-
పాక్ నాయకత్వానికి అసలు పరీక్ష
ఎన్నికలపై రాజకీయ గందరగోళం, వివాదాలతో కూడిన వాతావరణంలో పాకిస్తాన్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రధానిగా తన రెండవ పదవీ కాలంలో, షెహబాజ్ షరీఫ్ బలహీనమైన ఆరు పార్టీల సంకీర్ణానికి నాయకత్వం వహిస్తున్నారు. ఇది పాలనాపరమైన పని నుండి ప్రభుత్వ దృష్టిని మరల్చగలదు. ఆందోళనా రాజకీయాలను ఆశ్రయించాలని ‘పీటీఐ’ భావించడం కూడా పాలక కూటమికి సవాలే. పరిపాలనలో సైనిక వ్యవస్థ అజమాయిషీ కూడా ప్రభుత్వ అధికారాన్ని పరిమితం చేసేదే. ఇక ఆర్థిక సవాలు, అత్యంత ముఖ్యమైనది. పాక్ దారుణమైన సంక్షోభంలో ఉంది. అయితే, కఠినమైన ఆర్థిక చర్యల ద్వారా భారత్ సహా పలు దేశాలు భయంకరమైన ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కాయని గుర్తుంచుకోవాలి.పూర్తి మెజారిటీ లేని నాయకుడిగా షెహ బాజ్ షరీఫ్ తన ప్రభుత్వ మనుగడ కోసం పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ)పై ఆధారపడ్డారు. ఈ పార్టీ కేబినెట్లో చేరడానికి నిరాకరిస్తూ ప్రభుత్వానికి మద్దతునిచ్చింది. దీని అర్థం ఏమిటంటే, పీపీపీ, ఇతర మిత్రపక్షాలను సంతోషంగా ఉంచడానికీ, వారి డిమాండ్లను నెరవేర్చడానికీ ప్రభుత్వం నిరంతర ప్రయత్నాలలో నిమగ్నమై ఉంటుంది. ఆందోళనా రాజకీయాలను ఆశ్రయించాలని పాకిస్తాన్ తెహ్రిక్ ఎ ఇన్సాఫ్ (పీటీఐ) భావిస్తున్నందున ఇది పాలక కూటమికి నిరంతరం సవాలును విసురుతుంది. జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్షం పెద్ద కూటమిగా ఏర్పడినందున పార్లమెంటరీ వ్యవహారా లను నిర్వహించే పనిని అది మరింత కష్టతరం చేస్తుంది. అసెంబ్లీ ప్రారంభ సెషన్లలో పీటీఐ మద్దతుగల జాతీయ అసెంబ్లీ సభ్యుల విఘాతకరమైన ప్రవర్తన, రాబోయే పరిణామాల స్వరూపాన్ని సూచి స్తోంది. ప్రత్యేకించి వారు ప్రతి సెషన్ లోనూ నిరసనలు తెలుపుతామని తేల్చి చెప్పారు. ఈ ఘర్షణ శాసన నిర్మాణానికి అడ్డంకులుగా మారు తుంది. పైగా పార్లమెంట్ కార్యకలాపాలను కూడా స్తంభింపజేస్తుంది. పరిపాలనలో సైనిక వ్యవస్థ అజమాయిషీ కూడా ప్రభుత్వ అధికా రాన్ని పరిమితం చేస్తుంది. తన మునుపటి పదవీకాలంలో, షెహబాజ్ షరీఫ్ సైనిక వ్యవస్థకు చాలా ప్రాధాన్యతనిచ్చారు. ఇప్పుడు ఏదైనా ముఖ్యమైన మార్గంలో దానిపై తిరగబడడం లేదా దాని పాత్రను తగ్గించడం అసంభవం. కాబట్టి దేశం ఎలా నడుస్తుందనే అంశంపై సైన్యం అజమాయిషీ కొనసాగుతుందని దీని అర్థం. తర్వాత క్లిష్టమైన ప్రాదేశిక ముఖచిత్రం కూడా ఉంది. రాష్ట్రాలకు సంబంధించి పిఎమ్ఎల్–ఎన్ ఒక ప్రావిన్ ్సను మాత్రమే నియంత్రి స్తోంది. మిగిలిన మూడు ప్రావిన్సులను వేర్వేరు పార్టీలు నియంత్రి స్తున్నాయి. పైగా ఖైబర్ పఖ్తున్క్వాలో పూర్తిగా వ్యతిరేకమైన ప్రభుత్వం కొనసాగుతోంది. ఇది కూడా కొత్త ప్రభుత్వానికి