Renuka Chowdhury
-
తప్పులు చేసి నీతులు చెబుతారా?: బీఆర్ఎస్పై రేణుకా చౌదరి ఫైర్
సాక్షి, ఖమ్మం జిల్లా: బీఆర్ఎస్ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి మండిపడ్డారు. ఖమ్మంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కొండలు.. గుట్టలు మింగిన వాళ్లు ఈ రోజు నీతులు చెబుతున్నారంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఒక మాట, కేంద్రంలో ఓ మాట మాట్లాడుతున్నారని.. సీఎంని, మంత్రులను కావాలనే విమర్శిస్తున్నారని ఆమె దుయ్యబట్టారు.ఈ రోజు హరీశ్రావు 8 గంటలకే మార్కెట్కి వెళ్లి పర్యటన చేయడం హాస్యాస్పదం. వ్యవసాయం గురించి తెలిసివాళ్లకు రైతులు ఏ సమయానికి మార్కెట్కు వస్తారో తెలుస్తుంది. మీకు ప్రాజెక్టులు, వాటి మీద వచ్చే కమిషన్ల గురించి మాత్రమే తెలుసు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిద్రాహారాలు మాని పని చేస్తున్నారు. రైతులకు బేడీలు వేసిన వాళ్లు రైతుల గురించి మాట్లాడుతున్నారు.’’ అంటూ రేణుకా చౌదరి ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది. ఆ అప్పుల ఊబి నుంచి రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం బయటకు తీసుకొస్తుంది. ఉద్యోగులకు మొదటి తేదీ నాడే జీతాలు చెల్లిస్తోంది. సుజాతనగర్లో నకిలీ విత్తనాలు రైతులను నష్ట పరిచిన కంపెనీ యాజమాన్యంతో వారందరికీ పరిహారం చెల్లించేలా చేశాం. కొత్తగూడెం విమానాశ్రయం ప్రాసెస్ నడుస్తుంది. త్వరలోనే ఎయిర్పోర్ట్ రాబోతుంది’’ అని రేణుకా చౌదరి తెలిపారు. -
దవడ పగలకొడతా..రేణుకా చౌదరి వార్నింగ్..
-
పెద్దల సమక్షంలోనే.. రసాభాసగా ఖమ్మం కాంగ్రెస్ సమావేశం
సాక్షి, ఖమ్మం: జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో గ్రూప్ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఈ నెల 17వ తేదీన కాంగ్రెస్ భారీ ఎత్తున తుక్కుగూడలో(రంగారెడ్డి మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో) బహిరంగ సభకు సిద్ధమవుతోంది. అయితే ఈ సభకు సంబంధించి ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేయగా.. అది రసాభాసకు దారి తీసింది. సీనియర్ నేత వీహెచ్ మాట్లాడే సమయంలో కార్యకర్తలు అడ్డుపడడంతో.. ఆయన వాళ్లపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఖమ్మంలో తుక్కగూడ బహిరంగ సభ సన్నాహక సమావేశంలో అబ్జర్వర్ మహ్మద్ అరిఫ్ ఖాన్తో పాటు వీ హనుమంతరావు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు నియోజకవర్గ ఇంఛార్జిలు, కొందరు కీలక నేతలు పాల్గొన్నారు. అయితే వీహెచ్ మాట్లాడే సమయంలో కొందరు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ జిల్లాలో మీ కో అర్డినేషన్ ఏమిటి? అంటూ వీహెచ్పై కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వీహెచ్ సైతం కౌంటర్గా వాళ్లపై మండిపడ్డారు. దీంతో.. అరుపులు కేకలు వేసిన కార్యకర్తలపై వీహెచ్ అసహనం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కార్యకర్తలు ఎవరికి వారే.. ‘జై పొంగులేటి’, ‘జై రేణుకా చౌదరి’, ‘జై భట్టి’.. అంటూ నినాదాలు చేశారు. దీంతో సమావేశం గందరగోళంగా తయారైంది. పెద్దల్ని గౌరవించండి మనలో మనం కొట్టుకుంటే పార్టీకే నష్టమంటూ కార్యకర్తలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు పొంగులేటి, రేణుకాచౌదరి. పార్టీ పెద్దలను గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీ లో గ్రూప్ గొడవలు ఉండొద్దు. అందరం కలిసి పని చేస్తేనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. అప్పుడే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పది కి పది స్థానాలు గెలుస్తామన్నారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ‘‘నాకు చేదు నిజం చెప్పే అలవాటు ఉంది. నలభై ఏండ్ల నుంచి పార్టీ కోసం పనిచేసిన కొంతమంది నాయకులకు గౌరవం దక్కట్లేదు. పార్టీ కోసం పని చేసిన నేతలకు న్యాయం జరగాలి. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ జిల్లా. ఖబర్దార్ అజయ్ కుమార్(మంత్రి పువ్వాడ అజయ్కుమార్ను ఉద్దేశించి).. దమ్ముంటే రా. పోలీస్ సిబ్బందిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయకు. గాలి మారిపోయింది. రాబోయేది కాంగ్రెస్.. ఉండబోయేది కాంగ్రెస్.. గుర్తుంచుకో. కేసీఆర్, మోదీ తోడు దొంగలు. ఈ విషయం.. కవిత లిక్కర్ కేసుతో రుజువైందని రేణుక చౌదరి మండిపడ్డారు. -
ఖమ్మంలో సై అంటే సై అంటున్న కారు, కాంగ్రెస్..
ఖమ్మం జిల్లాలో రాజకీయ ప్రత్యర్థుల మధ్య మాటలే మంటలు రేపుతున్నాయి. పంచ్ డైలాగ్స్ తూటాల్లా పేలుతున్నాయి. కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి మంత్రి పువ్వాడ అజయ్ను పాతాళంలోకి తొక్కాలని పిలుపునిచ్చారు. దమ్ముంటే తన మీద పోటీ చేసి గెలవాలని రేణుకకు కౌంటర్ ఇచ్చారు పువ్వాడ అజయ్. కారు, కాంగ్రెస్ సై అంటే సై అంటున్న ఖమ్మంలో ఈ రెండు పార్టీల మధ్య ఏం జరుగుతోందో చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఖమ్మం జిల్లాలో అధికార బీఆర్ఎస్ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి మధ్య మంటలు రేగుతున్నాయి. ఇద్దరు సై అంటే సై అంటున్నారు. ఒకరి మీద ఒకరు నిప్పులు చెరుగుతున్నారు. ఖమ్మంలో పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి పాల్గొన్న నిరుద్యోగ ర్యాలీలో మాట్లాడుతూ..మంత్రి అజయ్ను అరే అంటూ సంభోదిస్తూ.. అజయ్ను పాతాళంలోకి తొక్కాలంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మంత్రి అజయ్ కూడా రేణుకకు అదేస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. రేణుకకు దమ్ముంటే ఖమ్మంలో తన మీద పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. తన మీద రేణుక గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కూడా మంత్రి అజయ్ సవాల్ చేశారు. రాష్ట్ర మంత్రి అజయ్, కేంద్ర మాజీమంత్రి రేణుకా చౌదరి..రాజకీయ విమర్శల స్థాయి నుంచి వ్యక్తిగత విమర్శల స్థాయికి దిగిపోయారు. ఒకరి మీద ఒకరు వ్యక్తిగత విమర్శలతో ఖమ్మంలో ఒక్కసారిగా రాజకీయ వేడి రగిలించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒరిజినల్గా బీఆర్ఎస్కు ఉన్న ఎమ్మెల్యే మంత్రి పువ్వాడ అజయ్ ఒక్కరే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని చెప్పుకుంటున్న ఇతరులంతా కాంగ్రెస్ నుంచి గెలిచి కారెక్కినవారే. అందుకే వచ్చే ఎన్నికల్లో గులాబీ పార్టీ మీద రివెంజ్ తీర్చుకోవాలనే కసితో రగలిపోతున్నారు కాంగ్రెస్ నాయకులు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని పది సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంటుందంటూ మైండ్ గేమ్కు తెర తీసారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన రేణుక ఖమ్మం జిల్లాకు గాని, నగరానికి గాని చేసిందేమీ లేదని, రేణుక అంటే పబ్బులు, గబ్బుల చరిత్రే గుర్తుకు వస్తుందని పువ్వాడ అజయ్ రివర్స్లో కౌంటర్ వేశారు. ఖమ్మం నుంచి రెండుసార్లు గులాబీ పార్టీ తరపున గెలిచిన మంత్రి పువ్వాడ అజయ్ హ్యాట్రిక్ కోసం ఎదురుచూస్తున్నారు. ఖమ్మం నియోజకవర్గంలో కాంగ్రెస్ బలం కూడా తక్కువేమీ కాదు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా మంత్రి అజయ్ను ఓడించాలని కాంగ్రెస్ నేతలు కంకణం కట్టుకుని కసితో పనిచేస్తున్నారు. రేణుకకు దమ్ముంటే తనపైన ఖమ్మంలో పోటీ చేయాలంటూ పువ్వాడ అజయ్ విసిరిన సవాల్కు కాంగ్రెస్ నేత ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూడాలి. రేణుకా చౌదరి ఖమ్మం నుంచి పోటీచేస్తారనే ప్రచారం ఓ వైపు..అసలు ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రచారం మాత్రమే చేస్తారంటూ మరోవైపు కాంగ్రెస్లో టాక్ నడుస్తోంది. ఒకవేళ రేణుక బరిలో ఉంటే ఖమ్మం నియోజకవర్గ రాజకీయాలు రసవత్తరంగా మారతాయి. పువ్వాడ, రేణుక ఇద్దరూ ఒకే సామాజికవర్గం గనుక ఆ వర్గంలోనే చీలిక తప్పనిసరి అవుతుంది. ఇప్పుడు పువ్వాడ అజయ్ సవాల్ను రేణుక ఎలా స్వీకరిస్తారా అని కాంగ్రెస్ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. చదవండి: పోటీకి వెనకడుగు.. ప్లాన్ ఇదేనా?.. టీ కాంగ్రెస్లో ఏం జరుగుతోంది? -
పోటీకి వెనకడుగు.. ప్లాన్ ఇదేనా?.. టీ కాంగ్రెస్లో ఏం జరుగుతోంది?
వాళ్ళంతా పార్టీలో సీనియర్లు.. సూపర్ సీనియర్లు.. హస్తం పార్టీ తమవల్లే చాలాసార్లు గెలిచిందంటారు. తమను గౌరవించాలని.. మాట వినాలని డిమాండ్ చేస్తారు. కాని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఈ సీనియర్లలో చాలా మంది వెనకాడుతున్నారు. పోటీ చేయకుండా కొత్తవారికి అవకాశం ఇస్తారా అంటే.. కుదరదంటారు. అసలు టీ.కాంగ్రెస్లో ఏం జరుగుతోంది? పోటీకి వెనకాడుతున్న నాయకులెవరు? తెలంగాణ కాంగ్రెస్లోని కొందరు సీనియర్లు ఎన్నికలు అంటేనే భయపడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాము నెట్టుకురాగలమా అని ఆందోళన చెందుతున్నారట. పాలిటిక్స్ గతంలో మాదిరిగా లేవు. ఎన్నికల్లో డబ్బు ప్రభావం బాగా పెరిగింది. దీంతో నేతలు ఎన్నికలంటేనే భయపడుతున్నారు. కొందరు నేతలు అక్కడా.. ఇక్కడా తాము వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంలేదని స్టేట్మెంట్స్ ఇస్తున్నారట. దీంతో కొందరు సీనియర్ల వ్యవహారం పై పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. పార్టీ కార్యక్రమాల్లో తామే ముందుండాలని, తమకు ప్రత్యేక ఆసనాలు వేయాలని కోరుకునే సీనియర్లు ఎన్నికలంటే భయపడుతున్నారని టాక్ నడుస్తోంది. రేణుక చౌదరి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, జానారెడ్డి, గీతారెడ్డి, సుదర్శన్ రెడ్డి లాంటి నేతలు సైతం ఎన్నికలు అనే సరికి వెనకడుగు వేస్తున్నారని సమాచారం. ఇందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి మినహా మిగతా నేతలంతా వరుసగా రెండు సార్లు ఓడిపోవడంతో ఎన్నికలు అనే సరికి భయపడే పరిస్థితి వచ్చిందంటున్నారు కొందరు. వారసుల కోసం.. సిటింగ్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పలు సందర్భాల్లో.. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ అంటేనే భయమేస్తోందని కామెంట్ చేశారు. ఉమ్మడి ఏపీలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన దామోదర రాజనర్సింహ సైతం ఎన్నికలు అంటేనే భయపడుతున్నారట. దామోదర తన కూతురుని పోటీలో ఉంచితే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారట. మాజీ మంత్రులు గీతారెడ్డి, సుదర్శన్ రెడ్డిలు సైతం వచ్చే ఎన్నికలను ఎదుర్కోగలమా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారట. జానారెడ్డి లాంటి నేతలు రాజకీయాలకు రిటైర్మెంట్ ఇచ్చి కొడుకులను రంగంలోకి దింపే ప్లాన్ చేస్తున్నారు. పొన్నాల లక్ష్మయ్య సైతం కోడలు వైశాలిని మళ్ళీ రాజకీయాల్లోకి తీసుకురావాలనే యోచన చేస్తున్నారట. మాజీ ఎంపీ రేణుక చౌదరి కూడా ఎన్నికల్లో పోటీ చేయకుండా పార్టీ కోసం పనిచేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇలా సీనియర్ లు అని చెప్పుకునే నేతలు సైతం ఎన్నికలు అంటే జంకుతున్నారు. కాని పోటీకి దూరం అని చెప్తున్నప్పటికీ ఈ నేతలెవరు తమ నియోజకవర్గంలో మరో నేతకు అవకాశం ఇవ్వడం లేదు. తమ వారసులనే బరిలో దించాలని ఉబలాటపడుతున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నికల ఖర్చు భారీగా పెరిగింది. దీంతో పాటు చాలా మంది కొత్త నేతలు వెలుగులోకి వచ్చారు. నాగార్జున సాగర్ లో జానారెడ్డి లాంటి సీనియర్ నాయకుడు ఓ యువనేతపై ఓడిపోవడం సీనియర్లను కలవర పెడుతోంది. కొత్త ఓటర్లతో.. సీనియర్ నేతలకు వచ్చిన గ్యాప్ పూడ్చుకోవడం సాధ్యం కావడం లేదు. ఈ పరిస్థితుల్లోనే వారు ఎన్నికలంటే భయపడే పరిస్థితి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పోటీకి దూరం అనేది నిజమా? లేక ఏదైనా ఎత్తుగడతో ఇలా అంటున్నారా? అనేది నిదానంగా కాని తేలదు. చదవండి: గులాబీ ఎమ్మెల్యే ఎందుకు టెన్షన్లో ఉన్నారు?.. అక్కడ ఇదే హాట్ టాపిక్ -
రేణుకా చౌదరికి మంత్రి పువ్వాడ సవాల్.. దమ్ముంటే పోటీ చేసి గెలువ్!
