rare
-
నేడు ఆకాశంలో అద్భుతం.. ఆరు గ్రహాల పరేడ్
ఈ రోజు(జనవరి 21) రాత్రి.. ఆకాశంలో ఒక అద్భుతమైన ఖగోళ దృశ్యం కనిపించనుంది. నేటి నుంచి మొదలుకొని రాబోయే కొన్ని వారాల పాటు, మన సౌర వ్యవస్థలోని ఆరు గ్రహాలు అంటే.. అంగారక గ్రహం, బృహస్పతి, యురేనస్, నెప్ట్యూన్, శుక్రుడు, శని ఒక సరళ రేఖలోకి రానున్నారు. ఇది ఒక అందమైన ప్లానెట్ పరేడ్గా కనిపించనుంది.గ్రహ సంయోగంగా పేర్కొనే ఈ దృగ్విషయం పలు గ్రహాల వరుస క్రమం ఏర్పడినప్పుడు సంభవిస్తుంది. ఈ ఖగోళ అద్భుతం జరిగే సమయంలో యురేనస్, నెప్ట్యూన్లను వీక్షించడానికి బైనాక్యులర్లు టెలిస్కోప్లు అవసరం అవుతాయి. మిగిలిన నాలుగు గ్రహాలను నేరుగా కళ్లతో చూడవచ్చు. ఈ అరుదైన గ్రహాల అమరిక రాబోయే కొన్ని వారాల పాటు కనిపించనుంది.గత వారం శని, శుక్ర గ్రహాలు ఒకదానికొకటి దగ్గరగా రావడం మొదలయ్యింది. ఇలాంటి గ్రహ అమరికలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఖగోళ శాస్త్ర ఔత్సాహికులు, నక్షత్ర పరిశీలకులు సాగించే అధ్యయనానికి ఇవి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తున్నాయి. ఈ గ్రహాలు సంపూర్ణ సరళ రేఖను ఏర్పరచకపోయినప్పటికీ, ఆకాశంలో కనిపించే వీటి అమరిక అద్భుతంగా ఉంటుంది.పరేడ్ రూపంలో కనిపించే ఈ ఆరు గ్రహాలలో శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని, నెప్ట్యూన్, యురేనస్ ఉన్నాయి. ఈ గ్రహాలన్నీ అంతరిక్షంలో మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. భూమి దాని కక్ష్యలో ఉన్న స్థానం కారణంగా ఈ అమరిక జరిగింది. జనవరిలో అంగారక గ్రహం సూర్యుడి నుండి భూమికి ఎదురుగా నేరుగా ఉండి, సరళ రేఖను ఏర్పరుస్తుందని నాసా తెలిపింది. ఈ సమయంలోనే ఈ గ్రహం భూమికి దగ్గరగా ఉంటుంది. దీని వలన అది అతిపెద్దదిగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది.జనవరి 21న ఈ అమరిక ప్రారంభమవుతుంది. ఈ అమరికను సూర్యాస్తమయం అయిన 45 నిమిషాల తర్వాత వీక్షించవచ్చు. రోజులో చీకటి పడిన తర్వాత నెల రోజుల పాటు నైరుతి దిశలో శుక్రుడు, శనిని రెండు గంటల పాటు చూడవచ్చని, బృహస్పతి ప్రకాశవంతంగా ప్రకాశిస్తుందని, తూర్పున అంగారక గ్రహం కనిపిస్తుందని నాసా తెలిపింది. భారతదేశంలోని దాదాపు ప్రతి నగరం నుంచి ఈ అరుదైన గ్రహ అమరికను చూసే అవకాశం ఉంటుంది.నేటి నుంచి రాత్రి సమయంలో ఆకాశంలో శుక్రుడు, శని, బృహస్పతి, అంగారక గ్రహాలను ఏ విధంగా వీక్షించవచ్చో ప్లానెస్ట్రీ సొసైటీకి చెందిన శాస్త్రవేత్త ఎన్ రఘనుందన్ కుమార్ తెలిపారు.1. శుక్రుడు: పశ్చిమ దిశలో ప్రకాశవంతంగా, మిణుకుమిణుకుమంటూ నక్షత్రం మాదిరిగా శుక్రుడు కనిపిస్తాడు. రాత్రి 8.30 గంటలకు అస్తమయం జరుగుతుంది. ఆ సమయంలో మనం శుక్రగ్రహాన్ని వీక్షించగలుగుతాం.2. శని: శుక్రుడిని గుర్తించిన మాదిరగానే నిశితంగా గమనించగలిగితే, శని గ్రహాన్ని కూడా చూడవచ్చు. లేత పసుపురంగుతో పాటు తెల్లని నక్షత్రంలా శని గ్రహం కనిపిస్తుంది.తూర్పు దిశలో3. బృహస్పతి: ఆకాశంలో తూర్పు వైపుకు తిరిగి చూస్తే మెరుస్తున్న నక్షత్రం లా బృహస్పతి కనిపిస్తుంది.4. అంగారక గ్రహం: తూర్పు దిశలో నారింజ ఎరుపు నక్షత్రంలా కనిపించేదే అంగారక గ్రహం.అర్ధరాత్రి, సూర్యోదయానికి ముందు..బృహస్పతిని రాత్రి 10 గంటల ప్రాంతంలో ఆకాశంలో నడినెత్తిపై చూడవచ్చు. అర్ధరాత్రి 12 గంటల తరువాత అంగారక గ్రహాన్ని చూడవచ్చు. ఇది సూర్యోదయానికి ముందు పశ్చిమ దిశలో కనిపిస్తుంది. ఈ వివరాలను అందించిన శాస్త్రవేత్త రఘునందన్ కుమార్ తన ఇంటి సమీపం నుంచి ఆకాశంలో ఇటీవలి కాలంలో ఈ గ్రహాలు ఎలా కనిపించాయో ఒక ఫొటో ద్వారా తెలియజేశారు. ఇది కూడా చదవండి: Mahakumbh: కుంభమేళాకు భయపడిన బ్రిటీష్ పాలకులు.. విప్లవగడ్డగా మారుతుందని.. -
తారను మాయం చేయనున్న జాబిల్లి
అంతరిక్షంలో అరుదైన ఘట్టం చోటుచేసుకోనుంది. ఆకాశంలో అత్యంత కాంతివంతమైన నక్షత్రం స్పైకా. భూమి నుంచి రాత్రిపూట స్పష్టంగా చూడగలిన ఈ నక్షత్రం నవంబర్ 27న దాదాపు గంటపాటు కనిపించదు. భూమికి, ఆ నక్షత్రానికి మధ్య చంద్రుడు వస్తుండటమే ఇందుకు కారణం. అమెరికా తూర్పు ప్రాంతంతో పాటు కెనడాలో దీన్ని చూడవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. 27న ఉదయం 5.50కు స్పైకా అదృశ్యమై గంట తర్వాత మళ్లీ దర్శనమివ్వనుంది. భూమి నుంచి 250 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న స్పైకా నీలం, తెలుపు కాంతులతో వెలిగిపోతూంటుంది. భూమి నుంచి నేరుగా చూడగలిగిన అతి పెద్ద నక్షత్రాల్లో ఇదొకటి. అంతరిక్ష వింతలపై ఆసక్తి ఉన్నవారిని నవంబర్ నెలలో మరో మూడు ఘట్టాలు ఊరిస్తున్నాయి. బృహస్పతి, శని, అంగారక గ్రహాలు రాత్రిపూట ఎంచక్కా దర్శనమివ్వనున్నాయి. అవి భూమికి సమీపంగా వస్తాయని టెలిస్కోపు లేకున్నా బైనాక్యులర్లతో వాటిని స్పష్టంగా చూడొచ్చని నాసా పరిశోధకులు తెలిపారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Ratan Tata Photos: దివికేగిన వ్యాపార సామ్రాజ్యాధిపతి రతన్ టాటా...(ఫొటోలు)
-
కవలలే గానీ... గర్భాశయాలు వేరు
వారు కవలలే. ఒక తల్లి పిల్లలే. కాకపోతే చెరో గర్భాశయం నుంచి పుట్టుకొచ్చారు. అదెలా సాధ్యమంటారా? వాళ్లమ్మకు రెండు గర్భాశయాలున్నాయి! ఎంచక్కా ఒక్కోదాంట్లో ఒక్కొక్కరు పురుడు పోసుకున్నారన్నమాట. వైద్యపరంగా అత్యంత ఈ అరుదైన ఘటన చైనాలో జరిగింది. ఇది అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లోకెక్కింది. పది లక్షల జననాల్లో ఒక్కసారి మాత్రమే ఇలా జరిగేందుకు అవకాశం ఉంటుందట. చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్లో లీ అనే మహిళ సెపె్టంబర్ తొలి వారంలో పండంటి కవలలకు జన్మనిచి్చంది. పిల్లాడు 3.3 కిలోలు, పాప 2.4 కిలోల బరువుతో పుట్టారు. అయితే వారిద్దరూ చెరో గర్భాశయంలో పెరిగారు! లీకి రెండు గర్భాశయాలుండటమే ఇందుకు కారణం. లీకి గర్భాశయాలు రెండూ సంపూర్ణంగా ఎదగడమే గాక పూర్తి ఆరోగ్యంగా ఉన్నాయని ఆమెకు పురుడు పోసిన సీనియర్ డాక్టర్ కై యింగ్ చెప్పుకొచ్చారు. పైగా ఆ రెండింట్లోనూ సహజ పద్ధతిలో గర్భధారణ జరగడం మరీ అరుదని వివరించారు. తమకు తెలిసి గతంలో కేవలం రెండు కేసుల్లో మాత్రమే ఇలా జరిగిందని చెప్పారు. ఇలా జంట గర్భాశయాలుండటాన్ని వైద్య పరిభాషలో యుటెరస్ డైడెలి్ఫస్గా పిలుస్తారు. కేవలం 0.3 శాతం మంది మహిళల్లో మాత్రమే ఇందుకు అవకాశముంటుంది. కారణమేమిటో తెలియకపోయినా, లీకి ఇంతకు ముందు వచి్చన గర్భం నిలవలేదు. 27 వారాల తర్వాత అబార్షన్ అయింది. దాంతో గత జనవరిలో మళ్లీ గర్భం దాల్చాక వైద్యులు పక్కాగా ముందుజాగ్రత్తలు తీసుకున్నారు. అన్నీ సజావుగా జరిగి కాన్పు తేదీ సమీపించాక రిస్కు తీసుకోకుండా సిజేరియన్ చేశారు. గతేడాది అమెరికాలోని అలబామాలో కూడా ఇలాంటి ఉదంతం జరిగినట్టు తెలుస్తోంది. రెండు గర్భాశయాలున్న మహిళ డిసెంబర్లో ఇలాగే ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచి్చంది. గత కాన్పులో ఆమెకు ముగ్గురు పిల్లలు పుట్టారు. కానీ వారంతా ఒకే గర్భాశయంలో పురుడు పోసుకోవడం విశేషం! ఎందుకిలా...? → గర్భావస్థలో పిండం ఎదిగే క్రమంలో గర్భాశయానికి సంబంధించిన రెండు కీలకమైన ట్యూబులు సకాలంలో కలిసిపోని పక్షంలో అవి రెండు గర్భాశయాలుగా ఏర్పడతాయి. → కొన్ని కేసుల్లో ఒక్కో గర్భాశయానికి విడిగా ఒక్కో ముఖద్వారం ఉంటుంది. యోని గుండా ఏర్పడే సన్నని కణజాల ద్వారం వాటిని విడదీస్తుంది. → ముందస్తు పరీక్షలు చేయించుకుంటే తప్ప గర్భధారణ జరిగేదాకా జంట గర్భాశయాలు ఉనికి ఇతరత్రా బయటపడే అవకాశం చాలా తక్కువ. → ఇలాంటి మహిళలకు గర్భస్రావం జరిగే ముప్పు ఎక్కువగా ఉంటుంది. అంతేగాక పిండం సరిగా ఎదగకపోవడం, ముందస్తు కాన్పు, కాన్పు సందర్భంగా విపరీతమైన రక్తస్రావం వంటి సమస్యలు తలెత్తవచ్చు. – బీజింగ్ -
ఓ డాక్టర్ హార్ట్ బిట్..! హృదయాన్ని మెలితిప్పే కేసు..!
గుండెకు రూపం ఉంటుంది. హృదయానికి కాదు. గుండెకు వైద్యం చేసేటప్పుడు వైద్యుడు తన హృదయం చేసే ఉద్వేగాలను అదుపు చేసుకోవాలి. అయితే అన్నిసార్లూ అలా ఉండదు. ఒక్కోసారి గుండెకు వైద్యం చేసేటప్పుడు వైద్యుడి గుండె కొట్టకులాడుతుంది. ఆ గుండెను ఎలాగైనా కాపాడాలని పెనుగులాడుతుంది. పరితపిస్తుంది. అలాంటి ఒక అరుదైన కేసు వివరాలివి... దాదాపు రెండేళ్ల కిందట మా దగ్గరికి 32 ఏళ్ల సతీష్ (పేరు మార్చాం) తీవ్రమైన ఛాతీనొప్పి, గుండెదడతో వచ్చాడు. వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుని చూస్తే అతడి గుండె నార్మల్ కంటే చాలా వేగంగా కొట్టుకుంటూ, ఆగిపోయింది. ఇలాంటప్పుడు కరెంట్తో షాక్ ఇచ్చి మళ్లీ కొట్టుకునేలా చేస్తుంటాం. గుండె మరీ బలహీనంగా కొట్టుకుంటున్నప్పుడు లేదా హార్ట్ అటాక్తో గుండె ఆగిపోయినప్పుడు కరెంట్తో షాక్ ఇచ్చి తిరిగి స్పందించేలా చేయడం మామూలే. సతీష్కూ ఇలాగే షాక్ ఇచ్చి ఆగిపొయిన గుండె మళ్లీ స్పందించేలా చేశాం. ఆ తర్వాత వెంటనే అతణ్ణి కాథ్ల్యాబ్కు తీసుకెళ్లి యాంజియోగ్రామ్ చేసి చూస్తే అందులో ఏమీ తేడా లేదుగానీ, వేగంగా కొట్టుకుంటున్న అతడి గుండె స్పందనలు నార్మల్ కాలేదు. గుండె బాగా బలహీనంగా ఉంది. లంగ్స్లోకి నీరు చేరింది. వెంటిలేటర్ మీద ఉంచాల్సి వచ్చింది. గుండె ఇలా వేగంగా కొట్టుకునే కండిషన్ను ‘వెంట్రిక్యులార్ ట్యాకికార్డియా – వీటీ’ అంటారు. ఒకసారి షాక్ తర్వాత... గుండె స్పందించడం మొదలయ్యాక మళ్లీ మునుపటి పరిస్థితి రాకుండా ఉండటానికి అనేక ఇంజెక్షన్లు ఇచ్చాం. కానీ వీటీ అదుపులోకి రాలేదు. మల్టిపుల్ ఇంజెక్షన్స్ తర్వాత కూడా అతడి పరిస్థితి చక్కబడకపోవడంతో చాలా బాధేసింది. పాపం... పెళ్లి వయస్సుకు వచ్చిన కుర్రాడు. సాధారణంగా వెంట్రిక్యులార్ ట్యాకికార్డియా (వీటీ)ని చక్కదిద్దడానికి పేస్ మేకర్ అమర్చుతారు. ఇది గుండె స్పందనల్లో మార్పులు వచ్చినప్పుడల్లా ఓ చిన్న షాక్ను ఉత్పన్నం చేసి, గుండె స్పందనలను సాధారణ స్థితిలోకి వచ్చేలా చేస్తుంది. కానీ అతడికి వస్తున్నది వీటీల పరంపరం. దాన్ని వీటీ స్టార్మ్ అంటారు. అంటే వీటీల తుఫాను. ఇలా ఆగకుండా వస్తున్న వీటి పరంపరకు పేస్మేకర్ అమర్చినా లాభం ఉండదు. అది వేగంగా మాటిమాటికీ కరెంట్తో షాక్లిస్తూ పోతుంటే అందులోని బ్యాటరీ అయిపోతుంది తప్ప... ఇంక పెద్దగా ప్రయోజనం ఉండదు. బయటి నుంచే ఓవర్ డ్రైవ్ పేసింగ్ చేసే ఓ చిన్న పేస్ మేకర్ పెట్టి చూశాం. లాభం లేదు. వైద్య చికిత్సల్లో ఇలాంటి పరిస్థితిని ఎన్ని రకాలుగా ట్యాకిల్ చేయవచ్చో అన్నీ చేశాం. సిటీలోని ఇతర కార్డియాలజిస్టులతోనూ మాట్లాడాం. ఇలా వీటీ వచ్చినప్పుడల్లా బ్లడ్ప్రెషర్ డౌన్ అయిపోతోంది. కొన్నిసార్లు 50కు కూడా పడిపోయింది. వీటీలు ఆగడం లేదు. ఊపిరితిత్తుల్లో నీరు. పేషెంట్ వెంటిలేటర్ మీద. అలా వెంటిలేటర్ మీద ఉంచాల్సిరావడంతో కిడ్నీలు పనిచేయడం మానేశాయి. డయాలసిస్ చేయాల్సి వచ్చింది. ఎక్కడెక్కడి మెడిసిన్స్ ఇచ్చాం. ఎన్నెన్నో ఇంజెక్షన్లు చేశాం. నార్మలైజ్ చేయడానికి ఎన్ని ప్రక్రియలు ఉన్నాయో అన్నీ చేసి చూశాం. ఏమీ ప్రయోజనం కనిపించలేదు. చిన్న వయసు. లోకం అంతగా చూడని కుర్రాడు కళ్ల ముందే చనిపోతున్నాడనిపించింది. చనిపోవడం ఖాయం. ఒక చివరి ప్రయత్నంగా మెడికల్ లిటరేచర్ అంతా చదివా. ‘‘సింపథెక్టమీ’’ అనే ఓ ప్రోసీజర్ ఉంటుంది. ఇందులో నెర్వ్కు సంబంధించిన గ్యాంగ్లియాన్స్కు ఇంజెక్షన్ ఇస్తే సింపథెటిక్ నర్వస్ సిస్టమ్లోని నరాలు నెమ్మదిస్తాయి. దాంతో వీటీ ఆగుతుంది అని లిటరేచర్లో ఉంది. పేషెంట్ బంధువులను అడిగితే ‘ఎలాగూ చనిపోయేలా ఉన్నాడు. ఆ ప్రోసీజర్ చేస్తే బతుకుతాడేమో చేయండి సర్’ అన్నారు.దాంతో సింపథెక్టమీ చేసే నా జూనియర్... డాక్టర్ విజయభాస్కర్ అని ఉన్నాడు. అతణ్ణి పిలిపించాం. వెంట్రిక్యులార్ ట్యాకికార్డియాకు సింపథెక్టమీ చేయడం మెడికల్ లిటరేచర్లో రాసి ఉన్న చాలా అరుదైన ప్రోసీజర్. నిత్యం మెడికల్ ప్రాక్టీస్లో అనుసరించేది కాదు. కేవలం ప్రయోగాత్మకంగా చేయాలనుకున్నది మాత్రమే. ప్రపంచం మొత్తమ్మీద ‘వీటీ’కి అప్పటికి జరిగిన సింపథెక్టమీ ప్రోసీజర్లు చాలా తక్కువ. పేషెంట్ను క్యాథ్ల్యాబ్లోకి తీసుకెళ్లాం. వెంటనే సింపథెక్టమీకి పూనుకున్నాం. వెన్నుపూస ఇరువైపులా ఉన్న గ్యాంగ్లియాన్స్కు ఇంజెక్షన్ ఇవ్వడం కోసం డాక్టర్ విజయభాస్కర్ సహాయంతో ‘బై లేటరల్ సర్వైకల్ సింపథెక్టమీ’ అనే ప్రోసీజర్ చేశాం. ఒకసారి సింపథెక్టమీ చేశాక... ఒకటి రెండు సార్లు వీటీ వచ్చింది. అయితే ‘ఓవర్డ్రైవ్ పేసింగ్’తో తగ్గిపోయాయి. ఆ తర్వాత మళ్లీ వీటీ రాలేదు. వీటీ ఆగిపోగానే నెమ్మదిగా బాధితుడి కండిషన్ మెరుగవ్వడం మొదలైంది. మూత్రం రావడం మొదలైంది. డయాలసిస్ ఆపేశాం. వెంటిలేటర్ కూడా తీసేశాం. ఆ తర్వాత పేస్ మేకర్ అమర్చాం. రెండేళ్ల తర్వాత మొన్ననే ఓసారి అతడు వచ్చాడు. పరీక్షల్లో గుండె కండిషన్ బాగా మెరుగైనట్లు కనిపించింది. ఈమధ్య పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. ఇదో టీమ్ వర్క్. ఓ బృందంలా చాలా ఫోకస్డ్గా పనిచేశాం. చావు తప్ప మరో దారే లేదనుకున్న ఓ బాధితుడి జబ్బును పూర్తిగా నార్మల్ చేయడం మా కార్డియాలజిస్టులకు దేవుడిచ్చిన ఒక అరుదైన అవకాశమని భావిస్తున్నాం. డా. ఎమ్.ఎస్.ఎస్. ముఖర్జీ, సీనియర్ కార్డియాలజిస్ (చదవండి: కుర్రాళ్ల గుండెలకు.. ఏమవుతోంది?) -
పెళ్లినాటి రేర్ ఫోటోలు పంచుకున్న సుధీర్ బాబు.. సందడిగా స్టార్ హీరోలు
-
దళపతి విజయ్ బర్త్ డే.. ట్రోల్ చేసినా సరే ఈ హీరో అందుకే స్పెషల్! (ఫొటోలు)
-
'ప్రేమలు' బ్యూటీ బర్త్ డే స్పెషల్.. రేర్ అండ్ క్యూట్ ఫొటోలు
-
'సత్యభామ' కాజల్ అగర్వాల్ బర్త్డే.. ఈ ఫోటోలు చూశారా..?
