Reliance Capital
-
‘ఇండస్ఇండ్’ ఆధీనంలోకి అంబానీ కంపెనీ
అప్పుల ఊబిలో కూరుకుపోయిన రిలయన్స్ క్యాపిటల్ (ఆర్సీఏపీ)ను ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (ఐఐహెచ్ఎల్) తన ఆధీనంలోకి తీసుకుంది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్, దాని అనుబంధ సంస్థల బోర్డును ఐఐహెచ్ఎల్ తన ఆధీనంలోకి తీసుకుందని, కొత్త బోర్డు తొలి సమావేశం బుధవారం జరిగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆమోదం మేరకు కొత్త బోర్డు సభ్యులుగా మోసెస్ హార్డింగ్ జాన్, అరుణ్ తివారీలు ఉన్నారు.అంతకుముందు రిలయన్స్ క్యాపిటల్ (ఆర్క్యాప్) కొనుగోలు ప్రక్రియ పూర్తయినట్లు ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ (ఐఐహెచ్ఎల్) చైర్మన్ అశోక్ హిందుజా వెల్లడించారు. బిడ్ మొత్తాన్ని రుణదాతల ఖాతాలోకి బదిలీ చేసినట్లు తెలిపారు. ఈ డీల్పై దాదాపు మూడేళ్లుగా కసరత్తు చేస్తున్నట్లు హిందుజా పేర్కొన్నారు.ఆర్క్యాప్ వ్యాపారాన్ని సమీక్షించి, అవసరమైతే నిధులను సమకూర్చడంపై నిర్ణయం తీసుకుంటామని వివరించారు. చిన్నా చితకా అనుబంధ సంస్థలు 39–40 వరకు ఉన్నాయని, వాటిల్లో చాలా మటుకు సంస్థలను కొత్త మేనేజ్మెంట్ విక్రయించవచ్చని హిందుజా చెప్పారు. బ్రోకింగ్, అసెట్ రీకన్స్ట్రక్షన్ వ్యాపారాన్ని మాత్రం అట్టే పెట్టుకుంటుందని వివరించారు.నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆదేశాల ప్రకారం మూడేళ్ల పాటు అదే పేరుతో వ్యాపారాలను కొనసాగించవచ్చని, కానీ తమ సొంత ఇండస్ఇండ్ బ్రాండ్తో అనుసంధానించడంపై కసరత్తు చేస్తున్నామని హిందుజా చెప్పారు. అనుసంధానానికి 6–9 నెలల సమయం పట్టొచ్చని వివరించారు.చెల్లింపుల విషయంలో డిఫాల్ట్ కావడం, గవర్నెన్స్లో లోపాలు తదితర అంశాల కారణంగా రిలయన్స్ క్యాపిటల్ను 2021లో రిజర్వ్ బ్యాంక్ నియమించిన అడ్మినిస్ట్రేటర్ తన ఆధీనంలోకి తీసుకున్నారు. కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ (సీఐఆర్పీ) కింద 2023 ఏప్రిల్లో రూ. 9,650 కోట్లు ఆఫర్ చేసి ఐఐహెచ్ఎల్ విజయవంతమైన బిడ్డరుగా నిల్చింది. -
చివరికి వచ్చేసిన రిలయన్స్ క్యాపిటల్ కొనుగోలు
రిలయన్స్ క్యాపిటల్ కొనుగోలు జనవరి చివరికి పూర్తి అవుతుందని హిందుజా గ్రూప్ కంపెనీ ఐఐహెచ్ఎల్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఆర్క్యాప్ కొనుగోలుతో బ్యాంకింగ్, ఫైనాన్షియల్సర్వీసెస్ (బీఎఫ్ఎస్ఐ) వ్యాపారాన్ని వచ్చే ఐదేళ్లలో 50 బిలియన్ డాలర్లకు చేర్చాలనే లక్ష్యంతో ఉన్నట్టు తెలిపింది. ప్రస్తుత విలువ 15 బిలియన్ డాలర్లుగా ఉంది.‘‘రిలయన్స్ క్యాపిటల్కు సంబంధించి చాలా వరకు అనుమతులు, పరిష్కార ప్రక్రియలు ముగింపునకు వచ్చాయి. మరికొన్ని ప్రక్రియలు అడ్మినిస్ట్రేటర్, సీవోసీ స్థాయిలో పూర్తి కావాల్సి ఉంది. వచ్చే 4–6 వారాల్లో ఇవి పూర్తవుతాయని భావిస్తున్నాం’’అని ఐఐహెచ్ఎల్ చైర్మన్ అశోక్ పి. హిందుజా ప్రకటించారు. రూ.9,650 కోట్లకు ఆర్క్యాప్ కొనుగోలు బిడ్డింగ్లో ఐఐహెచ్ఎల్ విజేతగా నిలవడం తెలిసిందే.ఇందులో రూ.2,750 కోట్లను ఈక్విటీ రూపంలో సమకూర్చనుండగా, మిగిలిన మొత్తాన్ని రుణాలకు చెల్లించాల్సి ఉంది. దీనికి కట్టుబడి ఉన్నట్టు హిందుజా తెలిపారు. ఇండస్ ఇండ్ బ్రాండ్ ప్రచారం చేయాలని అనుకుంటున్నామని, బ్రాండ్ ప్రచారంపై ఏజెన్సీలు పనిచేస్తున్నట్టు ప్రకటించారు. ఐఐహెచ్ఎల్ మరో సబ్సిడరీ అయిన ఇండస్ఇండ్ బ్యాంక్తో బ్యాంక్ అష్యూరెన్స్ ఒప్పందం కోసం ఆర్క్యాప్ చర్చించనున్నట్టు తెలిపారు. -
అనిల్ అంబానీ ఆర్క్యాప్ టేకోవర్.. హిందూజాకు గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో చిక్కుకున్న రిలయన్స్ క్యాపిటల్(ఆర్క్యాప్) కొనుగోలు రేసులో హిందుజా గ్రూప్నకు వెసులుబాటు లభించింది. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ(డీపీఐఐటీ) తాజాగా హిందుజా గ్రూప్ సంస్థ ఐఐహెచ్ఎల్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్(ఐఐహెచ్ఎల్)లోని కొంతమంది వాటాదారులు చైనా అధీనంలోని హాంకాంగ్ నివాసితులు కావడంతో డిపీఐఐటీ అనుమతి తప్పనిసరి అయ్యింది. కాగా.. సరిహద్దు(చైనా, బంగ్లాదేశ్ తదితర) దేశాల పౌరులు ఎవరైనా దేశీ సంస్థకు యజమాని అయితే.. స్థానికంగా పెట్టుబడుల కోసం ప్రభుత్వ అనుమతిని తీసుకోవలసి ఉంటుంది. వెరసి ఆర్క్యాప్ కొనుగోలుకి మారిషస్ సంస్థ ఐఐహెచ్ఎల్ రుణ పరిష్కార(రిజల్యూషన్) ప్రణాళికకు దారి ఏర్పాటుకానుంది.ఇదీ చదవండి: అనిల్ అంబానీ భారీ ప్లాన్..ఇప్పటికే రూ. 9,861 కోట్ల విలువైన రిజల్యూషన్ ప్రణాళిక ద్వారా ఐఐహెచ్ఎల్ బిడ్డింగ్లో గెలుపొందింది. ఈ ప్రణాళికను 2024 ఫిబ్రవరి 27న ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ అనుమతించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా రుణదాతల కమిటీ 99.96 శాతం వోటింగ్తో మద్దతు పలికింది. దీనిలో భాగంగా డీపీఐఐటీ తాజాగా అనుమతించింది. -
48 గంటల్లో రూ. 2,750 కోట్లు డిపాజిట్ చేయండి
ముంబై: రిలయన్స్ క్యాపిటల్ (ఆర్క్యాప్) పరిష్కార ప్రణాళికకు సంబంధించి 48 గంటల్లోగా రూ. 2,750 కోట్ల మొత్తాన్ని ఎస్క్రో ఖాతాలో జమ చేయాల్సిందిగా ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ (ఐఐహెచ్ఎల్)ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆదేశించింది. ఈ ఖాతాపై వచ్చే వడ్డీ, రుణదాతల కమిటీకే (సీవోసీ) చెందుతుందని స్పష్టం చేసింది. వివరాల్లోకి వెడితే.. రుణాల చెల్లింపులో విఫలమైన ఆర్క్యాప్ దివాలా చట్టం కింద చర్యలు ఎదుర్కొంటోంది. సంస్థను కొనుగోలు చేసేందుకు దివాలా పరిష్కార ప్రణాళిక కింద రూ. 9,661 కోట్లు ఆఫర్ చేసిన హిందుజా గ్రూప్ సంస్థ ఐఐహెచ్ఎల్ .. బిడ్డింగ్లో విజేతగా నిలి్చంది. ఇందులో రూ. 2,750 కోట్ల మొత్తాన్ని రుణదాతల కమిటీ ఖాతాలోకి డిపాజిట్ చేయాలంటూ జూలై 23న ఐఐహెచ్ఎల్ని ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ ఆదేశించింది. అయితే, ఇందుకు సంబంధించిన ప్రణాళిక అమలుకు గడువు పెంచుతూ ఆదేశాల్లో కొన్ని సవరణలు చేయాలంటూ కంపెనీ కొత్తగా దాఖలు చేసిన పిటీషన్పై విచారణ సందర్భంగా ఎన్సీఎల్టీ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మరో రూ. 7,300 కోట్ల నిధుల సమీకరణ వివరాలను కూడా పర్యవేక్షణ కమిటీకి తెలియజేయాలంటూ సూచించింది. మరోవైపు, ఎన్సీఎల్టీ ఆదేశించినట్లుగా రూ. 2,750 కోట్ల మొత్తాన్ని సీవోసీ ఖాతాల్లో డిపాజిట్ చేయకుండా ఆ మొత్తాన్ని తన సొంత ఖాతాలోనూ, ప్రమోటర్ల ఖాతాలోనూ జమ చేసుకుందని దివాలా పరిష్కార నిపుణుడు ఆరోపించారు. అయితే, ఎస్క్రో ఖాతా వివరాలను సీవోసీ ఇవ్వనందువల్లే అలా చేయాల్సి వచి్చందని ఐఐహెచ్ఎల్ వివరణ ఇచి్చంది. -
అప్పులతో కుంగిన అనిల్ అంబానీ కంపెనీకి ఊరట..
ముంబై: అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ క్యాపిటల్కి భారీ ఊరట లభించింది. రుణభారంతో కుంగిన రిలయన్స్ క్యాపిటల్కి సంబంధించి హిందుజా–ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ ప్రతిపాదించిన రూ. 9,650 కోట్ల పరిష్కార ప్రణాళికకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం కంపెనీ రుణదాతలు భారీగా 63 శాతం రుణాలను వదులుకోవాల్సి వస్తుంది. అలాగే, ప్రణాళిక అమల్లో భాగంగా ఆర్క్యాప్ షేర్లను ఇండస్ఇండ్కు బదలాయించాక, దాన్ని స్టాక్ ఎక్స్చేంజీల నుంచి తొలగిస్తారు. మొత్తం రూ. 38,526 కోట్ల రుణాల క్లెయిమ్లకు గాను ఎన్సీఎల్టీ రూ. 26,086 కోట్ల క్లెయిమ్లనే అనుమతించింది. కానీ, 2023 జూన్లో బిడ్ వేసిన ఇండస్ఇండ్ అందులో రూ. 9,661 కోట్లు (37%) కడతానని ప్రతిపాదించింది. రిలయన్స్ క్యాపిటల్ కార్యకలాపాల పునర్వ్యవస్థీకరణకు మార్గాన్ని అందించడంలో ఎన్సీఎల్టీ ఆమోదం కీలకమని గమనించవచ్చు. -
రిలయన్స్ క్యాపిటల్పై హిందూజా బ్రదర్స్ కన్ను: బిలియన్ డాలర్ల ఫండ్
అప్పుల ఊబిలో కూరుకుపోయిన అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ను కొనుగోలు చేసేందుకు హిందూజా కుటుంబం ప్లాన్ చేస్తోంది. తాజా నివేదికల ప్రకారం దాదాపు రూ. 8,200 కోట్లు (1 బిలియన్ డాలర్లు) గ్లోబల్ క్రెడిట్ ఫండ్స్ను సమీకరించిందట. ఒకప్పుడు రూ.93,851 కోట్ల విలువైన రిలయన్స్ క్యాపిటల్ కొనుగోలుకు ప్రయత్నించిన దిగ్గజ కంపెనీల్లో హిందుజాలు ప్రాధాన్యమైన బిడ్డర్ కావడం గమనార్హం. (లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్ ట్వీట్ చూశారా? ఇంటర్నెట్ లేటెస్ట్ హల్చల్) తాజాగా ఫరాలోన్ క్యాపిటల్, ఓక్ట్రీ, అరేస్ ఆసియా అండ్ ఆసెర్బెరస్ లాంటి వాటితో హిందుజాలు టచ్లో ఉన్నారని మూలాలను ఉటంకిస్తూ ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. రిలయన్స్ క్యాపిటల్ లైఫ్, జనరల్ ఇన్సూరెన్స్ షేర్ల ద్వారా హిందుజాలు ఫైనాన్సింగ్కు మద్దతు ఇవ్వవచ్చని దీనికి సంబంధించి బీమా రెగ్యులేటర్ నుండి అవసరమైన అనుమతికి ఫండింగ్ పార్టనర్లు హిందుజాల నుండి గ్యారెంటీని కోరే అవకాశం ఉందని నివేదించింది. (Google Doodle Pani Puri Game: క్రిస్పీ..క్రిస్పీ పానీ పూరీ లవ్: గూగుల్ డూడుల్ ఇంటరాక్టివ్ గేమ్) స్వాధీనానికి కోర్టు అనుమతి లభించిన తర్వాత మాత్రమే ఫైనాన్సింగ్ చేయనున్నారని, రాబోయే వారాల్లో ఫైనాన్షియర్ల తుది జాబితా మారే అవకాశం ఉందని పేర్కొంది. హిందూజా గ్రూప్ కంపెనీ ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (IIHL) సమర్పించిన రూ. 9,650 కోట్ల రిజల్యూషన్ ప్లాన్ను అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ క్యాపిటల్ రుణదాతలు దివాలా అండ్ దివాలా కోడ్ (IBC) నిబంధనల ప్రకారం ఆమోదించారని హిందూజా గ్రూప్ జూలై 3న తెలిపింది. చెల్లింపు డిఫాల్ట్లు , పాలనాపరమైన సమస్యల కారణంగా నవంబర్ 29, 2021న ఆర్బీఐ రిలయన్స్ క్యాపిటల్ బోర్డ్ను తన ఆధీనంలోకి తెచ్చుకుంది. బోర్డు టేకోవర్ తర్వాత, కంపెనీ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ (CIRP)కి సంబంధించి నాగేశ్వరరావు వైని అడ్మినిస్ట్రేటర్గా నియమించింది. రిలయన్స్ క్యాపిటల్ మొదటి వేలం డిసెంబర్లో జరగ్గా, ఇందులో టోరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ రూ. 8,640 కోట్ల ఆఫర్తో అత్యధిక బిడ్డర్గా, హిందుజా గ్రూప్ రూ. 8,110 కోట్ల ఆఫర్ ఇచ్చింది. కానీ 24 గంటల్లోనే 9,000 కోట్ల రూపాయలతో సవరించిన బిడ్ను సమర్పించింది . అయితే టోరెంట్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT)దీన్ని సవాలు చేసింది. ఇక తదుపరి వేలం ఏప్రిల్ 26న జరిగింది, 9,650 కోట్ల రూపాయలతో ఐఐహెచ్లో మాత్రమే వేలంలో పాల్గొంది. ఈప్లాన్ ఆమోదంకోసం ఈ వారంలోనే ఎన్సీఎల్టీని సంప్రదించనున్నారు.ఈ అంచనాలపై అటు రిలయన్స్ క్యాపిటల్గానీ, ఇటు హిందూజా గ్రూప్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. -
రిలయన్స్ క్యాపిటల్ కొనుగోలు.. నిధుల వేటలో ‘ఇండస్ఇండ్’
ముంబై: ప్రతిపాదిత రిలయన్స్ క్యాపిటల్ (ఆర్క్యాప్) కొనుగోలు కోసం ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ (ఐఐహెచ్ఎల్) 1.5 బిలియన్ డాలర్లు సమీకరించనుంది. అలాగే సంస్థలో వాటాలను ప్రస్తుతమున్న 15 శాతం నుంచి 26 శాతానికి పెంచుకునేందుకు కూడా ఈ నిధులను వినియోగించనుంది. 1.5 బిలియన్ డాలర్ల నిధులను సమీకరణతో తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరించేందుకు అప రిమితమైన అవకాశాలు లభించగలవని ఐఐహెచ్ఎల్ చైర్మన్ అశోక్ పి హిందుజా ఒక ప్రకటనలో తెలిపారు. -
ఆర్క్యాప్ నష్టాలు తగ్గాయ్
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని రుణ పరిష్కార ప్రణాళికలకు చేరిన అనిల్ అంబానీ కంపెనీ రిలయన్స్ క్యాపిటల్(ఆర్క్యాప్) గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నష్టాలను భారీగా తగ్గించుకుంది. రూ. 1,488 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 4,249 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం రూ. 4,770 కోట్ల నుంచి రూ. 4,436 కోట్లకు క్షీణించింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 8,982 కోట్ల నుంచి రూ. 5,949 కోట్లకు దిగివచ్చాయి. 2021 నవంబర్ 29న కంపెనీ దివాలా ప్రక్రియకు చేరిన సంగతి తెలిసిందే. ఇక స్టాండెలోన్ నష్టం భారీగా పెరిగి రూ. 1,389 కోట్లను తాకింది. అంతక్రితం కేవలం రూ. 25 కోట్ల నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం రూ. 5 కోట్ల నుంచి రూ. 3 కోట్లకు తగ్గింది. -
హిందుజా కంపెనీకి రిలయన్స్ క్యాపిటల్!
