Revenge
-
‘‘మా ప్రభుత్వాన్నే ప్రశ్నిస్తారా?..’’ 680 మందికి నోటీసులు.. 147 అక్రమ కేసులు.. 49 మంది అరెస్ట్
గుంటూరు, సాక్షి: ఏపీలో సోషల్ మీడియా యాక్టివిస్టులపై నిర్బంధాలు కొనసాగుతున్నాయి. రాజ్యాంగ హక్కులు కాలరాస్తూ చంద్రబాబు సర్కారు వికటాట్టహాసం చేస్తోంది. అక్రమ కేసులతో వేధించడంతో పాటు అడ్డగోలుగా నిర్బంధించి చిత్రహింసలకు గురి చేస్తోంది.మమ్మల్నే ప్రశ్నిస్తారా?.. అంటూ వైఎస్సార్సీపీ సో.మీ. కార్యకర్తలను, మద్దతుదారులను, సాధారణ ప్రజలనూ కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది. కూటమి పార్టీల మనుషులే ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి.. వాళ్లే ఫిర్యాదులు చేసి వైఎస్సార్సీపీ వాళ్లను అరెస్టులు చేయిస్తున్నారు. మరోవైపు.. జగన్, ఆయన కుటుంబ సభ్యులతో పాటు వైఎస్సార్సీపీ నేతలపైనా నీచంగా పోస్టులు పెట్టినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.కూటమి అరాచక పాలనలో గత వారం రోజుల్లోనే 147 అక్రమ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 680 మందికి నోటీసులు జారీ చేశారు. మరో 49 మంది అరెస్టు చేశారు. చంద్రబాబు ప్రభుత్వ ఆదేశాలతో కొందరు పోలీసులు కూడా అతి చేష్టలకు దిగుతున్నారు.నెట్టింట కూటమి ప్రభుత్వాన్ని వివిధ రూపాల్లో ప్రశ్నించేవారిని, నిలదీసేవారిని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని ఆరోపిస్తూ పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. సోషల్ మీడియా కార్యకర్తలను ఇలా పోలీసులు ఇబ్బంది పెడుతున్న వైనాన్ని ఏపీ డీజీపీ దృష్టికి తీసుకెళ్లింది వైఎస్సార్సీపీ. రెండ్రోజులు గడువు ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో కోర్టులకు వెళ్లాలని, రూల్స్కు వ్యతిరేకంగా వెళ్తున్న పోలీసులపై ప్రైవేట్ కంప్లయింట్లు చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. మరోవైపు..ఆ పార్టీ నేతలు జాతీయ మానవహక్కుల సంఘానికి వైఎస్సార్సీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. ఏపీలో కొనసాగుతున్న అరాచకాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. అదే సమయంలో సోషల్ మీడియా కార్యకర్తలకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ధైర్యం చెబుతున్నారు. న్యాయసహాయంతో పాటు అన్నిరకాలుగా సాయం అందించేందుకు విభాగాలను ఏర్పాటు చేయించారు. -
కాకి పగ పదిహేడేళ్లు..
పాములు పగబడతాయన్న మాట అప్పుడప్పుడూ వింటుంటాం. పాత సినిమాల్లో అయితే పగబట్టి వెంటాడే పాముల సీన్లూ చూసి ఉంటాం. మరి అవి అలా నిజంగా పోగబడతాయా? ఏమో చెప్పలేం. కానీ కాకులు మాత్రం పగబడతాయట. అదీ నెలో, ఏడాదో కాదు.. ఏకంగా 17 ఏళ్ల పాటు మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని మరీ పగ తీర్చుకునేందుకు ప్రయతి్నస్తాయట. వాషింగ్టన్ యూనివర్సిటీ పర్యావరణ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ఆ వివరాలేంటో చూద్దామా..కొన్ని కాకులను బంధించి.. పక్షుల్లో కాకులను బాగా తెలివైనవిగా భావిస్తారు. తమకు ఆహారం వేసే మనుషులను గుర్తించగలవని కూడా ఇంతకుముందే తేల్చారు. అదే సమయంలో తమకు కీడు చేయడానికి ప్రయతి్నంచిన, భయపెట్టినవారిపై పగబడతాయని తాజాగా తేల్చారు. దీనిపై వాషింగ్టన్ యూనివర్సిటీ పర్యావరణ శాస్త్రవేత్త ప్రొఫెసర్ జాన్ మార్జలఫ్ నేతృత్వంలోని పరిశోధకులు సుదీర్ఘ ప్రయోగం చేశారు. 2006లో దెయ్యం లాంటి ఓ మాస్కు పెట్టుకుని.. యూనివర్సిటీ క్యాంపస్లో కొన్ని కాకులను పట్టి బంధించారు. వాటిని కాసేపు భయపెట్టినట్టుగా చేశారు. తర్వాత వాటి కాళ్లకు ఐడెంటిఫికేషన్ రింగులను వేసి వదిలేశారు.మాస్క్ తో వెళితే వెంటాడుతూ.. శాస్త్రవేత్తలు ఆ తర్వాతి నుంచి క్యాంపస్లో ఆ దెయ్యం మాస్కు వేసుకుని కొన్నిసార్లు, వేసుకోకుండా మరికొన్నిసార్లు, వేరే ఇతర మాస్క్ లు పెట్టుకుని ఇంకొన్నిసార్లు తిరుగుతూ కాకులకు ఆహారం పెట్టడం మొదలుపెట్టారు. ఈ సమయంలో వాటి స్పందనను రికార్డు చేస్తూ వచ్చారు. శాస్త్రవేత్తలు దెయ్యం మాస్కు వేసుకుని వెళ్లినప్పుడు కాకులు.. తీవ్రంగా అరుస్తూ, వెంటాడుతూ రావడాన్ని.. మాస్క్ లేనప్పుడు, వేరే మాసు్కలు వేసుకున్నప్పుడు అవి మామూలుగానే ఉండటాన్ని రికార్డు చేశారు. అయితే క్రమంగా ఇలా వెంటాడటం తగ్గిందని, సుమారు 17 ఏళ్ల తర్వాత అవి వెంటాడటం ఆగిపోయిందని ప్రొఫెసర్ జాన్ మార్జలఫ్ చెప్తున్నారు.పక్కాగా గుర్తించి మరీ వెంటాడాయి..‘‘కొందరు వలంటీర్లకు వేర్వేరు మోడళ్లలోని మాస్కులు ఇచ్చి, యూనివర్సిటీ, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరగాలని చెప్పాం. అందులో మేం కాకులను పట్టుకుని, భయపెట్టినప్పటి మాస్క్ లు వేసుకున్నవారిని మాత్రమే కాకులు టార్గెట్ చేశాయి. గట్టిగా అరవడం, వేగంగా వచ్చి కాళ్లతో తన్నడం వంటివి చేశాయి. మేం బంధించిన కాకులు మాత్రమేకాకుండా వేరే కాకులు కూడా ఇలా చేశాయి. అవి ప్రమాదకరమని భావించిన వాటిపై సమాచారం ఇచి్చపుచ్చుకోవడమే దీనికి కారణం’’ అని ప్రొఫెసర్ వెల్లడించడం గమనార్హం. ..: సాక్షి సెంట్రల్ డెస్క్ :.. -
పబ్లిక్గా.. లోకం మాధవి పరువు తీసిన టీడీపీ
విజయనగరం, సాక్షి: కూటమి భాగస్వామ్య పార్టీలు టీడీపీ-జనసేన నేతల మధ్య విభేదాలు కొత్తకాదు. కానీ, ప్రభుత్వం ఏర్పాటయ్యాక కూడా అవి అంతే స్థాయిలో కొనసాగుతూ వస్తుండడం గమనార్హం. ఈ తగవులు ఇరు పార్టీల అధినేతల దృష్టిలోకి తరచూ వెళ్తున్నాయి. అయితే ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కువగా కాంప్రమైజ్ అవుతూ వస్తుండడం గమనిస్తున్నదే. తాజాగా..మరోమారు ఆయా పార్టీల నేతల మధ్య విభేదాలు బహిర్గతం అయ్యాయి. నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం నాగ మాధవి, ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు మధ్య జరిగిన వివాదం రచ్చకెక్కింది. అది ఎక్కడదాకా వెళ్లింది అంటే.. బహిరంగంగా సమావేశం నిర్వహించి మరీ మాధవి పరువును తీసిపారేశారు టీడీపీ నేతలు.‘‘ముంజేరు ఆడపడుచు అంటూ ఆమె గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. ఆమె నియోజకవర్గానికి ఏదో మంచి చేయాలని రాలేదు. కేవలం తన 30 ఎకరాల భూమిని రక్షించుకునేందుకే రాజకీయాల్లోకి వచ్చారు..’’ అంటూ ఓ టీడీపీ నేత ఒకరు వేదిక మీద మాట్లాడారు.తాము వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కూడా ఇంత ఇబ్బంది పడలేదని మరో టీడీపీ నేత వ్యాఖ్యానించగా.. మాధవి ఎలాగైనా టీడీపీని లేకుండా చేయాలని ప్రయత్నిస్తోందని, టీడీపీ వాళ్లను కూలీల్లాగా తీసి పారేస్తోందని ఆవేశంగా ఓ మహిళా నేత మాట్లాడారు. ఇలా.. టీడీపీ నేతలంతా ఆమెపై ఆరోపణలు, విమర్శలు, తీవ్ర వ్యాఖ్యలు చేశారు.బంగార్రాజు రివెంజా?బుధవారం నెల్లిమర్ల నగర పంచాయతీ సమావేశం వేదికగా మాధవి-బంగార్రాజు మధ్య విభేదాలు బయటపడ్డాయి. సమావేశంలో మాధవి మాట్లాడుతుండగా.. బంగార్రాజు అడ్డుకుని ఏదో ప్రశ్న వేశారు. దానికి ఆమె కాసేపు ఆగాలంటూ ఆయనకు సూచించారు. దీంతో మొదలైన గొడవ తీవ్ర రూపం దాల్చింది. దీంతో సమావేశం మధ్యలోనే ఎమ్మెల్యే బయటకు వెళ్లిపోయారు. ఆపై ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని బంగార్రాజు మీడియాకు చెప్పారు. ఈలోపే.. నలుగురిలో తనకు జరిగిన అవమానానికి తన అనుచరగణంతో పబ్లిక్గా మీటింగ్ పెట్టించి మరీ ఇలా రివెంజ్ తీర్చుకుని ఉంటారనే చర్చ నడుస్తోందక్కడ. -
స్థిరత్వం లేని ట్రంప్ను ఓడించండి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రచారం వేడెక్కుతోంది. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ తన ప్రత్యర్థి, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్పై మరోసారి విరుచుకుపడ్డారు. ట్రంప్ ఏమాత్రం స్థిరత్వం లేని మనిషి, ప్రతీకారమే అతడి విధానమని మండిపడ్డారు. విభజనవాది, గందరగోళానికి మారుపేరైన ట్రంప్ను చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తాజాగా డెమొక్రటిక్ ఎన్నికల ప్రచార సభలో కమలా హారిస్ మాట్లాడారు. అమెరికా పౌరులపైకి అమెరికా సైన్యాన్ని ప్రయోగించాలనుకుంటున్న ట్రంప్కు బుద్ధి చెప్పాలని సూచించారు. వ్యతిరేకులను బల ప్రయోగంతో అణచివేయాలన్నదే ఆయన ఆలోచన అని ఆరోపించారు. ప్రజలను శత్రువులుగా భావిస్తున్న ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎంతమాత్రం పనికిరారని తేల్చిచెప్పారు. ప్రజలు కోరుకుంటున్న కొత్త తరం నాయకత్వాన్ని పరిచయం చేస్తానని, అధ్యక్ష ఎన్నికల్లో తనను గెలిపించాలని ఓటర్లకు కమలా హారిస్ విజ్ఞప్తి చేశారు. ప్రజలకు మేలు చేయడమే తన లక్ష్యమని, అందుకోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని స్పష్టంచేశారు. దుష్ట స్వభావం కలిగిన వ్యక్తులపై, స్వప్రయోజనాల కోసం పాకులాడే శక్తులపై కఠినమైన పోరాటానికి భయపడబోనని చెప్పారు. తన తల్లి తనకు ధైర్యసాహసాలు నూరిపోశారని వ్యాఖ్యానించారు. కష్టపడి పనిచేసే నిజాయతీపరులైన ప్రజలను స్వార్థ శక్తుల నుంచి కాపాడుతానని హామీ ఇచ్చారు. అధికారికంలోకి వచ్చాక రాజకీయాలకు అతీతంగా అందరి బాగు కోసం కృషి చేస్తానని ప్రకటించారు. అన్ని పార్టీలతో కలిసి పని చేస్తానన్నారు. అమెరికా అధ్యక్షురాలిగా తాను భిన్నమైన సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని కమలా హారిస్ ఉద్ఘాటించారు. ఆకాశాన్నంటున్న ధరలే తన ముందున్న అతిపెద్ద సవాలు అని చెప్పారు. ధరలు తగ్గించడానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తానని వెల్లడించారు. నాకు ఓటేయని వారికీ ప్రతినిధినే: హారిస్బైడెన్ వివాదం నేపథ్యంలో వ్యాఖ్యలువాషింగ్టన్: ‘‘నేను అమెరికన్లందరికీ ప్రాతినిధ్యం వహిస్తా. అధ్యక్ష ఎన్నికల్లో నాకు ఓటేయని వారు కూడా అందులో భాగమే’’ అని హారిస్ స్పష్టం చేశారు. ట్రంప్ మద్దతుదారులను ‘చెత్త’గా అభివర్ణిస్తూ అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీయడం తెలిసిందే. వాటిపై హారిస్ ఇలా స్పందించారు. ఎవరికి ఓటేస్తారన్న దాని ఆధారంగా వ్యక్తులపై విమర్శలు చేయడాన్ని తాను అంగీకరించబోనని స్పష్టం చేశారు. -
టాటా ప్రతీకారం అలా తీరింది..!
దేశం అత్యంత ఎత్తైన పారిశ్రామిక శిఖారాన్ని కోల్పోయింది. టాటా గ్రూప్ ఎమిరిటస్ చైర్మన్ రతన్ టాటా బుధవారం రాత్రి ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు. అనేక రకాల వ్యాపారాల్లో చరిత్ర సృష్టించిన టాటా గ్రూప్నకు వైఫల్యాలు, వాటి నుంచి అద్భుతంగా పునరాగమనం చేసిన చరిత్ర కూడా ఉంది.టాటా కలను ఎగతాళి చేశారు..కార్పొరేట్ చరిత్రలో టాటా వర్సెస్ ఫోర్డ్ ఉదంతానికి ప్రత్యేక స్థానం ఉంది.90 దశకం చివరలో అప్పుడు టాటా మోటర్స్ టాటా ఇంజినీరింగ్ అండ్ లోకోమోటివ్ కో అనే పేరుతో ఉండేది. అప్పట్లో టాటా ఇండికా అనే కొత్త మోడల్ కారును లాంచ్ చేసింది. టాటా ఇండికాతో టాటా మోటర్స్ను దేశ ఆటోమొబైల్ రంగంలో కీలక సంస్థగా తీర్చిదిద్దాలన్నది స్వయంగా రతన్ టాటా కలగా ఉండేది. అయితే దేశంలోని కార్ల పరిశ్రమ సవాలుగా ఉన్న సమయంలో ఇండికాకు పెద్దగా ఆదరణ లభించలేదు.అసలే టాటా గ్రూప్నకు కార్ల కొత్త. దీంతో టాటామోటర్స్ ప్యాసింజర్ కార్ల విభాగాన్ని అమ్మేద్దాం అనుకున్నారు. అమెరికా ఆటోమొబైల్స్ సంస్థ ఫోర్డ్.. ఈ విభాగాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపింది. అలా 1999లో టాటా తన బృందంతో కలిసి టాటా మోటార్స్ ప్యాసింజర్ కార్ విభాగం విక్రయంపై చర్చించేందుకు ఫోర్డ్ ఎగ్జిక్యూటివ్లతో సమావేశం కోసం డెట్రాయిట్కు వెళ్లారు.అయితే సమావేశం అనుకున్న విధంగా జరగలేదు. ఫోర్డ్ ఎగ్జిక్యూటివ్లు టాటాను ఎగతాళి చేశారు. "మీరు కార్ల వ్యాపారంలోకి ఎందుకు వచ్చారు? దాని గురించి మీకు ఏమీ తెలియదు. మేము మీ కార్ల విభాగాన్ని కొనుగోలు చేస్తే అది మీకు చాలా మేలు చేసినట్లవుతుంది" అని వారిలో ఒకరు చాలా తక్కువ చేసి మాట్లాడారు. ఇది టాటాను, వారి బృందాన్ని తీవ్రంగా బాధించింది. దీంతో ఒప్పందాన్ని వద్దనుకుని భారత్కి తిరిగొచ్చేశారు.ప్రతీకారం ఇలా తీరింది..తరువాత టాటా మోటర్స్ పుంజుకుంది. టాటా ఇండికాకు క్రమంగా ఆదరణ పెరిగింది. భారతీయ కార్ మార్కెట్లో మొట్టమొదటి డీజిల్ హ్యాచ్బ్యాక్గా విజయవంతమైంది. తొమ్మిదేళ్ల తర్వాత 2008లో ప్రపంచ ఆర్థిక మాంద్యం కారణంగా ఫోర్డ్ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. దాని లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ను విక్రయానికి పెట్టింది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ను ఫోర్డ్ నుండి 2.3 బిలియన్ డాలర్లకు టాటా మోటార్స్ కొనుగోలు చేసింది. టాటాకు ఫోర్డ్ చేసిన అవమానానికి ఇలా ప్రతీకారం తీరింది. -
22 ఏళ్ల తర్వాత పగ తీర్చుకున్న వ్యక్తి.. తండ్రిని చంపినట్లే..