-
Manushi Chhillar: బ్యూటీ క్వీన్, ఆపరేషన్ వాలెంటైన్ భామ బర్త్డే స్పెషల్ రేర్ ఫోటోలు
-
మెగాస్టార్ ఇష్టసఖి..హీరో తల్లి.. హీరోయిన్ అత్త..ఎవరీమె?
-
Akhil Akkineni: అయ్యగారు.. అప్పుడే నెం.1! (ఫోటోలు)
-
Kalyani Priyadarshan Unseen Photos: క్యూట్గా కవ్వించే ఈ హీరోయిన్ ఎవరో తెలుసా...! (ఫోటోలు)
-
మాయా లేదు.. మంత్రం లేదు, వాళ్లంతే : అయితేనేం..!
ఆ ఇద్దరిదీ ఒకటే జననం. ఒకే తల్లి కడుపున ఒక్కటిగానే పుట్టారు. అందరిలాగానే రెండు గుండెలు, రెండు మెదడులు, రెండు చేతులు ఉన్నాయి. కానీ కాళ్లు మాత్రం రెండే. అదేంటి అనుకుంటున్నారా. మన వీణా వాణిలాగా పంజాబ్కు చెందిన సోహ్నా-మోహనా ఇద్దరూ అవిభక్త కలలు. మరి వీరి జీవనం ఎలా సాగుతోంది? ఇద్దరూ ఒకేలా ఆలోచిస్తారా? తెలుసుకుందాం రండి! 2003, జూన్ 14న ఢిల్లీలోని సుచేత కృపలానీ హాస్పిటల్లో జన్మించారు ఈ కవలలు. డెలివరీ చేసిన డాక్టర్ కూడా వీరిని చూసి విస్తుపోయారు. చాలా అరుదైన పరిస్థితిలో వీరు జన్మించారు. శరీరంలోని పై భాగం అంతా విడి విడిగానే ఉంటుంది. కానీ తుంటినుంచి దిగువ భాగంమాత్రం కలిసిపోయింది. పిత్తాశయం, ప్లీహము ఒకటే. అలాగే ఇద్దరికీ కలిపి రెండు కాళ్లు మాత్రమే ఉన్నాయి. వీరిని విడదీసే ప్రయత్నం చేస్తే ఎవరో ఒకరు మాత్రమే బతికే అవకాశం ఉందని వైద్యులు తేల్చారు. ఈ పిల్లల తండ్రి సుర్జిత్ కుమార్ టాక్సీ డ్రైవర్. వారికి అప్పటికే 3 కుమార్తెలు ఉన్నారు. దీంతో కవల శిశువులను పోషించలేమని రెండు నెలల వయస్సులో వారిని విడిచిపెట్టారు. దీంతో వీరిని ఢిల్లీలోని AIIMకి తరలించారు. తరువాత అంటే 2003 ఆగస్టు 15న అమృత్సర్లోని షెల్టర్హోమ్ ఆల్ ఇండియా పింగళ్వార ఛారిటబుల్ సొసైటీ దత్తత తీసుకుంది. డాక్టర్ ఇందర్జిత్ కౌర్ చాలా ఆదరంగా పోషించడమే కాదు, సోహ్నా సింగ్, మోహనా సింగ్ అంటూ నామకరణం చేశారు. వీరి ఫస్ట్ బర్త్డే పార్టీని కూడా ఘనంగా నిర్వహించారు. View this post on Instagram A post shared by Humans of Bombay (@officialhumansofbombay) పీఎస్పీసీఎల్లో ఉద్యోగాలు ఐటీఐ డిప్లొమా (ఎలక్ట్రీషియన్) పూర్తి చేసిన ఈ కవలలు పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (PSPCL)లో ఎలక్ట్రీషియన్గా ఉద్యోగాలు సాధించారు. ఇద్దరీ ఆలోచనలు వేరు, వేరు వీరి శరీరంలో రెండు మెదళ్లు ఉన్నాయి. అందుకే నేమో ఇద్దరికీ విలక్షణమైన వ్యక్తిత్వాలు,అభిప్రాయాలు ఉన్నాయి. సోహ్నా సింగ్ డామినేటింగ్గా, చురుగ్గా ఉంటాడు. మోహనా సింగ్ మౌనంగా, సున్నితంగా ఉంటాడు. ఇద్దిరికీ ఓటు హక్కు, వేర్వేరు ఓటర్ ఐడీలు సోహ్నా-మోహనా ఓటు వేశారు వీరి ప్రత్యేక పరిస్థితిని అర్థం చేసుకున్నఎన్నికల సంఘం ఇద్దరికీ వేర్వేరుగా ఓటర్ కార్డులను ఇవ్వడం విశేషం. అమృత్సర్లోని మనవాల్లో ఇద్దరు వేర్వేరు ఓటర్లుగా తొలిసారి ఓటు వేశారు. -
అమెరికాలో ప్రాణాంతక బుబోనిక్ ప్లేగు వ్యాధి కలకలం
అమెరికాలోని ఓరేగాన్ రాష్ట్రంలో అరుదైన వ్యాధి నమోదయ్యింది. అక్కడ ఓ వ్యక్తికి బుబోనిక్ ప్లేగు(Bubonic Plague) సోకినట్లు గుర్తించారు. పెంపుడు పిల్లి నుంచి ఆ వ్యాధి వ్యాపించి ఉంటుందని భావిస్తున్నారు. బుబోనిక్ ప్లేగు వల్ల ఒకప్పుడు యూరోప్లో భారీ నష్టం జరిగింది. మధ్యయుగంలో యూరోప్లో సోకిన ఆ ప్లేగు వల్ల సుమారు మూడవ వంతు జనాభా మృతి చెందింది. ఇప్పుడు మళ్లీ ఓరేగాన్లోని డిసెచూట్స్ కౌంటీలో తాజాగా అలాంటి కేసునే గుర్తించారు. అతనికి ట్రీట్మెంట్ ఇస్తున్నామని అధికారులు చెప్పారు. బాధితుడి సమీపంలో ఉన్న వారిని గుర్తించి చికిత్స అందిస్తున్నారు. ఆ వ్యక్తికి చెందిన పెంపుడు పిల్లికి కూడా చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్ రిచర్డ్ వాసెట్ తెలిపారు. అయితే ఈ వ్యాధి జంతువు లేదా ఈగకు సోకిన ఎనిమిది రోజుల తర్వాత మానువుల్లో ఈ ప్లేగు లక్షణాలు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. దీని లక్షణాలు జ్వరం, వికారం, బలహీనత, చలి, కండరాల నొప్పులు తదితరాలు వస్తాయని అన్నారు. ముందుగా రోగ నిర్థారణ చేయకపోతే గనుక ఈ వ్యాధి రక్తప్రవాహంలోకి వ్యాపించి అక్కడ నుంచి ఊపిరితిత్తులను ప్రభావితం చేసి.. న్యూమోనిక్ ప్లేగుగా మారి పరిస్థితి విషమిస్తుందని చెబుతున్నారు వైద్యులు. ఇక్కడ అదృష్టవశాత్తు ముందుగానే ఈ వ్యాధిని ప్రారంభదశలోనే గుర్తించి చికిత్స అందించగలిగామని అన్నారు. అందువల్ల పెద్ద ప్రమాదం ఏమీ లేదని భరోసా ఇచ్చారు. సదరు వ్యక్తి ఉన్న ఒరెగాన్ ప్రాంతంలో అందుకు సంబంధించిన కేసులు ఏమీ నమోదు కాలేదన్నారు. నిజానికి ఈ ప్రాంతంలో ప్లేగు వ్యాధులు చాలా అరుదని చెబుతున్నారు. చివరిగా 2015లో దీనికి సంబంధించిన కేసు నమోదయ్యింది. ఎలుకలు, పెంపుడు జంతువుల ద్వారా వ్యాపించే ఈ వ్యాధి 14వ శతాబ్దంలో ఐరోపాలో విలయం సృష్టించింది. నాటి సంక్షోభం కాల క్రమంలో ‘బ్లాక్ డెత్’ అన్న పేరు స్థిరపడింది. (చదవండి: హోలోగ్రామ్ వరుడు.. ప్రపంచంలోనే తొలి AI మ్యారేజ్!!) -
నేలమీది తారక: పువ్వు కాదు.. పుట్టగొడుగు!
ఫొటోలో వింత పువ్వులా కనిపిస్తున్నది నిజానికి పువ్వు కాదు, పుట్టగొడుగు. చూడటానికి నక్షత్రాకారంలో కనిపించడం వల్ల దీనిని ‘రౌండెడ్ ఎర్త్స్టార్’ అంటారు. దీని శాస్త్రీయనామం ‘గీస్ట్రమ్ సాకేటమ్’. ఈ రకం పుట్టగొడుగులు ఎక్కువగా ఎండకు ఎండి, వానకు నాని పుచ్చిపోతున్న కలప దుంగలపై వేసవి చివరి భాగంలో ఇవి ఎక్కువగా పెరుగుతాయి. హవాయి పొడి అడవుల్లో ఇవి విరివిగా కనిపిస్తాయి. అమెరికా, కెనడా, చైనా, ఉరుగ్వే, కాంగో, క్యూబా, మెక్సికో, పనామా, దక్షిణాఫ్రికా, టాంజానియా, టొబాగో, భారత దేశాలలో కొంత అరుదుగా కనిపిస్తాయి. పుచ్చిపోయే దశలో ఉన్న కలప దుంగల్లోని క్యాల్షియంను ఆహారంగా చేసుకుని ఈ పుట్టగొడుగులు పెరుగుతాయి. ఇవి మాసిపోయిన తెలుపు, లేతగోధుమ రంగు నుంచి ముదురు గోధుమ రంగు వరకు వివిధ ఛాయల్లో కనిపిస్తాయి.అయితే, ఇవి తినడానికి పనికిరావు. -
ప్రముఖ ఎన్నారై వంశీరెడ్డి కంచరకుంట్లకు అరుదైన గౌరవం!
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్- టీటీఏ సంస్థ అధ్యక్షులు, వాట్స్(WATS), వాటా(WATA), ఇండియన్ కమ్యూనిటీ సెంటర్(Indian Community Center) వ్యవస్థాపకులు, ప్రముఖ ఎన్నారై వంశీరెడ్డి కంచరకుంట్లకు అరుదైన గౌరవం దక్కింది. కమ్యూనిటీ సర్వీస్, వాలంటీర్ లీడర్షిప్ విభాగాల్లో అత్యుత్తమ సేవలు కనబరిచినందుకు గాను అమెరికాలో ప్రతిష్టాత్మకమైనా యూఎస్ ప్రెసిడెన్షియల్ అవార్డ్ వరించింది. ఆయన సేవా నిరతిని గుర్తించిన వాట్స్ సంస్థ.. ప్రెసిడెన్షియల్ వాలంటీర్ సర్వీస్ అవార్డ్ (PVSA), లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులను స్వర్ణ పథకంతో సత్కరించింది. సంక్రాంతి, రిపబ్లిక్ డేని పురస్కరించుకుని వాట్స్(WATS) సంస్థ నిర్వహించిన ఈవెంట్లో.. సీటెల్లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రకాష్ గుప్తా చేతుల మీదుగా ఈ అవార్డ్స్ను అందజేశారు. (చదవండి: తానా ప్రపంచ సాహిత్యవేదిక' గా 64 వ సాహిత్య సమావేశం) -
బాల్యం నుంచి స్టార్ హీరో దాకా.. సల్మాన్ ఖాన్ అరుదైన చిత్రాలు
-
Venkatesh Daggubati: అందరికీ నచ్చేసిన వెంకీ మామ అరుదైన ఫోటోలు
-
Rajinikanth: బస్ కండక్టర్ నుంచి సూపర్స్టార్గా ఎదిగిన రజనీకాంత్ అరుదైన (ఫొటోలు)
-
TPCC Chief Revanth Reddy: ఒడిదొడుకులను దాటి.. ముఖ్య నేతగా ఎదిగిన రేవంత్ అరుదైన ఫొటోలు
-
అత్యంత అరుదైన ఘటన!ఒకేసారి రెండు గర్భాలా..!:
ఒక మహిళలకు రెండు గర్భాశయాలు ఉండటం అనేది అత్యంత అరుదు. ఇలా ఉంటే డెలివరీ టైంలో చాలా రిస్క్ ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఒకవేళ ఉన్నా రెండింటిలోనూ శిశువులు పెరగడం అనేది కూడా అరుదే. అలాంటి విచిత్ర ఘటనే అలబామాకు చెందిన మహిళ విషయంలో జరిగింది. అసలేం జరిగిందంటే..దక్షిణ అమెరికాలోని అలాబామాకు చెందిన కెల్సీ హాట్చర్, కాలేబ్ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఐతే ఆమె మరోసారి గర్భం దాల్చింది. ఇందులో వింత ఏంటి? అని అనుకోకండి..ఎందుకంటే? ఈసారి ఒకేటైంలో రెండుసార్లు గర్భం దాల్చింది. ఇదేలా సాధ్యం అని వైద్యులు కూడా షాక్ అయ్యారు. ఇక్కడ కెల్సీకి తన ఆరోగ్య గురించి ముందు తెలుసు. దీంతో ఆమె ఈసారి తన కడుపులో ఇద్దరు ఉన్నారని తన భర్తకు చెబుతుంది. ఆటపట్టిస్తున్నావు ఇద్దరెలా ఉంటారని ఆమె భర్త కూడా కొట్టిపడేశాడు కూడా. నిజమే!ఇద్దరు శిశువులు పెరుగుతున్నారని నమ్మకంగా చెప్పింది తన భర్తకి. ఆ మహిళకు రెండు గర్భాశయాలున్నట్లు డాక్టర్లు ఇదివరకే ఆమెకు చెప్పారు. అయితే ఈసారి రెండు గర్భాశయాల్లోనూ శిశువులు పెరుగుతున్నాయి. ఇలా జరగదు. ఏదో ఒక దానిలో గర్భం పెరగడం జరుగుతుంటుంది. అయితే ఇక్కడ రెండు గర్భాశయాలు దేనికది వేరుగా పిండాన్ని అభివృద్ధి చేస్తున్నాయి. ఒక గర్భాశయంలో ఇద్దరు ఉంటే కవలలు అని పిలుస్తాం. ఇప్పుడు వేర్వేరు గర్భాశయాల్లో పిండాలు పెరుగుతున్నప్పుడూ కూడా కవలలనే పిలవాలా? అనేది సందేహస్పదమైన ప్రశ్న. ఈ మేరకు ఆమెకు వైద్యం అందిస్తున్న గైనకాలజిస్ట్ డాక్టర్ శ్వేతా పటేల్ మాట్లాడుతూ.. ఇలాంటివి అత్యంత అరుదని అన్నారు. కొంతమందది స్త్రీల్లో పుట్టుకతో ఇలా రెండు గర్భాశయాలు ఉంటాయి. ఈ గర్భాశయాలు రెండు చిన్న గొట్టాలతో ప్రారంభమవుతుంది. ఐతే పిండం పెరుగుతున్నప్పుడూ గొట్టాలు సాధారణంగా పెద్ద బోలు అవయవాన్ని సృష్టించేలా కలుస్తాయి. దీన్నే గర్భాశయం అంటారు. కొన్నిసార్లు ఈ ట్యూబ్లు పూర్తిగా చేరవు. బదులుగా దేనికది ప్రత్యేకంగా లేదా వేర్వేరు అవయవంగా అభివృద్ధి చెందుతాయి. డబుల్ గర్భాశయం ఒక యోని ప్రారంభాన్ని కలిగి ఉంటుంది. ఈ ఓపెనింగ్ను సర్విక్స్ అంటారు. కొన్ని సందర్భాల్లో ఇలా ప్రతి గర్భాశయం సెపరేట్ గర్భాశయాన్ని కలిగి ఉంటాయన్నారు. నిజానికి రెండు గర్భాశయాలు ఉన్న చాలా వరకు ఒక గర్భాశయంలోనే పిండం పెరుగుతుంది. రెండు గర్భాల్లోనూ పిండం అనేది పెరగదు. సరిగ్గా పిండం ఎదిగే క్రమంలో ఆ రెండు గొట్టాల్లా ఉన్న ట్యూబ్లు ఒక్కటిగా అయ్యి పిండం పెరిగేలా ఒకే గర్భాశయంగా మారతాయి. అరుదైన సందర్భాల్లోనే ఇలా వేర్వేరుగానే రెండు గర్భాశయాల్లో పిండాలు అభివృద్ధి చెందడం అనేది జరుగుతుందన్నారు శ్వేతా పటేల్. ఇలా డబుల్ గర్భాశయం ఉన్న స్త్రీలు విజయవంతంగా ప్రెగ్నెంట్ అయినప్పటికీ తరుచుగా గర్భస్రావం లేదా నెలలు నిండకుండానే డెలివరీ అవ్వడం జరుగుతుంటుందని క్లిష్టతర కాన్పుల నిపుణడైన డాక్టర్ రిచర్డ్ డేవిస్ చెబుతున్నారు. ప్రతి వెయ్యి మంది మహిళలల్లో ముగ్గురికి ఇలా డబుల్ గర్భాశయం లేదా డబుల్ గర్భాశయాలు ఉండొచ్చు అని వివరించారు. ప్రస్తుతం తాము సదరు మహిళ కెల్సీని ప్రసవం అయ్యేంత వరకు చాల జాగ్రత్త పర్యవేక్షిస్తూ.. ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. తాము ఇద్దరు శిశువులు బాగున్నారని భరోశ ఇవ్వలేమని పటేల్ చెబుతున్నారు. వైద్య పరంగా ఇది అరుదైన విషయమే అయినా ఆ శిశువులని కవలలని కాకుండా ప్రత్యామ్నాయంగా ఏమని పిలవాలో తెలియాల్సి ఉందన్నారు. (చదవండి: ఆహారం అనేది రుచి కోసం అనుకుంటే అంతే సంగతులు! వైద్యులు స్ట్రాంగ్ వార్నింగ్) -
Dalip Tahil Rare Pics: బాలీవుడ్ ప్రముఖ నటుడు దలీప్ తాహిల్ పుట్టినరోజు సందర్భంగా రేర్ (ఫోటోలు)
-
సూపర్ రేర్ చిరుత టోబీ పఫర్ ఫిష్: మురిసిపోతున్న ప్రకృతి ప్రేమికులు
ప్రకృతి అంటేనే మనిషికి అందని రహస్యాల పుట్ట. అప్పుడప్పుడు అద్భుతమైనవి వెలుగులోకి వచ్చి మనల్ని ఆశ్చర్యంలో ముంచుత్తుతాయి. అయితే కొన్ని అరుదైన జీవులు కూడా అంతరించిపోతున్న తరుణంలో, మారుతున్న కాలంతో పాటు కొన్ని ఆశ్చర్యకరమైన జీవులు వెలుగులోకి రావడం విశేషం. ఆస్ట్రేలియా తీరంలో అత్యంత అరుదైన లెపార్డ్ టోబీ పఫర్ ఫిష్ దర్శనమిచ్చింది. దీంతో ప్రకృతి ప్రేమికులు సంబర పడుతున్నారు. Super Rare Leopard Toby Puffer Fish సముద్రపు లోతుల్లో సంచరిస్తున్న కోరల్ సీ మెరైన్ పార్క్లో ఈత కొడుతున్న డీప్ సీ డైవర్ దృష్టిలోచిరుతపులిని పోలిన మచ్చలున్న చిన్న తెల్ల చేప పడింది. దీన్నే లెపార్డ్ పఫర్ ఫిష్ లేదా కాంతిగాస్టర్ లెపార్డ్ అని పిలుస్తారు. ఆస్ట్రేలియా తీరంలోని గ్రేట్ బారియర్ రీఫ్లో ఈత కొడుతుండగా, ఒక డైవర్ 'అత్యంత అరుదైన' సముద్ర జీవిని చూసి ఆశ్చర్యపోయాడు టోబీ పఫర్ అందమైన ఫోటోను గ్రేట్ బారియర్ రీఫ్ మెరైన్ పార్క్ అథారిటీకి అనుబంధ సంస్థ మాస్టర్ రీఫ్ గైడ్స్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో షేర్ చేసింది. ఇలాంటి చేపను ఎప్పుడూ చూడలేదని సంస్థ తెలిపింది. ఇవి సాధారణంగా ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, గ్వామ్, మైక్రోనేషియా జలాల్లో కనిపిస్తుందని, అయితే ఈ తెల్లని చేప ఆస్ట్రేలియాలో కనిపించడం ఇదే తొలిసారి అని పేర్కొంది. ప్రతిరోజూ మనల్ని ఆశ్చర్యపరిచే శక్తి సముద్రానికి ఉంది.ఇంకా కనుగొనలేని అద్భుతమైన జంతువులు సముంద్రం నిండి ఉంది. తన జీవితంలో చిన్న తెల్ల చేపను చూడటం చాలా అదృష్టం అని డైవర్ కేథరీన్ లోగాన్ పేర్కొన్నాడు. చిరుత టోబీ పఫర్ అంటే ? రాక్ ఎన్ క్రిటర్స్ ప్రకారం, ఇది అక్వేరియంలో ఎక్కువగా వాడతారు. దీని ముందు భాగంలో రెండు చారలు ఉంటాయి. ముత్యం లాంటి తెల్లటి శరీరంపై చిరుత పులికి ఉండే మచ్చల్ని పోలిన మచ్చలు ఉంటాయి. అలాగే దీన్నిపట్టుకున్నప్పుడు కొద్దిగా "పఫ్"(ఉబ్బుతాయి) అవుతాయి. దాదాపు 3 అంగుళాల పొడవు ఉంటాయి. View this post on Instagram A post shared by Master Reef Guides - Great Barrier Reef 🪸 (@masterreefguides) -
నివారించలేని వింత వ్యాధి! తనను తాను గాయపరచుకునేలా..