న్యూఢిల్లీ: రుణ భారంతో ఉన్న రిలయన్స్ క్యాపిటల్ కొనుగోలు రేసులో రూ.9,650 కోట్ల ఆఫర్తో హిందుజా గ్రూప్ కంపెనీ అయిన ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ (ఐఐహెచ్ఎల్) హైయెస్ట్ బిడ్డర్గా నిలిచింది. 2022 డిసెంబర్లో తొలిసారిగా జరిగిన వేలంలో టోరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ రూ.8,640 కోట్లు ఆఫర్ చేసింది. రెండవ రౌండ్ వేలంలో టోరెంట్తోపాటు ఓక్ట్రీ పాల్గొనలేదు. రుణదాతల కమిటీ (సీవోసీ) కనీస బిడ్ మొత్తాన్ని తొలి రౌండ్కు రూ.9,500 కోట్లు, రెండవ రౌండ్కు రూ.10,000 కోట్లుగా నిర్ణయించారు. అన్ని బిడ్స్కు కనీసం రూ.8,000 కోట్ల ముందస్తు నగదు చెల్లింపు ఉండాలని కూడా సీవోసీ షరతు విధించింది. సుప్రీం తీర్పునకు లోబడి.. రిలయన్స్ క్యాపిటల్ ఆస్తుల విక్రయం ద్వారా గరిష్టంగా రికవరీని పొందడానికి రుణదాతలకు గడువు పొడిగిస్తూ సుప్రీంకోర్టు అనుమతించడంతో బుధవారం రెండవ రౌండ్ వేలం జరిగింది. రిలయన్స్ క్యాపిటల్ పరిష్కారం విషయంలో సీవోసీ ద్వారా ఏదైనా నిర్ణయం టోరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ దాఖలు చేసిన అప్పీల్లో సుప్రీం కోర్టు తీర్పు ఫలితానికి లోబడి ఉంటుంది. రిలయన్స్ క్యాపిటల్ పరిష్కార ప్రక్రియ మొదటి రౌండ్ వేలం తర్వాత వ్యాజ్యంలో చిక్కుకుంది. మొదటి రౌండ్ వేలం ముగిసిన తరువాత హిందూజా గ్రూప్ సంస్థ బిడ్ను సమర్పించింది. 2022 డిసెంబరులో దాఖలు చేసిన రూ.8,110 కోట్ల ఆఫర్ను సవరిస్తూ ఐఐహెచ్ఎల్ రూ.9,000 కోట్లతో మరో బిడ్ను అందించింది. రుణదాతలు రెండో రౌండ్ వేలం నిర్వహించాలని తమ ఉద్దేశాన్ని వ్యక్తం చేసినప్పటికీ ఇది జరిగింది. -
టొరంట్కు ఎన్సీఎల్టీ రిలీఫ్
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో చిక్కుకున్న రిలయన్స్ క్యాపిటల్ విక్రయ అంశాన్ని ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ తాజాగా తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. దివాలా పరిష్కార ప్రక్రియలో ఉన్న ఆర్క్యాప్ కొనుగోలుకి హిందుజా గ్రూప్ చివర్లో దాఖలు చేసిన సవరించిన బిడ్పై స్టే ఆర్డర్ ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ వివరాల ప్రకారం.. ఆర్క్యాప్ రుణ పరిష్కార ప్రణాళికలో భాగంగా రూ. 8,640 కోట్ల బిడ్తో టొరంట్ గ్రూప్ గరిష్ట బిడ్డర్గా నిలిచింది. అయితే తదుపరి హిందుజా గ్రూప్ రూ. 9,000 కోట్లకు సవరించిన బిడ్ను డిసెంబర్ 21న ఈవేలం ముగిశాక దాఖలు చేసినట్లు టొరంట్ గ్రూప్ ఎన్సీఎల్టీకి ఫిర్యాదు చేసింది. వేలం ముగిసిన తదుపరి రోజు హిందుజా గ్రూప్ సంస్థ ఇండస్ఇండ్ బ్యాంక్ తొలి ఆఫర్ను రూ. 8,100 కోట్లను తదుపరి రూ. 9,000 కోట్లకు సవరించినట్లు టొరంట్ గ్రూప్ ఫిర్యాదులో పేర్కొంది. ఈ అంశంపై వచ్చే వారం విచారణ జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా.. మరోపక్క రిలయన్స్ క్యాప్ రుణదాతలు అటు టొరంట్ గ్రూప్, ఇటు హిందుజా గ్రూప్తో రిజల్యూషన్పై చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. -
రుణ సంక్షోభంలో అనిల్ అంబానీ కంపెనీ..ఈవేలానికి రిలయన్స్ క్యాపిటల్ రెడీ
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో చిక్కుకున్న అనిల్ అంబానీ కంపెనీ రిలయన్స్ క్యాపిటల్ విక్రయానికి ఈవేలం నిర్వహించేందుకు విధానాలను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. వేలం విధానాలు, నిబంధనలను రుణదాతలు అనుమతించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వెరసి ఈ నెల 19న ఈవేలం ప్రారంభంకానున్నట్లు తెలియజేశాయి. కాస్మియా పిరమల్ కన్సార్షియం వేసిన రూ. 5,300 కోట్ల బిడ్ను వేలానికి ప్రాథమిక ధరగా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రౌండ్ 1లో భాగంగా బిడ్డర్లు ఈ ధరకుపైన కోట్ చేయవలసి ఉంటుందని సంబంధిత వర్గాలు వివరించాయి. ఒక ఎన్బీఎఫ్సీ రుణ పరిష్కార ప్రణాళిక కోసం ఈస్థాయిలో ఈవేలాన్ని నిర్వహించడం ఇదే తొలిసారని తెలియజేశాయి. -
ఆర్క్యాప్ లిక్విడేషన్ విలువ రూ.13,000 కోట్లు?
న్యూఢిల్లీ: రిలయన్స్ క్యాపిటల్ (ఆర్క్యాప్) లిక్విడేషన్ విలువ రూ.13,000 కోట్ల వరకు ఉంటుందని ఇండిపెండెంట్ వాల్యూయర్లు తేల్చారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దివాలా పక్రియ ప్రారంభించే తేదీ నాటికి ఆస్తిని విక్రయించినప్పుడు ఆ ఆస్తిపై అప్పులుపోను కొనుగోలుదారుకు అందే తుది విలువ అంచనానే లిక్విడేషన్ విలువ. రిలయన్స్ క్యాపిటల్ రుణ దాతల కమిటీ (సీఓసీ) సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో సంస్థకు సంబంధించి ఇండిపెండెంట్ వాల్యూయర్లు– డఫ్ అండ్ ఫెల్ప్సŠ, ఆర్బీఎస్ఏలు ఇచ్చిన లిక్విడేషన్ విలువ వివరాలను రిలయన్స్ క్యాపిటల్ అడ్మినిస్ట్రేటర్ సమర్పించారు. సంబంధిత వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ► ఆర్క్యాప్కు డఫ్ అండ్ ఫెల్పŠస్ రూ.12,500 కోట్ల లిక్విడేషన్ విలువ కడితే, ఆర్బీఎస్ఏ విలువ రూ.13,200 కోట్లుగా ఉంది. ► రిలయన్స్ క్యాపిటల్ కోసం నాలుగు సంస్థలు బిడ్డింగ్ వేశాయి. వీటి బిడ్డింగ్ విలువ తాజా లిక్విడేషన్ అంచనా విలువకంటే 30 నుంచి 40 శాతం తక్కువగా ఉండడం గమనార్హం. ► రిలయన్స్ క్యాపిటల్ రుణదాతలు అందుకున్న అత్యధిక బిడ్ విలువ చూస్తే... కాస్మియా ఫైనాన్షియల్, పిరమల్ గ్రూప్ కన్సార్టియంల ఆఫర్ రూ. 5,231 కోట్లు. ► హిందూజా రూ.5,060 కోట్లకు బిడ్ చేసింది. ► టొరెంట్, ఓక్ట్రీ బిడ్ల పరిమాణం వరుసగా రూ.4,500 కోట్లు, రూ.4,200 కోట్లుగా ఉంది. ► లిక్విడేషన్ విలువ– వాస్తవ బిడ్ విలువల మధ్య ఉన్న భారీ అంతరాన్ని దృష్టిలో ఉంచుకుని, తమ బిడ్లను సవరించమని సీఓసీ బిడ్డర్లను కోరే అవకాశం ఉందని సంబంధిత వర్గాలుతెలిపాయి. రిలయన్స్ క్యాప్ లైఫ్, జనరల్ ఇన్సూరెన్స్ విలువలు ఇలా... రిలయన్స్ క్యాపిటల్ వ్యాపారం విలువలో దాదాపు 90 శాతం వాటా కలిగిన ఆ సంస్థ– జీవితబీమా, సాధారణ బీమా వ్యాపారాల లిక్విడేషన్ విలువలు చూస్తే.. డఫ్ అండ్ ఫెల్పŠస్ వాల్యుయేషన్ నివేదిక ప్రకారం రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ లిక్విడేషన్ విలువ రూ.7,000 కోట్లు. రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ విలువ రూ.4,000 కోట్లు. ఆర్బీఎస్ఏ విషయంలో ఈ అంచనా వరుసగా రూ.7,500 కోట్లు, రూ.4,300 కోట్లుగా ఉన్నాయి. రిలయన్స్ క్యాపిటల్ రుణ దాతలు.. మొత్తం సంస్థకు అలాగే సంస్థలోని విభిన్న వ్యాపారాలకు వేర్వేరుగా బిడ్డింగ్ను పిలవడం జరిగింది. సంస్థ మొత్తం కొనుగోలుకు పైన పేర్కొన్న నాలుగు సంస్థలు బిడ్డింగ్ వేయగా, సెక్యూరిటీస్, రియల్టీ, ఏఆర్సీలకు మూడు బిడ్లు వచ్చాయి. మూడు బిడ్ల విలువ కేవలం రూ.120 కోట్లుగా ఉంది. అయితే డఫ్ అండ్ ఫెల్ప్సŠ, ఆర్బీఎస్ఏలు తాజాగా ఇచ్చిన లిక్విడేషన్ విలువలు వరుసగా రూ.280 కోట్లు, రూ.240 కోట్లుగా ఉన్నాయి. కాగా, జీవితబీమా, సాధారణ బీమా వ్యాపారాలకు మాత్రం వేర్వేరుగా ఎటువంటి బిడ్లు దాఖలు కాలేదు. -
ఎన్నాళ్ల కెన్నాళ్లకు..అనిల్ అంబానీకి భారీ ఊరట
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ డైవర్సిఫైడ్ కంపెనీ రిలయన్స్ క్యాపిటల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో తిరిగి లాభాల్లోకి ప్రవేశించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో రూ. 215 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో దాదాపు రూ. 1,116 కోట్ల నష్టాలు నమోదయ్యాయి. దివాలా పరిష్కార ప్రక్రియలో ఉన్న కంపెనీ మొత్తం ఆదాయం సైతం రూ. 6,002 కోట్ల నుంచి రూ. 6,047 కోట్లకు పుంజుకుంది. ప్రస్తుత క్యూ2లో రూ. 290 కోట్ల పన్నుకుముందు లాభం ఆర్జించగా.. గత క్యూ2లో రూ. 1,115 కోట్ల నిర్వహణా నష్టం ప్రకటించింది. రుణ చెల్లింపుల వైఫల్యం నేపథ్యంలో గతేడాది నవంబర్లో ఆర్బీఐ కంపెనీ బోర్డును రద్దు చేయడంతోపాటు.. వై.నాగేశ్వరరావును పాలనాధికారిగా నియమించిన సంగతి తెలిసిందే. ఫలితాల నేపథ్యంలో రిలయన్స్ క్యాపిటల్ షేరు బీఎస్ఈలో దాదాపు 5 శాతం జంప్చేసి రూ. 11.22 వద్ద ముగిసింది. -
రిలయన్స్ నిప్పన్ లైఫ్లో వాటాలపై ఆదిత్య బిర్లా గ్రూప్ ఆసక్తి
న్యూఢిల్లీ: రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ (ఆర్ఎన్ఎల్ఐసీ)లో వాటాల కొనుగోలు కోసం తాజాగా ఆదిత్య బిర్లా క్యాపిటల్ కూడా బరిలోకి దిగింది. రిలయన్స్ క్యాపిటల్కు (ఆర్సీఎల్) ఉన్న 51 శాతం వాటా కొనుగోలు చేయాలని కంపెనీ భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్ఎన్ఎల్ఐసీలో రిలయన్స్ క్యాపిటల్కు 51 శాతం, జపాన్కి చెందిన నిప్పన్ లైఫ్కు 49 శాతం వాటాలు ఉన్నాయి. ఇరు సంస్థలు కలిసి దీన్ని జాయింట్ వెంచర్గా ఏర్పాటు చేశాయి. భారీగా పేరుకుపోయిన రుణాల చెల్లింపులో పదే పదే డిఫాల్ట్ అవుతుండటంతో ఆర్సీఎల్ బోర్డును రిజర్వ్ బ్యాంక్ గతేడాది నవంబర్ 29న రద్దు చేసింది. దివాలా చట్టం కింద చర్యలకు సంబంధించి వై నాగేశ్వరరావును అడ్మినిస్ట్రేటర్గా నియమించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆర్సీఎల్ విక్రయం కోసం అడ్మినిస్ట్రేటర్ ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలను ఆహ్వానించారు. మొత్తం 14 బిడ్లు వచ్చాయి. పూర్తి కంపెనీని కొనేందుకు ఆరు కంపెనీలు ముందుకు రాగా, ఆర్సీఎల్లో భాగంగా ఉన్న వివిధ సంస్థలను వేర్వేరుగా కొనేందుకు మిగతా వారు బిడ్లు వేశారు. బిడ్డింగ్ గడువు ముగిసే నాటికి ఆర్ఎన్ఎల్ఐసీ కొనుగోలు కోసం ఒక్క బిడ్ కూడా రాలేదు. -