సాక్షి, ఖమ్మం: ఖమ్మంలో పొలిటికల్ హీట్ పెరిగింది. మాజీ ఎంపీ రేణుకా చౌదరి, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మద్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇద్దరు నాయకులు సై అంటే సై అంటున్నారు. ఖమ్మం వేదిక నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. సోమవారం రేవంత్ రెడ్డి నిరుద్యోగ ర్యాలీలో మంత్రి అజయ్ కుమార్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు రేణుకా చౌదరి. అరే మంత్రి అజయ్ అని సంబోధిస్తూ.. అజయ్ను పాతాళంలోకి తొక్కలని వ్యాఖ్యలను చేశారు. ఖమ్మంలో మంత్రి అజయ్ కుమార్ గుట్టలను మింగేస్తున్నాడని ఆరోపణలు చేశారు. ఖమ్మం గడ్డ కాంగ్రెస్ అడ్డా అని, పదికి పది స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలకు పువ్వాడ తీవ్రస్థాయిలో కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. దమ్ముంటే రేణుక తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. ‘చిల్లరమల్ల మాటలు కాదు నువ్వు నా మీద రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. నాకు సంస్కారం ఉంది. నా తల్లిదండ్రులు అది నాకు నేర్పించారు. నాకు రేణుక చౌదరి లాగా మాట్లాడటం రాదు. న్యాయపరంగా నీచులపై పోరాటం చేస్తాను. అజయ్ కుమార్ను మాటలు అనడమే లక్ష్యంగా ఖమ్మంలో రాజకీయాలు చేస్తున్నారు. ప్రత్యర్ధులకు కలలో కూడా నేనే వస్తున్నట్లు ఉంది. రేణుకా చౌదరి అంటే పబ్భులు, గబ్భులు చరిత్ర అని ఫైర్ అయ్యారు మంత్రి. కేంద్రమంత్రిగా చేసిన నువ్వు ఖమ్మం జిల్లాకు చేసింది ఏంటి? ఖమ్మానికి గుండు సున్నా చూపించిన ఘనత రేణుకా చౌదరికే దక్కుతుంది’ అని మంత్రి పువ్వాడ ఫైర్ అయ్యారు. చదవండి: Karnataka: సిద్ధరామయ్యకు మద్దతుగా జగదీష్ శెట్టర్.. -
ప్రధాని మోదీపై పరువునష్టం కేసు వేస్తా: రేణుకా చౌదరి
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై పరువు నష్టం కేసు వేస్తానని కాంగ్రెస్ నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి తెలిపారు. 2018లో పార్లమెంట్లో ప్రధాని ప్రసంగిస్తుండగా ఓ విషయంపై తాను నవ్వానని, మోదీ తన నవ్వును శూర్పణఖ నవ్వుతో పోల్చారని ఆమె పేర్కొన్నారు. సభలో అందరిముందు అవమానిస్తూ మోదీ మాట్లాడిన మాటలు తనను బాధించాయని, అందుకు మోదీపై పరువు నష్టం దావా వేయబోతున్నట్లు చెప్పారు. ఇప్పుడు కోర్టులు ఎంత వేగంగా పనిచేస్తాయో చుద్దాం అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈమేరకు మోదీ పార్లమెంట్లో ప్రసంగించిన వీడియోను ఆమె ట్వీట్ చేశారు. ఇందులో.. రామాయణం సీరియల్ ప్రసారం అయిన కొన్ని రోజుల తర్వాత అలాంటి నవ్వు వినిపించినందున రేణుకా చౌదరి నవ్వును కొనసాగించడానికి అనుమతించాలని నరేంద్ర మోడీ రాజ్యసభ ఛైర్మన్ను కోరినట్లు కనిపిస్తుంది. కాగా ‘దొంగలందరి ఇంటిపేరు ఎందుకు మోదీయే ఉంటుంది?’ అంటూ వ్యాఖ్యలు చేసిన కేసులో కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీకి గుజరాత్లోని సూరత్ కోర్టు గురువారం రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఐపీసీ సెక్షన్లు 499, 500 కింద రాహుల్ను దోషిగా నిర్ధారించిన చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ హెచ్.హెచ్.వర్మ.. ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష ఖరారు చేసిన అనంతరం బెయిల్ మంజూరు చేశారు. ఈ ఆదేశాలపై కోర్టులో అప్పీలుకు వీలుగా జైలు శిక్షను 30 రోజులపాటు నిలిపేస్తున్నట్లు వెల్లడించారు. రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు శిక్ష విధించడాన్ని విపక్షాలన్నీ ఖండించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మోదీ తనను శూర్పణఖతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలపై కోర్టుకు వెళతానని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రాహుల్ విషయంలో కోర్టులు చాలా వేగంగా స్పందించాయని చెబుతూ.. ఈ కేసు విచారణను ఎంత వేగంగా పూర్తి చేస్తాయో చూడాలని ఆమె అన్నారు. చదవండి: ‘దొంగల ఇంటి పేరు మోదీ’ వ్యాఖ్యలపై... రాహుల్కు రెండేళ్ల జైలు This classless megalonaniac referred to me as Surpanakha on the floor of the house. I will file a defamation case against him. Let's see how fast courts will act now.. pic.twitter.com/6T0hLdS4YW — Renuka Chowdhury (@RenukaCCongress) March 23, 2023 -
ట్రాక్టరే కాదు పొక్లెయినర్ నడపటం కూడా వచ్చు: రేణుకా చౌదరి
సాక్షి, ఖమ్మం(సత్తుపల్లి): ‘సత్తుపల్లి సింగరేణి బాధితులకు ఇళ్లు కట్టిస్తే సరి.. లేకపోతే నాకు ట్రాక్టర్తో పాటు పొక్లెయినర్ నడపటం కూడా వచ్చు.. ఎవరు అడ్డు వస్తారో చూస్తా..’ అని కేంద్ర మాజీ మంత్రి గారపాటి రేణుకాచౌదరి హెచ్చరించారు. సత్తుపల్లిలో సోమవారం టీపీసీసీ అధికార ప్రతినిధి మానవతారాయ్ అధ్యక్షతన నియోజకవర్గ ప్రజాగర్జన సభ నిర్వహించారు. ఈ సభలో కేంద్ర మాజీ మంత్రి మాట్లాడుతూ పోలీసులు ఎమ్మెల్యేకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల్లో ఎవరికైనా ఏమైనా అయితే రేణుక నుంచి రేవంత్రెడ్డి వరకు ఇక్కడకు వస్తామని భరోసా ఇచ్చారు. డబ్బు తీసుకుని ఓట్లు వేయటం వల్లే ఇలాంటి పాలకులు వస్తున్నారని, ఇక సీఎం కేసీఆర్ను ఇంటికి పంపించాల్సిందేనన్నారు. వచ్చే ఎన్నికల్లో విలువైన ఓటుహక్కును దుర్వినియోగం చేయకుండా కాంగ్రెస్ అభ్యర్థిగా మానవతారాయ్ను ఎన్నుకోవాలని కోరారు. తాము అధికారంలోకి రాగానే సత్తుపల్లి జిల్లా ఏర్పాటుకు యత్నిస్తానని తెలిపారు. ట్రాక్టర్ నడుపుతున్న రేణుకాచౌదరి, పక్కన మానవతారాయ్ తదితరులు దమ్ముంటే సీబీఐ విచారణ చేయించాలి సింగరేణి నిధుల వినియోగంపై ఇప్పటికే ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేశానని మానవతారాయ్ తెలిపారు. పదమూడేళ్లుగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి పేదలకు గజం కూడా పంచలేదని మండిపడ్డారు. సభలో నున్నా రామకృష్ణ, మానుకొండ రాధాకిశోర్, ఎడవల్లి కృష్ణ, మద్ది శ్రీనివాసరెడ్డి, రావి నాగేశ్వరరావు, గాదె చెన్నారావు, వంకాయలపాటి వెంకటేశ్వరరావు, కట్ల రంగారావు, బుక్కా కృష్ణవేణి పాల్గొన్నారు. మట్టి అక్రమాలపై చర్యలు ఉండవా? రఘునాథపాలెం: ఖమ్మం శివారు పువ్వాడనగర్ గుట్టలపై అనుమతికి మించి మట్టి తవ్వినట్లు అధికారులు గుర్తించినా బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి ప్రశ్నించారు. మండలంలోని కోయచెలక రెవెన్యూ పరిధి పువ్వాడనగర్ గుట్ట వద్ద క్వారీని సోమవారం ఆమె పరిశీలించి మాట్లాడారు. ఈ విషయమై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఫిర్యాదు చేస్తామని తెలిపారు. నాయకులు మానుకొండ రాధాకిశోర్, దీపక్చౌదరి, మిక్కిలినేని నరేంద్ర, మందా బుచ్చిబాబు, మాధవిరెడ్డి, వాంకుడోత్ దీపక్నాయక్, దుంపటి నగేశ్ పాల్గొన్నారు. న్యాయం జరిగే వరకు పోరాటం ఖమ్మంరూరల్: ఇటీవల హత్యకు గురైన తమ్మినేని కృష్ణయ్య కుటుంబానికి న్యాయం జరిగే వరకు తాను పోరాడతానని కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి అన్నారు. మండలంలోని తెల్దారుపల్లిలో కృష్ణయ్య కుటుంబాన్ని ఆమె పరామర్శించి మాట్లాడారు. పోలీసులు ఇకనైనా రాజ్యాంగం ప్రకారం విధులు నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు రాధాకృష్ణ, కళ్లెం వెంకటరెడ్డి, ధరావత్ రాంమూర్తినాయక్, మద్ది శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎవరైనా అవమానిస్తే దుమారం ఎలా లేపాలో తమకు తెలుసు: రేణుకా చౌదరి
-
ఖమ్మంలో నన్ను ఎదురించే మొనగాడు లేడు : రేణుకా చౌదరి
సాక్షి, హైదరాబాద్: మర్రి శశిధర్రెడ్డి చాలా ఓపికతో ఉండే వ్యక్తి అని మాజీ మంత్రి రేణుకా చౌదరి అన్నారు. ఆయనకు ఏదో మనసుకు బాధ అనిపించి మాట్లాడి ఉంటారని తెలిపారు. ఈ విషయంలో రేవంత్రెడ్డే సర్దుకోవాలని సూచించారు. అన్ని పార్టీల్లో మనస్పర్ధలు ఉంటాయని, త్వరలోనే పరిస్థితి చక్కబడుతుందని పేర్కొన్నారు కాంగ్రెస్లో పరిణామాలు సహజమని, కొత్తేం కాదని రేణుక చౌదరి తెలిపారు. బీజేపీలో కూడా చాలా సమస్యలు, నేతల మధ్య విబేధాలు ఉన్నాయన్న మాజీ మంత్రి.. నితిన్ గడ్కరీ లాంటి వాళ్లనే బీజేపీ పక్కన పెట్టిందని ప్రస్తావించారు. పార్టీలో సీనియర్లను అవమానించే శక్తిమాన్ ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఎవరైనా అవమానిస్తే దుమారం ఎలా లేపాలో కూడా తమకు తెలుసన్నారు. ఖమ్మంలో తనను ఎదురించే మొనగాడు ఎవరూ లేరన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పార్టీ నుంచి బయటకు వెళ్లడం బాధాకరమని, మునుగోడులో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. -
వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన రేణుక చౌదరి
-
ఎస్సైతో దురుసు ప్రవర్తన!.. రేణుకా చౌదరిపై కేసు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ మాజీ ఎంపీ, ఆ పార్టీ సీనియర్ నేత రేణుకా చౌదరిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. గురువారం చలో రాజ్భవన్ సందర్భంగా.. పోలీసులతో ఆమె దురుసుగా ప్రవర్తించిన ఫుటేజ్లు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఎస్సై కాలర్ పట్టుకున్నారు ఆమె. దీంతో ఎస్ఐ ఉపేంద్ర బాబు ఫిర్యాదు మేరకు సెక్షన్ 353 కింద కేసు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు. చలో రాజ్భవన్లో పోలీసులతో దురుసు ప్రవర్తనపై. రేణుకా చౌదరిపై కేసు నమోదు అయ్యింది. ఘటన తర్వాత బలవంతంగా ఆమెను అరెస్ట్ చేసి గోల్కొండ పోలీస్ స్టేషన్కు తరలించారు. రేణుకా చౌదరిని రిమాండ్కు తరలించే యోచనలో ఉన్నారు పోలీసులు. అయితే దురుసు ప్రవర్తన ఆరోపణలపై రేణుకా చౌదరి స్పందించారు. వెనకాల నుంచి తోసేయడంతో.. ఎస్ఐ భుజం పట్టుకున్నానని, అవమానపరిచే ఉద్దేశం లేదని ఆమె తెలిపారు. యూనిఫాంను ఎలా గౌరవించాలో తెలుసని, పోలీసుల పట్ల గౌరవం ఉందని ఆమె అన్నారు. #WATCH | Telangana: Congress leader Renuka Chowdhury holds a Policeman by his collar while being taken away by other Police personnel during the party's protest in Hyderabad over ED summons to Rahul Gandhi. pic.twitter.com/PBqU7769LE — ANI (@ANI) June 16, 2022 -
ఎస్ఐ కాలర్ పట్టుకున్నరేణుకా చౌదరి
-
Hyderabad: ఉద్రిక్తంగా చలో రాజ్భవన్.. పోలీసుల సీరియస్
సాక్షి, హైదరాబాద్: రాహుల్ ఈడీ విచారణ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో రాజ్భవన్కు చేరుకున్నారు. పోలీసులను కూడా పెద్ద సంఖ్యలో మొహరించారు. కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఖైరతాబాద్ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు బైక్కు నిప్పుపెట్టి నిరసనకు దిగారు. బస్సుల రాకపోకలను కూడా అడ్డుకున్నారు. ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు పలువురు ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ఆంక్షలను ధిక్కరించి కాంగ్రెస్ నేతలు రాజ్భవన్ వైపు దూసుకెళ్లారు. దీంతో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, శ్రీధర్బాబు, గీతారెడ్డి, అంజన్కుమార్ సహా పలువురు నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై చొక్కా పట్టుకున్న రేణుకా చౌదరి కాంగ్రెస్ తలపట్టిన నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునే క్రమంలో పోలీసులు రేణుకాచౌదరిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆమెకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో రేణుకా చౌదరి ఎస్సై కాలర్ పట్టుకున్నారు. అయితే పోలీసులు ఆమెను బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కాంగ్రెస్ రచ్చపై పోలీసుల సీరియస్ కాంగ్రెస్ ఆందోళనపై పోలీసులు సీరియస్ అయ్యారు. డీసీపీ జోయల్ డేవిస్ చొక్కా పట్టుకున్న భట్టి విక్రమార్క, ఎస్ఐ కాలర్ పట్టుకున్న రేణుకా చౌదరి సహా పలువురు కాంగ్రెస్ నేతలపై పోలీసులు కేసు నమోదు చేయనున్నట్లు సమాచారం. రణరంగంగా మారిన ఖైరతాబాద్ రేవంత్రెడ్డి రోడ్డుపై బైఠాయించడంతో కాంగ్రెస్ చేపట్టిన చలో రాజ్భవన్ ఉద్రిక్తంగా మారింది. ఖైరతాబాద్ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు బైక్కు నిప్పుపెట్టి నిరసనకు దిగారు. బస్సుల రాకపోకలను కూడా అడ్డుకున్నారు. ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు పలువురు ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు పట్ల దురుసుగా ప్రవర్తించిన కాంగ్రెస్ ముఖ్యనేతలు రేవంత్రెడ్డి సహా పలువురిపై పోలీసులు కేసు నమోదు చేయనున్నారు. భారీగా ట్రాఫిక్ జామ్ రాహుల్ గాంధీపై ఈడీ విచారణకు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన చలోరాజ్భవన్ ఉద్రిక్తంగా మారింది. రాజ్భవన్కు వెళ్లే ఇరువైపులా రోడ్లను మూసివేయడంతో ఖైరతాబాద్ జంక్షన్లో భారీ ట్రాఫిక్ జాం అయింది. ఖైరతాబాద్-పంజాగుట్ట రూట్లో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. బేగంపేట మార్గంలోనూ ట్రాఫిక్ జాం అయింది. పోలీసులు ట్రాఫిక్ను రాజ్భవన్ రూట్లోకి అనుమతించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