మనుషుల వికృత ప్రవర్తనలకు తగ్గట్టుగానే వింత వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. ఇదేం వ్యాధిరా బాబు అని ముక్కుమీద వేలేసుకునేలా ఉన్నాయి వాటి పేర్లు. కోపంతో మరో మనిషిని చంపడం ఒక తరహ అయితే..అదే చికాకు కోపంతో తనను తాను చంపేసుకునేలా ప్రేరేపిస్తుంది ఈ వ్యాధి. ఆ తర్వాత ఆ వ్యక్తికి తాను చేసిందేంది గుర్తుండదట. తనపై ఎవరో దాడి చేసినట్లు లేదా ప్రమాదం జరిగినట్లు భావిస్తారట. వాస్తవం వివరించిన వారికి అదేమీ గుర్తుండదట. చూడ్డానికి టీవీల్లో చూసే చేతబడి మాదిరిగా లేదా దెయ్యంలాంటి వ్యాధిలా ఉంటుంది. ఈ వింత వ్యాధి బారినపడ్డ మహిళ స్థితి గురించే ఈ కథనం!. బ్రిటన్కి చెందని 41 ఏళ్ల షార్లెట్ హెవిట్ ఉన్నటుండి ఆస్పత్రి పాలయ్యింది. ఆమె భర్త హుటాహుటినా ఆస్పత్రికి తీసుకురావడంతో త్రుటిలో ప్రాణాలతో బయటపడింది. ఆ టైంలో ఆమె సుమారు ఒక వారం వరకు పూర్తి కోమాలో ఉంది. పైగా తాను ఎందుకు ఆస్పత్రిలో ఉన్నానని, ఏం జరిగిందని ఎదురు ప్రశ్నించడంతో ఆమె భర్తతో సహా వైద్యులు సైతం కంగుతిన్నారు. దీంతో వైద్యులు పలు పరీక్షలు నిర్వహించి ఆమెక హంటిగ్టన్స్ వ్యాధితో బాధపడుతున్నట్లు తేల్చారు. ఈ వ్యాధి కారణంగా ఉన్నట్లుండి ఆమె ఒక విధమైన ఉద్వేగానికిలోనై తనను తాను హాని చేసుకునులా వింతగా ప్రవర్తిస్తుందని చెప్పారు. ఇది మెదడులోని భాగాలను నెమ్మది నెమ్మదిగా పనిచేయకుండా నిలిపేసి మానిసికంగా దెబ్బతినేలా చేస్తుంది. ఒక విధంగా సైకోసిస్ వంటి సమస్యలకు దారితీస్తుంది. ఈ మేరకు ఆమె భర్త మాట్లాడుతూ..తన భార్య షార్లెట్ ఆరోజు సడెన్గా గదిలోపలకి వచ్చి గట్టిగా అరుస్తూ.. కత్తితో తనను తాను గట్టిగా పొడుచుకుందని చెప్పుకొచ్చాడు. ఈ హఠాత్పరిణామానికి తనకేం పాలిపోలేదని వాపోయాడు. కానీ ఇప్పుడేమో ఆమె తనకేమైందని ప్రశ్నిస్తుంటే చాలా గందరగోళంగా ఉందని ఆవేదనగా చెప్పుకొచ్చాడు. ఈ అసంఘటిత చర్య కారణంగా వైద్యులు ఆమెకు మూడుసార్లు సర్జరీ చేశారు. ఆమె పొట్టలోని ప్రేగుల్లో పావు వంతు దాక డ్యామేజ్ కాకుండా కాపాడారు. ఈ మేరకు వైద్యులు మాట్లాడుతూ..ఈ హంటిగ్టన్స్ వ్యాధి అనేది వారసత్వంగా వచ్చే రుగ్మత. దీని వలన మెదడులోని కొన్ని భాగాల్లో నరాలు క్రమక్రమంగా విఛ్చిన్నమై పోతాయి. ఫలితంగా మెదడులోని ఇతర ప్రాంతాల్లోని కదలికలను నియంత్రించే అవయవాల పనితీరు మార్పు వచ్చి.. జ్ఞాపక శక్తిని కోల్పోవడం, నిరాశ నిస్ప్రుహలకు లోనై వికృతంగా మారిపోవడం జరుగుతుంది. ఇవే ఈ వ్యాధి ప్రదాన లక్షణాలు. ఈ వ్యాధి బారినపడ్డవారి శరీరంలో అసంకల్పిత కుదుపు లేదా చంచలమైన కదలికలు సడెన్గా వస్తాయి. షార్లెట్ తాను ఇలా 2014లో 23 ఏళ్ల వయసులో ఇలాంటి స్థితిలోనే ఉన్నాని చెప్పుకొచ్చింది. అయినప్పటకీ తాను జీవితాన్ని కొనసాగించగలిగానని, మళ్లీ ఇన్ని రోజుల తర్వాత మళ్లీ ఇలాంటి స్థితినే ఎదుర్కొన్నానని వాపోయింది. ఈ వ్యాధి కారణంగా కుక్కును పార్క్లో వదిలేయడం, గ్యాస్ ఆఫ్ చేయడం మరచిపోవడం తదితర ఎన్నో సంఘటనలు జరిగాయని, ఇవే తనను నిరాశలోకి నెట్టేసి తనను తాను గాయపరుచుకునేలా ప్రేరేంపించాయని వెల్లడించింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ వ్యాధికి ఎలాంటి నివారణ లేదు. కానీ రోగులు మానసిక ఆరోగ్యానికి సత్వరమే చికిత్స తీసుకుంటే నయం అవుతుందని చెబుతున్నారు. ఈ వ్యాధి వస్తే తొలుత రోజు వారీ జీవితాన్ని పెద్దగా ప్రభావితం చేయదు. కానీ క్రమేణా సాధారణ పనులను సైతం సొంతంగా చేసుకోలేని ధీనస్థితికి వచ్చేస్తారు. ఈ వ్యాధికి గల కారణం.. ఈ వ్యాధిగ్రస్తుల డీఎన్ఏ ఈ హంటింగ్టిన్స్ ప్రోటీన్ని తయారు చేయడానికి కావాల్సిన సమాచారాన్ని నిల్వ చేయదు. ఫలితంగా అవి అసాధారణ ఆకారంలో పెరిగా మెదడులోని న్యూరాన్లను నాశనం చేస్తాయి. దీంతో శరీర కదలికలను నియంత్రించే మెదడులోని బేసల్ గాంగ్లియాలో నరాలు నాశనం అవ్వడం జరుగుతుంది. ఫలితంగా ఆలోచన, నిర్ణంయ తీసుకోవడం, జ్ఞాపకశక్తి తదితర పనులు నిర్వహించే మెదడు పనితీరుని ప్రభావితం చేసి సడెన్గామనిషిని ఓ ఉన్మాదిలా మారుస్తుంది. (చదవండి: రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి హెచ్ఐవీ ఫిజీషియన్ ఆయన!) -
చిరుత కుటుంబం ఇంత సన్నిహితమా?
వన్యప్రాణులకు సంబంధించిన ఆసక్తికరమైన వివరాలు, వీడియోలను తరచూ పంచుకునే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి పర్వీన్ కస్వాన్ తాజాగా ఇన్స్టాగ్రామ్లో పర్షియన్ చిరుతపులి కుటుంబానికి సంబంధించిన ఫుటేజీని షేర్ చేశారు. తుర్క్మెనిస్తాన్ వన్యప్రాణి సంరక్షకుడు నరిన్ టి రోసెన్ ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరా ద్వారా ఈ దృశ్యాలు చిత్రీకరించారు. చిరుతపులి ఉపజాతిలో పర్షియన్ చిరుతపులి అతిపెద్దది. ప్రస్తుతం అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఉంది. ప్రపంచంలో వెయ్యికి తక్కువగానే ఈ జాతి చిరుతపులులు ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ‘పర్షియన్ చిరుతపులి కుటుంబం వసతి ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నప్పుడు.. ట్రాప్ కెమెరా ముందు.. మీరు చూస్తున్న ఈ అద్భుత వీడియో గొప్పదనం @NarynTRకి చెందుతుంది’ అంటూ వీడియోకు క్యాప్షన్ జతచేశారు. ఈ అరుదైన వీడియోలో నాలుగు పర్షియన్ చిరుతపులుల కుటుంబం విశ్రాంతి తీసుకుంటూ కనిపిస్తుంది. చిరుతపులి కూనలు చేస్తున్న సౌండ్స్ కూడా ఈ వీడియోలో వినిపిస్తాయి. ఇంటర్నెట్ యూజర్స్ ఈ వీడియోను అమితంగా ఇష్టపడుతున్నారు. ఒక యూజర్ ఇలా రాశాడు ‘వావ్.. ఇది నిజంగా అద్భుతం. ప్రకృతి ఒడిలో పర్షియన్ చిరుతపులి కుటుంబం’. మరొక యూజర్ ‘నేను చాలా కాలం తరువాత చూసిన అద్భుతం’ అని రాశారు. కాగా ట్రాప్ కెమెరా అనేది ఇన్ఫ్రారెడ్ సెన్సార్కు జోడించిన డిజిటల్ కెమెరా. ఇది వన్యప్రాణులు, వాటి ఆవాసాలు, జాతుల స్థానం, జనాభా పరిమాణం, జాతుల పరస్పర చర్యలకు సంబంధించిన డేటాను పొందుపరుస్తుంది. ఏదైనా జంతువు కెమెరా సెన్సార్ దగ్గరికు వెళ్ళినప్పుడు అది కెమెరాను ట్రిగ్గర్ చేస్తుంది. తర్వాత వీడియోను రికార్డ్ చేస్తుంది. ఇది కూడా చదవండి: 72 ఏళ్ల క్రితం మూసిన ఆలయం తెరవగానే.. When a Persian Leopard family decided to make home in front of a trap camera. The best thing you will watch. Credits to @NarynTR for raising awareness about them. pic.twitter.com/5hp8R4Whh1 — Parveen Kaswan, IFS (@ParveenKaswan) October 14, 2023 -
గిన్నీస్ రికార్డు సాధించిన తెలుగుతేజం నిహాల్!
న్యూజెర్సీ: అక్టోబర్ 7, 2023 అమెరికాలో తెలుగు విద్యార్థికి అరుదైన గౌరవం అమెరికాలో ప్రవాస తెలుగు విద్యార్ధికి శ్రీ నిహల్ తమ్మనకు అరుదైన గౌరవం లభించింది. బ్యాటరీ రీసైక్లింగ్తో పర్యావరణానికి ఎంతో మేలు చేస్తున్న తెలుగు విద్యార్ధి శ్రీనిహాల్ తమ్మన తాను స్థాపించిన రీ సైక్లింగ్ మై బ్యాటరీ అరుదైన గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. రీసైకిల్ మై బ్యాటరీ సంస్థ ద్వారా నిహాల్ అతని బృందం సభ్యులు ఏకథాటిగా ఒక్కరోజులోనే 31,204 బ్యాటరీలను లైనింగ్ చేసి రికార్డ్ సృష్టించారు. ప్రపంచంలో అత్యధికంగా ఒక్కరోజులోనే 30 వేలకు పైగా బ్యాటరీలను ఇంతవరకు ఎవరు లైనింగ్ చేయలేదు.. కానీ మన తెలుగు విద్యార్థి నిహాల్ తన రీ సైకిల్ మై బ్యాటరీ సంస్థ సభ్యుల సహకారంతో ఈ ఘనతను నిహాల్ సొంతం చేసుకున్నారు. నిహాల్ నాయకత్వంలో సాధించిన ఈ విజయం యావత్ తెలుగువారికి గర్వకారణం.. ఇది ప్రపంచంలో పర్యావరణ మేలు కోరుకునే ప్రతి ఒక్కరికి స్ఫూర్తిని ఇస్తుందని గిన్నీస్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. న్యూజెర్సీ ఎడిసన్లో రీ సైకిల్ మై బ్యాటరీ సంస్థ సాధించిన విజయాలను అధికారికంగా నమోదు చేసి నిహాల్కు గిన్నీస్ రికార్డు ధ్రువ పత్రాన్ని అందించారు. రీసైకిల్ మై బ్యాటరీ సాధించిన ఈ విజయం తన పిలుపు స్పందించిన విద్యార్ధుల సహకారంతోనే సాధ్యమైందని ఈ సందర్భంగా నిహాల్ తెలిపాడు. చిన్ననాటి నుంచే పర్యావరణ పరిరక్షణపై నిహాల్ దృష్టి 10 ఏళ్ల వయస్సులోనే నిహాల్ పర్యావరణ మేలు కోసం ఆలోచించాడు. కాలం చెల్లిన బ్యాటరీలను ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల పర్యావరణానికి ఎంత నష్టం కలుగుతుంది అనే దాని గురించి చదివిన శ్రీ నిహాల్ పర్యావరణ మేలు కోసం నడుంబిగించాడు. మనం ఇళ్లలో వాడే బ్యాటరీలను చెత్తలో పడేయటం వల్ల అవి పర్యావరణానికి తీవ్ర నష్టాన్ని కలిగించడతో పాటు ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతున్నాయనే విషయాన్ని అందరికి అవగాహన కల్పిస్తున్నాడు, వివరిస్తున్నాడు. ఈ సమస్యను పరిష్కారించడానికి శ్రీ నిహాల్ బ్యాటరీ రీ సైక్లింగ్ కోసం తన వంతు కృషి ప్రారంభించాడు. బ్యాటరీల వల్ల వచ్చే అనర్థాలను, ప్రమాదాలపై అవగాహన కల్పించి.. పనికిరాని బ్యాటరీలను కాలం చెల్లిన బ్యాటరీలను సేకరించి వాటిని తిరిగి రీసైక్లింగ్ సెంటర్స్కు పంపిస్తున్నాడు. రీసైకిల్ మై బ్యాటరీ ప్రస్థానం ఇది. 2019లో రీసైకిల్ మై బ్యాటరీ(ఆర్.ఎం.బి) పేరుతో శ్రీనిహాల్ తొలుత తన స్నేహితులతో ఓ టీం ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత వెబ్ సైట్ ఏర్పాటు చేసి రీసైకిల్ మై బ్యాటరీ అనే దానిని ప్రచారం చేశాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా 500 మంది విద్యార్థి వాలంటీర్లు శ్రీనిహాల్ తో కలిసి పనిచేస్తున్నారు. దాదాపు మూడు లక్షలకు పైగా బ్యాటరీలు ఇప్పటివరకు శ్రీ నిహాల్ తన టీమ్ సాయంతో రీ సైకిలింగ్ చేశారు. దాదాపు కోటిన్నర మందికి బ్యాటరీల రీసైక్లింగ్పై అవగాహన కల్పించారు. పాఠశాలల్లో ఆర్.ఎం.బీ బ్యాటరీ డబ్బాలను ఏర్పాటు చేశారు. కాల్ టూ రీసైకిల్ వంటి సంస్థల భాగస్వామ్యంతో అడుగు వేసింది. బ్యాటరీలను సేకరించడం, వాటిని రీసైక్లింగ్ స్టేషన్లకు బదిలీ చేయడాన్ని సులభతరం చేసింది. ఇప్పటికే శ్రీ నిహాల్కు ఎన్నో పర్యావరణ పురస్కారాలు లభించాయి. అమెరికన్ టెలివిజన్ ఛానల్ సీఎన్ఎన్ రియల్ హీరో పేరుతో సత్కరించింది. యంగ్ హీరోలకు ఇచ్చే బారన్ ప్రైజ్ కూడా శ్రీనిహాల్ సొంతమైంది. (చదవండి: సింగపూరులో ఘనంగా తెలుగుతోరణం వేడుకలు) -
బిల్డింగ్ను ఢీకొని 1000 పక్షులు ఎందుకు మృతిచెందాయి? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?