రిలయన్స్ క్యాపిటల్ ప్రణాళికకు డెడ్లైన్ పొడిగింపు
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన రిలయన్స్ క్యాపిటల్ను (ఆర్సీఎల్) కొనుగోలు చేసేందుకు ఆసక్తి గల సంస్థలు తగు పరిష్కార ప్రణాళిక సమర్పించేందుకు గడువును రుణదాతలు ఆగస్టు 28 వరకూ పొడిగించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. విలువ మదింపు కోసం మరింత సమయం కావాలంటూ బిడ్డర్లు కోరడంతో డెడ్లైన్ను పొడిగించడం ఇది అయిదోసారని పేర్కొన్నాయి. గడువు ఆగస్టు 10తో ముగియాల్సి ఉంది. బరిలో ఉన్న పిరమల్, టోరెంట్ సంస్థలు సెప్టెంబర్ 30 వరకూ సమయం ఇవ్వాలని కోరగా రుణదాతల కమిటీ (సీవోసీ) తిరస్కరించింది. ఇండస్ఇండ్ బ్యాంక్ ఆగస్టు 30 వరకూ గడువు కోరింది. వాస్తవానికి పరిష్కార ప్రణాళిక సమర్పించేందుకు మే 26 అసలు డెడ్లైన్. అప్పటి నుంచి దాన్ని పొడిగిస్తూ వస్తున్నారు. చెల్లింపుల్లో విఫలం కావడంతో పాటు గవర్నెన్స్పరంగా లోపాలు ఉండటంతో గతేడాది నవంబర్ 29న ఆర్సీఎల్ బోర్డును రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసి అడ్మినిస్ట్రేటరును నియమించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కంపెనీ విక్రయానికి అడ్మినిస్ట్రేటర్ బిడ్లను ఆహ్వానించారు. -
తుది దశకు రిలయన్స్ క్యాప్ బిడ్డింగ్
న్యూఢిల్లీ: రిలయన్స్ క్యాపిటల్ రుణదాతలు రుణపరిష్కార(రిజల్యూషన్) ప్రణాళిక అభ్యర్థన పత్రాల(ఆర్ఎఫ్ఆర్పీ)పై నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీంతో తుది అనుమతి కోసం వచ్చే వారం ఆర్ఎఫ్ఆర్పీని రుణదాతల కమిటీ(సీవోసీ) ముందుంచవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రిజల్యూషన్ ప్రణాళిక దాఖలు, విలువ మదింపు తదితర అంశాలలో ఆర్ఎఫ్ఆర్పీ డాక్యుమెంట్ మార్గదర్శకంగా నిలవనుంది. రిజల్యూషన్ ప్రణాళికను రిలయన్స్ క్యాపిటల్ కొనుగోలుకి ఆసక్తి వ్యక్తం చేసిన(ఈవోఐ) కంపెనీలన్నిటికీ అందించనున్నారు. తద్వారా తుది బిడ్స్ దాఖలుకు వీలుంటుంది. బుధవారం సమావేశమైన సీవోసీ ఆర్ఎఫ్ఆర్పీని అనుమతించినట్లు తెలుస్తోంది. తుది అనుమతికి వచ్చే వారం దాఖలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. కన్సార్షియం క్లస్టర్ బిడ్డర్లు మొత్తం నగదు ప్రాతిపదికన బిడ్ చేయవలసి ఉన్నప్పటికీ ఆర్ఎఫ్ఆర్పీ ప్రకారం వాయిదా పద్ధతిలో చెల్లింపులకు వీలు కల్పించనున్నట్లు తెలిపాయి. రిలయన్స్ క్యాప్ కార్పొరేట్ దివాలా రిజల్యూషన్ ప్రాసెస్ పూర్తిచేసేందుకు సీవోసీ 3 నెలల గడువును కోరవచ్చని వెల్లడించాయి. -
రిలయన్స్ క్యాపిటల్ దివాలా పరిష్కారంపై భిన్నాభిప్రాయాలు!
న్యూఢిల్లీ: రిలయన్స్ క్యాపిటల్ (ఆర్క్యాప్) దివాలా పరిష్కార ప్రక్రియకు సంబంధించి ఇటు అడ్మినిస్ట్రేటరు, అటు రుణదాతల కమిటీ (సీవోసీ) మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. దీనితో తదుపరి తీసుకోవాల్సిన చర్యల విషయంలో జాప్యం జరుగుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. వివరాల్లోకి వెడితే రుణ సంక్షోభంలో చిక్కుకున్న ఆర్క్యాప్, దాని వివిధ అనుబంధ సంస్థలను వేలం వేస్తున్నారు. గడువు తేదీ మార్చి 25 నాటికి మొత్తం 54 బిడ్లు వచ్చాయి. ఆర్క్యాప్.. దాని 8 అనుబంధ సంస్థలన్నింటినీ ఏకమొత్తంగా ఒకే కంపెనీగా కొనుగోలు చేసేందుకు 22 ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలు (ఈవోఐ), ఆర్క్యాప్ను విడిగా.. మిగతా అనుబంధ సంస్థలను వేర్వేరుగా దక్కించుకునేందుకు మిగతా బిడ్లు వచ్చాయి. అయితే వీటిలో కొన్ని సంస్థలు లాభసాటిగానే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వీటిని టర్నెరౌండ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి దివాలా చట్టం ప్రకారం ఈ సంస్థలకు సంబంధించి పరిష్కార ప్రణాళిక సమర్పించాల్సిన అవసరం లేదని అడ్మినిస్ట్రేటర్ భావిస్తున్నాయి. ఇదే అంశంపై సీవోసీ.. దాని న్యాయ సలహాదారులు, అడ్మినిస్ట్రేటరు మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొనడంతో బిడ్డర్లకు పరిష్కార ప్రణాళిక అభ్యర్ధన (ఆర్ఎఫ్ఆర్పీ) పత్రం జారీ చేయడంలో జాప్యం జరుగుతోందని వివరించాయి. -
రిలయన్స్ క్యాపిటల్ రిజల్యూషన్ గడువు పెంపు!
న్యూఢిల్లీ: దివాలా చట్ట(ఐబీసీ) చర్య లలో ఉన్న రిలయన్స్ క్యాపిటల్ రుణ పరిష్కార(రిజల్యూషన్) ప్రణాళికకు మరింత గడువు లభించే వీలుంది. కంపెనీ రిజల్యూషన్ బిడ్స్పై బుధవారం(6న) రుణదాతల కమిటీ(సీవోసీ) చర్చించినట్లు తెలుస్తోంది. ఐబీసీ నిబంధనల ప్రకారం పాలనాధికారి 180 రోజుల్లోగా రిజల్యూషన్ను ముగించవలసి ఉంటుంది. అంటే 2022 జూన్3 కల్లా పూర్తికావలసి ఉంది. అయితే మరో 90 రోజులు అదనపు గడువునిచ్చేందుకు సీవోసీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వెరసి సెప్టెంబర్ 3వరకూ గడువు లభించే వీలుంది. అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీ ఆర్క్యాప్ రుణ భారం, చెల్లింపుల వైఫల్యంతో దివాలా చట్ట పరిధికి చేరిన సంగతి తెలిసిందే. కంపెనీ కొనుగోలుకి అదానీ ఫిన్సర్వ్, ఐసీఐసీఐ లంబార్డ్, టాటా ఏఐజీ, హెచ్డీఎఫ్సీ ఎర్గో, నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ తదితర 54 సంస్థలు బిడ్స్(ఈవోఐ) దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. -
రుణ సంక్షోభంలో రిలయన్స్ క్యాపిటల్,కొనుగోలు రేసులో టాటా!
న్యూఢిల్లీ:రుణ సంక్షోభంలో చిక్కుకున్ను రిలయన్స్ క్యాపిటల్ కొనుగోలుకి పలు దిగ్గజాలు ఆసక్తి చూపుతున్నాయి. అదానీ ఫిన్సర్వ్, ఐసీఐసీఐ లంబార్డ్, టాటా ఏఐజీ, హెచ్డీఎఫ్సీ ఎర్గో, నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ తదితర 54 కంపెనీలు ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) బిడ్ను దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఆర్బీఐ నియమిత పాలనాధికారి బిడ్స్ దాఖలుకు గడువును ఈ నెల 11 నుంచి 25కు పెంచారు. కాగా.. రేసులో మరికొన్ని కంపెనీలు నిలిచినట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. జాబితాలో యస్ బ్యాంక్, బంధన్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్, చోళమండలం ఇన్వెస్ట్మెంట్, ఓక్ట్రీ క్యాపిటల్, బ్లాక్స్టోన్, బ్రూక్ఫీల్డ్, టీపీజీ, కేకేఆర్, పిరమల్ ఫైనాన్స్, పూనావాలా ఫైనాన్స్ తదితరాలను ప్రస్తావించాయి. చెల్లింపుల వైఫల్యం, పాలనా సంబంధ సమస్యలతో రిజర్వ్ బ్యాంక్ గతేడాది నవంబర్ 29న రిలయన్స్ క్యాపిటల్ బోర్డును రద్దు చేసిన సంగతి తెలిసిందే. తదుపరి దివాలా చట్టం ప్రకారం చర్యలు చేపట్టింది. చదవండి: ఆ రెండు కంపెనీల నుంచి అనిల్ అంబానీ ఔట్ -
అంబానీ ఆస్తులపై అదానీ కన్ను !?
న్యూఢిల్లీ: రుణభారంతో కుదేలైన అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ క్యాపిటల్ను సొంతం చేసుకునేందుకు పలు దిగ్గజ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. కంపెనీని చేజిక్కించుకునేందుకు అదానీ ఫిన్సర్వ్, కేకేఆర్, పిరమల్ ఫైనాన్స్, పూనావాలా ఫైనాన్స్ తదితర 14 దిగ్గజాలు పోటీ పడుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తాజాగా రిలయన్స్ క్యాపిటల్ కొనుగోలుకి వీలుగా బిడ్స్ దాఖలు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నియమిత పాలనాధికారి ఈ నెల 25వరకూ గడువు పెంచారు. తొలుత ఇందుకు మార్చి 11చివరి తేదీగా ప్రకటించారు. చెల్లింపుల్లో వైఫల్యం, కార్పొరేట్ పాలనా సంబంధ సమస్యల నేపథ్యంలో గతేడాది నవంబర్ 29న ఆర్బీఐ రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ బోర్డును రద్దు చేసింది. 2021 సెప్టెంబర్లో కంపెనీ నిర్వహించిన ఏజీఎంలో కన్సాలిడేటెడ్ రుణ భారం రూ. 40,000 కోట్లుగా వాటాదారులకు తెలియజేసింది. మూడో పెద్ద కంపెనీ ఇటీవల ఆర్బీఐ దివాలా చట్ట చర్యల(ఐబీసీ)కు ఉపక్రమించిన మూడో పెద్ద నాన్బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ(ఎన్బీఎఫ్సీ)గా రిలయన్స్ క్యాప్ నిలుస్తోంది. ఇప్పటికే ఐబీసీ పరిధిలోకి చేరిన సంస్థల జాబితాలో శ్రేయీ గ్రూప్, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (డీహెచ్ఎఫ్ఎల్) చేరిన విషయం విదితమే. కాగా.. రిలయన్స్ క్యాప్ కొనుగోలు పట్ల ఆసక్తి కలిగిన కంపెనీలు బిడ్స్ దాఖలుకు మరింత గడువును కోరడంతో పాలనాధికారి తాజా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. రేసులో ఇప్పటికే ఆర్ప్ వుడ్, వర్దే పార్టనర్స్, మల్టిపుల్స్ ఫండ్, నిప్పన్ లైఫ్, జేసీ ఫ్లవర్స్, బ్రూక్ఫీల్డ్, ఓక్ట్రీ, అపోలో గ్లోబల్, బ్లాక్స్టోన్, హీరో ఫిన్కార్స్ ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) బిడ్స్ దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వీటిలో చాలవరకూ కంపెనీ పూర్తి కొనుగోలుకి ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేశాయి. కొనుగోలుదారులకు రెండు అవకాశాలు కొనుగోలుదారులకు రెండు అవకాశాలున్నాయి. కంపెనీకున్న 8 అనుబంధ సంస్థల కోసం లేదా మొత్తం రిలయన్స్ క్యాపిటల్ను సొంతం చేసుకునేందుకు ఈవోఐలు దాఖలు చేయవచ్చు. అనుబంధ సంస్థల జాబితాలలో రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్, రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్, రిలయన్స్ సెక్యూరిటీస్, రిలయన్స్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ తదితరాలున్నాయి. దివాలా చర్యలలో భాగంగా వై.నాగేశ్వరరావును ఆర్బీఐ పాలనాధికారిగా నియమించింది. -
అయ్యో అనిల్ అంబానీ! నీకే ఎందుకిలా ?