ఓ వ్యక్తి తన పగను తీర్చుకున్నాడు. అయితే ఒకటి రెండేళ్లకు కాదు ఏకంగా 22 ఏళ్ల తర్వాత తన తండ్రిని చంపిన హంతకుడిని మట్టుబెట్టాడు. ఒకప్పుడు తన తండ్రిని ఎలా చంపాడే సదరు వ్యక్తిని కూడా అలాగే చంపేశాడు. ఈ ఘటన గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగింది.పోలీసుల వివరాల ప్రకారం.. అక్టోబర్ 1న అహ్మదాబాద్ నఖత్ సింగ్ భాటి(50) అనే వ్యక్తి సైకిల్పై వెళ్తుండగా కారు ఢీకొనడంతో మరణించినట్లు సమాచారం అందింది. నఖత్ సింగ్ భాటీ అహ్మదాబాద్లో థాల్తేజ్ లోని ఓ కాలేనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ముందుగా ఇది ప్రమాదంగా భావించిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా హత్యకు గురైనట్లు తేలింది.నిందితుడు గోపాల సింగ్ భాటి ఉద్దేశపూర్వకంగానే నఖత్ను గుద్ది పారిపోయేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. 2002లో రాజస్థాన్లో 22 ఏళ్ల క్రితం తన తండ్రి కూడా ఇదే విధంగా నఖత్ హత్య చేసినట్లు పోలీసులకు వెల్లడించాడు. అందుకే ఇప్పుడు అతన్ని చంపి పగ తీర్చుకున్నట్లు తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. -
సీనియర్ ఐపీఎస్ అధికారులపై కూటమి ప్రభుత్వం కక్ష
-
చంద్రబాబూ.. ఛీ అనిపించుకోకండి: కేఏ పాల్
విశాఖపట్నం, సాక్షి: ఏపీలో జరుగుతున్న ప్రతీకార రాజకీయ దాడుల పర్వంపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ స్పందించారు. రాజకీయంగా కక్షలు తీర్చుకోనని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు దాడులకు దిగిన తన కార్యకర్తలను కంట్రోల్ చేయలేకపోతున్నారని మండిపడ్డారాయన. ఈ మేరకు కేఏ పాల్ ఓ వీడియో విడుదల చేశారు. ‘‘చంద్రబాబు గారూ.. మన రాష్ట్రం ఏమైపోతోంది. ఈ వయసులో మీ పార్టీ కార్యకర్తలను మీరు అదుపు చేయలేరా?. ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి ఎలా గెలిచారో అందరికీ తెలుసు. బుద్ధి లేని మీ పార్టీ గాడిదలకు చెప్పండి. ఇంత నీచమైన స్థితికి మీ పార్టీ కార్యకర్తలు దిగజారిపోయారు. ప్రజల చేత ఛీ అనిపించుకోకండి. చరిత్ర హీనులు కాకండి’’ అని పాల్ హితవు పలికారు. ‘‘గతంలో ఇలాంటి దాడుల్ని జగన్ పార్టీ ఏనాడూ ప్రొత్సహించలేదు. కానీ, కక్ష తీర్చుకోను అని చెప్పి.. ఇప్పుడు మీ కార్యకర్తలు చేస్తోంది ఏంటి?. లా అండ్ ఆర్డర్ మెయింటెన్ చేయలేని మీరూ.. ఆరునెలలకు మించి ముఖ్యమంత్రిగా ఉండలేరు. రాష్ట్రం అభివృద్ధి బాటలో వెళ్లాలంటే ఇలాంటి కక్షపూరిత రాజకీయాలను వదిలేయాలి. కక్ష పూరిత రాజకీయాలు మానేసి రాష్ట్రం బాగు చేయడం కోసం పాటు పడాలి. ఇంకో 48 గంటల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలి. లేకుంటే మీరు రాష్ట్రాన్ని పాలించేందుకు పనికి రారని కోర్టుకు వెళ్లా. అక్కడా న్యాయం జరగకపోతే దేవుడి కోర్టుకు వెళ్తా’’ అని ఆయన హెచ్చరించారు. -
వైజాగ్ టెస్టులో టీమిండియా ఘన విజయం.. సిరీస్ సమం
భారీ లక్ష్య ఛేదనలో ‘బజ్బాల్’ మంత్రం పని చేయలేదు...దూకుడైన ఆటతో చెలరేగి విజయతీరం చేరాలనుకున్న ఇంగ్లండ్ ఆటలు సాగలేదు...భారత బౌలింగ్ సామర్థ్యం ముందు బ్యాటర్లు తలవంచారు...మన బౌలర్ల ప్రతిభకు తోడు స్వీయతప్పిదాలు పర్యాటక జట్టును దెబ్బ తీశాయి...కీలక సమయాల్లో వికెట్లు తీసిన టీమిండియా నాలుగో రోజే ఇంగ్లండ్ను పడగొట్టింది...హైదరాబాద్లో ఎదురైన ఓటమికి విశాఖపట్నంలో ప్రతీకారం తీర్చుకుంది. తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో సిరీస్ను 1–1తో సమం చేసి రాబోయే టెస్టులపై ఆసక్తిని పెంచింది. తొలి ఇన్నింగ్స్కంటే మరింత పదునైన బంతులతో చెలరేగిన బుమ్రా ఇంగ్లండ్ను ఉక్కిరిబిక్కిరి చేయగా, అశ్విన్ అండగా నిలిచాడు. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగానే ఉన్నా...పెద్దగా స్పిన్ టర్న్ లేకపోయినా క్రాలీ మినహా ఎవరూ నిలవలేకపోయారు. అద్భుత ఫీల్డింగ్ భారత బలాన్ని రెట్టింపు చేసి విజయానికి బాటలు వేసింది. స్టోక్స్ సేన తాము ఆశించినట్లుగా గెలుపు పక్షాన నిలవలేకపోయినా...నాలుగో ఇన్నింగ్స్లో మూడు వందల పరుగులకు చేరువగా వచ్చి గట్టి పోటీనివ్వగలిగామనే సంతృప్తితో ముగించింది. విశాఖ స్పోర్ట్స్: భారత గడ్డపై ఒక విదేశీ జట్టు నాలుగో ఇన్నింగ్స్లో లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని అందుకున్న సందర్భాల్లో ఆ టీమ్ సాధించిన అత్యధిక స్కోరు 276 పరుగులు...ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ అంతకంటే ఎక్కువ పరుగులే చేసింది. కానీ చివరకు ఆ పోరాటం సరిపోక వందకు పైగా పరుగుల భారీ తేడాతో ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. సోమవారం నాలుగో రోజే ముగిసిన రెండో టెస్టులో భారత్ 106 పరుగుల తేడాతో ఇంగ్లండ్పై ఘన విజయం సాధించింది. 399 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్నైట్ స్కోరు 67/1తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్లో 69.2 ఓవర్లలో 292 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలీ (132 బంతుల్లో 73; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో టాప్ స్కోరర్గా నిలవగా...టామ్ హార్ట్లీ (47 బంతుల్లో 36; 5 ఫోర్లు, 1 సిక్స్), బెన్ ఫోక్స్ (69 బంతుల్లో 36; 4 ఫోర్లు, 1 సిక్స్) చివర్లో ప్రతిఘటించారు. ఈ ఇన్నింగ్స్లో 3 వికెట్లు తీసిన ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జస్ప్రీత్ బుమ్రా (9/91) మ్యాచ్లో మొత్తం 9 వికెట్లతో టెస్టు ఫలితాన్ని శాసించగా, అశ్విన్ 3 వికెట్లు తీశాడు. తాజా ఫలితం తర్వాత ఐదు టెస్టుల సిరీస్లో ఇరు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. కొంత విరామం తర్వాత ఈ నెల 15నుంచి రాజ్కోట్లో మూడో టెస్టు జరుగుతుంది. రూట్, స్టోక్స్ విఫలం... ఓపెనర్ క్రాలీతో పాటు నైట్వాచ్మన్ రేహన్ అహ్మద్ (27 బంతుల్లో 28; 6 ఫోర్లు) కూడా సోమవారం ఉదయం కొద్ది సేపు భారత బౌలర్లను ఇబ్బంది పెట్టాడు. ఎట్టకేలకు బుమ్రా ఈ జోడీని విడదీసినా ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన ఒలీ పోప్ (23) ఒక్క అక్షర్ బౌలింగ్లోనే ఐదు ఫోర్లు బాదాడు. స్లిప్లో రోహిత్ సూపర్ క్యాచ్కు పోప్ వెనుదిరిగాడు. అయితే చెత్త షాట్తో రూట్ భారత్కు కీలక వికెట్ ఇచ్చేశాడు. అశ్విన్ బౌలింగ్లో మిడ్ వికెట్ వైపు గుడ్డిగా ఆడబోయిన రూట్ బ్యాక్వర్డ్ పాయింట్లో క్యాచ్ ఇచ్చాడు. దాంతో ఇంగ్లండ్ జోరుకు కళ్లెం పడింది. ఆపై లంచ్ విరామానికి ముందు రెండు ఓవర్లలో రెండు వికెట్లు పడగొట్టిన టీమిండియా విజయానికి బాటలు వేసుకుంది. కుల్దీప్ బౌలింగ్లో క్రాలీ వికెట్ల ముందు దొరికిపోగా, డీఆర్ఎస్ ఫలితం కాస్త చర్చకు దారి తీసింది. బుమ్రా బంతికి బెయిర్స్టో వద్ద జవాబు లేకపోయింది. స్టోక్స్ ఉన్నంత వరకు కాస్త ఆశలు ఉన్నా...అతని రనౌట్తో జట్టు ఓటమి దాదాపుగా ఖాయమైంది. సింగిల్ తీసే క్రమంలో స్టోక్స్ బద్ధకంగా కదలగా...అయ్యర్ మెరుపు త్రో అతని ఆటను ముగించింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్ 396; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 253; భారత్ రెండో ఇన్నింగ్స్ 255; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: క్రాలీ (ఎల్బీ) (బి) కుల్దీప్ 73; డకెట్ (సి) భరత్ (బి) అశ్విన్ 28; రేహన్ (ఎల్బీ) (బి) అక్షర్ 23; పోప్ (సి) రోహిత్ (బి) అశ్విన్ 23; రూట్ (సి) అక్షర్ (బి) అశ్విన్ 16; బెయిర్స్టో (ఎల్బీ) (బి) బుమ్రా 26; స్టోక్స్ (రనౌట్) 11; ఫోక్స్ (సి) అండ్ (బి) బుమ్రా 36; హార్ట్లీ (బి) బుమ్రా 36; బషీర్ (సి) భరత్ (బి) ముకేశ్ 0; అండర్సన్ (నాటౌట్) 5; ఎక్స్ట్రాలు 15; మొత్తం (69.2 ఓవర్లలో ఆలౌట్) 292. వికెట్ల పతనం: 1–50, 2–95, 3–132, 4–154, 5–194, 6–194, 7–220, 8–275, 9–281, 10–292. వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) పా యింట్ల పట్టికలో భారత్ ముందుకు దూసుకుపోయింది. ఇప్పటి వరకు ఐదో స్థానంలో ఉన్న భారత్ ఈ గెలుపుతో మూడు స్థానాలు మెరుగుపర్చుకొని రెండో స్థానానికి (52.77 పాయింట్ల శాతం) చేరుకుంది. ఆ్రస్టేలియా అగ్రస్థానంలో (55 పాయింట్ల శాతం) కొనసాగుతోంది. -
జైలర్ మూవీ పై పగ తీర్చుకుంటున్న దళపతి ఫ్యాన్స్..
-
ఎక్స్ బాయ్ ఫ్రెండ్పై జొమాటో ద్వారా రివేంజ్! యువతి చేసిన పనికి..
ఎవరికైనా ఆకలేస్తే ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి స్విగ్గి, జొమాటో వంటి యాప్స్ ఉపయోగిస్తారు. కానీ ఒక యువతీ తన బాయ్ ఫ్రెండ్ మీద రివేంజ్ తీసుకోవడానికి జొమాటో వాడింది. వినటానికి వింతగా అనిపించినా ఇది నిజం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న ఒక యువతికి తన బాయ్ ఫ్రెండ్తో మనస్పర్థలు రావడంతో రివెంజ్ తీసుకోవడానికి.. అతని అనుమతి లేకుండానే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్తో జొమాటో నుంచి ఫుడ్ ఆర్డర్ చేసింది. తీరా డెలివరీ బాయ్ ఆ యువకుని అడ్రస్కి వెళితే నేను ఆర్డర్ పెట్టలేదని, డబ్బు ఇవ్వనని వాదించాడు. (ఇదీ చదవండి: ధనవంతుడవ్వాలనే తపన సరిపోదు.. ఈ టిప్స్ తప్పనిసరి!) ఇలా ఆ యువతి తన బాయ్ ఫ్రెండ్కి మూడు సార్లు ఫుడ్ ఆర్డర్ చేసింది. మూడు సార్లు నేను ఆర్డర్ చేయలేదని ఆ యువకుడు డబ్బు ఇవ్వకుండా డెలివరీ బాయ్ని వెనక్కి పంపించాడు. దీంతో విసిగిపోయిన కంపెనీ నేరుగా ఆ యువతికి దయచేసి ఇలా చేయడం ఆపండి అంటూ ట్వీట్ చేసింది. ఇది కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. Ankita from Bhopal please stop sending food to your ex on cash on delivery. This is the 3rd time - he is refusing to pay! — zomato (@zomato) August 2, 2023 -
పక్కింట్లో పార్టీ హోరు.. నిద్ర పట్టని ఆమె తీసుకున్న నిర్ణయం ఇదే..
పక్కింటివారి వలన మనం ఒక్కొక్కసారి ఇబ్బందులు పడుతుంటాం. ఇటువంటి సందర్బాల్లో వారికి అభ్యంతరం చెప్పలేక మనకి మనమే సతమతమైపోతుంటాం. ఒక మహిళకు ఇటువంటి అనుభవమే ఎదురయ్యింది. పక్కింటివారి వ్యవహారం వలన ఆమెకు నిద్ర కూడా కరువయ్యింది. దీనిని ఎదుర్కొనేందుకు ఆమె చేసిన ఒక పని అవతలివారి ఆట కట్టించింది. ‘నిద్ర కూడా పోనివ్వడంలేదు’ ఆ మహిళ రెడిట్లో తన అనుభవాన్ని షేర్ చేసింది. తన పక్కింట్లో ఉన్నవారు ప్రతీరోజూ సాయంత్రం పార్టీలు నిర్వహిస్తూ, పెద్ద ఎత్తున మ్యూజిక్ సౌండ్ వినిపిస్తుడటంతో ఆమెకు నిద్ర కూడా పట్టేదికాదు. వీరి ఇళ్ల మధ్య సన్నని గోడ మాత్రమే అడ్డుగా ఉన్న కారణంగా రాత్రివేళ ఆ ఇంటిలోని సౌండ్ హోరు ఈ మహిళను తెగ ఇబ్బంది పెట్టేది. దీంతో ఆ మహిళ నిద్ర పట్టక ఆ విషయాన్ని పక్కింటివారికి చెప్పింది. సౌండ్ తగ్గించాలని కూడా కోరింది. పక్కింటివారు మాట విన్నప్పటికీ.. ఆ మహిళ చెప్పింది విన్న పక్కింటివారు మ్యూజిక్ సౌండ్ తగ్గించినప్పటికీ, అక్కడి వారి మాటల హోరు కారణంగా ఆమె ఇబ్బంది ఏమాత్రం తగ్గలేదు. ఇక ఆ ఇంటిలో ఉండటం కష్టమని ఆమెకు అనిపించింది. ఏ మాత్రం ప్రశాంతత లేదని భావించింది. ‘ఇది మా సమస్య కాదు’ ఈ విధంగా అమె ఐదు నెలల పాటు పక్కింటివారితో ఇబ్బందులను ఎదుర్కొంది. తిరిగి మారోమారు వారిని సౌండ్ తగ్గించాలని కోరింది. అయితే పక్కింటివారు ఆమెతో ‘ఇది మా సమస్య కాదు’ అని సమాధానం ఇచ్చారు. ఈ మాట విన్నవెంటనే ఆమెకు ఆగ్రహం కలిగింది. దీంతో పక్కింటి వారికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. వారి శైలిలోని సమాధానం చెప్పాలని.. ఈ మాట వినగానే ఆమె పక్కింటివారికి వారి శైలిలోనే సమాధానం చెప్పాలని అనుకుంది. వెంటనే ఒక పెద్ద స్పీకర్ కొనుగోలు చేసింది. ఫుల్ వాల్యూమ్తో రాత్రంతా మ్యూజిక్ వినిపిస్తూనే ఉంది. దీంతో పక్కింటిలోని వారికి నిద్ర ఎగిరిపోయింది. వెంటనే వారు ఆ మహిళ దగ్గరకు వచ్చి.. మ్యూజిక్ సౌండ్ తగ్గించాలని కోరారు. అప్పుడు ఆమె ‘ఇది నా సమస్య కాదు’ అని సమాధానం చెప్పింది. ‘ఇది పిల్లల ఆట’ ఆ మహిళ పోస్టును చూసిన పలువురు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్ ‘ఇది పిల్లల ఆట’లా ఉందని పేర్కొనగా, మరొకరు ‘పక్కంటి వారు పార్టీ చేసుకునే సమయంలో మీరు పడుకుంటే అది మీ సమస్య. దానిలో వారి తప్పేమీ లేదు’ అని అన్నారు. ఇంకొక యూజర్ ‘మీరు మంచి పని చేశారు. ఇటువంటి వారికి బుద్ది చెప్పడం ఎంతో అవసరం’ అని అన్నారు. ఇది కూడా చదవండి: సినిమాల్లో నటి నుంచి సెక్స్ రాకెట్ దాకా.. -
హర్షదీప్ పై తిలక్ వర్మ రివెంజ్ మాములుగా లేదు గా..
-
ఇదేం పగరా నాయనా.. 1,100 కోళ్లను భయపెట్టి చంపడమేంది?
బీజింగ్: పక్కింటి వ్యక్తిపై ప్రతీకారంతో ఓ వ్యక్తి విచిత్ర చర్యకు పాల్పడ్డాడు. అతనికి చెందిన 1,100 కోళ్లను భయభ్రాంతులకు గురి చేసి వాటి మరణానికి కారణమయ్యాడు. వినడానికి కాస్త వింతగా ఉన్న ఈ ఘటన చైనాలో గతవారం జరిగింది. ఏం జరిగిందంటే..? గూ, జోంగ్ అనే ఇద్దరు పక్కపక్క ఇళ్లలో నివసిస్తారు. గతేడాది ఏప్రిల్లో జోంగ్.. గూ అనుమతి లేకుండా అతని చెట్లను నరికివేశాడు. దీంతో అప్పటి నుంచి గూ పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో తరచూ జోంగ్కు చెందిన కోళ్ల ఫాంకు రాత్రివేళల్లో పలుమార్లు వెళ్లాడు. కొద్ది రోజుల క్రితం ఓ రాత్రి జోంగ్ కోళ్ల ఫాం వద్దకు వెళ్లిన గూ.. సడన్గా ఫ్లాష్లైట్ ఆన్ చేశాడు. దీంతో అవి భయభ్రాంతులకు గురై అన్నీ ఓ మూలకు వెళ్లాయి. ఈ క్రమంలో ఒకదానిపై మరొకటి పడి 500 కోళ్లు చనిపోయాయి. జోంగ్ ఫిర్యాదు మేరకు గూను పోలీసులు అరెస్టు చేశారు. 500 కోళ్ల మరణానికి కారణమైనందుకు అతనికి రూ.35,713 జరిమానా కూడా విధించారు. ఆ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన గూకు పక్కింటి వ్యక్తిపై పగ మాత్రం చల్లారలేదు. దీంతో మరోసారి రాత్రివేళ కోళ్లఫాంకు వెళ్లి మళ్లీ ఫ్లాష్ లైట్ ఆన్ చేశాడు. ఈ సారి దాదాపు 640 కోళ్లు మరణించాయి. పోలీసులు మళ్లీ అతడ్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. గూ కావాలనే జోంగ్ కోళ్లను చంపి నష్టం కలిగేలా చేశాడని కోర్టు నిర్ధరించింది. అతడ్ని దోషిగా తేల్చి ఆరు నెలల కఠిన కారాగార శిక్ష విధించింది. చనిపోయిన 1,100 కోళ్ల విలువ రూ.1,60,000కు పైనే ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. చదవండి: నిరుపేదలుగా మారిన బిల్ గేట్స్, ట్రంప్, మస్క్, ‘ఇంత ఘోరంగా ఉన్నారేంటి!’ -
వాస్తవాన్ని వెంటాడుతూ గతం చేసిన యుద్ధమే ‘వీరఖడ్గం’
శ్రుతి ఢాంగే ప్రధానపాత్రధారిగా, సత్యప్రకాష్, ఆనంద్ రాజ్ ఇతర ముఖ్య తారాగాణంగా నటించిన చిత్రం ‘వీరఖడ్గం’. ఎంఏ చౌదరి దర్శకత్వంలో కె. కోటేశ్వరరావు నిర్మించిన ఈ రివెంజ్ బ్యాక్డ్రాప్ చిత్రం మార్చి మొదటి వారంలో రిలీజ్ కానుంది. ‘‘వాస్తవాన్ని వెంటాడుతూ గతం చేసిన యుద్ధమే ఈ ‘వీరఖడ్గం’ చిత్రం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. బ్రహ్మానందం, మదన్, తపస్వి, అపూర్వ పృధ్వీరాజ్ కీ రోల్స్ చేసిన ఈ చిత్రానికి సంగీతం: షయాక్పార్వాజ్, మాటలు: ఘటికాచలం, లైన్ ప్రొడ్యూసర్: మారిశెట్టి సునీల్కుమార్. -
ఇలా కూడా పగ తీర్చుకోవచ్చా..!