అమెరికాలోని చికాగోలో ఇటీవల ఒక్కరోజులో 1000 పక్షులు మృతి చెందడం సంచలనం కలిగించింది. ఆ పక్షులు శీతాకాలపు వలస కోసం దక్షిణ అమెరికా మైదానాలకు తరలివెళ్లాయి. అక్కడి నుండి ఉత్తర అమెరికాకు తిరిగి వస్తుండగా, చికాగోలోని మెక్కార్మిక్ ప్లేస్ సమీపంలో ఒకటిన్నర మైళ్ల వ్యాసార్థంలో పక్షులు చనిపోయి కుప్పలుగా పడిపోయాయి. స్థానికులు ఆ పక్షులకు ఆసుపత్రులకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు వాటి మరణానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. పక్షులు ఇలా చనిపోవడానికి కారణం అవి భవనాన్ని ఢీకొని కింద పడిపోవడమేనని నిపుణులు చెబుతున్నారు. ఈ సందర్భంగా చికాగో బర్డ్ కొలిజన్ మానిటర్స్ డైరెక్టర్ అన్నెట్ ప్రిన్స్ మాట్లాడుతూ భవనం సమీపంలో పక్షులు నేలకొరిగాయని తెలిపారు. వీటిలో మృతిచెందిన, గాయపడిన పక్షులు ఉన్నాయి. దాదాపు 1.5 మిలియన్ పక్షులు ఇక్కడి నుంచి వలస వెళుతుంటాయి. వీటిలో టేనస్సీ వార్బ్లెర్స్, హెర్మిట్ థ్రష్లు, అమెరికన్ వుడ్కాక్స్, ఇతర రకాల సాంగ్బర్డ్లు ఉంటాయి. యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ అంటారియోలో కిటికీలకు తగిలి చనిపోయే పక్షులపై పరిశోధన చేసిన బ్రెండన్ శామ్యూల్స్.. కిటికీకి తగిలిన ప్రతి పక్షి చనిపోదని చెప్పారు. పక్షుల మరణాలకు గాలి, వర్షం, పొగమంచు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు కారణం కావచ్చన్నారు. అమెరికన్ బర్డ్ కన్జర్వెన్సీకి చెందిన బ్రియాన్ లెంజ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఒక బిలియన్ పక్షులు గాజు కిటికీలను ఢీకొనడంతో చనిపోతున్నాయన్నారు. పక్షులు అద్దంలో తమ ప్రతిబింబాన్ని చూసినప్పుడు, భయపడి కిందపడి చనిపోతాయన్నారు. ఇటువంటి సందర్భాల్లో కొన్ని పక్షులు గాయపడతాయన్నారు. భవనాల లైట్లు స్విచ్ ఆఫ్ చేయడం పక్షుల మరణాలను తగ్గించడానికి ఒక మార్గంమని పేర్కొన్నారు చికాగోలో పక్షుల మరణాలపై 2021లో జరిపిన ఒక అధ్యయనంలో పెద్ద భవనాల్లో సగం లైట్లు ఆఫ్ చేయడం వల్ల పక్షుల ఢీకొనడం 6 నుంచి 11 రెట్లు తగ్గుతుందని తేలింది. ఇది కూడా చదవండి: బ్రిటన్ ధూమపాన రహితదేశం కానుందా? -
అరుదైన చర్మ వ్యాధి..ఒకేసారి వందలాది చీమలు
చర్మ వ్యాధులకు సంబంధించి చాలా భయనకమైనవి చూశాం. మరికొన్ని చర్మ వ్యాధులు పుండ్లు, గాయాలుగా మారి ప్రాణాలు కోల్పోయేలా చేయడం గురించి కూడా విన్నాం. ఈ చిన్నారికి వచ్చిన వ్యాధి అత్యంత అరుదైనది, వర్ణించలేనంత బాధకరమైనది. తీవ్రమైన దురద తోపాటు బహిరంగ గాయంలా మారి తట్టుకోలేని నరకయాతన అనుభవిస్తున్నాడు ఆ తొమ్మిదేళ్ల చిన్నారి. వివరాల్లోకెళ్తే..యూకేలోని నార్తాంప్టన్కి చెందిన థియోడర్ మోరార్ అనే తొమ్మిదేళ్ల చిన్నారి అరుదైన చర్మ పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. దీని కారణంగా అతని చర్మం కింద వందలాది చీమలు పాకినంత దురదగా ఉండి, చర్మం పగిలి రక్తస్రావం అవుతుంది. ఆ తర్వాత విపరీతమైన దురద. ఒక పక్క రక్తంకారడంతో దాన్ని గోకలేనంత దారుణమైన స్థితి. ఆ యాతన అనుభవించలేక ఆ చిన్నారి చనిపోతాను నా వల్ల కాదు అంటుంటే.. ఆ తల్లిదండ్రుల ఆ ఆవేదన వర్ణానాతీతం. కళ్లముందే కన్న కొడుకు పడుతున్న బాధను చూసి తట్టుకోలేక తల్లడిల్లిపోతున్నారు ఆ తల్లిదండ్రులు. ఆ చిన్నారి పుట్టుకతోనే ఈ పరిస్థతితో జన్మించాడు. అది క్రమంగా పెరిగిపోడం జరిగింది. కొంతకాలం తగ్గినట్లు తగ్గి మళ్లీ విజృంభించింది. దీంతో ఆ చిన్నారి శరీరం గాయాలతో రక్తం కారి పగుళ్లుగా ఉంటుంది. ఈ పరిస్థితి కారణంగా చేతులు కాళ్లు కదిలించలేదు. తట్టుకోలేని దురదను భరించలేక ఎన్నో రాత్రుళ్లు ఏడుస్తూనే ఉంటాడు. ఈ పరిస్థితిని న్యూరోడెర్మాటిటిస్ అని అంటారు. ఏంటీ న్యూరోడెర్మాటిటిస్ అంటే.. వైద్య పరిభాషలో దీర్ఘకాలికంగా వచ్చే దురద లేదా స్కేలింగ్ ద్వారా వచ్చే ఒక విధమైన చర్మ పరిస్థితి. చర్మంపై వచ్చే దురద ప్రాంతాలను గమనిస్తే.. సాధారణంగా మెడ, మణికట్టు, ముంజేతులు, కాళ్లు లేదా గజ్జలపై ఎక్కువగా ఇలా ఉంటుంది. అయితే న్యూరోడెర్మాటిటిస్కి అసలు ప్రధాన కచ్చితమైన కారణం ఏంటన్నది నిపుణులకు కూడ తెలియదు. కొందరి నిపుణుల అభిప్రాయం ప్రకారం తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన, భావోద్వేగాలు లేదా నిరాశ కారణంగా ఈ దురద వస్తుంటుందని చెబుతుంటారు. ఇతర కారణాలు .. నరాలలో గాయాలు పురుగు కాట్లు బిగుతైన దుస్తులు ధరించటం సోరియాసిస్ వంటి ఇతర చర్మ వ్యాధులు లక్షణాలు చర్మంపై విపరీతమైన దురద, పొడిగా మారడం విపరీతమైన నొప్పి జుట్టు ఊడిపోవటం బహిరంగ గాయాలు, రక్తస్రావం ఇన్ఫెక్షన్లు, పసుపు రంగు చీము కారడం చికిత్స దీన్ని దీర్ఘకాలిక చికిత్స ద్వారానే నయం చేయగలం చర్మ లేపనాలతో ఎరుపు రంగులోని వాపు, దురద, సున్నితత్వాన్ని తగ్గించడంలో సహయపడతాయి అలెర్జీని పెంచకుండా యాంటీహిస్టామైన్లు ఇస్తారు పొడిబారటం, దురద లేకుండా ఉండేలా మాయిశ్చరైజ్ క్రీములు కూల్ కంప్రెస్తో చర్మాన్ని మృదువుగాచేసి, మాయిశ్చరైజర్ క్రీములు చొచ్చుకునిపోయేలా చేసి త్వరిత గతిన కోలుకునేలా చేస్తారు. (చదవండి: ఆల్కహాల్ మోతాదుకు మించితే చనిపోతారా? పాయిజిన్గా ఎలా మారుతుంది?) -
అత్యంత అరుదైన పాము! వీడియో వైరల్
కొన్ని పాములు అత్యంత అరుదుగా కనిపిస్తాయి. అవి చూసేందుకు కూడా చాలా వింతగా ఉంటాయి. పురాణల్లోనో, సినిమాల్లోనో చూసి ఉంటాం అలాంటి రెండు తలలు పాముల లేదా ఐదు తలల పాములు. అంతేతప్ప మాముటుగా చూడటం కుదరదు. పైగా తాచుపాము జాతుల్లోని ప్రత్యేక పాములే ఇలా ఉంటుంది. ఆ ఐదు తలలు సెపరేట్గా ఉండి ఆ తలలన్నింటికి ఒకటే దేహంలా కింద భాగం ఉంటుంది. కానీ ఇక్కడ ఈ పాము అందుకు విభన్నం రెండు తలలు కలిసి పోయి ఉంటుంది. అచ్చం మనుషులకు జన్మించే అవిభక్త కవలల మాదిరిగా ఆ పాము ఉంది. నిజానికి ఆ రీతిలో జన్మించినవి పుట్టిన కొద్దిసేపటికే చనిపోతాయి. కానీ ఇది అలా కాదు. ఆరోగ్యంగా, యాక్టివ్గా ఉంది. హాయిగా కదులుతుంది. కాస్త ఆహారం తినేటప్పుడూ ఇబ్బంది పడుతుందేమో గానీ చూస్తే మాత్రం మాములు పాముల మాదిరిగానే పాకుతుండటం విశేషం. ఈ ఘటన యూకేలోని ఓ దుకాణంలో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Exeter Exotics (@exeter_exotics) (చదవండి: గోల్డెన్ పాస్పోర్ట్ గురించి తెలుసా! అత్యంత ధనవంతులే తీసుకోగలరా!) -
ప్రపంచంలోని టాప్ 10 అత్యంత అరుదైన ఆభరణాలు
-
ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం..
సాక్షి, న్యూఢిల్లీ: ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. ఐదు గ్రహాలు ఒకే కక్ష్యపై కనువిందు చేశాయి. బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, యురేనస్ గ్రహాలు ఒకే రేఖలో 50 డిగ్రీల పరిధిలో కనిపించాయి. ఆకాశంలో కనిపించే ఈ అరుదైన ఘటన సూర్యాస్తమయం తర్వాత కనిపించింది. సూర్యా స్తమయం తర్వాత పశ్చిమం వైపు 50 డిగ్రీల పరిధిలో ఐదు గ్రహాలు కనిపించాయి. భూమిపై నుంచి చూసేటప్పుడు.. ఐదు గ్రహాలు ఒకే రేఖపై ఆర్క్ ఆకారంలో కనిపించాయి. చదవండి: వామ్మో.. కోట్లు పలుకుతున్న లిక్కర్.. ఖాళీ బాటిల్ కూడా ఖరీదే గురూ! -
ఉద్యోగికి యాపిల్ అపూర్వ బహుమతి! స్వయంగా టిమ్కుక్...
ప్రీమియం స్మార్ట్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ కంపెనీ యాపిల్ తమ ఉద్యోగికి అపూర్వ బహుమతి అందించింది. సంస్థలో పదేళ్లు పూర్తి చేసుకున్న ఓ ఉద్యోగి ప్రత్యేకమైన బహుమతి అందుకున్నారు. ఓ వైపు ఆర్థిక మందగమనం కారణంగా అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలో ఓ ఉద్యోగి సేవలను గుర్తించి యాపిల్ బహుమతి పంపించడంపై అభినందనలు వ్యక్తమవుతున్నాయి. సదరు ఉద్యోగికి వచ్చిన బహుమతిని డాంగిల్బుక్ప్రో అనే యూట్యూబర్ అన్బాక్స్ చేశాడు. అందులో ఏమేమి వచ్చాయో చూపించాడు. సాధారణంగా యాపిల్ సంస్థ తమ ఉద్యోగులకు క్రిస్టల్తో తయారు చేసిన అవార్డులు పంపిస్తుంది. కానీ ఈ ఉద్యోగికి అల్యూమినియంతో తయారు చేసిన భారీ పెట్టె లాంటి బహుమతిని పింపించింది. దీనిపై ప్రకాశమంతమైన యాపిల్ లోగో ఉంది. దీంతో పాలిషింగ్ వస్త్రం కూడా ఉంది. ముఖ్యంగా కంపెనీ సీఈవో టిమ్కుక్ స్వయంగా సంతకం చేసిన నోట్ సైతం పంపించడం గమనార్హం. ఉద్యోగి పదేళ్ల సర్వీస్ను సూచిస్తూ బహుమతిపై 10 సంఖ్యను జోడించడం ప్రత్యేకతగా నిలిచింది. పెద్దగా ఉద్యోగులను తొలగించని అతికొద్ది కంపెనీల్లో యాపిల్ ఒకటి. గూగుల్, అమెజాన్, మెటా వంటి పెద్దపెద్ద సంస్థలు లేఆఫ్స్ పేరుతో వేలాదిగా ఉద్యోగులను తొలగించడం తెలిసిందే. ఇదే కాక ఆయా సంస్థల్లో ఏళ్లుగా పనిచేస్తున్న సీనియర్ ఉద్యోగులకు సైతం జీతాలు తగ్గించడం వంటి చర్యలు చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగుల సేవలను గుర్తించి బహుమతులు పంపించిన యాపిల్ సంస్థను పలువురు అభినందిస్తున్నారు. (ఇదీ చదవండి: రూ.14 వేలకే ఐఫోన్14.. యాపిల్ బంపర్ ఆఫర్!) -
ఆ చేపలు ఎగురుతాయి.. 56 కిలోమీటర్ల వేగంతో టేకాఫ్.. వైరల్ వీడియో
సాక్షి, అమరావతి: ఈ చేపలు నీటిలో ఈదటమే కాదు.. గాలిలో ఎగురుతాయి కూడా. వీటికి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఇవి రాత్రి పూట సముద్రం ఒడ్డుకు వచ్చి నిద్రపోతాయి. అట్లాంటిక్, పసిఫిక్ సముద్ర జలాల్లో కనిపించే ఈ జీవులు ఇటీవల భారత జలాల్లోనూ దర్శనమిస్తున్నాయి. ఈ చేపల కళ్లు నీటి అడుగు ప్రాంతాలను చూడటంతోపాటు గాలిలోనూ స్పష్టంగా చూడగలిగేలా మారిపోయాయట. ఈ చేపల విశేషాలేంటో మనమూ ఓ లుక్కేద్దాం. నీటిలో ఈదే చేపలు గాల్లో ఎగురుతున్నాయి. నీటి అడుగున గంటకు 56 కిలోమీటర్ల టేకాఫ్ స్పీడ్తో పైకి దూసుకెళ్తున్నాయి. ఉష్ణమండల సముద్ర జలాల్లో ఎక్కువగా కనిపించే ‘ఫ్లయింగ్ ఫిష్’లు చేపల్లోనే అరుదైన జాతులుగా గుర్తింపు పొందాయి. ప్రపంచంలో దాదాపు 40 రకాల ఎగిరే చేపలు ఉన్నాయి. ఈ సముద్ర చేపల కుటుంబాన్ని ఎక్సోకోటిడే అని పిలుస్తారు. లాటిన్ భాషలో ఎక్స్ అంటే ‘బయట’ అని ‘కొయిటోస్‘ అంటే మంచం అని అంటారు. ఇవి రాత్రి పూట సముద్రపు ఒడ్డుకు వచ్చి నిద్రపోతాయి కాబట్టే వీటిని లాటిన్లో అలా పిలుస్తారట. రెండు.. నాలుగు రెక్కలతో.. సాధారణ చేపలు నీటి నుంచి ఎగిరి దూకుతుంటాయి. వాటి దూరం కూడా మహా అయితే అడుగు వరకే ఉంటుంది. కానీ.. ఫ్లయింగ్ ఫిష్ శరీరానికి ఇరువైపులా పొడవాటి, వెడల్పాటి పెక్టోరల్ రెక్కలు ఉంటాయి. ఇందులో ‘టూ వింగర్స్’ అనే చేపకు రెండు పెద్ద పెక్టోరల్ రెక్కలు ఉంటాయి. ‘ఫోర్ వింగర్స్’గా పిలిచే చేపలకు రెండు పొడవాటి పెక్టోరల్ రెక్కలతో పాటు రెండు పెల్విక్ (చిన్న) రెక్కలు ఉంటాయి. వీటి సాయంతోనే ఇవి గాల్లో సులభంగా ఎగరగలుగుతుంది. వీటి వెన్నుపూస నిర్మాణం చూస్తే పడవ చుక్కానిలా కనిపిస్తుంది. ఇవి పక్షుల స్థాయిలో ఎగరలేవు కానీ.. దాదాపు 200 మీటర్ల వరకు ఎగరగలవు. పక్షలు రెక్కలు పైకీ, కిందకి ఆడించినట్టు ఇవి రెక్కలను ఊపలేవు. నీటినుంచి పైకి వచ్చిన వేగాన్ని బట్టి వాటి రెక్కలను విచ్చుకుని మాత్రమే కొంత దూరం ఎగురుతాయి. పెద్ద చేపల నుంచి తప్పించుకునేందుకే.. ఈ అసాధారణ చేపలు 6 నుంచి 20 అంగుళాలు పొడవు ఉంటాయి. రెండు అంగుళాల పొడవు ఉన్నప్పుడే ఎగరడం ప్రారంభిస్తాయి. డాల్ఫిన్లు, వేగంగా ఈదే ఇతర పెద్ద చేపలకు ఆహారం కాకుండా తప్పించుకోవడానికి ఇవి ఎగిరే సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వీటి కళ్లు నీటి అడుగున మాత్రమే కాకుండా గాలిలో కూడా స్పష్టంగా చూడగలిగేలా మార్పు చెందాయి. ఇవి చిన్నచిన్న చేపలను, పాచిని తీని జీవిస్తాయి. ఇవి సెకనుకు దాదాపు మీటరు వేగంతో ఉపరితలం వైపు ఈదుతాయి. చెన్నయ్ తీరంలోనూ సందడి ఇవి ఉష్ణమండల, సమశీతోష్ణ సముద్ర జాతులకు చెందిన చేపలు. అట్లాంటిక్, పసిఫిక్ సముద్ర తీరాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఇటీవల వీటి గమనం బంగాళాఖాతంలోనూ కనిపిస్తోంది. భారత్, బంగ్లాదేశ్, జపాన్, వియత్నాం, ఇండోనేషియా, తైవాన్, చైనా, వెనిజులా, బార్బడోస్ జలాల్లో ఎగిరే చేపలు ఉన్నాయి. మాల్దీవులు, చెన్నయ్ తీరాల్లోనూ ఇవి తరచూ కనిపిస్తున్నాయి. 400 మీటర్లు ఎగిరి.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం ఓ ఫ్లయింగ్ ఫిష్ 30 కిలోమీటర్ల వేగంతో 45 సెకన్ల పాటు గాల్లో ఎగిరింది. ఇది 2008లో జపాన్లోని కగోషిమాలో ఫెర్రీలో ప్రయాణిస్తున్న ఓ చిత్ర బృందం కెమెరాకు చిక్కింది. ఇది దాదాపు 1,312 అడుగుల మేర ఎగిరినట్టుగా నమోదైంది. సాధారణంగా ఫ్లయింగ్ ఫిష్లు 655 అడుగుల వరకు, నీటి ఉపరితలం నుంచి 26 అడుగుల ఎత్తు వరకు ఎగురుతాయి. నీటిలోకి తిరిగి దూకినప్పుడు కూడా వేగంగా ఈత కొట్టడం ప్రారంభిస్తాయి. ఇవి అలసి పోకుండా వరుసగా 12 సార్లు గాల్లో ఎగరగలవు. చదవండి: మిసెస్ ఇండియా పోటీలకు విశాఖ మహిళ పైడి రజని పట్టిన వెంటనే తినేయాలట కరేబియన్ ద్వీప దేశాలైన బార్బడోస్, ట్రినిడాడ్, టొబాగోలకు ఈ చేపలే వాణిజ్య పరంగా కీలకంగా ఉన్నాయి. స్థానిక మత్స్యకారులు వీటిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఈ ఫ్లయింగ్ ఫిష్ మాంసం గట్టిగా లేత, తెలుపు రంగులో ఉంటుంది. దీనిని కాల్చి, వేయించి, ఆవిరితో వండుకుని తింటారు. ఎగిరే చేపలను పట్టుకున్న వెంటనే తినేయాలట. ఇవి ఎక్కువ దూరం రవాణా చేయడానికి సరిపడవు. ఇతర సముద్ర జీవుల మాదిరిగానే ఇవి కూడా కాంతికి ఆకర్షితం అవుతాయి. అందుకే మత్స్యకారులు లైట్ల వెలుతురులో రాత్రిపూట వేట కొనసాగిస్తారు. -
ఏకాకి దీవిలో ఏకాకి ఇల్లు.. చూసేందుకు ఎగబడుతున్న జనం..