న్యూఢిల్లీ: వ్యాపారం దిగ్గజం ధీరుబాయి అంబానీ రెండో కుమారుడు అనిల్ అంబానీని కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే అనిల్ ఆధీనంలోని కంపెనీలు వరుసగా నష్టాలు ఎదుర్కొంటూ దివాలా దశకు చేరుకున్నాయి. తాజాగా ప్రకటించిన క్యూ 3 ఫలితాల్లోనూ ఎటువంటి మార్పు కనిపించలేదు. క్యూ 3 ఫలితాలు దివాలా చట్ట చర్యలకు లోనైన రిలయన్స్ క్యాపిటల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో మరోసారి నికర నష్టాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో రూ. 1,759 కోట్ల నష్టం ప్రకటించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 3,966 కోట్ల నష్టాలు నమోదుకాగా.. ఈ ఏడాది క్యూ2(జూలై–సెప్టెంబర్)లోనూ రూ. 1,156 కోట్ల నష్టం వాటిల్లింది. ఇక తాజా క్యూ3లో మొత్తం ఆదాయం రూ. 4,890 కోట్ల నుంచి రూ. 4,083 కోట్లకు క్షీణించింది. మొత్తం వ్యయాలు రూ. 5,658 కోట్లను తాకాయి. 2021 నవంబర్లో ఆర్బీఐ కంపెనీ బోర్డును రద్దు చేసిన సంగతి తెలిసిందే. సలహా కమిటీ కంపెనీ పాలనాధికారిగా వై.నాగేశ్వరరావును నియమించడంతోపాటు బాధ్యతల నిర్వహణలో మద్దతిచ్చేందుకు ముగ్గురు సభ్యులతో సలహా కమిటీని ఏర్పాటు చేసింది. రుణదాతలు, డిబెంచర్ హోల్డర్లకు చెల్లింపుల విషయంలో కంపెనీ విఫలంకావడంతో దివాలా చర్యలవైపు ప్రయాణించింది. క్యూ 3 ఫలితాల నేపథ్యంలో రిలయన్స్ క్యాపిటల్ షేరు ఎన్ఎస్ఈలో యథాతథంగా రూ. 15.90 వద్ద ముగిసింది. చదవండి: రిలయన్స్ క్యాపిటల్ నిర్వాకం.. ఈపీఎఫ్వోకి రూ.3,000 కోట్ల నష్టం? -
రిలయన్స్ క్యాపిటల్ నిర్వాకం.. ఈపీఎఫ్వోకి రూ.3,000 కోట్ల నష్టం?
న్యూఢిల్లీ: రిలయన్స్ క్యాపిటల్కు వ్యతిరేకంగా దివాలా అండ్ బ్యాంక్రప్టసీ చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) కోరింది. రిలయన్స్ క్యాపిటల్ బాండ్లలో ఈపీఎఫ్వో రూ.2,500 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్టు ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాడ్ రాజ్యసభకు లిఖిత పూర్వకంగా తెలియజేశారు. ఈపీఎఫ్వో పెట్టుబడులపై 2019 అక్టోబర్ నుంచి చెల్లింపుల్లో రిలయన్స్ క్యాపిటల్ విఫలమవుతూ వచ్చినట్టు వివరించారు. ఈపీఎఫ్వోకు అసలు పెట్టుబడి, వడ్డీ చెల్లింపుల్లో రిలయన్స్ క్యాపిటల్ విఫలమైందా? అంటూ ఆర్జేడీ ఎంపీ మనోజ్కుమార్ జా అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. 2021 నవంబర్ 30 నాటికి ఎన్సీడీలపై రిలయన్స్ క్యాపిటల్ రూ.534 కోట్ల వడ్డీని చెల్లించడంలో వైఫల్యం చెందినట్టు చెప్పారు. అసలు వడ్డీతో కలిసి సుమారు రూ.3,000 కోట్లు ఈపీఎఫ్వో బకాయిలు పేరుకుపోయాయి. దీంతో రిలయన్స్ క్యాపిటల్కు వ్యతిరేకంగా దివాలా చర్యలు ప్రారంభించాలని కోరుతూ ఆర్బీఐ ఇటీవలే ఎన్సీఎల్టీని ఆశ్రయించడం తెలిసిందే. చదవండి: రిలయన్స్ క్యాపిటల్ దివాలా ప్రొసీడింగ్స్ షురూ! -
Anil Ambani: రిలయన్స్ క్యాపిటల్ దివాలా ప్రొసీడింగ్స్ షురూ!
ముంబై: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన రిలయన్స్ క్యాపిటల్పై ఐబీసీ కింద దివాలా చర్యలు ప్రారంభించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దాఖలు చేసిన పిటిషన్ను సోమవారం ఎన్సీఎల్టీ (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్), ముంబై బెంచ్ అనుమతించింది. కంపెనీపై కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియను ప్రారంభించాలని గత వారం ఆర్బీఐ ఎన్సీఎల్టీ ముంబై బెంచ్లో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిని అడ్మిట్ చేస్తూ, ప్రదీప్ నరహరి, దేశ్ముఖ్, కపిల్ కుమార్ వాద్రాలతో కూడిన ఎన్సీఎల్టీ బెంచ్ సోమవారం సాయంత్రం రూలింగ్ ఇచ్చింది. పాలనా సంబంధ అంశాల్లో డిఫాల్ట్ అయ్యిందని పేర్కొంటూ అనిల్ అంబానీ ప్రమోట్ చేస్తున్న రిలయన్స్ క్యాపిటల్ బోర్డ్ను నవంబర్ 29న సెంట్రల్ బ్యాంక్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వై. నాగేశ్వరరావును కంపెనీ అడ్మినిస్ట్రేటర్గా కూడా నియమించింది. పూర్తి సహకారం: రిలయన్స్ క్యాపిటల్ ఇదిలాఉండగా, కంపెనీ ప్రమోటర్లు ఒక ప్రకటన చేస్తూ, 227 సెక్షన్ కింద ఎన్సీఎల్టీలో ఆర్బీఐ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు పూర్తిగా సహకరిస్తామని పేర్కొన్నారు. రుణదాతలు, కస్టమర్లు, ఉద్యోగులు, షేర్హోల్డర్లతో సహా తన వాటాదారులందరి పూర్తి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ఐబీసీ ప్రక్రియ ద్వారా వేగవంతమైన దివాలా పరిష్కార పక్రియకోసం కంపెనీ ఎదురుచూస్తున్నట్లు కూడా ప్రకటన తెలిపింది. ఆర్థిక రంగ నియంత్రణ సంస్థలు, ఫైనాన్షియల్ సర్వీస్ ప్రొవైడర్లు, సంబంధిత వర్గాలను సంప్రదించి ఒక కంపెనీని దివాలా– లిక్విడేషన్ ప్రొసీడింగ్ల కింద కేంద్రం నోటిఫై చేయడానికి దివాలా కోడ్ (ఐబీసీ)లోని సెక్షన్ 227 వీలుకల్పిస్తుంది. రిలయన్స్ క్యాపిటల్ రుణదాతలకు దాదాపు రూ.19,805 కోట్ల బకాయి ఉంది. వీటిలో మెజారిటీ నిధిని ట్రస్టీ విస్ట్రా ఐటీసీఎల్ ఇండియా కింద జారీ చేసిన బాండ్ల ద్వారా సమీకరించడం జరిగింది. ఆర్బీఐ ‘ఐబీసీ’ పిటిషన్ను ఎదుర్కొంటున్న మూడవ సంస్థ రిలయన్స్ క్యాపిటల్ దివాలా కోడ్ కింద ఇటీవల ఆర్బీఐ పిటిషన్ దాఖలు చేసిన మూడవ అతిపెద్ద నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ). ఇంతక్రితం శ్రేయీ గ్రూప్, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (డీహెచ్ఎఫ్ఎల్)లపై ఈ తరహా పిటిషన్లను ఆర్బీఐ దాఖలు చేసింది. రిలయన్స్ క్యాపిటల్పై దాదాపు రూ.40,000 కోట్ల రుణం భారం ఉన్నట్లు రిలయన్స్ క్యాపిటల్ తన వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో ప్రకటించింది. రెండవ త్రైమాసికంలో రూ.1,156 కోట్ల నష్టాలను ప్రకటించింది. 2020–21లో కంపెనీ రూ.19,308 కోట్ల ఆదాయంపై రూ.9,287 కోట్ల నష్టాన్ని పోస్ట్ చేసింది. చదవండి :Reliance Capital: అనిల్ అంబానికి షాక్ ! -
అనిల్ అంబానికి షాక్ ! త్వరలో రిలయన్స్ క్యాపిటల్ దివాలా ప్రక్రియ ప్రారంభం
ముంబై: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన రిలయన్స్ క్యాపిటల్ (ఆర్క్యాప్) బోర్డును రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసింది. బకాయిల ఎగవేతలు, తీవ్రమైన గవర్నెన్స్ సమస్యల నేపథ్యంలో త్వరలోనే కంపెనీ దివాలా ప్రక్రియ చేపట్టనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మాజీ ఈడీ నాగేశ్వర రావును సంస్థ అడ్మినిస్ట్రేటర్గా నియమించినట్లు వివరించింది. మరోవైపు, దివాలా చట్టం కింద రుణ సమస్యను పరిష్కరించాలన్న రిజర్వ్ బ్యాంక్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఆర్క్యాప్ తెలిపింది. అనిల్ అంబానీకి చెందిన ఆర్క్యాప్ రుణభారం సెప్టెంబర్ ఆఖరు నాటికి కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 40,000 కోట్లుగా ఉంది. సెప్టెంబర్ త్రైమాసికంలో సంస్థ రూ. 6,001 కోట్ల ఆదాయంపైరూ.1,156 కోట్ల నష్టం ప్రకటించింది. చదవండి: నష్టాల్లో కూరుకుపోయిన రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ -
అనిల్ అంబానీ, సగానికి తగ్గనున్న రుణ భారం
ముంబై: రుణ పరిష్కార(రిజల్యూషన్) ప్రణాళికలు విజయవంతమైతే రిలయన్స్ క్యాపిటల్ రుణ భారం సగానికి(50 శాతం) తగ్గే వీలున్నట్లు కంపెనీ చైర్మన్ అనిల్ అంబానీ తాజాగా పేర్కొన్నారు. రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్(ఆర్సీఎఫ్), రిలయన్స్ హోమ్ ఫైనాన్స్(ఆర్హెచ్ఎఫ్)ల రిజల్యూషన్ పూర్తయితే రిలయన్స్ క్యాపిటల్ కన్సాలిడేటెడ్ రుణాల్లో రూ. 20,000 కోట్లమేర కోత పడనున్నట్లు తెలియజేశారు. ఈ ఏడాది మొదట్లో ఆర్సీఎఫ్, ఆర్హెచ్ఎఫ్ల కొనుగోలుకి ఆథమ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ దాఖలు చేసిన బిడ్ను రుణదాతలు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటైన ఐసీఏలో భాగంగా రుణదాతలు రిజల్యూషన్ ప్రణాళికను అనుమతించారు. మెజారిటీ వాటాలు రిలయన్స్ క్యాపిటల్కు ఆర్సీఎఫ్లో 100 శాతం, ఆర్హెచ్ఎఫ్లో మెజారీటీ వాటా ఉంది. రిలయన్స్ క్యాపిటల్ ఏకీకృత రుణ భారం రూ. 40,000 కోట్లుగా నమోదైంది. ఆర్సీఎఫ్, ఆర్హెచ్ఎఫ్లకు రూ. 20,000 కోట్ల రుణాలున్నట్లు అంబానీ పేర్కొన్నారు. దీంతో ఈమేర రుణ భారం తగ్గే వీలున్నట్లు కంపెనీ వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం) సందర్భంగా అనిల్ అంబానీ ఈ వివరాలు వెల్లడించారు. రిజల్యూషన్ తదుపరి రిలయన్స్ క్యాపిటల్కు ఎన్సీడీల ద్వారా రూ. 15,000 కోట్లు, అన్సెక్యూర్డ్, గ్యారంటీడ్ ద్వారా రూ. 5,000 కోట్లు చొప్పున రుణ భారం మిగలనున్నట్లు వివరించారు. ఆర్సీఎఫ్ కోసం రూ. 2,200 కోట్లు, ఆర్హెచ్ఎఫ్కు రూ. 2,900 కోట్లు చొప్పున ఆథమ్ చెల్లించనున్నట్లు తెలియజేశారు. ఈ రెండు కంపెనీల ఉద్యోగులందరినీ కొనసాగించేందుకు ఆథమ్ కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ వార్తల నేపథ్యంలో రిలయన్స్ క్యాపిటల్ షేరు ఎన్ఎస్ఈలో 5% జంప్చేసి రూ. 19.70 వద్ద ముగిసింది. ఏజీఎంలో చైర్మన్ అనిల్ అంబానీ వెల్లడి రిలయన్స్ ఇన్ఫ్రా (ఆర్ఇన్ఫ్రా)కు అనుకూలంగా సుప్రీం కోర్టు ఉత్తర్వులు వచ్చిన నేపథ్యంలో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) నుంచి తమకు రూ. 7,100 కోట్లు వస్తాయని కంపెనీ చైర్మన్ అనిల్ అంబానీ తెలిపారు. ఈ నిధులను రుణాల చెల్లింపునకు వినియోగిస్తామని, తద్వారా ఆర్ఇన్ఫ్రా రుణరహిత సంస్థగా మారగలదని వార్షిక సర్వ సభ్య సమావేశంలో (ఏజీఎం) ఆయన పేర్కొన్నారు. ఆర్ఇన్ఫ్రాలో భాగమైన ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ (డీఏఎంఈపీఎల్).. ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో లైన్ను నిర్వహించేది. కాంట్రాక్టు నిబంధనలను డీఎంఆర్సీ ఉల్లంఘించిందన్న ఆరోపణలపై డీఏఎంఈపీఎల్ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. దీనికి సంబంధించి డీఏఎంఈపీఎల్కు రావాల్సిన పరిహారం విషయంలో కంపెనీకి అనుకూలంగా సుప్రీం కోర్టు ఇటీవలే ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో అనిల్ అంబానీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
టాటా కెమికల్స్- ఆర్క్యాపిటల్ జోరు