ఏర్పేడు(తిరుపతి జిల్లా): మనకు సరిపడని వ్యక్తిపై ఎలా అయినా పగ తీర్చుకోవచ్చు. అలాంటి సంఘటనే మండలంలోని గోవిందవరం పంచాయతీ జింకలమిట్ట గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతులు సుబ్రహ్మణ్యం నాయుడుకు, రాధికా కిరణ్కు మధ్య గత కొంతకాలంగా భూతగాదా నడుస్తోంది. అయితే తన పొలంలో సాగు చేసిన వరినారుపై రెండు రోజుల క్రితం రాధికాకిరణ్ కూలీలతో రాత్రిళ్లు కలుపు మందు పిచికారీ చేయించడంతో నారు ఎండిపోయిందని బాధితుడు ఏర్పేడు సీఐ శ్రీహరికి మంగళవారం ఫిర్యాదు చేశాడు. సుబ్రహ్మణ్యం నాయుడుకు 6 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. రబీ సీజన్లో వరి వేసుకునేందుకు నారు మడిని సిద్ధం చేసుకున్నాడు. అయితే భూతగాదా నడుస్తున్న నేపథ్యంలో అతను వరి నాట్లు వేయడానికి సాగు చేసిన నారుపై కలుపు మందు పిచికారీ చేయడంతో ఎండిపోయింది. అతని ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని సీఐ చెప్పారు. చదవండి: ఇద్దరు కుమార్తెలపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తల్లి -
ఫడణవీస్ 'ప్రతీకారం' వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన సంజయ్ రౌత్
ముంబై: తనకు వెన్నుపోటు పొడిచిన వాళ్లపై ప్రతీకారం తీర్చుకున్నానని మంగళవారం ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్. మాజీ ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రేను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే శివసేన(ఉద్ధవ్) సీనియర్ నేత సంజయ్ రౌత్ దీనిపై స్పందించారు. ఫడణవీస్ మాటలు మహారాష్ట్ర సంస్కృతికి పూర్తి విరుద్ధమని కౌంటర్ ఇచ్చారు. కొత్త ఒరవడి, సంప్రదాయాలకు శ్రీకారం చుడుతున్న ప్రస్తుత రాజకీయాల్లో ప్రతీకారానికి తావు లేదని పేర్కొన్నారు. ఫడణవీస్ మాటలు ఆయన స్థాయిని తగ్గించేలా ఉన్నాయని చెప్పారు. రాజకీయాల్లో అభిప్రాయ భేదాలు సహజమేనని, కానీ మహారాష్ట్రలో ఇప్పటివరకు ప్రతీకారం అనే పదాన్ని ఏ రాజకీయ నాయకుడు ఉపయోగించలేదని రౌత్ అన్నారు. ఫడణవీస్ వ్యాఖ్యలు దురదృష్టకరమని పేర్కొన్నారు. ఓ మరాఠీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు నమ్మకద్రోహం చేసిన వారిపై ప్రతీకారం తీర్చేసుకున్నానని ఫడణవీస్ అన్నారు. రాజకీయాల్లో తమ పక్కనే ఉండి, అధికారం పంచుకొని ఆ తర్వాత పదవుల కోసం వెన్నుపోటు పొడిచేవాళ్లు కచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారని వ్యాఖ్యానించారు. తనకు వెన్నుపోటు పొడిచిన వాళ్లపై తాను ఇప్పటికే ప్రతీకారం తీర్చుకున్నానని స్పష్టం చేశారు. ఆయన ఉద్ధవ్ థాక్రేను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారు. థాక్రే.. కాంగ్రెస్, ఎన్సీపీతో చేతులు కలిపి తన కాలిని తానే షూట్ చేసుకున్నాడని ఫడణవీస్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో శివసేనను చీల్చి ఏక్నాథ్ షిండే బీజేపీతో చేతులు కలిపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టారు. దేవేంద్ర ఫడణవీస్ డిప్యూటీ సీఎం అయ్యారు. సొంత పార్టీ నేతలే తిరుగుబావుటా ఎగురవేసినా.. ఉద్ధవ్ థాక్రే ఏమీ చేయలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఫడణవీస్ ప్రతీకారం తీర్చుకున్నానని వ్యాఖ్యానించారు. శివసేనను చీల్చి, థాక్రేను సీఎం పదవి నుంచి తప్పించి తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నానని చెప్పకనే చెప్పారు. చదవండి: కాంగ్రెస్కు మరో షాక్.. రాజస్థాన్ ఇన్ఛార్జ్ రాజీనామా -
జేమ్స్ బాండ్ సినిమా తరహాలో ప్రతీకారం తీర్చుకున్న అమెరికా
అల్ఖైదా అగ్రనేత అల్ జవాహిరీని అమెరికా వేటాడి, వెంటాడి ప్రాణాలు తీసిన వార్త కొంచెం ఆలస్యంగా వెలుగు చూసింది. గురికి బారెడు దూరంలో ఉన్న ఆస్తులకు, మనుషులకు ఏమాత్రం హాని కలిగించకుండా కేవలం లక్ష్యాన్ని మాత్రమే చేధించగల ఆధునిక క్షిపణి సాయంతో, అఫ్గానిస్తాన్లో తలదాచుకున్న ఆ ఉగ్రవాదిని మట్టుబెట్టింది. ఇరవై ఏళ్ళ క్రితం 2001 సెప్టెంబర్ 11 తేదీన (9/11) అప్పటి అల్ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ కారణంగా జరిగిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన 2,997 మంది అమెరికన్ కుటుంబాల బాధకు, ఆవేదనకు జవాహిరీ మరణం ఓ ముగింపు అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. 9/11గా ప్రసిద్ధమైన ఆనాటి విధ్వంసానికి ప్రతీకారంగా, అమెరికా పదేళ్ల తర్వాత, 2011లో బిన్ లాడెన్ను వధించి పగ తీర్చుకుంది. అప్పట్లో లాడెన్కు కుడి భుజంగా వ్యవహరించిన జవాహిరీని కూడా వదిలిపెట్టలేదు. మరో పదేళ్ల తర్వాత ఇప్పుడు అల్ జవాహిరీని చంపి, తమది పాము పగ అని అమెరికా యావత్ ప్రపంచానికీ మరోమారు చాటి చెప్పింది. ఈ నేపథ్యంలో గతంలో ఏం జరిగిందో చూద్దాం. ‘మతం కోసం ఎలాంటి మారణహోమానికి అయినా సిద్ధం’ అనే సిద్ధాంతం అల్ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ది. ‘ప్రపంచం మీద పెత్తనం కోసం ఎంతటి దురాగతానికయినా సంసిద్ధం’ అనే తత్వం అమెరికాది. ‘పాముకు పాలుపోసి పెంచుతాను, కానీ ఆ పాము తనను తప్ప ఎవరిని కాటేసినా ఫరవాలేదు అనే థియరీ’ అమెరికాది. ‘కోరల్లో దాచుకున్న విషం కక్కేటప్పుడు స్వపర భేదాల ప్రసక్తి పనికి రాదనే భావజాలం’ ఒసామాది. ఒకానొక కాలంలో అమెరికా తన అవసరాల కోసం పెంచి పోషించిన ఒసామా బిన్ లాడెన్ అనే ఈ విషనాగు, ఇరవై ఏళ్ళ క్రితం అమెరికాపైనే ఎదురుతిరిగి, పాలు పోసి పెంచిన చేతినే కాటేసింది. సోవియట్ యూనియన్ అంతర్ధానం తరువాత ఏర్పడ్డ ఏకధృవ ప్రపంచానికి... లేని పెద్దరికాన్ని ఆపాదించుకుని అనేక అకృత్యాలకు పాల్పడుతున్న అమెరికా అహంభావాన్ని... బిన్ లాడెన్ తనదైన శైలిలో దెబ్బ తీశాడు. అప్పుడు కానీ ‘పాము – పాలు’ కథ లోని అంతరార్థం అమెరికాకు అవగతం కాలేదు. తన దాకా వస్తేగాని తత్వం బోధపడదన్నట్టుగా... అల్ఖైదా తీవ్ర వాదులు 2001, సెప్టెంబర్ 11న వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట టవర్లను విమానాలతో ఢీ కొట్టించి కనీ వినీ ఎరగని భయోత్పాతాన్ని సృష్టించిన ఘటన తర్వాత గానీ ఉగ్రవాదం వల్ల పొంచి వున్న ముప్పు ఎలా ఉంటుందన్నది అమెరికాకు అర్థం కాలేదు. ఆనాటి పరాభవం అమెరికాలో పట్టుదలను పెంచింది. ఆ దురాగతానికి రూపశిల్పి అయిన ఒసామా బిన్ లాడెన్ అంతం చూడడానికి దశాబ్ద కాలంగా అమెరికా చేయని ప్రయత్నం అంటూ లేదు. చిట్టచివరికి, పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, పాకిస్తాన్ భూభాగంలో ఆ దేశ పాలకులకే తెలియకుండా తలదాచుకుంటున్న ఒసామా బిన్ లాడెన్ను, జల్లెడ పట్టి గాలించి పట్టుకుని మట్టు పెట్టేదాకా మాజీ అగ్ర రాజ్యాధినేత బరాక్ హుస్సేన్ ఒబామాకు కంటిమీద కునుకు లేకుండాపోయింది. ఒసామా మరణించిన విషయాన్ని స్వయంగా అమెరికన్ అధ్యక్షుడే ప్రకటించిన అంశాన్ని గమనిస్తే ఈ విషయానికి ఆ దేశం ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో విశదమవుతుంది. లాడెన్ మరణ వార్తను ధృవ పరచుకోవడానికి వీలుగా అమెరికా వ్యూహకర్తలు పకడ్బందీగా అమలు చేసిన హైటెక్ పద్ధతులు టీవీల్లో చూసినవారికి జేమ్స్ బాండ్ సినిమాలు జ్ఞప్తికి వచ్చాయి. వైట్ హౌస్లో కూర్చుని పథకం అమలవుతున్న తీరు తెన్నులను ఎప్పటి కప్పుడు ఉపగ్రహ సాయంతో గమనిస్తున్న ప్రెసిడెంట్ ఒబామా హావభావాలను బట్టి అన్ని దేశాలలోని టీవీ వీక్ష కులూ లాడెన్ మృతి పట్ల ఆ దేశానికి వున్న పట్టుదలను అర్థం చేసుకోగలిగారు. (క్లిక్: జవహరీ మృతిపై తాలిబన్ల సంచలన ప్రకటన) ఒసామా బిన్ లాడెన్ పూర్వీకులు ఎమెన్లో కడు నిరుపేదలు. అతడి తండ్రి మహమ్మద్ బిన్ లాడెన్, ఎమెన్ నుంచి ఉదర పోషణార్థం సౌదీ అరేబియాకు వలస వెళ్లి నిర్మాణ రంగంలో కాలుపెట్టి కోట్లకు పడగలెత్తాడు. గల్ఫ్ యుద్ధం సహాయక చర్యల్లో భాగంగా... అమెరికా మిలిటరీ స్థావరం ఏర్పాటుకు సౌదీ ప్రభుత్వం తన భూభాగంలో అనుమతించడాన్ని ఒసామా విమర్శించాడు. దీంతో కోపగించిన సౌదీ ప్రభుత్వం అతడి పౌరసత్వాన్నీ, పాస్పోర్ట్నూ రద్దు చేసింది. అప్పటికే లాడెన్ కుటుంబం కూడా ఒసామాను తమ నుంచి వెలి వేసింది. ఆ తర్వాత ప్రపంచంలోనే భయంకర ఉగ్రవాదిగా తయారయ్యి అమెరికా చేతిలో హతుడయ్యాడు. ఒసామా తర్వాత అల్ఖైదా పగ్గాలు చేపట్టిన అల్ జవాహిరీ కూడా లాడెన్ తరహాలోనే మరణించడం కాకతాళీయం. - భండారు శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్ట్ -
తొక్కి చంపినా కోపం చల్లారలేదా? భర్త ఆత్మ చేసిన పనట?!
నమ్మకం మనిషికి బలం.. మూఢనమ్మకం బలహీనత. కళ్ల ముందు ఏదైనా ఊహించని ఘటన జరిగితే.. అక్కడేదో ఉందనుకునే జనాలే మన చుట్టూరా ఎక్కువ!. అలాంటిదే ఈ ఘటన. ఆవేశంతో ఉన్న ఓ ఏనుగు ఓ మహిళను తొక్కి చంపడమే కాదు.. అంత్యక్రియలకు వచ్చి మరీ మళ్లీ మృతదేహంపై తన ప్రకోపాన్ని ప్రదర్శించింది. ఇదంతా చూసినవాళ్లు.. చనిపోయిన ఆమె భర్తే కారణమంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఒడిశా బరిపదాలోని రాయ్పల్ గ్రామంలో ఒంటరిగా నివసిస్తోంది మయ ముర్మూ(70). మంచి నీటి కోసం గురువారం పంపు మోటర్ దగ్గరకు వెళ్లింది. ఆ సమయంలో దాల్మా వైల్డ్లైప్ శాంక్చురీ నుంచి పొలాల్లోకి దూసుకొచ్చిన ఓ ఏనుగు ఆ వృద్ధురాలిపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించినా లాభం లేకుండా పోయింది. ఈలోపు సాయంత్రం అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు దూరపు బంధువులు. ఊరేగింపు తర్వాత.. ముర్మూ మృతదేహాన్ని చితి మీద ఉంచారు. అయితే అదే సమయంలో మళ్లీ హఠాత్తుగా ప్రత్యక్షమైంది అదే ఏనుగు. దీంతో జనాలంతా చెల్లాచెదురైపోయారు. ఈసారి చితి మీద నుంచి శవాన్ని తొండంతో ఎత్తి కిందపడేసి తొక్కింది. ఆపై గిరగిరా తిప్పేసి దూరంగా విసిరేసి.. అక్కడి నుంచి సైలెంట్గా వెళ్లిపోయింది. ఈ ఘటనతో అక్కడున్నవాళ్లంతా భయానికి లోనయ్యారు. కాసేపు అయ్యాక వచ్చి ఆ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి వెళ్లిపోయారు. మయ ముర్మూ భర్త ఏడేళ్ల కిందట అనారోగ్యంతో చనిపోయాడు. అయితే ఆ పెద్దాయనకు భార్యే విషం పెట్టి చంపిందనే పుకారు ఒకటి ఊరిలో వినిపిస్తుందట. ఆ భర్తే ఆత్మగా మారి.. ఆ ఏనుగు ద్వారా ఆమెను చంపి ప్రతీకారం తీర్చుకుని ఉంటాడని, అందుకే గ్రామస్తుల జోలికి రాకుండా ఆ ఏనుగు వెళ్లిపోయిందంటూ ఊరు ఊరంతా ఇప్పుడు ప్రచారం చేస్తోంది. అయితే అటవీ అధికారులు మాత్రం ఏనుగు ప్రకోపానికి కారణం ఏదైనా ఉండొచ్చని భావిస్తున్నారు. -
పాములు పగబడతాయా.. అందులో నిజమెంత..?
ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో ఒక విద్యార్థిని పాముకాటుకు బలై చనిపోయింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో ఒక కుటుంబం లోని అందరినీ గత రెండు మూడు నెలల నుండి పాము కరుస్తూ వస్తోందని భయపడుతున్నారు. అలాగే కీసరలోని ఒక హాస్టల్లో విద్యార్థి పాము కాటుకి గురై చనిపోయాడు. ఈ సందర్భంగా పాముల గురించి కొన్ని విషయాలు తెలుసుకోవటం అవసరం. అన్ని పాములూ విషం కలిగి ఉండవు. కేవలం నాలుగయిదు రకాల పాములు మాత్రమే ఎక్కువ ప్రమాదకరమైనవి. అవి కరిచిన వెంటనే వైద్యం చేయించాలి. అన్నిచోట్లా డాక్టర్లు ఉండరు కాబట్టి కరిచినా విషం శరీరం మొత్తానికి వెళ్లకుండా పైభాగంలో గట్టిగా కట్టుకట్టాలి. ఆ తరువాత వైద్యుని వద్దకి తీసుకెళ్ళాలి. తగిన సమయంలో ఇంజెక్షన్ ఇస్తే విషం వల్ల ప్రమాదం తప్పుతుంది. పాము కరిచిన తర్వాత భయానికి లోనవ్వడం వల్లనే ఎక్కువ మరణాలు సంభవిస్తాయి. ఆ పాము మనిషిని కరవక ముందు, ఏదైనా జంతు వును కరచినట్లయితే, ఆ తరువాత మనిషిని కరచినా కూడా ప్రమాద ముండదు. ఎందుకంటే ముందుగా జంతువుని కరచింది కనుక వెంటనే మనిషి చనిపోయేంత విషం కోరల్లో ఉండదు. ఇది తెలియక కూడా భయపడతాం. కొంతమంది తమపై పాము పగబట్టిందనీ, అందుకే కాటేసిందనీ లేదా కరవడానికి ప్రయత్నిస్తున్నదనీ భయపడుతుంటారు. పాము పగ బట్టడం అబద్ధం. మనకి పాముని చూస్తే, ఎలా భయమేస్తుందో, పాముకి కూడా మనిషిని చూస్తే అంతే భయం. అందువల్ల అవి మనల్ని చూడగానే పారిపోతాయి. హాని కలుగుతుందనుకుంటేనే కాటు వేస్తాయి. అప్పుడు డాక్టర్ చేత వైద్యం చేయించుకోవాలే కానీ మంత్రం వేయించుకోవడానికి మంత్రగాడి దగ్గరికి వెళ్లకూడదు. మంత్రాలు అబద్ధాలు. ఈ వాస్తవాలను తెలుసుకుంటే పాముకాటుకు గురైనా బతికి బట్టగట్టడానికి అవకాశం ఉంటుంది. – నార్నె వెంకటసుబ్బయ్య, అధ్యక్షుడు, ఏపీ హేతువాద సంఘం -
సమ్మర్కు తగ్గేదేలే...
-
మాములు ప్రతీకారం మాత్రం కాదు.. 'అంతకు మించి'
క్రికెట్లో సెండాఫ్స్ ఇచ్చుకోవడం.. దెబ్బకు దెబ్బ తీయడం సర్వ సాధారణం. ఉదాహరణకు.. ఒక బౌలర్ తన బౌలింగ్లో పదే పదే సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మన్ను ఔట్ చేసి రివేంజ్ తీర్చుకోవడం ఒక స్టైల్.. లేదంటే అదే బౌలర్ ప్రత్యర్థి బ్యాట్స్మన్ను అదే పనిగా విసిగిస్తుంటే.. నోటితో కాకుండా కేవలం బ్యాట్తోనే సమాధానం ఇవ్వడం మరో స్టైల్ రివేంజ్. అటు నోటితో.. ఇటు బ్యాటుతో సమాధానం ఇవ్వడం మరో రకమైన ప్రతీకారం. కానీ ఇప్పుడు మనం చెప్పుకునేది ''అంతకు మించి'' అనకుండా ఉండలేం. చదవండి: Viral Video: బంగారం లాంటి అవకాశం వదిలేశాడు.. విషయంలోకి వెళితే.. యూరోపియన్ క్రికెట్ లీగ్లో భాగంగా టన్బ్రిడ్జ్ వెల్స్, డ్రూక్స్ మధ్య మ్యాచ్ జరిగింది. టన్బ్రిడ్జ్ వెల్స్ ఇన్నింగ్స్ 8వ ఓవర్ను వహిద్ అబ్దుల్ వేశాడు. అబ్దుల్ వేసిన అంతకముందు ఓవర్లో టన్బ్రిడ్జ్ వెల్స్ ఓపెనర్ ఓ రియోర్డాన్ వరుస బంతుల్లో రెండు బౌండరీలు బాదాడు. ఇది మనసులో పెట్టుకున్న అబ్దుల్ 8వ ఓవర్లో ఒక యార్కర్ డెలివరీతో రియోర్డాన్ను క్లీన్బౌల్డ్ చేశాడు. దీంతో తన కాలికి ఉన్న షూ తీసి నెంబర్ డయల్ చేసి కాల్ మాట్లాడుతూ.. ''నువ్వు వచ్చిన పని ముగిసింది ఇక వెళ్లు'' అంటూ రియోర్డన్ను ఉద్దేశించి వెటకారంగా మాట్లాడాడు. నాన్స్ట్రైక్ ఎండ్లో ఉన్న కెప్టెన్ క్రిస్ విలియమ్స్ ఇదంతా గమనించాడు. 'టైం రాకపోతుందా' అని విలియమ్స్ మనుసులో అనుకున్నాడో లేదో.. ఆ అవకాశం రానే వచ్చింది. వహిద్ అబ్దుల్ మరుసటి ఓవర్లో స్ట్రైకింగ్లో ఉన్న విలియమ్స్ బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు కొట్టాడు. అంతే అబ్దుల్ వహిద్పై ప్రతీకారంగా తన బ్యాట్తో నెంబర్ కలిపి ఫోన్ మాట్లాడుతున్నట్లుగా అబ్దుల్ వైపు చూస్తూ..''ఇప్పుడు నీ పని ముగిసింది.. ఇక బౌలింగ్కు రాకు'' అంటూ హెచ్చరిక పంపాడు. మొత్తానికి తన జట్టు ఆటగాడిని ఏ విధంగా అయితే అవమానించాడో.. అదే పద్దతిలో కెప్టెన్ విలియమ్స్ ప్రతీకారం తీర్చుకొని దెబ్బకు దెబ్బ తీశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన క్రికెట్ ఫ్యాన్స్.. ఇలాంటి రివేంజ్ ఇంతకముందు చూడలేదు.. వారెవ్వా దెబ్బకు దెబ్బ తీశాడు.. ఇది మాములు ప్రతీకారం మాత్రం కాదు.. అంతకుమించి అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: హిజాబ్ వివాదంపై స్పందించిన గుత్తా జ్వాల ఇక మ్యాచ్లో టన్బ్రిడ్జ్ వెల్స్ 50 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టన్బ్రిడ్జ్వెల్ 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 141 పరుగుల భారీ స్కోరు చేసింది. క్రిస్ విలియమ్స్(56), అలెక్స్ విలియమ్స్(58) రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన డ్రూక్స్ 7.2 ఓవర్లలో 91 పరుగులకే ఆలౌట్ అయింది. జో మెక్కాఫ్రీ 9 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. Banter you WOULD NOT like to miss 😅 C. Williams comes up with a perfect reply to his teammate's dismissal 😎@BET2BALL European Cricket League 2022 | Presented by @KibaInuWorld | @Cricket_Espana pic.twitter.com/Q8H3HMuMO0 — European Cricket (@EuropeanCricket) February 11, 2022 -
కోతిపిల్లను వేటాడి చంపిన కుక్కలు, ప్రతీకారంతో 250 కుక్కల్ని..