రఘనందన్ రావు.. ఇన్నోవా వీడియో ఎందుకు చూపించలేదు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై విపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి.. టీఆర్ఎస్, బీజేపీపై నిప్పులు చెరిగారు. రేణుకా చౌదరి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రోజుల వ్యవధిలో తెలంగాణలో ముగ్గురు మహిళలపై లైంగిక దాడులు జరిగాయి. తెలంగాణలో పసి పిల్లలకు కూడా రక్షణ కరువైంది. ఇదేనా బంగారు తెలంగాణ అంటే..?. జూబ్లీహిల్స్ కేసులో అధికార పార్టీ నేతల పిల్లలు ఉన్నారు కాబట్టే.. ఈ కేసును నీరుగారుస్తున్నారు. వేలల్లో కేసులు నమోదయితే.. 46 కేసులలో మాత్రమే దోషులకు శిక్ష పడింది. జూబ్లీహిల్స్ మైనర్ కేసును వదిలేది లేదు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ ఎందుకు నోరు విప్పడంలేదు. షీ టీమ్స్ ఏమయ్యాయి..?. మైనర్ వీడియోను బయటపెట్టిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా దోషే. రఘునందన్ రావు ఇన్నోవా బండి వీడియో ఎందుకు బయటపెట్టలేదు. ఆయన సిగ్గుమాలిన ఆరోపణలు చేస్తున్నారు. ఖమ్మంలో బీజేపీ కార్యకర్త వాంగ్మూలంలో మంత్రి పువ్వాడనే తన చావుకు కారణం అని చెప్పినా ప్రభుత్వం నుంచి చర్యలు లేవు. నగరంలో రక్షణ లేనప్పుడు..పెట్టుబడులు ఎలా వస్తాయి. రాష్ట్రంలో పబ్బుల కల్చర్ పెరిగింది. లైసెన్స్లు ఇస్తుంది.. ఎక్సైజ్ శాఖ కాదా..?’’ అని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: ఎమ్మెల్యే రఘునందర్రావుపై కేసు నమోదు -
మాజీ మంత్రి రేణుకా చౌదరి ఇంట్లో చోరీ
సాక్షి, హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఇంట్లో చోరీ జరిగింది. రూ.3లక్షల నగదు,3.5 లక్షల బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్లు ఆమె తెలిపారు. ఈ మేరకు మంగళవారం బంజారాహిల్స్ పోలీసులకు రేణుకా చౌదదరి ఫిర్యాదు చేశారు. ఇంట్లో పనిచేసే ముగ్గురు వ్యక్తులను అనుమానిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పనిమనుషులందరినీ విచారించిన తర్వాతే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. -
కేంద్ర మాజీ మంత్రి రేణుకపై వారెంట్ ఎత్తివేత
సాక్షి, ఖమ్మం : ఖమ్మం కోర్టుకు హాజరైన కేంద్ర మాజీమంత్రి రేణుకాచౌదరిపై గత నెలలో జారీ చేసిన నాన్బెయిలబుల్ వారెంట్ను ఖమ్మం రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఎత్తివేసింది. గతంలో రేణుకా చౌదరిపై నమోదైన ఒక ప్రైవేట్ కేసుకు సంబంధించి స్పష్టమైన సమాచారం అందకపోవడంతో గత నెల 29న ఖమ్మంకోర్టు నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఆ కేసుకు సంబంధించి సోమవారం రేణుకాచౌదరి ఖమ్మం రెండో అదనపు జూనియర్ సివిల్జడ్జి కోర్టులో హాజరయ్యారు. కేసు వివరాలు పరిశీలించిన అనంతరం రేణుకాచౌదరిపై గతంలో జారీ చేసిన నాన్బెయిలబుల్ వారెంట్ను జడ్జి ఎత్తివేస్తూ రీకాల్ చేశారు. వచ్చే నెల 17వ తేదీకి కేసు వాయిదా వేశారు. -
రేణుకా చౌదరికి నాన్ బెయిల్బుల్ వారెంట్
సాక్షి, ఖమ్మం: కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ మహిళా నేత రేణుకా చౌదరికి నాన్ బెయిల్బుల్ వారెంట్ జారీ అయింది. చీటింగ్ కేసుకు సంబంధించి ఆమెకు ఖమ్మం జిల్లా రెండో అదనపు ఫస్ట్ క్లాస్ కోర్టు ఈ వారెంట్ ఇచ్చింది. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానంటూ రేణుక చౌదరి తన భర్తను మోసగించారంటూ కళావతి బాయి అనే మహిళ ఫిర్యాదు చేసింది. దీనిపై రేణుకా చౌదరిపై ఖానాపురం హవేలీ పోలీసులు సెక్షన్ 420, 417 కింద నాలుగేళ్ల క్రితం కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా కోర్టు పలుమార్లు రేణుకకు నోటీసులు జారీ చేసింది. అయితే ఆ నోటీసులు అందుకోకపోవడంతో పాటు, విచారణకు గైర్హాజరు కావడంతో న్యాయస్థానం వారెంట్ జారీ చేసింది. -
ఖమ్మం మెట్టు.. ఎవరిదో పట్టు!
విప్లవ రాజకీయాల పురిటిగడ్డ ఖమ్మం ఖిల్లాలో లోక్సభ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. ఇక్కడ ఎలాగైనా పాగా వేసేందుకు అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైనప్పటికీఆ తర్వాతి పరిణామాలతో పుష్పక విమానంలా మారిన‘కారు’లోని సైన్యం కలిసికట్టుగా పనిచేస్తే విజయం పెద్దకష్టమేమీ కానప్పటికీ, ఏం జరుగుతుందోననే మీమాంస ఆ పార్టీలో కనిపిస్తుండటం విశేషం. టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న నామా నాగేశ్వరరావుకు జిల్లాలోని ప్రధాన నేతల నుంచి ఎలాంటి సహకారం లభిస్తుందన్న దానిపైనే ఆయన విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. అయితే,వలసలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కాంగ్రెస్ మళ్లీ రేణుకా చౌదరిని రంగంలోకి దింపి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. బీజేపీ, సీపీఎం, న్యూడెమొక్రసీ బరిలో ఉన్నా.. ప్రభావంనామమాత్రమేనని, టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని స్థానిక పరిస్థితులు చెబుతున్నాయి.-మేకల కల్యాణ్ చక్రవర్తి టీఆర్ఎస్: బలం,బలగంతో జోష్ తెలంగాణ రాష్ట్ర సమితి విషయానికి వస్తే.. ఖమ్మం లోక్సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో పరాజయం పాలైనప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో పెద్దసంఖ్యలో నాయకులు, ఎమ్మెల్యేలు, కేడర్తో పరిపుష్టంగా కనిపిస్తోంది. అన్ని నియోజకవర్గాల్లో మంచి పట్టు సాధించిన గులాబీ దళానికి పెద్ద బలగమే కనిపిస్తోంది. సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అభ్యర్థి నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, పువ్వాడ అజయ్కుమార్, సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్రెడ్డి, రాములు నాయక్, జెడ్పీ చైర్మన్ కవిత, డీసీసీబీ మాజీ చైర్మన్ విజయబాబు, గత ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు, ఆయా నియోజకవర్గాల్లోని ముఖ్య నేతలు అండగా ఉన్నారు. వీరంతా నామా నాగేశ్వరరావు విజయానికి కృషి చేస్తే సానుకూల ఫలితం పెద్ద కష్టమేమీ కాదు. కానీ, నామా అభ్యర్థిత్వమే ఇక్కడ సమస్య అవుతుందా అనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై ఆయా నియోజకవర్గ ప్రజలు గుర్రుగానే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ టీడీపీ నుంచి తీసుకువచ్చి టీఆర్ఎస్ అభ్యర్థిగా నామాను బరిలోకి దించడం సామాన్య ప్రజలతో పాటు టీఆర్ఎస్ కేడర్కు కూడా రుచించడం లేదనే వాదన ఉంది. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారక రామారావు.. పథకం ప్రకారమే నామా నాగేశ్వరరావును బరిలో దించారని, జిల్లాలోని పార్టీ నేతలంతా ఆయన విజయానికి కృషి చేస్తారని, నామా విజయం తథ్యమని టీఆర్ఎస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఖమ్మం, సత్తుపల్లి, కొత్తగూడెం, వైరా, పాలేరు నియోజకవర్గాల్లో వైరి వర్గాలుగా తలపడిన రెండు గ్రూపులూ ఇప్పుడు తమ గూటికే రావడం కచ్చితంగా లాభిస్తుందని అంచనా వేస్తున్నారు. ‘పొంగులేటి’ కదలికలను బట్టి.. ఖమ్మం లోక్సభ నియోజకవర్గ రాజకీయాన్ని పరిశీలిస్తే ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయం సాధించాలంటే మాత్రం సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహకారం పరిపూర్ణంగా ఉండాల్సిందేనని అర్థమవుతుంది. ఖమ్మం, మధిర, వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం, పాలేరు.. ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ ఆయనకు సొంత కేడర్ ఉంది. ఎంపీగా గెలిచిన ఐదేళ్లలో ఆయన పట్టు నిలుపుకునేందుకు మంచి ప్రయత్నమే చేశారు. ఆర్థికంగా, రాజకీయంగా కేడర్కు అందుబాటులో ఉంటూ తనకంటూ ఎప్పుడు పిలిచినా పలికే కేడర్ను తయారు చేసుకున్నారు. ముఖ్యంగా అశ్వారావుపేట, మధిర, వైరా, కొత్తగూడెం నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థుల కన్నా ఎక్కువ పట్టు సాధించారు. గ్రామీణ ప్రాంత సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, సొంత ఖర్చుతో కొన్ని గ్రామాల సమస్యలు పరిష్కరించడం, ఏ కష్టమున్నా, కార్యక్రమమున్నా తానున్నాంటూ ఆర్థిక సాయం చేయడంతో ఎంపీగా పొంగులేటి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, కారణమేదైనా టీఆర్ఎస్ ఆయనకు టికెట్ నిరాకరించడంతో పొంగులేటి కేడర్ అంతా పూర్తిగా నైరాశ్యంలో ఉంది. తమ నాయకుడు పోటీ చేయడం లేదన్న నిస్తేజం నుంచి ఆయన అనుచరులు ఇంకా కోలుకోలేదు. పొంగులేటి కూడా శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంతోనే బహిర్గతమయ్యారు తప్ప ఇప్పటి వరకు ఎక్కడా తన అనుచరులకు దిశానిర్దేశం చేయలేదు. అయితే, ఏప్రిల్ 4న ఖమ్మంలో జరిగే బహిరంగసభలో సీఎం కేసీఆర్ పొంగులేటికి ఇచ్చే ప్రాధాన్యం, హామీ గురించి ఆయన అనుచరగణం ఎదురుచూస్తోంది. ఆ సభ తర్వాతే పొంగులేటి అనుచరుల్లో పూర్తి స్థాయి కదలిక వచ్చే అవకాశం ఉంది. అసెంబ్లీ స్థానాల్లో ఎవరి బలమెంత? ఖమ్మం: పట్టణ ఓటర్లు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్కు సానుకూలత కనిపిస్తోంది. ప్రస్తుత ఎమ్మెల్యే పువ్వాడ అజయ్కుమార్ (టీఆర్ఎస్) గట్టి పట్టున్న నాయకుడు. ఆయనకు తోడు ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కూడా కేడర్ ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి రేణుక వర్గం కూడా ఉన్నా కాంగ్రెస్ సంస్థాగతంగా పట్టు కోల్పోయింది. అయితే, ఇక్కడ నామా, రేణుకల్లో కమ్మ సామాజిక వర్గం ఎవరిని ఎంచుకుంటుంది..? మైనార్టీలు, మున్నూరు కాపులు ఎవరివైపు మొగ్గు చూపుతారనేవి అభ్యర్థుల జాతకాలను తారుమారు చేయనున్నాయి. పాలేరు: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరీ ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్రెడ్డిని గెలిపించాయి. ఇప్పుడు ఉపేందర్రెడ్డి టీఆర్ఎస్లో చేరుతున్నట్టు ప్రకటించగా, టీడీపీ కేడర్ కూడా నామాతో పాటు టీఆర్ఎస్ గూటికి చేరింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు తప్ప నేతలు లేని పరిస్థితి. అయితే, ఉపేందర్రెడ్డి పార్టీ మార్పుపై ప్రజల్లో కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. మొత్తానికి పాలేరు నియోజకవర్గంలో టీఆర్ఎస్దే పైచేయి అయ్యే అవకాశాలు మెండుగాకనిపిస్తున్నాయి. మధిర: రెడ్డి, ఎస్సీ ఓట్లు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గం ఎటు మొగ్గుచూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఇక్కడి నుంచి సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్నందున కాంగ్రెస్కు మెజార్టీ తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఆయనపై ఉంది. అయితే, టీఆర్ఎస్ కూడా బలంగానే కనిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో టీఆర్ఎస్ వైపే మొగ్గుచూపిన రెడ్డి సామాజికవర్గం ఈసారి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి టికెట్ రాకపోవడంతో టీఆర్ఎస్పై గుర్రుగా ఉందని స్థానిక పరిస్థితులు చెబుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి రేణుకకు కూడా ఇక్కడి ప్రజలతో నేరుగా సంబంధాలున్నాయి. నామాకు ఇక్కడ మెజార్టీ రావాలంటే పొంగులేటి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటేనే సాధ్యమవుతుంది. వైరా: ఈ నియోజకవర్గంలో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మంచి పట్టుంది. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన స్వతంత్ర అభ్యర్థి రాములు నాయక్ టీఆర్ఎస్లో చేరారు. ఆయనకు గత ఎన్నికల్లో సహకరించి పనిచేసింది కాంగ్రెస్ నేతలే. అయినా, మహాకూటమి తరఫున నిలబడ్డ సీపీఐ అభ్యర్థికి 25 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. అయితే, రాములు నాయక్, ఆయన ప్రత్యర్థి మదన్లాల్కు కలిపి లక్ష ఓట్ల వరకు వచ్చాయి. ఇప్పుడు ఇద్దరూ టీఆర్ఎస్లోనే ఉన్నారు. అయితే, మదన్లాల్ కంటే ఎక్కువ పొంగులేటి టీఆర్ఎస్ పక్షాన ఇక్కడ ప్రభావం చూపగలరు. కాంగ్రెస్ అభ్యర్థి పక్షాన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, స్థానిక కాంగ్రెస్ నాయకత్వం సహకారం తప్పనిసరి. కొత్తగూడెం: ఇక్కడ కూడా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు టీఆర్ఎస్లో చేరారు. కొత్తగూడెంలో కాంగ్రెస్ అంటేనే వనమా.. వనమా అంటేనే కాంగ్రెస్ అనే పరిస్థితి. కానీ, ఆయన కూడా టీఆర్ఎస్లో చేరడంతో యడవెల్లి కృష్ణతో పాటు నలుగురైదుగురు నేతలు మాత్రమే పార్టీలో మిగిలారు. వనమా, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, ఇక్కడ కూడా మంచి పట్టున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు కలిసి పనిచేస్తే ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్కు భారీ మెజార్టీ తప్పదు. అయితే, వనమాతో పాటు కొందరు నేతలే వెళ్లారని, కేడర్ తమతోనే ఉందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. సత్తుపల్లి: ఎమ్మెల్యే ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన సండ్ర వెంకటవీరయ్య కూడా టీఆర్ఎస్ పక్షానే చేరారు. ఈయనతో డీసీసీబీ మాజీ చైర్మన్ విజయబాబు కలిసి పనిచేస్తున్నారు. వీరిద్దరితో పాటు ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు ఇక్కడ నామా విజయం కోసం పనిచేస్తే ఇక్కడా టీఆర్ఎస్కు మంచి మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. అయితే, పార్టీ మారిన సండ్రపై నియోజకవర్గ ప్రజల్లో కొంత అసహనం కనిపిస్తోంది. నామా కూడా ఎన్నికల ముందే పార్టీ మారి బరిలో నిలవడంతో ఇక్కడి ఓటర్లు కొంత ప్రతికూల అభిప్రాయంతో ఉన్నట్టు కనిపిస్తోంది. అశ్వారావుపేట: ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ విషయానికి వస్తే అటు పార్టీగా కన్నా ఎంపీ పొంగులేటి వర్గంగానే బలంగా కనిపిస్తుంది. ఇక్కడ స్థానిక నేతలు ఎక్కువ మంది పొంగులేటి అనుచరులే. గతంలో ఎమ్మెల్యేగా పని చేసిన తాటి వెంకటేశ్వర్లు కూడా ఆయన వెంట ఉన్న నాయకుడే. తాటితో పాటు ఆలపాటి రాము ఇతర నేతలు సహకారం సంపూర్ణంగా లభించాల్సి ఉంటుంది. ఇక, ఎమ్మెల్యేగా గెలిచిన మెచ్చా నాగేశ్వరరావు (టీడీపీ), పార్టీ కేడర్ కాంగ్రెస్కు ఇక్కడ బలాలుగా కనిపిస్తున్నాయి. ప్రజల్లో మాత్రం మిశ్రమ స్పందన కనిపించింది. 16 సార్లు.. 10 మంది ఎంపీలు ఖమ్మం లోక్సభకు మొత్తం 16 సార్లు ఎన్నికలు జరిగితే 10 మంది మాత్రమే ఎంపీలుగా ప్రాతినిధ్యం వహించారు. అంటే ఇక్కడ వరుసగా గెలవడం పరిపాటి అయిపోయింది. కానీ, 1991 తర్వాత ఇక్కడి రాజకీయాల్లో మార్పు వచ్చింది. అప్పటివరకు పదిసార్లు ఎన్నికలు జరిగితే నలుగురే ఎంపీలుగా గెలుపొందారు. కానీ 91లో పి.వి.రంగయ్యనాయుడు గెలిచిన తర్వాత ఒక్కసారి తప్ప ప్రతిసారీ ఖమ్మం ఎంపీ మారుతూనే వచ్చారు. 91లో రంగయ్యనాయుడు, 96లో తమ్మినేని వీరభద్రం, 98లో నాదెండ్ల భాస్కరరావు, 99లో రేణుకా చౌదరి గెలిచారు. 2004లోనూ రేణుకాచౌదరి గెలవగా, 2009లో నామా నాగేశ్వరరావు, 2014లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెలిచారు. ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ పొంగులేటి బరిలో లేకపోవడంతో 2019 ఎన్నికల్లోనూ ఖమ్మం ఎంపీ మారబోతున్నారు. కాంగ్రెస్: కేడర్..లీడర్ కరువు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలంతా ఓ వైపు నిలబడగా, ఖమ్మం జిల్లా ప్రజానీకం మాత్రం మరోవైపు నిలబడింది. ఎవరూ ఊహించని విధంగా కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి అభ్యర్థులు 8 మంది ఇక్కడ విజయం సాధించారు. ఒకరు స్వతంత్ర అభ్యర్థి గెలుపొందగా, మరొకరు టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచారు. ఖమ్మం లోక్సభ పరిధిలోని కొత్తగూడెం, మధిర, పాలేరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందగా, సత్తుపల్లి, అశ్వారావుపేటల్లో కాంగ్రెస్ మద్దతుతో టీడీపీ గెలిచింది. వైరాలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి కాంగ్రెస్ శ్రేణుల పూర్తి సహకారంతో విజయం సాధించారు. అంటే ఖమ్మం లోక్సభ పరిధిలో ఒక్క ఖమ్మం అసెంబ్లీ తప్ప మిగిలిన అన్ని చోట్లా కాంగ్రెస్ విజయం సాధించింది. ఖమ్మంలో కూడా టీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్పై ప్రస్తుతం టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నామా నాగేశ్వరరావు టీడీపీ నుంచి పోటీచేసి ఓడిపోయారు. లోక్సభ పరిధిలో పోలైన ఓట్ల ఆధారంగా కూడా కాంగ్రెస్కు టీఆర్ఎస్ కంటే ఆధిక్యత ఉంది. ఈ పరిస్థితుల్లో ఖమ్మం లోక్సభ పరిధిలో తమ విజయం నల్లేరు మీద నడకే అని రాజకీయ వర్గాలు భావించాయి. కానీ, రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోయింది. కాంగ్రెస్ రెబల్ లావుడ్యా రాములు నాయక్ (వైరా), కొత్తగూడెం, పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, కందాల ఉపేందర్రెడ్డి, సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. తాజాగా కాంగ్రెస్ కీలకనేత పొంగులేటి సుధాకర్రెడ్డి కూడా పార్టీ వీడిపోవడంతో ఆ ప్రభావం కూడా రేణుక విజయావకాశాలపై పడనుంది. ప్రస్తుతం మధిర, అశ్వారావుపేటల్లో మాత్రమే కాంగ్రెస్కు ఎమ్మెల్యేలు మిగిలారు. ఆ రెండు స్థానాలు తప్ప అన్నిచోట్లా ఎమ్మెల్యేలు, నేతలు టీఆర్ఎస్ గూటికి చేరడంతో కాంగ్రెస్ కకావికలమైంది. కనీసం ప్రచారానికి, పోలింగ్ వ్యవస్థ నిర్వహణకు కేడర్ లేక కొట్టుమిట్టాడుతోంది. ఈ పరిస్థితుల్లో అధిష్టానంతో పోరాడి మరీ టికెట్ తెచ్చుకున్న రేణుకాచౌదరి గెలుపు కోసం కష్టపడుతున్నారు. నియోజకవర్గ స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి ఉన్న కొంతమంది నేతలు, కేడర్ను ఉత్తేజితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఖమ్మం లోక్సభ పరిధిలో కాంగ్రెస్ ప్రచారం నియోజకవర్గ స్థాయి సమావేశాల వరకు మాత్రమే వచ్చింది. ఏడాదికి మూడు నెలలే పని– రాజు, జ్యూస్ వ్యాపారి, అశ్వారావుపేట జ్యూస్ వ్యాపారం ఏడాది మొత్తానికి మూడు నెలలే ఉంటుంది. మిగిలిన 9 నెలలు ఖాళీగా ఉండాల్సి వస్తోంది. మాలాంటి సీజనల్ వ్యాపారులకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించాలి. అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం కోసం మంచి విధానాలు రూపొందించాలి. అలాంటి వారికే మా ఓటు వేస్తాం. మాలాంటోళ్లకష్టాలు తీరిస్తే బాగుండు– పానుగంటి నర్సింహారావు, సత్తుపల్లి ఎర్రని అగ్గిలో కూడా పని చేయాల్సిందే.. ఎండా లేదు.. వానా లేదు.. పగలస్తమానం కష్టపడితేనే కడుపునిండేది. మా గురించి అసలు ఎవరూ పట్టించుకోవటం లేదు. పని ఉంటే తింటున్నాం.. లేకపోతే పస్తులుండాల్సిందే. గతంలో మా కమ్మర కులం ఎస్టీలో ఉండేది. ఇప్పుడు తీసేశారు. మళ్లీ ఎస్టీలో చేర్చితేనే మా బతుకులు బాగుపడతాయి. చిరువ్యాపారులకు ఆసరా కావాలి– జోజి, కొబ్బరి బోండాల వ్యాపారి, వైరా మాలాంటి చిరు వ్యాపారులను ప్రభుత్వాలు ఆదుకోవాలి. అధికార పార్టీకి దగ్గర ఉన్న వారికి, పలుకుబడి ఉన్న వారికే ప్రభుత్వ సాయం, రుణాలు అందుతున్నాయి. మాలాంటి వారిని పట్టించుకున్న వారే లేరు. లోక్సభ ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలో ఇంకా నిర్ణయించుకోలేదు. రుణాలు ఇచ్చి ఆదుకోవాలి– అక్కిరాజు శివకృష్ణ, పండ్ల వ్యాపారి, సత్తుపల్లి మా కుటుంబం అంతా పండ్లు, కొబ్బరి బోండాల వ్యాపారంపైనే ఆధారపడి బతుకుతున్నాం. 30 ఏళ్లుగా ఇదే వృత్తి చేస్తున్నాం. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. వడ్డీలకు తెచ్చి వ్యాపారాలు చేస్తున్నాం.. ఏం మిగలడం లేదు. అప్పు తీర్చడానికే సరిపోతుంది. మాలాంటోళ్లకు బ్యాంకుల నుంచి లోన్లు ఇప్పిస్తే కొంతలో కొంత కష్టం తీరుతుంది. పార్టీలు మారడం తప్ప ప్రజలకేం ఒరిగేది లేదు– ఖాజా, టీ వ్యాపారి నా టీకొట్టు దగ్గరకు వచ్చే నాయకులు, కార్యకర్తలు రోజుకో పార్టీ కండువా కప్పుకొని వస్తున్నారు. ఇదేమిటంటే మా ఎమ్మెల్యే పార్టీ మారాడు.. మా ఎంపీ పార్టీ మారాడు.. మేమూ మారిపోయామంటున్నారు. ఒక ఎన్నికల్లో పోటాపోటీగా తిరిగిన వారు కలిసి తిరుగుతున్నారు. ప్రజలే అమాయకులు.. వీరి స్వార్థం కోసం ప్రజల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు. లోక్సభ ఓటర్లు పురుషులు 7,39,525 మహిళలు 7,73,503 ఇతరులు 66 మొత్తం ఓటర్లు 15,13,094 లోక్సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లుఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి,అశ్వారావుపేట, కొత్తగూడెం. -
నా ప్రచారాస్త్రం నేనే..
‘ఖమ్మం నా రాజకీయ ఎదుగుదలకు గుమ్మం. నాకు జన్మతః వచ్చిన ప్రశ్నించే తత్వాన్ని జిల్లా మహిళలు స్వాగతించారు. ఎవరైనా అక్రమంగా, అమానుషంగా ప్రవర్తిస్తే ఇదేమిటని ప్రశ్నించే చైతన్యాన్ని అలవరుచుకున్నారు మహిళలు. జిల్లాను అభివృద్ధి చేయాలన్న నా సంకల్పానికి ఖమ్మం ప్రజల సహకారం ఎల్లవేళలా ఉంటోంది. ఇక ముందు కూడా ఉండబోతుంది’.. అంటోన్న కేంద్ర మాజీ మంత్రి, ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గారపాటి రేణుకాచౌదరి ‘సాక్షి’తో పంచుకున్న విషయాలు ఆమె మాటల్లోనే.. ఉక్కులాంటి ఉపాధి... బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పడం ద్వారా ఉపాధి అవకాశాలను పెంపొందించడం, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా పరిశ్రమలు స్థాపించడం, జిల్లాలో 80 శాతం పైగా వ్యవసాయ రంగంపై ఆధారపడిన రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించడం, సమీకృత వ్యవసాయ విధానం తీసుకురావడం నా ముందున్న తక్షణ కర్తవ్యం. సమస్యలన్నీ ఎరుకే ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలోని ప్రతి పల్లెతో నాకు ఆత్మీయ అనుబంధం ఉంది. అక్కడి అవసరాలపై స్పష్టమైన అవగాహన ఉంది. ఏ ప్రాంతంలో ఏ సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారో 20 ఏళ్ల నుంచి చూçస్తూ్తనే ఉన్నా. అనేక సమస్యలను.. సామాజిక రుగ్మతలను రూపు మాపాను కూడా. ఇంకా చేయాల్సింది చాలానే ఉంది. సీజనల్గా వచ్చే వ్యాధులను అరికట్టడానికి కార్యాచరణ లేకుండా అభివృద్ధిని అంకెల్లో చూపెట్టడం వల్ల ఏం ప్రయోజనం? జిల్లాలో దోమల బెడద తగ్గనే లేదు. రేణుకా చౌదరి స్వస్థలం: విశాఖపట్నం భర్త పేరు: శ్రీధర్ చౌదరి సంతానం: ఇద్దరు కుమార్తెలు తల్లిదండ్రులు: వసుంధరరావు, కె.ఎస్.రావు పుట్టిన తేది: ఆగస్టు 13, 1954 విద్యార్హతలు: పీజీ (ఇండస్ట్రియల్ సైకాలజీ) రాజకీయ ప్రస్థానం: 1986, 1992, 2012లలో రాజ్యసభ మెంబర్, 1999–2004, 2004 – 2009 లోక్సభ మెంబర్ మంత్రి పదవులు: 1997– 98లో కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ, 2004 – 2006కేంద్ర పర్యాటక శాఖ, 2006– 2009మహిళ, శిశు అభివృద్ధిశాఖ. నా ప్రచారాస్త్రం నేనే.. ఖమ్మం ఎంపీగా జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి, కార్గో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు శ్రమించాను. కార్యరూపం దాల్చే సమయంలో ప్రభుత్వం మారింది. ప్రభుత్వ గ్రాంటుతో ఏర్పాటు చేసిన ఇర్రేడియేషన్ ప్లాంట్ ఊసే లేకుండా పోయింది. రెండో కేంద్రీయ విద్యాలయం నా హయాంలో మంజూరైతే ఇప్పటికీ భవనాల నిర్మాణం పూర్తి కాలేదింకా. నా ప్రచారానికి ప్రధాన అస్త్రాన్ని నేనే. పాలేరు నుంచి పర్ణశాల వరకు పర్యాటక అభివృద్ధి చేయడంతో పాటు నియోజకవర్గంలో కుంటుపడిన అభివృద్ధిని మళ్లీ పట్టాలెక్కించడమే ప్రస్తుతం నా లక్ష్యాలు. నా పోరాటం వ్యక్తులతో ఉండదు. అవినీతి, అరాచకత్వం, ప్రజలకు జరగాల్సిన అభివృద్ధిపై మాత్రమే ఉంటుంది. నేను చేసిన పనులు, ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకమే నన్ను గెలిపిస్తాయి. గృహహింస నిరోధక చట్టం మహిళలు రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో అత్యున్నత స్థితికి చేరాలి. గృహహింస నిరోధక చట్టంతో మహిళలకు చట్టపరమైన రక్షణ లభించింది. ఆ చట్టానికి రూపకల్పన జరిగింది నేను కేంద్రమంత్రిగా ఉన్న సమయంలోనే. మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండేందుకు ఒక మహిళగా నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను.– మాటేటి వేణు, సాక్షి–ఖమ్మం ప్రతినిధి -
రేణుక ప్రాబల్యం తగ్గుతోందా?