ముంబై, సాక్షి: కోవిడ్-19కు వ్యాక్సిన్లు, క్యూ2లో జీడీపీ పురోగతి నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు జోరు చూపుతున్నాయి. సరికొత్త గరిష్టాల రికార్డులతో ప్రారంభమై హుషారుగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల కారణంగా డైవర్సిఫైడ్ కంపెనీ టాటా కెమికల్స్, ఫైనాన్షియల్ రంగ కంపెనీ రిలయన్స్ క్యాపిటల్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి భారీ లాభాలో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. టాటా కెమికల్స్ గ్రూప్ కంపెనీ టాటా కెమికల్స్లో ప్రమోటర్లు టాటా సన్స్ తాజాగా వాటాను పెంచుకున్నారు. ఓపెన్ మార్కెట్ ద్వారా 1.8 మిలియన్ టాటా కెమికల్స్ షేర్లను టాటా సన్స్ కొనుగోలు చేసినట్లు ఎన్ఎస్ఈ బల్క్ డేటా వెల్లడించింది. కంపెనీ ఈక్విటీ 0.71 శాతం వాటాకు సమానమైన వీటిని షేరుకి రూ. 420.92 ధరలో సొంతం చేసుకుంది. ఇందుకు రూ. 76 కోట్లు వెచ్చించింది. ఈ నేపథ్యంలో టాటా కెమికల్స్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో 8 శాతంపైగా దూసుకెళ్లింది. రూ. 465కు చేరింది. ప్రస్తుతం 6.7 శాతం లాభంతో రూ. 456 వద్ద ట్రేడవుతోంది. గత నెల రోజుల్లో ఈ కౌంటర్ 42 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! రిలయన్స్ క్యాపిటల్ అనిల్ అంబానీ గ్రూప్ ఎన్బీఎఫ్సీ.. రిలయన్స్ క్యాపిటల్ను కొనుగోలు చేసేందుకు విదేశీ పీఈ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. వీటిలో ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ(ఏఆర్సీ)లు సైతం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. రుణ చెల్లింపులలో విఫలంకావడం ద్వారా రుణ పరిష్కార(రిజల్యూషన్) స్థితికి చేరిన రిలయన్స్ క్యాపిటల్ కొనుగోలుకి బ్లాక్స్టోన్ గ్రూప్, ఓక్టీ క్యాపిటల్, కేకేఆర్, బెయిన్ క్యాపిటల్, జేసీ ఫ్లవర్ తదితర పలు కంపెనీలు ఆసక్తిని వ్యక్తం చేస్తూ ఈవోఐను దాఖలు చేసినట్లు తెలుస్తోంది. రిలయన్స్ క్యాపిటల్ ఆస్తుల విక్రయానికి(మానిటైజేషన్) డిబెంచర్ హోల్డర్స్ కమిటీతోపాటు.. డిబెంచర్ ట్రస్టీ విస్ట్రా ఐటీసీఎల్ ఇండియా సన్నాహాలు చేస్తున్న విషయం విదితమే. వీటికి కంపెనీ రుణాలలో 93 శాతం వరకూ వాటా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రిలయన్స్ క్యాపిటల్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకింది. కొనేవాళ్లు అధికంకాగా.. అమ్మేవాళ్లు కరువకావడంతో రూ. 9.50 వద్ద ఫ్రీజయ్యింది. -
అనిల్ అంబానీ కీలక నిర్ణయం : రుణ వ్యాపారానికి గుడ్బై
సాక్షి, ముంబై: రిలయన్స్ అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రుణ వితరణ వ్యాపారానికి గుడ్ బై చెప్పాలని రిలయన్స్ కేపిటల్ నిర్ణయించినట్టు తెలిపారు. సోమవారం జరిగిన కంపెనీ వాటాదారుల వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) ఈ మేరకు ప్రకటించిన అంబానీ రిలయన్స్ క్యాపిటల్ తన రుణ వ్యాపారాలన్నింటిని నుంచి డిసెంబర్ నాటికి నిష్క్రమిస్తుందని చెప్పారు. గత ఆరు నెలల్లో చోటు చేసుకున్న ప్రతికూల సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ మందగించిన ఆర్థిక వ్యవస్థ, ఈ రంగంలో రుణాల సంక్షోభంతో రిలయన్స్ క్యాపిటల్ నష్టాన్ని ఎదుర్కోందని తెలిపారు. రిలయన్స్ క్యాపిటల్ ఇకపై రుణ వ్యాపారంలో ఉండదని నిర్ణయించింది. రుణ వ్యాపారాలు - రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ - డిసెంబరు నాటికి పూర్తవుతాయని భావిస్తున్నామని వార్షిక సర్వసభ్య సమావేశంలో అంబానీ వాటాదారులకు చెప్పారు. రిలయన్స్ క్యాపిటల్ అప్పు రూ .25 వేల కోట్లు తగ్గుతుందని అంబానీ చెప్పారు. అలాగే ప్రభుత్వం వచ్చే అయిదేళ్లలో మౌలిక సదుపాయాలపై రూ.100 లక్షల కోట్లు ఖర్చు చేయడం ఆర్ఇన్ఫ్రాకు కలిసి వస్తుందనీ, రక్షణ రంగంలో మరిన్ని వ్యాపార అవకాశాలు తమకు లభిస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. దేశంలో అత్యుత్తమ 5 ప్రైవేటు రక్షణ కంపెనీల్లో ఒకటిగా ఎదగాలని భావిస్తున్నామన్నారు. ఆధునాతన సాంకేతికను అందిపుచ్చుకొని అంతర్జాతీయ సరఫరా సంస్థగా మారతా మన్నారు. రిలయన్స్ క్యాపిటల్ ప్రస్తుతం చిన్న, మధ్యతరహా సంస్థలకు రిలయన్స్ మనీ ద్వారా, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ ద్వారా గృహ కొనుగోలుదారులకు రుణాలు ఇస్తుంది. ఈ రెండు వ్యాపారాలు గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయంలో 15 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఈ ఏడాది కంపెనీ ఆస్తులను డిజిస్ట్మెంట్ చేయనుంది. రిలయన్స్ క్యాపిటల్ తన మ్యూచువల్ ఫండ్ విభాగమయిన రిలయన్స్ నిప్పోన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్ (ఆర్నామ్)లోని 21.54 శాతం వాటా విక్రయాన్ని పూర్తి చేసినట్లు కంపెనీ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా అనిల్ అంబానీ నేతృత్వంలోని అడాగ్గ్రూపులో మూతపడనున్న రెండవ పెద్ద వ్యాపారం ఇది. ఇప్పటికే ప్రధానమైన రిలయన్స్ కమ్యూనికేషన్ రెండేళ్ల క్రితం మూత పడి దివాలా ప్రక్రియలో ఉంది. ఇక రక్షణ వ్యాపారం - రిలయన్స్ నావల్ - కూడా తీవ్రమైన ఆర్థిక ఒత్తిడికి లోనవుతుంది. -
రిలయన్స్ క్యాపిటల్ లాభం నాలుగింతలు
న్యూఢిల్లీ: అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో నాలుగు రెట్లు పెరిగింది. గత క్యూ1లో రూ.295 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.1,218 కోట్లకు పెరిగిందని రిలయన్స్ క్యాపిటల్ తెలిపింది. ఆదాయం అధికంగా రావడంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.4,641 కోట్ల నుంచి 31 శాతం వృద్ధితో రూ.6,083 కోట్లకు ఎగసిందని వివరించింది. ఆస్తులు రూ.83,973 కోట్ల నుంచి రూ.79,207 కోట్లకు పెరిగాయని పేర్కొంది. ప్రజల నుంచి ఫిక్స్డ్ డిపాజిట్లు ఏమీ సమీకరించలేదని వివరించింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,454 కోట్ల నికర నష్టాలు వచ్చాయని రిలయన్స్ క్యాపిటల్ తెలిపింది. రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ కోసం రూ.2,104 కోట్లు కేటాయించడం వల్ల ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని వివరించింది. -
‘ఫండ్స్’ వ్యాపారానికి అనిల్ గుడ్బై
న్యూఢిల్లీ: అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ మ్యూచువల్ ఫండ్స్ వ్యాపారం నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించింది. రిలయన్స్ నిప్పన్ లైఫ్ అస్సెట్ మేనేజ్మెంట్(ఆర్నామ్)లో రిలయన్స్ క్యాపిటల్, జపాన్కు చెందిన నిప్పన్లైఫ్కు చెరో 42.88 శాతం వాటా ఉంది. ఆర్నామ్లో రిలయన్స్ క్యాపిటల్ తనకున్న వాటాను నిప్పన్కు విక్రయించేందుకు తప్పనిసరిగా చేసి తీరాల్సిన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగా సెబీ నిబంధనల మేరకు ఆర్నామ్ పబ్లిక్ షేర్ హోల్డర్లకు ఒక్కో షేరు రూ.230 చొప్పున నిప్పన్లైఫ్ ఓపెన్ ఆఫర్ను కూడా ఇవ్వనున్నట్టు రిలయన్స్ క్యాపిటల్ తెలిపింది. రుణ భారం తగ్గింపు...ఆర్నామ్లో తన వాటాను విక్రయించడం ద్వారా వచ్చే రూ.6,000 కోట్లతో రిలయన్స్ క్యాపిటల్ రుణ భారాన్ని 33 శాతం వరకు తగ్గించుకోనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ‘‘మాకు సుదీర్ఘకాలంగా విలువైన భాగస్వామి అయిన నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్నామ్లో తన వాటాను 75 శాతానికి పెంచుకుంటోంది. ఆర్నామ్లో వాటా విక్రయం సరైన విలువను సొంతం చేసుకునే విధానంలో భాగమే. ఈ లావాదేవీతోపాటు అమల్లో ఉన్న ఇతర లావాదేవీలు కూడా కలిపితే రిలయన్స్ క్యాపిటల్ రుణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 50 శాతం తగ్గిపోతుంది’’ అని అనిల్ అంబానీ తెలిపారు. ఓపెన్ ఆఫర్ ఆర్నామ్లో పబ్లిక్ షేర్హోల్డర్ల నుంచి 14.63 శాతం వాటాకు సమానమైన 8.99 కోట్ల షేర్లకు రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. ఒక్కో షేరుకు రూ.230 చొప్పున మొత్తం రూ.2,068 కోట్లను ఇందుకోసం వినియోగించనుంది. ఆర్నామ్ నియంత్రణ నిప్పన్లైఫ్ చేతికి వెళుతుంది. అయితే, వాటా విక్రయం తర్వాత కూడా రిలయన్స్ క్యాపిటల్కు మైనారిటీ వాటా ఉంటుందని తెలుస్తోంది. దీనికి కారణం ప్రమోటర్ల వాటా గరిష్ట పరిమితి 75 శాతం కావడం గమనార్హం. అనిల్ అంబానీ కుమారుడు జై అనుమోల్ అంబానీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసినట్టు ఆర్నామ్ కంపెనీ ప్రకటించింది. ఈ డీల్ నేపథ్యంలో రిలయన్స్ క్యాపిటల్ షేరు బీఎస్ఈలో 2.77 శాతం లాభపడి రూ.131.90 వద్ద ముగియగా, ఆర్నామ్ షేరు 7 శాతం పెరిగి రూ.233.75 వద్ద క్లోజయింది. -
రిలయన్స్ క్యాపిటల్ లాభం రూ.213 కోట్లు
ముంబై: రిలయన్స్ క్యాపిటల్ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.213 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.6 కోట్ల నికర లాభం వచ్చిందని రిలయన్స్ క్యాపిటల్ తెలిపింది. సాధారణ బీమా విభాగం మంచి లాభాలు సాధించడంతో ఈ క్యూ3లో ఈ స్థాయి నికర లాభం వచ్చిందని వివరించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.5,386 కోట్ల నుంచి రూ.5,016 కోట్లకు తగ్గిందని తెలిపింది. మొత్తం ఆస్తులు 7 శాతం పెరిగి రూ.89,400 కోట్లకు పెరిగాయని వివరించింది. ఈ క్యూ3లో మ్యూచువల్ ఫండ్ విభాగం, రిలయన్స్ నిప్పన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ రూ.110 కోట్ల నికర లాభం సాధించిందని రిలయన్స్ క్యాపిటల్ తెలిపింది. నిర్వహణ ఆస్తులు 7% పెరిగి రూ.4,14,362 కోట్లకు పెరిగాయని పేర్కొంది. హోమ్ ఫైనాన్స్ విభాగం, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లోన్ బుక్ 26 శాతం ఎగసి రూ.16,160 కోట్లకు పెరిగిందని తెలిపింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో రిలయన్స్ క్యాపిటల్ షేర్ 1.7% లాభంతో రూ.139 వద్ద ముగిసింది. -
రిలయన్స్ క్యాపిటల్ లాభం రూ.272 కోట్లు
న్యూఢిల్లీ: రిలయన్స్ క్యాపిటల్ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ క్వార్టర్లో రూ.272 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ. 378 కోట్ల నికర నష్టాలు వచ్చాయని అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ తెలిపింది. గత క్యూ1లో రూ.4,444 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో రూ.4,641 కోట్లకు పెరిగిందని పేర్కొంది. అనుబంధ కంపెనీలు–రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్, రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ల ఫలితాలను దీంట్లో కలపలేదని వివరించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో రిలయన్స్ క్యాపిటల్ షేర్ స్వల్పంగా లాభపడి రూ.440 వద్ద ముగిశాయి. -