కోతులే కదా అని తీసిపారేస్తే ఏం చేస్తాయో చూపిస్తున్నాయి వానరాలు. తమకు పగ ఏర్పడితే ఎంత దూరమైనా వెళ్తామని జబ్బలు చరుస్తున్నాయి. ప్రాణమున్న ప్రతిజీవికి కోపం రావడం, దానికి కారకులపై పగ కలగడం సహజం. కానీ అన్ని పగాప్రతీకారాలు ఒకేలా ఉండవు. సదరు జీవి శక్తిని బట్టి, అవకాశాన్ని బట్టి, కలిగిన దుఃఖ బాధ తీవ్రతను బట్టి ప్రతీకార విస్తృతి మారుతుంది. ఉదాహరణకు రాముడి పగ రావణ సంహారంతో ఆగలేదు. రాక్షస వంశాన్ని దాదాపు తుడిచి పెట్టింది. ఆయనంటే సర్వసమర్థుడు కాబట్టి ఆ స్థాయిలో పగ తీర్చుకున్నాడు. కానీ సాధారణ ప్రాణికి దుఃఖం, కోపం కలిగించినా ప్రతీకారం తీర్చుకునే శక్తిలేక ఊరుకోవడమే ఎక్కువగా కనిపిస్తుంది. కానీ రామ బంట్లుగా భావించే కోతులు మాత్రం తమకు కలిగిన బాధకు గట్టిగా ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఎంతైనా మనకు పూర్వీకులు కదా! వాటికి తెలివితేటలు ఎక్కువే. అందుకే పక్కాగా తమ ప్రత్యర్ధి వర్గంపై దాడులు చేసి వంశనాశనానికి పూనుకున్నాయి. ఇంతకూ ఇవి పగ తీర్చుకున్నది ఎవరిమీదన్నదే డౌటు కదా! వీటి వర్గ శత్రువులు కుక్కలే! ఫ్యాక్షన్ సినిమా స్టోరీని తలపించే ఈ కథ మహారాష్ట్రలోని బీడ్ జిల్లా మజల్గావ్లో జరిగింది. ఏం జరిగింది? కోతులు వర్సెస్ కుక్కల పోరాటానికి కొన్నాళ్ల క్రితం జరిగిన ఘటన బీజం వేసిందని మజల్గావ్ గ్రామస్తులు తెలిపారు. గతనెల్లో కొన్ని కుక్కలు ఒక కోతిపిల్లను వేటాడి చంపాయి. ఇది కోతుల మందలన్నింటినీ బాధించిందని, దీంతో అప్పటి నుంచి అవి కుక్కలపై మెరుపుదాడులకు దిగాయని తెలిపారు. ముఖ్యంగా కుక్కపిల్లలు కనిపిస్తే వెంటనే వాటిని ఎత్తుకుపోయి ఎత్తైన బిల్డింగ్ లేదా చెట్ల మీద నుంచి చచ్చేలా విసిరికొట్టడం ఆరంభించాయన్నారు. అలాగే పెద్ద కుక్కలు ఒంటరిగా కనిపిస్తే మందగా వెళ్లి దాడి చేసి చంపేస్తున్నాయన్నారు. వీటి దెబ్బకు దాదాపు 250 కుక్కలు ప్రాణాలు పోగొట్టుకున్నాయని, గ్రామంలో కుక్క అన్నది కనిపించకుండా పోయిందన్నారు. కోతుల అరాచకంపై అటవీశాఖకు ఫిర్యాదు చేశామని, వారు వచ్చి పరిస్థితి చూసినా, కోతులను పట్టడంలో విఫలమై వెనుదిరిగారని గ్రామస్తులు వివరించారు. క్రమంగా కోతులు కేవలం కుక్కలపైనే కాకుండా గ్రామస్తుల పిల్లలపై దాడులకు దిగుతున్నాయని వాపోయారు. లాక్డౌన్ కారణంగా వీటికి సరైన తిండి దొరకకపోవడంతో కోతుల్లో ఆగ్రహం పెరిగి ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత సెప్టెంబర్లో కర్ణాటకలో ఒక గ్రామంపై పగపట్టిన కోతి 22 కి.మీ.లు ప్రయాణించి ఆ ఊరికి చేరుకొని బీభత్సం సృష్టించింది. -
అమ్మా... నాన్నా... కొట్టొద్దు ప్లీజ్
అమ్మా నాన్నా ఒకరితో ఒకరు బాగుంటే మంచిదే. ఒకరితో ఒకరు బాగోకపోయినా పిల్లలతో బాగుండాల్సిన బాధ్యత ఉంది. కాని ఇద్దరి మధ్య గొడవలు పిల్లలపై ప్రతీకారంగా మారితేనే సమస్య. నాన్న మీద కోపం అమ్మ పిల్లల మీద చూపినా అమ్మ మీద ఆగ్రహం నాన్న పిల్లల మీద చూపినా నలిగిపోయేది ఆ పసి మనసులే. తమిళనాడులో తులసి అనే తల్లి తన రెండేళ్ల కుమారుణ్ణి భర్త మీద కోపంతో కొట్టడం వైరల్ అయ్యింది. ఆమెను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కలతల కాపురాలలో పిల్లలపై హింస గురించిన కథనం... రెండు రోజుల క్రితం తమిళనాడులో ఒక వీడియో వైరల్ అయ్యింది. ఒక తల్లి తన రెండేళ్ల బాబును పదే పదే కొడుతూ ఆ వీడియోను రికార్డు చేసింది. ఆ పసివాడు తల్లి దెబ్బలకు తాళలేక ఏడుస్తూ తల్లి సముదాయింపు కోరుతూ ఉంటే ఆ తల్లి ఆ చిన్నారిని మళ్లీ మళ్లీ హింసించింది. ఇది బయటకు రావడంతోటే తమిళనాడు అంతా ఉలిక్కిపడింది. ఆ తల్లిని అరెస్టు చేయాలని నెటిజన్లు కోరారు. వెంటనే పోలీసులు రంగంలో దిగారు. ఆమెని అరెస్టు చేశారు. మూడు సెక్షన్లు– సెక్షన్ 323, 355, 75 కింద ఆమె ఇప్పుడు విచారణ ఎదుర్కొనాలి. ఏం జరిగింది? తమిళనాడు విల్లిపురం జిల్లాలోని గింజిలో వడివేలన్ (37), తులసి (22) భార్యాభర్తలు. వీరికి 2015లో వివాహం జరిగింది. ఇద్దరు అబ్బాయిలు. వడివేలన్ గింజిలో కాపురం పెట్టి చెన్నైలో ఉద్యోగం చేస్తూ ఇంటికి వస్తూ పోతూ ఉన్నాడు. అయితే అతడు భార్య ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతోందని గ్రహించి ఆమెని వారించాడు. మానకపోయేసరికి ఫిబ్రవరిలో చిత్తూరులోని ఆమె పుట్టింటికి పంపాడు. పిల్లల్ని తన దగ్గరే ఉంచుకున్నాడు. అయితే ఆమెను పుట్టింటికి పంపే ముందు ఆమె ఫోన్లో బాబును కొడుతూ రికార్డు చేసిన వీడియోలు చూశాడని ఒక కథనం. లేదా అప్పుడు రికార్డయిన వీడియోలు ఇప్పుడు బయట పడ్డాయని (అతడే బయటపెట్టాడని) ఒక కథనం. ఏమైనా కన్నతల్లి దారుణంగా తన పసిబిడ్డను కొట్టడం అందరినీ కలచి వేసింది. ఆదివారం తులసిని అరెస్టు చేసిన పోలీసులు విల్లిపురం తీసుకొచ్చారు. సైకియాట్రిస్టులు పరీక్షించి ఆమెకు ఏ మానసిక రుగ్మత లేదని నిర్థారించారు. కేవలం భర్త పట్ల కోపం, లేదా ఏదో ఒక నిస్పృహతోనే ఆమె పిల్లవాణ్ణి హింసించిందని ఒక అభిప్రాయం. ఎందుకు కొడతారు? ‘తల్లిదండ్రులు పిల్లల్ని ఎందుకు కొడతారంటే వాళ్లు తిరిగి కొట్టలేరని’ అని రాశాడు ప్రసిద్ధ రచయిత గుడిపాటి వెంకట చలం. తల్లిదండ్రుల కోపతాపాలకు పిల్లలు నలిగిపోవడం ఈ దేశంలో ఎప్పటి నుంచో ఉంది. భర్త మీద కోపంతో పిల్లలతో సహా ఆత్మహత్యలు చేసుకున్న తల్లులు ఎందరో ఉన్నారు. భార్య మీద కోపంతో పిల్లల్నీ, తల్లిని హత్య చేసేంత వరకూ వెళ్లిన తండ్రులు ఉన్నారు. ఇవి తీవ్రమైన కేసులు అయితే బయటకు రానివి ఇంట్లోనే ఉండేవి పిల్లలకు మాత్రమే తెలుస్తాయి. కలతల కాపురం చేస్తున్న భార్యాభర్తలు తమ కోప తాపాలను పిల్లల మీద చూపడం, పిల్లలతో ‘నువ్వు పుట్టకపోయినా బాగుండేది ఏ నుయ్యో గొయ్యో చూసుకునే దానిని’ అని తల్లి అనడమో ‘నీ వల్లే మీ అమ్మతో వేగాల్సి వస్తోంది’ అని తండ్రి అనో పసి మనసులను గాయపరుస్తారు. అది చాలక భార్యను కొట్టలేక పిల్లల్ని కొట్టడం, భర్తను తిట్టలేక పిల్లల్ని బాదడం చేస్తుంటారు. ఇంకా దారుణంగా పిల్లలతో మాట్లాడటమే మానేసి తమ తమ పంతాలలో ఉండిపోతారు. ఇలా పిల్లల్ని బాధించడం శిక్షార్హమైన నేరం. ఒక వైపు అయితే... తల్లిదండ్రుల్లో ఒకరు పిల్లల్ని బాధిస్తూ ఉంటే తల్లి/తండ్రి కాని వెంటనే దాని నివారణకు సీరియస్గా ఆలోచించాల్సి ఉంటుంది. చట్ట సహాయం లేదా కౌన్సిలింగ్ సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. పిల్లల్ని ఆ బాధ నుంచి రక్షించాల్సి ఉంటుంది. కాని తల్లిదండ్రులు ఇద్దరూ బాధిస్తూ ఉంటే వారికి విముక్తి కలిగించాల్సిన బాధ్యత ఇరుగుపొరుగు వారిది, బంధువులది, స్నేహితులది అవుతుంది. కలహాల కాపురం దాచేస్తే దాగేది కాదు. కచ్చితంగా అయినవారికి తెలుస్తుంది. అలా తెలిశాక వారు చేయాల్సిన పని పిల్లల మీద ఏదైనా హింస జరుగుతున్నదా అని ఆరా తీయడమే. ఈ పని తప్పక చేయాలి. ఇది అంత సులువు కాకపోయినా పిల్లల మెల్లగా బుజ్జగించి ఆ విషయాన్ని రాబట్టాల్సి ఉంటుంది. లేదా అమ్మమ్మలు, తాతయ్య లు అయితే హక్కుగా కూడా నిలదీసి తెలుసుకోవచ్చు. అలా జరుగుతున్న పక్షంలో ఆ తల్లిదండ్రులను హెచ్చరించాలి లేదా పిల్లల్ని ఆ వాతావరణం నుంచి తప్పించాల్సి ఉంటుంది. బ్లాక్మెయిలింగ్ సాధనం భార్యాభర్తల కొట్లాటలలో పిల్లలు ఒక బ్లాక్మెయిలింగ్ సాధనంగా మారటం చాలా విషాదం. సమస్య చేయి దాటేశాక భర్తను/భార్యను తిరిగి అదుపులోకి తెచ్చుకోవడానికి ‘నా మాట వినకపోతే పిల్లల్ని చంపేస్తా’ అనే వరకూ వెళ్లిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. అందుకు శాంపిల్గా పిల్లలకు వాతలు పెట్టి జీవిత భాగస్వామిని భయభ్రాంతం చేయాలనుకునే తల్లి/తండ్రి ఉన్నారు. ఈ సమస్య నుంచి పిల్లలు తమను తాము కాపాడుకోలేరు. దగ్గరి బంధువులే ఒక కన్నేసి పెట్టి ఈ పిల్లల గురించి పట్టించుకోవాలి. ‘మాకెందుకులే’ అనే భయం ఉంటే కనీసం చైల్డ్ కేర్ సెంటర్లకు ఫోన్ చేసి చెప్పడమో, పోలీసులకు ఇన్ఫామ్ చేయడమో చేయాలి. తల్లిదండ్రులు ఒక విషయం ఆలోచించాలి. కుదరని సంసారం నుంచి బయటపడటం లేదా సర్దుబాటు చేసుకోవడం ఈ ప్రాసెస్లో భార్య/భర్త ఒకరినొకరు ఎంత ఇబ్బంది పెట్టుకున్నా ఆ వ్యవహారంలో పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం ఏ మాత్రం సంస్కారం కాదని గ్రహించాలి. ఇటీవల బడులలో ‘గుడ్ టచ్’ ‘బ్యాడ్ టచ్’ గురించి అవగాహన కల్పిస్తున్నారు. దాంతోపాటు ‘కొట్టే తల్లిదండ్రులు’ గురించి కూడా పిల్లలు టీచర్లకు చెప్పే అవగాహన కల్పించడం అవసరం. అప్పుడే పిల్లల్ని కొట్టే తల్లిదండ్రుల ఆగడాలు ఆగుతాయి. -
Afghanistan: అప్పుడే మొదలు.. ఇంటింటికీ వెళ్లి..
కాబూల్: తాము గతంలో పాలించినట్లు ఈ సారి పాలన ఉండదని పూర్తిగా మారినట్లు తాలిబన్లు ప్రకటించారు. అయితే వారి పలుకులకు జనసంచరంలోని తాలిబన్ల చేతలకు ఏ మాత్రం పొంతన లేదు. ఇప్పటికే అక్కడ జరుగుతున్న పరిణామాలకి ప్రజలు బిక్కు బిక్కుమంటూ కాలాన్ని గడుపుతున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఇంట్లిట్లో తనిఖీలు నిర్వహిస్తున్నారట. దీని బట్టి చూస్తే అఫ్గనిస్తాన్లో తాలిబన్లు నరమేదాన్ని మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇదంతా గతంలో నాటో దళాలకు, ప్రభుత్వానికి అనుకూలంగా పని చేసిన వారి కోసం గాలింపు చేపడుతున్నారు. ఆచూకీ దొరకకపోతే వారి కుటుంబసభ్యులను బెరిస్తున్నట్లు యూఎన్ చెప్పింది. ఎటువంటి ప్రతీకారం తీర్చుకోమని తాలిబన్లు చెప్పినా.. ప్రస్తుతం ఆ మిలిటెంట్లు మానవవేట కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే కాకుండా వ్యక్తిగతంగా కూడా కొందర్ని తాలిబన్లు టార్గెట్ చేస్తున్నారని, ఆ బెదిరింపులు స్పష్టంగా కనిపిస్తున్నాయని రిప్టో నార్వేయన్ సెంటర్ తన నివేదికలో తెలిపింది.అమెరికా బలగాలు అఫ్గనిస్తాన్లో ఉన్న సమయంలో.. నాటో దళాలు కూడా తాలిబన్ల అరాచకాలను ఎంతో సమర్థవంతంగా నిలువరించగలిగాయి. ప్రస్తుతం నాటో దళాలు ఆ దేశం నుంచి వెళ్లిపోయిన నేపథ్యంలో వారికి సహకరించిన వారి కోసం తాలిబన్లు వేట మొదలు పెట్టారంట. వాళ్లకు వాళ్లుగా లొంగిపోతే ఏమీ చేయమని, లేదంటే వాళ్లను పట్టుకుని విచారించి, వారి కుటుంసభ్యులను శిక్షిస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు యూఎన్ తన రిపోర్ట్లో తెలిపింది. -
పాము కాటేసిందని... కోపంతో దాన్ని కొరికి చంపేశాడు
భువనేశ్వర్: పాములు మనుషులను కరవడం సాధరణంగా జరుగుతునే ఉంటాయి. అయితే ఇటీవల కాలంలో మాత్రం మనిషి పామును ‘కరవడం’ వంటి వింత ఘటనలు గురించి వింటున్నాం. ఒడిశా రాష్ట్రంలో ఇటువంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. పాము కాటేసిందిని కోపంతో ఆ పామునే కరిచి చంపాడు ఓ ప్రబుద్దుడు. వివరాలు.. జాజ్పూర్ జిల్లాలోని గంభారిపాటియా గ్రామానికి చెందిన కిషోర్ బద్ర (45)అనే గిరిజన రైతు బుధవారం రాత్రి పొలం పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో అతని కాలిని ఏదో కరిచింది. తన చేతిలో టార్చ్లైట్ వేసి చూడగా తనను కరిచింది.. విషపూరితమైన సర్పంగా గుర్తించాడు. వెంటనే కోపంతో ప్రతీకారం తీర్చుకునేందకు పామును పట్టి పదే పదే కొరికాడు. దాంతో ఆ పాము వెంటనే ప్రాణాలు వదిలింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. పామును కరిచిన కిషోర్ బద్రకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. మరణించిన పామును తీసుకుని తన గ్రామానికి వచ్చిన బద్ర.. జరిగిన విషయాన్ని తన భార్యకు చెప్పాడు. అతడి నిర్వాకం ఆ గ్రామంలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. -
పాము కాటేసిందన్న కోపంతో.. కస కస కొరికాడు.. ఆ తర్వాత..
పట్నా: బిహర్లో ఓ వృద్ధుడు మద్యం మత్తులో వింతగా ప్రవర్తించాడు. తనను కాటువేసిందన్న కోపంతో ఆ పాము పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. దాన్ని పట్టుకుని విచక్షణ రహితంగా కొరికాడు. అంతటితో ఆగకుండా పాముని అక్కడే ఉన్న చెట్టుపై వేలాడ దీశాడు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాలు.. నలంద జిల్లాలోని మాధోపూర్ గ్రామానికి చెందిన 65 ఏళ్ల రామా మహతోని ఆదివారం అర్ధరాత్రి పాము కాటువేసింది. దాంతో ఆగ్రహంతో ఊగిపోయిన అతడు.. వెంటపడి మరీ పామును పట్టుకుని కసితిరా కొరికి చంపాడు. ఆ తర్వాత అక్కడే ఉన్న చెట్టుకు వేలాడదీశాడు. పాముపట్ల వింతగా ప్రవర్తించిన వృద్ధుని తీరు చూసి స్థానికులు షాక్కు గురయ్యారు. ఆ తర్వాత అతడిని ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలని సూచించారు. అయితే, మహతో ఎవరిమాట పట్టించుకోలేదు. పాముని చంపేశాను...నాకేం కాదు అని మొండిగా ప్రవర్తించాడు. కాగా, రాత్రి మహతో భోజనం చేసి పడుకున్నాడు. ఆ తర్వాత మహతో నిద్రలోనే స్పృహ తప్పిపడిపోయాడు. ఎంత పిలిచిన లేవకపోయేసరికి.. కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా, మహతోను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
మూత్ర విసర్జన చేసి అవమానం.. అందుకే రాత్రి నిద్రపోతుంటే..
సాక్షి, సదాశివపేట(సంగారెడ్డి): పట్టణంలోని లక్ష్మీ కాంప్లెక్స్ వద్ద ఈనెల 6న కొనాపూర్కు చెందిన పెద్దగొల్ల పాపయ్య(65)ను తిమ్మన్న గూడెంకు చెందిన పెద్దగొల్ల బీరప్ప (32) హత్యచేశాడని సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ తెలిపారు. ఆదివారం పోలీస్ స్టేషన్లో విలేకర్ల సమావేశంలో ఆయన హత్య వివరాలను వెల్లడించారు. పెద్దగొల్ల బీరప్ప ఈనెల 5న రాత్రి ట్రాక్టర్ల బ్యాటరీలను దొంగతనం చేస్తుండగా, గమనించిన పెద్దగొల్ల పాపయ్య మరికొంతమందితో కొట్టి, మూత్ర విసర్జన చేసి అవమానించాడు. కక్ష్య పెంచుకున్న బీరప్ప 6వ తేదీ తెల్లవారుజామున కాంప్లెక్స్ పక్కన నిద్రిస్తున్న పాపయ్య తలపై బండరాయితో మోదీ హత్య చేశాడు. మృతుడి కుమారుడు పెద్దగొల్ల సుభాష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, అనుమానితుడు బీరప్పను విచారించగా, నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. బీరప్పను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించామని, హత్యకేసును త్వరగా ఛేదించిన ఇన్స్పెక్టర్ గూడూరి సంతోష్కుమార్, సిబ్బందిని డీఎస్పీ బాలాజీ అభినందించారు. -
ప్రతీకారం తీర్చుకోవాలని తల్లిదండ్రుల ఎదుటే బాలికపై..
లక్నో: ప్రతీకారం తీర్చుకోవాలని ఓ బాలికను తన తల్లిదండ్రులు ముందే సామూహికంగా అత్యాచారం చేశారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం... అమ్రోహా రైల్వే స్టేషన్ సమీపంలో నివాసం ఉండే కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి, పొరుగింటి అమ్మాయి కలిసి జూన్ 27న ఊరి నుంచి వెళ్లిపోయారు. దీంతో జూన్ 29న వీరివురి కుటుంబ సభ్యుల మధ్య వాగ్వివాదం నెలకొంది. ఈ క్రమంలో అమ్మాయి తరపున వాళ్లు ఆ వ్యక్తి కుటుంబ సభ్యులను ఓ ఇంటికి తీసుకెళ్లారు. తల్లిదండ్రుల ఎదుటే ఆ బాలికను వారిద్దరు లేచిపోవడానికి ఆ బాలిక తన అన్నకు సహాయపడిందనే అనుమానంతో ఆమెను తీవ్రంగా కొట్టారు. కనిపించకుండా పోయిన అమ్మాయి తరపు కుటుంబ సభ్యులు దీనికి ప్రతీకారం తీర్చుకోవాలంటూ ఆ బాలిక తల్లిదండ్రుల ఎదురుగానే ఆమెపై 8 మంది సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం ఓ నిందితుడు ఆ బాలిక ఇష్టంతో సంబంధం లేకుండా బలవంతంగా వివాహం చేసుకున్నాడు. ఈ విషయాలను బయట ఎవరికైనా చెప్తే చంపేస్తామంటూ ఆ బాలికతోపాటు ఆమె తల్లిదండ్రులను హెచ్చరించి విడిచిపెట్టారు. బాధితులు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయగా, తొలుత స్వీకరించేందుకు పోలీసులు నిరాకరించారు. అయితే తనపై జరిగిన దారుణాన్ని బాలిక వివరించడంతో ఆ 8 మందిపై పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
ప్రతీకారం కాదు, అంతా చట్ట ప్రకారమే!!
సాక్షి, ముంబై : దివంగత బాలీవుడు నటుడు సుశాంత్సింగ్ ఆత్మహత్యతో రగిలిన వివాదం, రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామి అనూహ్య అరెస్టు తరువాత మరోసారి రాజుకుంది. బీజేపీ, శివసేన మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. తాజాగా అర్నాబ్ గోస్వామి అరెస్టుపై వస్తున్న విమర్శలపై శివసేన నాయకుడు సంజయ్ రౌత్ స్పందించారు. తమ హయాంలో ప్రతీకారం అనే సమస్యే ఉండదనీ, చట్ట ప్రకారమే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. ఈ క్రమంలో అర్నాబ్ అరెస్టు చట్ట ప్రకారమే చోటు చేసుకుందని వివరించారు. తగిన ఆధారాలుంటే ఎవరిపైనైనా పోలీసులు చర్యలు తీసుకుంటారన్నారు. అంతేకాదు మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఎవరిపైనా ప్రతీకారం తీర్చుకునే ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆయన స్పష్టం చేశారు. (రిపబ్లిక్ టీవీ చీఫ్ అర్నాబ్ గోస్వామి అరెస్టు) మరోవైపు గతంలో మూసివేసిన ఇంటీరియర్ డిజైనర్ అన్వే నాయక్ ఆత్మహత్యకు సంబంధించిన 2018 కేసును విషయంలోనే అర్నాబ్ గోస్వామిని అరెస్టుచేశామని మహారాష్ట్ర హోంమంత్రి ధృవీకరించారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసుదర్యాప్తు, టీఆర్పీ కుంభకోణంపై మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు, అర్నాబ్పై రెండేళ్ల కేసును తిరిగతోడారన్న ఆరోపణల నేపథ్యంలో సంజయ్ ఇలా స్పందించారు. ముఖ్యంగా మహారాష్ట్ర పోలీసుల చర్యను పత్రికా స్వేచ్ఛపై దాడి అంటూ కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. అర్నాబ్ అరెస్టు సిగ్గు చేటని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. అటు మరో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూడా అర్నాబ్ గోస్వామికి మద్దతుగా నిలిచారు. అర్నాబ్ గోస్వామి అంటే ఇష్టం ఉన్నా లేకున్నా మీడియా స్వేచ్ఛపై జరుగుతున్న ఫాసిస్టు దాడికి వ్యతిరేకంగా నిలబడాలన్నారు. మౌనంగా ఉంటే అణచివేతకు మద్దతిచ్చినట్టేననిఆమె ట్వీట్ చేశారు. అటు బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కూడా సేన ప్రభుత్వంపై మండిపడింది. (అర్నాబ్ అరెస్టు, పత్రికా స్వేచ్ఛపై దాడి: కేంద్రమంత్రి) Those in the free press who don’t stand up today in support of Arnab, you are now tactically in support of fascism. You may not like him, you may not approve of him,you may despise his very existence but if you stay silent you support suppression. Who speaks if you are next ? — Smriti Z Irani (@smritiirani) November 4, 2020 -
ఫరిదాబాద్ హత్య.. ‘నా కెరీర్ నాశనం చేసింది’
చండీగఢ్: సోమవారం మధ్యాహ్నం ఫరిదాబాద్లో బల్లాగఢ్లో 21 ఏళ్ల నికితా తోమర్ని రోడ్డుపై అతి దారుణంగా కాల్చి చంపిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు తౌసీఫ్ నేరాన్ని అంగీకరించాడు. నికిత మరో వ్యక్తితో వివాహానికి సిద్ధపడటంతోనే ఆమెను హత్య చేశానని వెల్లడించాడు. నికిత (21) పరీక్ష రాసి వస్తుండగా, మాటు వేసిన ఇద్దరు దుర్మార్గులు అతి సమీపం నుంచి కాల్పులు జరిపి అక్కడినుంచి పారిపోయారు. ఈ దృశ్యాలు స్థానిక సీసీ టీవీలో రికార్డయ్యాయి. ఇక పోలీసుల దర్యాప్తులో ఈ నెల 24, 25 తేదీలలో నికిత, తౌసీఫ్లు దాదాపు 16 నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కెరీర్ని నాశనం చేసింది.. అందుకే నికితా తోమర్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తౌసీఫ్ తమ కుమార్తెని వివాహం చేసుకోవాల్సిందిగా చాలా కాలం నుంచి వేధిస్తున్నాడని తెలిపారు. ఒకసారి నికితను కిడ్నాప్ చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని.. వారు అతడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఆ మరుసటి రోజు ఇరు కుటుంబాల మధ్య రాజీ కుదరడంతో తౌసీఫ్ మీద పెట్టిన కేసును వాపస్ తీసుకున్నట్లు వెల్లడించారు. ఇక పోలీసుల విచారణలో తౌసీఫ్.. తన మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడంతో మెడిసిన్ చదవలేకపోయానని.. అందుకు ప్రతీకారం తీర్చుకోవాలిన భావించి.. నికితను హత్య చేశానని తెలిపాడు. (నడిరోడ్డుపై యువతి దారుణ హత్య : షాకింగ్ వీడియో) -
ఆకతాయిలపై గేదె ప్రతీకారం!
-
వైరల్.. ఆకతాయిలపై గేదె ప్రతీకారం!
మూగ జీవాలు అని కూడా చూడకుండా క్రూరంగా ప్రవర్తించిన ఆకతాయిలకు ఓ గేదె తగిన బుద్ధి చెప్పింది. కొందరు వ్యక్తులు నడిరోడ్డుపై రెండు బండ్లకు గేదెలను కట్టి పోటీ పడ్డారు. సామర్థ్యానికి మించి బండ్లపై ప్రయాణిస్తూ వాటిని హింసించారు. వేగంగా వెళ్లే క్రమంలో వాటిని అతి దారుణంగా కొట్టారు. అయితే కొద్దిదూరం వెళ్లాక.. అందులో ఓ గేదె బండిని డివైడర్కు తగిలేలా చేయడంతో అది కాస్తా బోల్తా పడింది. దీంతో అందులోని ఆకతాయిలు కిందపడిపోయారు. దీంతో ఆ బర్రె అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కస్వాన్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.‘గేదె ప్రతీకారం.. జంతువులను గుర్తించండి’ అని పేర్కొన్నారు. ప్రవీణ్ కస్వాన్ ఆ వీడియో షేర్ చేసిన కొద్దిసేపటికే అది వైరల్గా మారింది. ఇప్పటికే ఈ వీడియోకు 10 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. దీనిపై స్పందించిన పలువురు నెటిజన్లు.. అటువంటి వాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు చోటుచేసుకుందనే దానిపై స్పష్టత లేదు. -
తక్షణ న్యాయం ఉండదు!
జోధ్పూర్: న్యాయమన్నది ఎప్పుడూ తక్షణం అందేదిగా ఉండరాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ.బాబ్డే స్పష్టం చేశారు. న్యాయం ఎప్పుడూ ప్రతీకారంగా మారకూడదని, అలా మారినప్పుడు న్యాయానికి ఉన్న లక్షణాలేవీ మిగలవని ఆయన తెలిపారు. రాజస్తాన్ హైకోర్టులో శనివారం ఒక కొత్త భవనాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ చేసిన ఈ వ్యాఖ్యలు దిశ హత్య కేసు నిందితులు ఎన్కౌంటర్లో మరణించిన నేపథ్యంలో ప్రాధాన్యమేర్పడింది. ఇటీవలి పరిణామాలు చాలా పురాతనమైన చర్చను సరికొత్త ఉత్సాహంతో మొదలుపెట్టాయన్న జస్టిస్ బాబ్డే న్యాయవ్యవస్థ కేసుల విచారణలో జరుగుతున్న జాప్యం విషయంలో తన వైఖరిని మార్చుకోవాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. ప్రజలందరికీ న్యాయం అందుబాటులో ఉండేందుకు న్యాయవ్యవస్థ కట్టుబడి ఉండాలని, ఇందుకోసం కొత్త మార్గాలను అన్వేషించడంతోపాటు ఉన్నవాటిని దృఢతరం చేసుకోవాల్సిన అవసరమూ ఉందని ప్రధాన న్యాయమూర్తి వివరించారు. వివాదాలను వేగంగా సంతృప్తికరంగా పరిష్కరించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అదే సమయంలో న్యాయవ్యవస్థ పట్ల మారుతున్న దృక్పథంపై కూడా అవగాహన ఉండాలని అన్నారు. న్యాయవ్యవస్థలో జరిగిన తప్పిదాలను స్వయంగా దిద్దుకునే ఏర్పాటు అవసరముందని, అయితే ఈ ఏర్పాట్లను ప్రచారం చేయాలా? వద్దా? అన్నది చర్చనీయాంశమని అన్నారు. గత ఏడాది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నలుగురు బహిరంగంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి.. చేసిన వ్యాఖ్యలు, జరిగిన తప్పిదాలను స్వయంగా సరిచేసుకునేందుకు జరిగిన ఒక ప్రయత్నమేనని అన్నారు. ‘లిటిగేషన్లను వేగంగా పరిష్కరించే పద్ధతులను ఏర్పాటు చేయడమే కాదు. లిటిగేషన్లను ముందస్తుగా నివారించాల్సి ఉంది’అని చెప్పారు. కేసు దాఖలయ్యే ముందే మధ్యవర్తిత్వం ద్వారా సమస్య పరిష్కారానికి ఇప్పటికే కొన్ని చట్టాలున్నాయని, వాటిని అన్ని కేసులకూ తప్పనిసరి చేసే విషయాన్ని ఆలోచించాలని చెప్పారు. అంతకుముందు కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ మానభంగ కేసుల విచారణ సత్వరం జరిగేలా ప్రధాన న్యాయమూర్తి, ఇతర సీనియర్ న్యాయమూర్తులు ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు చొరవ చూపాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఇందుకు తగిన నిధులు అందిస్తుందని హామీ ఇచ్చారు. విచారణ జాప్యం దేశంలోని మహిళలను తీవ్రమైన బాధకు, ఒత్తిడికి గురిచేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో హేయమైన నేరాల విచారణకు 704 ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఉన్నాయని, పోక్సో, మానభంగ నేరాల విచారణకు మరో 1,123 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి వివరించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ నిందితుల ఎన్కౌంటర్ తరువాత మానభంగ కేసుల నిందితులకు సత్వర శిక్ష పడేలా చూడాలన్న డిమాండ్లు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్కౌంటర్లో దిశ నిందితులు మరణించడంపై కొన్ని వర్గాల వారు సంతోషం వ్యక్తం చేయడం, సంబరాలు చేసుకోవడం కొందరి ఆందోళనకు కారణమవుతోంది. పేదలకు అందని స్థాయిలో న్యాయ ప్రక్రియ: రాష్ట్రపతి దేశంలో న్యాయ ప్రక్రియ పేదలకు అందని స్థాయిలో ఉందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆందోళన వ్యక్తం చేశారు. జోధ్పూర్లో శనివారం హైకోర్టు కొత్త భవనం ఆవిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి మాట్లాడుతూ ‘‘న్యాయ ప్రక్రియ బాగా ఖరీదైపోయింది. పలు కారణాల వల్ల సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయింది. మరీ ముఖ్యంగా హైకోర్టు, సుప్రీంకోర్టులు సాధారణ కక్షిదారులకు అందడం అసాధ్యంగా మారింది’’అని వ్యాఖ్యానించారు. ‘‘ఈ రోజుల్లో పేదవారెవరైనా ఇక్కడకు ఫిర్యాదు తీసుకుని రాగలరా? ఈ ప్రశ్న చాలా ముఖ్యమైంది. ఎందుకంటే రాజ్యాంగం పీఠికలో అందరికీ న్యాయం అందించడం బాధ్యతని మనమందరం అంగీకరించాం కాబట్టి’ అని అన్నారు. న్యాయం కోసం పెడుతున్న ఖర్చుపై గాంధీజీ ఆందోళన వ్యక్తం చేశారని, దరిద్ర నారాయణుల సేవే ఆయనకు అన్నింటికంటే ముఖ్యమైన అంశమని అన్నారు. గాంధీజీ ప్రాథమ్యాలను గుర్తు చేసుకుంటే, కటిక పేదవాడు, అతి బలహీనుడి ముఖాలను మనం మననం చేసుకుంటే ఈ అంశాల్లో మనకు తగిన మార్గం కనిపిస్తుందని అన్న రాష్ట్రపతి న్యాయ ప్రక్రియను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ఉచిత న్యాయసేవలు ఒక మార్గం కావచ్చునని సూచించారు. -
పగబట్టిన పేగుబంధం!
సాక్షి, మచిలీపట్నం: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఇటీవల జరిగిన సంఘటన జంతువుల్లో పేగుబంధం ఎంత బలమైందో చాటిచెబుతోంది. లక్ష్మీటాకీస్ సెంటర్లో గత నెల 29న గుర్తుతెలియని వాహనం ఢీకొని లేగ దూడ చనిపోయింది. తల్లి ఆవు రోజంతా బిడ్డ వద్దే పడుకుంది. చనిపోయిన ఆ దూడను మున్సిపల్ సిబ్బంది ఆదేశాలతో ఓ రిక్షా కార్మికుడు తీసుకెళ్లి ఖననం చేశాడు. అయితే ఇప్పుడు ఆవు ఆ రిక్షా కార్మికుడిపై పగబట్టింది. బిడ్డను తనకు కాకుండా తీసుకెళ్లిపోయాడని అనుకుందో ఏమో ఆ కార్మికుడు ఎక్కడ కనిపించినా కొమ్ములతో పొడిచేస్తోంది. గురువారం రాత్రి బస్టాండ్ సెంటర్లో కన్పించిన ఆ రిక్షావాలాపై దాడి చేసి కిందపడేసింది. స్థానికులు వచ్చి రక్షించడంతో ప్రాణాలు దక్కించుకున్నాడు. ఆ ఆవు బారి నుంచి ఎలా బయటపడాలా? అని రిక్షా కార్మికుడు తలపట్టుకుంటున్నారు. -
రిక్షావాలాపై దాడి చేసిన ఆవు
-
దారుణం : ఓటు వేయలేదని గ్యాంగ్రేప్.. హత్య
రాంచీ : జార్ఖండ్ లో దారుణం చోటు చేసుకుంది. ఎన్నికల్లో తన భార్యకు మద్ధతు ఇవ్వలేదని ఓ వ్యక్తి ఒక కుటుంబంపై పగ పెంచుకుని దాష్టీకానికి పాల్పడ్డాడు. ఆ కుటుంబంలోని 13 ఏళ్ల బాలికపై సాముహిక అత్యాచారానికి పాల్పడి.. కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే... పాకూరు జిల్లా లిట్టిపారా గ్రామ పంచాయితీలో ‘ముఖియా’ పదవి కోసం కొన్నాళ్ల క్రితం ఎన్నికలు జరిగాయి. ప్రేమ్లాల్ హంసద అనే వ్యక్తి భార్య ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే బాధిత కుటుంబ సభ్యులు మాత్రం ఆమెకు ఓటు వేయలేదు. దీంతో వారి మూలంగానే తన భార్య ఓడిపోయిందన్న కోపంతో ప్రేమ్లాల్ రగిలిపోయాడు. జనవరి 8న బహిర్భూమికని వెళ్లిన బాలికను తన సోదరుల సహకారంతో అపహరించాడు. ఆపై వారంతా కలిసి ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడి, ప్రాణాలు తీశారు. చివరకు బాలిక మృత దేహాన్ని సమీపంలోని బ్లెవాన్ అటవీ ప్రాంతంలో పడేశారు. బాలిక కనిపించకుండా పోయే సరికి ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిచ్చిన సమాచారం మేరకు బాలిక శవాన్ని స్వాధీనపరుచుకున్నారు. ఆపై నిందితులపై తల్లిదండ్రుల ఫిర్యాదు చేయటంతో వారిని అరెస్ట్ చేశారు. తీవ్ర విమర్శలు... నిందితులు రాజకీయంగా కాస్త పలుకుబడి ఉన్నవారు కావటంతో తొలుత కేసు నమోదు చేసుకునేందుకు పోలీసులు తటపటాయించారు. అయితే ప్రతిపక్షాల ఆందోళన, తల్లిదండ్రుల నిరసన ప్రదర్శనతో పోలీసులపై విమర్శలు గుప్పించారు. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించి.. తక్షణమే వారిని అరెస్ట్ చేయాలని పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఎట్టకేలకు నిందితులను అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసులో ఎలాంటి తమపై ఎలాంటి ఒత్తిళ్లు రాలేదని.. సాక్ష్యాలు సేకరించటంలో జాప్యం మూలంగానే అరెస్ట్ ఆలస్యం అయ్యిందని పాకూరు జిల్లా ఎస్పీ శైలేంద్ర బర్న్వాల్ వెల్లడించటం విశేషం. నిందితులు ప్రేమ్లాల్, శ్యామూల్, కథి, శిశు హందలు నేరాన్ని ఒప్పుకోవటంతో వారిని రిమాండ్కు తరలించినట్లు వారు వివరించారు. -
నాగు పాము పగ..?!
పాము.. నాగు పాము పగ పడుతుందా..? పగబట్టి వెంటాడుతుందా..? వెంటాడి కాటేస్తుందా..? సామాన్యులు ఔనంటారు. హేతువాదులు కాదంటారు. ఇదంతా ఏమిటని సామాన్యులు ప్రశ్నిస్తారు. అదంతా యాధృచ్ఛికమని హేతువాదులు కొట్టిపారేస్తారు. ఇంతకీ, ఎప్పుడు... ఎక్కడ... ఏం జరిగింది? టేకులపల్లి: పాములు పగ పడతాయన్నది ఒక వాదన. అదంతా మూఢ నమ్మకమేనన్నది మరో వాదన. దీనిపై చర్చకు ఆస్కారమిస్తున్న ఘటన ఒకటి టేకులపల్లి మండలంలోని కోయగూడెం పంచాయతీ బావోజీతండాలో జరిగింది. 11 రోజుల్లో మూడుసార్లు కాటేసింది అదొక చిన్న నాగు (తాచు) పాము. 11 రోజుల వ్యవధిలో ఓ యువకుడిని మూడుసార్లు కాటేసింది. సకాలంలో వైద్యం అందడంతో అతడికి ప్రాణాపాయం తప్పింది. బావోజీతండాకు చెందిన ఆ యువకుడి పేరు అజ్మీర వీరన్న. నిరుపేద వ్యవసాయ రైతు దంపతులైన మంగ్త, మాలి కుమారుడు. ఆరేళ్ల క్రితం కవితతో వివాహమైంది. తండాలోని తల్లిదండ్రుల ఇంటి సమీపంలోనే చిన్న గుడిసెలో వేరుగా వీరన్న–కవిత దంపతులు నివసిస్తున్నారు. టేకులపల్లిలోని కూల్ డ్రింక్స్ గోడౌన్లో వీరన్న పని చేస్తున్నాడు. ఈ నెల 6న మొదటిసారి... ఈ నెల 6వ తేదీ (శుక్రవారం) రాత్రి. అది వీరన్న ఇల్లు. ఇంటి నుంచి బయటకు వెళుతున్నాడు. నాలుగు అడుగులు వేశాడో లేడో.. ఎడమ కాలి కింద మెత్తగా ఏదో తగిలినట్టు అనిపించింది. ఆ వెంటనే అదే కాలి పాదంపై ఏదో కరిచింది. ఈ రెండూ వెంట వెంటనే.. ఒకే ఒక్క క్షణంలో జరిగాయి. గుడ్డి వెళుతురులో కళ్లు రిక్కించి చూశాడు వీరన్న. అమ్మో.. తాచు పాము! చిన్న సైజులో ఉంది. జరజరా పాక్కుంటూ చీకట్లో మాయమైంది. ఇంటికెళ్లి తన భార్యతో చెప్పాడు. ఇద్దరూ పరిశీలనగా చూశారు. పాదంపై రెండు గాట్లు పడ్డాయి. విషయం తెలుసుకున్న వెంటనే వీరన్న తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారు వచ్చేసరికి నోటి నుంచి నురగతో అతడు కింద పడిపోయాడు. అందరూ కలిసి మండలంలోని సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడి సిబ్బంది యాంటీ స్నేక్ ఇంజక్షన్ వేసి, కొత్తగూడెంలోని ప్రభుత్వ వైద్యశాలకు పంపించారు. అక్కడి వైద్యులు పరీక్షించారు. పరిస్థితి విషమించిందంటూ స్థానిక ప్రయివేటు ఆసుపత్రికి పంపించారు. థ్యాంక్ గాడ్.. ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఆస్పత్రి ఖర్చు రూ.16,000 అయింది. మరుసటి రోజున మళ్లీ కనిపించింది మరుసటి రోజు (7వ తేదీన) ఉదయం వీరన్న ఇంటి సమీపంలో చిన్న సైజులోగల నాగు పామును స్థానికులు గమనించారు. చంపేం దుకు ప్రయత్నించడంతో తప్పించుకుని, వీరన్న తల్లిదండ్రుల ఇంటి పక్కనున్న సందులోగల చెట్టు మొట్టు తొర్రలోకి వెళ్లింది. దానిని బయటకు తెచ్చేందుకు గ్రామస్తులు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ నెల 13న రెండోసారి... వీరన్న పూర్తిగా కోలుకున్నాడు. ఆసుపత్రి నుంచి ఇంటికొచ్చాడు. ఈ నెల 13వ తేదీ (శుక్రవారం) రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న వీరన్న పాదంపై మళ్లీ పాము కాటు వేసింది. అతడు దిగ్గున లేచాడు. భయంతో చెమటలు పట్టాయి. వెన్నులో వణుకు మొదలైంది. దూరంగా జరజరా పాక్కుంటూ పాము వెళుతోంది. అదే.. అదే పాము..!! 6వ తేదీన తన కాలిపై కాటేసిన తాచు పామే..!!! కొన్నే కొన్ని క్షణాల్లో అతడి నోటి నుంచి నురగ రావడం మొదలైంది. కుటుంబీకులు, స్థానికులు కలిసి వెంటనే కొత్తగూడెంలోని ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈసారి కూడా ప్రాణాపాయం తప్పింది. ఆస్పత్రి ఖర్చు రూ.23,000 అయింది. అతడి కుటుంబీకుల్లో, స్థానికుల్లో తీవ్ర భయాందోళన మొ దలైంది. అంతకు ముందు పాము దాక్కున్న చెట్టు మొట్టు వద్దకు వెళ్లారు. ఆ పాము అక్కడే ఉండవచ్చేమోనని అనుకున్నారు. దానిని బయటకు రప్పించేందుకు ఎంతగానో ప్రయత్నించారు. ఫలితం కనిపించలేదు. భయాందోళన ఇంకా ఎక్కువైంది. మంత్రగాళ్లను ఆశ్రయించారు. ఇల్లు మార్చాలని మంత్రగాళ్లు చెప్పారు. దీంతో, వీరన్న దంపతులు ఆ ఇంటిని ఖాళీ చేశారు. ఎదురుగా ఉన్న (వీరన్న) తల్లిదండ్రుల ఇంటిలో ఉంటున్నారు. ఈ నెల 16న మూడోసారి... ఈ నెల 16వ తేదీ (సోమవారం) రాత్రి తొమ్మిది గంటల సమయం. తల్లిదండ్రుల ఇంటిలో నిద్రిస్తున్న వీరన్న పాదంపై మూడోసారి పాము కాటు వేసింది. భయం, వణుకుతో వీరన్నకు ప్రాణం పోయినంత పనయింది. అదే పాము.. నెమ్మదిగా పాక్కుంటూ వెళుతోంది. కొత్తగూడెంలోని ప్రయివేటు ఆస్పత్రిలో వెంటనే చికిత్స అందడంతో కోలుకున్నాడు. ఇంటికి తిరిగొచ్చాడు. ‘నాగు (తాచు) పాము పగ పట్టింది. ఇందులో సందేహం లేదు. ఇల్లు మారిన తరువాత కూడా వెతుక్కుంటూ వచ్చి కాటేయడమే ఇందుకు నిదర్శనం’ అని, వీరన్న దంపతులు.. తల్లిదండ్రులు.. స్థానికులు గట్టిగా నమ్మారు. ఈసారి ఎలాగైనా ఆ పామును చంపాలనుకున్నారు. అందరూ చాలా అప్రమత్తంగా ఉన్నారు. ఇప్పటివరకు ఆ పాము ఉదయం, రాత్రి వేళల్లోనే బయటకు వచ్చింది. అందుకే.. ఈ రెండు వేళల్లో ప్రతి ఒక్కరూ వేయి కళ్లతో నిరంతరం.. నిశితంగా పరిశీలిస్తున్నారు. మాయదారి పాము.. మళ్లీ వచ్చింది భయపడినట్టుగానే, అనుకున్నట్టుగానే 18వ తేదీ (సోమవరం) బుధవారం ఉదయం ఆ పాము బయటకు వచ్చింది.. వీరన్న తల్లిదండ్రుల ఇంటి వద్దకు చేరింది. అప్పటికే అక్కడ జనం ఉండటంతో తిరిగి చెట్టు మొట్టు తొర్రలోకి వెళ్లిపోయింది. అది అలా వెళ్లడాన్ని అక్కడి జనం గమనించారు. పరుగు పరుగున మొట్టు వద్దకు వెళ్లారు. ఆ పాముని బయటకు రప్పిం చేందుకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు. ఫలి తం కనిపించలేదు. చివరి ప్రయత్నంగా.. ఆ చెట్టు మొట్టు కింద మంట పెట్టారు. సక్సెస్..! ఆ పాము బయటకు వచ్చింది..!! ఇన్నాళ్లపాటు అందరినీ ముప్పుతిప్పలు పెట్టి, కంటి మీద కునుకు లేకుండా చేసిన ఆ పామును అందరూ కలిసి కొట్టి చంపారు. పీడ విరగడయిందని అనుకున్నారు. హాయిగా.. ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. ఒక రోజు ముందుగానే దీపావళి పండగ చేసుకున్నంతగా సంబరపడ్డారు!! చాలా భయంగా ఉంది ‘‘పాము పగ పడుతుందో లేదో నాకు తెలియదు. కానీ, నన్ను మాత్రం మూడుసార్లు కాటేసింది. వైద్యుల చలవతో బతికి బయటపడ్డాను. ఆస్పత్రి ఖర్చులు 40,000 రూపాయలయ్యాయి. తప్పనిసరి పరిస్థితిలో ఆ పాముని చంపాల్సొచ్చింది. ఎప్పుడేం జరుగుతుందోనని చాలా భయంగా ఉంది’’. అజ్మీర వీరన్న, పాము కాటు బాధితుడు -
34సార్లు కాటేసిన నాగుపాములు.. ఎందుకు?
బి.కొత్తకోట(చిత్తూరు జిల్లా): నాగుపాములు పగపట్టి కాటేస్తాయని సినిమాల్లో చూస్తుంటాం. కానీ నిజ జీవితంలో నాగుపాములు ఓవ్యక్తిని ఏకంగా 34 సార్లు వేటాడి మరీ కాటేశాయి. ప్రతిసారి ప్రాణాపాయం తప్పడం అదృష్టమే అయినా వైద్యం కోసం లక్షలు ఖర్చుచేసి ఆర్థికంగా చితికిపోయాడు ఆరైతు. వివరాల్లోకి వెళ్తే తంబళ్లపల్లె మండలం గోపిదిన్నె పంచాయతీ ఉప్పలూరివాండ్లపల్లెకు చెందిన కె.సురేంద్రనాథ్ రెడ్డిపై పాములు పగపట్టాయి. ఎప్పుడు ఏ పామొచ్చి కాటేస్తుందో తెలియదు. ఒంటరిగా క్షణమున్న భయం. రోడ్డుమీదకొస్తే జనం మధ్యే ఉండాలి. లేదంటే ఎటువచ్చి పాము కాటేస్తుందో అన్న ఆందోళన. ఇలాంటి పరిస్థితుల మధ్య జీవిస్తున్న సురేంద్రనాథ్రెడ్డికి వేటాడుతున్న పాములు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇలా ఒకేవ్యక్తిని నాగుపాములు పదేపదే కాటేయం పెద్ద చర్చగా మారింది. పొలం దున్నుతుండగా తొలిసారి... 2002 జూన్లో సురేంద్రనాద్రెడ్డి ఊరికి సమీపంలో పొలం దున్నతున్నండగా భూమిని చీల్చుకొంటూ వెళ్తున్న మడకలోంచి బయటకొచ్చిన నాగుపాము సురేంద్ర కాలికి కాటేసింది. దీనికి వైద్యం తీసుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. అప్పటినుంచి మొదలైన నాగుపాముల వేట నిరంతరం కొనసాగింది. ఇంటిలో ఉంటే తప్ప ఎక్కడ కనిపించినా పాము కాటేసేది. 2017 మే 29 వరకు మొత్తం 34 సార్లు నాగుపాములు కాటేశాయి. కాళ్లు చేతులపై వేసిన కాట్లతో చెరిగిపోని గుర్తులుగా మిగిలాయి. ఇంటి ఆవరణలో నిద్రిస్తున్నా, ఎక్కడికైనా వెళ్తున్నా, జనం మధ్యలో ఉన్నా కాటేసి వెళ్లేవి. స్థానికులు, కుటుంబీకులు ఆస్పత్రికి తరలించి ప్రాణం నిలపెట్టేవాళ్లు. ఇలా నాగుపాములు కాటేస్తున్న విషయంపై వైద్యులకు అనుమానం వస్తే ఓసారి ఎడమచేతికి కాటేసిన నాగుపామును అలాగే తీసుకుని ఆస్పత్రికి వచ్చాడు సురేంద్ర. దీనితో నిజమేనని నమ్మిన వైద్యులు చికిత్సలు చేస్తూ బతికిస్తూ వస్తున్నారు. కాటేసిన ప్రతిసారి ప్రాణం పోయిందన్న ఆవేదనతో సురేంద్రనాధ్రెడ్డి కుమిలిపోయేవాడు. కాటేసిన పాముల్లో ఆరింటిని చంపేశాడు. కొన్ని సార్లు చావు అంచులదాక వెళ్లొచ్చాడు. ఈ సందర్భాల్లో నోరు, ముక్కుల్లోంచి రక్తం, నురగ రావడంతో తిరుపతి, బెంగళూరు ఆస్పత్రుల్లో వైద్యం పొందాడు. ఇల్లు గుల్ల పాముకాటుకు గురైనప్పుడు ప్రాణాలతో బయటపడేందుకు వైద్యం కోసం సురేంద్రనాథ్రెడ్డి సుమారు రూ.10లక్షల వరకు ఖర్చు చేశాడు. దీనికి సంబంధించి రూ.6.50లక్షల వైద్యం బిల్లులు ఉన్నాయి. కుటుంబం గడవడమే భారంగా మారిన సురేంద్రనాథరెడ్డికి భార్య రెడ్డెమ్మ, చదువుకొనే ఇద్దరు కుమార్తెలు చదువుతున్నారు. సురేంద్రకు ఏలాంటి ఆదాయమార్గాలు లేవు. వ్యవసాయం ఆగిపోయింది. భార్య రెడ్డెమ్మ స్వచ్చంద సంస్థలో పనిచేస్తుండగా వచ్చే కొద్దిపాటి వేతనంతో కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఇప్పుడు సురేంద్ర పరిస్థితి దయనీయంగా మారింది. వైద్యం, పాముకాట్ల కారణంగా శరీరం నిస్సత్తువుగా మారింది. ఎక్కువ దూరం నడవలేడు. మునుపటిలా కష్టపడి సేద్యం చేయలేడు. వర్షంలో తడిస్తే వాపులు, గుల్లలు వస్తాయి. దీనికి విరుగుడుగా వేడి పదార్థాలను తీసుకుంటే తగ్గిపోతాయి. దీనిపై సురేంద్ర, ఆయన భార్య రెడ్డమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత మందిలో ఉన్నా తననే పాములు ఎందుకు కాటేస్తున్నాయో అర్థం కావడం లేదని సురేంద్ర వాపోయాడు. -
కాకులతో పెట్టుకుంటావా.. ఖబడ్దార్!
వేమనపల్లి: పాములు పగబడుతాయనే మాట విన్నాం.. కానీ కాకులు కూడా పగబట్టడం వింతే మరి. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలకేంద్రం బొగుడ గూడెంలో కాకుల జంట ఓ యువరైతును పగబట్టాయి! అతను ఎటు వెళ్లినా వెంటప డుతూ ముప్పుతిప్పలు పెడుతున్నాయి. తెల్గ రమేశ్ అనే వ్యక్తిని ఓ కాకుల జంట గత పది రోజులుగా వెంబడిస్తోంది. రమేశ్ ఇంటి సమీపంలో ఉన్న వేపచెట్టు ఇటీవల గాలి దుమారాలకు ఒక వైపునకు వంగింది. రోడ్డు వెంట రాకపోకలకు ఇబ్బందిగా ఉందని రమేశ్ ఆ చెట్టు కొమ్మలను నరికాడు. అదే వేప చెట్టుపై ఉన్న కాకి గూడును అతను గమనించ లేదు. ఆ కొమ్మలు నరుకు తుండగా గూట్లో ఉన్న కాకిపిల్లలు కింద పడ్డాయి. ఇక అంతే.. ఆ కాకులు వెంటనే రమేశ్పై దాడికి దిగాయి. కావు కావు మం టూ అరుస్తూ, కాళ్లతో కొడుతూ, ముక్కుతో పొడుస్తూ బీభత్సం సృష్టిం చాయి. వాటి గోలకు తట్టుకోలేక ఇంట్లోకి పరిగెత్తాడు. కిందపడ్డ కాకి పిల్లలను కాపాడాలని గ్రామస్తులు సూచించారు. దీంతో వాటిని తట్టలోకి తీసుకుని కొమ్మలు లేని ఆ వేప చెట్టుపై పెట్టాడు. అప్పటి నుంచి కాకులు పిల్లల ఆలనాపాలనా చూసుకుంటున్నా యి. కానీ, రమేశ్ను మాత్రం వదిలిపెట్టడం లేదు. చెట్టు పక్కనే ఉన్న గడ్డివాము వద్దకెళ్లి ఎడ్లకు మేత వేద్దామన్నా వెంబడిస్తున్నాయి. వాడలో కనిపించినా, రోడ్డు మీదకొచ్చినా దాడికి దిగుతున్నాయి. దీంతో రమేశ్ వాటి కంటపడకుండా వ్యవసాయ పనులకు వెళుతున్నాడు. ‘‘కాకులతోని నాకిదేం గోస, వాటి పగ గింత ఘోరంగా ఉంటుందనుకోలేదు. వాటి పిల్లలను కింద పడేసినందుకే నా మీద కసి పెంచుకు న్నయ్. మా బొగుడగూడెంల ఎక్కడ కనపడ్డా నాపై దాడికి దిగుతున్నాయి. ఆటికి కనపడకుండా చేన్లకు, ఎవుసపు పనులకు పోతాను’’అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. -
ప్రతీకారం కోసం లాడెన్ కొడుకు తహ తహ
-
పగకు పొగబెడదాం...
ఆత్మీయం కోపానికి పుట్టిన బిడ్డ పగ. ఇది చాలా ప్రమాదకరమైనది. అందుకే పగ ఉన్న మనిషిని పామున్న ఇంటితో పోల్చాడు తిక్కన మహాభారతంలో. ఎందుకంటే మనసులో ఎవరి మీద అయినా పగ ఉంటే వాళ్లు స్థిమితంగా ఉండలేరు. ఎదుటి వారిని స్థిమితంగా ఉండనివ్వరు. పగబట్టిన వారు తమ అభివృద్ధి మీద, తమ బాగు మీద దృష్టి పెట్టడం మానేసి, తాము పగబట్టిన వారిని నాశనం చేయడం కోసమే ఎదురు చూస్తుంటారు. పగ నివురుగప్పిన నిప్పులా మనిషిని నిలువెల్లా దహించి వేస్తుంది. ఎవరి మీదనయితే పగబట్టామో, వారిని చావు దెబ్బతీయాలని, సర్వనాశనం చేయాలని ఎదురు చూస్తూ చివరకు తమకు తామే చేటు తెచ్చుకుంటారు. శాస్త్రీయమైన ఆధారాలు లేనప్పటికీ, పాము ఎవరి మీదనయితే పగబట్టిందో, నిర్ణీత గడువు లోగా ఆ పగ తీర్చుకోలేకపోతే నోటి ముందుకు వచ్చిన ఆహారాన్ని కూడా తినడం మానేసి, ఆకలితో కృంగి, కృశించి, చివరకు తలను నేలకేసి కొట్టుకుని చచ్చిపోతుందంటారు. అర్థం పర్థం లేని పగలు, ప్రతీకారాల వల్ల అవతలి వారి నిండుప్రాణాలు తీయడానికి వెనుదీయకపోవడంతోపాటు ఆత్మహాని కూడా జరుగుతుంది. అందుకే పగను ప్రేమతో... శాంతంతో... సహనంతో... క్షమతో తరిమి కొట్టాలి. -
సైకిల్తో వేటాడి తగిన బుద్ధి చెప్పింది
-
సైకిల్తో వేటాడి తగిన బుద్ధి చెప్పింది
లండన్: సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయ్యింది. అల్లరి చేయాలని, ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడాలని ప్రయత్నించిన కొంతమంది పురుషులకు ఓ యువతి తగిన బుద్ధి చెప్పింది. పట్టరాని కోపంతో వారిని ఫాలో అయ్యి మరి తన కసి తీర్చుకొని వెళ్లిపోయింది. ఈ వీడియో లండన్లోని గో ప్రో కెమెరాలో రికార్డు చేశారు. ఓ బైకర్ తాను రైడింగ్ చేస్తూ వెళుతుండగా తన కళ్లముందు చోటు చేసుకున్న ఈ దృశ్యాన్ని రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టగా ఇప్పుడది దుమ్మురేపుతుంది. దీన్ని చూసినవారంతా అమ్మాయి అంటే ఇలా ధైర్యంగా ఉండాలి అని అనుకుంటున్నారు. ఈ వీడియోలో రికార్డయిన ప్రకారం.. ఓ అమ్మాయి సైకిల్ పై వెళుతుండగా వ్యాన్లో వెళుతున్న కొంతమంది ఆమెను చూసి కామెంట్లు చేశారు. అవేవీ పట్టించుకోకుండా ముందుకెళ్లిన ఆమె ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగింది. ఆ వ్యాన్ కూడా ఆమెతోపాటు అక్కడే గ్రీన్ సిగ్నల్ కోసం ఆగిన సందర్భంలో వారు దుశ్చేష్టలు ఆపలేదు.. తమ ఫోన్ నెంబర్ తీసుకోవాలని, లేదంటే ఆమె ఫోన్ నెంబర్ ఇవ్వాలని విసిగించారు. అసభ్యంగా తాకేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత గ్రీన్ సిగ్నల్ పడగానే ముందుకు కదిలారు. కానీ, వారిని విడిచిపెట్టకూడదని భావించిన ఆ యువతి వ్యాన్తోపాటు వేగంగా సైకిల్ తొక్కి ఓ చోట ఆగిన వ్యాన్ వద్దకు వెళ్లి దాని సైడ్ మిర్రర్ను విరిచి నేలకేసి వారిపై ఆగ్రహం వ్యక్తం చేసి గట్టి వార్నింగ్ ఇచ్చి వెళ్లింది. ప్రస్తుతం ఈ వీడియోను లక్షలమంది చూశారు. -
జింక ఓ మహిళను పగబట్టిన వేళ..
-
జింక ఓ మహిళను పగబట్టిన వేళ..
న్యూజెర్సీ: సాధారణంగా పాములు పగబడతాయంటే విన్నాము.. మనుషులు పగబడతారంటే నిజంగా చూశాం. కానీ, బెదురుబెదురుగా ఉంటూ చీమ చిటుక్కుమన్న చెవులు నిక్కపొడుచుకొని తలపైకెత్తి చూసి పారిపోయేందుకు సిద్ధంగా ఉండే జింకలు కూడా పగబడతాయంటే నమ్ముతామా.. కానీ, నమ్మాలి. న్యూజెర్సీలో ఓ కొమ్ముల జింక ఇలాగే చేసింది. తనను ఢీకొట్టిన ఓ ఎస్యూవీ వాహనం నడుపుతున్న మహిళపై తన కసి కొద్దిగా దాడికి దిగింది. తన కొమ్ములతో డోర్ ఓపెన్ చేసి మరి యుద్ధం చేసినంతపని చేసి ఆమెకు చుక్కలు చూపించింది. ఈ క్రమంలో ఆమె కాలికి గాయం కూడా అయింది. అయితే, ఏదో ఒకలా ఆ జింక గట్టిగా తన్ని బయటపడిన ఆమె వెంటనే డోర్ వేసుకుంది. కానీ, కారుతగలడంతో గాయాలపాలయిన ఆ జింకా కొద్ది సేపటి తర్వాత చనిపోయింది. ఇద్దరు వ్యక్తులు కలిసి జాలిగా షికారుకు వెళుతుండగా రాత్రి పూట కొద్ది రోజుల కిందట ఈ ఘటన చోటుచేసుకుంది. ఇదంతా పెట్రోలింగ్ కు వెళుతున్న ఓ అధికారి కారులోని డాష్ క్యామ్ లో రికార్డవ్వగా దానిని తాజాగా విడుదల చేయడంతో వైరల్ గా మారింది. -
ఆనాటి కక్షలు...నేటికి ప్రతీకారం
విదేశాల నుండి వ్యూహారచన అదును చూసి ప్రత్యర్దులపై దాడి గ్రామాన్ని వీడిన రెండు వర్గాలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని వైనం ‘తిరుపతమ్మ’ శప««దlం చేసి అంతమోందించే పెద్ద తలకాయ ఎవరిది? పెదవేగి రూరల్: కుటుంబ, రాజకీయ కక్ష్యల నేపధ్యంలో జరిగిన ట్రిపుల్ మర్డర్కు నేటికి రెండేళ్లు....గ్రామంలో జరిగిన ఓ హత్యకు ప్రతిగా హతుడి భార్య చేసిన శపధంతో జిల్లాలో హత్యల పరంపర కొనసాగుతూ వస్తోంది. ఓకే సామాజిక వర్గానికి చెందిన ఇరువర్గాల వారు వారి వారి కుటుంబాలలో పెద్దదిక్కులను కోల్పోయి నిరాశ్రయులవగా, కుటుంబ సభ్యులు అనాధలుగా మారారు. సామాజికవర్గమే కాదు వీరి ఇరువర్గాలలో ప్రవహించే రక్తమూ ఒక్కటే అయినా రక్తసంభందం రక్తం పారించడానికి వారికి అడ్డుకాలేదు. ఆడ మగ తేడా లేకుండా ప్రతీకారంతో రగులుతూ రక్తపాతం సషి్ఠస్తున్నారు. ఏలూరు జేకే ప్యాలెస్ హోటల్ యజమాని భూతం దుర్గారావు హత్యతో మొదలైన పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. దేశవిదేశాలలో తమ వత్తిపరంగా ఖ్యాతితో పాటు కాసులు గడించిన వారు వారిని అంతమొందించేందుకు గడించిన కాసులనే వర్షంలా కురిపిస్తూ హత్యాకాండ కొనసాగిస్తున్నారు. తిరుపతమ్మ శపధం చేసి అంతమోందించనున్న పెద్ద తలకాయ్..? పెదవేగి మండలం పినకడిమి గ్రామంలో జ్యోతిష్యం వత్తిగా జీవించే కొన్ని కుటుంబాలు ఉన్నాయి. వాటిలో రెండు కుటుంబాల మధ్య ఆరేళ్ల క్రితం తలెత్తిన కుటుంబ వివాదం ఆ తర్వాత రాజకీయ రంగు పులుముకుంది. జ్యోతిషు్యడు, ఏలూరులోని జేకే ప్యాలెస్ హోటల్ అధినేత భూతం దుర్గారావు పినకడిమి గ్రామంలో ఓ రాజకీయ పార్టీ పెద్దగా ఉండేవారు. ఆయన సూచించిన వారికే పదవులు దక్కేవి. దుర్గారావు సోదరుడు గోవిందు కుమార్తెను తూరపాటి నాగరాజు కుమారుడికి ఇచ్చి వివాహం చేశారు. కాగా, ఆరేళ్ల క్రితం గోవిందు కుమార్తె నాగరాజు కొడుకుపై వరకట్న వేధింపుల కేసు పెట్టడంతో ఇరు కుటుంబాల మధ్య వివాదాలు మొదలయ్యాయి. ఆ తర్వాత జరిగిన పంచాయితీ ఎన్నికల సమయంలో మాజీ ఎంపీటీసీ పామర్తి వెంకటేశ్వరరావుకు తిరిగి ఎంపీటీసీ టికెట్ ఇచ్చేందుకు దుర్గారావు నిరాకరించడంతో వివాదంలోకి రాజకీయం అడుగుపెట్టింది. దీంతో కుటుంబ, రాజకీయ కక్ష్యల నేపధ్యంలో గ్రామంలోనే వాకింగ్ చేస్తోన్న దుర్గారావును ప్రత్యర్ధులు గత 2014 ఏప్రిల్ 6వ తేదీన కత్తులతో నరికి హత్యచేశారు. ఈ నేపద్యంలో ఏలూరు జేకే ప్యాలెస్ హోటల్ యజమాని భూతం దుర్గారావు భార్య తిరుపుతమ్మ. భర్త మతదేహం ముందు నిన్ను చంపిన వారిని చంపాకే నీకు కర్మఖాండ చేస్తా...నా మెడలో తాళి తీస్తానని తిరుపతమ్మ శపధం చేసింది. ఆ తరువాత ఐదు నెలల వ్యవధిలోనే తన భర్త హత్యకేసులో నిందితులుగా ఉన్న గంధం మారయ్య, పగిడిమారయ్యలు ఏలూరు కోర్టుకు వస్తుండగా అదే ఏడాది సెప్టెంబర్ 24వ తేదీన పెద్దఅవుటపల్లి వద్ద కిరాయి హంతకులు కాల్చి చంపారు. వీరితో పాటు వీరి తండ్రి గంధం నాగేశ్వరరావు కూడా ఈ ఘటనలో మతిచెందారు. ఇదిలా ఉండగా భూతం దుర్గారావు హాత్యకేసులోని ప్రధాన నిందితుడైన తూరపాటి నాగరాజు తన భార్యతో కలిసి హైదరాబాద్ సరూర్నగర్లోని జింకలదీవి కాలనీలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని జీవిస్తుండగా, పోలీసులకు చిక్కని నిందితుడు ప్రత్యర్దులకు చిక్కనే చిక్కాడు. దీనిలో భాగంగానే 2015 మార్చి 31వ తేదీన నాగరాజుపై అగంతకులు ఐదురౌండ్లు కాల్పులు జరిపి హాత్యాయత్నానికి పాల్పడ్డారు. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సషి్ఠంచిన ఈ ఘటనలో నాగరాజు ప్రాణాలతో బయటపడ్డాడు. మళ్ళీ 2016 జూన్ 28వ తేదీ రాత్రి ఏలూరులో దుర్గారావు హత్యకేసులో ప్రధాన నిందితుడైన తూరపాటి నాగరాజుపై కాల్పులు జరిగాయి. రెండసారి దాడిలోనూ నాగరాజుకు ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. ఈ నేపధ్యంలో స్దానికంగా అలజడి వాతావరణం నెలకొంది. గ్రామంలో మరలా పోలీసుల పహారా, వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. ఇలా ఏ సమయంలో ఏ వర్గం వారు ఎవరెవరిని దాడి చేస్తారో తెలియక ఇటు పోలీసులకు, ప్రజలకు మనశాంతి లేకుండా పోయింది. అస్సలు తిరుపతమ్మ శపధం చేసిన పెద్ద తలకాయ ఎవరిదన్న? ఆలోచన ఎవ్వరికి నిద్ర పట్టనివ్వకుంది. ఏలూరులో దాడి అనంతరం కోలుకున్న నాగరాజు కుటుంబ సభ్యులతో సహా అజ్ఞాతంలోకి వెల్లిపోయాడు. ప్రస్తుతం హాత్యలకు కారణమైన ఇరువర్గాలు పినకడిమి గ్రామంలో లేరు. వీరితో పాటు చాలా కుటుంబాలు జరుగుతున్న వరుస దాడులు, హాత్యలను చూసి నూటికి 50 శాతం మంది ప్రజలు గ్రామాన్ని వీడి బయటకు వెల్లిపోయారని స్దానికులు చెబుతున్నారు. ఈ మారణకాండలు ఎప్పటికి ఆగుతాయో అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో అంతా ప్రశాంతం... వీరంకి రామకోటేశ్వరరావు ఎసై ్స పెదవేగి మండలం గ్రామంలో ప్రస్తుతం అంతా ప్రశాంతంగా ఉంది. పికెట్స్ను కూడా ఉన్నతాధికారులు తీసేసారు. భూతం దుర్గారావు, తూరపాటి నాగరాజుల ఇరు కుటుంబ సభ్యులు పినకడిమి గ్రామంలో లేరు. మా స్టేషన్ నుండి సిబ్బంది అప్పుడప్పుడు వెల్లి అక్కడ పరిస్దితిని పరిశీలించి వస్తాము. -
పథకం ప్రకారమే ప్రతీకార హత్య
హత్యకేసులో ఆరుగురు నిందితుల అరెస్ట్ కదిరి టౌన్ : తమ సోదరుడ్ని హతమార్చాడనే కక్షతో పథకం ప్రకారం ప్రతీకార హత్య చేశారు.. ఆ ఇద్దరు. చివరికి పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్వాపరాలను బుధవారం రాత్రి స్థానిక రూరల్ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ రవికుమార్ వెల్లడించారు. వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లి సమీపంలోని టీ.వెలమవారిపల్లికి చెందిన రామచంద్రరెడ్డి 2015లో ఉగాది పండుగ సమయంలో హత్యకు గురయ్యాడు. అయితే ఈ హత్య కేసులో కీలక పాత్ర పోషించిన అదే గ్రామానికి చెందిన వెంకటసుబ్బారెడ్డిని అంతమొందించాలనుకున్నారు.. రామచంద్రసోదరులు. ఇందుకు పథకం రచించారు. వెంకటసుబ్బారెడ్డిని నమ్మించి హతమారిస్తే రూ.6లక్షల మేర నగదు ఇస్తామని దీంతో గత ఏడాది జూలై 31న అదే గ్రామానికి చెందిన ఓబుళరెడ్డి, గోవర్ధన్, అతని కుమారుడు లక్ష్మినాయుడు, ప్రభాకర్, నాగేంద్రలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతా కలిసి వెంకటసుబ్బారెడ్డిని నమ్మించి ఆటోలో తలుపుల వైపు బయలుదేరారు. మార్గమధ్యంలో తలుపుల మండలం దాంపల్లి సమీపంలోకి రాగానే ఆటో చెడిపోయినట్లు, మెకానిక్ను తీసుకురావాలని తోటి వారిని సూచించినట్లు నాటకమాడారు. అక్కడ పథకం ప్రకారం తమ వెంట తెచ్చుకున్న మిరపపొడిని చల్లి కట్టెలు, రాళ్లతో వెంకటసుబ్బారెడ్డిని దారుణంగా హతమార్చారు. అప్పట్లో ఈ హత్య తలుపుల మండలంలో సంచలనం రేపింది. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి తమదైన శైలిలో పలు కోణాల్లో విచారణ జరిపి ఎట్టకేలకు బుధవారం నిందితుల్ని అరెస్ట్ చేసి వారి నుంచి రూ.60వేల నగదుతో పాటు హత్యకు ఉపయోగించిన కట్టెలు, రాళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్యకేసులో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని వారిలో ఒక మహిళ కూడా ఉందని సీఐ వివరించారు. త్వరలోనే వారిని కూడా అరెస్ట్ చేస్తామన్నారు. సమావేశంలో తలుపుల ఎస్ఐ చంద్రశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఫ్రాన్స్ ప్రతీకారం!
డోవర్: ఒకదాని వెంటే మరో వాహనం.. 20 కిలోమీటర్లకుపైగా స్తంభించిన ట్రాఫిక్. వేలాది వాహనాల్లో లెక్కకు మించిన జనం.. పైన ఎండ వాత.. లోన ఉక్కపోత.. గంటా రెండు గంటలూ కాదు గడిచిన రెండు రోజులుగా అక్కడ ఇదే పరిస్థితి. ఇప్పుడు స్తంభించిన ట్రాఫిక్ క్లియర్ చేయాలంటేనే ఇంకో రెండు రోజులు పడుతుంది. వాహనాల్లో చిక్కకుపోయిన పిల్లలు, వృద్ధులు, మహిళలదైతే అరిగోస! ప్రభుత్వం తన వంతుగా ప్రయాణికులకు 11వేల నీళ్ల బాటిళ్లను సరఫరా చేస్తోంది. ట్రాఫిక్ క్లియరెన్స్ పై మాత్రం చేతులెత్తేసింది. ఎందుకంటే ఆ పని చేయాల్సింది పొరుగుదేశం కాబట్టి! బ్రిటన్- ఫ్రాన్స్ సరిహద్దులోని డోవర్ పట్టణంలో గడిచిన 50 గంటలుగా ట్రాఫిక్ భారీగా స్తంభించింది. నీస్ ట్రక్కు దాడి తర్వాత అంతర్గత భద్రతను కట్టుదిట్టం చేసిన ఫ్రాన్స్.. అన్ని వైపుల నుంచి వచ్చే వాహనాల తనిఖీలు నిర్వహిస్తోంది. దీంతో బ్రిటన్ నుంచి చానెల్ టన్నెల్ మీదుగా ఫ్రాన్స్ వెళ్లాల్సిన వాహనాలన్నీ ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఒక్కో వాహనం తనిఖీకి 40 నిమిషాలు పడుతుండటంతో ఇప్పుడున్న ట్రాఫిక్ క్లియరెన్స్ కే రెండు లేదా అంతకు మించి రోజుల సమయం పడుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఫ్రాన్స్ బ్రిటన్ సరిహద్దును దాదాపు మూసేసినంత పని చేయడంతో బ్రిటిషర్లు భగ్గుమంటున్నారు. ఫ్రాన్స్ బ్రెగ్జిట్ కు ప్రతీకారం తీర్చుకుంటోందని నెటిజన్లు భావిస్తున్నారు. -
ప్రతీకారంతో...!
కాలేజీలో ఓ ఆరుగురు యువకులు చేసిన అన్యాయానికి బదులుగా ఓ అమ్మాయి ఎలా ప్రతీకారం తీర్చుకుందనే కథాంశంతో హారర్, సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిన చిత్రం ‘అమ్మాయి...ఆరుగురు’. జి.మురళి దర్శకత్వంలో రామచంద్ర హీరోగా నటిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆశాలత కథానాయిక. ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. హీరో మాట్లాడుతూ -‘‘బావా మరదళ్ల మధ్య సాగే ఈ ప్రేమకథ అందరినీ అలరిస్తుంది. తలకోన, దుర్గంకొండ ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరిపాం. ముఖ్యంగా వందేమాతరం శ్రీనివాస్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలైట్గా నిలుస్తుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సుధీర్, సంగీతం: వందేమాతరం శ్రీనివాస్. -
వీడియో: ఖలీ పగ తీర్చుకున్నాడిలా..!
న్యూఢిల్లీ: రెజ్లింగ్ మ్యాచులో తనపై తీవ్రంగా దాడి చేసిన ప్రత్యర్థులను చిత్తుచేసి ది గ్రేట్ ఖలీ పగ తీర్చుకున్నాడు. ఆదివారం డెహ్రాడూన్లో జరిగిన రెజ్లింగ్ మ్యాచులో ఖలీ వీరవిహారం చేశాడు. తలకు బ్యాండెడ్ కట్టుకొని రింగులోకి దిగిన ఖలీ కెనడా రెజర్లపై భారీ పంచులు కురిపించాడు. ప్రధాన ప్రత్యర్థి అయిన బ్రాడీ స్టీల్ను చిత్తుగా ఓడించాడు. 'ది గ్రేట్ ఖలీ షో' పేరిట ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ వీడియో ప్రస్తుతం యూట్యూబ్లో హల్చల్ చేస్తున్నాయి. అంతకుముందు జరిగిన మ్యాచులో కెనడియన్ రెజ్లర్ బ్రాడీ స్టీల్ ఖలీని తీవ్రంగా గాయపర్చిన సంగతి తెలిసిందే. స్టీల్, అతని సహచరులు ఒక్కసారిగా విరుచుకుపడటంతో తలకు, చేతికి గాయాలైన ఖలీ ఐసీయూలో ఉండి చికిత్స పొందాడు. గాయాల నుంచి కోలుకొని ఆదివారం రింగులోకి దిగిన ఖలీ ప్రత్యర్థులపై దాడి చేసే దృశ్యాలతోపాటు.. అంతకుముందు అతనిపై కెనడా రెజర్లు విరుచుకుపడిన దృశ్యాలు కూడా ఈ వీడియోలో చూడొచ్చు. 7.1 అడుగుల ఎత్తుతో మాంఛి బలిష్టంగా ఉండే ఖలీ అసలు పేరు దలిప్ సింగ్ రాణా. పంజాబ్ రాష్ట్ర పోలీస్ ఆఫీసర్ అయిన ఖలీ 2007లో హెవీ వెయిట్ ఛాంపియన్ షిప్ సాధించాడు. -
ప్రత్యర్థిని చిత్తుచేసి పగ తీర్చుకున్న ఖలీ
డెహ్రాడూన్: డబ్ల్యూడబ్ల్యూఈ మాజీ సూపర్ స్టార్ ది గ్రేట్ ఖలీ తనపై దాడిచేసిన ప్రత్యర్థిపై ప్రతీకారం తీర్చుకున్నాడు. ఆదివారం జరిగిన మ్యాచులో కెనడా రెజ్లర్ బ్రాడీ స్టీల్ ను చిత్తుగా ఓడించి తన సత్తా చాటాడు. డెహ్రాడూన్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం రాత్రి కిక్కిరిసిన అభిమానుల మధ్య ఖలీ వీరవిహారం చేశాడు. ఐదు రోజుల కిందట జరిగిన మ్యాచులో కెనడియన్ రెజ్లర్ బ్రాడీ స్టీల్ ఖలీని తీవ్రంగా గాయపర్చిన సంగతి తెలిసిందే. స్టీల్ తోపాటు అతని సహచరులు ఒక్కసారిగా విరుచుకుపడటంతో తలకు, చేతికి గాయాలైన ఖలీ ఐసీయూలో ఉండి చికిత్స పొందాడు. ఈ సందర్బంగా తనపై దాడికి దిగిన రెజర్లను చిత్తుగా ఓడించి దెబ్బకు దెబ్బ తీస్తానని ఖలీ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. 'ది గ్రేట్ ఖలీ షో' పేరిట ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో ఈ కుస్తీ పోటీలు జరుగుతున్నాయి. ఆదివారం జరిగిన మ్యాచుకు ఉత్తరాఖండ్ సీఎం హరీశ్ రావత్, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కిషోర్ ఉపాధ్యాయ్ హాజరై తిలకించారు. 7.1 అడుగుల ఎత్తుతో మాంఛి బలిష్టంగా ఉండే ఖలీ అసలు పేరు దలిప్ సింగ్ రాణా. పంజాబ్ రాష్ట్ర పోలీస్ ఆఫీసర్ అయిన ఖలీ 2007లో హెవీ వెయిట్ ఛాంపియన్ షిప్ సాధించాడు. -
పాత కక్షలతో 3 బైక్లు దహనం
మేడ్చల్ (రంగారెడ్డి) : పాత కక్షల నేపథ్యంలో ఇంటి ఆవరణలో ఉంచిన మూడు బైక్లను గుర్తు తెలియని దుండగులు దహనం చేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం రాయిలాపూర్ గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. మేడ్చల్ సీఐ శశాంక్రెడ్డి , గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... రాయిలాపూర్ గ్రామానికి చెందిన వెంకటస్వామి గౌడ్, అంజయ్య గౌడ్ కల్లు వ్యాపారం చేస్తున్నారు. గ్రామ ప్రధాన రోడ్డు పక్కన ఉన్న రెండంతస్తుల భవనంలో వెంకటస్వామి, అంజయ్య కుటుంబాలు ఉంటున్నాయి. వారికి చెందిన ఒక పల్సర్, రెండు హీరో హోండా బైకులను ఇంటి ఆవరణలో పార్క్ చేసి ఇంట్లో వారు నిద్ర పోయారు. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో వెంకటస్వామి ఇంటి నుంచి మంటలు చెలరేగాయి. రోడ్డుపై వెళుతున్న కంకర తరలించే టిప్పర్ డ్రైవర్లు గమనించి వెంకటస్వామిని నిద్రలేపారు. వారు ఇరుగుపొరుగు వారి సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. మంటల్లో వాహనాలు పూర్తిగా కాలిపోగా ఇంటి పైకప్పు పాక్షికంగా దెబ్బతింది. వాహనాలు పార్క్ చేసిన ప్రాంతానికి పక్కనే వంట గది ఉంది. మంటలు ఏమాత్రం వంట గదిలోకి చేరి గ్యాస్ సిలిండర్ల వరకు పాకి ఉంటే పెను ప్రమాదం చోటు చేసుకునేది. వారి విరోధులెవరో కక్ష తీర్చుకునేందుకు ఈ చర్యకు పాల్పడి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
భయానక క్షణం నుంచీ..