పరిమితులు విధిస్తుంది. కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలను నిర్వహించడం ఒక స్పష్టమైన సవాలుగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఆచరణాత్మకమైన తత్వం, దృఢంగా వ్యవహరించడం మధ్య తెలివైన కలయిక అవసరం. అయితే దేశం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ పరిమితులు ఏవీ ప్రభుత్వాన్ని నిరోధించకూడదు. ఏదేమైనా, అది ప్రభుత్వ బాధ్యత. దీని కోసం, ప్రధానమంత్రి తన మునుపటి పదవీకాలంలో నియమించిన విచిత్రమైన, సంఖ్యరీత్యా పెరిగి పోయిన క్యాబినెట్ను కాకుండా, ఒక సమర్థమైన బృందాన్ని ఎంచు కోవాలి. స్పష్టమైన, పొందికైన విధాన ఎజెండాను రూపొందించాలి. ఆర్థిక సవాలు, వాస్తవానికి అత్యంత ముఖ్యమైనది. పాకిస్తాన్ భారీ విదేశీ రుణ సేవా బాధ్యతలను దృష్టిలో ఉంచుకుని, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుండి కోరుకోవాల్సింది పొందేందుకు షరీఫ్ ప్రభుత్వం కఠినమైన, రాజకీయంగా బాధాకరమైన నిర్ణయాలను తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆర్థిక సవాలు తీవ్రమైనది అయినప్పటికీ ఈ సంక్షోభంలోనూ ప్రభుత్వం ఒక అవకాశాన్ని చూడాలి. ఎక్కువ రుణాలు తీసుకోవడం, ఉద్దీపనలు, సంస్కరణలను వాయిదా వేయడం, అధిక స్థాయి రుణాలను తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని సృష్టించకుండా ఎక్కువ రుణాలు సేకరించడం– ఇవన్నీ పాక్ రహదారిపై మరొక సంక్షోభానికి మాత్రమే హామీ ఇస్తాయి. వృద్ధి, పెట్టుబడులను ప్రోత్సహించడానికి లేదా రికార్డు స్థాయి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే విషయంలో ఏమీ చేయదు. కాబట్టి రోగాన్ని దాచిపెట్టే బ్యాండ్ ఎయిడ్ విధానం, ఏ విధంగానూ ఇప్పుడు ఆమోదయోగ్యం కాదు. ప్రత్యామ్నాయంగా ఈ సంక్షోభాన్ని విస్తృత శ్రేణి నిర్మాణాత్మక సంస్కరణలను ప్రారంభించడానికీ, ఆర్థిక వ్యవస్థను విష వలయం నుండి బయట పడేయటానికీ ఉపయోగించవచ్చు. నిలకడలేని ఆర్థిక అసమతుల్య తలు, భారీ దేశీయ, విదేశీ రుణాలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, తక్కువ పొదుపులు, పెట్టుబడి, స్తంభించిన వృద్ధి– ఇవన్నీ ఈ విషవలయంలో భాగమే. ప్రపంచంలోని పలు దేశాలు పాకిస్తాన్ ఎదుర్కొంటున్న దాని కంటే భయంకరమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. కానీ అవి సంక్షోభాన్ని బలంగా, మరింత స్థితిస్థాపకంగా తిరిగి లేచినిలబడేలా ఉపయోగించుకోగలిగాయి. 