రిలయన్స్ క్యాపిటల్ డివిడెండ్ రూ.11
న్యూఢిల్లీ: రిలయన్స్ క్యాపిటల్ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి రూ.428 కోట్ల నికర లాభం సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి ఆర్జించిన నికర లాభం (రూ.428 కోట్లు)తో పోల్చితే 36 శాతం వృద్ధి సాధించామని రిలయన్స్ క్యాపిటల్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.5,007 కోట్లుగా ఉందని పేర్కొంది. పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.1,086 కోట్లుగా ఉన్న నికర లాభం 2017–18లో 21% వృద్ధితో రూ.1,309 కోట్లకు పెరి గిందని తెలిపింది. మొత్తం ఆదాయం రూ.19,898 కోట్లుగా ఉందని పేర్కొంది. ఒక్కో షేర్కు -
రిలయన్స్ క్యాపిటల్ నికరలాభం రూ.315 కోట్లు
సాక్షి, ముంబై: రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ క్యూ3లో లాభాలను ఆర్జించింది. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 50శాతం వృద్దిని సాధించింది. డిసెంబర్ 31 తో ముగిసిన ఈ త్రైమాసికంలో రిలయన్స్ క్యాపిటల్ రూ. 315 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. కంపెనీ మొత్తం ఆదాయం రూ .4,771 కోట్లకుగా నమోమైందని కంపెనీ గురువారం వెల్లడించింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో 3,964 కోట్ల రూపాయల ఆదాయాన్ని రిలయన్స్కంపెనీ నికర విలువ రూ .16,232 కోట్లగాను, రుణ ఈక్విటీ నిష్పత్తి 2.48 గా ఉంది. రిలయన్స్ గ్రూప్ కంపెనీ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్ రూ .470 కోట్లు ఆర్జించగా , 130 కోట్ల రూపాయల నికరలాభాన్ని ఆర్జించింది. సంవత్సరం ప్రాతిపదికన చూస్తే 26 శాతం వృద్ధి సాధించింది. భీమా పరిధిలో లైఫ్, నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలు అధిక ప్రీమియం ఆదాయాన్ని పోస్ట్ చేశాయి. డిసెంబరు 31 న ముగిసిన త్రైమాసికంలో రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ స్థూల రాబడి వార్షిక ప్రాతిపదికన 26 శాతం వృద్ధిరేటుతో రూ. 1,075 కోట్లుగా ఉంది. నిరక లాభం54 శాతం వృద్ధితో 28 కోట్ల రూపాయలను సాధించింది. అలాగే సంస్థకు చెందిన బ్రోకింగ్ సంస్థ రిలయన్స్ సెక్యూరిటీస్ 83 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది. వార్షిక ప్రాతిపదికన 2 శాతం గ్రోత్తో 14 కోట్ల లాభాన్నినమోదు చేసింది. -
రిలయన్స్ క్యాపిటల్ నుంచి డిజిటల్ సేవలు
కంపెనీ ఈడీ అన్మోల్ అంబానీ వెల్లడి న్యూఢిల్లీ: అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ కంపెనీ కీలకం కాని ఆస్తుల విక్రయం ద్వారా భారీగా మూలధన లాభాలు పొందాలని యోచి స్తోంది. మరోవైపు డిజిటల్ సేవలందిండం ద్వారా కొత్త తరం వినియోగదారులను ఆకట్టుకోవాలని చూస్తోంది. గురువారం జరిగిన కంపెనీ వ్యాపార ప్రణాళికలను విశ్లేషకులకు వివరించే సమావేశంలో కంపెనీ ఈడీ అన్మోల్ అంబానీ ఈ వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో కంపెనీ చైర్మన్, అన్మోల్ తండ్రి అనిల్ అంబానీ, గ్రూప్ కంపెనీల ఇతర సీనియర్ ఎగ్జిక్యూటివ్లు కూడా హాజరయ్యారు. 24 సంవత్సరాల అన్మోల్ అంబానీ గత ఏడాది ఈడీగా రిలయన్స్ క్యాపిటల్లో చేరారు. మూడు నెలల్లో హోమ్ ఫైనాన్సింగ్ లిస్టింగ్ ప్రపంచంలో భారత్, చైనాలు పెద్ద డిజిటల్ మార్కెట్లని అన్మోల్ పేర్కొన్నారు. కొత్త తరం వినియోగదారులకు సేవలందించడానికి తమ వ్యాపారాలన్నింటినీ డిజిటలైజ్ చేయాలని యోచిస్తున్నామని వివరించారు. రిలయన్స్ గ్రూప్కు ఆర్థిక సేవల కంపెనీ కీలకమని, గ్రూప్లో అధిక వృద్ది ఉన్న వ్యాపారం ఇదని వివరించారు. కీలకం కాని ఆస్తుల విక్రయం జరుగుతోందని, వచ్చే మార్చి కల్లా భారీ స్థాయిలో మూలధన లాభాలు పొందగలమన్న ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే మూడు నెలల్లో రిలయన్స్ హోమ్ ఫైనాన్స్లిస్టింగ్ జరుగుతుందని పేర్కొన్నారు. ఫండ్లలో పెట్టుబడులు పెరిగాయ్.. రెండున్నరేళ్లలో భారత్లో భారీ మార్పులు వచ్చాయని, రెడ్ టేపిజమ్(ప్రభుత్వ విధానాల్లో సుదీర్ఘ జాప్యం)పోయి రెడ్ కార్పెట్ వచ్చిందని, చాలా సంస్కరణలు వచ్చాయని, వ్యాపార విశ్వసనీయత పెరిగిందని అనిల్ అంబానీ వ్యాఖ్యానించారు. చౌక ధరల గృహాలు, సార్వత్రిక బీమా, చెల్లింపుల బ్యాంక్ల ఏర్పాటు, ఆధార్ వంటివన్నీ భారత్లో ఆర్థిక సేవల వృద్ధికి దోహదపడే కీలకాంశాలని వివరించారు. -
పేటీఎమ్లో ఆర్ క్యాప్ 1% వాటా విక్రయం
డీల్ విలువ రూ.225 కోట్లు భారీగా లాభాలు న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎమ్లో 1% వాటాను రిలయన్స్ క్యాపిటల్(ఆర్ క్యాప్) విక్రయించింది. ఈ వాటాను చైనాకు చెందిన ఆలీబాబా గ్రూప్కు రూ.275 కోట్లకు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ విక్రయించిందని సమాచారం. ఈ వాటా విక్రయంతో రిలయన్స్ క్యాపిటల్కు భారీగా లాభాలు వచ్చాయి. ఈ 1% వాటాను గతంలో రిలయన్స్ క్యాపిటల్ రూ.10 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుదు ఈ వాటాను రూ.275 కోట్లకు విక్రయించింది. లాభాలు అప్పడే అయిపోలేదు. గతంలో పేటీఎమ్లో ఈ 1% వాటాను కొనుగోలు చేసినందుకు పేటీఎమ్ ఈ కామర్స్ వెంచర్లో కొంత వాటా రిలయన్స్ క్యాపిటల్కు ఉచితంగా లభించింది. ఈ ఉచిత వాటాను కొనసాగించాలని రిలయన్స్ క్యాపిటల్ భావిస్తోంది. ఇటీవల పెట్టుబడులు సమీకరణ పరంగా చూస్తే పేటీఎమ్ ఈ కామర్స్ సంస్థ విలువ వంద కోట్ల డాలర్లుగా ఉంటుందని అంచనా. కాగా తాజా 1 శాతం వాటా విక్రయం పరంగా చూస్తే పేటీఎమ్ విలువ 500 కోట్ల డాలర్లుగా ఉంటుందని నిపుణులు లెక్కలేస్తున్నారు. భారత్లో అమెజాన్తో పోటీ పడేందుకు గాను ఆలీబాబా సంస్థ పేటీఎమ్లో వాటాను పెంచుకుంటోందని విశ్లేషకులంటున్నారు. అయితే ఈ విక్రయ వార్తలపై ఇరు కంపెనీల ప్రతినిధులు వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. కాగా గత ఏడాది డిసెంబర్లో పేటీఎమ్ వ్యవస్థాపకులు, సీఈఓ కూడా అయిన విజయ్ శేఖర్ శర్మ పేటీఎమ్ మాతృకంపెనీ వన్97 కమ్యూనికేషన్స్లో 1% వాటాను రూ.325కు విక్రయించారు. -
రిలయన్స్ హోమ్ ఫైనాన్స్
• రూ.1,000 కోట్ల ఇష్యూకి రూ.3,000 కోట్ల బిడ్లు • రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ • ఎన్సీడీ ఇష్యూకు భారీ స్పందన న్యూఢిల్లీ: రిలయన్స్ క్యాపిటల్కు చెందిన రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ తొలి ఎన్సీడీ(నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల) ఇష్యూకు ఇన్వెస్టర్ల నుంచి తొలి రోజే అనూహ్యమైన స్పందన లభించింది. నేడు(శుక్రవారం) ముగిసే ఈ రూ.1,000కోట్ల ఎన్సీడీ ఇష్యూకు గురువారం నాడే రూ.3,000 కోట్ల బిడ్లు వచ్చాయి. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించిందని సమాచారం. ఈ ఎన్సీడీ నిధులను రుణాలివ్వడానికి, పాత బకాయిలను తీర్చడానికి, ఇతర సాధారణ వాణిజ్య కార్యకలాపాలకు వినియోగించాలని కంపెనీ యోచిస్తోంది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం, గురువారం సాయంత్రం ఐదు గంటలకు ఈ ఎన్సీడీ ఇష్యూ 3 రెట్లు ఓవర్సబ్స్క్రైబయింది. రూ.3,012.91 కోట్లకు బిడ్లు వచ్చాయి. రూ. 1,000 ముఖ విలువ గల సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ ఎన్సీడీల జారీ ద్వారా రూ.1,000 కోట్లు సమీకరించాలని రిలయన్స్ హోమ్ భావించింది. ఓవర్ సబ్స్క్రిప్షన్ను అట్టిపెట్టుకునే సౌలభ్యం కంపెనీకి ఉంది. -
త్వరలో రిలయన్స్ క్యాపిటల్ వివిధ విభాగాలు లిస్టింగ్
♦ వచ్చే ఏప్రిల్ కల్లా రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిస్టింగ్ ♦ కమోడిటీ ఎక్స్చేంజీ మళ్లీ ప్రారంభిస్తాం ♦ వినియోగదారుల రుణాల కోసం కొత్త విభాగం ♦ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ వెల్లడి ఏజీఎమ్లో ప్రసంగం ముంబై: రిలయన్స్ క్యాపిటల్కు చెందిన వివిధ విభాగాలను త్వరలో స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయనున్నామని గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ తెలిపారు. గృహ రుణ విభాగాన్ని(రిలయన్స్ హోమ్ ఫైనాన్స్) వచ్చే ఏడాది ఏప్రిల్లో స్టాక్ మార్కెట్లలో లిస్ట్ చేస్తామని పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన రిలయన్స్ క్యాపిటల్ ఏజీఎమ్ (వార్షిక సాధారణ సమావేశం)లో వాటాదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్లో 49 శాతం వాటా రిలయన్స్ క్యాపిటల్ వాటాదారులకే ఉంటుందని, రిలయన్స్ క్యాపిటల్ వాటాదారులకు ఉచితంగా రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ షేర్లను కేటాయిస్తామని అంబానీ వివరించారు. అంతేకాకుండా వాణిజ్య రుణాల విభాగాన్ని, జీవిత బీమా, సాధారణ బీమా విభాగాలను కూడా తగిన సమయంలో లిస్ట్ చేస్తామని వివరించారు. వాటాదారుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఈ సంస్థల లిస్టింగ్పై తుది నిర్ణయాన్ని తీసుకుంటాయని వివరించారు. వినియోగదారులకు రుణాలిచ్చే కొత్త విభాగాన్ని అభివృద్ధి చేయనున్నామని పేర్కొన్నారు. కమోడిటీ ఎక్స్చేంజీని మళ్లీ ప్రారంభిస్తామని, వజ్రాలు, ముడిచమురు ఫ్యూచర్లపై ప్రధానంగా దృష్టి పెడతామని చెప్పారు. వజ్రాల ఫ్యూచర్స్ రోజువారీ టర్నోవర్ రూ.6,000 కోట్లు ఉండే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ప్రతి ఏడాది డివిడెండ్ చెల్లింపుల్లో వృద్ధి సాధించాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. జీఎస్టీతో భారీ మార్పు వర్షాలు బాగా కురుస్తాయన్న అంచనాలున్నాయని, వడ్డీరేట్లు తక్కువ స్థాయిల్లో ఉన్నాయని, ద్రవ్యోల్బణం కూడా కనిష్ట స్థాయిలోనే ఉందని దీంతో భారత ఆర్థిక వృద్ధి జోరుగా ఉండగలదని పేర్కొన్నారు. జీఎస్టీ కారణంగా ఆర్థిక వ్యవస్థలో సమూల మార్పులు రాబోతున్నాయని పేర్కొన్నారు. ఈ ఏజీఎంలో రిల యన్స్ క్యాప్ సీఈఓ శామ్ ఘోష్ తదితరులు కూడా పాల్గొన్నారు. ఆర్కామ్లో రుణ భారం తగ్గించుకుంటాం: రిలయన్స్ కమ్యూనికేషన్స్ భారీ రుణ భారాన్ని ఏడాది కాలంలో 75 శాతం వరకూ తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నామని అంబానీ పేర్కొన్నారు. ఆర్కామ్లో ఎంటీఎస్, ఎయిర్సెల్ విలీన ప్రక్రియలు పూర్తయితే రుణ భారం రూ.20,000 కోట్ల వరకూ తగ్గుతుందని పేర్కొన్నారు. ఈ రెండు కంపెనీల విలీనం పూర్తయితే, దేశంలోనే అత్యధిక స్పెక్ట్రమ్ ఉన్న రెండో అతి పెద్ద కంపెనీగా, 18 కోట్ల మంది వినియోగదారులతో నాలుగో అతి పెద్ద టెలికం కంపెనీగా అవతరిస్తామని వివరించారు. టవర్ల వ్యాపార విక్రయానికి సంబంధించిన కీలకమైన ప్రకటనను త్వరలోనే వెల్లడిస్తామని వివరించారు. తమ తండ్రి ధీరుబాయ్ అంబానీ స్వప్నాన్ని సాకారం చేయడానికి తన సోదరుడు ముకేశ్ అంబానీ రిలయన్స్ జియోతో కలిసి పనిచేస్తామని తెలిపారు. ఆర్కామ్, రిలయన్స్ జియోల అనుబంధం దాదాపు విలీనంలాంటిదేనని అనిల్ అంబానీ అభివర్ణించారు. అన్మోల్ ప్రభావం.. రిలయన్స్ క్యాపిటల్లో కొత్త డెరైక్టర్గా తన కుమారుడు అన్మోల్ అంబానీ నియమితులైనప్పటి నుంచి రిలయన్స్ క్యాపిటల్ షేర్ 40 శాతం పెరిగిందని అనిల్ అంబానీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ అన్మోల్ ప్రభావం కొనసాగగలదన్న ఆశాభావాన్ని, ధీమాను ఆయన వ్యక్తం చేశారు. అన్మోల్ డెరైక్టర్గా చేరకముందు రిలయన్స్ క్యాపిటల్ షేర్ రూ.467గా ఉంది. సోమవారం ఈ షేర్ రూ.557 ధర వద్ద ముగిసింది. పూర్తి స్థాయి ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్గా అన్మోల్ నియామకాన్ని ఈ ఏజీఎమ్లో వాటాదారుల ఆమోదించడం పట్ల వాటాదారులకు అనిల్ అంబానీ కృతజ్జతలు తెలిపారు. -