సాక్షి, మధిర: దశాబ్దకాలానికిపైగా ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి కీలకంగా పనిచేశారు. ఒక రకంగా శాసించారు. ఏకచత్రాధిపత్యంగా పట్టుసాధించిన ఆమె ప్రాబల్యం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో నానాటికీ తగ్గిపోతోందనే ప్రచారం జరుగుతోంది. ఖమ్మం పార్లమెంట్ సభ్యురాలిగా 1999, 2004 ఎన్నికల్లో గెలుపొంది కేంద్ర పర్యాటకశాఖ మంత్రిగా, కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. నాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేంద్రమంత్రి హోదాలో సుడిగాలి పర్యటనలు చేసి కాంగ్రెస్లో తన వర్గాన్ని బలోపేతం చేసుకున్నారు. ఆమె చెప్పిందే వేదంగా నడిచింది. కోట్లాదిరూపాయల నిధులు జిల్లా అభివృద్ధికి మంజూరు చేయించారు. అయితే 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు చేతిలో ఆమె ఓటమి చెందారు. 2014 ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరగ్గా.. ప్రస్తుత ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ అధిష్టానం వద్ద ఆమెకు ఉన్న పలుకుబడితో రాజ్యసభ సభ్యురాలిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఈ పదవీకాలం కూడా ముగిసింది. ఈ క్రమంలో జిల్లా కాంగ్రెస్లో మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ప్రాబల్యం పెరుగుతూ వచ్చింది. భట్టి సహకారంతోనే ఐతం సత్యం కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడయ్యారు. భట్టి అనుచరుడిగా ఉన్న సత్యంను పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకుండా అడ్డుకునేందుకు ఆమె అప్పట్లో ప్రయత్నాలు చేసినప్పటికీ విఫలమైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఐతం సత్యం మృతి చెందిన తర్వాత ఆ పదవిని నేటికీ భర్తీ చేయలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆమె వర్గీయులకు టికెట్లు దక్కలేదు. కొత్తగూడెం నియోజకవర్గంలో రేణుకా అనుచరుడిగా ఉన్న ఎడవల్లి కృష్ణకు కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో బీఎల్ఎఫ్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఖమ్మం సీటుకోసం ఆమె అనుచరులు పోట్ల నాగేశ్వరరావు, మానుకొండ రాధాకిషోర్, పాలేరు సీటుకోసం రాయల నాగేశ్వరరావు ప్రయత్నించినప్పటికీ ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ప్రజాకూటమి పొత్తుల్లో భాగంగా ఖమ్మం సీటు టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు.. పాలేరు సీటు కందాల ఉపేందర్రెడ్డికి ఇచ్చారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆమె పట్టుకోల్పోతున్నారని రాజకీయపార్టీలు చర్చించుకుంటున్నాయి. అంతేకాంకుండా రేణుకా వర్గీయులుగా మధిర మండలంలో గెలుపొందిన ఇద్దరు సర్పంచ్లు, ఒక ఎంపీటీసీ సభ్యుడితోపాటు కొంతమంది అనుచరులు టీఆర్ఎస్లో చేరారు. వైరా నియోజకవర్గంలో రేణుకాచౌదరి వర్గీయులు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సూరంపల్లి రామారావు, కారేపల్లి మాజీ ఎంపీపీ పగడాల మంజుల తదితరులు పార్టీకి రాజీనామా చేసి.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా బరిలో నిలిచిన లావుడ్యా రాములు నాయక్కు మద్దతు ఇచ్చారు. దీనికితోడు మల్లు భట్టి విక్రమార్క మధిర అసెంబ్లీ స్థానంనుంచి మూడుసార్లు గెలుపొందడం.. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టం.. రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజా కూటమి అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో ఆయనకు అధిష్టానం దగ్గర పరపతి పెరిగినట్లు క్షేత్రస్థాయి కేడర్లో చర్చజరుగుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్గాంధీ వచ్చినప్పుడు నిర్వహించిన బహిరంగ సభల్లో కూడా రేణుకా చౌదరికి మాట్లాడే అవకాశం కూడా రాకపోవడంపై ఆమె వర్గీయులు ఆవేదనకు గురయ్యారు. అదేవిధంగా ఈ సారి కాంగ్రెస్ తరఫున భట్టికి సీఎల్పీ లీడర్ కానీ, మరేదైనా ప్రాధాన్యత కలిగిన పార్టీ పదవి కట్టబెట్టే అవకాశం ఉందని సమాచారం. దీంతో జిల్లా కాంగ్రెస్లో భట్టి పట్టు సాధిస్తుండగా.. రేణుకాచౌదరి ప్రాధాన్యత తగ్గిపోతుందని వివిధ పార్టీల నాయకులు చర్చించుకుంటున్నారు. -
అవసరమైతే సీనియర్ నాయకులు త్యాగాలు చేస్తారు
-
ముందస్తు ఎన్నికలుకు మేము ముందే సిద్ధం
-
ముందస్తు ఎన్నికలు వస్తాయని ఏడాది క్రితమే చెప్పా!
సాక్షి, ఖమ్మం : ముందుస్తు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సమాయత్తమై ఉందని, ఈ యుద్ధానికి తాము సిద్ధమని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి అన్నారు. సరైన సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు. కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించడంతో ఆ పార్టీలో రోజుకోక వ్యవహారం వెలుగుచూస్తోందని అసమ్మతిని ఉద్దేశించి పేర్కొన్నారు. ప్రభుత్వం నడిపే అనుభవం తమకు ఉందన్నారు. సంవత్సరం ముందే ముందస్తు ఎన్నికలు వస్తాయని తాను ఆన్ రికార్డు చెప్పానని ఆమె పేర్కొన్నారు. పొత్తులపై స్పందిస్తూ ప్రతిపక్ష పార్టీలతో మాట్లాడుతున్నామని, ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపడం, ప్రజలకు మేలు చేయడం లక్ష్యంగా పొత్తులు ఉంటాయని అన్నారు. టీడీపీ- కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటాయని జరుగుతున్న ప్రచారంపై ప్రస్తావించగా ఆ ప్రచారం నిజమయ్యేవరకు తాను కామెంట్ చేయనని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం, ఖమ్మం జిల్లా నుంచి అసెంబ్లీకి పోటీ చేయడం తదితర విషయాల్లో పార్టీ అధినాయకత్వం నిర్ణయం, ప్రజాభిప్రాయం ప్రకారం నడుచుకుంటానని చెప్పారు. -
వైరా టికెట్ ఇప్పిస్తానని చెప్పి..
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి టికెట్ ఇప్పిస్తానని చెప్పి పలువుర్ని మోసం చేశారని కాంగ్రెస్ నేత రవిచంద్ర చౌహాన్ ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే టికెట్ మీకేనంటూ.. ఆమె చాలా మంది దగ్గర డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. దీనిలో భాగంగా 2014లో డాక్టర్ రాంజీ నాయక్ దగ్గర కోటి 30లక్షల రూపాయలు తీసుకున్నారని, తిరిగి డబ్బులు ఇవ్వమని అడిగినందుకు కేసులు పెట్టించారని అన్నారు. వైరా టిక్కెట్ ఇప్పిస్తానని చెప్పి.. రేణుకా చౌదరి వైరా టికెట్ ఇప్పిస్తానని చెప్పి తమ వద్ద కోటి 30లక్షలు రూపాయలు తీసుకున్నారని రాంజీ నాయక్ భార్య కళావతి ఆరోపించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా రేణుకా చౌదరిని డబ్బులు అడుగుతున్నాపట్టించుకోవటం లేదని వాపోయారు. ఈ నెల 14వ తేదీన తెలంగాణ పర్యటనకు రానున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలుస్తానని అన్నారు. అలా కుదరకపోతే ఢిల్లీ వెళ్లి ధర్నా చేస్తానన్నారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని ఆమె స్పష్టం చేశారు. -
వీళ్లు ఆయనకు వారసులా?..ఖర్మ!
సాక్షి, న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, త్రిపుర సీఎం విప్లవ్ కుమార్ దేవ్ల వ్యాఖ్యలు పార్టీకి తలనొప్పి తెచ్చిపెడుతున్నాయి. విచిత్రమైన వ్యాఖ్యలతో బీజేపీ ముఖ్యమంత్రులిద్దరూ వార్తల్లో నిలిచింది తెలిసిందే. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ వీరి వ్యాఖ్యలపై మండిపడుతోంది. తాజాగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి వీళ్ల వ్యవహారంపై స్పందించారు. ‘ఒకయాన(విజయ్ రూపానీ) గూగుల్ను-నారదుడ్ని పోలుస్తూ మాట్లాడతారు. ఆయన జ్ఞానం ఇంతేనేమో. ఇంకోకరేమో(విప్లవ్) మహాభారత కాలంలో ఇంటర్నెట్ ఉందంటాడు. ఆయన అక్కడితోనే ఆగలేదు. యువకులను ఉద్దేశించి ‘ఉద్యోగాలేం చేస్తారు.. పాన్ షాపులు పెట్టుకుని బతకండి’ అంటాడు. మరోసారి అందాల పోటీలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తాడు. వాళ్లిద్దరి మాటలు నాకు ఆశ్చర్యం కలిగించాయి. మోదీగారి వారసులు ఇలా ఉన్నారు. వీళ్లేం ముఖ్యమంత్రులు. వీళ్లా ప్రజల్ని పాలించేంది?. జనాలకు వీళ్లసలు ఏం చెప్పదల్చుకున్నారు. ఇది ఇంతటితోనే ఆగుతుందని మాత్రం నేను అనుకోవట్లేదు’ అని రేణుకా చౌదరి తెలిపారు. సోమవారం సాయంత్రం ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆమె పై వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే విప్లవ్ కుమార్ దేవ్కు అధిష్టానం తమ ఎదుట హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ చేసిందన్నది తెలిసిందే. అయితే ఆ వార్తలను విప్లవ్ తోసిపుచ్చారు. ‘మోదీ నన్ను కొడుకులా భావిస్తారు. ఆయన నాపై ఆగ్రహంగా ఉన్నారన్నది నిజం కాదు. చాలా కాలం క్రితమే ప్రధాని అపాయింట్మెంట్ తీసుకున్నా. అది ఇప్పుడు కుదరటంతో వెళ్లి కలవబోతున్నా’ విప్లవ్ వివరణ ఇచ్చుకున్నారు. -
ఫైర్బ్రాండ్కు ‘రెబల్’ మద్దతు
న్యూఢిల్లీ: బీజేపీ ‘రెబల్’ ఎంపీ శత్రుఘ్నసిన్హా మరోసారి సొంత పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శస్త్రాలు ఎక్కుపెట్టారు. విపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరికి బాసటగా నిలిచారు. రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తుండగా నవ్వినందుకు బీజేపీ నాయకులు ఆమెను రామాయణంలోని తాటాకితో పోల్చి విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో శత్రుఘ్నసిన్హా ట్విటర్లో స్పందించారు. రేణుక ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఎవరేమన్నా పట్టించుకోవద్దని, తనను చూసి ఏడ్చేవారిని ఏడవనివ్వాలని సూచించారు. మహిళా సాధికారతను వ్యతిరేకించేవాళ్లు త్వరలోనే పతనమవుతారని వ్యాఖ్యానించారు. వారికి ఇదే చివరి నవ్వు అవుతుందని పేర్కొంటూ నారీ శక్తికి జై కొట్టారు. బీజేపీకి తలనొప్పిలా తయారైన శత్రుఘ్నసిన్హా ఇంతకుముందు కూడా ప్రతిపక్ష నాయకులను ప్రశంసిస్తూ ట్వీట్లు పెట్టారు. బీజేపీ అగ్రనాయకులపై విమర్శలు చేస్తున్న రాహుల్ గాంధీ సహా పలువురు విపక్ష నాయకులను వెనకేసుకొచ్చారు. Laugh Renuka laugh! We love you, we're fond of you & wish you well. Don’t worry, be happy! Let them cry & shout hoarse. Things will settle down. Those who oppose women's empowerment & laughter would melt soon. We all will have the last laugh. Long live ‘Nari Shakti. Jai hind! — Shatrughan Sinha (@ShatruganSinha) February 13, 2018 -
రేణుక ద్రౌపదిగా.. మోదీ, షాలు కౌరవులుగా..
అలహాబాద్, ఉత్తరప్రదేశ్ : రాజ్యసభలో ప్రసంగిస్తున్న సమయంలో పెద్దగా నవ్వుతూ పదే పదే అడ్డుపడిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేణుకా చౌదరిని రామాయణంలోని ఓ క్యారెక్టర్తో పోల్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తాజాగా ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు హసీబ్ అహ్మద్.. రేణుకను మహాభారతంలోని ద్రౌపదితో పోల్చుతూ పోస్టర్ వేశారు. రేణుకపై మోదీ రాజ్యసభలో చేసిన కామెంట్కు దేశంలోని మహిళలందరికీ ప్రధాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన వ్యక్తుల్లో హసీబ్ అహ్మద్ కూడా ఒకరు. పోస్టర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు అమిత్ షా, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజులను కౌరవులుగా చిత్రీకరించారు. బీజేపీ కురువృద్దుడు ఎల్కే అద్వాణీని అంధరాజు ధృతరాష్ట్రుడిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని శ్రీకృష్ణుడి పాత్రలో ఉన్నారు. రక్షామ్ రాహుల్ గాంధీ( రాహుల్ గాంధీ రక్షించండి) అనే పదాన్ని కూడా పోస్టర్పై ఉంచారు. ‘ఓ మహిళ నవ్విందని దుర్యోధనుడు అహంకారంతో చేసిన పనికి 101 మంది కౌరవులు మరణించారన్నది మర్చిపోకండి’ అనే ట్యాగ్ లైన్ను కూడా పోస్టర్లో ఉంచారు. ఓ వైపు బేటీ బచావో బేటీ పడావో లాంటి కార్యక్రమాలను చేస్తున్న మోదీ.. ఓ మహిళా ఎంపీ నవ్వును అవహేళన చేయడంపై హసీబఅహ్మద్ మండిపడ్డారు. -
‘ఇదే సభలో హామీలిచ్చాం, అమలు చేయాల్సిన బాధ్యత లేదా?
-
కడిగిపారేసిన ఫైర్ బ్రాండ్!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి ప్రశ్నించారు. బడ్జెట్పై చర్చ సందర్భంగా శుక్రవారం ఆమె రాజ్యసభలో మాట్లాడుతూ... ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ‘ఇదే సభలో హామీలిచ్చాం, అమలు చేయాల్సిన బాధ్యత లేదా? ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్రానికి ఉన్న ఇబ్బంది ఏంట’ని సూటిగా ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాలను కేంద్రం పట్టించుకోవడమే మానేసిందని కడిగిపారేశారు. కేంద్ర బడ్జెట్లో రైతుల సంక్షేమానికి నిధులు కేటాయించలేదని, రుణమాఫీకి నిధులు ఇవ్వడం లేదని అన్నారు. ఎన్నికలు వస్తున్నందునే రైతులు గుర్తుకొచ్చారా? రైతుల కష్టాలు ఈ ప్రభుత్వానికి ఏం తెలుసని నిలదీశారు. కౌలు రైతులకు పైసా కేటాయించలేదని వెల్లడించారు. పార్లమెంట్లో మహిళలకు మోదీ ప్రభుత్వం ఎంత గౌరవం ఇస్తుందో చూస్తున్నామని, ఇక మహిళా రైతుల గురించి ఏం మాట్లాడతామని నిర్వేదం వ్యక్తం చేశారు. రేణుకను బీజేపీ నాయకులు ‘శూర్పణక’తో పోల్చిన సంగతి తెలిసిందే. అర్థం చేసుకోండి: కేకే ఆంధ్రప్రదేశ్ ఆందోళన అర్థం చేసుకోవాలని మోదీ సర్కారును టీఆర్ఎస్ ఎంపీ కె. కేశవరావు కోరారు. విభజన హామీల అమలు బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. -
ఆహా..! ఆమె నవ్వు.. మోదీ విసుర్లు
-
‘రామాయణం’ తర్వాత ఇప్పుడే చూస్తున్నాం!