1997లో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న ఆగ్నేయాసియా దేశాలు ప్రాథమిక సంస్కరణలను చేపట్టడం ద్వారా, కఠినమైన ఆర్థిక చర్యలతో నిర్మాణాత్మక సమస్యలను పరిష్కరించడం ద్వారా గట్టెక్కాయి. అదేవిధంగా, 1990లలో భారతదేశం, 1980లు, 1990లలో అనేక లాటిన్ అమెరికన్ దేశాలు కూడా తీవ్రమైన ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొన్నాయి. అవి తర్వాత కోలుకోవడమే కాకుండా పటిష్టమైన వృద్ధి బాటలో పయనించగలిగాయి. ఆర్థిక స్థిరత్వాన్ని సాధించాయి. ప్రతి సందర్భంలోనూ, దీర్ఘకాల నిబద్ధత చూపుతూ, స్థిరమైన విధానాలను ఈ దేశాల నాయకులు అమలుపరిచారు. అతుకుల బొంత పరిష్కారాలు నిజానికి పరిష్కారాలే కావనీ, నిర్మా ణాత్మక సర్దుబాట్లు, కఠినమైన ఆర్థిక విధానం, ఇతర సంస్కరణ చర్యలు ముందుకు సాగడానికి చాలా అవసరమనీ విశ్వసించిన సమర్థ బృందాల దన్నుతో నాయకులు తగు చర్యలు ప్రారంభించారు. స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని నెలకొల్పడానికి తక్షణ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉన్నప్పటికీ, మరొక సంక్షోభం కూడా షరీఫ్ ప్రభుత్వానికి సవాలుగా నిలుస్తుంది. ఇది మానవాభివృద్ధిలో సంక్షోభం. అక్షరాస్యత, విద్య, ఆరోగ్యం, పేదరికం, సామాజిక న్యాయం, మానవ సంక్షేమానికి సంబంధించిన ఇతర అంశాలు ఇటీ వలి సంవత్సరాలలో క్షీణిస్తున్నాయి. ప్రపంచ మానవాభివృద్ధి ర్యాంకింగ్స్లో పాకిస్తాన్ గణనీయంగా పడిపోవడంతో ప్రపంచ బ్యాంక్ దీనిని ‘నిశ్శబ్ద, లోతైన మానవ మూలధన సంక్షోభం’గా పేర్కొంది. అత్యధిక సంఖ్యలో బడి మానేసిన 2 కోట్లకు పైగా పిల్లలతో ప్రపంచంలోనే పాకిస్తాన్ రెండవ స్థానంలో ఉందనే భయంకరమైన వాస్తవం, దాని విద్యా అత్యవసర పరిస్థితిని ప్రతిబింబిస్తుంది. 40 శాతం మంది నిరక్షరాస్యులతో అక్షరాస్యత స్థాయిలు నిలిచి పోయాయి. అంతకుముందటి సంవత్సరంతో పోలిస్తే 2023లో 1.25 కోట్ల మంది ప్రజలు పేదరికంలోకి నెట్టబడ్డారని అంచనా. మానవ అభివృద్ధికి సంబంధించిన పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఇది దేశ స్థిరత్వం, ఆర్థిక పురోగతి గొప్ప ప్రమాదంలో పడనుందనే వాస్తవాన్ని తెలియజేస్తోంది. పాకిస్తాన్ నిద్రలో నడుచుకుని వెళ్తూ విపత్తులో పడిపోవచ్చని సూచిస్తుంది. ఈ సవాళ్లను నిండు రాజకీయ వాతావరణంలోనే పరిష్కరించవలసి ఉంటుందనీ, ప్రభుత్వ అధికారంపై ఉన్న పరిమితులు, ప్రధాన విధాన చర్యలను అమలు చేయగల దాని సామర్థ్యంపై భారంగా పడతాయనీ అంగీకరించాలి. రాజకీయ ఉద్రిక్తతలను తగ్గించడానికీ, కీలక చర్యలపై రాజకీయ ఏకాభిప్రాయాన్ని ఏర్పరచడానికీ ప్రభుత్వం మార్గాలను అన్వేషించాలి. ఇది సులభం కాదు. ప్రభుత్వ సంకీర్ణ భాగస్వాములు కఠినమైన ఆర్థిక చర్యల నుండి తమను తాము దూరం చేసుకోవాలనుకుంటున్నారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన నాయకులను వారి పోరాట మార్గం నుండి తప్పించడం కూడా అంతే కష్టం. అందుకే, షెహబాజ్ షరీఫ్కు ఇది నాయకత్వ పరీక్ష. మలీహా లోధి వ్యాసకర్త పాకిస్తాన్ దౌత్యవేత్త; ఐరాసలో పాక్ మాజీ ప్రతినిధి (‘ద డాన్’ సౌజన్యంతో) -