ఇక రంగంలోకి రిలయన్స్ హోం ఫైనాన్స్
రిలయన్స్ క్యాపిటల్ అధినేత అనిల్ అంబానీ వ్యాపార విస్తరణలో జోరు పెంచినట్టు కనిపిస్తోంది. ఒకవైపు కీలకమైన ఎయిర్ సెల్ తో ఒప్పందాన్ని ఖాయం చేసుకుంటూనే మరోవైపు మరో సరికొత్త కంపెనీతో స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. 49 శాతం ఈక్విటీ తో 'రిలయన్స్ హోం ఫైనాన్స్' అనే సంస్థను మార్కెట్ లో లిస్ట్ చేయనున్నారు. రిలయన్స్ కేపిటల్ కి సంబంధించిన హౌసింగ్ ఫైనాన్స్ ను విడిగా స్టాక్ ఎక్స్ఛేంజ్ లోకి తీసుకురావాలని నిర్ణయించినట్టు రిలయన్స్ ప్రకటించింది. ఇందులో 49శాతం షేర్లు హోమ్ లోన్ కంపెనీకి చెందిన సుమారు పదిలక్షల షేర్ హోల్డర్లకే ఉచితంగా అందించనున్నట్టు తెలిపింది. అంటే రిలయన్స్ క్యాపిటల్ షేరున్న ప్రతీ ఖాతాదారుడికి ఒక హౌసింగ్ ఫైనాన్స్ షేరును ఎలాట్ చేయనుంది. ఈ మేరకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం అంగీకారం తెలిపినట్లు కంపెనీ తెలిపింది. రిలయన్స్ క్యాపిటల్ లో 100 శాతం అనుబంధ సంస్థగా రిలయన్స్ హోం ఫైనాన్స్ హోం లోన్, ప్రాపర్టీలోన్, కనస్ట్రక్షన్ ఫైనాన్స్ , చవకైన గృహ రుణాలు లాంటిరుణ సేవల్లో విస్తృత పరిధిలో తన సేవలను అందించనుంది. 2016 జూన్ 30 తో ముగిసిన త్రైమాసికంలో రూ.8,259 కోట్ల ఎస్సెట్ మ్యానేజ్ మెంట్, రూ. 7,750 కోట్ల అవుట్ స్టాండింగ్ లోన్ బుక్, ఒక శాతం ఎన్పీఏ రేషియోను రిపోర్ట్ చేసింది కాగా మాతృ సంస్థ రిలయన్స్ క్యాపిటల్ జీవిత, సాధారణ బీమా, ఆస్తుల నిర్వహణ, మ్యూచువల్ ఫండ్, కన్స్యూమర్ ఫైనాన్స్ తదితర వివిధ ఆర్థిక సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలతో . రిలయన్స్ క్యాపిటల్ షేర్లు పదిశాతానికిపై ఎగిసి 52 వారాల కనిష్టాన్ని తాకింది. చివరికి రూ 8.68 శాతం లాభపడి 580 దగ్గర ముగిసింది. -
రిలయన్స్ క్యాపిటల్ బోర్డులోకి అనిల్ అంబానీ కుమారుడు
న్యూఢిల్లీ: బిలియనీర్ అనిల్ అంబానీ పెద్ద కుమారుడు జై అన్మోల్ తాజాగా రిలయన్స్ క్యాపిటల్ బోర్డులో అడిషనల్ డెరైక్టర్గా నియమితులయ్యారు. ఈయన నియామకానికి బోర్డు ఆమోదం తెలిపింది. 24 ఏళ్ల ఈ యువ డైనమైట్ గత రెండేళ్లుగా రిలయన్స్ క్యాపిటల్లోని పలు ఫైనాన్షియల్ సర్వీసెస్లకు సంబంధించిన కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ఈయన యూకేలోని వర్విక్ బిజినెస్ స్కూల్ నుంచి డిగ్రీ పొందారు. ‘గత రెండేళ్లలో ఫైనాన్షియల్ సర్వీసెస్ బిజినెస్లకు సంబంధించి చాలా నేర్చుకున్నాను. ఈ అనుభవంతో కంపెనీని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తాను’ అని జై అన్మోల్ తెలిపారు. రిలయన్స్ క్యాపిటల్.. లైఫ్ ఇన్సూరెన్స్, కమర్షియల్ ఫైనాన్స్, సెక్యూరిటీస్, జనరల్ ఫైనాన్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వ్యాపారాలను నిర్వహిస్తోంది. -
దూసుకొచ్చిన వారసుడు
ముంబై: కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ క్యాపిటల్ కంపెనీలోకి కొత్త వారసుడు దూసుకొచ్చాడు. రిలయన్స్ గ్రూప్ అధ్యక్షుడు అనిల్ ధీరూబాయ్ అంబానీ పెద్ద కొడుకు జై అన్మోల్ అంబానీ (24) ఎడిషనల్ డైరెక్టర్ గా నియమితుడయ్యారు. ఈ మేరకు కంపెనీ బోర్డు మంగళవారం ఆమోదం తెలిపింది. రిలయన్స్ క్యాపిటల్ బోర్డు ఆధ్వర్యంలోని నామినేషన్ అండ్ కాంపన్సేషన్ కమిటీ సిఫారసులకు మేరకు బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై అన్మోల్ అంబానీ సంతోషం వ్యక్తం చేశారు. ఫైనాన్షియల్ సర్వీసెస్ లో గత రెండేళ్లుగా తనకున్న అనుభవం వ్యాపారవృద్ధిలో తనకు సహాయపడనుందని తెలిపారు. ఫాస్ట్ లెర్నర్ గా వివిధ నిర్ణయాలసందర్భంగా యాక్టివ్ పార్టిసిపెంట్ గా ఉన్న అన్ మోల్ ను ఆహ్వానిస్తున్నామని, రిలయన్స్ కాపిటల్ ఈడీ, గ్రూప్ సీఈవో సామ్ ఘోష్ ఆయనకుస్వాగతం పలికారు. కాగా జై అన్మోల్ 2014 నుంచి రిలయన్స్ క్యాపిటల్ తన సేవలను అందించారు. 'వార్విక్ బిజినెస్ స్కూల్' నుంచి డిగ్రీ పొందిన ఇతడికి ఫైనాన్స్ రంగంపై ఆసక్తి ఎక్కువ. ఈ నేపథ్యంలో రిలయన్స్ క్యాపిటల్ వివిధ కంపెనీలను టేకోవర్ చేస్తూ దూసుకెడుతున్న సంగతి తెలిసిందే. -
రిలయన్స్ క్యాపిటల్ డివిడెండ్ రూ.10
♦ క్యూ4లో 10% పెరిగిన నికర లాభం ♦ 12% వృద్ధితో రూ.2,828 కోట్లకు ఆదాయం ముంబై: రిలయన్స్ క్యాపిటల్ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.415 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2014-15) ఇదే కాలానికి సాధించిన నికర లాభం(రూ.407 కోట్లు)తో పోల్చితే 2 శాతం వృద్ధి సాధించామని రిలయన్స్ క్యాపిటల్ పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.2,542 కోట్ల నుంచి 11 శాతం వృద్ధితో రూ.2,828 కోట్లకు పెరిగిందని వివరించింది.ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2014-15లో రూ.1,001 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 10 శాతం వృద్ధితో రూ.1,101 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.8,929 కోట్ల నుంచి 12 శాతం వృద్ధితో రూ.9,998 కోట్లకు వృద్ధి చెందిందని వివరించింది. రూ. 10 ముఖ విలువ గల ఒక్కో షేర్కు రూ. 10 (వంద శాతం)డివిడెండ్ను ఇవ్వనున్నామని పేర్కొంది. ఈ ఏడాది మార్చి 31 నాటికి కంపెనీ నెట్వర్త్ రూ.15,390 కోట్లుగా ఉంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో రిలయన్స్ క్యాపిటల్ షేర్ స్వల్పంగా పెరిగి రూ.384 వద్ద ముగిసింది. -
రిలయన్స్ క్యాపిటల్ లాభం 10 అప్
న్యూఢిల్లీ: రిలయన్స్ క్యాపిటల్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 10 శాతం పెరిగింది. గత క్యూ3లో రూ.213 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.235 కోట్లకు పెరిగిందని రిలయన్స్ క్యాపిటల్ పేర్కొంది. మ్యూచువల్ ఫండ్, బ్రోకింగ్ వ్యాపారాల్లో వృద్ధి కారణంగా నికర లాభంలో పెరుగుదల సాధించామని వివరించింది. మొత్తం ఆదాయం రూ.2,106 కోట్ల నుంచి రూ.2,318 కోట్లకు వృద్ధి చెందిందని తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో రిలయన్స్ క్యాపిటల్ షేర్ బీఎస్ఈలో 1 శాతం క్షీణించి రూ.363 వద్ద ముగిసింది. ఇండిగో లాభం 24 శాతం అప్ న్యూఢిల్లీ: ఇండిగో మాతృసంస్థ ఇంటర్గ్లోబల్ ఏవియేషన్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 24 శాతం పెరిగింది. గత ఏడాది నవంబర్లో స్టాక్ మార్కెట్లో లిస్టైన ఈ కంపెనీ ఈ క్యూ3లో రూ.657 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇంధన వ్యయాలు తక్కువగా ఉండడం, విమాన సర్వీసులు పెరగడం ప్రయాణికుల ఆదాయం పెరగడంతో మంచి నికర లాభం సాధించామని ఇండిగో ప్రెసిడెంట్ ఆదిత్య ఘోష్ చెప్పారు. గత క్యూ3లో రూ.3,939 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం 12 శాతం వృద్ధి చెంది రూ.4,407 కోట్లకు పెరిగిందని వివరించారు. స్టాక్ మార్కెట్లో లిస్టైన తర్వాత ఈ కంపెనీ ప్రకటించిన తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఇవి. -
250 మంది ఉద్యోగులకు రూ. 150 కోట్ల ఎసాప్స్
ముంబై: రిలయన్స్ క్యాపిటల్ తమ ఉద్యోగులతో పాటు అనుబంధ సంస్థల్లోని సిబ్బందికి భారీ నజరానాలు ప్రకటించింది. అర్హులైన 250 మంది ఉద్యోగులకు రూ. 150 కోట్ల విలువ చేసే ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్లు (ఎసాప్స్) ఇవ్వనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రత్యేక స్కీము కింద రిలయన్స్ క్యాపిటల్ లిస్టెడ్ షేర్లు, ఇతర అనుబంధ సంస్థల ‘ఫాంటమ్ షేర్లు’ ఉద్యోగులకు జారీ చేస్తారు. ఇందులో 6,46,080 షేర్లు రిలయన్స్ క్యాపిటల్వి, మిగతావి ఫాంటమ్ షేర్ల రూపంలో అనుబంధ సంస్థలవీ ఉంటాయి. భౌతిక రూపంలో కాకుండా ‘కల్పిత’ రూపంలో జారీ చేసే షేర్లను ఫాంటమ్ షేర్లుగా వ్యవహరిస్తారు. ఇవి కల్పితమైనవే అయినప్పటికీ.. సంబంధిత కంపెనీ, ఆ షేర్లను జారీచేసినవారు విక్రయించదలిస్తే, మార్కెట్ విలువ ప్రకారం భవిష్యత్తులో చెల్లింపు చేయడం లేదా వాటి స్థానంలో వాస్తవ షేర్లను జారీచేయడం జరుగుతుంది. రిలయన్స్ క్యాపిటల్ అనుబంధ సంస్థలైన రిలయన్స్ క్యాపిటల్ అసెట్ మేనేజ్మెంట్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్, రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ మొదలైన వాటిల్లో అర్హులైన ఉద్యోగులకు ఎసాప్స్ లభిస్తాయి. రిలయన్స్ క్యాపిటల్ నజరానా -
రిలయన్స్ క్యాపిటల్లో ఎస్ఎంటీబీకి వాటాలు
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగంలోకి ప్రవేశించే దిశగా తమ కంపెనీలో 2.77 శాతం వాటాలను జపాన్కు చెందిన సుమితోమో మిత్సుయి ట్రస్ట్ బ్యాంక్ (ఎస్ఎంటీబీ)కి విక్రయించే ప్రక్రియ పూర్తయినట్లు రిలయన్స్ క్యాపిటల్ తెలిపింది. షేరు ఒక్కింటికి రూ. 530 చొప్పున ఈ డీల్ విలువ రూ. 371 కోట్లని, ఏడాది లాకిన్ పీరియడ్ ఉంటుందని ఒక ప్రకటనలో వివరించింది. రిజర్వ్ బ్యాంక్ అనుమతులు వస్తే ఎస్ఎంటీబీ వ్యూహాత్మక భాగస్వామిగా కొత్త బ్యాంకును ఏర్పాటు చేయగలమని రిలయన్స్ క్యాపిటల్ పేర్కొంది. రెండు దేశాల్లోని క్లయింట్లకు ఇరు కంపెనీలు సంయుక్తంగా సేవలు అందించనున్నట్లు సంస్థ సీఈవో శామ్ ఘోష్ తెలిపారు. జపాన్లో నాలుగో అతి పెద్ద గ్రూప్ అయిన ఎస్ఎంటీబీ సుమారు 682 బిలియన్ డాలర్ల అసెట్స్ను నిర్వహిస్తోంది. పారిశ్రామిక దిగ్గజం అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్లో భాగంగా రిలయన్స్ క్యాపిటల్ ఉంది. -
రిలయన్స్ బ్యాంకులో సుమితొమోకు 10% వాటా!