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభలో ప్రధాని మోదీ తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేణుకా చౌదరి తీవ్రంగా స్పందించారు. ప్రధాని మోదీ తనపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారని, ఆయన నుంచి ఇంతకంటే ఏం ఆశించగలమని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తుండగా.. ఎంపీ రేణుకా చౌదరి పదేపదే అడ్డుపడిన సంగతి తెలిసిందే. మోదీ మాట్లాడుతుండగా.. ఆమె గట్టిగా నవ్వుతూ ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించారు. దీంతో సభాపతిగా ఉన్న వెంకయ్యనాయుడు.. ప్రధాని ప్రసంగానికి అడ్డు తగలవద్దంటూ రేణుకను ఘాటుగా మందలించారు. మీకు ఏమైనా సమస్య ఉంటే డాక్టర్ వద్దకు వెళ్లాలని, అంతేకానీ సభలో అనుచిత ప్రవర్తనను సహించబోనని వెంకయ్య ఘాటుగా పేర్కొన్నారు. ఈ దశలో ప్రధాని మోదీ కల్పించుకుంటూ.. 'సభాపతిగారు.. రేణుకాజీని ఏమీ అనొద్దని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. రామాయణం సీరియల్ తర్వాత ఇంతటి నవ్వులను వినే సౌభాగ్యం ఇప్పుడే దక్కింది' అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. దీంతో సభలో నవ్వులు పూశాయి. ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై అనంతరం సభ వెలుపల రేణుకా చౌదరి స్పందించారు. 'ప్రధాని మోదీ నాపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. ఆయన నుంచి ఇంతకంటే ఏం ఆశించగలం? ఆయన స్థాయికి దిగజారి నేను బదులు ఇవ్వలేను. మహిళలను ఇది కించపరిచడమే' అని ఆమె మండిపడ్డారు. గతంలో ఆధార్కు వ్యతిరేకంగా యూపీఏ సర్కారుపై విమర్శలు చేసిన మోదీ.. ఇప్పుడు ఆ ఆధార్ పథకానికి అద్వానీ ప్రసంగంలో మూలాలు ఉన్నాయని చెప్పడం తనకు నవ్వు తెప్పించిందని అన్నారు. -
ఆహా..! ఆమె నవ్వు.. మోదీ విసుర్లు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాజ్యసభలో ప్రసంగిస్తుండగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేణుకా చౌదరి పదేపదే అడ్డుపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కాంగ్రెస్పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులతోపాటు రేణుకా చౌదరి పదేపదే మోదీ ప్రసంగానికి అడ్డుతగిలే ప్రయత్నం చేశారు. ఓ దశలో సభాపతిగా ఉన్న వెంకయ్యనాయుడు.. ప్రధాని ప్రసంగానికి అడ్డు తగలవద్దంటూ రేణుకను మందలించారు కూడా. అయితే, ఈ సమయంలో ప్రధాని మోదీ.. రేణుకా చౌదరిని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రసంగిస్తుండగా రేణుక గట్టిగా నవ్వుతుండటంతో.. 'సభాపతిగారు.. రేణుకాజీని ఏమీ అనొద్దని మిమ్మల్ని కోరుతున్నా.. రామాయణం సీరియల్ తర్వాత ఇంతటి నవ్వులను వినే సౌభాగ్యం ఇప్పుడే దక్కింది' అంటూ మోదీ అన్నారు. దీంతో సభలో నవ్వులు పూశాయి. ప్రధాని మోదీ రాజ్యసభలో చేసిన ప్రసంగంలోని ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆధార్ను మేమే తీసుకొచ్చామని కాంగ్రెస్ పార్టీ పదేపదే చెప్తోంది. కానీ, 1998లో రాజ్యసభలో జరిగిన చర్చలో ఎల్కే అద్వానీ ఈ విషయం గురించి చెప్పారు. ఆధార్ మూలాలు అద్వానీ ప్రసంగంలో ఉన్నాయి. ఈ విషయాన్ని కాంగ్రెస్ గుర్తించాలి ట్రిపుల్ తలాక్ బిల్లులో మార్పులు చేయాలని మీరు (కాంగ్రెస్) అంత బలంగా భావిస్తే.. చాలాకాలం మీరు అధికారంలో ఉన్నారుగా.. అప్పుడెందుకు ఈ చట్టాన్ని తీసుకురాలేదు? కాంగ్రెస్ పార్టీ స్వచ్ఛ భారత్, మేకిన్ ఇండియా, సర్జికల్ స్ట్రైక్స్, యోగా డే ఇలా మా ప్రతి పథకాన్ని కాంగ్రెస్ విమర్శిస్తోంది. కాంగ్రెస్ కావాలనుకుంటే ఇలా మమ్నల్ని విమర్శించవచ్చు, కానీ ఎందుకు ట్రిపుల్ తలాక్, ఓబీసీ కమిషన్ బిల్లులను అడ్డుకుంటోంది. ఓబీసీల ఆకాంక్షలు కాంగ్రెస్కు పట్టవా? బీజేపీపై విమర్శలు చేస్తూ.. మోదీని తిడుతూ.. మీరు(కాంగ్రెస్) దేశాన్ని కూడా తిడుతున్నారు. ఇది సరైనదేనా -
'ఆ మూడింటితో గెలవలేరు'
న్యూఢిల్లీ: గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో చివరికి ప్రజాస్వామ్యం గెలిచిందని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. గుజరాత్లో అత్యంత ఉఠ్కంతభరితంగా జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ పటేల్ గెలిచారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు ప్రయత్నించిన బీజేపీ నాయకులకు పటేల్ గెలుపు కనువిప్పు కావాలని కాంగ్రెస్ పేర్కొంది. 'డబ్బు, కండబలం, కుతంత్రంతో విజయం సాధించలేరు. కాంగ్రెస్ పార్టీలో కొంతమంది బలహీన ఎమ్మెల్యేలను బీజేపీ చీల్చింది. కానీ పార్టీని చీల్చలేకపోయింద'ని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం ట్వీట్ చేశారు. ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరును ఆయన ప్రశంసించారు. యుద్ధంలో గెలవడం కష్టమేనని, విజయం సాధించేందుకు ప్రభుత్వం చాలా కష్టపడిందని చివరకు ప్రజాస్వామ్యం గెలిచిందని కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు. అహ్మద్ పటేల్కు ఆమె అభినందనలు తెలిపారు. గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో సత్యం గెలిచిందని, అహం ఓడిపోయిందని కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జివాల్ అన్నారు. అహ్మద్ పటేల్ విజయంతో బీజేపీ చెప్పిందంతా బూటకమని తేలిపోయిందని ఎద్దేవా చేశారు. -
కోర్టు తీర్పును గౌరవించాలి
-
రైతులపై ఇంత నిర్లక్ష్యమా?: రేణుక
సాక్షి, హైదరాబాద్: రైతులపై రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యమెందుకు అని రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి ప్రశ్నించారు. గాంధీభవన్లో గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. రుణమాఫీ చేయకుండా, కరువులో పరిహారం ఇవ్వకుండా, వరద నష్టాన్ని అంచనా వేయకుండా, నకిలీ విత్తనాల నుంచి రక్షించకుండా రైతులపై కక్ష సాధించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. నకిలీ విత్తనాల కంపెనీలను బ్లాక్లిస్టులో పెట్టాలని, వాటి ఆస్తులను జప్తు చేయాలని డిమాండ్ చేశారు. వాటివల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వమే పరిహారమివ్వాలన్నారు. ఖమ్మం ఎమ్మెల్యే టీఆర్ఎస్లో చేరినందుకు అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూమిని కట్టబెట్టారన్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరం గా ఉంటున్నట్లు కొందరు కాంగ్రెస్ నేతలే తనపై దుష్ర్పచారం చేస్తున్నారని రేణుక చెప్పారు. -
హాఫ్ ఫొటో చూసి నిందలు వేస్తారా?
తన తల్లిపై అనవసరంగా నిందలు వేస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి కుమార్తె తేజశ్విని అన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా విమర్శలు చేయడం తగదని పేర్కొన్నారు. తన తల్లిపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపై తేజుశ్విని స్పందించారు. కుటుంబ సభ్యులతో కలిసి రెస్టరెంట్ కు వెళ్లిన రేణుక ఫొటోపై సోషల్ మీడియాలో దుమారం రేగింది. పనమ్మాయిని పక్కనే నిలబెట్టి వారంతా భోజనం చేస్తున్నట్టు ఆ ఫొటోలో ఉంది. దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పనమ్మాయిని మనిషిగా చూడకుండా అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకోకుండా నిందలు వేయడం సరికాదని తేజుశ్విని అన్నారు. 'పనమ్మాయిని నాకోసమే నియమించింది. ఆమె బాలిక కాదు. ఆమె వయసు 26 ఏళ్లు. ఆమెకు 9, 7 ఏళ్ల వయసున్న పిల్లలు ఉన్నారు. రెస్టరెంట్ లో మాతోపాటే భోజనం చేసింది. మా అమ్మ అందరినీ సమానంగా చూస్తుంది. తన చుట్టు ఉన్నవారి అవసరాలను స్వయంగా తెలుసుకుని తీరుస్తుంది. ఎంతో మంది మహిళలు, పిల్లలను ఆమె కాపాడింది. ధైర్యం, విశ్వాసం, దయగుణం కలిగిన అమ్మ ఇప్పటికీ ప్రజల కోసం ఎంతో కష్టపడి పనిస్తోంది. అలాంటి ఆమె అకారణంగా నిందలు మోపుతున్నారు. ఆమె సహాయం పొందిన వారిలో చాలా మందికి ట్విటర్ ఖాతాలు లేవు. అందుకే సోషల్ మీడియాలో విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోతున్నారు. సరైన ఆధారాలు లేకుండా నిందారోపణలు చేయడం సమంజసం కాదు. హాఫ్ ఫొటో చూసి విమర్శలు గుప్పించడం కరెక్ట్ కాదు. అసలేం జరిగిందో తెలియకుండా ఎదుటివారిని బాధ పెట్టే కామెంట్స్ చేయొద్ద'ని తేజుశ్విని పేర్కొన్నారు. -
రేణుకా చౌదరీపై ఆన్లైన్ దుమారం
కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి రేణుకా చౌదరీపై నెటిజన్లు దుమ్మెత్తి పోశారు. ఆమె చేసిన చర్యని ఆన్ లైన్లో ఎండగట్టారు. తన కుటుంబంతో కలిసి ఓ ఫ్యామిలీ రెస్టారెంటుకు వెళ్లిన ఆమె తన ఇంట్లోని ఓ చిన్నపాపను చూసుకునే అమ్మాయికి కనీసం విలువ ఇవ్వకుండా వారంతా భోజనం చేశారు. ఆ అమ్మాయిని కుర్చీలో కూర్చో అని కూడా చెప్పకుండా అలాగే నిల్చుబెట్టి ఉంచారు. అలాగే చేతులు కట్టుకుని నిల్చునేలా చేసినందుకు ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమంలో పలువురు ఆమెను ప్రశ్నించారు. రిషి బగ్రీ అనే వ్యక్తి ఆ ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేయగా ఒకే రోజు 1700మంది రీ ట్వీట్ చేశారు. 'ప్రియమైన రేణుకా చౌదరీగారూ.. మీ చిన్నారిని చూసుకునే అమ్మాయికి భోజనం పెట్టించలేనప్పుడు వారిని అసలు రెస్టారెంట్లకు తీసుకెళ్లకండి' అంటూ ట్వీట్ చేశారు. ఇప్పటికే పెద్ద వాళ్ల ఇళ్లలో వెలి కొనసాగుతుందని చెప్పడానికి ఈ దృశ్యం ఒక సజీవ సాక్ష్యం అని బదులిచ్చారు. ఇంకొంతమంది మాత్రం కాంగ్రెస్ పార్టీ కల్చర్ అని కూడా విమర్శించారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ పప్పుతో భోజనం చేస్తున్నప్పుడు రేణుకా ఇలాగే నిల్చుంటారని కూడా పేర్కొన్నారు. గతంలో మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి అయ్యి ఉండి ఇలా చేస్తారా అని కూడా కొందరు ప్రశ్నించారు. Dear Renuka Chowdary If you can't feed the little girl minding your child, please don't bring them to a restaurant! pic.twitter.com/N104ZYtVKN — Rishi Bagree (@rishibagree) 31 May 2016 Modern slavery means stripping dignity. We eat. You don't. We sit.You don't.I'm rich, you manage my brat in public. https://t.co/1ik1FWfFwo — Aparna Jain (@Aparna) 1 June 2016 Aww, Congress leader Renuka Chowdhary displaying her commitment to the 'GARIB' Hatao programme of her party. https://t.co/vbz2C7fl3g — Shefali Vaidya (@ShefVaidya) 31 May 2016 When children care taker girls will be treated with dignity? & you expect them to serve their masters with loyality pic.twitter.com/oRNmu4tDPS — santosh gupta (@toshiG010) 31 May 2016 -
శరద్పవార్కు రేణుక విందు
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తలపెట్టిన అయుత చండీయాగానికి హాజరైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్పవార్ శనివారం మధ్యాహ్నం హైదరాబాద్లో కొద్దిసేపు ఆగారు. కాంగ్రెస్ నాయకురాలు రేణుకాచౌదరి ఇచ్చిన విందుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్బంగా పలువురు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. పవార్ను కలిసిన వారిలో మాజీ మంత్రి గీతారెడ్డి, రాజ్యసభ సభ్యులు ఎంకే ఖాన్, టి.సుబ్బరామిరెడ్డి, దానం నాగేందర్ తదితరులున్నారు. -
రేణుకా చౌదరి అనుచరుడికి చెప్పు దెబ్బ
ఖమ్మం: తమను మోసం చేసిన కేంద్ర మాజీమంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరిపై చర్యలు తీసుకోవాలని గిరిజన మహిళ, డాక్టర్ రాంజీ నాయక్ భార్య కళావతి డిమాండ్ చేశారు. 2014 ఎన్నికల్లో వైరా అసెంబ్లీ ఎస్టీ రిజర్వుడ్ టిక్కెట్ను ఇప్పిస్తానని రేణుకా చౌదరితోపాటు మరో ఆరుగురు రూ.1.10 కోట్లు తీసుకున్నారని ఆమె తెలిపారు. తమ డబ్బులు తిరిగివ్వాలంటూ బుధవారం రేణుకా చౌదరి అనుచరుల మీడియా సమావేశాన్ని ఆమె అడ్డుకున్నారు. రేణుక అనుచరుడు సైదులు నాయక్ పై చెప్పుతో దాడి చేశారు. రేణుకా చౌదరి, ఆమె అనుచరులు కలిసి తమను మోసం చేయడమే కాకుండా, కులం పేరుతో దూషించారని కళావతి ఆరోపించారు. తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుంటే తన పిల్లలతో కలిసి రేణుకాచౌదరి ఇంటిముందు ఆత్మహత్య చేసుకుంటానని ఆమె హెచ్చరించింది. అవసరమైతే సోనియా గాంధీని కలిసి తనకు జరిగిన అన్యాయం వివరిస్తానని తెలిపింది. కళావతి ఫిర్యాదు మేరకు రేణుకాచౌదరితోపాటు మరో ఆరుగురిపై ఈనెల 16న ఖమ్మం అర్బన్ పోలీస్స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ అ ట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది. -
రేణుకా చౌదరిపై అట్రాసిటీ కేసు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: కేంద్ర మాజీమంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరిపై ఖ మ్మం అర్బన్ పోలీస్స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ అ ట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది. గిరి జన మహిళను కులం పేరుతో దూషించారన్న ఫిర్యాదుతోపాటు, తన భర్తను రేణుకా చౌదరి మోసం చేశారని గిరిజన మహిళ, డాక్టర్ రాం జీనాయక్ భార్య కళావతి ఫిర్యాదు చేసింది. ఈ విషయమై రాంజీనాయక్ సతీమణి కళావతి హైకోర్టును ఆశ్రయించారు. ఫిర్యాదును స్వీకరించిన హైకోర్టు ఈ అంశంపై కేసు నమో దు చేయాలని ఖమ్మం అర్బన్ పోలీసులను ఆదేశించింది. రేణుకాచౌదరితోపాటు మరో ఆరుగురిపై ఈనెల 16న కేసు నమోదైంది. పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచ డం చర్చనీయాంశంగా మారింది. కాగా, రేణుకా చౌదరిపై 420, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఖమ్మంకు చెందిన డాక్టర్ భూక్యా రాంజీకు 2014 ఎన్నికల్లో వైరా అసెంబ్లీ ఎస్టీ రిజర్వుడ్ టిక్కెట్ను ఇప్పిస్తానని రేణుకా చౌదరితోపాటు మరో ఆరుగురు రూ.1.10 కోట్లు తీసుకున్నారని పేర్కొన్నారు. టిక్కెట్ రాకపోగా కోటి రూపాయలు ఖర్చు కావడంతో మానసికంగా కుంగిపోరుు మనోవేదనతో తన భర్త మృతి చెందాడని పేర్కొన్నారు. టికెట్ కోసం రాంజీ రేణుకా చౌదరికి, ఆవిడ అనుచరులకు ఎప్పుడు, ఎక్కడ ఎంత మొత్తంలో నగదు చెల్లించింది ఫిర్యాదులో వివరించారు. 2013 మే 30న ఇల్లెందు రోడ్డు లో ఉన్న ఎన్నెస్పీ విశ్రాంతి భవనంలో రూ . 10 లక్షలు, ఖమ్మంలోని ఆఫీసర్స్ విశ్రాంతి భ వనంలో 2013 డిసెంబర్1న రూ. 60 లక్షలు రేణుకాచౌదరికి ఇచ్చినట్లు పేర్కొన్నారు. అదే రోజు రంగారెడ్డి, సుబ్బారెడ్డి, దయాకర్రెడ్డిలకు రూ. 15 లక్షలు ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. 2014 మార్చి30 హైదరాబాద్లో రేణుకాచౌదరి ఇంటి వద్ద రూ. 50 లక్ష లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. డబ్బులు ఇవ్వాలని అడిగితే తమను కులం పేరుతో దూషిం చారని పేర్కొన్నారు. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రేణు కాచౌదరితో పాటు రామారావు, పుల్లయ్య, సైదులు, రంగారెడ్డి, సుబ్బారెడ్డి, దయాకర్రెడ్డిలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
‘మాఫీ’ చేయకుంటే రణమే..
