే నీట మునిగాయి! దాంతో సహాయక చర్యల కోసం ఏకంగా సైన్యాన్ని రంగంలోకి దించాల్సిన పరిస్థితి తలెత్తింది!! రెండేళ్లు గడిచిపోయినా సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ఒక్క చర్య కూడా తీసుకోలేదని గోపాల్సింగ్ అనే స్థానికుడు ఆవేదన వెలిబుచ్చాడు. నియోజకవర్గంలో చాలాచోట్ల డ్రైనేజీ నీళ్లతోనే కూరగాయలు పండిస్తున్నారంటూ రాథోడ్ ఆందోళన వెలిబుచ్చాడు. ఇది చాలా ఏళ్లుగా జరుగుతున్నా యంత్రాంగం పట్టించుకోవడం లేదన్నది స్థానికుల ఫిర్యాదు. గెహ్లోత్ కేవలం తన సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న కొన్ని ప్రాంతాలకు మాత్రమే అభివృద్ధిని పరిమితం చేయడమే ఈ సమస్యకు మూల కారణమని బీజేపీ ఆరోపిస్తోంది. మాలీలే ఎక్కువ... సర్దార్పురాలో మాలీ సామాజికవర్గం వారి సంఖ్య చాలా ఎక్కువ. తర్వాతి స్థానంలో ఓబీసీలుంటారు. ఇక జాట్లు, మహాజన్లు, ఎస్సీ, మైనారిటీలూ ఎక్కువగానే ఉన్నారు. చదవండి: జడ్జీలను ‘ఎంచు’కుంటోంది: కేంద్రంపై సుప్రీం మండిపాటు సర్దార్పురా అసెంబ్లీ స్థానం విశేషాలు.. జోధ్పూర్ జిల్లా నట్టనడుమ ఉన్న అసెంబ్లీ స్థానమిది. మహరాజు సర్దార్సింగ్ పేరిట దీనికి ఈ పేరొచ్చింది. ఇక్కడ ఆరు శతాబ్దాల నాటి మెహ్రాన్గఢ్ కోట ఉంది. దాని పక్కనే 300 ఏళ్ల కింద సర్దార్సింగ్ నిర్మించిన ఘంటా ఘర్ ఇప్పటికీ ఉంది. ఆ పక్కనే ఉన్న సర్దార్ మార్కెట్ కూడా ఆయన హయాంలో వచి్చనదే. సర్దార్పురా.. సమస్యల చిట్టా... రాజస్తాన్లోని అతి పెద్ద అసెంబ్లీ స్థానాల్లో సర్దార్పురా ఒకటి. స్వయానా సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం. అయినా ఇక్కడ సమస్యలకు మాత్రం కొదవ లేదు...! ► అధ్వానమైన రోడ్లు ► దారుణమైన డ్రైనేజీ వ్యవస్థ ► తీవ్రమైన తాగునీటి సమస్య ► వాననీరు పోయే ఏర్పాట్ల లేమి ► ప్రతి సీజన్లోనూ నీట మునిగే కాలనీలు ►ఆరోగ్య సేవలు, వసతులకు తీవ్ర కొరత ►కలుషిత నీటితో పంటల సాగు ♦ మొత్తం ఓటర్లు 2,54,572 మంది ♦పురుషులు1,29,869 మంది ♦ స్త్రీలు1,24,703 మంది ♦మొత్తం పోలింగ్ కేంద్రాలు - 212 ♦పోలింగ్ తేదీ నవంబర్ 25 చదవండి: ధుంధాడ్లో దూకుడెవరిదో! -
రాజస్థాన్: ఎపుడూ డిపాజిట్ దక్కలే.. అయినా తగ్గేదేలే!
Rajasthan Assembly Elections 2023: రాజస్థాన్ ఎన్నికల సందర్బంగా 78 ఏళ్ల తీతర్ సింగ్ వార్తల్లో నిలిచారు. వరుసగా 32వ సారి కూడా ఎన్నికల బరిలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రడీ అయ్యారు. 1970 నుంచి గ్రామపంచాయతీ నుంచి లోక్సభ వరకు 31 ఎన్నికల్లో పోటీ చేసిన తీతర్ సింగ్ ప్రతిసారీ ఓటమిని చవిచూశారు. అయితే తగ్గేదెలే అంటూన్న తితార్ సింగ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజస్థాన్లోని గంగానగర్కు చెందిన 78 ఏళ్ల తీతర్ సింగ్ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) దినసరి కూలీ. తాజా ఎన్నికల్లో వరుసగా స్వతంత్ర అభ్యర్థిగా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశారు. కరణ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పోటీకి సై అన్న తీతర్ సింగ్ ఈ పోటీ వెనుక అసలు ఉద్దేశాన్ని కూడా వెల్లడించారు. రాష్ట్రంలోని 25ఎఫ్ గులాబేవాలా గ్రామంలో నివాసం ఉంటున్న సౌదాగర్ సింగ్ కుమారుడు తీతర్ సింగ్. చదవింది ఐదవ తరగతి. కరణ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం 1985లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాననీ అన్ని ఎన్నికల్లో ఓడిపోయినా ఆ ఆశ మాత్రం అలాగే ఉంది అంటారు తీతర్ సింగ్. ఎందుకంటే నాలుగు తరాలు గడిచినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అటు పేదలకుగానీ ఇటు గ్రామాభివృద్ధికి చేసిందేమీ లేదని విమర్శించారు.ఇప్పటికైనా పేద ప్రజలకు ప్రభుత్వభూమి, కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు తానుఎమ్మెల్యేగా ఎన్నికైతే గ్రామంలోని రోడ్ల అభివృద్ధితో పాటు పలు అభివృద్ధి పనులు చేపట్టడంతోపాటు భూమిలేని పేద కూలీలకు భూమి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరతానని తెలిపారు. ఎన్నికలలో పోటీ చేయడానికి తన మేకలను, ఇంటిని అమ్ముకున్నారట. స్థానికుల నుంచి సేకరించిన కొద్దిపాటి విరాళాలతోనే పోటీకి దిగారు. స్నేహితులతో కలిసి డోర్ టు డోర్ కాన్వాసింగ్ చేయడం మరో ప్రత్యేకత. గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించాలనేది సింగ్ కల అట. వృద్ధాప్యం కారణంగా చదవడం, రాయడం మర్చిపోయినా సంతకం మాత్రం చేయగలరు. అయినా ఎన్నికల్లో పోటీ చేయడాన్ని మాత్రం వీడలేదు. అంతేకాదు ప్రతీ ఎన్నికలోనూ అతనికి డిపాజిట్ కూడా దక్కలేదు. 2018 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో 653 ఓట్లు, 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 427, 2008 అసెంబ్లీ ఎన్నికల్లో 938 ఓట్లు వచ్చాయట. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి సురేంద్ర పాల్ సింగ్, కాంగ్రెస్ నుంచి గుర్మీత్ సింగ్ కూనర్తో సింగ్ తలపడనున్నారు. తీతర్ సింగ్కు భార్య గులాబ్ కౌర్, ఇక్బాల్ సింగ్ ,రిచ్పాల్ సింగ్ అనే ఇద్దరు కుమారులున్నారు. ఈసారి ఎన్నికల్లో భార్యా పిల్లలు తనకు మద్దతుగా నిలిచారని సింగ్ చెప్పారు. కాగా రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యనే నెలకొంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సదర్పుర అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ఇప్పటికే నామినేషన్ వేశారు. ఇక్కడ నవంబర్ 25న పోలింగ్, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. Titar singh srikaranpur nirdlay akele dum lde 💪🏻 pic.twitter.com/nuWGnNmI9k — Rajan Gupta (@rajangupta066) November 2, 2023 -
ఎన్నికల సిత్రం: ‘‘కాళ్లు పట్టుకుంటా.. నాకు మద్దతివ్వు’’
జైపూర్: రాజస్థాన్లో కాంగ్రెస్లో టికెట్ల కేటాయింపు ముసలం వైపు దారి తీస్తోంది. గతంలో సచిన్ పైలట్ నేతృత్వంలో తిరుగుబాటు జరిగినప్పుడు.. ఆయన వెంట ఉన్న రెబల్స్లో కొందరికి ఈదఫా టికెట్లు నిరాకరించింది కాంగ్రెస్ అధిష్టానం. దీంతో వాళ్ల అనుచరులు ఆందోళనలకు దిగారు. ఇదిలా ఉండగానే కాంగ్రెస్ అభ్యర్థి ఒకరు.. ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలంటూ ఎమ్మెల్యే అభ్యర్థి కాళ్లు పట్టుకోబోయారు. రాజ్గఢ్-లక్ష్మణ్గఢ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జోహారీలాల్ మీనాను కాదని.. తాజాగా రిటైర్డ్ అయిన ప్రభుత్వ అధికారి మంగీలాల్ మీనాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది. దాంతో.. ఇదే స్థానం నుంచి టికెట్ ఆశించిన రాహుల్ మీనా భంగపడ్డారు. కొన్ని రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన రాహుల్.. తాజాగా మూడో జాబితా ప్రకటన తర్వాత రాజస్థాన్కు తిరిగొచ్చారు. రాజ్గఢ్లో కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశమై.. తన ఆవేదనను వెలిబుచ్చారు. ఆ సమయంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆ సమావేశం కొనసాగుతుండగానే అక్కడికి వచ్చిన మంగీలాల్ తనకు అండగా నిలవాలని మోకాళ్లపై కూర్చొని రాహుల్ను వేడుకున్నారు. ఒక సోదరుడిలా భావించి తనకు మద్దతు ఇవ్వాలంటూ ఆయన కాళ్లు పట్టుకోబోయారు కూడా. రాహుల్ ఒకింత ఇబ్బందికి గురై.. పాదాలను తాకకుండా మంగీలాల్ను ఆపారు. कांग्रेस प्रत्याशी ने दावेदार के सामने टेके घुटने, मांगीलाल मीणा बोले- मुझसे गलती हो गई हैं तो माफ करें#RajasthanAssemblyElection2023 #RajasthanElection2023 pic.twitter.com/uDSuPiUMML — khushbu rawal (@khushburawal2) November 1, 2023 -
రాజస్థాన్లో పోటీకి సై అంటే సై అంటున్న జంట
2023 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలలోదాంతా రామ్గఢ్ నియోజకవర్గం ఎన్నికలు ఆసక్తికరమైన రాజకీయ పోరుకు తెర తీయ నున్నాయి. రెండు వేర్వేరు పార్టీలనుంచి భార్యా భర్తలు ఈ సారి ఎన్నికల బరిలోకి నిలవనున్నారు. దంతారామ్గఢ్లో భర్తపై భార్య పోటీ చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఎంతోకాలంగా కాంగ్రెస్ పార్టీ సేవలు చేసినా ఫలితం లేదని భావించిన భార్య ప్రత్యర్థి పార్టీని పోటీకి ఎంచుకోగా, కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న భర్త అదే నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. దీంతో భార్యా భర్తల మధ్య పోరులో గెలుపెవరిది అనేది ఆసక్తికరంగా మారింది. పీసీసీ మాజీ చీఫ్, ఏడుసార్లు ఎమ్మెల్యే నారాయణ్ సింగ్ కుమారుడు వీరేంద్ర సింగ్ కుటుంబం కాంగ్రెస్లో చిర కాలంగా కొనసాగుతోంది. కానీ వీరేంద్ర సింగ్ భార్య రీటా సింగ్ ఈ ఏడాది ఆగస్టులో జననాయక్ జనతా పార్టీ (జెజెపి)లో చేరారు. దీన్ని అవకాశం తీసుకున్న జేజేపీ రీటా సింగ్ను అభ్యర్థిగా ప్రకటించడంతో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైనట్టైంది. అటు కాంగ్రెస్ నాయకత్వం కూడా దాంతా రాంగఢ్ సిట్టింగ్ ఎమ్మెల్యే వీరేంద్ర సింగ్నే మరోమారు బరిలో దింపాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు దంతా రామ్గఢ్ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని రీటా భావించి భంగపడ్డారు.ఇక్కడ పోటీకి పార్టీ ఆమె భర్తను ఎంపిక చేయడంతో మౌనం వహించారు. కానీ రాజకీయాల్లో ఎదగాలని భావిస్తున్న రీటా కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంతో సంప్రదింపులు జరిపారు. ఫలితం లేకపోవడంతో ఆమె కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి జేజేపీలో చేరి మరీ దాంతా రామ్ గఢ్ టికెట్ సంపాదించారు. తాను మనసు చెప్పిందే చేశాను. ఇన్నాళ్లుగా ప్రజలతోనే ఉన్నా.. వారి ప్రతీ ఆపదలోనూ, అవసరమైనప్పుడల్లా వారికి అండగా ఉన్నాను అని చెప్పారు రీటా. అందుకే తన నిర్ణయాన్ని ప్రజలు అంగీకరించి, మద్దతిస్తారనే విశ్వాసాన్ని ప్రకటించారు. తన విజయంపై నమ్మకం ఉందని రీటా వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ నియోజకవర్గంలో పార్టీ సీటు మళ్లీ తనకే దక్కుతుందనే ఆశాభావంతో ఉన్నారు వీరేంద్ర సింగ్. జేజేపీ ఆమెను (రీటాను) రంగంలోకి దింపింది, ఈ నేపథ్యంలో తనకు సీట్ లభిస్తే తమ మధ్య ప్రత్యక్ష పోరు తప్పదన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ-జేజేపీ కూటమి హర్యానాలో విజయం సాధించిన జేజేపీ ఇపుడు రాజస్థాన్లో కూడా ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతోంది. రీటా సింగ్ రాజకీయ ప్రస్థానం రాజస్థాన్ రాజకీయాల్లో చాలా చురుకుగా ఉండే రీటా 1995లో తొలిసారిగా దంతారామ్గఢ్ పంచాయతీ సమితి సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆమె ప్రధాన్ ఎన్నికల్లో రెండు ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2010లో సికార్ జిల్లా పరిషత్ సభ్యుని ఎన్నికలో పోటీ చేసి 2015 వరకు సికార్ జిల్లా అధ్యక్షురాలిగా కొనసాగారు. 2014లో సచిన్ పైలట్ పీసీసీ చీఫ్గా ఉన్న సమయంలో రీటా సింగ్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు రాజస్థాన్లో జేజేపీ మహిళా మోర్చా అధ్యక్ష పదవిని రీటా సింగ్కు అప్పగించడం విశేషం. కాగా 2018లో దాంతా రామ్ గఢ్ నియోజకవర్గం ఎన్నికల్లో పోటీ చేయనని నారాయణ్ సింగ్ ప్రకటించడంతో వీరేంద్ర సింగ్కు కాంగ్రెస్ టికెట్ లభించింది. నారాయణ్ సింగ్ 1972, 1980, 1985, 1993, 1998, 2003 , 2013లో ఏడుసార్లు గెలిచారు. నవంబర్ 25న రాజస్థాన్ లో పోలింగ్ జరగనుంది. ఫలితాలు డిసెంబర్ 3న వెల్లడికానున్నాయి. -
ఇద్దరికీ ఇబ్బందులే!
200 స్థానాలున్న రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల పోరు తారస్థాయికి చేరింది. బీజేపీ, పాలక కాంగ్రెస్ హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత, మోదీ మేనియా తమను ఈసారి కచ్చితంగా గట్టెక్కిస్తాయని బీజేపీ ఆశపడుతోంది. ఇక అశోక్ గెహ్లోత్ ప్రభుత్వం సంక్షేమ పథకాలపైనే నమ్మకం పెట్టుకుంది. మరోవైపు రెండు పార్టీలూ అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్నాయి. పైగా అవతలి పార్టీలోని తలనొప్పులు తమకే మేలు చేస్తాయన్న భావనలో ఉన్నాయి...! ఐదేళ్లకోసారి అధికార పార్టీని మార్చడం రాజస్తాన్ ఓటర్లకు ఆనవాయితీ. 1993 మధ్యంతర ఎన్నికల నాటినుంచి ఏ పార్టీ కూడా అధికారాన్ని నిలబెట్టుకున్న చరిత్ర లేదు. అలా చూస్తే ఈసారి బీజేపీకి అవకాశం దక్కాలి. దీనికి తోడు కాంగ్రెస్లో సీఎం గెహ్లోత్, ఆ పార్టీ అసమ్మతి నేత సచిన్ పైలట్ మధ్య విభేదాలను వీలైనంతగా ప్రచారం చేయడం ద్వారా మరింత లబ్ధి పొందాలని కమలనాథులు ప్రయత్నిస్తున్నారు. అంతేగాక కొన్నేళ్లుగా ఎన్నో శాంతిభద్రతల సమస్యలను రాజస్తాన్ చవిచూడటాన్ని ప్రచారంలో పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఇక అవినీతి విచ్చలవిడిగా మారిపోయిందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయినా గెహ్లోత్కే మొగ్గు...! అవినీతి ఆరోపణలు, శాంతిభద్రతల సమస్యలు, అంతర్గత కుమ్ములాటల వంటివి ఎన్నున్నా గెహ్లోత్ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత పెద్దగా కనిపించడం లేదని పరిశీలకులు అభిప్రాయపడుతుండటం విశేషం! ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గెహ్లోత్ పలు ప్రజాకర్షక పథకాలను వరుసబెట్టి ప్రకటించారు. ఇవన్నీ జనాన్ని బాగా ఆకట్టుకుంటున్నట్టు చెబుతున్నారు. 2014లో రాష్ట్రంలో కనిపించిన మోదీ వేవ్ ఇప్పుడు దాదాపుగా లేనట్టేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. నిత్యావసరాల ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటివాటి వల్ల మోదీపై రాష్ట్ర ప్రజలకు భ్రమలు తొలగాయంటూ కాంగ్రెస్ జోరుగా ప్రచారం చేస్తోంది. ముఖ్యంగా కేంద్రం పట్ల మహిళల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, ఇది తమకు బాగా అనుకూలిస్తుందని ఆ పార్టీ నేతలంటున్నారు. అధికార ఎమ్మెల్యేల్లో అసంతృప్తి కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో నెలకొన్న తీవ్ర అసంతృప్తి ఆ పార్టీకి బాగా చేటుచేయవచ్చన్న అభిప్రాయం అంతర్గతంగా వినిపిస్తోంది. పైగా వారిలో చాలామందిపై ప్రజలు అసంతృప్తితో ఉన్నట్టు వస్తున్న వార్తలు నాయకత్వానికి సమస్యగా మారాయి. ఇవన్నీ అంతిమంగా పుట్టి ముంచితే ఎలాగన్న ఆందోళన కాంగ్రెస్ అధిష్టానంలో నెలకొంది. అందుకే బీజేపీ బాటలోనే ఆ పార్టీ ఈసారి గెహ్లోత్ను సీఎం అభ్యర్థిగా ఎక్కడా పెద్దగా ప్రచారం చేయడం లేదు. అయితే ఈ ఎత్తుగడ అంతిమంగా బెడిసికొట్టి వారికే చేటు చేసే ప్రమాదం లేకపోలేదంటూ వస్తున్న వార్తలు పార్టీ పెద్దలను చికాకు పరుస్తున్నాయి. గుజ్జర్లు ఏం చేస్తారో? 