న్యూఢిల్లీ: ప్రతిపాదిత రిలయన్స్ బ్యాంకులో జపాన్ ఆర్థిక సేవల దిగ్గజం సుమితొమో మిత్సుయ్ ట్రస్ట్ బ్యాంక్ ఆఫ్ జపాన్(ఎస్ఎంటీబీ)కు 10 శాతం వాటా ఇవ్వాలని రిలయన్స్ క్యాపిటల్ భావిస్తోంది. యూనివర్సల్ బ్యాంకింగ్ లెనైన్స్కు దరఖాస్తు చేసేందుకు ఉత్సాహంగా ఉన్న అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్(అడాగ్).... ఆర్బీఐ తుది మార్గదర్శకాల విడుదల కోసం వేచిచూస్తోంది. ఇటీవలే అడాగ్ గ్రూప్ కంపెనీ రిలయన్స్ క్యాపిటల్.. ఎస్ఎంటీబీతో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రూ.371 కోట్ల పెట్టుబడితో ఎస్ఎంటీబీ రిలయన్స్ క్యాపిటల్లో 2.77 శాతం వాటాను తీసుకుంది. తద్వారా దీర్ఘకాలంలో విభిన్న వ్యాపారాల్లో ఎస్ఎంటీబీని భాగస్వామిగా చేసుకోవాలనేది అడాగ్ ప్రణాళిక. కాగా, మరో జపాన్ భాగస్వామ్య సంస్థ నిప్పన్ లైఫ్కు కూడా ప్రతిపాదిత బ్యాంకింగ్ వెంచర్లో 10 శాతం వాటాను ఇచ్చేందుకు రిలయన్స్ క్యాపిటల్ సుముఖంగా ఉంది. నిప్పన్ లైఫ్ వాటా 49 శాతానికి...! బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డీఐ) పరిమితిని 49 శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఆర్డినెన్స్ను జారీ చేయడంతో.. అడాగ్ గ్రూప్ జోరు పెంచుతోంది. రిలయన్స్ క్యాపిటల్కు చెందిన రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో నిప్పన్ లైఫ్కు మరింత వాటా ఇచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. నిప్పన్ లైఫ్కు ప్రస్తుతం 26 శాతం వాటా ఉండగా... దీన్ని 49 శాతానికి పెంచుకునే అంశంపై ప్రాథమికంగా చర్చలు జరిపినట్లు రిలయన్స్ క్యాప్ సీఈఓ శ్యామ్ ఘోష్ చెప్పారు. అదేవిధంగా హెల్త్, జనరల్ ఇన్సూరెన్స్ వ్యాపారాల్లో కూడా విదేశీ కంపెనీలకు వాటాలు ఇచ్చే అంశంపై చర్చలు జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. -
కార్నివల్ చేతికి బిగ్ సినిమాస్
అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూపు కంపెనీ నుంచి కొనుగోలు డీల్ విలువ సుమారు రూ. 700 కోట్లు మూడో పెద్ద మల్టీప్లెక్స్ సంస్థ ఆవిర్భావం న్యూఢిల్లీ: అనిల్ అంబానీ గ్రూప్ సంస్థ రిలయన్స్ క్యాపిటల్.. బిగ్ సినిమాస్ బిజినెస్ను కార్నివల్ గ్రూప్నకు విక్రయించింది. డీల్ విలువ రూ. 700 కోట్లుగా అంచనా. ఇది దేశీ మల్టీప్లెక్స్ రంగంలోనే అతిపెద్ద డీల్ కాగా, అనుబంధ సంస్థ రిలయన్స్ మీడియా వర్క్స్ ద్వారా దక్షిణాదికి చెందిన కార్నివల్ గ్రూప్నకు బిగ్ సినిమాస్ను విక్రయించింది. అయితే వీటిలో ముంబైలోని ఐమాక్స్ వాడాల మల్టీప్లెక్సెస్ తదితర ప్రాంతాలలో ఉన్న కొన్ని రియల్టీ ఆస్తులను మినహాయించింది. రూ. 200 కోట్ల విలువైన ఈ ఆస్తులను రిలయన్స్ క్యాపిటల్ విడిగా విక్రయించే యోచనలో ఉంది. తద్వారా కీలకంకాని వ్యాపారాల నుంచి వైదొలగే ప్రణాళికను అమలు చేయడంతోపాటు ఆమేర రుణ భారాన్ని సైతం తగ్గించుకోనుంది. బిగ్ సినిమాస్ బిజినెస్ అమ్మకం ద్వారా రిలయన్స్ క్యాపిటల్ రుణాల బదిలీతోపాటు, కొంతమేర నగదును సైతం పొందనుంది. వెరసి సుమారు రూ. 700 కోట్ల వరకూ రుణ భారాన్ని దించుకునే వీలు చిక్కనుంది. ఈ విషయాన్ని రెండు సంస్థలూ సంయుక్తంగా వెల్లడించాయి. అయితే డీల్ కచ్చితమైన విలువను అటు కార్నివల్, ఇటు రిలయన్స్ క్యాపిటల్ వెల్లడించలేదు. ప్రైమ్ ఫోకస్ డీల్కు ఓకే వినోద బిజినెస్ను ప్రైమ్ ఫోకస్కు బదిలీ చేసేందుకు ఇటీవలే రిలయన్స్ మీడియా వర్క్స్ కుదుర్చుకున్న ఒప్పందానికి కాంపిటీషన్ కమిషన్ తాజాగా గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. రూ. 1,800 కోట్ల విలువైన ఈ డీల్ వల్ల దేశీయ వినోద రంగంలో పోటీ వాతావరణం దెబ్బతినే అవకాశం లేదంటూ సీసీఐ ఈ సందర్భంగా పేర్కొంది. ప్రైమ్ ఫోకస్లో 30.2% వాటాను పొందే డీల్లో భాగంగా రిలయన్స్ మీడియా రూ. 120 కోట్లను ఇన్వెస్ట్ చేయనుంది. ఇక ప్రైమ్ ఫోకస్లో ప్రస్తుత ప్రమోటర్లు కూడా ఇదే స్థాయిలో పెట్టుబడులను తీసుకురానున్నారు. డీల్ ప్రకారం రిలయన్స్ మీడియాకు చెందిన ముంబైలోని ఫిల్మ్ సిటీ, నవీముంైబె సెజ్లోని బ్యాక్ఎండ్ యూనిట్, లాస్ఏంజిల్స్లోని లౌరీ డిజిటల్తోపాటు, ఈ యూనిట్కుగల రూ. 200 కోట్ల రుణ భారం కూడా ప్రైమ్ ఫోకస్కు దాఖలు కానున్నాయి. కార్నివల్ సంగతిదీ... కేరళ కేంద్రంగా ఏర్పాటైన కార్నివల్ గ్రూప్ ఇప్పటికే 125కుపైగా తెరలను కలిగి ఉంది. గ్రూప్ సీఈవో శ్రీకాంత్ భసీ. కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లలో కార్యకలాపాలు విస్తరించింది. మీడియా, వినోదం, ఆతిథ్య రంగాలలో బిజినెస్లు కలిగి ఉంది. ఈ ఏడాది జూలైలో ముంబై రియల్టీ సంస్థ హెచ్డీఐఎల్కు చెందిన మల్టీప్లెక్స్ బిజినెస్ బ్రాడ్వే సినిమాను రూ. 110 కోట్లకు సొంతం చేసుకుంది. ఇదే నెలలో లీలా గ్రూప్నకు చెందిన కొచ్చిలోని ఐటీ పార్క్ను రూ. 280 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. అక్టోబర్లో ఎల్అండ్టీకి చెందిన చండీగఢ్లోని ఎల ంటే మాల్ను రూ. 1,900 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపింది. బిగ్ సినిమాస్ పేరుతో రిలయన్స్ మీడియావర్క్స్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 250 తెరలను కలిగి ఉన్న విషయం విదితమే. వెరసి బిగ్ సినిమాస్ కొనుగోలుతో కార్నివల్ మూడో పెద్ద మల్టీప్లెక్స్ సంస్థగా ఆవిర్భవించనుంది. -
రిలయన్స్ లైఫ్ నుంచి సూపర్ మనీ బ్యాక్ ప్లాన్
హైదరాబాద్: రిలయన్స్ క్యాపిటల్కు చెందిన రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ కొత్తగా రిలయన్స్ సూపర్ మనీ బ్యాక్ ప్లాన్ను ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్లో లైఫ్ కవర్ ఎన్నేళ్లు ఉంటుందో, దాంట్లో సగం కాలానికి ప్రీమియం చెల్లిస్తే సరిపోతుందని కంపెనీ సీఈవో అనుప్ రావూ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతీ ఐదేళ్లకు మనీ బ్యాక్ ప్రయోజనాలుంటాయని పేర్కొన్నారు. ప్రీమియం చెల్లింపు కాలం పూర్తయిన తర్వాత పాలసీదారుడు క్రమం తప్పకుండా నెలవారీ ఆదాయం పొందవచ్చని వివరించారు. ఈ నెల వారీ చెల్లింపు ప్రతీ ఏడాది 3% చొప్పున వృద్ధి చెందుతుందని, మెచ్యురిటీ కాలం వరకూ/పాలసీదారుడు జీవించి ఉన్నంత వరకూ ఈ చెల్లింపులు కొనసాగుతాయని తెలిపారు. పూర్తి కాలానికి లైఫ్ ప్రొటెక్షన్ లభిస్తుందని పేర్కొన్నారు. 18-55 సంవత్సరాల వయస్సున్న వ్యక్తులు ఈ పాలసీకి అర్హులని, కనీస బీమా రూ. 1లక్ష అని, 10/20/ 30/40/50 సంవత్సరాల కాలానికి పాలసీ తీసుకోవచ్చని అనుప్ వివరించారు. -
బ్యాంక్ లెసైన్సు సాధిస్తాం
ముంబై: రిజర్వ్ బ్యాంక్ కొత్తగా జారీ చేసే బ్యాంకింగ్ లెసైన్సుల్లో తాము కూడా ఒకటి దక్కించుకోగలమని రిలయన్స్ క్యాపిటల్ చైర్మన్ అనిల్ అంబానీ ధీమా వ్యక్తం చేశారు. తద్వారా కొత్తగా రిలయన్స్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని, మూడేళ్ల తర్వాత పబ్లిక్ ఇష్యూ చేపట్టి స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేస్తామని ఆయన తెలిపారు. కొత్త బ్యాంక్కి వాణిజ్య రుణాల వ్యాపారాన్ని బదలాయించడం ద్వారా రిలయన్స్ క్యాపిటల్ (ఆర్క్యాప్) ప్రస్తుత రుణభారం మూడు వంతులమేర తగ్గిపోగలదని అనిల్ వివరించారు. మంగళవారం జరిగిన ఆర్క్యాప్ వాటాదారుల వార్షిక సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. బ్యాంక్ మినహా ఆర్క్యాప్లో మిగతా అనుబంధ సంస్థలు వేటినీ లిస్టింగ్ చేసే యోచనేదీ లేదని ఆయన స్పష్టం చేశారు. 5వేల కోట్లకు తగ్గనున్న రుణం.. ఆర్క్యాప్కి చెందిన కమర్షియల్ ఫైనాన్స్ వ్యాపారాన్ని ప్రతిపాదిత బ్యాంకుకు బదలాయిస్తామని అనిల్ చెప్పారు. దీంతో ప్రస్తుతం రూ. 20,000 కోట్లుగా ఉన్న కన్సాలిడేటెడ్ రుణభారం రూ. 5,000 కోట్లకు తగ్గగలదన్నారు. ఫలితంగా డెట్-ఈక్విటీ నిష్పత్తి కూడా పరిశ్రమ ప్రమాణాల కన్నా మెరుగ్గా 0.5-1 స్థాయికి తగ్గగలదని వివరించారు. కంపెనీ వద్ద తగినంత మూలధనం ఉందని, మరింతగా సమకూర్చుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఆర్క్యాప్ జీవిత బీమా, సాధారణ బీమా, హెల్త్ ఇన్సూరెన్స్, అసెట్ మేనేజ్మెంట్, బ్యాంకింగ్ వ్యాపారాలపైనే ప్రధానంగా దృష్టి సారిస్తుందని చెప్పారు. ఆర్థికపరమైన అంశాల కన్నా సాంకేతిక నైపుణ్యత రూపంలో లాభించే భాగస్వామ్యాలను కుదుర్చుకునే యోచన ఉందన్నారు. మరోవైపు బ్యాంకులు వివిధ బీమా సంస్థల పథకాలను విక్రయించేందుకు బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏ అనుమతించడం సానుకూల అంశమని, దీనివల్ల కోట్లకొద్దీ కస్టమర్లకు ప్రయోజనం చేకూరుతుందని అనిల్ తెలిపారు. టెలికంలో కన్సాలిడేషన్.. రాబోయే రోజుల్లో టెలికం రంగంలో కన్సాలిడేషన్ జరగగలదని రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) వాటాదారుల వార్షిక సమావేశంలో పాల్గొన్న సందర్భంగా చైర్మన్ హోదాలో అనిల్ చెప్పారు. జాతీయస్థాయిలో కేవలం నాలుగైదు కంపెనీలు మాత్రమే మిగులుతాయని ఆయన తెలిపారు. ఇక, పెద్దన్న ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్తో సర్వీసులపరంగా పరస్పర సహకారం మరింత పెరగగలదని అనిల్ అంబానీ చెప్పారు. ఆర్కామ్ ఇకపై కూడా సీడీఎంఏ సర్వీసులు కొనసాగిస్తుందని.. 4జీ తదితర సేవలు అందించే దిశగా భవిష్యత్లో స్పెక్ట్రమ్ వేలంలోనూ పాల్గొంటుందని ఆయన వివరించారు. ప్రస్తుతం 4జీ సేవల కోసం దేశవ్యాప్త స్పెక్ట్రమ్ ఉన్న రిలయన్స్ జియోతో రూ. 14,000 కోట్ల విలువ చేసే రెండు ఒప్పందాలను ఆర్కామ్ కుదుర్చుకుందన్నారు. కొత్త కంపెనీగా ఆర్కామ్ రియల్టీ ఆస్తులు.. ఆర్కామ్ రియల్టీ ఆస్తులను విడగొట్టి ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేయనున్నట్లు అనిల్ తెలిపారు. కొత్తగా ఏర్పాటయ్యే ‘రిలయన్స్ ప్రాపర్టీస్’ని లిస్టింగ్ కూడా చేస్తామని ఆయన చెప్పారు. ఆర్కామ్ షేర్హోల్డర్లందరికీ.. కొత్త సంస్థ షేర్లను ఉచితంగా ఇస్తామని అనిల్ వివరించారు. ప్రస్తుతం కంపెనీ రియల్ ఎస్టేట్ ఆస్తుల విలువ సుమారు రూ. 12,000 కోట్లు ఉంటుందన్నారు.