Pakistan General Elections 2024: పాక్ ప్రధానిగా షహబాజ్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానమంత్రిగా పీఎంఎల్–ఎన్ నేత షెహబాజ్ షరీఫ్(72) ఎన్నికయ్యారు. నూతన ప్రధానిని ఎన్నుకోవడానికి పాకిస్తాన్ పార్లమెంట్లో ఆదివారం ఓటింగ్ నిర్వహించారు. మొత్తం 336 ఓట్లకు గాను çషహబాజ్ షరీఫ్కు 201 ఓట్లు లభించాయి. ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ అభ్యర్థి ఒమర్ అయూబ్ ఖాన్కు కేవలం 92 ఓట్లు దక్కాయి. షెహబాజ్ షరీఫ్కు సాధారణ మెజార్టీ కంటే 32 ఓట్లు అధికంగా లభించడం విశేషం. పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్(పీఎంఎల్–ఎన్), పాకిస్తాన్ పీపుల్స్ పారీ్ట(పీపీపీ) సంకీర్ణ ప్రభుత్వానికి ఆయన నాయకత్వం వహించబోతున్నారు. పీఎంఎల్–ఎన్, పీపీపీ కూటమికి ముత్తహిదా ఖ్వామీ మూవ్మెంట్, పాకిస్తాన్ ముస్లిం లీగ్(క్యూ), బలూచిస్తాన్ అవామీ పార్టీ, పాకిస్తాన్ ముస్లిం లీగ్(జెడ్), ఇస్తెఖామ్–ఇ–పాకిస్తాన్ పార్టీ, నేషనల్ పార్టీ మద్దతిస్తున్నాయి. షహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ 24వ ప్రధానమంత్రిగా ఎన్నికైనట్లు పార్లమెంట్ స్పీకర్ సర్దార్ అయాజ్ సాదిక్ ప్రకటించారు. షహబాజ్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన 2022 ఏప్రిల్ నుంచి 2023 ఆగస్టు వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఓటింగ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులైన కొందరు ఎంపీలు సభలో అలజడి సృష్టించారు. అనంతరం షహబాజ్ మాట్లాడుతూ కశ్మీర్పై మరోసారి అక్కసు వెళ్లగక్కారు. కశ్మీరీల, పాలస్తీనియన్ల స్వాతంత్య్రం కోసం ఒక్కటి కావాలని ఎంపీలకు పిలుపునిచ్చారు. వారి స్వేచ్ఛను కోరుతూ పార్లమెంట్లో తీర్మానం చేయాలన్నారు. -
పాక్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ కొత్త ప్రధాన మంత్రిగా పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) నేత షెహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు. సంకీర్ణ ప్రభుత్వం తరఫున షెహబాజ్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. పాక్ ప్రధానమంత్రిగా ఆయన ఎన్నిక కావటం ఇది రెండోసారి. షెహబాజ్ షరీఫ్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ ప్రధాన మంత్రిగా ఎన్నికైనట్లు పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్ అయాజ్ సాదిక్ ప్రకటించారు. 