ఖమ్మంజడ్పీ సెంటర్ : జిల్లాలో అర్హులైన రైతులందరికీ వెంటనే రుణమాఫీ వర్తింపజేయాలని, వ్యవసాయానికి నిరంతరాయంగా ఏనిమిది గంటల విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నాచౌక్లో మహాధర్నా నిర్వహించారు. తొలుత వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు ప్రదర్శనగా కలెక్టరేట్కు చేరుకున్నారు. ధర్నాచౌక్లో ఏర్పాటు చేసిన శిబిరంలో బైఠాయించి రుణమాఫీని వెంటనే అమలు చేయాలి, కొత్త రుణాలు అందించాలి, సోనియా రాహుల్ నాయకత్వం వర్దిల్లాలి, కాంగ్రెస్ జిందాబాద్, కిలాడి చంద్రశేఖర్రావు ఢాం ఢాం అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పార్టీ జిల్లా కార్యాలయం ఇన్చార్జి అయితం సత్యం అధ్యక్షతన జరిగిన ధర్నాలో పలువురు నేతలు ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ పథకాన్ని వెంటనే అమలు చేసి కొత్తరుణాలు ఇవ్వాలని రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి డిమాండ్ చేశారు. రైతులకు ఎరువులు, విత్తనాలు అందించి రైతాంగాన్ని ఆదుకోవాలన్నారు. కేసీఆర్ వందరోజుల పాలనలో 175 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. రైతులు కష్టకాలంలో ఉన్న ఈ సమయంలో ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అక్రమార్కుల పాలిట హిట్లర్ అని కేసీఆర్ చెప్పుకోవటం సిగ్గుచేటన్నారు. సమగ్ర సర్వే పేరుతో ప్రజలందరినీ ఉరుకులు పరుగులు పెట్టించి, ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న వారిని కూడా రప్పించి, చివరకు సంక్షేమ పథకాలు అందకుండా చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రెక్కలు ముక్కలు చేసుకొని వ్యవసాయం చేస్తున్న రైతులకు ఆలస్యం చేయకుండా రుణమాఫీ ఇవ్వాలన్నారు. వందరోజుల పాలనలో వెయ్యి అబద్దాలు చెప్పిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలకు మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. దేశవ్యాప్తంగా రూ. 75వేల కోట్లు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కిందన్నారు. ఆ రుణమాఫీలో కేసీఆర్, కేటీఆర్, హరీష్రావులు కూడా మాఫీ పొందలేదా? అని ప్రశ్నించారు. 2001లో సోనియాగాంధీ నాయకత్వంలో వై.ఎస్. రాజశేఖరరెడ్డి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసి రైతుల కష్టాలు తెలుసుకొని ఉచిత విద్యుత్ అమలు చేశారన్నారు. ప్రభుత్వం రుణమాఫీపై బ్యాంకర్లకు ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదని మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఆరోపించారు. వెంటనే రుణమాఫీ పై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. బ్యాంకర్లు మాత్రం పాతరుణాలు చెల్లిస్తేనే మరలా కొత్తరుణాలు చెల్లిస్తామని చెబుతున్నారని తెలిపారు. రాష్ట్రం ఆత్మహత్యల తెలంగాణగా మారుతోందన్నారు. రైతులందరికీ రుణమాఫీని వర్తింపజేసి ఆదుకోవాలని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్కుమార్ కోరారు. బంగారం రుణాలు, పట్టణ బ్యాంకుల్లో తీసుకున్న రుణాలన్నింటినీ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతులను తికమక పెట్టకుండా స్పష్టమైన వైఖరిని తీసుకుని మాఫీని అమలు చేయాలని, వర్షాలు కురిసి వ్యవసాయ సీజన్ ప్రారంభమైనందున రైతులకు అవసరమైన అన్ని ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుకుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కిలాడి కేసీఆర్ రోజుకోమాట చెబుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి విమర్శించారు. వందరోజుల పాలనలో ఆయన చేసిన ఘనకార్యం ఏమీ లేదన్నారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు కలెక్టరేట్లోకి వెళ్ళేందుకు ప్రయత్నించారు. అప్పటికే గేట్లు మూసి వేయడంతో పలువురు ముఖ్యనాయకులు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ ఇలంబరితికి అందచేశారు. ఈ మహాధర్నాలో నాయకులు ఎడవల్లి కృష్ణ, మానుకొండ రాధాకిషోర్, శీలంశెట్టి వీరభద్రం, నాగండ్ల దీపక్చౌదరి, పరుచూరి మురళి, పులిపాటి వెంకయ్య, వి.వి.అప్పారావు, వడ్డెబోయిన శంకర్, కొల్లు పద్మ, దేవబత్తిని కిషోర్, విజయ్కుమార్, కూల్హోం ప్రసాద్, వెంకట్, మగ్బూల్, నరేంద్రచౌదరి, మనోహర్నాయుడు పాల్గొన్నారు. -
కనకయ్య ‘కారు’ ఎక్కేనా..?
ఇల్లెందు: ఇల్లెందు కాంగ్రెస్లో ‘రేణుక తుపాన్’ మొదలైంది. పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారిపై చర్య తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య గత రెండు నెలల క్రితం పీసీసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఇల్లెందు నియోజకవర్గంలో రేణుక వర్గానికి చెందిన 12 మందిని పీసీసీ ఇటీవల సస్పెండ్ చేసింది. అయితే తమ అనుచరులపై వేటు వేయడాన్ని రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి తీవ్రంగా ఆక్షేపించారు. జిల్లాలో తాను ఉన్నంత కాలం కార్యకర్తలకు ఎలాంటి ఢోకా లేదని ఆమె భరోసా ఇచ్చారు. అయితే గత ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారిని రేణుక వెనకేసుకొస్తున్నారని ఎమ్మెల్యే వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఇల్లెందు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టాలని కోరేందుకు ఎమ్మెల్యే కోరం కనకయ్య సీఎం కేసీఆర్ ఇంటికి వెళ్లి కలిశారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను సీఎంకు వివరించారు. అవన్నీ సావధానంగా విన్న కేసీఆర్.. బంగారు తెలంగాణ పట్ల తనకున్న విజన్ను ఎమ్మెల్యే ముందుంచారు. బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలని, టీఆర్ఎస్లోకి రావాలని కనకయ్యను కేసీఆర్ స్వయంగా ఆహ్వానించారు. అయితే తన విజయానికి కృషి చేసిన కార్యకర్తలు, ప్రజల మనోభావాలకు అనుగుణంగానే నడుచుకుంటానని, వారి అభీష్టం మేరకే తన నిర్ణయం ఉంటుందని సీఎంకు చెప్పారని సమాచారం. కాగా, ఎమ్మెల్యే అనచరుల్లో ముఖ్యమైన నేతలు టీఆర్ఎస్ వైపు అడుగు వేసేందుకు సంసిద్ధంగా ఉన్నారని తెలిసింది. వచ్చే ఐదేళ్లలో అభివృద్ధితో పాటు నియోజకవర్గ ప్రజలను మెప్పించేలా పాలన సాగించాలంటే ప్రభుత్వ సహకారం అవసరమని, కేసీఆర్ ఆహ్వానం మేరకే గులాబీ తీర్థం పుచ్చుకుంటే నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇందుకోసం ఒకటి, రెండు రోజుల్లో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించి కార్యకర్తల మనోభావాలు తెలుసుకుంటామని ఎమ్మెల్యే అనుచర నాయకుడు ఒకరు తెలిపారు. సెప్టెంబర్ ఒకటిన వీరంతా టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. -
కాంగ్రెస్ కార్యాలయంలో ఒక కుర్చీ... ఐదుగురు నాయకులు
ఖమ్మం : ఇప్పటికే పార్టీని నడిపించే నాయకుడు లేక.. చుక్కాని లేని నావలా ఉన్న కాంగ్రెస్కు కొత్త సమస్య వచ్చింది. డీసీసీ కార్యాలయ నిర్వహణకు ఐదుగురు సభ్యుల కమిటీ ఉన్నా.. ఎవరికీ సంపూర్ణ అధికారం లేదు. దీంతో స్వాతంత్య్ర దినోత్సవం రోజున జిల్లా కార్యాలయంలో జాతీయ జెండాను ఎవరు ఎగుర వేయాలనేది ప్రశ్నగా మారింది. పార్టీ సీనియర్ నాయకులు ఎగురవేస్తారా.. లేదా అధిష్టానం జిల్లా ఇన్చార్జి కుసుమకుమార్ను పంపుతుందా.. లేకుంటే ఈ ఐదుగురిలోనే ఒకరు పతాకావిష్కరణ చేయాలని ఆదేశిస్తుందా.. అలా వస్తే ఏ వర్గం వారికి అవకాశం దక్కుతుంది అనేది పార్టీలో చర్చనీయాంశమైంది. ఒక కుర్చీ .. ఐదుగురు నాయకులు జిల్లా కాంగ్రెస్ పార్టీ నిర్వహణ ఒక కుర్చీ.. ఐదుగురు నాయకులు చందంగా మారింది. డీసీసీ అధ్యక్షుడిగా వనమా వెంకటేశ్వరరావు ఉన్నప్పుడు ఆయన కొత్తగూడెంలోనే ఉండి పార్టీ ముఖ్య సమావేశాలు, ఇతర వ్యవహారాలకు హాజరయ్యేవారు. పార్టీ కార్యాలయ నిర్వహణ అంతా రేణుకాచౌదరి వర్గానికి చెందిన వ్యక్తిగా ముద్ర ఉన్న పులిపాటి వెంకయ్య చూసేవారు. అయితే ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు రావడంతో కార్యాల ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించారు. దీనికి తోడు డీసీసీ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోయారు. దీంతో ఇదే అదనుగా భావించిన జిల్లాలోని కొందరు నాయకులు తమ అనుచరులకు పార్టీ పగ్గాలు, కార్యాలయ బాధ్యతలు అప్పగించేందుకు ఎవరికి వారుగా ప్రయత్నించారు. ఎన్నికల ముందు ఒక వర్గానికి ప్రాధాన్యత ఇస్తే మరో వర్గంతో ఇబ్బంది కలుగుతుందని భావించిన పార్టీ అధిష్టానం రాంరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడు శీలంశెట్టి వీరభద్రం, భట్టి విక్రమార్క అనుచరుడు ఐతం సత్యం, పొంగులేటి సుధాకర్రెడ్డి సోదరుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను కార్యాలయ ఇన్చార్జిలుగా నియమించింది. అయితే కార్యాలయంలో అన్నీ తామై ఉన్న తమ వర్గానికి ప్రస్తుతం ప్రాధాన్యత తగ్గిందని రేణుకాచౌదరి వర్గీయులు ఆమెతో మొరపెట్టుకున్నట్లు సమాచారం. దీంతో ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న రేణుక తమ అనుచరులకు కూడా కార్యాలయ నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని తెలంగాణ పీసీసీ వద్ద పట్టుబట్టి నట్లు తెలిసింది. దీంతో ప్రస్తుతం ఉన్న ముగ్గురితోపాటు రేణుకాచౌదరి వర్గానికి చెందిన వి.వి. అప్పారావు, పరుచూరి మురళీకృష్ణ పేర్లు చేర్చి డీసీసీ నిర్వహణ బాధ్యతలు ఐదుగురికి అప్పగిస్తూ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పుడు పార్టీ కార్యాలయంలో వర్గపోరు మళ్లీ మొదలైంది. ఉన్న కుర్చీలో కూర్చునేందుకు ఒకరి తర్వాత ఒకరు పోటీ పడుతున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు చెపుతున్నారు. జాతీయ పతాకావిష్కరణ చేసేదెవరో..? డీసీసీ కార్యాలయంలో స్వాతంత్ర వేడుకల్లో జెండా ఎగుర వేసేది ఎవరనేది జిల్లాలో చర్చనీయాంశమైంది. ఇప్పటి వరకు స్వాతంత్ర, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగుర వేసే ఆనవాయితీ ఉంది. అయితే అధ్యక్షుడు ఎగురవేయాల్సిన జెండాను ఆయన అందుబాటులో లేకపోతే సీనియర్ నేత, మంత్రి స్థాయి నాయకుడు ఎగుర వేసేవారు. కానీ ఇప్పుడు డీసీసీ నిర్వహణ ఐదుగురు సభ్యులతో ఉంది. ఇందులో వివిధ వర్గాలకు చెందిన వారు ఉన్నారు. స్వాతంత్ర వేడుకల్లో జెండా ఎగురవేసేది తామంటే తామని ఆయా నాయకులు చెప్పుకుంటున్నట్లు సమాచారం. దీంతో కుర్చీల కుమ్ములాట ఇప్పుడు పతాకావిష్కరణ వద్ద బహిర్గతమైతే పార్టీ పరువు పోతుందని కాంగ్రెస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
నేను మళ్లీ ఖమ్మం జిల్లాకే వస్తా
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న కాంగ్రెస్ ఫైర్బ్రాండ్, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి సేవలు ఇక నుంచి జిల్లాకు అందే అవకాశం లేకుండా పోయింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు రాజ్యసభ సభ్యుల పంపకానికి సంబంధించి తీసిన లాటరీలో రేణుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లిపోయారు. ఈమెతో పాటు తెలంగాణకు చెందిన మరో ముగ్గురు ఎంపీలు కూడా ఆ రాష్ట్రానికి కేటాయించబడ్డారు. దీంతో రేణుక తన పదవీకాలం ముగిసేంతవరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకే సేవలందించాల్సి ఉంటుంది. ఎంపీగా ఆమె ఖర్చు చేసే నిధులు కూడా అక్కడి ప్రజల అవసరాలను తీర్చేందుకే కేటాయించాల్సి ఉంటుంది. మళ్లీ 2018 తర్వాత ఆమెకు రాజ్యసభకు అవకాశం వస్తే... అది కూడా తెలంగాణ నుంచి అధిష్టానం ఎంపిక చేస్తే ఆమె ఇక్కడకు వచ్చే అవకాలున్నాయి. కాగా, జిల్లా నుంచి ప్రస్తుతానికి పంపకాలు జరిగిన రాజ్యసభ సభ్యుల మధ్య పరస్పర అవగాహన కుదిరితే నిధుల కేటాయింపునకు సంబంధించి భారత ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వుల మేరకు ఇక్కడ అభివృద్ధికి కూడా నిధులు కేటాయించవచ్చని అధికార వర్గాలు చెపుతున్నా అది కూడా కష్టమేననే వాదన వినిపిస్తోంది. రేణుక ఏమంటున్నారంటే.... ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు కేటాయించబడిన నేపథ్యంలో రేణుకాచౌదరిని ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా... ఆమె ఎప్పటిలాగే తనదైన శైలిలో మాట్లాడారు. ప్రదేశ్ మారినా తాను మారేది లేదని, ఖమ్మం జిల్లాను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తనను నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వదిలిపెట్టబోనని, ఏ ప్రభుత్వం వచ్చినా తనలో మార్పు ఏమీ ఉండదని ఆమె చెప్పారు. ‘చూస్తూ ఉండండి... ఏం జరుగుతుందో... నేను మళ్లీ ఖమ్మం జిల్లాకే వస్తా’ అని ఆమె వ్యాఖ్యానించడం గమనార్హం. పోలవరం ముంపు ప్రాంత ప్రజల పక్షాన అటు పార్లమెంటులో, ఇటు బయట పోరాడింది తానేనని, సీఎం హోదాలో ఉండి కేసీఆర్ బంద్కు పిలుపునివ్వడం హాస్యాస్పదమని అన్నారు. అప్పుడు నోరుమెదపని నేతలు ఇప్పుడు డ్రామాలు ఎందుకు ఆడుతున్నారని ఆమె ప్రశ్నించారు. జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర... ఫైర్బ్రాండ్గా గుర్తింపు తెచ్చుకున్న రేణుక జిల్లా రాజకీయాల్లో హల్చల్ సృష్టించారు. అతి తక్కువ కాలంలోనే జిల్లా రాజకీయాలను ఒక కుదుపు కుదిపారు. ఖమ్మం పార్లమెంటు సభ్యురాలిగా పనిచేసిన ఆమె జిల్లా కాంగ్రెస్ రాజకీయాలను ఒకరకంగా శాసించారనే చెప్పాలి. జిల్లా వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకుని కాంగ్రెస్ మహామహులను ఎదుర్కొని నిలబడ్డారు. జిల్లా కాంగ్రెస్ వర్గ రాజకీయాలు ముదురుపాకాన పడ్డప్పుడు కూడా ఆమె ఎక్కడా వెనక్కు తగ్గలేదు. అయితే, ఇప్పుడు రేణుకను ఆంధ్రప్రదేశ్కు కేటాయించడంతో జిల్లా కాంగ్రెస్లో రేణుకాచౌదరి వర్గంగా గుర్తింపు పొందిన నేతలు నైరాశ్యంలో మునిగిపోయారు. ఖచ్చితంగా మేడమ్ ఇక్కడే ఉంటారనుకున్న రేణుక వర్గం ఆమె ఆంధ్రప్రదేశ్కు వెళ్లిపోవడంతో తమ భవిష్యత్తు ఏమిటనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. -
రేణుకా చౌదరి, బలరాం నాయక్ వర్గీయుల ఘర్షణ
హైదరాబాద్: కాంగ్రెస్ సీట్ల కేటాయింపు విషయమై రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, కేంద్ర మంత్రి బలరాం నాయక్ వర్గీయుల మధ్య గొడవ జరిగింది. రేణుకా చౌదరి తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. అదే సమయంలో టికెట్ వస్తుందని ఆశించి, రాని వారు కూడా పొన్నాల నివాసం వద్దకు వచ్చి నిరసన తెలిపారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల లలిత, మరికొందరు మహిళా నేతలు కూడా వచ్చారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలైన తనకే టికెట్ ఇవ్వలేదని లలిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కుట్ర వెనుక రాష్ట్ర నేతలు ఉన్నారని ఆమె ఆరోపించారు. పొన్నాల వెంటనే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్కు ఫోన్ చేసి మాట్లాడారు. ఆ తరువాత బాన్సువాడ నుంచి పోటీ చేయమని ఆయన లలితను కోరారు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. తాను నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేస్తానని చెప్పారు. ఆ టికెట్ను తనకు కాకుండా మరో నేతకు కేటాయించడం బాధాకరం అన్నారు. ఈ సందర్భంగా రేణుకా చౌదరి, బలరాం నాయక్ వర్గీయుల గొడవపడ్డారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లు గల్లంతు కావడానికి బలరాం నాయక్ కారణమంటూ రేణుక వర్గీయుల ఘర్షణకు దిగారు. -
నామాపై బాలసాని ఫైర్
ఖమ్మం కార్పొరేషన్, న్యూస్లైన్: తెలుగు ‘తమ్ముళ్లు’ మరోసారి వీధి పోరాటాలకు దిగారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుపై తుమ్మల వర్గీయులు మరోసారి బహిరంగ విమర్శలకు దిగారు. తుమ్మలకు టికెట్ అడుక్కోవాల్సిన అవసరం లేదని, నిన్నగాక మొన్న వచ్చిన నాయకుల పెత్తనమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మంనగరంలోని తుమ్మల క్యాంప్ కార్యాలయానికి శనివారం 300 మంది కార్యకర్తలు చేరుకున్నారు. తుమ్మల ఖమ్మం నుంచే పోటీ చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మాట్లాడారు. జిల్లా అభివృద్ధిలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పాత్రేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. 1982లో టీడీపీ స్థాపించిన సమయంలో జిల్లాలో కేవలం రెండు నియోజకవర్గాల్లో మాత్రమే పార్టీ ఉందని, ఈ 33 సంవత్సరాలుగా పార్టీని నడిపి బలమైన శక్తిగా తయారు చేసింది తుమ్మల నాగేశ్వరరావేనని అన్నారు. మంత్రిగా పని చేసిన కాలంలో తుమ్మల జిల్లాలోని 46 మండలాల్లో అభివృద్ధి పనులు చేశారని, అందుకు గుర్తుగా ప్రతీ గ్రామంలో శిలాఫలకాలు ఉన్నాయని అన్నారు. తెల్దారుపల్లి, మొద్దులపల్లి గ్రామాల్లో పార్టీ జెండాలు కట్టింది ఎవరో అందరికీ తెలుసని, అలాంటి వ్యక్తికి పార్టీ టికెట్ అడుక్కోవాల్సి వస్తే ఇంక విలువేముందని ప్రశ్నించారు. అయన చేసిన అభివృద్ధికి జిల్లాలో ఎక్కడి నుంచి అయిన పోటి చేసే అర్హత ఉందన్నారు. తుమ్మల పాలేరు నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకుని స్వర్ణకుమారికి అన్యాయం చేస్తున్నాడని ఎంపీ నామా పరోక్షంగా మాట్లాడడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. పార్టీలో ఎవరి వల్ల ఎవరికి అన్యాయం జరిగిందో అందరికీ తెలుసని, స్వర్ణకుమారికి అన్యాయం చేసింది నామానేనని ఆరోపించారు. ఉద్యోగం చేసుకుంటున్న స్వర్ణకుమారిని రాజకీయాల్లోకి తీసుకువచ్చి ఖమ్మం ఎంపీ టికెట్ ఇప్పించింది తుమ్మల నాగేశ్వరరావేనని గుర్తు చేశారు. అప్పట్లో రేణుకాచౌదరిపై ఆమె కేవలం 8వేల ఓట్ల తేడాతో ఓడిపోయిందని, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో స్వర్ణకుమారి స్థానాన్ని నామా నాగేశ్వరరావు లాక్కుని ఆమెకు అన్యాయం చేశారని అన్నారు. ఎంపీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని అన్నారు. ఇన్ని సంవత్సరాలు కార్యకర్తలు ఎక్కడా ఇబ్బంది పడలేదని అన్నారు. సీటు కావాలంటే హైదరాబాద్లో ఉండి పైరవీలు చేసుకోవచ్చిని, కానీ జెడ్పీటీసీ ఎన్నికల కోసం ఏజెన్సీలో ప్రచారం చేస్తున్నామని అన్నారు.తుమ్మలకు ఎంపీ టికెట్ ఇవ్వాలని వారు అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. అదే జరిగితే ఖమ్మం ఎంపీ స్థానంతో పాటు ఏడు నియోజవర్గాల్లో టీడీపీ గెలిచే అవకాశం ఉందని అన్నారు. ఈ విషయంపై పార్టీ అధినేత చంద్రబాబుకు లేఖ రాస్తామని అన్నారు. కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తా : తుమ్మల ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ జిల్లా రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలకు భిన్నంగా ఉంటాయని, కార్యకర్తలు వారి అభిప్రాయాలు చెప్పుకోవచ్చని అన్నారు.కానీ దానిని నిర్ణయించే శక్తి తన చేతుల్లో లేదని, పార్టీ అధినేత నిర్ణయించాల్సిందేనని అన్నారు. అధిష్టానం ఆదేశించిన విధంగా తాను ముందుకు పోతానని ఆయన కార్యకర్తలకు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో నాయకులు గాజుల ఉమామహేశ్వరరావు, పంతంగి వెంకటేశ్వర్లు, మదార్సాహెబ్, భీరెడ్డి నాగ చంద్రరెడ్డి, రాయపూడి జయకర్, హన్మంతరెడ్డి, రాజేందర్ పాల్గొన్నారు. -
కాంగ్రెస్ ఎంపీలకు సోనియా విందు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ సోమవారం రాత్రి విందు ఇచ్చారు. ఢిల్లీలోని సోనియా నివాసంలో జరిగిన ఈ విందు సమావేశానికి.. సీమాంధ్ర నుంచి కేంద్రమంత్రులు కావూరి సాంబశివరావు, కిశోర్చంద్రదేవ్, పళ్లంరాజు, చిరంజీవి, జె.డి.శీలం, పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణి, ఎంపీలు బొత్స ఝాన్సీ, కనుమూరి బాపిరాజు, టి.సుబ్బిరామిరెడ్డి తదితరులు హాజరయ్యారు. తెలంగాణ నుంచి కేంద్రమంత్రులు ఎస్.జై పాల్రెడ్డి, బలరాంనాయక్, సర్వే సత్యనారాయణ, ఎంపీలు పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్రెడ్డి, మధుయాష్కీ, సిరిసిల్ల రాజయ్య, సురేష్శెట్కర్, వి.హనుమంతరావు, పాల్వాయి గోవర్ధన్రెడ్డి, రాపోలు ఆనంద్భాస్కర్, ఎం.ఎ.ఖాన్, రేణుకాచౌదరి, తదితరులు హాజరయ్యారు. టీఆర్ఎస్తో బంధం ఖరారుకాలేదు: సింఘ్వీ టీఆర్ఎస్తో కాంగ్రెస్ బంధం ఎలా ఉండాలన్న అంశంపై తుది నిర్ణయం జరగలేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి అభిషేక్సింఘ్వీ పేర్కొన్నారు. ‘తెలంగాణ, సీమాంధ్రకు సమన్యాయం చేసేందుకు కాంగ్రెస్ యత్నించినట్లుగా మరే పార్టీ చేయలేదు. అందుకు అనుగుణంగా అవసరమైన పొత్తులు పెట్టుకునేందుకు మేం సుముఖంగా ఉన్నాం. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదు’’ అని చెప్పారు. -
‘ఎవ్వడ్రా అక్కడ పిచ్చివేషాలు వేసేది’
ఖమ్మం: రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి తెలంగాణవాదులపై తనకు గల ద్వేషాన్ని మరోసారి వెళ్లగక్కారు. నూతనంగా ఎంపికైన సర్పంచ్లకు, పీఏసీఎస్ చైర్మన్లకు మంగళవారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ఆమె మాట్లాడుతుండగా ఇల్లెందు, టేకులపల్లి మండలానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.ఆగ్రహించిన రేణుక ‘ఎవ్వడ్రా అక్కడ పిచ్చివేషాలు వేసేది’ అని గద్దిస్తూ అధికారులు, కాంగ్రెస్ నాయకుల వైపు చూశారు. నినాదాలు చేసిన వారిని పోలీసులు బయటకు తీసుకువెళ్లారు. ఖమ్మం జిల్లా ఏర్పాటై 60 సంవత్సరాలు పూర్తై సందర్భంగా ఖమ్మంలోని స్తంభాద్రి గుట్టపై శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయంలో మంగళవారం ప్రారంభమైన అవతరణ వేడుకల్లోనూ రేణుకాచౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖమ్మంజిల్లా జ్యోతిని దేశమంతా ప్రతిబింబించేలా అవతరణ వేడుకలు నిర్వహిస్తామని అన్నారు. ప్రజలందరికీ జిల్లా చరిత్ర తెలిసేలా సమగ్ర సమాచారంతో ఒక సావనీర్ను రూపొందించనున్నట్లు తెలిపారు. -
సిఎమ్ స్వాగతిస్తే ఏంటీ, వ్యతిరేకిస్తే ఏంటీ? - రేణుక