24 అసెంబ్లీ స్థానాల్లో నిర్ణాయకంగా ఉన్న గుజ్జర్లు, మీనా సామాజిక వర్గం ఓటర్లు ఈసారి కాంగ్రెస్ను ఆదరించడం కష్టమేనంటున్నారు. ఇక ఓబీసీ సామాజికవర్గంలో ప్రధానమైన జాట్లు గెహ్లోత్తో ఎప్పుడూ సంతృప్తిగా లేరు పైగా జాట్ ప్రాబల్య స్థానాల్లో రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ పోటీకి దిగుతుండటం కాంగ్రెస్ అవకాశాలను దెబ్బ తీసేలా కనిపిస్తోంది. గుజ్జర్ సామాజిక వర్గానికి చెందిన సచిన్ పైలట్ సీఎం అవుతారన్న భావనతో గత అసెంబ్లీ ఎన్నికల్లో వారు కాంగ్రెస్కు జైకొట్టారు. ఈసారి వారు బీజేపీకేసి మొగ్గితే కాంగ్రెస్కు కష్టమేనని చెబుతున్నారు. భారతీయ ఆదివాసీ పార్టీ 2018లో రెండు స్థానాలే గెలిచినా పలు గిరిజన ప్రాంతాల్లో గణనీయంగా ఓట్లు సాధించింది. బీఎస్పీ సైతం కాంగ్రెస్ ఓటు బ్యాంకు నుంచి 5 శాతం ఓట్లు కొల్లగొట్టినట్టు గత ఎన్నికల ఫలితాల విశ్లేషణలో తేలింది. ఈసారి ఈ ట్రెండ్ కొనసాగితే కాంగ్రెస్కు మరింత నష్టమే. బీజేపీకీ ఇంటి పోరు బీజేపీ ఇంటి పోరుతో సతమతమవుతోంది. ముఖ్యంగా మాజీ సీఎం వసుంధర రాజే వర్గం స్థానిక బీజేపీ ముఖ్యులకు సహాయ నిరాకరణ చేస్తూ చిక్కులు సృష్టిస్తోంది. ఈ గొడవలు ముదిరితే మొదటికే మోసమని గ్రహించిన అధిష్టానం ఈసారి సీఎం అభ్యర్థిగా ఎవరినీ ప్రకటించకుండా జాగ్రత్త పడింది. రాజే సూచించిన వారిలో పలువురికి టికెట్లు నిరాకరించింది. కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించే ప్రయత్నాల్లో పడింది. హిందూత్వ కార్డుతో పాటు మోదీ ఛరిష్మాపైనే బీజేపీ ప్రధానంగా నమ్మకం పెట్టుకుంది. కానీ వసుంధర రాజే మాదిరిగా రాష్ట్రమంతటా జనాకర్షణ ఉన్న మరో నాయకుడంటూ ఎవరూ లేకపోవడం బీజేపీకి పెద్ద మైనస్ పాయింట్గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు 100 యూనిట్లదాకా ఉచిత కరెంటు రూ.500కే ఎల్పీజీ వంటగ్యాస్ సిలిండర్ వృద్ధాప్య పింఛన్ల మొత్తం పెంపు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం -
Rajasthan Congress Crisis: ఓవర్ టు రాజస్తాన్
ఎస్.రాజమహేంద్రారెడ్డి: మల్లికార్జున ఖర్గే ఇంట గెలిచారు. ఇక రచ్చ గెలవడానికి సన్నద్ధమవుతున్నారు. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ బాస్గా 80 ఏళ్ల వయసులో నియమితుడైనప్పుడు, పార్టీని గాడిలో పెట్టడం ఖర్గేకు తలకు మించి భారమే అవుతుందని విశ్లేషకులు అంచనా వేశారు. దశాబ్ద కాలంగా వరుస పరాజయాలతో, పరాభవాలతో నానాటికీ తీసికట్టుగా తయారవుతున్న కాంగ్రెస్కు యువరక్తం ఎక్కిస్తే ఆ జోష్ వేరేగా ఉండేదని కూడా వ్యాఖ్యానించారు. గాంధీల (సోనియా, రాహుల్)కే చేతకానిది ఈయన వల్ల అవుతుందా అంటూ పెదవి విరిచిన వాళ్లూ ఉన్నారు. శనివారం ఖర్గే సొంత రాష్ట్రం కర్ణాటక అసెంబ్లీ ఫలితాలు చూశాక చాలామందికి ఆయన నాయకత్వ పటిమపై అనుమానాలు పటాపంచలైపోయాయి. నిజానికి కాంగ్రెస్ సాధించిన ఈ విజయం మామూలుదా! ఇంకోపార్టీ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా సొంత కాళ్లమీద మరో ఐదేళ్లు మందగమనంతోనో, వాయువేగంతోనో పరుగెత్తగల ఆత్మవిశ్వాసాన్ని, సత్తాను కాంగ్రెస్కు అందించింది. కర్ణాటక కాంగ్రెస్కు రెండు కళ్లలాంటి మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మధ్య రగులుతున్న చిరకాల వైరాన్ని చల్లార్చడం ఎవరి తరమూ కాదన్న సమయంలో ఖర్గే జాతీయ అధ్యక్షుని హోదాలో రంగంలోకి దిగి చాకచక్యంగా ఆ అగ్నిని చల్లార్చారు. అదిగో అక్కడే, ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడటానికి ముందే, యుద్ధభూమిలోకి దిగకముందే కాంగ్రెస్కు సగం విజయాన్ని చేకూర్చారు. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రచారం మొదలై ఓటేసే తేదీ వచ్చేదాకా సిద్ధరామయ్య, శివకుమార్ పల్లెత్తు మాట అనుకోకుండా ఆప్త మిత్రుల్లా కనిపించడం కర్ణాటక ఓటర్లలోకాంగ్రెస్పై నమ్మకాన్ని పెంచింది. రాహుల్ భారత్ జోడో యాత్ర ఎన్నికలకు ముందే కర్ణాటక మీదుగా వెళ్లేట్టు వ్యూహరచన చేయడం కూడా కాంగ్రెస్కు లాభించింది. ఈ రెండు అంశాల్లోనూ ఖర్గే వ్యూహాత్మకంగా వ్యవహరించి కన్నడిగుల మనసు కొల్లగొట్టారు. దాని ఫలితమే ఈ సానుకూల ఫలితాలు. రాజస్తాన్ పరీక్షకు రెడీ తన మొదటి లక్ష్యాన్ని జనం జేజేల మధ్య దిగ్విజయంగా చేరుకున్న ఖర్గే తదుపరి లక్ష్యంవైపు దృష్టి సారించారు. బెంగళూరులో మోగిన విజయదుందుభి 1,921 కిలోమీటర్ల దూరంలో ఉన్న జైపూర్లో ప్రతిధ్వనించింది. ఒకరకంగా ఇది రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికలకు ఖర్గే మోగించిన నగారా! అంతర్గత పోరుతో సతమతమవుతున్న అక్కడి పార్టీ వ్యవహారాలను కొలిక్కి తేవడం ఖర్గే ముందున్న తక్షణ కర్తవ్యం. సీఎం గహ్లోత్, యువ నేత సచిన్ పైలట్ మధ్య సయోధ్య కుదర్చాల్సి ఉంది. సీన్ రాజస్తాన్కు మారుతుంది. అదే సీన్, అదే దర్శకుడు. పాత్రలే మారతాయి. అంతే. చేయి తిరిగిన దర్శకుడు గనుక అక్కడా లక్ష్యాన్ని చేరతారంటున్నారు. గహ్లోత్– పైలట్ విభేదాలు తారస్థాయికి 2018లో జరిగిన రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను విజయపథంలో నడిపించిన పైలట్ను కాదని గహ్లోత్కు పట్టం కట్టడంతో వారి మధ్య అగ్గి రాజుకుంది. ఐదేళ్లు గడిచి మళ్లీ ఎన్నికల ముంగిట్లోకి వచ్చేసరికి అది కాస్తా కార్చిచ్చులా వ్యాపించింది. సొంత పార్టీ మీద, ముఖ్యమంత్రి మీదా అలిగి ధర్నా చేసేందుకూ పైలట్ వెనకాడలేదంటే ఆయనలో అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. మరోవైపు గతేడాది సెప్టెంబర్లో తనను వరించి వచ్చిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవిని గహ్లోత్ తృణీకరించారు. సీఎం పదవే ముద్దంటూ బింకానికి పోయారు. అప్పటికే ఆయన పేరిట 12 సెట్ల నామినేషన్ పత్రాలు కూడా సిద్ధమయ్యాయి. అధిష్టానం కోరికను, లేదా ఆదేశాన్ని మన్నించకుండా రాష్ట్రానికే పరిమితమైన గహ్లోత్కు, తన స్థానంలో అధ్యక్షుడైన ఖర్గే ముందు చేతులు జోడించి నిల్చోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. విభేదాలు పక్కన పెడతారా, అధిష్టానం ముందు హాజరవుతారా అంటూ ఖర్గే ఇప్పటికే ఆ ఇద్దరికీ తాఖీదు పంపించారు. గాంధీల ఆశీర్వాదంతో అధ్యక్షుడైన ఖర్గే కర్ణాటక విజయంతో మరో మెట్టు పైకి చేరుకున్నారు. పార్టీలో ఇప్పుడు ఆయన మాటలకు తిరుగులేదు. త్వరలోనే గహ్లోత్, పైలట్లను పిలిచి బుజ్జగించడమో, తప్పదనుకుంటే హెచ్చరించడమో తప్పని పరిస్థితిలో ఖర్గే ఉన్నారు. ఈ ఏడాది డిసెంబరులో జరగనున్న రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికలను ఎదురీదడం కాంగ్రెస్కు కష్టమేనన్నది అంతర్గత నివేదికల సారాంశం. ఈ నివేదికల నేపథ్యంలో ఖర్గే మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించేందుకు అవసరమైన పథకాలను సిద్ధం చేసుకుంటున్నారు. పక్షం రోజుల ముందే సీనియర్ నేతలు కమల్నాథ్, వేణుగోపాల్ ద్వారా సచిన్కు రాయబారం పంపారు. విభేదాలు పక్కన పెడితే ఏఐసీసీ జనరల్ సెక్రటరీ పదవితో పాటు వర్కింగ్ కమిటీలోనూ చోటు కల్పిస్తానని ఆశ చూపారు. పైలట్ ఈ ప్రతిపాదనను తోసిపుచ్చారని అభిజ్ఞ వర్గాల భోగట్టా. ఈ నేపథ్యంలో పైలట్ను రాజస్తాన్ పీసీసీ అధ్యక్షునిగా నియమించాలన్నది ఖర్గే మరో ఆలోచనగా ఉంది. పార్టీ టికెట్ల విషయంలో, మంత్రివర్గంలో కొన్ని స్థానాల విషయంలో తనమాట చెల్లితే అభ్యంతరం లేదని పైలట్ భావిస్తున్నట్టు వినికిడి. అయితే ఈ ప్రతిపాదనకు సమ్మతించేది లేదని గహ్లోత్ బాహాటంగానే స్పష్టం చేశారు. దీనికి విరుగుడుగా పైలట్ ఈ నెల చివరి వారంలోనో, వచ్చే నెల మొదటి వారంలోనో పార్టీని చీల్చడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తన తండ్రి రాజేశ్ పైలట్ వర్ధంతి (జూన్ 11) నాటికి పైలట్ చీలిక వర్గాన్ని తయారు చేసి తీరతారంటున్నారు. అదే జరిగితే వీరి వ్యవహారాన్ని అధిష్టానం మరింత సీరియస్గా తీసుకునే అవకాశముంది. గహ్లోత్, పైలట్ తమ వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనపెట్టి పార్టీ నిర్ణయానికి బద్ధులుగా ఉండాలన్నది అధిష్టానం మాటగా ఖర్గే హితవు చెబుతున్నారు. గాంధీలు కూడా ఖర్గే మాటే ఫైనల్ అన్న సంకేతాన్ని పరోక్షంగా ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో గహ్లోత్, పైలట్ మధ్య రాజీ కుదిర్చి రాజస్తాన్లోనూ పార్టీని ఎన్నికల యుద్ధక్షేత్రంలో సమర్థంగా ముందుకు నడపడం ఖర్గేకు పెద్ద కష్టమేమీ కాదు. -
రాజస్థాన్ పీఠంపై బీజేపీ కన్ను.. ఎన్నికల సన్నద్ధత షురూ!
జైపుర్: దేశంలోని ఒక్కో రాష్ట్రంలో పాగా వేస్తూ తన ప్రబల్యాన్ని విస్తరించుకుంటోంది భారతీయ జనతా పార్టీ. తాజాగా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే 2023లో శాసనసభ ఎన్నికలు జరగనున్న రాజస్థాన్లో పాగా వేసేందుకు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. జులై 10 నుంచి 12 వరకు మూడు రోజుల పాటు కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ శిబిరం ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ విషయమై రాజస్థాన్లోని మౌంట్ అబూలో సమావేశం కానున్నట్లు పేర్కొన్నాయి. రానున్న ఎన్నికల్లో విజయం సాధించేలా పార్టీ కార్యకర్తలు, నేతలకు ఈ క్యాంప్కు హాజరయ్యే జాతీయ స్థాయి నాయకులు ఎన్నికల వ్యూహాలను వివరించనున్నారు. బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే విధంగా వారికి శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ శిబిరం ప్రారంభానికి ఒక రోజు ముందే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ జైపుర్ చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ ట్రైనింగ్ క్యాంప్ అనంతరం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మకు మద్దతు తెలిపిన హిందూ వ్యక్తి హత్యకు గురైన విషయం, ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితులపై ఈ భేటీలో చర్చించనున్నారు. శిక్షణ శిబిరానికి వచ్చే నేతలెవరు? రాజస్థాన్లో మూడు రోజుల పాటు నిర్వహించి ట్రైనింగ్ క్యాంప్కు పలువురు జాతీయ స్థాయి నేతలు హాజరుకానున్నారు. అందులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు వీ సతీశ్, బీఎల్ సంతోష్, రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు సతీశ్ పూనియా, కేంద్ర మంత్రులు.. కైలాశ్ చౌదరి, అరుణ్ రామ్ మెఘ్వాల్, గజేంద్ర సింగ్ శేఖావత్, ప్రతిపక్ష నేత గులాబ్ చంద్ కటారియా, మాజీ ముఖ్యమంత్రి వసుందర రాజే సహా పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. చదవండి: మేడమ్ టుస్సాడ్స్ నుంచి రోడ్డుపైకి బోరిస్ మైనపు విగ్రహం -
సీఎం అభ్యర్థుల ప్రకటన ఆలస్యం!
-
యువనేతల ట్విస్ట్.. రసకందాయంలో సీఎం రేసు!
న్యూఢిల్లీ : మూడు రాష్ట్రాల్లో జయకేతనం ఎగురవేసిన కాంగ్రెస్ పార్టీకి కొత్త చిక్కొచ్చిపడింది. సీనియర్లు, జూనియర్ల మధ్య తీవ్ర పోటీ ఉండటంతో కాంగ్రెస్ అధిష్టానానికి ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను ఎంపిక చేయడం కత్తిమీద సాములా మారింది. ముఖ్యంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్ సీఎంల ఖరారుపై కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకోలేకపోతోంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లో సీఎం పదవి ఆశావహులు గురువారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నివాసానికి వచ్చారు. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలు కూడా రాహుల్ నివాసానికి వచ్చారు. ఇదివరకు ఏ సమావేశం జరిగినా 10 జన్పథ్లోని సోనియాగాంధీ నివాసంలో జరిగేది. కానీ ఈసారి మూడు రాష్ట్రాల సీఎంల ఎంపిక కసరత్తంతా రాహుల్ నివాసంలోనే జరుగుతోంది. రాజస్థాన్ సీఎం పదవి కోసం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్.. మధ్యప్రదేశ్ సీఎం పదవి కోసం కమల్నాథ్, జ్యోతిరాదిత్యల మధ్య తీవ్ర పోటీ ఉంది. ఈ నలుగురితో విడివిడిగా రాహుల్ గాంధీ మాట్లాడారు. యువనేతలు సచిన్ పైలట్, జ్యోతిరాదిత్యలకు డిప్యూటీ సీఎం పదవులు ఆఫర్ చేసినా వారు ఆ పదవులను తీసుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు. ఎన్నికల్లో తాము కష్టపడితే సీనియర్లకు పదవులిస్తారా అంటూ సచిన్, జ్యోతిరాదిత్య కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. సీఎం రేసులో నుంచి తప్పుకోవడానికి యువనేతలు నిరాకరిస్తుండటంతో పార్టీ అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. ఎన్నికైన ఎమ్మెల్యేలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని రాహుల్ గాంధీ వారికి సర్దిచెప్పినట్టు సమాచారం. దీంతో ముఖ్యమంత్రి అభ్యర్థుల ప్రకటన ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. -
గెహ్లాట్ వర్సెస్ పైలట్
సాక్షి, న్యూఢిల్లీ : రాజస్ధాన్లో కాంగ్రెస్ సారథ్యంలో ఏర్పాటయ్యే ప్రభుత్వానికి సారధి ఎవరనే ఉత్కంఠ కొనసాగుతోంది. సీనియర్ నేత అశోక్ గెహ్లాట్, యువనేత సచిన్ పైలట్లు సీఎం రేసులో తీవ్రంగా పోటీపడుతున్నారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ నిర్ణయం కీలకంగా మారడంతో పార్టీ నేతలతో ఆయన విస్తృతంగా సంప్రదింపులు జరుపుతున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు సహా సీనియర్ నేతలందరి అభిప్రాయాలను కేంద్ర పరిశీలకులు సేకరించారని, రాహుల్ గాంధీ ఈ అంశంపై గురువారం ఓ నిర్ణయం తీసుకుంటారని సీఎం రేసులో నిలిచిన అశోక్ గెహ్లాట్ చెప్పారు. రాజస్ధాన్ సీఎం ఆశావహులు గెహ్లాట్, సచిన్ పైలట్లు ఇద్దరూ ఢిల్లీలోనే మకాం వేసి రాహుల్తో మంతనాలు జరుపుతున్నారు. కాగా మధ్యప్రదేశ్ సీఎంగా కమల్నాథ్ ఖరారయ్యాయరని, రాజస్ధాన్ సీఎంగా అశోక్ గెహ్లాట్, చత్తీస్గఢ్ సీఎంగా ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ భూపేష్ బాఘేల్లను సీఎం రేసులో ముందున్నారని భావిస్తున్నారు. -
వసుంధరా రాజె రాజీనామా
జైపూర్ : రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి వసుంధరా రాజె తన పదవికి రాజీనామా చేశారు. హోరాహారీగా సాగిన పోరులో కాంగ్రెస్ పార్టీ పాలక బీజేపీని మట్టికరిపించింది. కాగా, నూతన ప్రభుత్వం రాజస్ధాన్ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తుందని వసుంధరా రాజె ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధించిన కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతను ఎన్నుకునేందుకు సన్నాహాలు చేపట్టింది. నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బుధవారం సమావేశమై సీఎల్పీ నేతను ఎన్నుకోనున్నారు. ప్రభుత్వ ఏర్పాటులో స్వతంత్ర అభ్యర్ధుల సహకారం కూడా తీసుకుంటామని సీనియర్ కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ తెలిపారు. రాజస్ధాన్ సీఎం రేసులో అశోక్ గెహ్లాట్తో పాటు యువ నేత సచిన్ పైలట్ కూడా ముఖ్యమంత్రి పదవికి పోటీపడుతున్నారు. -
కౌంటింగ్కు కౌంట్డౌన్..
జైపూర్ : సెమీఫైనల్స్గా భావిస్తున్న అయిదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఇక అందరి దృష్టీ ఈనెల 11న వెలువడే ఎన్నికల ఫలితాలపైనే నెలకొంది. కీలక రాష్ట్రాలైన రాజస్ధాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్లో బీజేపీ అధికారంలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేకత ఆసరాగా ఆయా రాష్ట్రాల్లో పాగా వేసేందుకు కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. ఇక్కడ అధికార పగ్గాలు చేపట్టి రానున్న లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని ఆ పార్టీ సర్వశక్తులూ ఒడ్డింది. ఇక అధికారం నిలుపుకుని సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధం కావాలని పాలక బీజేపీ భావిస్తోంది. రాజస్ధాన్లో ముగిసిన పోలింగ్ రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శుక్రవారం చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. రాజస్ధాన్లో మొత్తంగా 72.62 శాతం పోలింగ్ నమోదైంది. 200 స్ధానాలకు గాను 199 స్ధానాల్లో పోలింగ్ జరిగింది. బీఎస్పీ అభ్యర్థి మృతితో అల్వార్ జిల్లా రామ్గర్ స్ధానంలో పోలింగ్ వాయిదా పడింది. పోలింగ్లో సందర్భంగా కొన్నిప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగాయి. సికార్లో ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్న ఘటనలో పోలీసులు లాఠీచార్జి జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. పోలింగ్ కేంద్రం వద్దే బాహాబాహీకి దిగిన కార్యకర్తలు వాహనాలకు నిప్పంటించడంతో కొద్దిసేపు పోలింగ్ నిలిచిపోయింది. మధ్యాహ్నం వరకూ మందకొడిగా సాగిన పోలింగ్ ఆ తర్వాత ఊపందుకుంది. రాజస్ధాన్లో అధికార పగ్గాలు చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ, మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ ఈ ఎన్నికల్లో హోరాహోరీ తలపడ్డాయి. డిసెంబర్ 11న రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, మిజోరం ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. -
ఎడారి గడ్డపై.. సోషల్ ఇంజనీరింగ్
‘మోదీ, మీరంటే కోపం లేదు. కానీ.. రాజేని సహించే ప్రసక్తే లేదు’ రాజస్తాన్లో ఎక్కడికి వెళ్లినా ఇదే నినాదం వినిపిస్తోంది. ఎవరికీ అందుబాటులో ఉండరు, తలబిరుసు ఎక్కువ వంటి విమర్శల్ని ఎదుర్కొంటూ ఎన్నికలకు ముందే ప్రజాగ్రహం వేడిని చూస్తున్న వసుంధరా రాజే.. కుల సమీకరణలతోనైనా నెగ్గడానికి వ్యూహాలు పన్నుతున్నారు. ఎన్నికల్లో ప్రభావితం చేసే అంశాలు ఎన్ని ఉన్నప్పటికీ రాజస్తాన్లో కులమే అత్యంత కీలకమని, అభ్యర్థుల జయాపజయాల్ని అదే శాసిస్తుందని బలంగా నమ్ముతున్న రెండు పార్టీలు టిక్కెట్ల పంపిణీ సమయంలో కులాల లెక్కల్ని పక్కాగా వేసుకొని బరిలోకి దిగాయి. దీంతో 30 చోట్ల ఒకే కులానికి చెందిన అభ్యర్థులు ఢీ అంటే ఢీ అంటున్నారు. 15 నియోజకవర్గాల్లో జాట్లు తలపడుతుండగా.. 7 స్థానాల్లో బ్రాహ్మణులే బ్రాహ్మణులతో తలపడాల్సి వస్తోంది. 4 సీట్లలో రాజ్పుత్లు ఒకరిపై మరొకరు సై అంటుండగా.. 2 చోట్ల గుజ్జర్లు, యాదవ్లు నువ్వా నేనా అని సమరశంఖం పూరిస్తున్నారు. రాజపుత్లు ఎవరివైపు? రాజస్తాన్ జనాభాలో 9% ఉన్న రాజపుత్లు ఓట్లు ఏ పార్టీకైనా అత్యంత కీలకం. గతసారి ఎన్నికల్లో బీజేపీ అండదండగా ఉన్న ఈ సామాజిక వర్గం ఇప్పుడు కమలనాథులపై ఆగ్రహంతో ఉంది. రాజ్పుత్ అయిన గ్యాంగ్స్టర్ ఆనందపాల్ సింగ్ నకిలీ ఎన్కౌంటర్, పద్మావత్ సినిమా విడుదలకు రాజే సర్కార్ సై అనడం, ఎస్సీ, ఎస్టీ చట్టానికి సవరణలు వంటివి బీజేపీపై రాజ్పుత్లలో కోపాన్ని పెంచాయి. రాజ్పుత్ సంఘాలు బహిరంగంగానే సభలు నిర్వహిస్తూ గతంలో కమలం పార్టీకి ఓటు వెయ్యడం తాము చేసిన తప్పిదమంటూ ప్రకటనలు చేస్తున్నాయి. ఈ సారి బీజేపీని ఓడించాలంటూ శ్రీ రాజ్పుత్ కర్ణిసేన కన్వీనర్ లోకేంద్ర కాల్వీ పిలుపునిచ్చారు. వీరి ఓట్లన్నీ ఈ సారి కాంగ్రెస్కు మళ్లే అవకాశం ఉంది. ఇక రాజ్పుత్ సామాజిక వర్గానికి చెందిన నేత జస్వంత్ సింగ్ కుమారుడు మానవేంద్ర సింగ్ కాంగ్రెస్లో చేరడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. అయితే, రాజపుత్ర సేనను చీల్చిన సుఖ్దేవ్ సింగ్ గోగామేధీ బీజేపీకి మద్దతు ప్రకటించారు. రాజ్పుత్లు - 9% ప్రభావాన్ని చూపించే నియోజకవర్గాలు- 25 బీజేపీ ఇచ్చిన టికెట్లు- 26 కాంగ్రెస్ ఇచ్చిన టికెట్లు- 15 గుజ్జర్ల అండ దక్కేదెవరికి? రాష్ట్ర జనాభాలో 9%శాతం ఉన్న గుజ్లర్లు కూడా ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. సమాజంలో అత్యంత వెనుకబడిన ఈ వర్గం తమను సంచార తెగగా గుర్తించి ఎస్టీ హోదా కల్పించాలంటూ దశాబ్దాలుగా పోరాడుతున్నారు. ఎస్టీ కులమైన మీనాలతో రాజకీయంగా పోటీపడుతున్నారు. రాజే సర్కార్ గత జులైలోనే గుజ్లర్లను తిరిగి ఓబీసీల్లోకి చేర్చింది. దీంతో ఇప్పటికే అమల్లో ఉన్న 21% రిజర్వేషన్లు వారికీ వర్తిస్తాయి ఇక అదనంగా ఒక్క శాతాన్ని అత్యంత వెనుకబడిన వర్గాల్లోకి (ఎంబీసీ) చేర్చింది. ఈ చర్యతో రాష్ట్రంలో సుప్రీం అనుమతిచ్చిన 50% రిజర్వేషన్లు పూర్తయ్యాయి. అయినా గుజ్లర్లు సంతృప్తిగా లేరు. మరోవైపు కాంగ్రెస్లో గుజ్జర్ అయిన సచిన్ పైలెట్ సీఎం అభ్యర్థి రేసులో ముందు ఉండడంతో ఈ ఎన్నికల్లో గుజ్లర్లు కాంగ్రెస్కే మద్దతు ఇవ్వొచ్చన్న అంచనాలు ఉన్నాయి. ‘ప్రభుత్వంలో మా ప్రాధాన్యం చాలా తక్కువగా ఉంది. గుజ్జర్ నేతలు ఎక్కువ మంది ఎన్నికైతేనే మా డిమాండ్లు సాధించుకునే అవకాశం ఉంటుంది. సచిన్ పైలెట్ సీఎం రేసులో ఉండడం హర్షణీయం. ఈ సారి మా మద్దతు కాంగ్రెస్కే ఉంటుంది’ అని గుజ్జర్ ఆరక్షణ్ సంఘర్ష్ సమితి ప్రధాన కార్యదర్శి శైలేంద్ర సింగ్ ధభానీ వెల్లడించారు. గుజ్జర్లు- 9% ప్రభావాన్ని చూపించే నియోజకవర్గాలు- 25 కాంగ్రెస్ ఇచ్చిన టికెట్లు- 12 బీజేపీ ఇచ్చిన టికెట్లు- 10 జాట్లు రూటు ఎటు? గ్రామీణ రాజస్థాన్లో జాట్ల ప్రాబల్యం ఎక్కువ. రాష్ట్ర జనాభాలో 15% ఉన్న వీరు మొదట్నుంచి కాంగ్రెస్ పక్షమే. కానీ ఆ పార్టీ తమకు ఎప్పుడూ ప్రాధాన్యం ఇవ్వలేదన్న అసంతృప్తి వీరిలో ఉంది. పరశురామ్ మధేర్నా, రామ్నివాస్ మీర్ధా, శీష్రాం ఓలా వంటి బలమైన జాట్ నేతలను కాంగ్రెస్ ఎప్పుడూ సీఎంను చేయలేదని జాట్లు అసంతృప్తిగా ఉన్నారు. గత ఎన్నికల్లో పరశురామ్ మధేర్నాను సీఎంగా కాంగ్రెస్ ప్రకటించాలని ఒత్తిడి తెచ్చారు. కానీ మాలీ వర్గానికి చెందిన అశోక్ గెహ్లాట్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించడంతో వీరంతా కాంగ్రెస్కు దూరమయ్యారు. జాట్లలో అత్యధికులు వ్యవసాయ రంగం మీద ఆధారపడే ఉన్నారు. అయితే రైతాంగ సమస్యల కారణంగా వారు బీజేపీ వైపు కూడా ఉండే అవకాశం లేదు. తిరిగి జాట్లను తమ గూటికి లాక్కోవడానికి కాంగ్రెస్ పార్టీ అన్నిరకాలుగా ప్రయత్నించింది. వ్యూహాత్మకంగా ఎవరినీ సీఎం అభ్యర్థిగా ప్రకటించకుండా ముందుకు వెళ్లింది. ఈ సారి ఎన్నికల్లో ప్రముఖ జాట్ నాయకుడు హనుమాన్ బేనీవాల్ రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీతోబరిలో దిగడంతో జాట్ ఓటు బ్యాంకు అటు మళ్లిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాట్లు- 15% ప్రభావాన్ని చూపించే నియోజకవర్గాలు- 60 కాంగ్రెస్ ఇచ్చిన టికెట్లు- 33 బీజేపీ ఇచ్చిన టికెట్లు- 33 సర్వేలు ఏం చెబుతున్నాయంటే ఏబీపీ సీఎస్డీఎస్ బీజేపీ - 84 కాంగ్రెస్- 110 ఇతరులు-06 టైమ్స్ నౌ సీఎన్ఎక్స్ బీజేపీ - 70-80 కాంగ్రెస్- 110-120 బీఎస్పీ- 1-3 ఇతరులు- 7-9 ఇక ఇండియా టుడే–యాక్సిస్ మై ఇండియా సర్వేలో వసుంధా రాజే ప్రభుత్వం మారాలని 48% మంది కోరుకుంటే, రాజే ప్రభుత్వ పనితీరుపై 32% మంది సంతృప్తి వ్యక్తం చేశారు. రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల వివరాలు.. ఎన్నికలు – డిసెంబర్ 7 ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు కౌంటింగ్, ఫలితాలు – డిసెంబర్ 11 రాష్ట్ర జనాభా– 6.86 కోట్లు హిందువులు– 88.49%, ముస్లింలు– 9.07% ఓటర్ల సంఖ్య – 4,77,89,815 పోలింగ్ కేంద్రాల సంఖ్య– 51,965 అసెంబ్లీ స్థానాలు – 200 పోలింగ్ జరిగే సీట్లు– 199 ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు– 34 ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు– 25 జనరల్ సీట్లు– 141 పోటీలో ఉన్న అభ్యర్థులు–2,873 మహిళా అభ్యర్థులు– 189 సీఎం – వసుంధరా రాజే (బీజేపీ) 2013 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ–163 సీట్లు– 45,17% కాంగ్రెస్–22 సీట్లు– 33.07% ఇతరులు–17 సీట్లు– 22% -
రాజస్ధాన్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ!
జైపూర్ : రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కమలనాధులకు గట్టిషాక్ తగిలింది. వసుంధర రాజె నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత నెలకొందనే ప్రచారంతో కలవరపడుతున్న బీజేపీకి తాజాగా ఆ పార్టీ ఎంపీ నుంచి ఎదురుదెబ్బ తగిలింది. దౌసా ఎంపీ, మాజీ డీజీపీ హరీష్ మీనా బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. మరికొన్ని వారాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి రావాలని ఆశిస్తున్న బీజేపీకి మీనా నిష్క్రమణ భంగపాటుగా మారింది. మీనా సోదరుడు నమో నారాయణ్ మీనా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రాజస్ధాన్లో ప్రాబల్యం కలిగిన మీనాలు తూర్పు రాజస్ధాన్లో గణనీయ సంఖ్యలో ఉన్నారు. మీనా వర్గీయులు రాజకీయాల్లో, ప్రభుత్వ సర్వీసుల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నారు. 2009-13 మధ్య హరీష్ మీనా రాజస్థాన్ పోలీస్ చీఫ్గా దీర్ఘకాలం సేవలు అందించారు. కాగా రాజస్ధాన్లో ప్రభుత్వ వ్యతిరేకతను అందిపుచ్చుకుని ఎలాగైనా పాగా వేయాలని కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతుండగా, అధికారం నిలుపుకునేందుకు బీజేపీ హోరాహోరీగా తలపడుతోంది. -
సంప్రదాయమే పునరావృతమా?
బీజేపీ ఒకసారి, కాంగ్రెస్ మరోసారి.. వరుసగా ఒకే పార్టీ రెండు సార్లు గెలిచిందీ లేదు.. మూడో పార్టీకి చోటూ లేదు. ప్రతీ ఎన్నికల్లో అధికార పార్టీని ప్రతిపక్షంలో కూర్చోబెడుతున్నాడు రాజస్తాన్ ఓటరు. గత 20 ఏళ్లుగా ఇదే తీరు. మరి ఈసారి ఏం జరగబోతోంది? ముఖ్యమంత్రి వసుంధరా రాజె ఆ సంప్రదాయాన్ని తోసిరాజంటారా? లేక అదే పునరావృతం కానుందా? – సాక్షి, నాలెడ్జ్ సెంటర్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలు, రైతు సమస్యలు, నిరుద్యోగం, గ్రామీణ ప్రాంతాల్లో సంక్షోభ పరిస్థితులు, రాజ్పుట్లు వంటి ప్రధాన సామాజికవర్గంలో అసంతృప్తి సెగలతో అధికార బీజేపీ దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోతే.. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుగులేని విజయాల్ని నమోదు చేసుకున్న కాంగ్రెస్ రెట్టించిన ఉత్సాహంతో ఎన్నికల సంగ్రామంలో దూసుకుపోతోంది. రాజస్తాన్ ఎన్నికల చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 2013 ఎన్నికల్లో ఏకంగా 163 సీట్లను సాధించి చరిత్ర సృష్టించిన బీజేపీ గ్రాఫ్.. ఈ అయిదేళ్లలో అంతే వేగంగా కిందకి పడిపోయింది. ముఖ్యమంత్రి వసుంధరా రాజె ఎవరికీ అందుబాటులో ఉండరన్న విమర్శలు.. మంత్రులు, ఇతర ముఖ్య నాయకులు తలబిరుసుతో వ్యవహరిస్తారన్న ఆరోపణలు.. పార్టీలో అంతర్గత పోరుతో బీజేపీ చతికిలపడిపోయింది. గడచిన కొద్ది రోజుల్లో రాష్ట్రంలో ఎన్నో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ, ముఖ్యమంత్రి ప్రజలకు కనీస వివరణ కూడా ఇచ్చే ప్రయత్నం చేయకపోవడంతో చాలా వర్గాల్లో అసంతృప్తి నెలకొంది. ప్రభుత్వ వ్యతిరేకతపైనే లబ్ధి పొందడం కోసం సీపీఐ(ఎం)తో పాటు ఇతర ఏడు చిన్న పార్టీలు రాజస్తాన్ లోక్తాంత్రిక్ మోర్చా (ఆర్ఎల్ఎం) పేరిట పోటీ చేయడానికి సిద్ధంకాగా, మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ 200 స్థానాల్లోనూ పోటీకి దిగుతానని ప్రకటించింది. సర్వేలు ఏం చెబుతున్నాయ్? రాజస్తాన్లో ప్రభుత్వ వ్యతిరేకత బీజేపీ పుట్టి ముంచుతుందని సర్వేలన్నీ అంచనా వేస్తున్నాయి. ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా గెలిచే రాష్ట్రం రాజస్తానేనని సర్వేలన్నీ చెబుతున్నాయి. ఏబీపీ న్యూస్–సీ ఓటరు సర్వేలో కాంగ్రెస్ పార్టీ 50 శాతం ఓటు షేరుతో 142 స్థానాలను గెలుచుకొని తిరుగులేని విజయాన్ని సాధిస్తుందని వెల్లడైంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో అంచనాలు రోజురోజుకీ మారిపోతూ ఉంటే రాజస్తాన్లో మాత్రం కాంగ్రెస్ పార్టీయే నెగ్గుతుందని సర్వేలు చెబుతున్నాయి. బీజేపీ దిద్దుబాటు చర్యలు ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిపోతోందని, ముఖ్యమంత్రి వ్యవహారశైలి సొంత పార్టీలో అసమ్మతిని రాజేసిందని బీజేపీ అధిష్టానం గుర్తించింది. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. రాజెకు అత్యంత సన్నిహితుడైన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అశోక్ పర్నామిని తొలగించి, ఆయన స్థానంలో ఓబీసీ నాయకుడు మదన్లాల్ సైనీని నియమించింది. బీజేపీకి గుడ్బై చెప్పి ఎన్పీపీకి వెళ్లిపోయిన ఎమ్మెల్యే కిరోడి లాల్ మీనాను తిరిగి పార్టీలోకి ఆహ్వానించింది. తూర్పు రాజస్తాన్ గిరిజన ప్రాంతాల్లో మీనాకు మంచి పట్టుంది. ముఖ్యమంత్రి వసుంధరా రాజె కూడా ప్రజల్లో, పార్టీ కేడర్లో తన పట్ల పెల్లుబుకుతున్న అసమ్మతి తగ్గించే ప్రయత్నాలు ప్రారంభించారు. గత రెండు నెలలుగా కాలికి బలపం కట్టుకొని రాష్ట్రమంతటా తిరుగుతున్నారు. రాజస్తాన్ గౌరవ యాత్రల్ని మొదలుపెట్టారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. వృత్తి నైపుణ్యాల్లో శిక్షణా కార్యక్రమాలు, విద్యార్థినులకు స్కూటర్ల పంపిణీ, అన్నపూర్ణ భండార్లు ఏర్పాటు వంటి పేరు తెచ్చిన పథకాలను ఎన్నికల ర్యాలీలలో పదే పదే ప్రస్తావిస్తున్నారు. వంద మంది సిట్టింగ్లకు నో చాన్స్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాజస్తాన్పై ప్రత్యేకంగా దృష్టిసారించారు. గత సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు 5 సార్లు రాష్ట్రంలో పర్యటించారు. వంద నియోజకవర్గాల్లో సిట్టింగ్లకు కా దని కొత్తవారికి టికెట్లు ఇవ్వాలని యోచిస్తున్నారు. అభ్యర్థి కాదు.. గుర్తు ముఖ్యమంటూ కార్యకర్తలకు సంకేతాలు పంపుతున్నారు. ఉప ఎన్నికల విజయంతో కాంగ్రెస్లో ఆత్మవిశ్వాసం గత ఫిబ్రవరిలో అల్వార్, అజ్మీర్ లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. మండల్గఢ్ అసెంబ్లీ స్థానంలోనూ హస్తానిదే హవా. ఈ లోక్సభ పరిధిలో 16 అసెంబ్లీ స్థానాలున్నాయి. అన్నింటిలోనూ కాంగ్రెస్ తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది. కాషాయానికి కంచుకోట వంటి ప్రాంతాల్లోనూ కాంగ్రెస్కే ప్రజలు పట్టం కట్టారు. దీంతో ఆ పార్టీలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరినీ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ యువనేత, పీసీసీ చీఫ్ సచిన్ పైలట్ను ముందుంచి రాజకీయాన్ని నడుపుతోంది. బీజేపీ గౌరవ యాత్రలకు కౌంటర్గా సంకల్ప్ ర్యాలీలు మొదలుపెట్టింది. మేరా బూత్, మేరా గౌరవ్ అంటూ బూత్ స్థాయి నుంచి ఓటర్లను ఆకర్షించే కార్యక్రమాలు చేపట్టింది. అశోక్ గెహ్లాట్, సీపీ జోషి, సచిన్ పైలట్లు ఊరూవాడా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. గెహ్లాట్, సచిన్ పైలట్ల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ అవి బయటకు కనిపించకుండా ఎవరికి వారు తమ సత్తా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో సచిన్ దూకుడుగా ఉన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను సమర్థంగా ఎండగట్టడమే కాదు, బీజేపీ చేసిందేమీ లేదని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. కనీసం 50 నియోజకవర్గాల్లో కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వడానికి కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. మానవేంద్ర సింగ్ రాజ్పుట్ ఓట్లను ఆకర్షిస్తారా? కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత జశ్వంత్సింగ్ కుమారుడు, పార్టీ తిరుగుబాటు నాయకుడు మానవేంద్రసింగ్ ఎన్నికల వేళ కాంగ్రెస్లో చేరడం బీజేపీకి ఎదురుదెబ్బగా మారింది. రాజ్పుట్ నాయకుడైన మానవేంద్రసింగ్ పోటీ చేసే ప్రాంతం బర్మార్–జైసల్మీర్లో కనీసం 26 స్థానాలో రాజ్పుట్లు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. ఇప్పుడు వారి ఓట్లను మానవేంద్రసింగ్ ఎంతవరకు లాగుతారన్నది చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల్లో ప్రభావితం చేసే అంశాలు నిరుద్యోగం గత ఎన్నికల్లో 15 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని బీజేపీ నిలబెట్టుకోలేకపోయింది. ఈ నాలుగేళ్లలో 40 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయింది. దీంతో గత ఎన్నికల్లో గంపగుత్తగా ఓట్లు వేసి బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టిన నిరుద్యోగ యువత ఆ పార్టీకి దూరమయ్యారు. దాదాపు లక్షమంది నిరుద్యోగులు సభ్యులుగా ఉన్న రాజస్తాన్ బెరోజ్గార్ ఎకిక్రాత్ మహాసంఘ్ రోడ్డెక్కి నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తోంది. ఇంటింటికీ తిరుగుతూ బీజేపీ ముక్త రాజస్తాన్ అని నినదిస్తోంది. విభజన రాజకీయాలు ఇటీవల కాలంలో రాజస్తాన్లో హేయమైన దాడులు పెరిగిపోయాయి. గోవధ నిషేధానంతరం జరిగిన దాడులు, మత అసహన పరిస్థితులు బీజేపీకి ప్రతికూలంగా మారాయి. ఉప ఎన్నికల సందర్భంలో బీజేపీ నేత జశ్వంత్ యాదవ్ మీరు హిందూ అయితే బీజేపీకి ఓటెయ్యండి, ముస్లింలు కాంగ్రెస్ వెంట నడవండి అంటూ వ్యాఖ్యానించడం, మరో బీజేపీ ఎమ్మెల్యే బన్వారి లాల్ సింఘాల్ దేశంలో హిందూ జనాభాని తగ్గించి దేశాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికే ముస్లింలు ఎడాపెడా పిల్లల్ని కంటున్నారంటూ వివాదాస్పదమైన ఫేస్బుక్ పోస్టింగు రాష్ట్రంలో ఒక విభజన రేఖను గీశాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర జనాభాలో 9 శాతం ఉన్న ముస్లిం ఓట్లు అత్యంత కీలకంగా మారాయి. గ్రామీణ సంక్షోభం రాజస్తాన్లో 75.13% మంది గ్రామాల్లో నివసిస్తారు. ఇక్కడ అంతా తీవ్రమైన సంక్షోభ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. రుణమాఫీ అమలు కాకపోవడం, పంటలకు గిట్టుబాటు ధరలేకపోవడం వంటి సమస్యలతో గత ఏడాదిగా అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతన్నలు ఆత్మహత్యలకూ పాల్పడుతున్నారు. సికార్లో జరిగిన రైతు ఆందోళనతో దిగొచ్చిన సర్కార్ రూ.50వేల వరకు రుణమాఫీని అమలు చేసినప్పటికీ, అన్నదాతల ఆగ్రహం ఇంకా చల్లారలేదు. స్వామినాథన్ కమిటీ సిఫారసుల మేరకు కనీస మద్దతు ధరని ప్రకటించేంతవరకూ తమ ఉద్యమం కొనసాగుతుందని వారు స్పష్టంచేశారు. కుల సమీకరణాలు రాజస్తాన్లో కుల రాజకీయాలు అత్యంత సంక్లిష్టమైనవి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో సామాజికవర్గానిది పైచేయిగా ఉంది. ఉత్తర రాజస్తాన్లో జాట్లు, దక్షిణాదిన గుజ్జార్, మీనాలు, పశ్చిమంలో రాజ్పుట్లు, మధ్య ప్రాంతంలో ముస్లింల ప్రాబల్యం ఎక్కువ. వీరందరిలో మెజార్టీ ఎవరి వెంట నడిస్తే ఆ పార్టీయే గెలవడం ఖాయం. ఈసారి ఎన్నికల్లో గుజ్జార్ వెర్సస్ మీనాలు, రాజ్పుట్స్ వెర్సస్ జాట్లుగా పోరు నడుస్తోంది. జోధ్పూర్లోని సమరూ గ్రామంలో రాజ్పుట్ల ఇళ్లను జాట్లు లూటీ చేశారంటూ వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం స్పందించకపోవడంతో రాజ్పుట్లు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. రాజ్పుట్ గ్యాంగ్స్టర్ ఆనంద్ పాల్ ఎన్కౌంటర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాజ్పుట్ సామాజిక వర్గానికి చెందిన గజేంద్ర సింగ్ షెకావత్కు అవకాశం ఇవ్వకుండా వసుంధరా రాజె అడ్డుపడటం వంటి చర్యలతో వారు బీజేపీ పట్ల అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్ర జనాభాలో 10 శాతం ఉన్న రాజ్పుట్ ఓట్లు అత్యంత కీలకంగా మారి ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశాలున్నాయి. -
ఒక్కరోజులో 9500 ప్రాజెక్టులు
న్యూఢిల్లీ : ఈనెల 29న కేవలం ఒకరోజులోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 9500 రోడ్డు ప్రాజెక్టులకు లైన్ క్లియర్ చేయనున్నారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఈ కార్యక్రమానికి వేదిక కానుంది. వీటిలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, గ్రామీణ రహదారులున్నాయని అధికారులు చెప్పారు. రూ 27,000 కోట్ల విలువైన ఈ రోడ్డు ప్రాజెక్టుల్లో కొన్నింటిని ప్రారంభిస్తుండగా, మరికొన్నింటికి శంకుస్ధాపన చేయనున్నారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ప్రధానితో పాటు కేంద్ర రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ, రాజస్థాన్ సీఎం వసుంధర రాజే పాల్గొంటారు. 873 కిమీ పరిధిలో నిర్మించిన 11 జాతీయ రహదారులను ప్రధాని ప్రారంభిస్తారు. రోడ్డు ప్రాజెక్టుల ప్రారంభోత్సవం నేపథ్యంలో ఉదయ్పూర్లో మోదీ భారీ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తారని అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఒకేసారి భారీస్ధాయిలో ప్రధాని సమక్షంలో భారీ స్ధాయిలో ప్రాజెక్టులను చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
కాంగ్రెస్ చిత్తు చిత్తు
జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ను చిత్తుగా ఓడించి బీజేపీ తిరుగులేని మెజారిటీ సాధించింది. బలమైన ప్రభుత్వ వ్యతిరేక పవనాలు కాంగ్రెస్ను దెబ్బతీయగా.. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ ప్రచారం ఆ పార్టీకి లాభించింది. మొత్తం 200 శాసనసభ స్థానాలకు గాను 199 స్థానాలకు ఎన్నికలు జరగగా.. ప్రతిపక్ష బీజేపీ 162 స్థానాలు గెలుచుకుని తిరుగులేని ఆధిక్యం ప్రదర్శించింది. అధికార కాంగ్రెస్ కేవలం 21 స్థానాలకు పరిమితమై ఘోర పరాజయం చెందింది. బీజేపీ బలం 78 సీట్ల నుంచి 162కి పెరగగా.. కాంగ్రెస్ బలం 96 సీట్ల నుంచి 21కి పడిపోయింది. తాజా ఎన్నికల్లో స్వతంత్ర సభ్యులు 7 సీట్లు, ఎన్పీపీ 4 సీట్లు, బీఎస్పీ 3 సీట్లు, ఇతరులు 2 సీట్లు గెలుచుకున్నారు. చురు నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థి మరణంతో ఎన్నిక వాయిదా పడింది. మొత్తం మీద బీజేపీ రికార్డు స్థాయిలో 46 శాతం ఓట్లు కొల్లగొట్టింది. కాంగ్రెస్కు పోలైన ఓట్ల శాతం 34కు పడిపోయింది. (2008 ఎన్నికల్లో బీజేపీకి 34.27 శాతం ఓట్లు పోలవగా.. కాంగ్రెస్కు 36.82 శాతం ఓట్లు పోలయ్యాయి.) వసుంధర భారీ విజయం... బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ముఖ్యమంత్రి అభ్యర్థి వసుంధరరాజె ఝాలార్పతన్ నియోజకవర్గం నుంచి 60,896 ఓట్ల ఆధిక్యంతో సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి చంద్రావత్పై గెలుపొందారు. ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్గెహ్లాట్ సర్దార్పురా నియోజకవర్గం నుంచి సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి శంభూసింగ్ ఖేతేశ్వర్పై 18,478 ఓట్లతో గెలిచారు. గెహ్లాట్ సొంత జిల్లా అయిన జోద్పూర్లో గల పది అసెంబ్లీ స్థానాల్లో 9 సీట్లు బీజేపీ కైవసం చేసుకుంది. మిగతా ఒక్క సీటులో గెహ్లాట్ గెలిచారు. రాష్ట్రంలో ఓటమిని అంగీకరించిన గెహ్లాట్.. ఆదివారం నాడే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తూ గవర్నర్ మార్గరెట్ అల్వాకు లేఖ సమర్పించారు. పీసీసీ చీఫ్, స్పీకర్ పరాజయం... ఈ ఎన్నికల్లో రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు చంద్రభాన్, అసెంబ్లీ స్పీకర్ దీపేంద్రసింగ్ల వంటి పలువురు హేమాహేమీలు పరాజయం పాలయ్యారు. మాంద్వా నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి నరేందర్కుమార్ చేతిలో చంద్రభాన్ ఓడిపోయారు. దీపేంద్రసింగ్ శ్రీమధోపూర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఝాబర్సింగ్ ఖార్రా చేతిలో ఓడిపోయారు. కాంగ్రెస్ మంత్రివర్గంలోని 19 మందిలో ముగ్గురు మినహా మొత్తం మంత్రులూ మట్టికరవటం విశేషం. కాంగ్రెస్ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ చంద్రభాన్ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేశారు. కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణపతక విజేత కృష్ణపునియా, ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ మమతాశర్మ వంటి ప్రముఖులు కూడా ఈ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. మోడీ ప్రభావంతోనే గెలిచాం రాజస్థాన్లో బీజేపీ విజయం రాష్ట్ర ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అంకితం. ఈ గెలుపు వెనుక మా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ ప్రభావం బలంగా ఉంది. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ కాంగ్రెస్ పాలనారాహిత్యంతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారు. గుజరాత్లో అభివృద్ధి జరుగుతోందని మోడీ చూపించారు. ఆ నమూనాను ఎక్కడైనా అనుసరించవచ్చని చూపారు. చాలా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఇలాగే చేయగలిగాయి. ఈ దేశ ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. ఇవి సెమీ ఫైనల్ ఎన్నికలు. అతి త్వరలో దేశంలో కూడా ఇది పునరావృతం కాబోతోంది. కేంద్రంలో మోడీ నేతృత్వంలో మా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. రాష్ట్రాన్ని మళ్లీ తన కాళ్లపై నిలబెట్టేందుకు మేం మంచి కృషి చేస్తాం. ప్రధానంగా రాష్ట్ర ప్రజలను బలోపేతం చేస్తాం. - వసుంధరరాజె, బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి మాపై దుష్ర్పచారంతో గెలిచారు... మా (కాంగ్రెస్) ప్రభుత్వం మంచి పాలనను అందించింది. సంక్షేమ పథకాలతో ప్రజలకు లబ్ధి కూడా చేకూర్చాం. కానీ ఓటర్ల మనసులో ప్రతిపక్ష బీజేపీ తప్పుడు అభిప్రాయం సృష్టించగలిగింది. ఈ అంతర్లీన వ్యతిరేకత ఉన్నట్లయితే దానిని ఇక ఏమీ చేయలేం. ఈ ప్రాతిపదికగానే ప్రజలు ఓటు వేసినట్లు కనిపిస్తోంది. రాజస్థాన్లో ఏ ప్రభుత్వం ఏం చేసిందనే దానిపై మా ప్రచారాన్ని కేంద్రీకరించాం. కానీ దీనిని, అభివృద్ధిని ఎన్నికల అంశంగా చేయటంలో మేం విఫలమయ్యాం. ప్రతిపక్షం మాపై దుష్ర్పచారం కానీ అభివృద్ధి గురించి మాట్లాడలేదు. వారు తప్పుడు అభిప్రాయం సృష్టించారు. వసుంధరరాజె ‘నమో’ (నరేంద్రమోడీ) పేరు చెప్పి ఓట్లు అడిగారు. కాబట్టి రాజస్థాన్లో గెలుపు ఆమె గెలుపు కాదని నేను భావిస్తున్నా. - అశోక్గెహ్లాట్, రాజస్థాన్ ముఖ్యమంత్రి -
రాజస్థాన్లో బిజెపి ఘనవిజయం:80శాతంపైగా స్థానాల్లో గెలుపు
జైపూర్: రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో బిజెపి ఘనవిజయం సాధించింది. ఈ రాష్ట్రంలో అన్ని ఫలితాలు వెలువడ్డాయి. 80శాతంపైగా స్థానాలను బిజెపి గెలుచుకుంది. మొత్తం 200 స్థానాలకు 162 స్థానాలను బిజెపి గెలుచుకుంది. జలర్పఠాన్ నియోజకవర్గంలో బీజేపీ సీఎం అభ్యర్థి వసుంధరా రాజే 60వేలకు పైగా ఓట్లతో విజయం సాధించారు.సాదుల్షహర్, పింద్వారా-అబూ, రియోడర్(ఎస్సీ) స్థానాల్లో బీజేపీ గెలుపొందింది. కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. ఆ పార్టీ 21 స్థానాల్లో మాత్రమే గెలిచింది. నేషనల్స్ పీపుల్స్ పార్టీ నాలుగు స్థానాలను, బిఎస్పి మూడ స్థానాలను, స్వతంత్ర అభ్యర్థులు ఏడు స్థానాలను, నేషనల్ యూనియనిస్ట్ జమిందార్ పార్టీ రెండు స్థానాలను గెలుచుకున్నాయి. బిజెపి 78 స్థానాల నుంచి 162 స్థానాలకు ఎగబాకగా, కాంగ్రెస్ 96 స్థానాల నుంచి 21 స్థానాలకు పడిపోయింది. రాజస్థాన్లో 200 సీట్లు ఉండగా 199 సీట్లకు పోలింగ్ జరిగింది. బీఎస్పీ అభ్యర్థి మృతి చెందడంతో చురు స్థానంలో ఓటింగ్ను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేశారు. -
రాజస్థాన్లో హస్తం పార్టీ అడ్రస్ గల్లంతు
జైపూర్: రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ కుదేలయింది. ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా హస్తం పార్టీ అడ్రస్ గల్లంతయింది. మధ్యాహ్నం రెండు 2 గంటలకు ప్రకటించిన ఫలితాలను చూస్తే కాంగ్రెస్ పార్టీకి కనీసం విపక్ష హోదా అవకాశాలు కూడా లేవని స్పష్టమవుతోంది.12 స్థానాల్లో జిల్లాల్లో కాంగ్రెస్ ఖాతా తెరవకలేకపోయింది. జైపూర్ నగరంలోని 19 స్థానాల్లో 10 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉందంటే అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ పరిస్థితి ఎంత దీనంగా ఉందో. జ్యోతిరాదిత్య సింధియా యువ మంత్రం రాజస్థాన్లో పనిచేయలేదు. బీజేపీ సీఎం అభ్యర్థి వసుంధరా రాజే తన సొంత నియోజకవర్గంలో విజయబావుటా ఎగుర వేశారు. సర్దార్పూరలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ గెలుపు బాటలో పయనిస్తున్నారు. -
రాజుల కోటలో కాషాయ రెపరెపలు
జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష బీజేపీ భారీ విజయం దిశగా దూసుకెళుతోంది. మెజారిటీ స్థానాలు గెల్చుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఎన్నికల ఫలితాల సరళిని పరిశీలిస్తే అధికార కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా కూడా దక్కే పరిస్థితి కనిపించడం లేదు. మధ్యాహ్నం 1 గంటకు అందించిన వివరాల ప్రకారం బీజేపీ మూడు స్థానాలు గెలిచింది. 143 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 28 సీట్లలో లీడింగ్లో కొనసాగుతోంది. నేషనల్ పీపుల్స్ పార్టీ 9, స్వతంత్ర అభ్యర్థులు 8 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. బీఎస్పీ అభ్యర్థులు మూడు స్థానాల్లో ముందంజలో ఉన్నారు. గంగాధర్ సాదుల్షహర్, పింద్వారా-అబూ, రియోడర్(ఎస్సీ) స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. తమ పార్టీ విజయంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. సీఎం అశోక్ గెహ్లట్, బీజేపీ సీఎం అభ్యర్థి వసుంధరా రాజే తమ తమ స్థానాల్లో స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు. -
రాజస్థాన్ ప్రజలకు థ్యాంక్స్: రాజే
జైపూర్: రాజస్థాన్ ముఖ్యమంత్రి పీఠాన్ని బీజేపీ నాయకురాలు వసుంధరా రాజే అధిష్టించనున్నారు. రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రావడంతో కమలం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. తమ పార్టీ భారీ విజయం సాధించడం పట్ల రాజే హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు, బీజేపీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. తమ పార్టీ ప్రజలు ఎంతో కష్టపడ్డారని తెలిపారు. ఈ ఫలితాలు 2014 లోక్సభ ఎన్నికల్లోనూ పునరావృతమవుతాయని అన్నారు. రాజస్థాన్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రబావం బాగా పనిచేసిందని ఆమె అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కే పరిస్థితి లేదని పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. -
రాజస్థాన్లో బీజేపీ సంబరాలు
జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు దిశగా బీజేపీ పయనిస్తోంది. బీజేపీకి అధిక స్థానాలు దక్కనున్నాయని ఎన్నికల ఫలితాల సరళి వెల్లడిస్తోంది. ఐదేళ్ల కాంగ్రెస్ పాలనకు బీటలు వారనున్నాయని వార్తలు వస్తుండడంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. బాణా సంచా కాల్చారు. జైపూర్లోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఎదుట నృత్యాలతో హోరెత్తించారు. రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లోనూ కాషాయ పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. 200 స్థానాలున్న రాజస్థాన్లో 199 సీట్లకు ఈ నెల 1న పోలింగ్ జరిగింది. ఝూలావర్ పట్టణ నియోజకవర్గంలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి వసుంధరా రాజే గెలుపుదిశగా పయనిస్తున్నారు.