అదొక ఏకాకి దీవి. అందులో ఒక ఏకాకి ఇల్లు. ఏకాకి దీవిలో ఉన్న ఆ ఏకాకి ఇంటి చుట్టూ అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఐస్లాండ్ దక్షిణ తీరానికి ఆవల ఉన్న ఈ ఏకాకి దీవి పేరు ఎల్లియోయే. ఇది ఐస్లాండ్లోని వెస్ట్మానేయార్ మునిసిపాలిటీ పరిధిలో ఉంది. ఇదివరకు ఇక్కడ కొద్దిపాటి జనాలు ఉండేవాళ్లు. చాలాకాలంగా ఇక్కడ మనుషులెవరూ ఉండటం లేదు. వందేళ్ల కిందట ఈ దీవిలో ఒక ఇల్లు వెలిసింది. ఈ దీవిలో ఉంటూ వస్తున్న చివరి మనుషులు 1930లో దీనిని విడిచిపెట్టారు. అప్పటి నుంచి ఈ దీవి, ఇందులోని ఇల్లు పూర్తిగా ఖాళీగానే ఉంటున్నాయి. ప్రళయం ముంచుకొచ్చినప్పుడు తలదాచుకునే ఉద్దేశంతో ఒక శతకోటీశ్వరుడు ఇక్కడ ఇల్లు కట్టినట్లు ప్రచారం ఉన్నా, నిజానికి ఈ ఇంటిని ఎల్లియాయే హంటింగ్ అసోసియేషన్ చేపలు వేటాడేవాళ్లకు స్థావరంగా ఉపయోగపడేందుకు నిర్మించారని అధికారిక సమాచారం. ఈ ఇంటికి మంచినీటిపైపులు, విద్యుత్తు సరఫరా సౌకర్యాలేవీ లేవు. వర్షపునీటిని సేకరించి, ఆ నీటిని ఉపయోగించుకునే సౌకర్యం మాత్రమే ఉంది. ఖాళీగా ఉన్న ఈ దీవి గురించి, ఇందులోని ఇంటిని గురించి కథనాలు రావడంతో దీనిని చూసేందుకు చాలామంది ఆసక్తి ప్రదర్శించడంతో ఐస్లాండ్కు చెందిన టూరిస్ట్ కంపెనీలు ఇక్కడకు టూర్లు నిర్వహిస్తున్నాయి. బస చేసే సౌకర్యం లేకపోవడంతో, పగలంతా ఇక్కడ తిరిగినా, సాయంత్రం పడవలో బయలుదేరి, వెస్ట్మానేయర్ పట్టణానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా, ఈ దీవిని చూసేందుకు జనాలు ఆసక్తి చూపుతుండటం విశేషం. చదవండి: ఈ కొండపైకి చేరుకోవాలంటే ఆ దారి మాత్రమే దిక్కు! -
మంత్రి ఆదిమూలపు సురేష్కు అరుదైన గౌరవం
సాక్షి, అమరావతి: రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్కు అరుదైన గౌరవం లభించింది. ఆయన ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎల్రక్టానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీర్స్(ఐఈటీఈ) ఫెలోగా ఎన్నికయ్యారు. సైంటిఫిక్ అండ్ ఇండ్రస్టియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎస్ఐఆర్వో) గుర్తింపుతో 1953లో ఏర్పడిన ఈ సొసైటీలో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎల్రక్టానిక్స్, టెలికమ్యూనికేషన్, ఐటీ రంగాలకు చెందిన నిష్ణాతులు సభ్యులుగా ఉంటారు. చదవండి: ఆ అగ్రిమెంట్లో తప్పేముంది? ఢిల్లీ కేంద్రంగా ఉన్న ఈ సంస్థ తరఫున 1.25 లక్షల మందికి పైగా నిపుణులు దేశ, విదేశాల్లో 63 కేంద్రాల ద్వారా సేవలు అందిస్తున్నారు. మంత్రి డాక్టర్ సురేష్ను ఐఈటీఈ సొసైటీ విజయవాడ కేంద్రం నిర్వహించే కార్యకలాపాల్లో పాల్గొనాలని కోరింది. డాక్టర్ సురేష్ కర్ణాటకలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ)లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి భారతీయ రైల్వేలో చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లో బిజీగా ఉన్నా ఇంజనీరింగ్లో పరిశోధనలు చేసి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో పీహెచ్డీ అందుకున్నారు. -
అయ్యో.. కనిపించిన కాసేపటికే కన్నుమూత!
అరే.. ఏంటిది.. అడవుల్లో నల్ల ఎలుగుబంట్లు లేదంటే గోధుమ రంగు ఎలుగుబంట్లు ఉంటాయని తెలుసు. కానీ ఇదేంటి ధ్రువ ప్రాంతాల్లో సంచరించే తెల్ల ఎలుగుబంటి ఇలా దట్టమైన అడవిలోకి ఎలా వచ్చిందని ఆశ్చర్యపోతున్నారా? అయితే మీరు పొరబడ్డట్లే..! ఎందుకంటే మీరనుకుంటున్నట్లు ఇది పోలార్ బేర్(ధృవపు ఎలుగుబంటి) కాదు! ప్రపంచంలోనే అత్యంత అరుదైన తెల్ల ‘స్పిరిట్ బేర్’ ఇది. దీన్నే కీర్మోడ్ బేర్ అని కూడా పిలుస్తారు. అమెరికాలోని అడవుల్లో కనిపించే ఈ తెల్ల ఎలుగు.. వాస్తవానికి నల్ల ఎలుగుబంటి ఉపజాతికి చెందినది కావడం విశేషం! జన్యు మార్పుల కారణంగా నల్ల ఎలుగులకు ఇలా తెల్ల ఎలుగు పుడుతుందని వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఈ పరిణామం ప్రతి 10 లక్షలసార్లలో కేవలం ఒక్కసారే సంభవించేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. అత్యంత అరుదుగా పుట్టే ఈ రకమైన ఎలుగుబంట్లను అడవుల్లో గుర్తించడం దాదాపు అసాధ్యమని అటవీ అధికారులు చెబుతున్నారు. సాధారణంగా కెనడాలోని బ్రిటిష్ కొలంబియా మధ్య, ఉత్తర తీర ప్రాంతాల్లో స్పిరిట్ బేర్స్ జీవిస్తాయని వారు వివరించారు. కానీ అనూహ్యంగా.. ఈ తెల్ల ఎలుగుబంటి ఇటీవల అమెరికాలోని మిషిగన్ రాష్ట్రంలో ఉన్న పశ్చిమ ఎగువ ద్వీపకల్ప ప్రాంతంలో కనిపించి యావత్ ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. ఓ వేటగాడు అమర్చిన ఎరవైపు వచ్చి అక్కడ అటవీ అధికారులు అమర్చిన ఓ ఆటోమెటిక్ మోషన్ సెన్సర్ కెమెరాకు చిక్కింది. ఈ ఎలుగు ముఖం, మెడ భాగం తప్ప మిగతా శరీరమంతా ధవళవర్ణంలో ఉంది. దీని వయసు సుమారు రెండేళ్లు ఉండొచ్చని, అది మగదని అధికారులు వివరించారు. కానీ, విషాదం ఏంటంటే.. కనిపించిన కాసేపటికే అది తోడేళ్ల దాడిలో మృతి చెందిందని అధికారులు చెప్తున్నారు. ఇలాంటిది మళ్లీ ఎప్పుడు కనిపిస్తుందో అనే బెంగ ఇప్పుడు పరిశోధకుల్లో నెలకొంది. ఇది తెల్ల ఎలుగేనని అమెరికా సహజ వనరుల శాఖ ఇంకా నిర్ధారించనప్పటికీ ఓ ట్రెక్కింగ్ గైడ్ మాత్రం దీన్ని స్పిరిట్ బేర్గా పేర్కొంటూ ఫేస్బుక్లో ఫొటోలు షేర్ చేయడంతో అవి కాస్తా వైరల్గా మారాయి. -
అయ్యవారికి అరటి గెల.. తెలుసుకోవాలంటే 170 ఏళ్లు వెనక్కి వెళ్లాల్సిందే..
టెక్కలి(శ్రీకాకుళం జిల్లా): భీష్మ ఏకాదశి పర్వదినం.. చెట్లతాండ్ర అనే గ్రామంలో లక్ష్మీనృసింహ స్వామి ఆలయ ప్రాంగణమంతా అరటి సువాసన. యువకులు గెలలు లెక్క పెడుతున్నారు. వంద దాటాయి.. వెయ్యి దాటాయి.. సమయం గడుస్తోంది గానీ లెక్క తేలడం లేదు. గెలలన్నీ పూర్తయ్యే సరికి వచ్చిన లెక్క ఎనిమిది వేలు. చదవండి: ‘ఎల్లువొచ్చి గోదారమ్మా’.. బిందెలన్నీ అక్కడ తయారైనవే! ఎనభై ఏళ్ల కిందట ఊరిలో మొదలైన ఈ సంప్రదాయం ఇప్పుడు సరిహద్దులు చెరిపేస్తూ ఇతర రాష్ట్రాలకూ పాకింది. ఎక్కడెక్కడ నుంచో భక్తులు వచ్చి ఇక్కడ అరటి గెలలు కడుతున్నారు. ఇంత పెద్ద ఎత్తున గెలలు కట్టినా ఎన్నడూ లెక్కలో పొరపాటు రాలేదు. అసలు ఈ అరుదైన సంప్రదాయం ఎలా మొదలైంది.? ఆలయ నిర్మాణం వెనుక విశేషాలేంటో తెలుసుకోవాలంటే 170 ఏళ్లు వెనక్కి వెళ్లాలి. సంతబొమ్మాళి మండలంలోని చెట్లతాండ్ర. పెద్ద ప్రత్యేకతలు ఏమీ లేవు. అన్ని పల్లెల్లాగానే సా దాసీదా గ్రామం. కానీ ఇక్కడ ప్రతి ఇంటిలో నిర్వహించే శుభ కార్యానికి ముందు పరావస్తు అయ్యవారికి మొదట పూజలు నిర్వహించి ఆ తర్వా తే పనులు మొదలుపెడతారు. 170 ఏళ్ల కిందట ఈ ఊరికి వచ్చిన స్వామీజీ పేరే పరావస్తు అయ్యవారు. అరటి గెలల సంప్రదాయానికి మూల కారణం ఆయనే. అయ్యవారు జీవ సమాధిగా మారిన స్థలానికి ఆనుకుని నిర్మాణం చేసిన లక్ష్మీ నృసింహస్వామి ఆలయం ఇప్పటికి 170 ఏళ్ల కిందట.. ప్రస్తుతం నౌపడ ఆర్ఎస్.. అప్పట్లో రాళ్లపేట రైల్వే స్టేషన్లో చెట్లతాండ్ర గ్రామానికి చెందిన కుమ్మరి వృత్తిదారులు కుండలు అమ్మడానికి వెళ్లారు. పరావస్తు అయ్యవారు అనే స్వామి వారి వద్దకు వెళ్లి తనను చెట్లతాండ్ర గ్రామానికి తీసుకెళ్లాలని కోరారు. దీంతో కుమ్మరి వృత్తిదారులు స్వామిని గ్రామానికి తీసుకువచ్చారు. అప్పట్లో ఉన్న పాఠశాల వద్ద గ్రామానికి చెందిన పంగ అప్పలనాయుడుకు చెందిన స్థలంలో పర్ణశాల ఏర్పాటు చేసి అయ్యవారికి ఆతిథ్యం ఇచ్చారు. ఆయన నిత్యం లక్ష్మీనృసింహ స్వామిని ఆరాధించేవారు. గ్రామం చుట్టుపక్కల సత్సంగాలు నిర్వహించే వారు. ఈతి బాధలు ఉన్న వారికి స్వామి వద్దకు వెళ్లి సమస్యలు చెప్పుకుని సాంత్వన పొందేవారు. ఇలా 45 ఏళ్ల పాటు ఆయన ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇన్నేళ్లూ ఆయన వద్ద ఉన్న అక్షయ పాత్ర ద్వారా ప్రసాదాలు ఇచ్చే వారని భక్తులు చెప్పుకునేవారు. పరావస్తు అయ్యవారు జీవసమాధిగా మారిన స్థలంలో పుట్టిన మర్రిచెట్టు 45 ఏళ్ల కైంకర్యాల తర్వాత ఆయన అక్కడే జీవ సమాధి పొందారు. ఆయన జీవ సమాధిగా మారిన ప్రదేశంలో కొద్ది రోజులకే మర్రి చెట్టు పుట్టింది. దీంతో ఆ మర్రిచెట్టు అయ్యవారికి ప్రతిరూపంగా భావించారు. ఆ తర్వాత గ్రామం మధ్యలో సుమారు ఎకరా స్థలాన్ని కేటాయించి లక్ష్మీ నృసింహ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు. మొదట్లో వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పించేవారు. రోజు రోజుకూ భక్తులు ఆరాధన పెరుగుతుండడంతో 80 ఏళ్ల కిందట అరటి గెలలను కట్టడం ప్రారంభించారు. ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. మొదట్లో గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భక్తులు మాత్ర మే అరటి గెలలు కట్టేవారు. ఆ తర్వాత జిల్లాలు, రాష్ట్రాలు దాటి భక్తులు ఇక్కడకు చేరుకుని అరటి గెలలు కట్టడం ప్రారంభించారు. అరటి గెలల సంఖ్య పదుల నుంచి వేలకు చేరింది. ఈ ఏడాది నిర్వహించిన భీష్మ ఏకాదశి ఉత్సవాలకు ఏకంగా 8 వేలకుపై చిలుకు అరటి గెలలు కట్టారు. ఒక్కటీ మిస్ కాదు చెట్లతాండ్ర గ్రామంలో గల పరావస్తు అయ్యవారు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయం ఆవరణలో భక్తులు వేల సంఖ్యలో అరటి గెలలు కడుతుంటారు. అయితే తిరిగి అరటి గెలలు తీసుకునే క్రమంలో ఏ ఒక్క అరటి గెల కూడా మిస్ కాదు. గ్రామంలో యువకులంతా ఎంతో బాధ్యతగా చూసుకుంటారు. మూడు రోజుల తర్వాత కొంత మంది భక్తులు అరటి గెలలను ఇంటికి తీసుకువెళ్తారు. మరి కొంత మంది స్వామి వద్దనే ఉంచేస్తారు. దశాబ్దాలుగా జరుగుతున్న ఈ ఉత్సవంలో ఏ రోజూ అరటి గెలలు పోయాయి అనే మాట రాలేదని ఉత్సవాల కమిటీ సభ్యులు చెబుతున్నారు. చిన్నప్పటి నుంచి చూస్తున్నా.. మా ఊరిలో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అయ్యవారి సన్నిధిలో అరటి గెలల మహోత్సవాన్ని చూస్తున్నాను. ఏటా భక్తులు పెరుగుతున్నారు. -పి.జగ్గయ్య, చెట్లతాండ్ర, సంతబొమ్మాళి మండలం. బాధ్యతగా ఉంటాం మా గ్రామంలో ఏటా భీష్మ ఏకాదశి నుంచి మూడు రోజుల పాటు పరావస్తు అయ్యవారు లక్ష్మీ నృసింహాస్వామి ఆలయంలో ఎంతో బాధ్యతగా ఉత్సవాలు నిర్వహిస్తాం. వేలాదిగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యువకులంతా సమష్టిగా పనిచేస్తారు. భక్తులకు అన్నదానం నిర్వహిస్తాం. ఆంధ్రా, ఒడిశా, తెలంగాణ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. -పి.అసిరినాయుడు, సర్పంచ్, చెట్లతాండ్ర -
అరుదైన రకం.. మేలైన నిర్ణయం!
అరుదైన రకానికి చెందిన పుంగనూరు జాతి ఆవులకు మంచి రోజులు వచ్చాయి. వెయ్యేళ్ల నాటి ఆవుగా గుర్తింపు పొందిన ఈ పొట్టి రకాన్ని అధికంగా ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అందుకోసం ఐవీఎఫ్ ల్యాబ్తోపాటు సెమన్ స్టోరేజీ బ్యాంకును పలమనేరులోనే ఏర్పాటు చేసింది. సరోగసీ పద్ధతిలో పొట్టి జాతి ఆవుల అధికోత్పత్తికి అధికార యంత్రాంగం అవసరమైన చర్యలు చేపడుతోంది. పలమనేరు: ప్రపంచంలోనే అరుదైన రకం పశువులుగా పుంగనూరు జాతికి పేరుంది. ప్రస్తుతం వీటి ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. అందుకే వీటిని అధికంగా ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం ఆర్కేవీవై ద్వారా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ నిధుల ద్వారా పలమనేరు పశుపరిశోధన కేంద్రంలో ఐవీఎఫ్ ల్యాబ్ను ఏర్పాటు చేశారు. దీనిద్వారా పుంగనూరు జాతి పశువులను ఎక్కువగా ఉత్పత్తి చేయనున్నారు. ఈ ల్యాబ్ను నెలరోజుల్లో ప్రారంభించేందుకు ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. పరిశోధన కేంద్రం లక్ష్యం ఇదీ పలమనేరు సమీపంలోని కేటిల్ఫామ్ వద్ద 1953లో సంకర జాతి ఆవుల ఉత్పత్తి, పరిశోధనా కేంద్రం పేరుతో ప్రారంభమైన ఈ పశుపరిశోధన సంస్థ 1995 నుంచి పుంగనూరు పొట్టి రకం పశువుల ఉత్పత్తి కేంద్రంగా మారింది. ఇన్సైటీవ్ కన్సర్వేషన్ (స్థానికంగా వీటి సంఖ్యను ఉత్పత్తి చేయడం) దీని లక్ష్యం. 20 పొట్టి రకం పశువులతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు 276 పశువుల వరకు పెరిగినప్పటికీ ఆశించినంత ఉత్పత్తి జరగడం లేదు. క్రమేణా ఇక్కడ పేయి దూడల ఉత్పత్తి తగ్గుతోంది. ఒకే రక్త సంబంధం కలిగిన కోడెలతో సంక్రమణం చెందడంతో జన్యుపరమైన ఇబ్బందులతో దూడలు ఆరోగ్యకరంగా జన్మించడం లేదు. దీనిపై దృష్టిపెట్టిన ప్రభుత్వం స్థానిక పరిశోధనా కేంద్రంలో పిండమార్పిడి కేంద్రాన్ని (ఎంబ్రయో ట్రాన్స్ఫర్ ల్యాబ్) నెలకొల్పింది. దీంతోపాటు ఎన్ఏహెచ్ఈపీ (నేషనల్ అగ్రికల్చర్ హైయ్యర్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్)కింద ఐకార్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్) ద్వారా రూ.3 కోట్ల నిధులతో ఐవీఎఫ్(ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) ల్యాబ్ను ఏర్పాటు చేశారు. ఇప్పటిదాకా స్థానిక ల్యాబ్లో సెమన్ స్టోరేజీ చేసి, ఆ వీర్యాన్ని గుంటూరు జిల్లాలోని లాంఫారం, కర్ణాల్లోని యన్.బి.ఏ.జి.ఆర్ (జాతీయ జన్యువనరుల కేంద్రం)లో భద్రపరిచేవారు. ఇకపై పూర్తి స్థాయిలో అన్ని పనులు ఇక్కడే జరగనున్నాయి. పిండమార్పిడి పద్ధతి పుంగనూరు జాతి ఎద్దునుంచి సెమన్ను తీసి దాని ద్వారా ఎక్కువ అండాలను ఉత్పత్తి చేయిస్తారు. ఆపై కృత్రిమ గర్భ«ధారణ ద్వారా ఫలదీకరణం జరిపి ఈ అండాలను పోగుచేసి సరోగసీ పద్ధతిలో ఎదకొచ్చిన ఆవులకు ఇంప్లాంట్ చేస్తారు. దీంతో ఈ జాతి పశువులను ఎక్కువ ఉత్పత్తి చేసేందుకు వీలవుతుంది. తద్వారా ఏటా వందల సంఖ్యలో పొట్టిరకం పశువుల ఉత్పత్తి జరగనుంది. అంతరించిపోతున్న అరుదైన జాతులు దేశంలో 34 రకాల పశు జాతులున్నాయి. వీటిల్లో అత్యంత ముఖ్యమైంది పుంగనూరు పొట్టి రకం పశువులే. ఇవి స్థానిక పశు పరిశోధనా కేంద్రంలో 200 ఉండగా వీటి సంఖ్య ఇప్పుడు 276కు చేరుకుంది. ఉభయగోదావరి జిల్లాల్లో ఇవి వందకు పైగా ఉన్నట్టు సమాచారం. కేరళ రాష్ట్రంలోని కొట్టాయం జిల్లాలో వేచూరు రకం పొట్టి ఆవుల (ఇవి ఎరుపు రంగులో ఉంటాయి) సంఖ్య పదికి పడిపోయింది. ఇక అ«ధిక పాలనిచ్చే షాహీవాల్ రకం కనుమరుగవుతోంది. ప్రస్తుతం ఇవి మన దేశంలోని పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, పాకిస్తాన్లోనూ మాటంగొమేరి జిల్లాలో మాత్రం కనిపిస్తున్నాయి. ఏదేమైనా వీటన్నింటికంటే అత్యంత అరుదైన జాతి పుంగనూరు రకమే. అందుకే వీటిని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పుంగనూరు రకాన్ని మరింత అభివృద్ధి చేస్తాం ఇక్కడి పరిశోధనా కేంద్రంలో 276 వరకు పుంగనూరు రకం పశువులున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎల్డీఏ ద్వారా ఈ జాతి వీర్యాన్ని అందించేందుకు ఇప్పటికే కృషి చేస్తున్నాం. మరో నెల రోజుల్లో ఇక్కడ ఐవీఎఫ్ ల్యాబ్ సిద్ధమవుతుంది. దీంతో వీర్యాన్ని వృథా కానీయకుండా ఎక్కువ పశువులకు ఇచ్చి పుంగనూరు వెరైటీని పెంచుతాం. రాబోవు రెండేళ్లలో పశువుల సంఖ్యను 500 చేసేలా లక్ష్యం పెట్టుకున్నాం. డాక్టర్ వేణు, సైంటిస్ట్, పశుపరిశోధన కేంద్రం, పలమనేరు -
అంతరించిపోయేలా ఉన్నాం.. మమ్మల్ని కాపాడండయ్యా!
-
అంతరించిపోయేలా ఉన్నాం.. మమ్మల్ని కాపాడండయ్యా!
World Wildlife Day Special: ‘‘మా బతుకు మేం బతుకుతున్నాం. మా సరిహద్దుల్లోకి వచ్చేది మీరు. అనవసరంగా మమ్మల్ని బలిగొనేదీ మీరే. మా కుటుంబం ప్రకోపాన్ని చూపిస్తే తట్టుకోగలరా మీరు?. కానీ, అలా చేయం. ఎందుకంటే.. మాకంటూ అడవి ధర్మం ఉంది. మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి. అంతరించిపోతున్న మా జాతుల్ని వీలైతే పరిరక్షించి పుణ్యం మూటగట్టుకోండి’’ మూగ జీవాలకు మాటొస్తే.. కచ్చితంగా మనుషులతో ఇలాగే మొరపెట్టుకుంటాయేమో. భూమ్మీద వృక్షజాలం, జంతుజాలాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనుషులదే. ఆ బాధ్యతను గుర్తు చేసేందుకే ఒక రోజు ఉంది. ఇవాళ(మార్చి 3వ తేదీ) వరల్డ్ వైల్డ్లైఫ్ డే. వైల్డ్లైఫ్ పరిరక్షణ ప్రధాన లక్ష్యంగా అవగాహన కల్పించే రోజు. అంతేకాదు అందమైన వాటి ప్రపంచం గురించి ప్రస్తావించుకునే రోజు కూడా. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా వనజీవుల సంరక్షణ కోసం చర్చ నడుస్తోంది. ఈ తరుణంలో కొత్తగా అర్టిషిషియల్ టెక్నాలజీ (AI) ద్వారా అంతరించిపోతున్న దశలో ఉన్న జంతువుల్ని గుర్తించడం, తద్వారా వాటి పరిరక్షణకు అవసరమైన చర్యల్ని తీసుకోవాలని భావిస్తున్నారు. 1973లో సైట్స్ (Convention on International Trade in Endangered Species of Wild Fauna and Flora) ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో ఆ తేదీని World Wildlife Dayగా పరిగణించాలని డిసెంబర్ 20, 2013లో ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ తీర్మానించింది. వైల్డ్లైఫ్ డే సందర్భంలో మన గడ్డ మీద ఉండి.. అంతరించిపోయే దశకు చేరుకున్న ఆరు జాతుల గురించి చర్చించుకుందాం. ఏషియాటిక్ లయన్ ప్రపంచంలోనే అతిపెద్ద రెండో జాతి ఇది. రాజసం ఉట్టిపడే సింహాలకు.. గుజరాత్ ‘గిర్’ శాంక్చురీ దీనికి అడ్డా. కానీ, చాలా ఏళ్ల కిందట భారత్లోని ఉత్తర, మధ్య తూర్పు ప్రాంతాల్లోనూ వీటి సంఖ్య ఎక్కువగా ఉం డేది. అంతరించిపోతున్న క్రమంలో వీటి పరిరక్షణకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నీలగిరి మార్టెన్ దక్షిణ భారత దేశంలో.. అందునా నీలగిరి కొండల్లో కనిపించే అరుదైన మార్టెన్ జాతి ఇది. తమిళనాడు, అన్నామలై టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో వీటి సంఖ్య ఎక్కువగా ఉంది. కేరళ నెయ్యర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలోనూ వీటి పరిరక్షణకు కృషి చేస్తున్నారు. వీటి సంఖ్య వెయ్యి లోపే ఉంది. అందుకే ఐయూసీఎన్ (International Union for Conservation of Nature) ఈ జాతిని రెడ్ లిస్ట్లో చేర్చింది. మంచు చిరుత ఔన్స్ అని ముద్దుగా పిల్చుకునే ఈ జాతి.. అరుదైన జీవుల్లో ఒకటి. అరుణాచల్ ప్రదేశ్ దిబాంగ్ వైల్డ్లైఫ్ శాంక్చురీలో, హిమాచల్ ప్రదేశ్ హిమాలయన్ నేషనల్ పార్క్లో, ఉత్తరాఖండ్ నందా దేవి నేషనల్ పార్క్లో ఇవి కనిపిస్తాయి. శరవేగంగా వీటి జనాభా క్షీణించి పోగా.. ప్రస్తుతం మొత్తంగా పది వేల లోపే మంచు చిరుతలు ఉంటాయని అధికారులు లెక్కలు వేశారు. సంగై అనిమిలీయా కుటుంబంలోని దుప్పి జాతి సంగై (Brow-antlered Deer). మణిపూర్ లోక్టక్ సరస్సును ఆనుకుని ఉన్న కెయిబుల్ లామ్జావో నేషనల్ పార్క్లో ఇవి కనిపిస్తాయి. ఇక్కడో ప్రత్యేకత ఏంటంటే.. సంగై ఆ రాష్ట్ర జంతువు. డ్యాన్సింగ్ డీర్ పేరుతో వీటి మీద జానపద కథలు సైతం ప్రచారంలో ఉన్నాయి. సింహపు తోక మకాక్ వాండెరూ.. సింహపు తోక మకాక్(కోతులు). ప్రపంచంలోనే అతి పురాతనమైన, అరుదైన జాతిగా వీటిని చెప్తుంటారు రీసెర్చర్లు. కేరళ షెండూర్నీ వైల్డ్లైఫ్ శాంక్చురీలో ఇవి కనిపిస్తాయి. ఒంటికొమ్ము రైనో వేట, కొమ్ముల అక్రమ రవాణాతో క్షీణించే దశకు చేరుకున్న జాతి ఇది. కజిరంగ నేషనల్ పార్క్ (అస్సాం), దుద్వా టైగర్ రిజర్వ్(యూపీ), పోబిటోరా వైల్డ్లైఫ్ శాంక్చురీ(అస్సాం)లో మాత్రమే ఇవి కనిపిస్తాయి. పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ కోసం కీలక జాతులను రక్షించడం అనే థీమ్తో ఈ ఏడాది వరల్డ్ వైల్డ్లైఫ్ డేని నిర్వహిస్తున్నారు. There are over 22,000 endangered & critically endangered species on the IUCN Red List. Continued species loss is a threat to people and planet. For #WWD2022, let us all support conservation of vulnerable plants and animals. Learn more: https://t.co/hW7VtdeXHK #RecoverKeySpecies pic.twitter.com/AtjMmtVCio — World Wildlife Day (@WildlifeDay) February 22, 2022 పరుగు, పుట్రా, మొక్కలే కాదు.. పరిమాణంలో పెద్ద జంతువులు సైతం మనిషి నిర్లక్ష్యానికి బలై అంతరించే దశకు చేరుకోగా.. ఇప్పటికే కొన్ని అంతరించిపోయాయి కూడా. -సాక్షి, వెబ్ స్పెషల్ -
Punganur Cow: బుల్లి ఆవుకు అరుదైన గౌరవం
పుంగనూరు(చిత్తూరు జిల్లా): పుంగనూరు జాతి ఆవులను క్రీ.శ. 610 సంవత్సరంలో గుర్తించినట్లు శాసనాలు పేర్కొంటున్నాయి. బాణులు, నోళంబులు, వైదంబ చోళ ప్రభువులు పుంగనూరు ఆవును పోషించేవారు. పుంగనూరు నుంచి తిరుపతి వరకు గల అప్పటి అభయారణ్యంలో పుంగనూరు ఆవులు అభివృద్ధి చెందాయి. చదవండి: చుక్క గొరక.. సాగు ఎంచక్కా! ఆవుల విశిష్టత భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పుంగనూరు ఆవులు చిన్న అకారాన్ని కలిగి ఉంటాయి. మంచి ఔషధ గుణాలు, స్నేహపూర్వకంగా మెలుగుతాయి. ప్రపంచ దేశాల్లో ఈ ఆవు పాలకు మంచి గిరాకీ ఉంది. తెలుపు, నలుపు వర్ణాలతో ఉంటాయి. ఈ ఆవు పాలలో ఉన్న ఔషధ గుణాలు మరే పాలలోనూ లేదని బయోడైవర్సిటీ యూనివర్సిటీ ప్రకటించింది. ఈ ఆవుల చరిత్ర, విశిష్టత గురించి మద్రాస్ ప్రభుత్వం అప్పట్లో గెజిట్ను విడుదల చేసింది. అలాగే కేఎస్ఎస్ శేషన్ అనే రచయిత తన పరిశోధనాత్మక పుస్తకం బ్రిటీష్ రోల్ ఇన్ రూరల్ ఎకానమీలో పుంగనూరు ప్రాంత ఆవుల గురించి జమీందారులు చేపట్టిన సంరక్షణ చర్యలను విశదీకరించారు. రూ.70 కోట్లతో పరిశోధన కేంద్రం ఈ జాతి ఆవులు అంతరించిపోతుండడంతో వీటిని అభివృద్ధి చేసేందుకు ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ కడప జిల్లాలో రూ.70 కోట్లతో పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్శా ఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్రెడ్డి పుంగనూరు జాతి ఆవుకు తగిన గుర్తింపునకు చర్యలు తీసుకున్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు లభించేలా పోస్టల్ స్టాంపు, కవర్ విడుదల చేయడంలో సఫలీకృతులయ్యారు. ఆవుకు జాతీయ గుర్తింపు రావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకతలు ♦ఈ ఆవులు 70 నుంచి 90 సెంటీమీటర్ల ఎత్తు మాత్రమే ఉంటుంది. ♦ఎద్దులు కూడా ఇదే పరిణామంలో ఉంటాయి. ♦పుంగనూరు ఆవులను దేవతా గోవులుగా పిలుస్తారు. ♦సాధారణ గోవు పాలలో 3 నుంచి 3.5 శాతం వరకు కొవ్వు పదార్థాలు ఉంటాయి. ఈ జాతి ఆవు పాలలో 8 శాతం కొవ్వు పదార్థాలతో పాటు పూర్తిగా ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ♦ఈ జాతి ఆవులు 115 నుంచి 200 కిలోల బరువు కలిగి ఉంటుంది. ♦ప్రతి రోజూ ఒక ఆవు 5 కిలోల పచ్చిగడ్డిని తింటుంది. ♦2 నుంచి 4 లీటర్ల వరకు పాల దిగుబడి ఇస్తుంది. ♦ఎంత కరువు పరిస్థితులు ఎదురైనా తట్టుకుని జీవించగలవు. ♦లేత చర్మం, చిన్న పొదుగు, చిన్న తోక, చిట్టికొమ్ములు కలిగి నలుపు, తెలుపు వర్ణంలో ఉంటాయి. ♦వీటి ధర రూ. లక్ష నుంచి రూ. 20 లక్షల వరకు ఉంటుంది. -
అరుదైన ‘నక్కతోక’ మొక్కను ఎప్పుడైనా చూశారా..?
పెదవాల్తేరు (విశాఖ తూర్పు): అరుదైన నక్కతోక (ఫాక్స్టెయిల్) ఆర్కిడ్ మొక్క స్థానిక రాణిచంద్రమణీదేవి ఆస్పత్రి ఆవరణలోని జీవవైవిధ్యపార్కులో కనువిందు చేస్తోంది. ఇవి గాలి నుంచే ఆహారం, తేమను తీసుకుని జీవిస్తాయి. ఈ తరహా మొక్కలు తూర్పు కనుమలలో మాత్రమే కనిపిస్తాయి. వీటిని అలంకరణ కోసం వినియోగిస్తారని డాల్ఫిన్ నేచర్ కన్జర్వేషన్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ రామమూర్తి తెలిపారు. ఈ పార్కుకు వచ్చే విద్యార్థులు ఈ తరహా మొక్కలపై పలురకాల పరిశోధనలు చేస్తుంటారు. చదవండి: భర్త పాఠశాలకు వెళ్లొద్దాన్నాడని.. భార్య ఎంత పనిచేసిందంటే.. -
అరుదైన సర్జరీ.. ఒక వ్యక్తిలో ఐదు కిడ్నీలు!!
ఆయనకి శరీరంలో ఐదు కిడ్నీలు ఉన్నాయి. యస్.. తనవి రెండు.. దాతలు ఇచ్చినవి మూడు. గతంలో రెండుసార్లు అవయవ మార్పిడి చికిత్సలు నిర్వహించిన వైద్యులు.. ఈమధ్యే విజయవంతంగా మరో కిడ్నీని శరీరంలోకి ఎక్కించారు. ఇంతకు ముందు సర్జరీలు ఫేయిల్ కావడానికి కారణం.. ఆయనకు ఉన్న హైపర్టెన్షన్(అధిక రక్తపోటు) సమస్య. దీంతో మరోసారి ప్రయత్నించిన డాక్టర్లు.. సంక్లిష్టమైన సర్జరీ ద్వారా ఐదో కిడ్నీని విజయవంతంగా అమర్చారు. తద్వారా వైద్య చరిత్రలో అరుదైన ఈ ఘటనకు చెన్నై వైద్యులు కారణం అయ్యారు. తమిళనాడుకు చెందిన 41 ఏళ్ల సదరు వ్యక్తికి ఇదివరకే రెండుసార్లు రెనల్ (మూత్రపిండం)కు సంబంధిచిన సర్జరీలు జరిగాయి. పేషెంట్కు 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడు రెండు కిడ్నీలూ ఫెయిల్ అయ్యాయి. దీంతో 1994లో తొలిసారి.. 2005లో రెండోసారి కిడ్నీలను మార్చారు. ఆయనకు ఉన్న అధిక రక్తపోటు సమస్య వల్ల ఈ రెండూ సర్జరీలు విఫలం అయ్యాయి. దీంతో coronary artery disease బారినపడ్డాడు. ఈ పరిస్థితుల్లో మరో కిడ్నీ అమర్చే విషయంపై ఆయనతో చర్చించారు మద్రాస్ మెడికల్ మిషన్ డాక్టర్లు. కానీ, అప్పటికే శరీరంలో నాలుగు కిడ్నీలు ఉండడంతో ఐదవది అమర్చడం సంక్లిష్టంగా మారింది. అయినప్పటికీ పేషెంట్ ఉన్న కండిషన్కి ఆ ఆప్షన్ తప్ప మరొకటి కనిపించలేదు. ఇది చదవండి: పాములే ఇక సైంటిస్టులకు దిక్కు ఎక్కడ అమర్చారంటే.. సాధారణంగా దాతల కిడ్నీలను.. పేషెంట్ల కిడ్నీల పక్కనే ఉన్న నాళాలకు అమరుస్తారు. కానీ, ఈ పేషంట్కు ఇదివరకే నాలుగు అమర్చి ఉన్నాయి. దీంతో స్పేస్ లేకపోవడంతో కొంత ఇబ్బంది పడ్డారు డాక్టర్లు. పైగా ఇంతకు ముందు జరిగిన సర్జరీల వల్ల పేషెంట్ నుంచి యాంటీబాడీస్ రిలీజ్ అయ్యే రిస్క్ ఏర్పడొచ్చు. కాబట్టి, జాగ్రత్తగా కిడ్నీని అమర్చాలని ఫిక్స్ అయ్యారు. చివరకు పొత్తికడుపు కుహరం దగ్గర ఆ కిడ్నీని అమర్చి.. ఇక్కడే గుండెకు సంబంధించిన రక్తనాళాలకు కనెక్ట్ చేశారు. ప్రపంచంలోనే ఇలాంటి సర్జరీలు జరగడం చాలా అరుదు. పాతవి తీయకపోవడానికి కారణం ఇదే కొత్త కిడ్నీ అమర్చేప్పుడు.. పాత కిడ్నీలను ఎందుకు తొలగించలేదని చాలామందికి అనుమానం కలగవచ్చు. ఒకవేళ పాతవి గనుక తొలిగిస్తే.. రక్తస్రావం జరగొచ్చు. అదే టైంలో యాంటీబాడీస్ ఉత్పత్తి అయ్యి.. కొత్త కిడ్నీ అమర్చడానికి పరిస్థితి ప్రతికూలంగా మారొచ్చు. అందుకే ఆ పాత కిడ్నీలను అలాగే వదిలేశారు. ఇక జులై 10న సర్జరీ విజవంతంగా జరగ్గా.. నెల తర్వాత (ఆగస్టు 10న) ఆ పేషెంట్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం అతని ఆరోగ్య స్థితి మెరుగ్గా ఉందని, మరికొన్ని నెలలపాటు అతని ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలని వైద్యులు నిర్ణయించుకున్నారు. -
మరో అరుదైన వైరస్, 20 ఏళ్ల తరువాత మళ్లీ ప్రత్యక్షం
వాషింగ్టన్: కరోనా మహమ్మారితో ఇప్పటికీ ప్రపంచం అల్లాడుతోంటే అమెరికాలో తాజాగా అరుదైన మంకీ పాక్స్ వైరస్ కేసును గుర్తించారు. దాదాపు రెండు దశాబ్దాల తరువాత తొలిసారి అమెరికాలోని టెక్సాస్లో మంకీ పాక్స్ సోకిన వ్యక్తిని గుర్తించినట్టు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) శుక్రవారం తెలిపింది. అమెరికా నివాసి అయిన బాధితుడు కొన్ని రోజుల క్రితం నైజీరియా వెళ్లి తిరిగి వచ్చినట్టు తెలిపారు. ప్రస్తుతం డల్లాస్లో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. దీంతో ఈ రోగితో సంబంధం కలిగి ఉండవచ్చనే అనుమానంతో లాగోస్, నైజీరియా, అట్లాంటా, డల్లాస్ మధ్య రెండు విమానాల ప్రయాణికులను, ఇతరులపై దృష్టిపెట్టింది మరోవైపు స్మాల్ పాక్స్ వైరస్కి చెందినదిగా భావిస్తున్న ఈ మంకీపాక్స్ వల్ల ఆందోళన అవసరం లేదని, సాధారణ ప్రజలకు పెద్దగా ముప్పు ఉండదని ప్రభుత్వ అధికారులు తెలిపారు. తుంపర్ల వల్ల కూడా ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం ఉన్నప్పటికీ కరోనా కారణంగా మాస్కులు ధరిస్తున్న నేపథ్యంలో పెద్దగా వ్యాపించకపోవచ్చని సీడీసీ వెల్లడించింది. అమెరికాలో తొలిసారిగా 2003లో 47 మందికి ఈ వైరస్ సోకింది. మిడ్వెస్ట్లోని పెంపుడు జంతువుల ప్రేరీ కుక్కలు, దిగుమతి చేసుకున్న ఆఫ్రికన్ ఎలుకల ద్వారా వైరస్ వ్యాప్తి చెందింది. కాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం మంకీపాక్స్ వైరస్ మధ్య, పశ్చిమ ఆఫ్రికాలోని మారుమూల ప్రాంతాల్లో ఎక్కువగా వచ్చే అరుదైన వైరల్ వ్యాధి. ఫ్లూతో మొదలై, లింఫ్ నోడ్స్లో వాపు, శరీరంపై భారీగా దద్దుర్లు రావడం జరుగుతుంది. రెండు నుండి నాలుగు వారాల వరకు లక్షణాలు ఉంటాయి. ప్రస్తుత గణాంకాల ప్రకారం మంకీపాక్స్ కేవలం ఒకశాతం మందిలో ప్రాణాంతకమని తేలింది. -
అరుదైన సీతాకోకచిలుక.. ఎప్పుడైనా చూశారా ?
తగరపువలస (భీమిలి): విశాఖ జిల్లా భీమిలి బ్లూజే అపార్ట్మెంట్లో ఆదివారం ఉదయం అరుదైన సీతాకోకచిలుక సందడి చేసింది. ఆరెంజ్, బిస్కట్ కలర్లో ఉన్న ఈ సీతాకోకచిలుక 18 సెంటీమీటర్ల పొడవు ఉంది. ఇలాంటి అరుదైన సీతాకోకచిలుకను గతంలో ఎప్పుడూ చూడలేదని అపార్ట్మెంట్ వాసులు తెలిపారు. -
డొనాల్డ్ ట్రంప్ స్పెషల్ ఫోటోలు
-
క్రికెట్లో అత్యంత అరుదైన పెనాల్టీ!
సాక్షి, స్పోర్ట్స్ : మైదానంలో కీపర్ ఉపయోగించని హెల్మెట్కు బంతి తగిలితే, ఫీల్డింగ్ చేస్తూ బంతి చేతులో లేకుండానే బ్యాట్స్మెన్ను కంగారు పెడితే విధించే పెనాల్టీలు చూశాం.. కానీ ఆస్ట్రేలియా దేశవాళి మ్యాచుల్లో విధించిన ఓ పెనాల్టీని ఇప్పటి వరకు ఎవరూ చూసుండరు.! ఆస్ట్రేలియా క్రికెటర్ రెయిన్ షా సరదాగా చేసిన ఓ పని ఐదు పరుగుల పెనాల్టీకి కారణమైంది. ఆసీస్ దేశవాళి జట్లైన క్విన్స్లాండ్స్- వెస్టెర్న్ ఆస్ట్రేలియా జట్ల మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. క్విన్స్లాండ్స్ తరఫున రెయిన్ షా ఆడుతుండగా.. మ్యాచ్ మధ్యలో కీపర్ జిమ్మి పీయర్సన్ గ్లోవ్స్ పక్కన పడేసి బంతికోసం పరుగెత్తాడు. అయితే స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న రెయిన్ షా ఆ బంతిని అందుకోడానికి స్టంప్స్ వైపు వస్తూ కీపర్ గ్లోవ్స్ పెట్టుకోని అందుకున్నాడు. ఇది క్రికెట్ నిబంధనలకు విరుద్దం కావడంతో అంపైర్ వెంటనే ఐదు పరుగుల పెనాల్టీ విధించాడు. దీంతో క్విన్స్లాండ్ ఆటగాళ్లు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే అంపైర్ ‘క్రికెట్ రూల్ 27.1 ప్రకారం కేవలం వికెట్ కీపర్ మాత్రమే గ్లోవ్స్ ధరించి ఫీల్డింగ్ చేయాలి. ఇతరులకు అనుమతి లేదని వివరించారు.’ దీంతో రెయిన్ షా చేసిన తీట పనికి ప్రత్యర్థి జట్టుకు అనవసరంగా ఐదు పరుగులు వచ్చాయి. ఈ మ్యాచ్ క్విన్స్ లాండ్స్ గెలుపొందడంతో రెయిన్ షాకు ఊరట లభించనట్లైంది. ఇక యాషెస్ సిరీస్ అనంతరం ఫామ్ కోల్పోయిన రెయిన్ షా ఆస్ట్రేలియా జట్టులో స్థానంలో కోల్పోయాడు. దీంతో తిరిగి దేశవాళి మ్యాచ్లు ఆడుతున్నాడు. భారత పర్యటనకు వచ్చిన ఆసీస్ జట్టులో ఓపెనర్గా రెయిన్ షా రాణించిన విషయం తెలిసిందే. -
సరదాగా చేసిన ఓ పనికి ఐదు పరుగుల పెనాల్టీ
-
12 ఏళ్లు..లక్ష కేసులు!
అలహాబాద్: అలహాబాద్ హైకోర్టు సీనియర్ జడ్జీగా పనిచేస్తున్న సుధీర్ అగర్వాల్ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. 2005 అక్టోబర్ 5వ తేదీన అలహాబాద్ హైకోర్టులో అదనపు జడ్జీగా నియమితులైన ఈయన బుధవారం నాటికి (12 ఏళ్లలో) లక్ష కేసులను పరిష్కరించారు. హైకోర్టు లక్నో బెంచ్లో ఉండగానే జడ్జి సుధీర్ అగర్వాల్ 10వేల కేసులను పరిష్కరించారని ఆయన సన్నిహితవర్గాలు తెలిపాయి. -
జీజీహెచ్లో అరుదైన శస్త్రచికిత్స
ఎండోస్కోపిక్ సర్జరీతో నాలుగు నెలల చిన్నారికి మెదడులోని నీరు తొలగింపు కాకినాడ వైద్యం (కాకినాడ సిటీ): పుట్టుకతో మెదడులో సంభవించిన జన్యుపరలోపంతో బాధపడుతున్న నాలుగు నెలల చిన్నారికి గంట స్వల్ప వ్యవధిలో కాకినాడ జీజీహెచ్ న్యూరోసర్జన్లు అరుదైన శస్త్రచికిత్స విజయవంతంగా చేశారు. మెదడుకు నీరు పట్టడంతో తల సైజు పెరిగిపోవడం, తలను నిలబెట్టలేకపోవడం వంటి రుగ్మతలతో సతమతమవుతున్న చిన్నారికి ఎండోస్కోపిక్ థర్డ్ వెంట్రిక్యులాస్టమి (ఈటీవీ) విధానంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చికిత్స చేశారు. మెదడులోని నీరు తొలగించారు. ఈ వివరాలను కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి న్యూరోసర్జరీ విభాగాధిపతి డాక్టర్ ఎం.ప్రేమ్జిత్ రే మంగళవారం విలేకరులకు వెల్లడించారు. మలికిపురం గ్రామానికి చెందిన రాపాక నాగరాజు, కనకదుర్గ దంపతులకు తొలి కాన్పులో నాలుగు నెలల కిందట పాప జన్మించింది. ప్రైవేట్ ఆసుపత్రిలో సిజేరియన్ చేశారు. పాప పుట్టినప్పటి నుంచి తల సైజు పెరగటం, తల నిలబెట్టలేకపోవడం, ఆకలి మందగించడం, తలతిరగటం వంటి లక్షణాలను తల్లిదండ్రులు గుర్తించి పలువురు వైద్యులకు చూపించారు. చిన్నారికి మైక్రోస్కోపిక్ స్టంట్స్ ద్వారా పైపులు వేయాలని, రిస్క్తో కూడుకున్న ఆపరేషన్ అని, ఇందుకు చాలా ఖర్చవుతుందని చెప్పడంతో ఆర్థిక స్తోమత లేని వీరు తమ చిన్నారిని ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చి 2వ తేదీన చేర్పించారు. చిన్నారిని పరీక్షించిన న్యూరోసర్జరీ విభాగాధిపతి డాక్టర్ ప్రేమ్జిత్ రే ఎండో స్కోపిక్ థర్డ్ వెంట్రిక్యులాస్టమీ (ఈటీవీ) ఆధునిక పరిజ్ఞానంతో శస్త్రచికిత్స నిర్వహించారు. మార్చి 18న మైక్రోస్కోపిక్ స్టంట్స్ ద్వారా తలకు ఎటువంటి పైపులు వేయకుండా, ఎండోస్కోపిక్ సర్జరీతో కేవలం గంట వ్యవధిలో నీటిని తొలగించారు. ఎండోస్కోపిక్ సర్జరీని చిన్నారికి జీజీహెచ్లో నిర్వహించడం ఇదే తొలిసారని విభాగాధిపతి డాక్టర్ ప్రేమ్జిత్ రే తెలిపారు. పదిరోజుల తర్వాత పూర్తిగా కోలుకున్న తర్వాత చిన్నారిని డిశ్చార్జి చేసినట్టు తెలిపారు. శస్త్రచికిత్సలో తనతో పాటూ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గిరి, మత్తు వైద్యులతో పాటూ పీజీ వైద్యులు పాల్గొన్నట్టు తెలిపారు. ఆపరేషన్కు రూ.2 లక్షలు ఖర్చవుతుందని ప్రైవేట్ వైద్యులు తెలపడంతో నిరుపేదలమైన తాము చిన్నారి జీవితంపై ఆశ వదులుకున్నామన్నారు. అలాంటి దశలో జీజీహెచ్ వైద్యులు ఉచితంగా వైద్యం చేశారని తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. -
నిలువెత్తు గెల!
ఆరడుగుల ఎత్తు, 25 అత్తాలు అబ్బురపరచిన అరటి గెల సాధారణంగా మూడడుగుల ఎదిగే అరటి గెల ఏకంగా ఆరడుగులు పెరిగి అబ్బుర పరుస్తోంది. రావులపాలెం ప్రాంతంలో అరుదుగా కనిపించే కర్ణాటక చెక్కరకేళీగా పిలిచే బూడిద బక్కీస్ రకానికి చెందిన భారీ గెలను స్థానిక అరటి మార్కెట్కు బుధవారం అమ్మకానికి తీసుకువచ్చారు. రావులపాలానికి చెందిన మల్లిడి త్రినాథరెడ్డి తన ఇంటి పెరడులో పెంచిన చెట్టుకు కాసిన గెల పక్వానికి రావడంతో తన సైకిల్పై యార్డుకు తీసుకువచ్చాడు. ఆ గెలను కొనేందుకు వ్యాపారులు పోటీ పడ్డారు. చివరికి కొమరాజులంకకు చెందిన కర్రి శ్రీనివాసరెడ్డి రూ.650కు కొనుగోలు చేశారు. ఈ గెలలో మొత్తం 25 అత్తాలు ఉండగా, ఒక్కో అత్తంలో సుమారు 20 నుంచి 25 కాయలు ఉన్నాయి. మొత్తంగా సుమారు 600 కాయలు ఉంటాయని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ గెలను అంతా ఆసక్తిగా తిలకించారు. - రావులపాలెం -
జీజీహెచ్లో అరుదైన ఆపరేషన్
గుంటూరు మెడికల్: ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి అరుదైన ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడినట్లు గుంటూరు జీజీహెచ్ కార్డియోథొరాసిక్ వైద్య విభాగం( సిటిఎస్) అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మెగావత్ మోతీలాల్ చెప్పారు. గురువారం ఆస్పత్రిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆపరేషన్ వివరాలను ఆయన వెల్లడించారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చెర్లోపల్లికి చెందిన పాముల ఆవులయ్య గొర్రెలు, మేకలు మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈనెల 10న తన పశువులకు ఆహారం కోసం చెట్టు నరుకుతున్న సమయంలో కొమ్మ విరిగిపడి కుడికాలికి గుచ్చుకుని రక్తనాళం తెగిపోయింది. దీంతో ఆగకుండా రక్త స్రావం అవుతోంది. . సుమారు 4 లీటర్లకు పైగా ఆవులయ్య శరీరం నుండి రక్తం పోవటంతో అపస్మారక స్థితికి చేరుకుని ప్రాణాపాయ స్థితిలో బుధవారం అర్ధరాత్రి జీజీహెచ్కు తీసుకొచ్చారు. క్యాజువాలిటీలో ఎమర్జెన్సీ డ్యూటీకి అర్ధరాత్రి హాజరై ముందస్తుగా ఐదు బ్యాగ్స్ రక్తం ఎక్కించి ఎమర్జన్సీ ఆపరేషన్ థియేటర్లోనే రెండుగంటలసేపు ఆపరేషన్ చేసి ఆవులయ్య ప్రాణాలను కాపాడినట్లు డాక్టర్ మోతీలాల్ చెప్పారు. ‘ఫిమరల్ వీన్ ఎండ్టు ఎండ్’ అనే ఆపరేషన్ చేశామని ఆపరేషన్ ప్రక్రియలో తనతోపాటుగా మత్తు వైద్య విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నాగభూషణం, పీజీ వైద్యుడు డాక్టర్ కౌషిక్, జనరల్ సర్జరీ పీజీ వైద్యులు డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ రాకేష్, డాక్టర్ రాజేష్లు పాల్గొన్నట్లు వెల్లడించారు. జీజీహెచ్లో ఇలాంటి ఆపరేషన్ చేయటం ఇదే మొదటిసారి అని, ప్రమాద బాధితుడికి హెపటైటిస్ పాజిటివ్ ఉన్నప్పటికీ రిస్క్ తీసుకుని తాము ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడామన్నారు. సకాలంలో ఆపరేషన్ చేయకపోతే ప్రాణాలు పోతాయని, కుడి కాలిలో నరం తెగిపోవటంతో, కడుపులో రక్తనాళం తీసి ఆపరేషన్ చేశామని డాక్టర్ మోతీలాల్ వివరించారు. ఆవులయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని రెండు రోజుల్లో ఆస్పత్రి నుండి డిశ్చార్జి చేస్తామన్నారు. -
ఛత్తీస్ఘడ్లో అరుదైన పాము
-
శాస్త్రవేత్తలను రక్షించేందుకు సాహసం...
అనారోగ్యంతో ఉన్న ఇద్దరు సైంటిస్టుల ప్రాణాలు కాపాడేందుకు దక్షిణ ధృవానికి అత్యంత క్లిష్టతరమైన పరిస్థితుల్లో ప్రయోగాత్మకంగా రెండు చిన్న విమానాలు బయల్దేరాయి. అంటార్కిటికాలో శీతాకాలం నడుస్తున్న సమయంలో ఇటువంటి ప్రయోగం నిజంగా సాహసమేనని నేషనల్ సైన్స్ ఫౌండేషన్ పోలార్ ప్రోగ్రామ్స్ డైరెక్టర్ కెల్లీ ఫాల్కనర్ తెలిపారు. దక్షిణ ధృవానికి వెళ్ళిన ఇద్దరు శాస్త్రవేత్తలకు కొన్ని అనుకోని కారణాలవల్ల అనారోగ్యం సంభవించిందని, అయితే వారిప్రాణాలు రక్షించేందుకు కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కెల్లీ పాల్కనర్ వివరించారు. ప్రతియేటా 50 మంది శాస్త్రవేత్తల బృదం శీతాకాలానికి ముందే దక్షిణ ధృవానికి చేరుకుని అక్కడే దాదాపు ఆరునెలలు ఉంటారు. శీతాకాలం సమయంలో అక్కడినుంచీ వారు ఎట్టిపరిస్థితిలో బయటకు వచ్చే అవకాశం ఉండదని, రేడియో కాంట్రాక్టుద్వారా అమెరికా, రష్యాల్లోని కమాండింగ్ సెంటర్లకు సమాచారం పంపుతుంటారు. అయితే ఈ సీజన్ లో ఇద్దరు శాస్త్రవేత్తలకు అనుకోకుండా అనారోగ్యం సంభవించినట్లు సమాచారం అందిందని, ప్రయోగాత్మకంగా వారిని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పాల్కనర్ తెలిపారు. అయితే వారికి అందించే మెడికల్ హెల్ప్ కు సంబంధించిన మిగిలిన వివరాలను మాత్రం గోప్యతా కారణాల దృష్ట్యా వెల్లడించలేదు. నేషనల్ సైన్స్ ఫౌండేషన్, లాక్ హీడ్ మార్టిన్ లు కలసి ప్రతి సంవత్సరం దక్షిణ ధృవానికి వెళ్ళే ఈ బృందాన్ని ఎంపిక చేస్తుంటాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తాము అన్ని నిర్ణయాలు సమతుల్యంగా ఉండేట్లు ప్రయత్నిస్తున్నామని పాల్కనర్ చెప్తున్నారు. ఈ సమయంలో రోగుల పరిస్థితి, విమాన సిబ్బంది భద్రత తో పాటు అముంద్సేన్ స్కాట్ లోని మిగిలిన 48 మంది శాస్త్రవేత్తల అసవసరాలను కూడ దృష్టిలో ఉంచుకోవాలన్నారు. అయితే 60 సంవత్సరాల సౌత్ పోల్ రీసెర్స్ సెంటర్ చరిత్రలో ఈ తరహా రెస్క్యూ ఆపరేషన్లు రెండు మాత్రమే జరిగాయని, ఇటువంటివి ఆసాధారణంగా ఉంటాయని, శీతాకాలంలో అత్యంత మంచుతోను, చీకటిగాను ఉన్నసమయంలో అక్కడ విమానాల ల్యాండింగ్, టేకాఫ్ వంటి వాటికి ఎంతమాత్రం అనుకూలంగా ఉండదని అంటున్నారు. 1999 లో, ఓ డాక్టర్ తన ఛాతీభాగంలో క్యాన్సర్ కణతిని గుర్తించి, తనకు తానే శస్త్రచికిత్స చేసుకొని, అనంతరం కీమో థెరపీ చేసుకోగా, ఆమెను బయటకు తెచ్చేందుకు శీతాకాలం ముగిసే సమయంలో బృందం వెళ్ళింది. పదేళ్ళ తర్వాత 2001 ఆగస్టులో ఓ మేనేజర్ గుండెపోటుకు గురికాగా, ఓ వైమానిక బృదం రిస్క్ తీసుకొని మరీ అక్కడకు వెళ్ళి ఆయన్ను క్షేమంగా బయటకు తెచ్చింది. కాగా ప్రస్తుతం దక్షిణ ధృవంలో ఇద్దరు శాస్త్రవేత్తలకు అనారోగ్యం సంభవించడంతో నేషనల్ ఫౌండేషన్ అధికారులు వారిని క్షేమంగా బయటకు తెచ్చే సాహసోపేత ప్రయత్నం చేస్తున్నారు. -
రెయిన్ బో ఇలా కూడానా!
సాధారణంగా ఇంద్రధనుస్సు ఎలా కనిపిస్తుంది? విల్లు ఆకారంలో కనిపిస్తుంది. అందుకే దీనిని హరివిల్లు అని కూడా అంటాం. కానీ, అమెరికాలో మండుతున్నట్లుగా కనిపించి అక్కడి ప్రజల్ని మురిపించింది. అత్యంత అరుదుగా సంభవించే ఈ ఘటన మంగళవారం న్యూజెర్సీలో సముద్రతీరంలో దర్శనమిచ్చింది. ఒకసారి మండుతున్న మంటలా.. ఇంకోసారి ఆకాశం నుంచి రాలుతున్న తోకచుక్కలా.. మరోసారి ఒకదాని ఒకటి ఆనుకుని ఉన్న పర్వాతాల్లా కనిపించి చూపరులను సంభ్రమాశ్చార్యాలకు గురిచేసింది. వాతావరణంలో మార్పులు, మేఘాలు అడ్డుతగలడం వల్ల ఇలాంటివి అప్పుడప్పుడు సంభవిస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. మంగళవారం మేఘాలు చాలా ఎత్తులో ఉన్నాయని, అదే సమయంలో సూర్యుని నుంచి కిరణాలు ఒకే కోణంలో మేఘాల్లో ఘనీభవించిన నీటిని తాకడం వల్ల హరివిల్లు ఇలా ఏర్పడినట్లు వివరించారు. దాదాపు 15,000 అడుగుల ఎత్తులో హరివిల్లు ఏర్పడినట్లు చెప్పారు. కాగా, ఆర్లాండో నరమేధానికి నివాళిగా ఈ రెయిన్ బో ఏర్పడినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. -
నీలివజ్రం కొత్త రికార్డు!
హాంకాంగ్: వేలం పాటలో ఓ నీలి వజ్రం సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ వజ్రం సోథెబేస్ట్ మార్కెట్లో 205 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయి జ్యువెలరీ మార్కెట్లో ఇంతకు ముందెన్నడూ కనీ వినీ ఎరుగని రికార్డును సాధించింది. అలాగే మరో పెయింటింగ్ కూడా వందలకోట్ల ధర పలికి రికార్డు సృష్టించింది. డీబీర్స్ మిలీనియమ్ జ్యువెల్ 4 లో 10.10 క్యారెట్ల గోళాకార ఫాన్సీ వివిద్ బ్లూ డైమండ్... ఆసియాలో మరే ఇతర ఆభరణాల వేలంలోనూ తెచ్చి పెట్టని అత్యధిక డబ్బును తెచ్చిపెట్టిందని ఆక్షన్ హౌస్ వెల్లడించింది. ఆ అరుదైన నీలి వజ్రాన్ని ఓ బిడ్డర్ ఫోన్ ద్వారా వేలంలో కొనుగోలు చేసినట్లు దక్షిణ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక ఓ ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు చైనీస్ కళాకారుడు ఝాన్ డాక్వియన్ సృష్టించిన 'పీచ్ బ్లౌజమ్ స్పింగ్' కళాత్మక పెయింటింగ్ .. అసలు ధర 8.3 మిలియన్ డాలర్లు ఉండగా... అంచనాలను అధిగమించి సుమారు 230 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. ఆ కళారూపం కేవలం 50 నిమిషాల్లో 100 కంటే ఎక్కువ బిడ్లను పొంది.. షాంఘై లాంగ్ మ్యూజియంకు అత్యంత అధిక ధర పలికింది. ఝాన్ వేసిన ఈ పెయింటింగ్ ఈ స్థాయిలో ధర పలకడం ఇదే మొదటిసారి. -
ఇసుక తిని బతికేస్తున్న సాండ్ మ్యాన్!
వర్షం వస్తున్నపుడు వచ్చే మట్టి వాసనను ఇష్టపడని మనుషులుండరేమో.. అలాగే చిన్నతనంలో మట్టి తినని వారు కూడా ఉండరేమో.. కానీ ఓ వ్యక్తి చిరుతిండిలా... తినుబండారాలను తిన్నట్లుగా ఇసుక, మట్టిని తినెయ్యడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. శరీరంలో విటమిన్ల లోపం కారణంగానే అతడు మట్టి తినడానికి అలవాటు పడ్డాడని డాక్టర్లు చెప్తుండగా.. తాను ఎంతో ఆరోగ్యంగా ఉన్నానని చెప్తున్న సదరు వ్యక్తి ఏకంగా 'సాండ్ మాన్' గా పేరు తెచ్చుకున్నాడు. ఉత్తరప్రదేశ్ లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన హంస్ రాజ్ ఏదో టిఫిన్ తిన్నట్లుగా రోజుకో ప్లేటు ఇసుకను తినేస్తున్నాడు. ఇరవై ఏళ్ళ వయసులో ఇసుక తినడానికి అలవాటు పడ్డ అతడు చివరికి అదే అలవాటుకు బానిసయ్యాడు. ఇసుకతోపాటు ఇటుక, రాళ్ళ ముక్కలను కూడ నంజుకుని కరాకరా నములుతూ తినేస్తున్నాడు. శరీరంలో విటమిన్లు లోపంవల్ల ఏర్పడే పికా డిజార్డర్ అతనికి ఉండొచ్చని, అందుకే అలా చేస్తున్నాడని డాక్టర్లు చెప్తున్నారు. అటువంటి అలవాటు కొన్నాళ్ళకు తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతాయని అంటున్నారు. ఇటువంటి రోగానికి చికిత్స లేదని చెప్తున్నారు. ఇలా ఇసుక తినడం వల్ల కొన్నాళ్ళకు అది విషంగా మారి ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. అయితే హంస్ రాజ్ మాత్రం తాను ఎంతో ఆరోగ్యంగా ఉన్నానని, ఇసుక తినడం వల్ల ఎటువంటి సమస్యా లేదని చెప్తున్నాడు. ఇసుక తినడంతో తనకు విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా చేరుతున్నాయని, తాను ధృఢంగా ఉండేందుకు అవి తోడ్పడుతున్నాయని అంటున్నాడు. సుమారు 25 ఏళ్ళనుంచి ఇలా.. ఇసుక, రాళ్ళు, ఇటుక ముక్కలు తింటున్నానని, ఇలా తినడం ఇప్పటికీ తనకు ఎంతో ఇష్టమని ఆనందంగా చెప్తున్నాడు. ప్రతిరోజూ ఓ ప్లేటు ఇసుక తిననిదే 45 ఏళ్ళ హంస్ రాజ్ కు నిద్ర పట్టదు. అందుకే తన గ్రామంనుంచీ పక్క గ్రామానికి వెళ్ళి మరీ బస్తాలతో ఇసుకను తెచ్చి ఇంట్లో భద్రపరచుకుంటున్నాడు. ఈ అలవాటు వల్ల అతను ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ లోనే ఫేమస్ అయిపోయాడు. 'సాండ్ మ్యాన్' గా పేరు తెచ్చుకున్నాడు. ఇసుక తినడంవల్ల తన కడుపులోనూ, పళ్ళకు కూడ ఎటువంటి ఇబ్బందీ కలగడం లేదని, గట్టిగా ఉన్న రాయిని కూడ తాను సునాయాసంగా కొరకగల్గుతానని చెప్తున్నాడు. -
సన్షైన్లో అరుదైన శస్త్రచికిత్స
సాక్షి, హైదరాబాద్ : గుండె నాళాలు మూసుకుపోయిన ఆరుగురు రోగులకు దేశంలోనే మొట్ట మొదటిసారిగా సన్షైన్ ఆస్పత్రి వైద్యులు క్రాస్బాస్ పద్ధతిలో యాంజియో ప్లాస్టీని విజయవంతంగా నిర్వహించారు. టోక్యోకు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ అకసూరతో కలిసి ఈ అరుదైన శస్త్ర చికిత్సలు పూర్తి చేశారు. ‘కార్డియాలజీలో వస్తున్న అధునాతన చికిత్స... శస్త్ర చికిత్స విధానా లు’ అనే అంశంపై ఆస్పత్రిలో గురువారం సద స్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆస్పత్రి ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు డాక్టర్ శ్రీధర్ కస్తూరి మాట్లాడుతూ గుండె రక్తనాళం పూర్తిగా లేదా 80 శాతానికి పైగా పూడుకు పోయిన వారికి, కాల్షి యం లాంటి గట్టి పదార్థాలతో బ్లాక్స్ ఏర్పడిన వారికి ఓపెన్హార్ట్ సర్జరీ నిర్వహించే వారని తెలిపారు. వారికి యాంజియోప్లాస్టీ శస్త్ర చికిత్సలు చేయడం క్లిష్టమైనదని వివరించారు. తాము మొట్టమొదటి సారిగా క్రాస్బాస్ పద్ధతిలో యాం జియోప్లాస్టీ నిర్వహించినట్లు తెలిపారు. ఆస్పత్రి ఎమ్డీ డాక్టర్ గురవారెడ్డి మాట్లాడుతూ ఎలాంటి గాటు లేకుండా శస్త్ర చికిత్స చేయడంతో రోగి త్వరగా కోలుకుంటారని తెలిపారు. రోజు వారీ పనులు యధావిధిగా చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో కార్డియాలజిస్టులు డాక్టర్ విజయ్ కుమార్, డాక్టర్ కొండల్రావు పాల్గొన్నారు. -
అరుదైన కలం
అసమానతలు, అణచివేత ఉన్నచోటే చైతన్యమూ, పోరాటమూ ఉంటుంది. ధిక్కారం దావానలంలా నలుదిక్కులా వ్యాపిస్తుంది. అందులో బుద్ధిజీవులైనవారు భాగస్వాములు కాకుండా ఉండలేరు. అలా నిజాం నిరంకుశత్వంపై, దొరల దోపిడీపీడనలపై జనంతో కలిసి పోరాడిన కవులు, రచయితలు తెలంగాణ గడ్డపై ఎంతోమంది ఉన్నారు. 87 ఏళ్ల వయసులో సోమవారం కన్నుమూసిన దాశరథి రంగాచార్య ఆ కోవకు చెందిన విఖ్యాత రచయిత. నిప్పును కడిగే సనాతనుల వంశంలో పుట్టినా పద్దెనిమిదేళ్ల చిరుప్రాయంలోనే తుపాకిపట్టి అజ్ఞాతవాసానికి వెళ్లి మట్టి మనుషులతో భుజం భుజం కలిపి నడిచిన యోధుడు రంగాచార్య. మృత్యువు వెంట్రుకవాసి దూరంలో నిరంతరం వెన్నాడుతూనే ఉన్నా వెరవని వ్యక్తిత్వం ఆయనది. ఆరో తరగతి చదువుతున్న సమయంలోనే నిజాం ఫర్మానాకు వ్యతిరేకంగా ఖమ్మం స్కూల్లో విద్యార్థుల్ని సమీకరించి ఉద్యమించడం మొదలుకొని ఆయనది మొదటినుంచీ పోరాట పథమే. అన్న, అభ్యుదయ కవి దాశరథి కృష్ణమాచార్య ప్రేరణతో కమ్యూనిజాన్ని చదువుకొని, పోరాటాన్ని ఒంటబట్టించుకుని సమాజాన్ని చాలా సన్నిహితంగా చూసిన అనుభవంతో రచయితగా ఎదిగాడు. అడపా దడపా కవిత్వమూ రాశాడు. అయితే, నిజాం రాజరికంపై ‘అగ్నిధార’ కురిపించిన అన్న కృష్ణమాచార్యే కవిత్వం రాయడానికి సరైనవారని భావించి తాను వచనానికి పరిమితం కావాలని ఆయన నిర్ణయించుకున్నాడు. పాలకుల దాష్టీకాన్ని ప్రశ్నించనివాడు రచయిత కాదుగదా...మనిషి కూడా కాదన్న స్పృహతో తెలంగాణ జనజీవితాన్ని అక్షరాల్లో పొదిగినవాడు దాశరథి. నిజాం పాలనను ఇవాళ్టి అవసరాలతో ఎవరైనా అలవోకగా పొగిడేయవచ్చుగానీ...ఆ భూస్వామ్య పాలన తెలంగాణ జనజీవితాన్ని ఎలా విచ్ఛిన్నం చేసిందో, ఎంతగా కష్టపెట్టిందో, ఎన్ని కుటుంబాల ఉసురుపోసుకున్నదో ప్రత్యక్షంగా తెలుసుకుని వాటిని అక్షరీకరించిన రచయిత ఆయన. నిజాం కాలంలో తెలంగాణ సమాజం ఎట్లా ఉన్నదో... పోరాటం రాజుకుని విజృంభించిన వేళ అది ఏ ఏ మలుపులు తీసుకున్నదో... వివిధ సందర్భాల్లో సామాన్యులు చేసిన సాహసాలెలాంటివో... పరిమళించిన మానవీయ విలువల ఔన్నత్యమెంతటిదో కళ్లకు కట్టిన రచనలు ఆయనవి. దాశరథే చెప్పుకున్నట్టు అవన్నీ పోరాటాల కథలు. త్యాగాల కథలు. జీవితం కథలు. తాను పేరు కోసమో, డబ్బు కోసమో రాయలేదని...ఈ గడ్డన ఎలాంటి మనుషులు మనుగడ సాగించారో, ఎన్ని ఇబ్బందులుపడ్డారో, వాటిని అధిగమించడానికి ఏంచేశారో భవిష్యత్తరాలు తెలుసుకోవడానికే కలం పట్టానని ఆయన చెప్పారు. లేనట్టయితే ఆనాటి నిరంకుశ పాలననూ, రజాకార్ల హింసనూ మరిచి నిజాంను ఒక ప్రభువుగా కీర్తించే ప్రమాదమున్నదని ఆయన శంకించారు. పోరాట క్షేత్రంలో మాత్రమే కాదు...జీవితంలోనూ ఆయనకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. నమ్మిన విలువలనుంచి వైదొలగకుండానే వీటన్నిటినీ ఆయన ఎదుర్కొన్నారు. పోలీసు చర్య అనంతరం 1948లో సాయుధ పోరాట విరమణ జరిగాక బయటికొచ్చినప్పుడు దాశరథికి జీవితమే ప్రశ్నార్థకమైంది. ఏం చేయాలో, ఎలా బతకాలో తెలియని పరిస్థితి. అన్న జైలుపాలై తనతోపాటు మరో అయిదుగురు కుటుంబసభ్యుల భారం మీదపడినప్పుడు తొణక్కుండా పంటి బిగువున కష్టాలు భరించి మెట్రిక్యులేషన్ పూర్తిచేసి బడిపంతులు ఉద్యోగాన్ని సంపాదించారు. ఆ ఉద్యోగం చేస్తూనే బీఏ ఉత్తీర్ణత సాధించి సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కొలువు సంపాదించారు. వట్టికోట ఆళ్వారుస్వామి అసంపూర్తిగా వదిలివెళ్లిన కర్తవ్యాన్ని పరిపూర్తి చేయడానికి తాను రచనారంగంలోకి ప్రవేశించాల్సిన అవసరం ఉన్నదని ఆయన గుర్తించారు. ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాట పూర్వ పరిస్థితులనూ, ఆ పోరాటం సమయంలో ఉన్న స్థితిగతులనూ, అనంతర పరిణామాలనూ ఆయన రచనలు రికార్డు చేశాయి. ఈ రచనలన్నీ ఉద్దేశిత వర్గాలకు చేరడానికి అనుసరించాల్సిన మార్గమేమిటో ఆయన ముందే నిర్ణయించుకున్నారు. పాత్రలు సంభాషించుకునే సందర్భంలో మాత్రమే మాండ లికానికి చోటీయాలని, మిగిలినదంతా ప్రామాణిక భాషలో సాగాలని భావించారు. అందువల్లే ఆయన కథలైనా, నవలలైనా తెలుగు నేలంతా గుబాళించాయి. తన నవలల్లో చిత్రీకరించే కాలానికి పాఠకుల్ని తీసుకెళ్లడం కోసం దానికి అనుగుణమైన వాతావరణాన్ని ఎన్నుకోవడం, పాత్రలు ఉపయోగించే భాష మొదలుకొని అన్నిటిలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఆయన విశిష్టత. 1938కి పూర్వంనాటి తెలంగాణ జీవితాన్ని చిత్రించిన ‘చిల్లరదేవుళ్లు’ నవలలో ఉర్దూ పదాలు ఎక్కువగా కనిపించడానికి కారణం ఇదే. దొరతనంపై ఊరు ఊరంతా ఏకమై పోరాడటం ఇతివృత్తంగా సాగిన ఈ నవల హిందీ, ఇంగ్లిష్ భాషల్లోకి అనువాదమై దేశంలోనే విశేషాదరణ పొందింది. ఈ నవలకు 1970లో సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. రేడియో నాటకంగా ప్రసారమై, అనంతరకాలంలో చలనచిత్రంగా వచ్చి అందరి మన్ననలూ పొందింది. ‘మోదుగుపూలు’ నవల సాయుధ పోరాట కాలంనాటి పరిస్థితులనూ, ‘జనపదం’ పోరాట విరమణానంతర పరిణామాలనూ సమర్థవంతంగా కళ్లకు కట్టాయి. కమ్యూనిస్టుగా జీవితాన్ని ప్రారంభించి, ఆ భావజాలంతోనే కొనసాగుతున్నానని చెప్పిన దాశరథి రామాయణ, మహాభారతాలనూ... వేదాలనూ, ఉపనిషత్తులనూ, బ్రాహ్మణాలనూ అనువదించడం చాలామందికి వింతగానే అనిపించింది. విశ్వశ్రేయస్సును కాంక్షి ంచడంలో వేదాలూ, కమ్యూనిజం ఒకటేనని ఆయన విశ్వాసం. దేవుణ్ణి నమ్మొచ్చుగానీ, మతతత్వం కూడదంటారు. అది సమాజాన్ని నాశనం చేసేంత ప్రమాదకరమైనదని ఆయన భావన. సమాజంలోని అసమానతలు పోవాలని, పెత్తందారీ పోకడలను ఎదిరించాలనీ, విద్వేషాలను రెచ్చగొట్టేవారు అంతరించి పోవాలనీ ఆకాంక్షించి... మనుషులు ఒకరి కోసం ఒకరు బతకాలనీ కోరుకుని... అందుకోసమే రచనలు చేసిన దాశరథి వంటివారు మన సమాజానికి ఎంతో అవసరం. ప్రపంచీకరణ మానవ సంబంధాలను ధ్వంసంచేస్తున్న తీరుపై ఆవేదనా... ఈ స్థితిపై సమష్టిగా గొంతెత్తరేమన్న అసహనమూ దాశరథిలో ఉండేవి. ఇలాగైతే భవిష్యత్తరాలు క్షమించబోవని హెచ్చరించేవారు. డబ్బుతో కొనుక్కుంటున్న విద్యవల్ల జ్ఞానం అడుగంటుతున్నదని బాధపడేవారు. తనచుట్టూ ఉన్న సమాజం కోసం, దాని క్షేమం కోసం పరితపించిన మహోన్నతుడు దాశరథి. ఆయనకివే మా నివాళులు. -
అరుదైన సీతాకోక చిలుక
కోస్గి: మహబూబ్నగర్ జిల్లా కోస్గి పట్టణంలో గురువారం ఓ అరుదైన సీతాకోక చిలుక కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. త్రిభుజాకారంలో వింతైన రంగుల మేళవింపుతో రెక్కలపై గుండ్రటి కళ్లలాంటి గుర్తులతో అక్కడక్కడ సేదతీరుతూ ఆక ట్టుకుంది. అందమైన సీతాకోక చిలుకను చూశామనే సంతోషాన్ని మిగిల్చి రివ్వున ఎగిరిపోయింది.