మూడేళ్ళ క్రితం ఆమె... మెర్సీ కిల్లింగ్ కు పర్మిషన్ ఇమ్మంటూ కోర్టుకు అర్జీ పెట్టుకుంది. సగం కాలిన గాయాలతో, చూపు, వినికిడి కోల్పోయి బతకడమే కష్టంగా ఉందంటూ కోర్టును వేడుకుంది. అయితే ఇప్పుడామె బతకాలనుకుంటోంది. తనవంటి బాధితులకు జీవితంపై ఆశ కల్పించి, అండగా నిలబడి న్యాయంకోసం పోరాడేందుకు సిద్ధమైంది. పదేళ్ళక్రితం ఝార్ఖండ్ కి చెందిన సోనాలీ ముఖర్జీ.. ముగ్గురు దుండగుల యాసిడ్ దాడినుంచీ కేవలం ప్రాణాలతో బయట పడింది. అది.. 2002 సంవత్సరం. అప్పుడామెకు పదిహేడేళ్ళ వయసు. అందరిలాగే కాలేజీ జీవితాన్ని హాయిగా గడుపుతోంది. కానీ ఆమెపై కన్నేసిన దుండగులు ఎంత బతిమలాడినా ఆమెను వదల్లేదు. ఆఖరికి ఆమె తండ్రి కూడ వేడుకున్నాడు. తన కూతరి వెంట పడొద్దని. కొన్నాళ్ళు ప్రశాంతంగా జరిగిపోయింది. అయితే ఆ ప్రశాంతత వెనుక తుఫాను లాంటి భయం ఉందని వారు గమనించలేదు. దుండగులు రహస్యంగా పన్నిన పన్నాగంలో సోనాలీ చిక్కుకుపోయింది. యాసిడ్ దాడిలో కాలిన ముఖంతోపాటు, కళ్ళు చాలా వరకు దెబ్బతిన్నాయి. వినికిడి శక్తి కొంతశాతం కోల్పోయింది. డాక్టర్లు కూడ ఇంతటి దారుణాన్ని తామెప్పుడూ చూడలేదన్నారు. అయితే ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆమెకు ఎంతగానో సహకరించారు. గత పదేళ్ళలో ఆమె ముఖాన్నికొంతవరకైనా సాధారణ స్థితికి తెచ్చేందుకు కనీసం 28 సార్లు ప్లాస్టిక్ సర్జరీ నిర్వహిచారు. భవిష్యత్తులో కూడ మరెన్నో చికిత్సలు చేయాల్సి ఉంది. అయినా ఆమె సగం కాలిన ముఖంతోనే జీవితం గడపాల్సి ఉంది. కానీ ఆమెపై దాడి చేసిన దుండగులు మాత్రం కేవలం రెండున్నరేళ్ళ జైలు శిక్ష అనుభవించి బయటకొచ్చేశారు. ప్రశాతంగా జీవితం గడుపుతున్నారు. 2012 లో సోనాలీ కోర్టును ఆశ్రయించింది. ఇండియాలో అమలులోలేని.. మెర్సీ కిల్లింగ్ కు పర్మిషన్ ఇవ్వాలని అర్జీ పెట్టుకుంది. ''నాకు న్యాయం జరగడం లేదు, నేనీ బాధ భరించలేను. సగం ముఖంతో మిగిలిన సగం జీవితాన్నిజీవించలేను. నాకు మిగిలిన మార్గం ఒక్కటే. నా ప్రాణం తీసుకునేందుకు పర్మిషన్ ఇవ్వండి'' అంటూ వేడుకుంది. అయితే 2013 లో జరిగిన ఘటన ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఇండియాలోనే అతిపెద్ద టీవీ కార్యక్రమం కౌన్ బనేగా కరోడ్ పతి లో పాల్గొన్న ఆమెను చూసిన చిత్తరంజన్ తివారి ఫేస్ బుక్ ద్వారా పలకరించాడు. ఆ స్నేహం ప్రేమగా మారి పెళ్ళికూడ చేసుకునేందుకు అంగీకరించాడు. ఈ ఏడాది ఏప్రిల్ లో వారి వివాహం జరిగింది. '' నాకు పెళ్ళవుతుందని నేను ఏమాత్రం ఊహించలేదు. పదేళ్ళుగా నన్ను నేను నిలబెట్టుకునేందుకు ఎంతో ప్రయాస పడ్డాను. కానీ పెళ్ళి జరుగుతుందని మాత్రం కలలో కూడ అనుకోలేదు'' అంటుంది సోనాలి. ఇప్పుడామె ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగుతోంది. తనవంటి బాధితులకు అండగా నిలబడి, న్యాయ పోరాటం చేసేందుకు కృషి చేస్తోంది. లండన్ కు చెందిన ఓ సేవా సంస్థ, యాసిడ్ సర్వైవర్స్ ఇంటర్నేషనల్ లెక్కల ప్రకారం... సంవత్సరంలో సుమారు పదిహేను వందల యాసిడ్ అటాక్స్ జరుగుతున్నట్లు లెక్కలు చెప్తున్నాయి . అందులో 80 శాతం బాధితులు మహిళలే ఉంటున్నారు. చాలామంది విషయాన్ని బహిర్గతం చేసేందుకు భయపడతున్నారు. అయతే అటువంటి క్రిమినల్స్ కు తగిన శిక్ష పడటం లేదని, వారు ఎంతో హాయిగా తిరుగుతుంటే బాధితులు నరకం చూస్తున్నారని సోనాలి చెప్తోంది. బాధితులకోసం న్యాయ పోరాటానికి తాను సిద్ధమంటోంది. -
'ముంబైలో ఆత్మహుతి దాడులు చేస్తా'
ముంబై పోలీసు ప్రధాన కార్యాలయం మీద ఆత్మాహుతి దాడులు చేస్తానంటూ సిరియా నుంచి తిరిగొచ్చిన అరీబ్ మజీద్ అనే యువకుడు ట్వీట్ చేశాడు. దాంతో ఆ ఖాతాను ట్విట్టర్ సస్పెండ్ చేసింది. కళ్యాణ్ ప్రాంతానికి చెందిన ఆ యువకుడు ఐఎస్ఐఎస్లో చేరేందుకు సిరియా వెళ్లినట్లు తెలుస్తోంది. మజీద్ స్నేహితుడు ఫహీద్ షేక్ కూడా అతడితో కలిసి గత సంవత్సరం సిరియా వెళ్లిపోయాడు. అతడు కూడా ఐఎస్ఐఎస్లో చేరేందుకే వెళ్లినట్లు సమాచారం. ఫహీద్ షేకే ఈ ట్విట్టర్ ఖాతాను నిర్వహించేవాడని అంటున్నారు. మజీద్ ఇండియాకు ఎందుకు తిరిగొచ్చాడో తెలుసుకోండి.. అంటూ ట్వీట్లు మొదలయ్యాయి. అరీబ్ మజీద్ సోదరిని భారతీయ పోలీసులు తీవ్రంగా అవమానించారని, అందుకే వాళ్లమీద ప్రతీకారం తీర్చుకోడానికి ముంబై పోలీసు ప్రధాన కార్యాలయం మీద దాడులు చేసేందుకు అతడు వస్తున్నాడని చెప్పారు. ఐఎస్ఐఎస్లో మజీద్ సివిల్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడని కూడా ఆ ట్వీట్లో అన్నారు. -
పగబట్టి.. జుట్టు కత్తిరించి..
వ్యక్తిగత కక్షల నేపథ్యంలో మహిళ కేశాలను కత్తిరించింది తన కసి తీర్చుకుంది మరో మహిళ. ఈ ఘటన చిలకలగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. సికింద్రాబాద్ బౌద్ధనగర్కు చెందిన శ్రీవల్లి (28), అనీల్కుమార్ భార్యాభర్తలు. అదే ప్రాంతానికి చెందిన పార్వతి మరో ముగ్గురు మహిళలతో కలిసి శుక్రవారం రాత్రి బైక్లపై వచ్చి శ్రీవల్లి ఇంట్లో చొరబడి ఆమెపై దాడిచేశారు. ఈ సందర్భంగా ముగ్గురు మహిళలు బాధితురాలి చేతులు పట్టుకోగా పార్వతి తనవెంట తెచ్చుకున్న కత్తెరతో శ్రీవల్లి జుత్తును కత్తిరించింది. బాధితురాలు విడిపించుకుని పక్కనే ఉన్న తన తల్లి ఇంటికి వెళ్లినా వారు ఆమె వెంటపడి దాడి చేశారు. దీనిని అడ్డుకున్న శ్రీవల్లి తల్లి బాలమణిపై కూడా దాడికి పాల్పడి వాహనాలపై అక్కడినుంచి పరారయ్యారు. వ్యక్తిగత కక్షలతోనే పార్వతి మరో ముగ్గురు మహిళలను తనపై దాడికి పాల్పడడమే కాకుండా జుత్తును కత్తిరించారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ జయశంకర్ తెలిపారు. -
పట్టపగలు వ్యక్తి దారుణ హత్య
రైల్వేకోడూరు (వైఎస్సార్జిల్లా) : పాత కక్షలతో ఒక వ్యక్తిని అతి దారుణంగా బండరాళ్లతో మోది హత్య చేశారు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు మండలం లక్ష్మిగిరిపల్లె వద్ద శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని అబ్బినాయుడుపల్లెకు చెందిన కె. శంకరయ్య(38) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా ఆయనకు కొందరు వ్యక్తులతో పాతగొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శంకరయ్య కడప నుంచి తిరుపతికి వెళ్తుండగా.. రహదారిలోని లక్ష్మిగిరిపల్లె సమీపంలో కాపు కాసిన ఇద్దరు వ్యక్తులు అతనిపై దాడి చేశారు. బండరాళ్లతో తలపై బలంగా మోదడంతో శంకరయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. హంతకులు అదే గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం, సుబ్బారాయుడులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. -
నాకే సంబంధం లేదు.. అంతా కక్షే
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని టీడీపీ నేత ప్రదీప్ అన్నారు. ఎలాంటి సంబంధం లేకున్నా నోటీసులు ఇవ్వడం చూస్తుంటే కచ్చితంగా ప్రభుత్వ కక్ష సాధింపే చర్యే అన్న అనుమానం కలుగుతుందని అన్నారు. ఈ కేసులో తమ నేతలకు కూడా సంబంధం లేదని చెప్పారు. కోర్టులపై తమకు నమ్మకం ఉందని అన్నారు. ఏసీబీ ముందు వంద శాతం హాజరవుతానని, వారికి పూర్తి స్థాయిలో సహకరిస్తానని చెప్పారు. ఈ కేసులో ఇతర నిందితులైన సండ్ర వెంకట వీరయ్య, వేం నరేందర్ రెడ్డి తెలుసా అంటే తనకు వారు తెలియదని, తాను అంత పెద్ద స్థాయి నేతను కాదని వివరణ ఇచ్చారు. తాను కేవలం పార్టీ కార్యకర్తలాంటివాడిననే చెప్పారు. ఏసీబీ సోమవారం ఉదయం 10.30గంటలకు హాజరుకావాలని ఏసీబీ ఆదేశించిందని, ఆ మేరకు హాజరయ్యి వారికి సమాధానాలు ఇచ్చిన తర్వాత మీడియాతో అన్ని విషయాలు చెప్తానని తెలిపారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ డివిజన్కు టీడీపీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఆయన నారా లోకేశ్కు కీలక సన్నిహితుడు అని కూడా తెలుస్తోంది. -
పాతకక్షలతో కర్నూలులో వ్యక్తి హత్య
కర్నూలు : పాతకక్షల కారణంగా కర్నూలులో ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన కర్నూలు నగరం వడ్డెగేరిలో బుధవారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. వడ్డెగేరికి చెందిన అస్లాం (40) అనే వ్యక్తి బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ ఫ్యాన్స్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా ఉన్నాడు. బుధవారం సాయంత్రం వడ్డెగేరిలో నడుచుకుంటూ వెళుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు అస్లాంపై వేట కొడవళ్లతో దాడి చేసి దారుణంగా హతమార్చారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హతుడు పాత నేరస్తుడని, సినీ అభిమానుల మధ్య గతంలో గొడవలున్నాయనీ, ఆ పాత కక్షల వల్లే ఈ హత్య జరిగి ఉంటుందని అనుమానిస్తున్నామనీ పోలీసులు వెల్లడించారు. కాగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
దేవుడెన్నడూ హింసను ఆమోదించడు
రోజురోజుకూ ప్రపంచవ్యాప్తంగా హింస పేట్రేగిపోతోంది. వేలాది ప్రజలు చిన్నా పెద్దా తేడా లేకుండా హింసకు బలైపోతున్నారు. తాము ఈ ‘మహత్కార్యాన్ని’ ప్రతీకారం కోసం చేస్తున్నాం అని వాదించే హింసావాదులు ఇలాంటి చర్యలను దేవుడు ఆమోదించడని గ్రహించాలి. ‘‘మీరు అల్లాహ్ పేరుతో చేసే ప్రమాణాలు మిమ్మల్ని సన్మార్గం నుండి, దైవభీతి నుండి, ప్రజలలో శాంతి స్థాపించడం నుండి ఆటంక పరిచేవిగా కానివ్వకండి. అల్లాహ్ సర్వజ్ఞుడు (అల్బఖరహ్ 2:224). ‘అల్లాహ్’ అంటే మహోన్నతుడైన దేవుడు. ఆయన సర్వ మానవాళికి సృష్టికర్త అయినప్పుడు, తోటి మానవుడు మనకు సహోదరుడవుతాడు. ఒకడు ఒకవేళ తప్పుడు మార్గంలో వెళితే వానికి సన్మార్గం గురించి బోధించాలి. వినకపోతే అంతిమ దినాన వానికి తీర్పు చెప్పబడుతుంది. అంతకుమించి వానిని శిక్షించే అధికారం మనకు లేదని ఖురాన్ చెబుతోంది. ‘‘మీరు అల్లాహ్నే ఆరాధించండి. తల్లిదండ్రులతో, దగ్గరి బంధువులతో, అనాథలతో, నిరుపేదలతో, బంధువులైన పొరుగువారితో, అపరిచితులైన పొరుగువారితో, పక్కనున్న మిత్రులతో, బాటసారులతో మరియు అందరితోనూ ఉదార స్వభావంతో వ్యవహరించండి. నిశ్చయంగా అల్లాహ్ గర్వితుణ్ణి, బడాయిలు చెప్పుకునేవాడిని ప్రేమించడు’’ (అన్ నిసా 4:36) ఖురాన్లో ‘ప్రతీకారం’ అనే పదం మచ్చుకైనా కనిపించదు. దయ, కరుణ అనే పదాలు వందల సార్లు కనిపిస్తాయి. దేవునిది నూటికి నూరు పాళ్లు శాంతి మార్గం. ఈ నిజాన్ని ప్రపంచం గ్రహించిననాడు ప్రతి హృదయంలో శాంతి స్థాపన జరుగుతుంది. అప్పుడు ఈ లోకం స్వర్గమయం అవుతుంది. - యస్. విజయభాస్కర్ -
పగబట్టిన పాము కథ
అదో అందమైన గ్రామం. ఆ గ్రామంలో ఓ యువతి, యువకుడు ప్రేమించుకుంటారు. తెలియక ఆ యువకుడు చేసిన ఓ పని వల్ల ఒక పాము అతనిపై పగబడుతుంది. మహా భక్తురాలైన అతని ప్రేయసి ఎలాగైనా ప్రియుణ్ణి కాపాడాలనుకుంటుంది. తర్వాత ఏం జరిగింది? అనే కథతో రూపొందిన తమిళ చిత్రం ‘నంజుపురం’. ఈ చిత్రాన్ని ‘నాగలాపురం’ పేరుతో కె. సృజన సమర్పణలో మురళీమోహన్ కూసుపాటి తెలుగులో విడుదల చేయనున్నారు. ‘శివరామరాజు’లో చెల్లెలి పాత్ర, ‘మా అల్లుడు వెరీ గుడ్డు’ తదితర చిత్రాల్లో కథానాయికగా నటించిన మోనిక ఈ చిత్రంలో హీరోయిన్. రాఘవ్ హీరో. ప్రేమ, పగ, ఫ్యామిలీ సెంటిమెంట్తో రూపొందిన చిత్రమని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సహనిర్మాత: మంగమ్మ, దర్శకత్వం: చార్లెస్. -
ప్రపంచ కప్... వింతలు - విశేషాలు
-
ఒక్క రివెంజ్తో ఇతడి రేంజ్ ఎక్కడికో పాకింది!
-
విభజన పార్టీలపై ప్రతీకారం తీర్చుకుంటాం: అశోక్బాబు
మేమూ రాజకీయాలు చేస్తాం: అశోక్బాబు తణుకు, న్యూస్లైన్: రాష్ట్ర విభజనకు సహకరించిన పార్టీలపై ఓటు హక్కుతో ప్రతీకారం తీర్చుకుంటామని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్బాబు అన్నారు. శ్రీరామనవమి సందర్భంగా మంగళవారం తణుకు ఎన్జీవో హోంలో జరిగిన సీతారాముల కల్యాణోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగుల డిమాండ్లను మేనిఫెస్టోలో పెట్టిన పార్టీలవైపే ఉద్యోగ సంఘాలు మొగ్గుచూపుతాయని చెప్పారు. రాజకీయ పార్టీలు ఓట్లు, సీట్లు అనే పద్ధతిలో కాకుండా, ఉద్యోగుల సంక్షేమం కోసం పాటుపడాలని.. అటువంటి పార్టీల వైపు తాము ఉంటామన్నారు. ఉద్యోగుల సమస్యలను, సంక్షేమాన్ని పట్టించుకోకపోతే తామూ రాజకీయాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. కమలనాథన్ కమిటీలో అవగాహనలేమి కారణంగా ఉద్యోగుల ఆప్షన్లపై ఎటువంటి స్పష్టతా లేకుండా పోయిందన్నారు. హైదరాబాద్లో ఉన్న లక్ష మంది పెన్షనర్లకు సక్రమంగా పెన్షన్ అందాలని, పీఆర్సీ, హెల్త్ కార్డులు, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ తదితర అంశాలకు ప్రాధాన్యతనిచ్చే పార్టీలకే ఉద్యోగ సంఘాలు మద్దతిస్తాయని స్పష్టం చేశారు. 2009 ఎన్నికల్లో 4 లక్షల మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ల ద్వారా పలుచోట్ల ఎన్నికల ఫలితాలను మార్చారని.. ఉద్యోగులను తక్కువగా అంచనా వేయొద్దని చెప్పారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ అధినేతలను కలిశామని, త్వరలో మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డిని కూడా కలుస్తామని చెప్పారు. -
పదహారేళ్ల పగ
నల్లగొండ రూరల్, న్యూస్లైన్: అండ్లపురి సోమలింగం ఇంట్లో 16 సంవత్సరాల క్రితం మొదటగా పశువులు, మేకలు మృతి చెందాయి. తల్లి రాములమ్మ అనారోగ్యానికి గురైంది. ఆస్పత్రిలో చికిత్స పొందిన తర్వాత ఆమె కోలుకుంది. తర్వాత 10 సంవత్సరాల క్రితం నిందితుడైన సోమలింగం మానసిక రోగిగా వ్యవహరించాడు. ఇతను ఎర్రగడ్డ ఆస్పత్రిలో కొంతకాలం చికిత్స పొందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇతని సోదరుడు నర్సింహ ఢిల్లీలో పోలీసు విభాగంలో పనిచేస్తున్న సమయంలో నర్సింహ తన భార్య మేఘన మధ్య చిన్న వివాదం జరిగింది. దీంతో భార్య మేఘన కిరోసిన్ పోసుకుని ఢిల్లీలోనే మృతి చెందింది. మృతదేహాన్ని రైల్లో ఇంటికి తీసుకువస్తుండగా రైల్లో నుండి అతని సోదరుడు నర్సింహ దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత గ్రామంలో ఉంటే బాగుండడం లేదని తల్లి రాములమ్మ, తమ్ముని పిల్లలతో కలిసి నల్లగొండలో నివాసం ఉంటున్నది. రెండు సంవత్సరాల క్రితం తల్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. కుటుంబంలో ఇలాంటి సంఘటనలు జరుగుతుండడంతో మానసిక క్షోభకు గురై తన పిల్లలకు, తమ్ముని పిల్లలకు ఏమైనా చేస్తారనే అనుమానంతో ఐదు సంవత్సరాల క్రితం పేరం రాములు, గాదరి భిక్షమయ్యలపై దాడి చేశాడు. దీంతో పోలీసుస్టేషన్లో అండ్లపురి సోమలింగంపై కేసు నమోదైంది. మృతులు ఇద్దరు కులపెద్దలు కావడంతో గ్రామంలో సోమలింగం నివాసం ఉండవద్దని పంచాయతీ నిర్వహించారు. దీంతో నిందితుడు నల్లగొండలో నివాసం ఉంటున్నాడు. సోదరుని పిల్లలు, తండ్రి అండ్లపురి రాములు శేషమ్మగూడెంలో నివాసం ఉంటున్నారు. శేషమ్మగూడేన్ని సందర్శించిన జనవిజ్ఞాన వేదిక నాయకులు మంత్రాలు, చేతబడి చేస్తున్నారని శేషమ్మగూడెం ఎస్టీ కాలనీలో ఇద్దరిని కొట్టి చంపడం హేయమని జనవిజ్ఞాన వేదిక ప్రతినిధి బృందం పేర్కొన్నది. మంగళవారం జేవీవీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్. వెంకటరమణారెడ్డి, సహాయ కార్యదర్శి ఎస్కె.మస్తాన్, పట్టణ కార్యదర్శి వి. పంచలింగం గ్రామాన్ని సందర్శించారు. మంత్రాలు, మాయలు ఉండవన్నారు. మానసిక లోపంతో ఉన్న సోమలింగం తన కుటుంబ సభ్యుల మృతికి పేరం రాములు, భిక్షమయ్యలు కారణమనే నెపంతో ఉన్మాదిగా మారి హత్యకు పాల్పడ్డాడని అన్నారు. ప్రభుత్వం స్పందించి ప్రజల్లో ఉన్న అపోహాలను తొలగించాలని కోరారు.