2022లో ఇమ్రాన్ ప్రభుత్వం పతనమైన తర్వాత షెహబాజ్ షరీఫ్.. మొదటి సారి ప్రధాని అయ్యారు. షెహబాజ్షరీఫ్ నేషనల్ అసెంబ్లీలో 201 ఓట్ల సాధించారు. మ్యాజిక్ ఫిగర్ 169 ఓట్లు. జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ మద్దతు గల ఒమర్ అయూబ్ 92 ఓట్లకే పరిమితమయ్యారు. ఇక.. ఇటీవల జరిగిన పాక్ సార్వత్రిక ఎన్నికల్లో 265 స్థానాలకుగాను పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) మద్దతున్న స్వతంత్ర అభ్యర్థులు 93, పీఎంఎల్ఎన్ 75, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) 53, ముత్తాహిదా క్వామీ మూవ్మెంట్ పాకిస్తాన్ (ఎంక్యూఎం)కి 17 సీట్లు వచ్చాయి. దీంతో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో నవాజ్ షరీఫ్కు చెందిన పీఎంఎల్-ఎన్, బిలావల్ భుట్టోకు చెందిన పీపీపీలు కూటమిగా ఏర్పాడ్డాయి. సుదీర్ఘ చర్చల అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకరించి.. ప్రధాని అభ్యర్థిగా షెహబాజ్ షరీఫ్ను ప్రకటించింది. తాజాగా ఆదివారం జాతీయ అసెంబ్లీలో జరిగిన ఎన్నికల్లో షెహబాజ్ షరీఫ్ ప్రధానమంత్రిగా గెలుపొందారు. -
‘పాక్ కొత్త ప్రభుత్వాన్ని గుర్తించొద్దు’
వాషింగ్టన్: పాకిస్థాన్లో కొత్త ప్రభుత్వం కొలువు దీరనున్న వేళ.. అగ్రరాజ్య చట్ట సభ్యులు పెద్ద షాకే ఇచ్చారు. ఆ ప్రభుత్వాన్ని గుర్తించొద్దంటూ అధ్యక్షుడు జో బైడెన్కు డెమొక్రటిక్ సభ్యులు లేఖ రాశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని.. అమెరికా ఆ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తోందని లేఖలో పేర్కొన్నారు వాళ్లంతా. ఫిబ్రవరి 8 నాటి పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందనడానికి బలమైన ఆధారాలు ఉన్నాయి. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిగేవరకు కొత్త ప్రభుత్వాన్ని గుర్తించొద్దని లేఖలో బైడెన్ చట్టసభ్యులు కోరారు. ‘‘పోలింగ్కు ముందు, తరువాత రిగ్గింగ్ జరిగిందనే దానికి బలమైన సాక్ష్యాలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై సమగ్రమైన, పారదర్శకమైన, విశ్వసనీయమైన దర్యాప్తు జరిగేవరకు వేచి చూడండి. అంతవరకు ఆ ప్రభుత్వాన్ని గుర్తించొద్దు. లేనిపక్షంలో ఆ దేశాధికారుల ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణిని సమర్థించినట్లవుతుంది. అది అక్కడి ప్రజల ప్రజాస్వామ్య స్ఫూర్తిని తక్కువ చేసినట్లే’’ అని లేఖలో ప్రస్తావించారు వాళ్లు. బైడెన్తో పాటు విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ను ఉద్దేశించి సంయుక్త లేఖ రాశారు వాళ్లు. ‘‘ఎన్నికలకు ముందు మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ నేత ఇమ్రాన్ఖాన్కు జైలు శిక్షలు విధించారు. ఆ పార్టీ అభ్యర్థులకు స్వతంత్రులుగా పోటీ చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. పీటీఐ శ్రేణులు.. పోలీసు దాడులు, అరెస్టులు, వేధింపులు ఎదుర్కొన్నారు. ఎన్నికల తుది ఫలితాల విడుదలలో జాప్యం అనుమానాలకు కారణమైంది. ఫలితాలు తారుమారైనట్లు ఆరోపణలు ఉన్నాయి’’ అని 33 మంది చట్టసభ్యులు తెలిపారు. ఇందులో ప్రోగ్రెసివ్ కాకస్ ఛైర్పర్సన్, భారత సంతతికి చెందిన ప్రమీలా జయపాల్ కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే.. సార్వత్రిక ఎన్నికల్లో భారీఎత్తున రిగ్గింగ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ మద్దతుదారులు గురువారం పార్లమెంటులోనూ ఈ అంశాన్ని లేవనెత్తారు. అదే సమయంలో.. మెజారిటీ రాకపోయినా కూటమి రూపేణా ప్రభుత్వ ఏర్పాటునకు నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్-ఎన్ సిద్ధమైంది. షరీఫ్ సోదరుడు.. మాజీ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆదివారం పాక్ నూతన ప్రధానిగా ప్రమాణం చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ పరిణామాల మధ్య అగ్రరాజ్య చట్టసభ్యుల లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. -
పాక్ రాజకీయాల్లో అదిరిపోయే ట్విస్ట్
ఇస్లామాబాద్: తీవ్ర గందరగోళం.. రిగ్గింగ్ ఆరోపణల నడుమ ఎన్నికలు పూర్తి చేసుకున్న పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీకి కాబోయే ప్రధాని ఎవరనే ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే అస్పష్టతతో కూడిన ఫలితాలతో.. అనిశ్చితి నెలకొన్న పాకిస్థాన్లో రాజకీయం ఇప్పుడు ఆసక్తికరమైన మలుపు తిరిగింది. ఇప్పటికే నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్-ఎన్ ప్రభుత్వ ఏర్పాటునకు తీవ్రంగా యత్నిస్తుండగా.. ప్రతిపక్ష పాత్రకైనా రెడీ అని ప్రకటించిన ఇమ్రాన్ ఖాన్ మద్ధతుదారులు ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటు యత్నాల్లోకి దిగడం విశేషం. మెజారిటీ రాకున్నా.. మిత్రపక్షం పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(PPP)తో.. మరికొన్ని చిన్నచిన్న పార్టీలతో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చింది ముస్లిం లీగ్ నవాజ్(PML-N) యత్నిస్తోంది. తన సోదరుడిని షెహబాజ్ను ఎలాగైనా మరోసారి ప్రధానిని చేయాలని నవాజ్ షరీఫ్ తీవ్రంగా యత్నిస్తున్నారు. ఈలోపు ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు భలే ట్విస్ట్ ఇచ్చారు. ప్రస్తుతం జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్కు మద్ధతుగా ఆయన మద్ధతుదారులు.. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి మెజారిటీ స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఇండిపెండెంట్లు కావడంతో వాళ్లకు ప్రభుత్వ ఏర్పాటునకు వీలు లేకుండా పోయింది. దీంతో.. ప్రతిపక్ష పాత్రకే వీళ్లంతా పరిమితం కావొచ్చనే చర్చ నడిచింది. ఈ లోపు.. పీటీఐ వర్గం ఓ ఆసక్తికరమైన ప్రకటన చేసింది. పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లున్నాయి. వీటిలో 266 స్థానాలకు ఎన్నికలు జరిగాల్సి ఉంది. ఓ సీటులో అభ్యర్థి చనిపోవడంతో ఈసారి 265 సీట్లకే ఎన్నికలు జరిగాయి. మిగతా 70 స్థానాల్లో 10 మైనారిటీలకు, 60 మహిళలకు రిజర్వ్ చేస్తారు. వీటిని ఆయా పార్టీలకు అవి గెలిచిన స్థానాలను బట్టి దామాషా ప్రకారం కేటాయిస్తారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కనీసం 135 సీట్లలో గెలుపొందాల్సి ఉంది. అయితే.. ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీని పాక్ ఎన్నికల సంఘం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించింది. దీంతోనే వాళ్లు ఇండిపెండెంట్లుగా పోటీ చేసి నెగ్గారు. అక్కడి నిబంధనల ప్రకారం.. పాక్ ఎన్నికల్లో నెగ్గిన ఒక పార్టీకి గెలిచిన సీట్ల సంఖ్యకు అనుగుణంగా రిజర్వ్డ్ సీట్ల కేటాయింపు ఉంటుంది. అయితే ఖాన్ మద్ధతుదారులంతా స్వతంత్ర అభ్యర్థులుగా గెలవడంతో.. ఆ వర్గానికి రిజర్వ్డ్ సీట్లు దక్కవు. అందుకే ఒక పార్టీగా వాళ్లు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. పాక్లో ఇస్లామిక్ పొలిటికల్ పార్టీస్ గ్రూప్గా పేరున్న ‘‘ఇస్లామిక్ పొలిటికల్ అండ్ రెలిజియస్ పార్టీస్ గ్రూప్’’లోని ఓ చిన్న పార్టీ అయిన సున్నీ ఇత్తేహద్ కౌన్సిల్(SIC). ఈ పార్టీలో చేరేందుకు ఖాన్ మద్దతుదారులంతా సిద్దం అయ్యారు. ఎస్ఐసీ తరఫున ఆ పార్టీ చైర్మన్ సయ్యద్ మహ్ఫూజ్ ఒక్కరే మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించడం గమనార్హం. ఈ కూటమిలో చేరడం ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నది పీటీఐ ప్లాన్గా స్పష్టం అవుతోంది. ‘‘ఈ కూటమికి గనుక అనుమతి లభిస్తే.. పాకిస్థాన్లోని వివిధ ప్రావిన్స్లోనే కాదు కేంద్రంలోనూ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థితికి పీటీఐ చేరుకుంటుంది’’ అని పీటీఐ తరఫున ప్రధాని అభ్యర్థి అయూబ్ ఖాన్ చెబుతున్నారు. ‘‘మా సభ్యులంతా సున్నీ ఇత్తేహద్కౌన్సిల్లో చేరాలని నిర్ణయించుకున్నాం. ఈ మేరకు చర్చలు సఫలం అయ్యాయి. మళ్లీ ఇమ్రాన్ఖాన్ ప్రధాని అయ్యేందుకు అవకాశమూ లేకపోలేదు’’ అని పీటీఐ చైర్మన్(ఆపద్ధర్మ) గోహర్ అలీఖాన్ మీడియాకు తెలిపారు. ఈ వారంలోనే ఎస్ఐసీలో చేరేందుకు దరఖాస్తులను పాకిస్థాన్ ఎన్నికల సంఘానికి పంపనున్నట్లు తెలిపారాయన. ఒకవేళ.. ఈ కూటమికి గనుక పాక్ ఈసీ అంగీకరిస్తే మాత్రం.. పాక్ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!
రైతు వేదికలు నిరుపయోగం
ప్రజాపాలనతోనే పేదల సంక్షేమం
భువనగిరి ఖిల్లా కిరణ్దే..
రఘునందన్ను గెలిపిద్దాం
పదేళ్లలో బీజేపీ చేసింది శూన్యం
నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే చర్యలు
రైతు సమస్యలు పరిష్కరించండి
రాష్ట్రంలో మెజారిటీ స్థానాలు
ఆర్ఎంపీ వైద్యుడికి మంత్రి బాసట
తప్పక చదవండి
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement