smart
-
కృత్రిమ మేధాజాలం వంటింట్లో మయాజాలం
‘రేపటికి పాల ప్యాకెట్ వేయించుకోవాలి రాత్రికి ఇడ్లీ పిండి నానబెట్టుకోవాలి రెండు రోజుల్లో జామకాయలు పాడైపోతాయి నాలుగు రోజుల్లో బియ్యం అయిపోతాయి’ఇవన్నీ మన అమ్మో, అమ్మమ్మో గుర్తుచేసే మాటలు కావు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) కిచెన్ అలర్ట్స్. ఇవే కాదు, ఏం తినాలి? ఏం తింటే మంచిది?తింటున్న ఆహారం ఎంతవరకు ఆరోగ్యకరం? ఇంట్లో ఏమేం కూరగాయలు మిగిలి ఉన్నాయి?వాటితో రేపు ఏం కూర చేసుకోవచ్చు? ఇలా ఎన్నో సలహా సూచనలు వినొచ్చు. మనం ఆఫీస్కి వెళ్లినా, ఔటింగ్కి వెళ్లినా, ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నా, వినోదాల్లో మునిగి తేలుతున్నా వంటింటిని భద్రంగా చూసుకునే బాధ్యత ఇకపై ఏఐదేనట!∙సంహిత నిమ్మనప్రతి ఇంటికి వంట తప్పనిసరి పని. కట్టెల పొయ్యిలు, బొగ్గుల కుంపట్ల నుంచి గ్యాస్స్టవ్ల వరకు సాగిన వంటింటి ప్రస్థానం ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంటోంది. వంటిళ్లు ‘స్మార్ట్’గా మారుతున్నాయి. ఎలక్ట్రిక్ స్టవ్లు, ఇండక్షన్ స్టవ్లకు కూడా తొందర్లోనే కాలం చెల్లిపోయే రోజులు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో (ఏఐ) పనిచేసే స్మార్ట్ పరికరాలు వంటిళ్లలోకి చేరుతున్నాయి. వీటిలో స్మార్ట్ స్టవ్లు, ఓవెన్లు, రిఫ్రిజిరేటర్లు సహా నానా రకాలు ఉంటున్నాయి. వంటింటి పనిని ఇవి మరింత సునాయాసం చేయనున్నాయి.రోజూ ఉదయాన్నే కిచెన్లోకి వెళ్లేసరికి, ‘హాలో మేడమ్/సర్! మీ వంటశాలకు స్వాగతం. ఈరోజు మీకు ఏం టిఫిన్ కావాలి? భోజనంలో ఏం స్పెషల్ కావాలి? డిన్నర్ ఏం ప్లాన్ చేయమంటారు?’ అంటూ అడిగి తెలుసుకుని మరీ వండిచ్చే సౌలభ్యం ఉంటే ఎంత బాగుంటుందో కదా? ఈ ఊహ అదిరింది కదా? కానీ ఫ్యూచర్లో దీన్నే నిజం చేయబోతుంది ఏఐ. అందుకు ఇప్పటికే రొబోటిక్ కిచెన్ మెషిన్స్ సాయంతో తొలి అడుగులు ప్రారంభమయ్యాయి.అంచెలంచెలుగా మనిషి సాధించిన ఆధునిక సాంకేతికతకు ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తోడైంది. ఏఐతో ప్రపంచ ఊహాచిత్రమే పూర్తిగా మారబోతుంది. ఈ కృత్రిమ మే«ధ, మానవ మేధను తలదన్నే స్థాయికి ఎదుగుతోంది. ఇప్పటికే వైద్యరంగం నుంచి వాణిజ్యరంగం వరకూ ప్రతి రంగమూ ఏఐ అధీనంలోకి వచ్చేసింది. ఇక భవిష్యత్తులో ఏఐనే మీ వంటింటి మహారాణి కాబోతుందంటే నమ్ముతారా? నమ్మితీరాలి!అహో, అద్భుతం! అనుకున్న 3జీ, 5జీల కాలాన్ని మించిందే ఈ ఏఐ కాలం. ఏ విషయంలోనైనా తొందరపడి, ఆత్రం కనబరిస్తే, ‘తినకముందే రుచి దేనికి?’ అంటుంటారు పెద్దలు. కానీ తినబోయే ముందే రుచి చూపిస్తాననడం ఏఐ స్పెషాలిటీ. మనిషి ఊహలకు రూపాన్నిస్తూ, నిమిషాల్లోనే కళ్లప్పగించేలా మాయాజాలం చేయగలదు ఏఐ. త్వరలో ఏఐ రోబోలు ఇంటి మనుషులుగా మారి వండి వారుస్తాయి. షెఫ్గా, సర్వెంట్గా ఇలా రకరకాల పాత్రల్లో సేవలను అందిస్తాయి. ఆ సేవలు ఎలా ఉండబోతున్నాయి? కిచెన్ను ఏ దిశగా ఏఐ తీసుకెళ్తుంది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.సాధారణంగా వంటగదిలో కావాల్సిన ముఖ్యమైన యంత్రాలు నాలుగే నాలుగు రకాలు. ఒకటి: వండి వార్చేవి. రెండు: వంటకు కావాల్సిన పొడులను, గుజ్జులను సిద్ధం చేసేవి. మూడు: వండిన వాటిని నిల్వ చేసేవి. నాలుగు: వండిన పాత్రలను శుభ్రం చేసేవి. అయితే వండివార్చే వాటిలో ఓవెన్స్, కుకర్స్, స్టవ్స్, గ్రిల్స్, బ్రెడ్ అండ్ పిజ్జా మేకర్స్, కాఫీ అండ్ టీ మేకర్స్ ఇవన్నీ ప్రత్యేకంగా నిలుస్తాయి. అలాగే వంటకు కావాల్సిన పదార్థాలను తయారు చేసేవాటిలో మిక్సీలు, చాపర్స్, గ్రైండర్స్, బ్లెండర్స్, జ్యూసర్స్ ఇవన్నీ లెక్కకొస్తాయి. ఇక వండిన వాటిని, వండని వాటినీ నిల్వ చేసేందుకు రిఫ్రిజిరేటర్, వంటపాత్రలను శుభ్రం చేయడానికి డిష్వాషర్ ఇవన్నీ లగ్జరీ కిచెన్కి అవసరమయ్యే యంత్రాలే! ఈ యంత్రాలన్నిటినీ ఏఐకి అనుసంధానం చేయగలిగితే, వంటింటిని రోబోటిక్ కిచెన్లా మార్చేయవచ్చు. అందుకు శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు సాధించిన విజయాలకు ఈ ఏఐ గాడ్జెట్స్ మచ్చుతునకలు. రానున్న రోజుల్లో ప్రపంచమంతా ప్రతి రంగాన్నీ ఏఐతో కలిపి చూడటం అనివార్యం కానుంది. ఈ క్రమంలోనే చాలా కంపెనీలు తమ యూజర్స్కి ఏఐ సేవలను మిళితం చేసి, అడ్వాన్స్డ్ ప్రొడక్ట్స్ను అందించడానికి ముందుకొస్తున్నాయి. అందులో భాగంగానే ‘థింక్యూ కేర్’ అనే యాప్తో ఎల్జీ స్మార్ట్ వర్షన్స్కి ఏఐను అనుసంధానం చేస్తోంది ఎల్జీ కంపెనీ. ఇక స్మార్ట్ ఎల్జీ గాడ్జెట్స్ వేటిని కొన్నా యాప్ సాయంతో ఏఐ సేవలను పొందవచ్చు. గాడ్జెట్ సేవల్లో అంతరాయాలను అంచనా వేయడానికి, నిర్వహణను మెరుగుపరచడానికి ఏఐ సహకరిస్తుంది. సాంకేతికతతో కూడిన అధునాతన జీవనశైలిని అలవాటు చేస్తుంది. వంటగదిని ఏఐ సాంకేతికతతో అమర్చుకుంటే, మొత్తం ఇల్లే ‘స్మార్ట్ హోమ్’లా మారిపోతుంది. హైటెక్ కిచెన్ గాడ్జెట్స్తో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమను ఏఐ మరింత బలోపేతం చేస్తుంది. ఇలానే చాలా కంపెనీలు తమ సొంత యాప్స్ను పరిచయం చేస్తూ, లేటెస్ట్ టెక్నాలజీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను జోడిస్తున్నాయి.పాకశాస్త్రంలో ఏఐ ప్రవేశం కొత్త సవాళ్లకు నాంది అంటున్నారు కొందరు నిపుణులు. భవిష్యత్తులో వంటశాలలన్నీ ఏఐ వశమైతే.. డేటా గోప్యతకు భంగం వాటిల్లడం, ఉద్యోగ భద్రతకు భరోసా లేకపోవడం, వంటల తయారీలో మానవ ప్రాధాన్యం తగ్గడం, మనుషుల మధ్య ఆర్థిక, సామాజిక అంతరాలు పెరగడం వంటి ఎన్నో సమస్యలు తలెత్తవచ్చని సామాజికవేత్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఆ సవాళ్లను ఏఐ అధిగమిస్తుందని కూడా చాలామంది ధీమా వ్యక్తం చేస్తున్నారు.సిగ్నేచర్ కిచెన్ సూట్స్ ట్రాన్సిషనల్ సిరీస్ ఓవెన్ ఈ ఓవెన్ లో కెమెరాలు అమర్చి ఉంటాయి. ఇది ఏఐ సాంకేతికతను ఏకం చేస్తూ, పని చేస్తుంది. వంట ప్రక్రియలను క్రమబద్ధీకరించడానికి అబ్జర్వేషనల్ అసిస్టెంట్గా పని చేయడంతో పాటు స్వయంగా వివిధ పదార్థాలను గుర్తిస్తుంది. వంటకాలను సూచిస్తుంది. ఇంట్లో వంట చేసేవారు వంటగదిలో కొత్త వంటకాలు, పదార్థాలు, పద్ధతులను ప్రయత్నించడానికి ఈ ఓవెన్ నుంచి అవసరమైన సహకారం లభిస్తుంది. ఇది రోజువారీ వంట ప్రక్రియలను మెరుగుపరుస్తుంది. అలాగే జూన్ ఇంటెలిజెంట్ ఓవెన్ అనే మరో ఏఐ కిచెన్ గాడ్జెట్కి కూడా మార్కెట్లో మంచి డిమాండ్ నడుస్తోంది. దానిలో 85 రకాల వంటకాలను గుర్తించే అంతర్నిర్మిత వ్యవస్థ ఉంది. ఉష్ణోగ్రత, సమయాన్ని సర్దుబాటు చేసుకోవడంతో దానిలో వంట చేసుకోవచ్చు. అలెక్సా, గూగుల్ అసిస్టెంట్తో అనుసంధానం చేసుకోవచ్చు.కుకింగ్ రోబోవంటను వేగవంతం చేయడం, రకరకాల రెసిపీలతో వండిపెట్టడమే లక్ష్యంగా చేసుకుని రూపొందిన ‘కోడీ 29’ కుకింగ్ రోబో ఆప్షన్ ్సని బట్టి 1500 వంటకాలను అందిస్తుంది. ఇది 21 రకాల మోడ్స్తో పని చేస్తుంది. అంతర్నిర్మితంగా ఉన్న డిస్ప్లేతో కృత్రిమ మేధస్సు సాయంతో ఇది చక్కగా యూజ్ అవుతుంది. ఫంక్షన్ ్స, పార్టీస్ ఉన్నప్పుడు ఈ రోబో భలే చక్కగా సహకరిస్తుంది. మల్టీఫంక్షనల్, స్మార్ట్ ఆప్షన్ ్సతో ఇది ఉపయోగపడుతుంది. హ్యాండ్స్–ఫ్రీ యూజర్లా ఆకట్టుకుంటుంది. వాయిస్ కమాండింగ్స్తో యూజర్ ఫ్రెండ్లీగా పనిచేస్తుంది.హెస్టన్ క్యూ స్మార్ట్ కుకింగ్ సిస్టమ్ఇది ఏఐతో అనుసంధానమైన పవర్డ్ పాన్. లేదా ఇండక్షన్ బర్నర్. ఇది ‘స్మార్ట్’ సాంకేతికతతో వంట ప్రక్రియను మెరుగుపరుస్తుంది. వంట ఎలా చేసుకోవాలో, ఏ పదార్థం ఎప్పుడు వేయాలో చెబుతూ, మనతోనే మరింత మహత్తరంగా వంట చేయిస్తుంది. వంట రానివారికి ఇది బెస్ట్ గైడ్గా నిలుస్తుంది. టెంపరేచర్, టైమ్ అడ్జస్ట్మెంట్లతో ఇది చక్కగా శ్రమ తెలియనీయకుండా పనిచేస్తుంది. వంటకాల కోసం ఇంటరాక్టివ్ వీడియోలను కూడా అందిస్తుంది. కొత్త పద్ధతులను నేర్చుకోవాలనుకునే వారికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది.ఫ్యామిలీ హబ్ రిఫ్రిజిరేటర్ఇది స్మార్ట్ హోమ్ ఇంటిగ్రేషన్ కోసం ఏఐ ఫీచర్లతో కూడిన స్మార్ట్ సామ్సంగ్ రిఫ్రిజిరేటర్. దీనిలో కెమెరాలు ఉంటాయి. అవి ఫుడ్ ఇన్వెంటరీని ట్రాక్ చేసి ఏవి ఎన్ని ఉన్నాయి? ఏవి నిల్వ ఉంటాయో, ఏవి ఉండవో కనిపెడుతుంటాయి. అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ వంటి స్మార్ట్ హోమ్ ఎకోసిస్టమ్లతో కనెక్ట్ అయ్యి ఉంటుంది. దాంతో ఈ రిఫ్రిజిరేటర్ కారణంగా చాలా ప్రయోజనాలుంటాయి. ఇది ఇంటి కిరాణా అవసరాలపై ఓ అవగాహన కల్పిస్తుంది.న్యూట్రిబుల్లెట్ బ్యాలెన్ ్స స్మార్ట్ బ్లెండర్ఈ డివైస్తో ఆరోగ్యకరమైన స్మూతీస్ను సులభంగా చేసుకోవచ్చు. వినియోగదారులకు సులభంగా సహాయపడటానికి ఏఐ పవర్డ్ న్యూట్రిషనల్ ట్రాకింగ్తో కూడిన బ్లెండర్ ఇది. దీనికి అంతర్నిర్మిత బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. ఇందులో జ్యూస్ ఐటమ్స్ లేదా చట్నీలకు కావాల్సిన ఆహార పదార్థాలను జోడించేటప్పుడు, వాటికి సంబంధించిన పోషకాహారాల వివరాలను తెలియజేస్తుంది. ఫిట్నెస్ లక్ష్యంగా ఆహార ప్రాధాన్యాన్ని చెబుతుంది. తమ ఆరోగ్యానికి తగిన కేలరీలను తీసుకునే వారికి ఈ బ్లెండర్ చక్కగా ఉపయోగపడుతుంది.సీర్ పర్ఫెక్టా గ్రిల్ బార్బెక్యూ ప్రపంచంలోని మొట్టమొదటి కృత్రిమ మేధస్సుతో పనిచేసే గ్రిల్ ఇది. ఆటోమేటెడ్ పద్ధతిలో చాలా రకాల రెసిపీలను సిద్ధం చేయగలదు. వంట ప్రక్రియను ఆటోమేట్ చేయడానికి ఆన్ బోర్డ్ సెన్సర్లను, ప్రత్యేక సాంకేతికతను వినియోగిస్తుంది. ఆహారాలను మారినేట్ చేసి సిస్టమ్కి అందిస్తే సరిపోతుంది. గ్రిల్ రెండు వైపుల నుంచి అధిక ఉష్ణోగ్రతలను అందిస్తూ ఇన్ ఫ్రారెడ్ కుకింగ్ టెక్నాలజీతో ఇది పని చేస్తుంది. స్వయంచాలక పద్ధతిలో ఆహారాన్ని వండడానికి అధునాతన సాంకేతికతను ఉపయోగించే ఈ గ్రిల్ ఏఐ ఆదేశాలతో చక్కగా పని చేస్తుంది.స్టెయిన్లెస్ స్టీల్ ఏఐ స్లో జ్యూసర్హురోమ్ ప్లాస్టిక్, స్టెయిన్ లెస్ స్టీల్తో రూపొందిన ఈ ఏఐ స్లో జ్యూసర్.. చాలా అప్డేటెడ్ వర్షన్ లో పని చేస్తుంది. 200 వాట్ల శక్తిమంతమైన ఏఐ మోటార్తో సుదీర్ఘమైన వారంటీతో ఆకట్టుకుంటున్న ఈ గాడ్జెట్.. పల్ప్ కంట్రోల్ ఆప్షన్స్తో వినూత్నంగా ఉపయోగపడుతుంది. స్క్వీజింగ్ స్క్రూ 60 రిజల్యూషన్ తో, స్పిన్నింగ్ బ్రష్ నిమిషానికి 23 సార్లు తిరుగుతూ జ్యూస్ను అందిస్తుంది. కాస్త వంపు కలిగిన దీని ట్యాప్ నుంచి జ్యూస్ను గ్లాసులోకి లేదా పాత్రలోకి తీసుకోవచ్చు. రకరకాల ఫ్లేవర్స్లో డిప్స్, చట్నీస్, స్మూతీస్, మిల్క్షేక్స్తో పాటు డ్రై మసాలాలు కూడా తయారు చేసుకోవచ్చు. ఈ డివైస్లో జ్యూసర్ యూనిట్తో పాటు రెండు రకాల ఫిల్టర్స్, జ్యూస్ కంటైనర్, పల్ప్ కంటైనర్, క్లీనింగ్ బ్రష్లు, రెసిపీ బుక్ ఇలా చాలానే లభిస్తాయి.ఫుడ్ స్కానర్ఈ గాడ్జెట్, ఆహారాన్ని స్కాన్ చేసి ఏది తినడానికి పనికొచ్చేది, ఏది పనికిరానిది, ఏది పాడైపోయినది? ఏది ఇంకా నిల్వ ఉండే పరిస్థితుల్లోనే ఉంది? లాంటి ఎన్నో వివరాలను అందిస్తుంది. ఈ నువిలాబ్ ఏఐ ఫుడ్ స్కానర్ 3.0 వర్షన్ ఆహార వ్యర్థాలను అరికట్టేందుకు ఎప్పటికప్పుడు తగిన సూచనలను జారీ చేస్తుంది. ఈ స్కానర్ వినియోగించే యూజర్స్కి పోషకాహారానికి సంబంధించిన సలహాలను అందిస్తుంది. న్యూట్రిషనల్ హెల్త్కేర్కి ఏ ఆహారం సరైనదో తెలియజేస్తుంది.త్వరలోనే ఏఐ రోబో షెఫ్!మనిషి శ్రమను ప్రతి స్థాయిలోనూ తగ్గించడానికి రోబోల తయారీలో ఇప్పటికే ఎన్నో ప్రయోగాలు జరిగాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. పాఠాలు చెప్పే టీచర్ల దగ్గర నుంచి యుద్ధం చేసే సైనికుల వరకు ప్రతి రంగంలోనూ మనిషి కష్టానికి రీప్లేస్మెంట్ కావాలంటే, అది రోబోతోనే సాధ్యమన్నట్లుగా దూసుకునిపోతోంది టెక్నాలజీ. నిజానికి ఒక బరువైన వస్తువును ఒక చోట నుంచి మరోచోటకి తరలించడం ఒక పని. ఆమ్లెట్ లేక దోసెను పెనంపై వేసి, కాల్చడమూ ఒక పనే! పాలలో కాఫీ పొడి వేసి, కలిపి కాఫీ పెట్టడమూ ఒక పనే! అయితే మనిషి సామాన్యంగా చేయగలిగే ఈ పనులన్నింటినీ ఒక మరబొమ్మ నేర్చుకోవడమంటే మాటలు కాదు. అందుకోసమే శాస్త్రవేత్తలు.. మనిషికి, మెషిన్కి అనుసంధానంగా ఏఐని ఎంచుకున్నారు. సాధారణ పనులను ఏవిధంగా చెయ్యాలో ఇప్పుడు రోబోలు ఏఐ సాయంతో సులభంగా నేర్చుకోగలుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రోబోలకు శిక్షణ ఇవ్వడానికి ఇప్పటికే ఓపెన్ స్టోర్ సిస్టమ్ని రూపొందించారు. మనిషి చేయగల సాధారణ పనులను ఓ డేటాలా మార్చి, దాన్ని వీడియోల రూపంలో, ఆడియోల రూపంలో రోబోలకు తెలియజేస్తూ వస్తున్నారు. దాంతో రోబోలకు దాదాపు ఇంటి పనులపై కనీస అవగాహన ఉందని, వీటికి చాలా అంశాల్లో శిక్షణ ఇస్తున్నామని, ఆ శిక్షణతో ఏమాత్రం పరిచయంలేని వంటింట్లో కూడా రోబోలు అలవోకగా పనిచేసే స్థాయికి రూపాంతరం చెందుతున్నాయని అంటున్నారు. ఇక భవిష్యత్తులో ఏఐ రోబో వంటింటికి వస్తే, మనం వంటగదిలోకి అడుగుపెట్టాల్సిన పనే ఉండదు. హోటల్స్లో ఆర్డర్ ఇచ్చినట్లు మెనూ చూసుకుని, ఆర్డర్ ఇచ్చుకోవడమే! ఏఐనా మజాకా! -
చిన్న పారిశ్రామిక టౌన్షిప్లు
న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సరళీకరించడం, స్మార్ట్ పారిశ్రామిక టౌన్షిప్లు, టైర్–2, 3 పట్టణాల్లో రంగాల వారీ ప్రత్యేకమైన పారిశ్రామిక పార్క్ల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించిందని పరిశ్రమల ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి అమర్దీప్ సింగ్ భాటియా తెలిపారు. దేశ పారిశ్రామికీకరణకు ఈ చర్యలు ఊతమిస్తాయన్నారు.ఫిక్కీ వార్షిక సమావేశంలో భాగంగా మాట్లాడారు. పలు శాఖల మద్దతుతో పారిశ్రామికాభివృద్ధికి అనుకూల ఎకోసిస్టమ్ను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. జాతీయ పారిశ్రామిక నవడా కార్యక్రమం, ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ), వ్యాపార సులభతర నిర్వహణ సంస్కరణలు పారిశ్రామికాభివృద్ధికి వీలు కల్పించినట్టు భాటియా తెలిపారు. విద్యుదీకరణ పారిశ్రామికీకరణను వేగవంతం చేసిందని భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శి కరమ్ రిజ్వి ఇదే కార్యక్రమంలో భాగంగా అన్నారు.తయారీలో పోటీతత్వం, దేశీయ వాటాను పెంచేందుకు తీసుకుంటున్న చర్యలను ప్రస్తావించారు. ప్రైవేటు పెట్టుబడులు అన్నవి దేశీయ డిమాండ్కు అనుగుణంగా ఉండాలని ఫిక్కీ వైస్ ప్రెసిడెంట్, ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ అనంత్ గోయెంకా అన్నారు. రంగాల వారీ పారిశ్రామిక పార్క్లు ఎంతో మార్పును తీసుకురాగలవన్నారు. కాకపోతే స్థానికంగా, విదేశాల్లోని ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్లు) నుంచి పాఠాలను పరిగణనలోకి తీసుకోవాలని, తయారీ రంగంలో పోటీతత్వాన్ని పెంచాలని సూచించారు. -
వర్షాకాలంలో కిచెన్ క్లీన్గా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
వర్షాకాలం అనంగానే సీజనల్ వ్యాధులు పగబట్టినట్లుగా మనుషులపై దాడి చేస్తాయి. అందుకు ప్రధాన కారణం బ్యాక్టీరియా, వైరస్లే. వాతావరణంలోని తేమ కారణంగా సులభంగా బ్యాక్టీరియా, ఫంగస్ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కిచెన్లోని వస్తువులు పాడవ్వడం లేదా బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో కిచెన్ని ఎంత పరిశుభ్రంగా ఉంచితే అంత ఆరోగ్యం ఉంటాం. నిత్యం మన ఉపయోగించే కిచెన్లోని వస్తువులు పాడవ్వకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. అందుకోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సినవి సవివరంగా తెలుసుకుందామా..!వర్షాకాలంలో కిచెన్ని సురక్షితంగా ఉంచేలా పాటించాల్సినవి ఇవే..కిచెన్ చిమ్నీ, ఎగ్జాస్ట్ ఫ్యాన్: వంటగదిలో సూర్యరశ్మి వచ్చేలా, తేమ చేరకుండా ఉండేలా చూసుకోమని చెబుతుంటారు పెద్దలు. కానీ వర్షాకాలంలో అలా అస్సలు కుదరదు. ఎండ అనేది పెద్దగా ఉండదు, పైగా వాతావరణంలోని తేమ కారణంగా కిచెన్ను పొడిగా ఉంచడం కాస్త ఇబ్బందే. అలాంటప్పుడూ కిచెన్కి ఉండే ఎగ్జాస్ట్ ఫ్యాన్లను శుభ్రపరిచి ఆన్ చేసి ఉంచాలి. అలాగే వంటగది చిమ్నీ కూడా డెస్ట్ లేకుండా ఉంచుకుంటే తేమ చేరకుండా కాపాడుకోగలుగుతాం. కిచెన్ కూడా పొడిగా ఉంటుంది.అలాగే వంటగదిలో సరుకులు పాడవ్వకూడదంటే గాలి చొరబడిన క్లోజ్డ్ కంటైనర్లలో భద్రపరుచుకోండి. సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసులను తేమ, బ్యాక్టీరియా చేరకుండా ఉండేలా గాలి చొరబడిని గాజు పాత్రలో ఉంచాలి. ఇక వంటగదిలో పంచదార, కొన్ని రకాలు పొడులు అవి పాడ్వకుండా ఉండేందుకు వంటల్లో ఉపయోగించే మసాలా దినుసులతో సమస్యను నివారించండి. దాల్చిన చెక్క, లవంగాలు వంటి వాటిని నిల్వ ఉంచే పొడులకు చేర్చితే పాడవ్వకుండా ఉంటాయి. సింక్ పైపులను శుభ్రంగా ఉంచండి: వంటగదిలోని సింక్పైపులు చక్కగా ఉండేలా చూడండి. ఎలాంటి లీక్లు లేవనేది నిర్థారించుకోండి. దీనివల్ల దోమలు, ఈగలు రాకుండా కాపాడుకోగలుగతాం. ఈ సీజన్ ప్రారంభమయ్యే ముందే ఈ జాగ్రత్తలను తప్పనసరి తీసుకోవాలి. అలాగే కాలానుగుణ పండ్లను, కూరగాయలను తీసుకోండి. వాటిని తాజాగా నిల్వ ఉంచుకునేలా తగు జాగ్రత్తలు తీసుకుంటే వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి సులభంగా బయటపడగలుగుతారు అని చెబుతున్నారు నిపుణులు. (చదవండి: యూకేలో భారతీయ కిరాణ సరుకులు ధర తెలిస్తే నోరెళ్లబెడతారు..!) -
స్మార్ట్ సీతాకోక చిలుకలు
రంగు రంగుల సీతాకోక చిలుకలు ఎగురుతున్న దృశ్యం పిల్లలకే కాదు, పెద్దలకూ సంబరంగానే ఉంటుంది. అలాగని సీతాకోక చిలుకలు ఎప్పుడంటే అప్పుడు కనిపించవు. కాంక్రీట్ కీకారణ్యాల్లాంటి నగరాల్లోనైతే, సీతాకోక చిలుకలు కనిపించడం మరీ అరుదు. మరి పిల్లలకు సీతాకోక చిలుకల సరదా తీరేదెలా? అందుకే, అమెరికన్ టాయ్ కంపెనీ ‘జింగ్’ ఎప్పుడంటే అప్పుడు ఎగరవేయగలిగే సీతాకోక చిలుకలను ‘గో గో బర్డ్’ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. రంగు రంగులతో అచ్చం అసలు సిసలు సీతాకోక చిలుకల్లా కనిపించే ఈ బొమ్మ సీతాకోక చిలుకలను రిమోట్ కంట్రోల్ సాయంతో కోరుకున్నప్పుడల్లా ఇంచక్కా ఎగరేయవచ్చు. డ్రోన్ మాదిరిగా ఎగిరే ఈ సీతాకోక చిలుకలను రాత్రిపూట చీకటిపడిన తర్వాత కూడా ఎగురవేయవచ్చు. వీటిలోని ఎల్ఈడీ లైట్లు రంగు రంగుల్లో వెలుగుతూ చీకట్లో మిరుమిట్లు గొలుపుతాయి. ఇవి రీచార్జబుల్ బ్యాటరీల సాయంతో పనిచేస్తాయి. ఈ ‘గో గో బర్డ్’ సీతాకోక చిలుక ధర 12.99 డాలర్లు (రూ. 1,083) మాత్రమే! స్మార్ట్ ఉకులెలె.. మ్యూజిక్ మేడీజీ! గిటార్లా కనిపించే ఈ బుల్లి వాద్యపరికరం ఉకులెలె. ఈ పోర్చుగీసు సంప్రదాయ పరికరాన్ని అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో స్మార్ట్గా తయారు చేసిన చైనీస్ కంపెనీ జియోమీ ఇటీవల ‘పాపులెలె 2 ప్రో స్మార్ట్’ పేరుతో మార్కెట్లోకి తెచ్చింది. సంగీతంలో కొత్తగా సరిగమలు నేర్చుకుంటున్న వారు సైతం దీనిపై తేలికగా కోరుకున్న పాటలు పలికించేలా దీన్ని తీర్చిదిద్దడం విశేషం. స్మార్ట్ఫోన్ లేదా లాప్టాప్ ద్వారా కోరుకున్న పాటను ఎంపిక చేసుకుని, యాప్ ద్వారా దీనిని అనుసంధానం చేసుకుంటే చాలు. ఈ ఉకులెలె ఫింగర్ బోర్డులో పాటలోని సంగీతానికి తగిన స్వరస్థానాలలో ఎల్ఈడీ లైట్లు వెలుగుతాయి. ఎల్ఈడీ లైట్ల వెలుగు ఆధారంగా వేళ్లను కదుపుతూ దీనిని వాయిస్తే, ఎలాంటి పాటైనా భేషుగ్గా పలుకుతుంది. దీనిని వాయించడంలో మొదట్లో కొద్దిగా తడబడినా, సంగీతం రానివారు సైతం దీనికి పదిహేను నిమిషాల్లోనే అలవాటు పడిపోతారని, తేలికగా పాటలు వాయించగలుగుతారని జియోమీ కంపెనీ చెబుతోంది. సంప్రదాయ ఉకులెలెను కలపతో తయారు చేస్తారు. ఈ స్మార్ట్ ఉకులెలెను సింథటిక్ ఫైబర్తో కొద్దిపాటి డిజైన్ మార్పులతో తయారు చేశారు. దీని ధర 279 డాలర్లు (రూ.23,264) మాత్రమే! చార్జర్ కమ్ రేడియో ఇది చార్జర్ కమ్ రేడియో. మామూలు చార్జర్లలా దీనికి బయటి విద్యుత్తుతో పనిలేదు. ఇది తనంతట తానే విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటుంది. కావలసినప్పుడు ఆన్ చేసుకుంటే, ఇంచక్కా రేడియోను వినిపిస్తుంది. దీనొకక ఎల్ఈడీ లైట్ కూడా ఉంటుంది. ఈ చార్జర్ కమ్ రేడియో పనిచేయడానికి కాసింత ఉప్పునీరు చాలు. జపానీస్ కంపెనీ ‘స్టేయర్ హోల్డింగ్’ దీనిని ఇటీవల మార్కెట్లోకి తెచ్చింది. ఇది మాగ్నెటిక్ చార్జర్. దీని సాకెట్లో నాలుగు మెగ్నీషియం రాడ్లు ఉంటాయి. అందులో ఉప్పునీరు వేసి నింపడం వల్ల జరిగే రసాయనిక చర్య ద్వారా విద్యుత్తు పుడుతుంది. దీంతో మొబైల్ ఫోన్లు, లాప్టాప్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను చార్జ్ చేసుకోవచ్చు. వినియోగాన్ని బట్టి దీనిలోని మెగ్నీషియం రాడ్లను మార్చుకోవాల్సి ఉంటుంది. ఆరుబయట పిక్నిక్లకు వెళ్లేటప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. దీని ధర 15,800 యెన్లు (రూ.8,837) మాత్రమే! -
సంగీతం నేర్పే ‘స్మార్ట్ ఉకులెలె’.. ఎలా పనిచేస్తుందంటే?
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కొత్త విషయాలు నేర్చుకోవడం సులువు అవుతోంది. తెలియని అంశాలను నేర్చుకోవడానికి చాలామంది క్రమశిక్షణతో ప్రయత్నం చేస్తున్నారు. అందుకు కొంత సమయం పట్టినా చివరకు సాధిస్తున్నారు. గతంలో సంగీతం నేర్చుకోవాలంటే ప్రత్యేక తరగతులకు వెళ్లాల్సివచ్చేది. అందుకు కొంత డబ్బు, సమయం ఖర్చయ్యేది. అయితే ప్రస్తుతం టెక్నాలజీని ఉపయోగించి సంగీతాన్ని నేర్పే యాప్స్, ఇన్స్ట్రుమెంట్లు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా జియోమీ సంస్థ అలాంటి ఓ పరికరాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. అది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. గిటార్లా కనిపించే ఈ బుల్లి వాద్యపరికరం ఉకులెలె. ఈ పోర్చుగీసు సంప్రదాయ పరికరాన్ని అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో స్మార్ట్గా తయారు చేసిన చైనీస్ కంపెనీ జియోమీ ఇటీవల ‘పాపులెలె 2 ప్రో స్మార్ట్’ పేరుతో మార్కెట్లోకి తెచ్చింది. సంగీతంలో కొత్తగా సరిగమలు నేర్చుకుంటున్న వారు సైతం దీనిపై తేలికగా కోరుకున్న పాటలు పలికించేలా దీన్ని తీర్చిదిద్దారు. స్మార్ట్ఫోన్ లేదా లాప్టాప్ ద్వారా కోరుకున్న పాటను ఎంపిక చేసుకుని, యాప్ ద్వారా దీనిని అనుసంధానం చేసుకుంటే చాలు. ఈ ఉకులెలె ఫింగర్ బోర్డులో పాటలోని సంగీతానికి తగిన స్వరస్థానాలలో ఎల్ఈడీ లైట్లు వెలుగుతాయి. ఎల్ఈడీ లైట్ల వెలుగు ఆధారంగా వేళ్లను కదుపుతూ దీనిని వాయిస్తే, ఎలాంటి పాటైనా భేషుగ్గా పలుకుతుంది. దీనిని వాయించడంలో మొదట్లో కొద్దిగా తడబడినా, సంగీతం రానివారు సైతం దీనికి పదిహేను నిమిషాల్లోనే అలవాటు పడిపోతారని, తేలికగా పాటలు వాయించగలుగుతారని జియోమీ కంపెనీ చెబుతోంది. సంప్రదాయ ఉకులెలెను కలపతో తయారు చేస్తారు. ఈ స్మార్ట్ ఉకులెలెను సింథటిక్ ఫైబర్తో కొద్దిపాటి డిజైన్ మార్పులతో తయారు చేశారు. దీని ధర 279 డాలర్లు (రూ.23,264) మాత్రమే! -
‘స్మార్ట్’ పోలింగ్ స్టేషన్ ప్రత్యేకతలేమిటంటే?
ఇండోర్: ఓటర్లు క్యూలో నిలబడే అవసరం లేకుండానే ఓటేయొచ్చు.., అక్కడే సిరా గుర్తున్న వేలు చూపుతూ కృత్రిమ మేధ(ఏఐ)తో పనిచేసే కెమెరా ద్వారా సెల్ఫీ తీసుకోవచ్చు..! మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఏర్పాటు చేసిన స్మార్ట్ పోలింగ్ బూత్ ప్రత్యేకతలివీ. నంద నగర్ నియోజకవర్గంలోని ‘మా కనకేశ్వరి దేవి’గవర్నమెంట్ కాలేజీ బూత్లో ఈ ఏర్పాటును అందుబాటులోకి తెచ్చారు. ‘ఓటర్ల క్యూ పెద్దగా అవసరం లేకుండా చేసేందుకు ఆన్లైన్ టోకెన్ విధానాన్ని తీసుకొచ్చాం. పోలింగ్ బూత్కు వచ్చిన వెంటనే ఓటర్లకు టోకెన్లు అందజేశాం. దీంతో, తమ వంతు వచ్చే వరకు వారు పోలింగ్ బూత్ వద్దే కూర్చోవచ్చు’అని రాష్ట్ర ప్రభుత్వ ఇండోర్ స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ లిమిటెడ్కు చెందిన అసిస్టెంట్ ప్లానర్ రుపాల్ చోప్రా పీటీఐకి చెప్పారు. ‘పోలింగ్ స్టేషన్ ఆవరణలోనే ఏఐ ఆధారిత కెమెరాను ఏర్పాటు చేశాం. ఓటేసిన వారు ఆ పాయింట్ వద్ద నిలబడి ఇంక్ గుర్తున్న వేలిని చూపితే చాలు వెంటనే కెమెరా క్లిక్మనిపిస్తుంది’అని ఆమె వివరించారు. ‘అక్కడే ఉన్న స్క్రీన్పై బార్ కోడ్ ప్రత్యక్షమవుతుంది. ఓటర్ తన ఫోన్తో స్కాన్ చేస్తే ఫొటో వెంటనే మొబైల్లోకి వచ్చేస్తుంది. సోషల్ మీడియాలోకి సైతం షేర్ అవుతుంది’అని రుపాలి పేర్కొన్నారు. -
ఈ మల్టీ స్పెషాలిటీ కుక్కర్ గురించి విన్నరా..
మల్టీ – ఫంక్షనల్ మేకర్స్ ఇప్పుడు సర్వసాధారణం. వినియోగించడమూ తేలికే! అలాంటి ఈ పరికరం కుకర్లానే కాదు.. స్టీమర్గానూ పని చేస్తుంది. పైగా ఎక్కువ మోతాదులో వండిపెట్టగలదు. ఇందులో రకరకాల రైస్ ఐటమ్స్తో పాటు.. సూప్స్, చికెన్ కర్రీస్, మటన్ కుర్మా ఇలా చాలానే చేసుకోవచ్చు. గుడ్లు, కూరగాయలు, కండెలు, దుంపలు వంటివీ ఉడికించుకోవచ్చు. ఇది సుమారుగా మూడులీటర్ల సామర్థ్యంతో దాదాపు 5 కేజీలపైనే బియ్యాన్ని ఉడికించగలదు. ఈ కుకర్ ఆపరేటింగ్ ప్యానెల్లో లేటెస్ట్ మైక్రో స్విచ్ అమర్చి ఉండటంతో కుకింగ్ చాలా ఈజీ. వంట పూర్తయిన తర్వాత 6 గంటల పాటు వేడిగా ఉంచే.. ఆటోమేటిక్ వార్నింగ్ ఆప్షన్ ఉంటుంది. (చదవండి: రైస్ దగ్గర నుంచి సూప్స్, న్యూడిల్స్ వరకు అన్నీ ఈ కుకర్లోనే..!) -
బ్యాటరీతో పనిచేసే ఎయిర్ప్యూరిఫైయర్, అదెలా పనిచేస్తుందంటే?
ఇప్పటి వరకు ఫ్యాన్ మాదిరిగా నేరుగా కరెంట్ కనెక్షన్తో పనిచేసే ఎయిర్ ప్యూరిఫైయర్స్నే చూశాం. ఇప్పుడు రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేసే ఎయిర్ ప్యూరిఫైయర్ అందుబాటులోకి వచ్చింది. ఇది మూడంచెల్లో గాలిని శుభ్రపరుస్తుంది. అమెరికన్ కంపెనీ ‘డ్రియో’ ఈ మ్యాక్రో ప్రో బ్యాటరీ పవర్డ్ ఎయిర్ పూరిఫైయర్ను ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది గాలిలోని కాలుష్యానికి కారణమయ్యే సూక్ష్మ కణాలను, ప్రమాదకరమైన సూక్ష్మజీవులను తొలగిస్తుంది. గాలిలో వ్యాపించే వాసనలను తొలగిస్తుంది. దీనిని స్థూపాకారంలో నిర్మించడం వల్ల 360 డిగ్రీల్లో పనిచేస్తూ, గదిలోని అన్ని దిశల్లోనూ గాలిని సమానంగా శుభ్రపరుస్తుంది. ఇందులోని హెచ్13 హెపా ఫిల్టర్లు గాలిలోని సూక్ష్మాతి సూక్ష్మ కణాలను కూడా సమర్థంగా క్షణాల్లో పీల్చేసుకుంటాయి. ఇది 680 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న గదికి చక్కగా సరిపోతుంది. దీని ధర 109.99 డాలర్లు (రూ.9,156) మాత్రమే! -
జస్ట్ "పిట్టబొమ్మ" అనుకునేరు..ఇది చేసే పని చూస్తే అవాక్కవ్వాల్సిందే!
ఇది మామూలు పిట్టబొమ్మ కాదు. చాలా స్మార్ట్ పిట్టబొమ్మ. దీనిని గోడకు అలంకరణలా వేలాడదీసుకుంటే చాలు. ఇంట్లోని గాలి నాణ్యతను ఎప్పటికప్పుడు గమనిస్తూ, గాలిని శుభ్రపరుస్తుంది. వంటగదిలో వంట చేసేటప్పుడు వెలువడే వాసనలను, పెంపుడు జంతువుల నుంచి వెలువడే వాసనలను, గాలిలోని దుమ్ము ధూళి కణాలను ఎప్పటికప్పుడు తొలగిస్తుంది. ఇంట్లో కార్బన్ డయాక్సైడ్ మోతాదుకు మించి చేరితే, దీని యాప్ ద్వారా వెంటనే కిటికీలు తెరవాలంటూ సందేశం పంపుతుంది. ‘బర్డీ’ అనే డానిష్ కంపెనీ, ఇదే బ్రాండ్ పేరుతో ఈ పిట్టబొమ్మను ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ హైటెక్ పిట్ట ఇంట్లో ఉంటే, ఇంట్లో ఉండేవారికి అలెర్జీలు, ఉబ్బసం సమస్యల నుంచి ఎంతో ఉపశమనంగా ఉంటుంది. దీని ధర 189 డాలర్లు (రూ.15,616) మాత్రమే! (చదవండి: ప్రపంచంలోనే అత్యంత కారు చౌక ఈ ఇల్లు! ఎందుకో తెలుసా!) -
విద్యార్థులే ఊపిరిగా..
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మందమతులేం కాదు, తెలివైన, చురుకైన వారు. విద్యార్థులే కాదు టీచర్లు కూడా నిరంతరం నేర్చుకుంటూనే ఉంటారు’’ అంటోంది నేషనల్ గుడ్ టీచర్ అవార్డు గ్రహీత మాలతీ టీచర్. దేశవ్యాప్తంగా యాభైమంది ఈ అవార్డు అందుకోగా అందులో మాలతీ టీచర్ ఒకరు. తమిళనాడులోని సెంగోటై్టలో పుట్టి పెరిగిన మాలతి నల్లాసైతిరా ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభాస్యం పూర్తిచేసింది. మనస్తత్వ, రసాయన శాస్త్రాల్లో మాస్టర్స్ చేసింది. రసాయనశాస్త్రంలో పీహెచ్డీ చేస్తూ టీచర్గా పనిచేస్తోంది. 2008లో తిరుపూర్ పెరుమతూర్ గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్లో టీచర్గా చేరింది మాలతి. అక్కడ మూడేళ్లు పనిచేశాక బదిలీ అవ్వడంతో తెన్కాసి గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్లో టీచర్గా వెళ్లింది. ఇక్కడ ఏడాది పనిచేశాక ప్రమోషన్ రావడంతో వీరకేరళంబుదూర్ గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్లో పోస్టుగ్రాడ్యుయేట్ సైన్స్ టీచర్గా చేరింది. గత పదేళ్లుగా ఇదే స్కూల్లో సైన్స్ టీచర్గా పనిచేస్తూ విద్యార్థులకు చక్కగా అర్థమయ్యేలా పాఠాలు చెబుతూ వారి మనసులో సుస్థిరస్థానాన్ని సంపాదించుకుంది. ఆటపాటలతో... పాఠాలు విద్యార్థులు సైన్స్సబ్జెక్టుని ఇష్టపడాలని మాలతి కోరిక. అందుకే ఎంతో కష్టమైన చాప్టర్లను సైతం విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధిస్తోంది. విలువిద్య, తోలుబొమ్మలాట, పాటలు పాడడం, నృత్యం, కథలు చెప్పడం ద్వారా సైన్స్ పాఠాలను వివరిస్తోంది. కరోనా సమయంలో ఇళ్లకే పరిమితమైన విద్యార్థులకు ఆన్లైన్ తరగతుల ద్వారా బోధించింది. గ్రామాల్లో మొబైల్ ఫోన్స్ లేని అంధవిద్యార్థులకు సైతం ఆడియో పాఠాలను అందించింది. నూటపద్దెనిమిది మూలకాల పట్టికను సైతం కంఠస్థం చేయాలన్న ఆసక్తి ఉన్న వారికి చక్కగా నేర్చుకునేందుకు సాయపడుతోంది. మేధో వైకల్యాలున్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వీరు కూడా మంచి ఉత్తీర్ణత సాధించేలా కృషిచేస్తోంది. ఈ విద్యార్థులకు ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించి వారి నైపుణ్యాలను మెరుగుపరుస్తోంది. ఇలా మాలతీ టీచర్ సాయంతో సైబుల్ ఇస్లాం అనే మేధోవైకల్య విద్యార్థి 25 సెకన్లలో 20 ద్రవాల పేర్లు టకటకా చెప్పి ‘చోళన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకున్నాడు. ఇస్లాంకు మాలతీ ఆరునెలలపాటు శిక్షణ ఇచ్చింది. మహేశ్వరి, కరణ్, శక్తి ప్రభ వంటి విద్యార్థులు సైతం సెకన్ల వ్యవధిలో నూటపద్ధెనిమిది మూలకాల పీరియాడిక్ టేబుల్ను అప్పచెప్పి చోళన్ వరల్డ్ రికార్డు బుక్లో చోటు దక్కించుకున్నారు. అరవైశాతం మేధో వైకల్యం కారణంగా సరిగా మాట్లాడలేని వారితో సైతం మూలకాల పేర్లను కంఠస్థం చేయించి, గడగడా చెప్పించడం విశేషం. అవార్డులు రికార్డులు... విద్యార్థులను రికార్డుల బుక్లో చోటుదక్కించుకునేలా తయారు చేయడమేగాక మాలతీ కూడా కరోనా సమయంలో ఐదువందల రోజులు ఉచితంగా ఆన్లైన్ తరగతులు చెప్పి చోళన్ వరల్డ్ రికార్డు బుక్ లో చోటు దక్కించుకుంది. మాలతి కృషిని గుర్తించిన తమిళనాడు ప్రభుత్వం 2020–2021 సంవత్సరానికిగాను డాక్టర్ రాధాకృష్ణన్ అవార్డుతో సత్కరించింది. 2022లో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఇరవై ఆరుగంటలపాటు నిరంతరాయంగా ఆన్లైన్ తరగతులు నిర్వహించి వరల్డ్ రికార్డు సృష్టించింది. ఆరోతరగతి నుంచి పై తరగతులకు పాఠాలు బోధించే మాలతీ తనకు వచ్చిన నగదు బహుమతితో విద్యార్థులకు రోటోటిక్స్ కిట్స్ కొని ఇచ్చింది. గేమ్లకు బానిసలు కాకుండా... స్మార్ట్ఫోన్లు వచ్చాక విద్యార్థులంతా మొబైల్ గేమ్స్కు అంకితమైపోతున్నారు. వీరిని ఆడుకోనిస్తూనే పాఠాలు నేర్పించడానికి మాలతి క్విజ్గేమ్ వాయిస్ యాప్ను రూ΄÷ందించింది. ఈ యాప్ను స్టూడెంట్స్తోనే తయారు చేయించడం విశేషం. దీనిలో పీరియాడిక్ టేబుల్ ఉంటుంది. ఈ టేబుల్లో విద్యార్థుల పేర్లు, ఇంగ్లిష్లోని కష్టమైన పదాలను వెతుకుతూ నేర్చుకోవచ్చు. విద్యార్థులకు నేర్పిస్తోన్న పాఠాలను వారి తల్లిదండ్రులు చూసేలా యూట్యూబ్లో పోస్టుచేస్తూ వారి ఉన్నతికి కృషిచేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది మాలతి టీచర్. ‘‘బోధనే నా శ్వాస, విద్యార్థులే నా ఊపిరి. డాక్టర్లు, టీచర్లకు రిటైర్మెంట్ ఉండదు. అధికారికంగా రిటైర్ అయినప్పటికీ ఆ తరువాత కూడా స్టూడెంట్స్ కోసం పనిచేస్తాను. నేను సైకాలజీ చదవడం వల్ల విద్యార్థుల్ని, వారి వైకల్యాలను అర్థం చేసుకుని పాఠాలు చెప్పగలుగుతున్నాను. ప్రతి ఒక్క టీచర్ సైకాలజీ చదివితే మరింత చక్కగా బోధించగలుగుతారు. నేషనల్ గుడ్ టీచర్ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను నేర్చుకుంటూ, విద్యార్థులకు నేర్పించడమే నా జీవితాశయం’’ అని మాలతీ టీచర్ చెబుతోంది. -
ఎస్డబ్ల్యూపీ అంటే? నెక్ట్స్ మంత్ నుంచే ఆదాయం పొందొచ్చా?
ఎస్డబ్ల్యూపీ అంటే ఏంటి? ఓ పథకంలో పెట్టుబడి పెట్టి, తదుపరి నెల నుంచి ఎస్డబ్ల్యూపీ ద్వారా ఆదాయం పొందొచ్చా? – కృతిక మార్కెట్ల అస్థిరతలను అధిగమించేందుకు వీలుగా క్రమంగా ఇన్వెస్ట్ చేసుకునేందుకు సిప్ ఎలా ఉపయోగపడుతుందో..? అదే మాదిరి.. సిస్టమ్యాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ (ఎస్డబ్ల్యూపీ) అనేది, పెట్టుబడిని క్రమానుగతంగా వెనక్కి తీసుకునేందుకు వీలు కల్పిస్తుంది. మార్కెట్లు కనిష్టాల్లో (తక్కువ విలువల వద్ద) ఉన్నప్పుడు పెట్టుబడినంతా వెనక్కి తీసుకోకుండా ఎస్డబ్ల్యూపీ సాయపడుతుంది. రిటైర్మెంట్ తీసుకున్న వారికి ఎస్డబ్ల్యూపీ అనుకూలంగా ఉంటుంది. కావాల్సినంత స్థిరమైన ఆదాయం పొందే ఏర్పాటు చేసుకోవచ్చు. ఎన్ని రోజులకు ఒకసారి ఆదాయం రావాలన్నది నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉంటుంది. ఇన్వెస్టర్ ప్రతీ నెలా నిరీ్ణత తేదీన, నిరీ్ణత మొత్తాన్ని ఎస్డబ్ల్యూపీ ద్వారా రావాలని నిర్ణయించుకుంటే.. అదే రోజు ఆ మొత్తం బ్యాంకు ఖాతాకు జమ అవుతుంది. ఆ మేరకు పెట్టుబడుల నుంచి యూనిట్లు తగ్గిపోతాయి. సిప్కు విరుద్ధంగా పనిచేసేదే ఎస్డబ్ల్యూపీ. ఇక్కడ రెండు కీలక అంశాలను గుర్తు పెట్టుకోవాలి. ఎస్డబ్ల్యూపీ కోసం చేసే పెట్టుబడుల్లో కనీసం మూడింట ఒక వంతు అయినా ఈక్విటీల్లో ఉంచుకోవాలి. ఉపసంహరించుకునే మొత్తం ఏటా పెట్టుబడుల విలువలో 4-6 శాతం మించి ఉండకూడదు. దీనివల్ల పెట్టుబడికి నష్టం లేకుండా ఉంటుంది. ఉదాహరణకు మీ పెట్టుబడులపై రాబడి వార్షికంగా 8-9 శాతంగా ఉండి, మీరు 5 శాతాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు అయితే.. అప్పుడు మిగిలిన 3-4 శాతం రాబడి పెట్టుబడి వృద్ధికి తోడ్పడుతుంది. దీనివల్ల మీ పెట్టుబడి విలువ క్షీణించకుండా ఉంటుంది. ఎస్డబ్ల్యూపీ ద్వారా ఉపసంహరించుకునే మొత్తంలో కొంత పెట్టుబడి, కొంత లాభం ఉంటుంది. ఈ లాభంపైనే పన్ను పడుతుంది. డెట్లో అయితే కాలవ్యవధితో సంబంధం లేకుండా లాభం వ్యక్తిగత ఆదాయానికి కలుస్తుంది. ఈక్విటీల్లో అయితే ఏడాదిలోపు లాభంపై 15 శాతం చెల్లించాలి. ఏడాదికి మించిన లాభం మొదటి రూ.లక్షపై పన్ను లేదు. తదుపరి లాభంపై 10 శాతం పన్ను పడుతుంది.(ఊరట: వచ్చే నెల నుంచి కూరగాయల రేట్లు తగ్గుముఖం) ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్వోఎఫ్) ఎలా పనిచేస్తాయి? వీటి వల్ల లాభాలేంటి? – రవీంద్రనాథ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్వోఎఫ్) అంటే సమీకరించిన పెట్టుబడులను తీసుకెళ్లి మరో మ్యూచువల్ ఫండ్ పథకంలో ఇన్వెస్ట్ చేసే పథకం. పెట్టుబడుల విధానానికి అనుగుణంగా డెట్ ఫండ్స్ లేదా ఈక్విటీ ఫండ్స్లో ఒకటి లేదా ఒకటికి మించిన పథకాల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. సాధారణంగా ఎఫ్వోఎఫ్లను ఆయా ఫండ్స్ హౌస్లు వాటికి సంబంధించిన ఈటీఎఫ్ల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ప్రారంభిస్తుంటాయి. ఎఫ్వోఎఫ్లు ఇతర మ్యూచువల్ ఫండ్స్ పథకాల మాదిరే పనిచేస్తాయి. వీటిల్లోనూ సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. విదేశీ సూచీలు, విదేశీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసే ఎఫ్వోఎఫ్లు కూడా ఉన్నాయి. ఇతర పథకాల మాదిరే ఎఫ్వోఎఫ్ల్లోనూ ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. ఎఫ్వోఎఫ్లు ఇతర పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి కనుక రెండింటిలోనూ ఎక్స్పెన్స్ రేషియో భారం ఇన్వెస్టర్పైనే పడుతుంది. ఉదాహరణకు ఎఫ్వోఎఫ్లో 1 శాతం ఎక్స్పెన్స్ రేషియో ఉందనుకుంటే, అది ఇన్వెస్ట్ చేసే పథకం ఎక్స్పెన్స్ రేషియో 0.50 శాతం ఉంటే మొత్తం 1.5 శాతం ఎక్స్పెన్స్ రేషియో చెల్లించాల్సి వస్తుంది. ఎఫ్వోఎఫ్ ఇన్వెస్ట్ చేసే పథకంలో నేరుగా ఇన్వెస్టర్లు పెట్టుబడులకు అవకాశం లేనప్పుడు వీటిని పరిశీలించొచ్చు. ఎఫ్వోఎఫ్లను నాన్ ఈక్విటీ పథకంగా పరిగణిస్తారు. కనుక డెట్ పథకాలకు మాదిరే మూలధన లాభాలపై పన్ను అమలవుతుంది. ఒకవేళ ఎఫ్వోఎఫ్ దేశీయ ఈక్విటీ పథకాల్లోనే 90 శాతానికిపైగా పెట్టుబడి పెడితే ఈక్విటీకి మాదిరే మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది. ఎస్డబ్ల్యూపీతో స్థిరమైన ఆదాయం పొందొచ్చా? ధీరేంద్ర కుమార్ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
స్మార్ట్ సేద్యం! అధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న రైతులు
మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ బహుళ ప్రయోజనాలు పొందుతున్నారు అనంతపురం జిల్లా పండ్ల తోటల రైతులు. ‘ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల’ను ఏర్పాటు చేసుకుని చీడపీడలను ముందే పసిగట్టి తగిన జాగ్రత్తలు పాటిస్తూ పంట నష్టాన్ని నివారించుకుంటున్నారు. పనిలో పనిగా సస్యరక్షణ ఖర్చు సగానికి తగ్గినట్టే. నాణ్యత పెరగడమే కాదు.. ఆశించిన దిగుబడులు సాధిస్తున్నారు. ఈ సూత్రాలను ‘స్మార్ట్’గా పాటిస్తూ పండ్ల తోటల్లో ‘ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల’ ద్వారా చక్కటి ఫలితాలను సాధిస్తున్నారు అనంతపురం రైతులు. దానిమ్మ, ద్రాక్ష, బొప్పాయి, బత్తాయి వంటి పండ్ల తోటలు సాగు చేసే పెద్ద రైతులకు వెదర్ స్టేషన్లు ఉపయుక్తంగా ఉన్నాయి. తోటల యాజమాన్యాన్ని ‘స్మార్ట్’ సాధనాలతో సులభతరం చేసుకోవడమే కాక ఖర్చును తగ్గించుకుంటూ అధికాదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఆటోమేటిక్ స్మార్ట్ వెదర్ స్టేషన్ సోలార్ సిస్టమ్తో నడుస్తుంది. భూమి రకాన్ని బట్టి 3 ఎకరాలకు ఒకటి సిఫారసు చేస్తున్నారు.. ఒకే పంటను సాగు చేసే రైతులు ఒక పరికరంతోనే సత్ఫలితాలను పొందుతున్నారు. రూ.50 వేల వ్యయంతో దీన్ని తోట మధ్యలో అమర్చుకోవాలి. భూమి లోపల కనీసం 2–3 మొక్కలను కలుపుతూ ఒక అడుగు లేదా 15 అంగుళాల లోతులో సెన్సార్ను పెడతారు. అలాగే, రాబోయే 14 రోజుల్లో ఉండే ఉష్ణోగ్రతలను అంచనా వేసేందుకు టవర్కు మధ్యలో మరో సెన్సార్ను ఏర్పాటు చేస్తారు. గాలివేగం, తేమశాతం తెలుసుకునేందుకు టవర్కు రెండో వైపు 2.5–3 అడుగుల ఎత్తులో మరో సెన్సార్ను ఏర్పాటు చేస్తారు. భూమిలో ఉండే సెన్సార్ మొక్కల వేర్లకు ఏ స్థాయిలో నీరు అందుతోంది? వేర్ల దగ్గర తేమ శాతం, ఒత్తిడి ఎలా ఉందో చెబుతుంది. అలాగే రెండో సెన్సార్ ఉష్ణోగ్రతలను, మూడో సెన్సార్ ద్వారా గాలిలో తేమ శాతం, గాలి వేగం గురించి చెబుతుంది. రెయిన్ గేజ్ ద్వారా వర్షపాతాన్ని నమోదు చేస్తుంది. 3 సెన్సార్ల ద్వారా వచ్చే సమాచారాన్ని తనే విశ్లేషించుకొని రైతులకు తగిన సూచనలు, సలహాలతో మెస్సేజ్లు పంపుతుంది. మంచి ఫలితాలొస్తున్నాయి నేను 25 ఎకరాల్లో దానిమ్మ, 10 ఎకరాల్లో ద్రాక్ష పండ్లు సాగు చేస్తున్నా. మహారాష్ట్రకు చెందిన డాక్టర్ బాబాసాహెబ్ ఘోరే శిక్షణా కార్యక్రమంలో వీటి ప్రయోజనాల కోసం తెలుసుకున్నా. రెండేళ్ల క్రితం వీటిని మా తోటల్లో ఏర్పాటు చేశాం. చాలా బాగా పనిచేస్తున్నాయి. వచ్చే సిఫార్సులకు అనుగుణంగా యాజమాన్య పద్ధతులు పాటిస్తున్న. మంచి ఫలితాలు వస్తున్నాయి. ఏర్పాటు చేసిన ఫసల్ కంపెనీ ఏడాది పాటు ఉచితంగా సేవలందించింది. మా జిల్లాలో 10 మంది రైతులు ఈ పరికరాలను ఏర్పాటు చేసుకున్నారు. ఎకరాకు 5 టన్నులు దిగుబడి రాగా, పెట్టుబడులు పోను రూ.2–3 లక్షల వరకు నికరాదాయం వస్తో్తంది. – గౌని పాతిరెడ్డి, కల్యాణదుర్గం, అనంతపురం జిల్లా (9440752434) ఇంట్లో నుంచే తోట యాజమాన్యం నేను 64 ఎకరాల్లో దానిమ్మ, బత్తాయి, బొప్పాయి తోటలు సాగు చేస్తున్నా. ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ ఏర్పాటు చేసుకున్నా. ఇంట్లో కూర్చొని వ్యవసాయం చేయొచ్చు. పంట ఏ తెగులు బారినపడుతుందో అన్న దిగులు లేదు. ఎప్పటికప్పుడు సెల్ఫోన్కి మెస్సేజ్లొస్తాయి. సమాచారం చాలా పక్కాగా ఉంటుంది. అనుగుణంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటే చాలు. గతంతో పోలిస్తే∙నీరు 50% ఆదా అవుతుంది. 25% పెట్టుబడి ఖర్చులు తగ్గాయి. దిగుబడి పెరిగింది. పండ్ల నాణ్యత 50% పెరిగి మంచి రేటు కూడా వస్తోంది. – సుగాలి చిన్న నాగరాజు, యలగలవంక తండా, బేలుగుప్ప మం., అనంతపురం జిల్లా (7702828062) చీడపీడలను ఇట్టే పసిగడుతుంది గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంది.. ఫలానా చీడపీడలు వచ్చే అవకాశం ఉంది. ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంది.. ఫలానా తెగులు సోకే ప్రమాదం ఉంది.. మరో గంటలో వర్షం పడే అవకాశం ఉంది వంటి హెచ్చరికలు పంపిస్తుంది. భూమిలో ఉండే సెన్సార్ ఆధారంగా ఏ సమయంలో ఎంత మేరకు నీరు పెట్టాలో చెబుతుంది. పోషక లోపాలు ఏమేరకు ఉన్నాయో గుర్తించి తగిన సిఫారసులు చేస్తుంది. చీడపీడలకు పిచికారీ చేసేందుకు వాతావరణం అనుకూలంగా ఉందో లేదో కూడా తెలియజేస్తుంది. ఎంత మోతాదులో ఎటు నుంచి పిచికారీ చేయాలో కూడా చెబుతుంది. టవర్కు ఉండే రెయిన్ గేజ్ ఆధారంగా పంటపొలం వద్ద ఎన్ని మిల్లీమీటర్ల వర్షపాతం పడింది? ఆ ప్రభావం పంటలపై ఏ మేరకు ఉంటుందో కూడా రైతులకు తెలియజేస్తుంది. టవర్ లోపల సిమ్ కార్డు నిక్షిప్తం చేసి ఉంటుంది. ఇది ఎప్పటికప్పుడు టెక్ట్స్ మెసేజ్ రూపంలో రైతుకు సమాచారం వస్తుంది. రైతు తోటలో ఉండాల్సిన అవసరం లేదు. ఎక్కడున్నా సరే ప్రత్యేక యాప్ ద్వారా మెసేజ్ రూపంలో అన్ని విషయాలు ఎప్పటికప్పుడూ తెలిసిపోతాయి. ఏమైనా తెగుళ్లు సోకినట్టు గుర్తిస్తే తప్ప అనవసరంగా మందులు కొట్టే అవసరం ఉండదు. సిఫారసు చేసిన పురుగుమందులను సిఫార్సు చేసిన మోతాదులో స్ప్రే చేయడం వలన అదనపు ఖర్చు తగ్గుతుంది. సరైన సమయంలో సరైన మందు స్ప్రే చేయడం వలన దిగుబడి కూడా పెరుగుతుంది. తెగుళ్లు, చీడపీడలు సోకకుండా ముందస్తుగా గుర్తించడం వలన పెట్టుబడి ఖర్చు గణనీయంగా తగ్గించుకోవచ్చు. పురుగుమందుల వినియోగం తగ్గడంతో ఆశించిన స్థాయిలో నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చు. పొలంలో వెదర్ స్టేషన్ను ఏర్పాటు చేసుకున్న తర్వాత పెట్టుబడి ఖర్చు 20% తగ్గడంతోపాటు, నాణ్యత 50%, దిగుబడి 25% వరకు పెరుగుతుంది. 20% పైగా అదనపు ఆదాయం వస్తున్నదని రైతులు చెబుతున్నారు. – పంపాన వరప్రసాదరావు, సాక్షి, అమరావతి (చదవండి: ఇంగ్లండ్లో సర్దార్జీల సేద్యం! స్మెదిక్లో సిక్కు జాతీయుల ఫార్మింగ్ సిటీ) -
ముచ్చటైన పెన్ను.. మూడు భాషల నిఘంటువు చేతిలో ఉన్నట్లే!
ఇది మూడు భాషల ముచ్చటైన పెన్ను. ఇది చేతిలో ఉంటే, మూడు భాషల నిఘంటువు చేతిలో ఉన్నట్లే! దీంతో రాయడానికి సాధ్యంకాదు గాని, దీనివల్ల చాలా ఉపయోగాలే ఉన్నాయి. చైనీస్ కంపెనీ ‘స్మార్ట్ యుడావో’ ఇటీవలే ఈ పెన్నును మార్కెట్లోకి తెచ్చింది. చైనీస్, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లోని పదాలను, వాక్యాలను ఈ పెన్ను ఒక భాష నుంచి మరో భాషలోకి ఇట్టే అనువదిస్తుంది. మామూలు పుస్తకం లేదా ఈ–బుక్లోని వ్యాక్యాలను ఈ పెన్నుతో స్కాన్ చేస్తూ ఉంటే, కోరుకున్న భాషలోకి అనువదిస్తుంది. అంతేకాదు, తెలియని పదాలకు గల అర్థాలను, పర్యాయపదాలను చెబుతుంది. విద్యార్థులకు, భాషలను ప్రత్యేకంగా అధ్యయనం చేసే ఔత్సాహికులకు ఎంతగానో ఉపయోగపడే ఈ పెన్ను ధర 199.99 డాలర్లు (రూ.16,474) మాత్రమే! -
జేఈఈ పరీక్షలో స్మార్ట్ కాపీయింగ్
-
యాపిల్ స్పెషల్ ఫీచర్తో స్మార్ట్ ట్రావెల్ మగ్, ధర వింటే..!
సాక్షి, ముంబై: టెక్ దిగ్గజం యాపిల్ ఉత్పత్తులకు ఉండే క్రేజే వేరు. అత్యంత ప్రజాదరణ పొందిన వాటిల్లో ఐఫోన్లు, ఎయిర్పాడ్స్, ఐపాడ్స్, స్మార్ట్ వాచెస్ను చూశాం. తాజాగా టెంపరేచర్ను కంట్రోల్ చేసే కీలక ఫీచర్తో యాంబర్ ట్రావెల్మగ్ 2+ను యాపిల్ తన ఆన్లైన్ స్టోర్లో విక్రయిస్తోంది. యాపిల్ స్టోర్లో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ ట్రావెల్ మగ్ ధర ప్రస్తుతం 199.95 డాలర్లు (రూ. 16,542) గా ఉంది. (మంటల్లో మహీంద్రా ఎక్స్యూవీ700: వీడియో వైరల్, స్పందించిన కంపెనీ) ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్లో ఫైండ్ మై యాప్కు సపోర్ట్ను అందిస్తోంది అంటే ఒక వేళ ఈ స్మార్ట్ ట్రావెల్ మగ్ పోతే, దాన్ని ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. (మారుతీ ‘జిమ్నీ’: మీకో గుడ్న్యూస్, ఇంట్రస్టింగ్ అప్డేట్స్) వేడిగా వేడిగా కాఫీనో, టీనో ఆస్వాదించే ఈ యాంబర్ ట్రావెల్ మగ్ 2+ లో మనం తాగే డ్రింక్ ఉష్ణోగ్రతను (120°F- 145°F) సెట్ చేసుకోవచ్చు. ఇంటర్నల్ బ్యాటరీ సాయంతో ఉష్ణోగ్రతను 3 గంటల వరకు ఉంచుకోవచ్చు. లేదా ఛార్జింగ్ కోస్టర్ సాయంతో రోజంతా కూడా ఇందులోని డ్రింక్స్ను హాట్గా ఉంచుకోవచ్చు. ఇలాంటి టెక్ వార్తలు, ఇతర బిజినెస్ వార్తలకోసం చదవండి: సాక్షిబిజినెస్ -
స్మార్ట్ సేద్యం: వ్యవసాయ సాధనాల కోసం స్మార్ట్ కిట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, రైస్ ట్రాన్స్ప్లాంటర్లు వంటి వ్యవసాయ సాధనాల వినియోగాన్ని పర్యవేక్షించేందుకు ఉపయోగపడేలా ఎంఅండ్ఎం గ్రూప్లో భాగమైన కృష్–ఈ సంస్థ స్మార్ట్ కిట్ (కేఎస్కే)ని తెలంగాణ మార్కెట్లో ఆవిష్కరించింది. దీనితో రైతులు తమ ట్రాక్టర్లు, వ్యవసాయ సాధనాల వినియోగం వివరాలను స్మార్ట్ ఫోన్ ద్వారా ట్రాక్ చేయొచ్చని ఎంఅండ్ఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ రామచంద్రన్ తెలిపారు. ఇదీ చదవండి: iPhone 14 Offers: ఐఫోన్14పై ఆఫర్లే ఆఫర్లు.. ఫ్లిప్కార్ట్, అమెజాన్తో పాటు మరో సంస్థలోనూ భారీ డిస్కౌంట్లు! తద్వారా నిర్వహణ వ్యయాలను గణనీయంగా తగ్గించుకోవచ్చని, ఆదాయాన్ని మెరుగుపర్చుకోవచ్చని ఆయన వివరించారు. ప్రారంభ ఆఫర్ కింద దీన్ని రూ. 4,995కి (పన్నులు, ఆరు నెలల సబ్స్క్రిప్షన్ ప్యాకేజీ కూడా కలిపి) అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే 25,000 పైచిలుకు కిట్స్ వినియోగంలో ఉన్నట్లు కేఎస్కేని రూపొందించిన కార్నట్ టెక్నాలజీస్ సీటీవో పుష్కర్ లిమాయే తెలిపారు. కార్నాట్లో ఎంఅండ్ఎంకు గణనీయంగా వాటాలు ఉన్నాయి. ఇదీ చదవండి: FASTag Record: ఒక్క రోజులో రూ.1.16 కోట్లు.. ఫాస్ట్ట్యాగ్ వసూళ్ల రికార్డు -
అమెరికాలో వరుస ఘటనలు, సరికొత్త స్మార్ట్ గన్.. ఎవరుపడితే వారు కాల్చలేరు
వాషింగ్టన్: యజమాని మినహా మరెవరూ పేల్చడం సాధ్యంగాని 9ఎంఎం తుపాకీని తయారు చేసింది అమెరికాకుచెందిన బయోఫైర్ కంపెనీ. ఫింగర్ప్రింట్ సెన్సార్, కాల్చే వ్యక్తిని పోల్చుకునే ఫేషియల్ రికగ్నేషన్ టెక్నాలజీ దీని సొంతం. ఇలాంటి తుపాకీ ప్రపంచంలో ఇదే మొదటిది. గన్ను పక్కన పెట్టేయగానే లాక్ అవుతుంది. అమెరికా వంటి దేశాల్లో చిన్నారులు పొరపాటున తుపాకీ కాల్చడం, గన్ చోరీ తదితరాలకు ఇక తెర పడుతుందని బయోఫైర్ సంస్థ చెబుతోంది. ఈ సంస్థకు ఇంటెల్, గూగుల్, నాసాలు తోడ్పాటునందిస్తున్నాయి. అమెరికాలో తరచూ తుపాకీల కాల్పులు ఘటనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ హింసను నియంత్రించి తుపాకీని ఎవరు పడితే వారు వాడకుండా చేయాలనే సదుద్దేశంతో ఈ స్మార్ట్గన్ను అభివృద్ధి చేసినట్లు బయోఫైర్ పేర్కొంది. వచ్చే ఏడాది ఇవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని తెలిపింది. ఇప్పుడే ప్రీ ఆర్డర్లు కూడా తీసుకుంటోంది. ఈ స్మార్ట్ గన్ను బయోఫైర్ వ్యవస్థపకుడు క్లోయేఫర్(26) అభివృద్ధి చేస్తున్నారు. 15 ఏళ్ల వయసు నుంచే దీన్ని రూపొందిస్తున్నారు. సాంకేతికతతో ప్రతి సమస్యను పరిష్కరించేలేమని, కానీ అమెరికాలో క్లిష్టమైన సమస్యలను సాంకేతికతను ఉపయోగించి పరిష్కరించుకోగలమని క్లోయేఫర్ పేర్కొన్నారు. ఈ గన్తో పొరపాటున పిల్లల చేతుల్లో తుపాకులు పేలే ఘటనలు తగ్గుతాయని చెప్పారు. యజమానులు తప్ప మరెవరికీ తుపాకీని ఉపయోగించడం సాధ్యం కాకపోతే దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉండవన్నారు. చదవండి: కృత్రిమ మేధపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఆందోళన.. తేడావస్తే అంతే! -
శ్రీకాకుళంలో మంచు లక్ష్మి సందడి.. చూసేందుకు ఎగబడిన జనం
శ్రీకాకుళం: తెలుగు రాష్ట్రాల్లో అన్ని పాఠశాలల్లో విద్యార్థులు ఇంగ్లిష్ నేర్చుకోవాలని సినీ నటి మంచు లక్ష్మి అన్నారు. ఆమె మంగళవారం అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ, ఆలయ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావులు గౌరవ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. అనంతరం మంచు లక్ష్మి మాట్లాడుతూ తన తండ్రి డాక్టర్ మోహన్బాబు అరసవల్లి క్షేత్రానికి వెళ్లాలని సూచించారని, అద్భుతంగా స్వామి దర్శనం జరిగిందన్నారు. ఇక తాము ‘టీచ్ ఫర్ ఛేంజ్’ అనే ఎన్జీవో తరఫున రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 475 ప్రభు త్వ పాఠశాలల్లో స్మార్ట్ క్లాసులు నిర్వహిస్తున్నామని, తద్వారా విద్యార్థులకు ఇంగ్లిష్ను నాణ్యంగా బోధించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ క్రమంలో స్థానిక జిల్లాలో కొరసవాడ ప్రభుత్వ పాఠశాలలో స్మార్ట్ క్లాసులను ప్రారంభించేందుకు తాను జిల్లాకు వచ్చినట్టు వివరించారు. అలాగే మరోవైపు నటనను కొనసాగిస్తున్నానని, త్వరలోనే ‘లేచింది మహిళా లోకం’ అనే పూర్తి మహిళల చిత్రం విడుదల కానుందని, అలాగే తన తండ్రి మోహన్బాబుతో కలిసి కుటుంబకథా చిత్రాన్ని కూడా చేయనున్నానని ప్రకటించారు. స్మార్ట్ క్లాస్రూమ్ ప్రారంభం పాతపట్నం: కొరసవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.3 లక్షలతో డిజిటల్ తరగతిని (స్మార్ట్ క్లాస్రూం)ను సినీ నటి మంచు లక్ష్మి మంగళవారం ప్రారంభించారు. ఆమె ముందుగా ఓపెన్ టాప్ జీపులో కొరసవాడ చేరుకున్నారు. ఊరివారితో పాటు సమీప గ్రామస్తులు కూడా ఆమెను చూడడానికి పోటెత్తారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీచ్ ఫర్ చేంజ్ ట్రస్ట్ ద్వారా శ్రీకాకుళం జిల్లాలోని 20 పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్రూంలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆమెతో పాటు జిల్లా డీఈఓ జి.పగడాలమ్మ, ఎంఈఓలు సీహెచ్ మణికుమార్, కె.రాంబాబు, ప్రధానోపాధ్యాయు డు సింహాచలం, సర్పంచ్ జక్కర ఉమా, ఎంపీటీసీ మడ్డు సుగుణ కుమారి, గ్రామస్తులు పాల్గొన్నారు. అలాగే హిరమండలం మండలంలోని సవరచొర్లంగి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో స్మార్ట్ క్లాస్రూంను కూడా ఆమె ప్రారంభించారు. -
స్మార్ట్ ఉంగరం, మన ఆరోగ్యానికి కనిపెట్టుకుని ఉంటుంది
ఈ ఫొటోలో కనిపిస్తున్నది స్మార్ట్ ఉంగరం. ఉంగరం లోపలి వైపు రాళ్లు పొదిగారేమిటా అనుకుంటున్నారా? అవి రాళ్లూ రత్నాలూ కావు. స్మార్ట్ సెన్సర్ల లైట్లు. ఈ ఉంగరం వేలికి పెట్టుకుంటే, ఇది అనుక్షణం మన ఆరోగ్యానికి కనిపెట్టుకుని ఉంటుంది. దీనిని ఒకసారి చార్జింగ్ చేసుకుంటే, ఇందులోని బ్యాటరీ ఏడురోజుల వరకు ఎలాంటి అంతరాయం లేకుండా పనిచేస్తుంది. ఫిన్లాండ్కు చెందిన ‘ఓరా’ సంస్థ ఈ స్మార్ట్ ఉంగరాన్ని ‘ఓరా రింగ్ జెన్3 హారిజన్’ పేరుతో అందుబాటులోకి తెచ్చింది. దీనిని వేలికి పెట్టుకుంటే, మన ఆరోగ్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు స్మార్ట్ఫోన్కు పంపుతుంది. బ్లడ్ ఆక్సిజన్ లెవల్, నిద్రపోయే సమయం, గుండె స్పందనలు, రోజువారీ పనుల్లో మనం ఖర్చు చేసే కేలరీలు తదితర వివరాలను గూగుల్ ఫిట్ లేదా యాపిల్ హెల్త్ యాప్స్ ద్వారా స్మార్ట్ఫోన్కు పంపుతుంది. దీని ధర 349 డాలర్లు (సుమారు రూ.28,500). -
అదిరిపోయే స్మార్ట్ ఫ్యాన్..అమెజాన్ అలెక్సా, సిరి ఇంకా ఎన్నో ఫీచర్లు
ఇక్కడ ఫొటోలో ఉన్నది సాదా సీదా పెడెస్టల్ ఫ్యాన్లాగానే కనిపిస్తోంది గాని, ఇది స్మార్ట్ కూలింగ్ ఫ్యాన్. ఈ ఫ్యాన్ ఎయిర్ కూలర్ కంటే అమోఘంగా పనిచేస్తుంది. ‘నాష్ పీఎఫ్–1’ పేరుతో ఎలక్ట్రిక్ పరికరాల తయారీ సంస్థ ‘నాష్’ దీనికి రూపకల్పన చేసింది. ఈ ఫ్యాన్లోని సెన్సర్లు పరిసరాల్లోని ఉష్ణోగ్రతల పెరుగుదలను గుర్తించి, గది వేడెక్కక ముందే చల్లబరుస్తుంది. ఈ ఫ్యాన్ స్మార్ట్ఫోన్లోని గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సా, సిరి వంటి యాప్స్ ద్వారా వాయిస్ కమాండ్లకు అనుగుణంగా స్పందిస్తుంది. వైఫై కనెక్షన్, స్మార్ట్ఫోన్ ఉంటే చాలు, ఈ ఫ్యాన్ చాలా స్మార్ట్గా పనిచేస్తూ, వేసవి ధాటిని ఏమాత్రం తెలియనివ్వదు. దీని ధర 249 డాలర్లు (రూ.19,817). -
లవ్బర్డ్.. ఇలా చేయడం ఎప్పుడూ చూసి ఉండరు!
హోం.. స్వీట్ హోం.. ఎవరికైనా ఇళ్లంటే ఇష్టమే. పందిరి ఇంటి నుంచి పదంస్తుల మేడ వరకు ఏదైనా సరే ఒక ఇళ్లు కలిగి ఉండాలని అంతా కోరకుంటాం. పక్షులు కూడా అంతే గుడ్లు పెట్టే సమయంలో కచ్చితంగా గూడు కట్టుకుంటాయి. అందుకోసం ఎంతగానో శ్రమిస్తాయి. చెట్లు, మొక్కల నుంచి రకరకాల పదార్థాలు సేకరించి... వాటిని అల్లి చిత్రవిచ్రితంగా గూళ్లు కడుతుంటాయి. అయితే ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంతనంద ట్విట్టర్లో షేర్ చేసిన పోస్టులో ఉన్న లవ్బర్డ్ చాలా స్మార్ట్. ఎంతో నేర్పుగా ఆకులోని మధ్య ఈనెను తొలచి వేస్తుంది. అలా తొగించిన వాటిని ఈకల్లో దాచిపెట్టుకుంటోంది. మాములుగా అయితే నోటితో పట్టుకుని.. గూడు నిర్మించే చోటుకి వాటిని తరలించాలి. ఒక్కోసారి ఒక్కోటి పట్టుకుని వెళితే సమయం, శ్రమ ఎక్కువ అవుతుందని ఆలోచించిన లవ్బర్డ్ ఈనెలను ఈకల్లో దాచుకోవడమే ఇక్క ‘స్మార్ట్’. ఇక లవ్బర్డ్ తెలివైన పనిని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంతనంద దానిని షేర్ చేయగా వైరల్ అయింది. ఈ వీడియో చూసిన వారు పక్షి తెలివి తేటలకి తెగ ముచ్చటపడుతున్నారు. Just amazing... Love bird rips the mid vein of leaves, tucks it in the feather & flies to build its nest when it has enough. Not flying each time. Efficiency👌 From Channa Prakash pic.twitter.com/ddJaEuFJ39 — Susanta Nanda IFS (@susantananda3) June 22, 2021 చదవండి : కార్బెట్ రిజర్వ్లో తెల్ల నెమలి.. 85 ఏళ్లలో ఇదే తొలిసారి -
వైర్లు లేని స్మార్ట్ సిగ్నల్ వ్యవస్థ
సౌతాంప్టన్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన రంగంలో ఎప్పటికప్పుడు వస్తోన్న మార్పులను అందిపుచ్చుకొని ప్రతి రంగాన్ని అభివృద్ధి చేసుకుంటూ పోయినప్పుడే నిజమైన పురోభివృద్ధి మానవ జాతి సాధించగలదన్నది తెల్సిందే. కాలుష్యం నియంత్రణలో భాగంగా ఇంగ్లండ్ ప్రభుత్వం గత కొంత కాలంగా మోటారు వాహనాల స్థానంలో సైకిళ్లను ప్రోత్సహిస్తూ వస్తోన్నది. అయినప్పటికీ వాహనాల సంఖ్య తగ్గక పోగా, ప్రతి కూడలి వద్ద రద్దీగా పెరుగుతుండడంతో సైకిళ్లపై ప్రయాణించడమన్నది సైక్లిస్టులకు భారంగా తయారయింది. ఈ నేపథ్యంలో ప్రతి కూడలి వద్ద వారికి అనుకూలమైన సిగ్నలింగ్ వ్యవస్థ తీసుకురావాలని ప్రభుత్వం సంకల్పించింది. ఒకప్పుడు పాదాచారులకు ప్రాధాన్యమిచ్చిన తీరులో ఇప్పుడు సైక్లిస్టులు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేయడమే ఇంగ్లండ్ ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యత. గతంలో పాదాచారుల కోసం నిర్దిష్ట సమయంలో గ్రీన్ సిగ్నల్ వెలగ్గా, ఇప్పుడు నిర్దిష్ట సంఖ్యలో సైకిళ్లను చూసి వెంటనే వాటికి ముందుగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ప్రభుత్వం ప్రవేశ పెడుతోన్న స్మార్ట్ సిగ్నలింగ్ వ్యవస్థ లక్ష్యం. ఇందుకు విద్యుత్ వైర్లు అవసరం లేని ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ను ఉపయోగిస్తోంది. ఈ స్మార్ట్ వ్యవస్థను ముందుగా ప్రయోగాత్మకంగా లండన్తోపాటు వోల్వర్హామ్టన్, కోవెంట్లీ, సౌతాంప్టన్లో ముందుగా ప్రవేశపెడుతున్నారు. తర్వాత దీన్ని అన్ని నగరాలకు విస్తరించనున్నారు. ఈ స్మార్ట్ వ్యవస్థను ఇంతకుముందే అమల్లోకి తీసుకరావాలనుకున్నారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. (చదవండి: ఒక్కసారిగా ఏడ్చేసిన కిమ్) -
అవి వర్చువల్ నీటి అలలు
-
అబ్బురపరిచే వర్చువల్ నీటి అలలు
సియోల్: నీటి అలలు వేగంగా ఓ భవనంలోని గాజు గదిలోకి దూసుకుపోవటం ఎప్పుడైనా చూశారా? అలాంటి ఓ అద్భుతమైన దృశ్యం దక్షిణ కొరియా దేశంలో చూడవచ్చు. అవి నిజమైన నీటి అలలు కావు.. వర్చువల్ అలలు. సియోల్ నగరంలోని ఓ పెద్ద భవనంలో ఉన్న గాజు గదిలో ప్రపంచంలోనే అతిపెద్ద వర్చువల్ అవుట్ డోర్ హై డెఫినేషన్ స్క్రీన్ ప్రోగ్రామ్ చేయబడింది. దీంతో నీటి అలలు ఎగిసిపడుతున్నట్లు కనిపిస్తున్న వర్చువల్ స్క్రీన్ చూపరులను అబ్బురపరుస్తోంది. అనామోర్ఫిక్ ఎలుషన్గా వర్ణించబడిన ఈ వర్చువల్ అలలు 80 మీటర్ల వెడల్పు, 20 మీటర్ల పొడవైన తెరపై ప్రతి గంటకు ఒకసారి నిజంగా నీటి అలలు ఎగిసిపడినట్లు దర్శనమిస్తాయి. అనామోర్ఫిక్ ఎలుషన్ దృశ్యం కనిపించాలంటే నిర్దిష్టమైన కోణంలో చూడాలి. ఆశ్చర్యపరిచే ఈ ఆర్ట్ను డిస్ట్రిక్ట్ అనే సంస్థ రూపొందించింది. ఈ సంస్థకు ఆర్ట్# వన్ వేవ్గా పేరు ఉన్న విషయం తెలిసిందే. ‘మా సంస్థ నుంచి పలు సృజనాత్మకమైన కళలను సృష్టించాలనుకుంటున్నాం’ అని డిస్ట్రిక్ట్ సంస్థ డైరెక్టర్ జూన్ లీ స్టఫ్ తెలిపారు. (మృత్యుశకటం.. భీతావహ వాతావరణం) శామ్సాంగ్ స్మార్ట్ ఎల్ఈడీ టెక్నాలజీని ఉపయోగించి 1620 చదరపు మీటర్ల స్మార్ట్ స్క్రీన్లో ఈ అలలకు సంబంధించిన ఆర్ట్ను ఇన్స్టాలేషన్ చేయబడింది. ఈ తెరను తయారు చేయడానికి సుమారు రెండు నెలలు సమయం పట్టినట్లు డిస్ట్రిక్ట్ సంస్థ పేర్కొంది. ఇక ఈ స్క్రీన్ రెజల్యూషన్ 7,840 x 1,952 పిక్సెల్స్ ఉంది. ఈ వర్చవల్ తెర అలలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇప్పటికే నాలుగు లక్షలు మంది ఈ వీడియోను విక్షించగా, నెటిజన్లు ఆశ్చర్యపోతూ కామెంట్లు చేస్తున్నారు. వర్చువల్ తెర తయారు చేయటం వెనకు అద్భుతమైన నైపుణ్యం దాగి ఉంది’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ‘దక్షిణ కొరియన్లు ఇంత సాంకేతికతో భవిష్యత్తులో ఇంకా ఎంత ముందుకెళుతారోనని అసూయగా ఉంది’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. -
అదిరిపోయే ‘స్మార్ట్ షూస్’
వియన్నా: ఆస్ట్రియాలోని వియన్నా నగరంలో గత అక్టోబర్లో జరిగిన రెండు గంటల ప్రపంచ మారథాన్లో కెన్యా అథ్లెట్ ఎలియుడ్ కిప్చోజ్ విజయం సాధించారు. సుదూర మారథాన్లో ఓ అథ్లెట్ విజయం సాధించడం ప్రపంచంలోనే మొదటిసారి. అందుకు కారణం ఆయన కాదు. ఆయన ధరించిన ‘నైక్ స్మార్ట్ షూ’యే కారణం. ఆ తర్వాత అనతి కాలంలోనే ఈ బూట్లపై వివాదం మొదలయింది. అథ్లెట్లు ఈ బూట్లు ధరించకుండా నిషేధం విధించాలని ప్రపంచ అథ్లెటిక్స్ సంఘం డిమాండ్ చేస్తోంది. షూస్ అడుగు భాగాన కార్బన్ ఫైబర్ ప్లేట్కు ఫోమ్ కుషన్ జతచేసి కుట్టడం వల్ల అది స్ప్రింగ్లాగా పనిచేస్తుంది. వాటిని ధరించడం వల్ల పరుగెత్తుతున్నప్పుడు గాల్లో ఎగురుతున్నట్లు ఉంటుంది. వీటిని ఇప్పుడు అథ్లెట్స్కు ట్రెయినర్స్గాను పిలుస్తున్నారు. ఇంగ్లండ్లోని ‘కెంట్ అథ్లెటిక్స్ క్లబ్’లో 90 శాతం మంది అథ్లెటిక్స్ ఇప్పుడు ఈ షూస్నే వాడుతున్నారని మిడిల్ డిస్టెన్స్ రన్నర్ ఓవెన్ హింద్ తెలిపారు. బూట్లకు స్ప్రింగ్ యాక్షన్ ఉండడం వల్ల అడుగు దూరంగా పడడంతో ఎక్కువ దూరం ఎక్కువ ప్రయాసం లేకుండా పరుగెత్తవచ్చని ఆయన తెలిపారు. ఒక తెలుపు రంగులోనే కాకుండా రకరకాల రంగుల్లో ఇవి లభిస్తుండడం వల్ల కూడా అథ్లెటిక్స్ను, రన్నర్లకు ఈ షూస్ ఎక్కువ ఆకర్షిస్తున్నాయి. ధర తెలిస్తే మాత్రం కాళ్లు వణకడం ఖాయం. కనీస ధర 240 పౌండ్లు (దాదాపు 22 వేల రూపాయలు)గా ఉంది. -
ఓట్ల పండగ.. ఇక స్మార్ట్ గురూ..!
సాక్షి, శ్రీకాకుళం: ఈ దఫా సార్వత్రిక ఎన్నికలు ఆధునిక టెక్నాలజీతో జరగనున్నాయి. ఓటరు సౌలభ్యం కోసం ఎన్నికల కమిషన్ చాలా రకాల యాప్లను అందుబాటులో తీసుకువచ్చింది. ఓటు నమోదు, నమోదైన ఓటు ఉందో లేదో తెలుసుకోవడం, ఫిర్యాదు చేయడం, ఎన్నికల నియమావళిపై ప్రజల నిఘా, ఇలా పలు అంశాల్లో యాప్లను రూపొందించారు. కేవలం అండ్రాయిడ్ మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ సదుపాయం ఉంటే ఎవరైనా ఇంటి దగ్గర నుంచి కానీ, ఆఫీస్ నుంచి కానీ ఎక్కడి నుంచైనా దరఖాస్తు, ఫిర్యాదు, సమాచారం ఇచ్చే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ కల్పించింది. ‘నా ఓటు’, ఓటరు సర్వీస్, సమాధాన్, సి విజల్, సుగం, వీవీప్యాట్ వంటి యాప్లను ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ యాప్లను సెల్ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని ఈ సదుపాయాలు పొందవచ్చు. ఓటర్ సర్వీస్ పోర్టల్ ఓటు నమోదు కోసం నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ యాప్ను ఎన్నికల కమిషన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇంటిలో ఉండే ఓటు నమోదు చేసుకోవచ్చు. ఈ సర్వీసు పోర్టల్ యాప్లో మన ఓటు ఏ స్థితిలో ఉందో తెలుసుకోవచ్చు. అధికారులు ధ్రువీకరించిన తరువాత గుర్తింపు కార్డును సర్వీస్ పోర్టల్ నుంచి పొందవచ్చు. దీని వల్ల ఓటు నమోదు కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. సీ విజల్ పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యలు, ఎన్నికల నియమావళి ఉల్లంఘన వంటి అంశాలపై ఫిర్యాదు చేయాలంటే ఇంతవరకు నేరుగా అధికారులను కలిసి తెలియజేయాల్సి వచ్చేది. అయితే ఈ ఎన్నికల కమిషన్ రూపొం దించిన సీ విజల్ యాప్ ద్వారా ఉన్నచోట నుంచే ఫిర్యాదు చేయవచ్చు. దీనికి కావాల్సిన ఆధారాలు, ఫొటోలు కూడా అప్పుడే అప్లోడ్ చేయవచ్చు. దీంతో ఆ ఫిర్యాదు అ«ధికారులకు వెంటనే చేరుతుంది. దీని నిర్వహణకు కలెక్టరేట్లో ఒక సెల్ కూడా నిర్వహిస్తారు. ఫిర్యాదులపై వెంటవెంటనే చర్యలు కూడా ఉంటాయి. ‘నా ఓటు’ ఓటరు సెర్చ్ ఆప్షన్లో రిజిస్ట్రేషన్ వివరాలు ఎంటర్ చేస్తే, తొలుత మనకు సంబంధించిన ఓటరు గుర్తింపు నంబర్ వస్తుంది. నియోజకవర్గం పేరు. పోలింగ్ స్టేషన్ వివరాలు వస్తాయి. ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఎన్నికల షెడ్యూల్ వివరాలు, పోలింగ్ స్టేషన్కు వెళ్లేందుకు మార్గం, తదితర వివరాలు వస్తాయి. సెర్చిలోకి వెళ్లి ఎపిక్ నంబర్ టైప్ చేస్తే దారి చూపుతుంది. దివ్యాంగులకు వాహనాలు కావాలన్నా ఆ యాప్లో కోరుకోవచ్చు. సమాధాన్ యాప్ ఎన్నికల సమయంలో ఓటరు సందేహాల నివృత్తికి ఆర్డీవో (ఆర్వో), కలెక్టరేట్ (జిల్లా ఎన్నికల అ«ధికారి)లలో టోల్ ఫ్రీ నంబర్ 1950ను అందుబాటులో ఉంచారు. నేరుగా ఫోన్ చేయడం, ఈమెయిల్, ఎస్ఎంఎస్, ఫ్యాక్స్, తపాలా ద్వారా ఫిర్యాదు, సమాచారం తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ కార్యక్రమంలో ఇంటి దగ్గర నుంచి ఫోన్ ద్వారా సందేహలు నివృత్తి చేసుకోవచ్చు. ప్రతి ఫిర్యాదుకు సమాచారం అందుతుంది. సువిధ యాప్ ఎన్నికల్లో పోటీ చేయదలచుకున్న అభ్యర్థులు పలు రకాల ప్రచార కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొనాల్సి ఉంటుంది. దీనికి గాను అధి కారుల అనుమతి తప్పనిసరి. మాటిమాటికీ కార్యాలయాలకు వెళ్లకుండా ఈ యాప్ ద్వారా వారు పలు అనుమతులు తీసుకోవచ్చు. సుగం యాప్ ఎన్నికల సమయంలో పోటీలో ఉన్న అభ్యర్థుల ప్రచార నిర్వహణకు వినియోగించే వాహనాలను నియంత్రించడానికి రూపొందించిందే సుగం యాప్. ప్రచారం కోసం అభ్యర్థులు, పార్టీలు పోలింగ్ సందర్భంగా అధికారులు వినియోగించే వాహనాల రాకపోకల వివరాలన్నీ ఈ యాప్లో నమోదవుతాయి. ఆ వాహనాల్లో ఉన్నవారి వివరాలు, డ్రైవర్ల వివరాలు కూడా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో ఓటర్లు జాబితా సరిచూసుకునే యాప్ను కూడా పొందుపరిచారు. ఏదైనా ఒక ప్రాంతంలో ఓటు హక్కును కల్పించేందుకు ఈఆర్వో నెట్. 20 వెర్షన్ సాఫ్ట్ వేర్ను ఎన్నికల సంఘం ప్రవేశ పెట్టింది. ముందుగా ఈ సాఫ్ట్వేర్ను పట్టణ ప్రాంతాల ఓటరు జాబితాలో ఉపయోగించి ఒకే వ్యక్తి పేరిట రెండు ఓట్లు ఉంటే సంబంధిత ఓటరుకు కౌన్సెలింగ్ ఇచ్చి ఒక ఓటును తొలగిస్తారు. -
స్మార్ట్ ఫీచర్లతో జియో ఫోన్ 3
సాక్షి, ముంబై: ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ప్రవేశం టెలికం మార్కెట్లో విధ్వంసక మార్పులకు తెరతీసింది. అలాగే జియో ఫోన్ పేరుతో ఫీచర్ల ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చి, బడ్జెట్ ధరలో సామాన్యులకు మొబైల్ సేవలను మరింత దగ్గర చేసింది. తద్వారా ఫీచర్ఫోన్ మార్కెట్ను కొల్లగొట్టింది. ఇపుడు స్మార్ట్ ఫీచర్లతో అందుబాటులో ధరలో స్మార్ట్ఫోన్ తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో జియో ఫోన్ 3 పై అంచనాలు మార్కెట్లో హాట్ టాపిక్గా నిలిచాయి. మరికొన్ని నెలల్లో రిలయన్స్ వార్షిక సమావేశం జరగనున్న నేపథ్యంలో జియోఫోన్ 3 ఆవిష్కరణపై పలు ఊహాగానాలు హల్చల్ చేస్తున్నాయి. 5 అంగుళాల టచ్ స్క్రీన్తో, పవర్ఫుల్ సాఫ్ట్వేర్ సహాయంతో చాలా స్మార్ట్గా జియో ఫోన్ 3ని ఆవిష్కరించనుంది. ఆండ్రాయిడ్ గో ఆధారితంగా 2జీబీ ర్యామ్, 64 స్టోరేజ్ సామర్ధ్యంతో ఈ స్మార్ట్ఫోన్ను తీసుకు రానుందట. అంతేకాదు 5 ఎంపీ రియర్ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరాను పొందుపరచినట్టు తెలుస్తోంది. ఇక జియో ఫోన్ 3 ధర విషయానికి వస్తే రూ. 4500 అందించనుందని అంచనా. ఈ ఏడాది జూన్లో జరిగే రిలయన్స్ జియో వార్షిక సమావేశంలో జియో ఫోన్ 3 స్మార్ట్గా వినియోగదారులను పలకరించనుంది. -
స్మార్ట్ బస్సులు వచ్చేశాయి!?
ఇప్పటివరకూ కలలు కంటున్న స్మార్ట్/సెల్ఫ్ డ్రైవింగ్ బస్సులు ప్రజలకు అందుబాటులోకి వచ్చేశాయి. పూర్తి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ బస్సులు శనివారం ఉదయం నుంచి చైనాలోని షెన్జెన్ సిటీలో పరుగులు తీస్తున్నాయి. అత్యంత ఆధునాతన నగరమైన షెన్జెన్లో దాదాపు 70 శాతం ఐటీ సంస్థలున్నాయి. ఐటీ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల కొసం ఈ స్మార్ట్ బస్సులును అధికారులు ప్రవేశపెట్టారు. రెండు కిలోమీటర్ల పరిధిలో.. ఈ బస్సులు ప్రయాణిస్తాయి. స్మార్ట్ బస్సులు.. కనిష్టంగా 10 కి.మీ. గరిష్టంగా 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. స్మార్ట్ బస్సులకు జీపీఎస్ ఆంటెన్నా, హై రెజ్యుల్యూషన్తో కూడిన హెచ్డీ కెమెరాను ఏర్పాటు చేశారు. ఆటో సెన్సార్ టెక్నాలజీ ద్వారా పాదచారులను ఈ బస్సు ఢీ కొట్టే అవకాశం లేదని తెలుస్తోంది. ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడితే.. బస్సులో ఉండే డ్రైవర్.. స్మార్ట్ నుంచి మ్యాన్యువల్ డ్రైవింగ్కు మార్చి బస్సును నడిపిస్తాడు. ఈ స్మార్ట్ బస్సులను షెంజెన్ ఇంజినీరింగ్ టెక్నాలజీ గ్రూప్ రూపోందించడం విశేషం. -
సిటీ బస్.. ఇక స్మార్ట్
సాక్షి, హైదరాబాద్: సిటీ బస్సు ఇక స్మార్ట్గా మారనుంది. ఏ బస్సు ఎక్కడ ఉందో, ఎంత సేపట్లో బస్టాపునకు చేరుకుంటుందో తెలిపే సాంకేతిక పరిజ్ఞానం మన అరచేతుల్లో నిక్షిప్తం కానుంది. ఇందుకోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన వెహికల్ ట్రాకింగ్ అండ్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(వీటీపీఐఎస్)తో సిటీ బస్సులను అనుసంధానించనున్నారు. బస్సుల రాకపోకల్లో వేగాన్ని, నాణ్యతను, పారదర్శకతను పెంచేం దుకు అనుగుణంగా రూపొందించిన ఈ పరిజ్ఞానాన్ని ఫ్రాన్స్ మనకు అందజేయనుంది. ఈ మేరకు శనివారం బస్భవన్లో ఫ్రాన్స్ రాయబారి అలెగ్జాండర్ నేతృత్వంలోని ప్రతి నిధుల బృందంతో రవాణా శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. రవాణా మంత్రి మహేందర్రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్శర్మ, ఆర్టీసీ ఎండీ రమణారావు ఫ్రాన్స్ బృందంతో సంప్రదింపులు జరిపారు. పూర్తిగా ఫ్రాన్స్ ఆర్థిక సాయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును వచ్చే 9 నెలల్లో 2 రూట్లలో మూడు దఫాలుగా ప్రయోగాత్మకంగా అమలు చేస్తారు. ఈ ఫలితాలను బట్టి అన్ని రూట్లకు, అన్ని బస్సులకు జీపీఎస్ ఆధారిత వెహికల్ ట్రాకింగ్ వ్యవస్థను అనుసంధానం చేస్తారు. వీటీపీఐఎస్ను సమర్థంగా అమలు చేసేందుకు ప్రతి బస్సు ట్రాకింగ్ను ప్రయాణికులకు అందుబాటులో ఉంచేందుకు ఒక ప్రత్యేక మొబైల్ యాప్ను కూడా రూపొందించనున్నారు. ఈ యాప్ ద్వారా బస్సు జాడ తెలుసుకున్న ప్రయాణికులు తమ రాకపోకల్లో అంతరాయాలను అధిగమించేందుకు అవకాశం లభించనుంది. రెండు మార్గాల్లో ప్రయోగాత్మకం.. ఫ్రాన్స్కు చెందిన లుమిప్లాన్, ఇక్సి అనే సంస్థలు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశాయి. ప్రస్తుతం ఫ్రాన్స్లోని ప్రజారవాణా వ్యవస్థ మొత్తాన్ని ఈ వీటీపీఐఎస్ వ్యవస్థతో అనుసంధానం చేశారు. పారిస్లో తిరిగే రైళ్లు, బస్సులను ఈ పరిజ్ఞానంతో అనుసంధానించారు. ఈ సంస్థల సహకారంతోనే హైదరాబాద్లో వీటీపీఐఎస్ అమలు చేస్తారు. లుమి ప్లాన్, ఇక్సి సంస్థల ప్రతినిధులు గత నెలలోనే రెండు రూట్లను ఎంపిక చేశారు. సికింద్రాబాద్ నుంచి వారాసిగూడ మీదుగా కోఠీ వరకు రాకపోకలు సాగించే 86 రూట్లో 17 బస్సులు, సికింద్రాబాద్ నుంచి అశోక్నగర్ మీదుగా నడిచే 40వ రూట్లో 22 బస్సులకు వచ్చే నెల నుంచి జీపీఎస్ ఆధారిత వీటీపీఐఎస్ను అమలు చేయనున్నారు. ఈ 2 మార్గాల్లోని బస్టాపులను జియోఫెన్సింగ్ చేశారు. రూట్ మ్యాప్లను సేకరించారు. టికెట్ ఇష్యూ మిషన్స్(టీమ్స్) సహాయంతో ట్రిప్పులు, సమయపాలన వివరాలు సేకరించారు. త్వరలో కొత్త టెక్నాలజీని అమలు చేయనున్నారు. బస్భవన్లో కేంద్రీకృత వ్యవస్థ.. ఈ సాంకేతిక పరిజ్ఞానం అమలు కోసం ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్భవన్లో తాజాగా ఒక కేంద్రీకృత వ్యవస్థను, సోలార్ పవర్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీంతో ఏ బస్సు ఎక్కడ ఉందో బస్భవన్ నుంచే పర్యవేక్షించే అవకాశం లభిస్తుంది. ఈ పైలట్ ప్రాజెక్టు దశలో 4 సోలార్ పవర్ డిస్ప్లేలను కూడా ఏర్పాటు చేస్తారు. అలాగే ఎంపిక చేసిన రెండు రూట్లలోని అన్ని బస్సులకు ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేస్తారు. ప్రజారవాణా బలోపేతం: మహేందర్రెడ్డి ఫ్రాన్స్ అధికారులతో ఒప్పందంపై మంత్రి మహేందర్రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ నుంచి ఒక్క రూపాయి కూడా వెచ్చించకుండా పూర్తిగా ఫ్రాన్స్ ఆర్థిక, సాంకేతిక సహాయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు వల్ల నగరంలో ప్రజారవాణా వ్యవస్థ బలపడుతుందన్నారు. ఏ బస్సు ఎక్కడ ఉందో తెలుసుకునే అవకాశం లభించడం వల్ల ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎదురుచూపులు లేకుండా పయనిస్తారన్నారు. టీఎస్ఆర్టీసీ ఇంటలెక్చువల్ ఐటీ సొల్యూషన్స్ కింద ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. ఫ్రాన్స్ రాయబారి అలెగ్జాండర్ మాట్లాడుతూ.. రవాణా రంగంలో సమయం ఎంతో విలువైందని, ఈ విధానం అమలుతో ప్రయాణికులకు సకాలంలో ఆర్టీసీ సేవలు లభిస్తాయని చెప్పారు. ఆర్టీసీ సేవల విస్తరణ, కచ్చితమైన సమాచారం కోసం ఈ ప్రాజెక్టును ఎంపిక చేసినట్లు చైర్మెన్ సత్యనారాయణ తెలిపారు. సోలార్ డిస్ప్లే బోర్డుల వల్ల ప్రయాణికులను ఎప్పటికప్పుడు బస్సుల సమాచారం లభిస్తుందని ఎండీ రమణారావు తెలిపారు. ఈ సందర్భంగా బస్భవన్లో ఏర్పాటు చేసిన సోలార్ ఆధారిత ఎలక్ట్రానిక్ డిస్ప్లే పనితీరును అధికారులు పరిశీలించారు. -
స్మార్ట్’ ఆఫర్
పైపులైన్ గ్యాస్ మూడు నెలలు ఉచితం సెక్యూరిటీ డిపాజిట్ లేకుండానే కనెక్షన్లు తొలి ఐదువేల కనెక్షన్లకే ఈ అవకాశం కాకినాడ: ‘జియో’ లాగే ఇప్పుడు ‘గ్యాస్’కు కూడా ఓ ఆఫర్ వచ్చింది. పైపులైన్ గ్యాస్ కనెక్షన్ వేయించుకుంటే మూడు నెలలపాటు ఉచితంగా ‘గ్యాస్’ వాడుకునే అవకాశాన్ని భాగ్యనగర్ గ్యాస్ సంస్థ స్మార్ట్ సిటీ కాకినాడ వాసులకు కల్పించింది. ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్ లేకుండానే కనెక్షన్ ఇస్తామంటూ ముందుకు రావడంతో ఈ కొత్త ‘ఆఫర్’ అందుబాటులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే... స్మార్ట్సిటీ కాకినాడలో రామారావుపేట, గాంధీనగర్ ప్రాంతాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఈ ప్రాంతంలోని ప్రతీ ఇంటికి పైపులైన్ గ్యాస్, పైబర్ గ్రిడ్ కనెక్షన్, సోలార్ లైట్స్, ప్రతి ఇంటికీ సౌర విద్యుత్ ప్లాంట్లు, ఇంటింటికీ చెత్త సేకరణ వంటి అన్ని సదుపాయాలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ఇక్కడ విజయం సాధించాక దశలవారీగా మిగిలిన ప్రాంతాలకు విస్తరించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన రామారావుపేట, గాంధీనగర్ ప్రాంతాల్లో 4,700 కనెక్షన్లు ఇవ్వాలని అంచనా వేశారు. ప్రధానంగా పైపులైన్ ద్వారా గ్యాస్ వేసేందుకు భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ సంస్థ రూ.ఐదువేలు సెక్యూరిటీ డిపాజిట్గా నిర్ధేశించి, తొలుత రూ.వెయ్యి స్వీకరించి మిగిలిన సొమ్మును ఎనిమిది వాయిదాల్లో చెల్లించేలా వెసులుబాటు కల్పించింది. అయితే ప్రజల నుంచి మిశ్రమ స్పందన రావడంతో కమిషనర్ అలీమ్భాషా, డిప్యూటీ కమిషనర్ కె.రమేష్కుమార్ భాగ్యనగర్ గ్యాస్ సంస్థతో చర్చలు జరిపారు. చర్చలు అనంతరం తొలి పదివేల కనెక్షన్లను ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్ లేకుండానే ఇచ్చేలా సంస్థ యాజమాన్యం ఆమోదం తెలిపింది. దీంతోపాటు మొదటి మూడు నెలలు గ్యాస్ను ఉచితంగా అందించేందుకు కూడా సంస్థ అంగీకరించడంతో నగరంలో పెద్ద ఎత్తున పైపులైన్ గ్యాస్ కనెక్షన్లు వచ్చే అవకాశం ఉందని కార్పొరేషన్ అధికారులు భావిస్తున్నారు. . తొలి దరఖాస్తులకు ప్రాధాన్యం... సెక్యూరిటీ డిపాజిట్ లేకుండా మూడు నెలలు ఉచితంగా గ్యాస్ పొందేందుకు తొలుత వచ్చే దరఖాస్తులకే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే కాకినాడలో 4,800 వరకు దరఖాస్తులు వచ్చినట్టు కార్పొరేషన్ వర్గాల సమాచారం. పదివేల కనెక్షన్లు వరకు రాయితీ అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ముందుగా వచ్చే 5,200 కనెక్షన్లకు ప్రాధాన్యతనిచ్చి ఈ వెసులుబాటును అందివ్వనున్నారు. ఇందుకోసం కార్పొరేషన్ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు ద్వారా ఇంటింటికీ ప్రచారం చేయాలని నిర్ణయించారు. . సద్వినియోగం చేసుకోవాలి... భాగ్యనగర్ గ్యాస్ సంస్థ మంచి అవకాశం కల్పించింది. దీన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలి. ప్రస్తుతం వినియోగిస్తున్న ఎల్పీజీ సిలెండర్తో పోలిస్తే పైపులైన్ గ్యాస్ ధర తక్కువ, సురక్షితం. వచ్చే డిసెంబర్ చివరినాటికి నగరంలో 20 వేల పైపులైన్ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. -
స్మార్ట్ ... పిటీ
కాకినాడ స్మార్ట్ సిటీలో పడని అభివృద్ధి అడుగులు సమస్యలతో సహవాసం చేస్తున్న ప్రజలు ప్రతిపాదననలకే పరిమితమైన రూ.1993 కోట్లు తొలి విడతగా విడుదలైన రూ. 378 కోట్లు నమూనాలు...టెండర్ల దశలోనే పనులు . అమరావతి ... రాజధాని ... ప్రపంచంలోనే అత్యద్భుతం ... కళ్ల ముందు ఊహా చిత్రాలు ఓ వైపు రాష్ట్ర ప్రజల ముందు ఒయ్యారాలు ఒలకబోస్తుంటే ... ఇంకోవైపు స్మార్ట్ సీటీల పేరుతో నగర ప్రజలను ఊరిస్తున్నాయి. అదిగో నవలోకం అంటూ రెండేళ్ల నుంచి ఆశలు ఆకాశంలో విహరిస్తున్నా ఆచరణలో మాత్రం చిన్న చిగురు కూడా కనిపించడం లేదేమిటంటూ జనం ప్రశ్నిస్తున్నారు. వందల కోట్ల రూపాయల కుమ్మరింపు సంఖ్యలు పుంఖానుపుంఖాలుగా అధికారులు చెబుతున్నారు గానీ విడుదల్లో ఆ స్పీడు కనిపించకపోవడంతో ఇదేమి ‘స్మార్ట్’రా బాబూ అని తలలు పట్టుకుంటున్నారు నగర వాసులు. . ప్రకటన: కాకినాడ నగరాన్ని స్మార్ట్ సిటీగా చేస్తామని 2016 జూన్లో... - నిధుల ఆశల విహారం: రూ.1993 కోట్లతో ప్రతిపాదనలు కూడా రూపొందించారు. - విడుదల: దీనిలో భాగంగా మొదటి విడతగా రూ. 378 కోట్లు... - హడావుడి ఇలా: స్మార్ట్సిటీ నమూనాలు, మార్గదర్శకాల తయారీ పేరుతో పెద్ద ఎత్తునే హడావుడి చేశారు. - ఎలా అంటే...: రూ. 307 కోట్లతో సీనరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, రూ. 80 కోట్లతో స్మార్ట్ రోడ్డు నిర్మాణం, రూ.75 కోట్లతో డ్రైనేజీ వ్యవస్థ, రూ.50 కోట్లతో స్మార్ట్ బస్ టెర్మినళ్లు, రూ.40 కోట్లతో మాల్స్, మల్టీ ప్లెక్స్, రూ. 40 కోట్లతో భవనాలపై సోలార్ వ్యవస్థ, \రూ. 30.46 కోట్లతో గోదావరి కళాక్షేత్రం, రూ. 30 కోట్లతో నీటి సరఫరా, రూ. 10 కోట్లతో పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, రూ. 7.4 కోట్లతో మార్కెట్ల అభివృద్ధి, రూ.6 కోట్లతో ప్రతాప్నగర్ వంతెన తదితర అభివృద్ధి చేపడుతున్నట్టు ఊరించారు - వామ్మో: దీంతో కాకినాడ దశ దిశ మారిపోతుందని ప్రజలు కూడా భావించారు. నగరం స్వరూపమే మారిపోతుందని ఆశించారు. కానీ ప్రజల ఆశలు కలలుగానే మిగిలిపోతున్నాయి. . సాక్షి ప్రతినిధి, కాకినాడ: పేరు గొప్ప ఊరు దిబ్బలా ఉంది కాకినాడ పరిస్థితి. ప్లానింగ్ సిటీ అని, పెన్షనర్స్ ప్యారడైజ్ అని గొప్పగా చెప్పుకునే కాకినాడ పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా మారింది. ఎక్కడికక్కడ పేరుకుపోతున్న చెత్త ... పట్టణమంతా అపారిశుద్ధ్య పరిస్థితులు... మురుగునీటి ముంపునకు గురవుతున్న కాలనీలు...దోమలతో నరకయాతన...పందుల స్వైర విహారం...చెలరేగిపోతున్న గ్రామ సింహాలు...గోతులమయమైన రోడ్లు...ప్రమాదాలకు గురవుతున్న వాహన చోదకులు... కాకినాడ నగరంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా కనిపిస్తున్న దృశ్యాలివీ. స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని ఏడాదిన్నర క్రితం ప్రకటించారు. రూ. 1993 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. రాష్ట్ర రాజధాని మాదిరిగా నమూనాలతో ప్రజల్ని ఊహల్లో ఊరేగించారు. కానీ ఇంతవరకూ అభివృద్ధి అడుగులు వేయలేదు. టెండర్ల పేరుతోనే కాలయాపన చేస్తున్నారు. కనీసం పారిశుద్ధ్య పరిస్థితుల్ని మెరుగుపర్చలేకపోయారు. ఇప్పుడు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. స్మార్ట్ సిటీ మాటేమోగానీ దోమలు, పందుల్లేకుండా చెయ్యండి మొర్రో అని పట్టణ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అక్కడా, ఇక్కడా అని తేడా లేకుండా నగరమంతా ఇదే పరిస్థితి నెలకుంది. మంత్రులు, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు నిత్యం నడియాడే కాకినాడలోనే ఈ పరిస్థితి ఉందంటే జిల్లాలో మిగతాచోట్ల ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇవన్నీ పక్కన పెడితే కాకినాడను స్మార్ట్ సిటీగా తీర్చుదిద్దుతామని పాలకులు తెగ ప్రచారమిచ్చారు. ఆచరణలో వారి ఆ పనితనం కనిపించడం లేదు. . ఊరింపు ఇలా... కాకినాడ నగరాన్ని స్మార్ట్ సిటీగా చేస్తామని 2016 జూన్లో ప్రకటించారు. రూ.1993 కోట్లతో ప్రతిపాదనలు కూడా రూపొందించారు. దీనిలో భాగంగా మొదటి విడతగా రూ. 378 కోట్లు విడుదలయ్యాయి. స్మార్ట్సిటీ నమూనాలు, మార్గదర్శకాల తయారీ పేరుతో పెద్ద ఎత్తునే హడావుడి చేశారు. రూ. 307 కోట్లతో సీనరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, రూ. 80 కోట్లతో స్మార్ట్ రోడ్డు నిర్మాణం, రూ.75 కోట్లతో డ్రైనేజీ వ్యవస్థ, రూ.50 కోట్లతో స్మార్ట్ బస్ టెర్మినళ్లు, రూ.40 కోట్లతో మాల్స్, మల్టీ ప్లెక్స్, రూ. 40 కోట్లతో భవనాలపై సోలార్ వ్యవస్థ, \ రూ. 30.46 కోట్లతో గోదావరి కళాక్షేత్రం, రూ. 30 కోట్లతో నీటి సరఫరా, రూ. 10 కోట్లతో పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, రూ. 7.4 కోట్లతో మార్కెట్ల అభివృద్ధి, రూ.6 కోట్లతో ప్రతాప్నగర్ వంతెన తదితర అభివృద్ధి చేపడుతున్నట్టు ప్రకటించారు. ఏరియా బేస్డ్ డెవలప్మెంట్ పేరుతో కాకినాడలో ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో తొలి విడద అభివృద్ధి పనులకు ప్రణాళికలు రచించారు. దీంతో కాకినాడ దశ దిశ మారిపోతుందని ప్రజలు కూడా భావించారు. నగరం స్వరూపమే మారిపోతుందని ఆశించారు. కానీ ప్రజల ఆశలు కలలుగానే మిగిలిపోతున్నాయి. అభివృద్ధి పనులేవీ కార్యరూపం దాల్చలేదు. ఎప్పడు అడిగినా టెండర్ల దశలో ఉన్నాయని అధికారులు సెలవిస్తున్నారు. ఈలోపు నగరంలో సమస్యలు ఎక్కువైపోతున్నాయి. పరిష్కారం కాదు కదా ఇబ్బందులు మరింత పెరుగుతున్నాయి. అపారిశుద్ధ్య పరిస్థితుల మధ్య పెరిగిన దోమలతో ఎటువంటి వ్యాధులు వస్తాయోనన్న భయం ప్రజలకు పట్టుకుంది. ముఖ్యంగా వర్షాలు పడుతుండటంతో సీజనల్ వ్యాధులు ఎవరి కొంప ముంచుతాయోనన్న ఆందోళన నెలకుంది. -
పెండింగ్ ప్రజాసాధికార సర్వేకు చర్యలు
జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ భూపరిపాలన శాఖ ముఖ్య కమిషనర్తో వీడియో కాన్ఫరెన్స్ కాకినాడ సిటీ : జిల్లా వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న లక్షా 30 వేల మంది ప్రజాసాధికార సర్వేకు చర్యలు చేపట్టామని జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ తెలిపారు. రాష్ట్ర భూపరిపాలనశాఖ ముఖ్య కమిషనర్ అనిల్చంద్ర పునేట విజయవాడ నుంచి బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు జేసీ కలెక్టరేట్ నుంచి హాజరయ్యారు. వివిధ అంశాలపై జిల్లాలో చేపట్టిన ప్రగతి, చేపట్టిన చర్యలను జేసీ వివరించారు. ఈ సందర్భంగా సీసీఎల్ఏ అనిల్ చంద్ర మాట్లాడుతూ రెవెన్యూ శాఖను సాంకేతికంగా ముందుకు తీసుకువెళ్లడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డిప్యూటి తహసీల్దార్ నుంచి ఆఫీస్ సబార్డినేట్ వరకూ ప్రతిఒక్కరూ కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలన్నారు. కైజాలా మొబైల్ యాప్ను అందరూ డౌన్లోడ్ చేసుకుని వినియోగించాలని సూచించారు. పెండింగ్ లేకుండా మీసేవ అర్జీలను సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు. విద్యార్థులకు అవసరమైన సర్టిఫికెట్ల జారీకి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డిప్యూటీ తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్ల ప్యానల్ను తయారు చేసి వెంటనే పంపాలని సూచించారు. జిల్లాకు మంజూరైన తహసీల్దార్ కార్యాలయ భవనాల నిర్మాణ పనులను ప్రారంభిచాలని ఆదేశించారు. ఈసమావేశంలో జాయింట్ కలెక్టర్–2 జె.రాధాకృష్ణమూర్తి, సర్వే శాఖ ఏడీ నూతనకుమార్, కలెక్టరేట్ ఏవో తేజేశ్వరరావు పాల్గొన్నారు. -
సర్వే ప్రక్రియ నెలాఖరు నాటికి పూర్తి కావాలి
వీడియోకాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి కాకినాడ సిటీ : ప్రజాసాధికార సర్వే ప్రక్రియ ఈకేవైసీతో సహా ఈ నెలాఖరుకు పూర్తి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు గురువారం విజయవాడ సెంట్రల్ కంట్రోల్ అండ్ కమాండ సెంటర్ నుంచి జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజాసాధికార సర్వే పురోగతిపై సమీక్షించి సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. జిల్లా నుంచి కాన్ఫరెన్స్లో పాల్గొన్న కలెక్టర్ అరుణ్కుమార్ సర్వే ప్రగతిని వివరించారు. జిల్లా ప్రొజెక్టెడ్ జనాభా 52 లక్షలకు గాను 43 లక్షల జనాభా సర్వే పూర్తి చేశామన్నారు. ఇప్పటి వరకు 16 లక్షల 93 కుటుంబాల సర్వే పూర్తయ్యిందని, ఏజన్సీ మండలాలతో పాటు మైదానప్రాంతాల్లో డోర్లాక్డ్, తాత్కాలిక వలస వెళ్లిన దాదాపు లక్షా 94 కుటుంబాల సర్వే ఇంకా మిగిలి ఉందన్నారు. మైదాన ప్రాంత సర్వేను ఈ నెలాఖరుకు, ఏజన్సీ మండలాల్లో సర్వేను డిసెంబర్ ఐదో తేదీ నాటికి పూర్తి చేస్తామన్నారు. ఏజెన్సీ మండలాల్లో జనావాసాలు దూరందూరంగా ఉండటం వల్ల సర్వే ఆలస్యమవుతోందని, దీనిని అధిగమించేందుకు సర్వే బ్లాకులను మరింత విభజించి ఎక్కువ సంఖ్యలో ఎన్యూమరేటర్లను, ట్యాబ్లను రంగంలోకి దించుతామన్నారు. పట్టణ ప్రాంత ప్రజాసాధికార సర్వేలో 76 శాతం పురోగతితో జిల్లా అగ్రస్థానంలో ఉందని, 69 శాతంతో వెనుకబడిన పిఠాపురం మున్సిపాలిటీ మినహా మిగిలిన అన్ని మున్సిపాలిటీలలో సర్వే ముమ్మరంగా సాగుతోందన్నారు. సమావేశంలో జేసీ సత్యనారాయణ, జేసీ–2 జె.రాధాకృష్ణమూర్తి, డీపీవో టీవీఎస్ గంగాధరకుమార్, డిఆర్డిఏ పీడీ ఎస్.మల్లిబాబు, ఎన్ఐసి సీనియర్ సైంటిస్ సయ్యద్ ఉస్మాన్, సెక్షన్ అధికారి రామ్మోహనరావు, రామ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కోర్టు ఆదేశాలతో ‘స్మార్ట్సిటీ’పై కదలిక
పీఎంసీ నియామకం కోసం కసరత్తు ∙ వాడియా, ఆర్వీ కన్సల్టెంట్లతో చర్చలు కాకినాడ : కోర్టు ఆదేశాలతో నిలిచిపోయిన కాకినాడ స్మార్ట్సిటీ ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ(పీఎంసీ) నియామకంపై మళ్ళీ కదలిక వచ్చింది. పీఎంసీ కోసం ఆర్వీ కన్సల్టెంట్స్, వాడియా సంస్థలు తీవ్రంగా పోటీపడి చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కొద్దినెలలుగా ప్రతిష్టం బన నెలకొంది. స్మార్ట్సిటీలో చేపట్టే అభివృద్ధి పనులకు సంబంధించి ప్రాజెక్టు నివేదికలు, పనుల పర్యవేక్షణ సహా అన్ని అంశాలను పర్యవేక్షించేందుకు గతంలో టెండర్లు పిలిచారు. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని చివరకు ఆర్వీ కన్సల్టెంట్స్ను పీఎంసీకి ఎంపిక చేయాలని స్మార్ట్సిటీ కార్పొరేష¯ŒS ఎవాల్యూష¯ŒS కమిటీ నిర్ధారణకు వచ్చింది. వీరితో పోటీపడ్డ వాడియా సంస్థ ఆర్వీ కన్సల్టెంట్స్ ఆర్హతలను ప్రశ్నిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఎంపిక ప్రక్రియను నిలిపివేయాల్సిందిగా న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. కేసును పరిశీలించిన న్యాయస్థానం ఇరు సంస్థలతోనూ ఎవాల్యూష¯ŒS కమిటీ సమావేశమై చర్చలు ద్వారా పరిష్కరించాలని ఆదేశించింది. ఈ నేపథ్యలో శుక్రవారం స్మార్ట్సిటీ కార్పొరేష¯ŒS ఎండీ, కమిషనర్ అలీమబాషా సమక్షంలో ఇందుకు సంబంధించి ఇరు సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆయా సంస్థల వాదనలు విన్నారు. అనంతరం కమిషనర్ అలీమ్బాషా నగరపాలక సంస్థ అధికారులతోనూ సమావేశమై తదుపరి చర్యలపై సమీక్షించారు. ఎంపిక ప్రక్రియపై రాత్రి వరకూ అధికారులు ఓ నిర్ణయానికి రాలేదు. దీనిపై అధికారులు తుది నిర్ణయం తీసుకుని పీఎంసీ కోసం సంస్థను ఎంపిక చేస్తే స్మార్ట్సిటీ పనులను వేగవంతమయ్యే అవకాశం కనిపిస్తోంది. -
స్మార్ట్ మీటర్లు వచ్చేస్తున్నాయ్!
సాక్షి, హైదరాబాద్: స్మార్ట్ కరెంటు మీటర్లు వచ్చేస్తున్నాయి. స్మార్ట్గ్రిడ్ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా వాటిని బిగించే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామికవాడ పరిధిలో పరిశ్రమలు, గృహాలకు వీటిని ఏర్పాటు చేయనుంది. రూ.41.82 కోట్ల అంచనా వ్యయంతో జీడిమెట్ల పారిశ్రామికవాడలో చేపట్టేందుకు ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)తో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు వ్యయంలో 50% నిధులను కేంద్రం భరించనుంది. జీడిమెట్ల పారిశ్రామికవాడలోని 12,880 గృహాలు, పరిశ్రమలకు 2017 సెప్టెంబర్ 17లోగా ఈసీఐఎల్ స్మార్ట్ మీటర్లను బిగించాల్సి ఉంది. స్మార్ట్ మీటర్లు విద్యుత్ వినియోగదారులు, డిస్కంలకు ఉభయ ప్రయోజనకారిగా పనిచేయనున్నాయి. విద్యుత్ పంపిణీ నష్టాలను తగ్గించుకోడానికి డిస్కంలకు అవకాశం లభించనుంది. వినియోగదారులు సెల్ఫోన్ ద్వారా ఎక్కడి నుంచైనాఎస్ఎంఎస్ను తమ ఇంట్లోని స్మార్ట్ మీటర్కు పంపించి ఇంట్లో విద్యుత్ వినియోగాన్ని నియంత్రించేందుకు వీలుకలగనుంది. స్మార్ట్ఫోన్ తరహాలోనే ఈ స్మార్ట్మీటర్ పనిచేయనుంది. ఇందులో ఓ సిమ్కార్డుతోపాటు ఎల్సీడీ డిస్ప్లే బోర్డు ఉంటుంది. ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా పనిచేసే ఈ మీటర్లను ఒక ఎస్ఎంఎస్ ద్వారా షట్డౌన్ చేసి ఇంట్లో విద్యుత్ సరఫరాను నిలుపుదల చేయవచ్చు. మెయింటెనెన్స్ పనులు, ఇతరాత్ర అవసరాల కోసం విద్యుత్ కోతలు విధించాల్సి వస్తే సంబంధిత వినియోగదారుల స్మార్ట్ మీటర్లకు డిస్కంలు ఎస్ఎంఎస్లు పంపించనున్నాయి. స్మార్ట్ మీటర్లో ఉండే డిస్ప్లే బోర్డులో ఈ సందేశాలను చూసుకోవచ్చు. ఎస్ఎంఎస్ ద్వారానే ఇంట్లోని గ్రీజర్, రిఫ్రిజిరేటర్ వంటి విద్యుత్ పరకరాలను ఆన్/ఆఫ్ చేయవచ్చు. ప్రస్తుతం పరిశ్రమలు పగటి పూట విద్యుత్ వినియోగిస్తే ప్రతి యూనిట్పై రూపాయి టైమ్ ఆఫ్ డే(టీఓడీ) పెనాల్టీని విధిస్తున్నారు. రాత్రివిద్యుత్ వాడకంపై పరిశ్రమలకు విద్యుత్ చార్జీలో ప్రతియూనిట్పై రూపాయి రాయితీని ఇస్తున్నారు. రాయితీలు లభించే రాత్రిపూట మాత్రమే విద్యుత్ను వినియోగించేవిధంగా పరిశ్రమలు స్మార్ట్ మీటర్ను సెట్ చేసుకొని పెట్టుకోవచ్చని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. -
ప్రజాసాధికార సర్వే పురోగతిపై సమీక్ష
కాకినాడ సిటీ : రాష్ట్ర భూపరిపాలన ముఖ్య కమిషనర్ అనిల్చంద్ర పునేట జాయింట్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో బుధవారం రాత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రజాసాధికార సర్వే పురోగతిని సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ సర్వే ప్రక్రియను ఈ నెలాఖరునాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. సర్వే చేసిన గృహాలకు డిజిటల్ ఇంటి నంబర్లు జారీ చేసేందుకు వాటి ముందు ఉన్న వీధుల జీపీఆర్ఎస్ వివరాలను సేకరించి అప్లోడ్ చేయాలని సూచించారు. అసంపూర్తి, అసంబద్ధ డేటాను సరిచేసేందుకు ప్రత్యేక అప్ రూపొందించామని, దీనితో సత్వరం సవరణలు పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ పాల్గొంటూ జిల్లాలో 68 శాతం సర్వే పూర్తి చేశామన్నారు. జాయింట్ కలెక్టర్–2 రాధాకృష్ణమూర్తి, ఎన్ఐసీ సైంటిస్ట్ ఉస్మాన్, హెచ్ సూపరింటెండెంట్ రామ్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. -
పల్స్ పట్టుకుంటారా..?
నత్తనడకన ప్రజా సాధికార సర్వే కొరవడిన పర్యవేక్షణ ఈ నెలాఖరుతో ముగియనున్న గడువు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సాధికార సర్వే ఎప్పుడు పూర్తవుతుందో తెలియని సందిగ్ధ పరిస్థితి నెలకొంది. ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతుల సమగ్ర వివరాలను ఈ ప్రక్రియలో ఎన్యుమరేటర్లు అక్కడికక్కడే ట్యాబ్లలో నిక్షిప్తం చేస్తున్నారు. ఆయా వివరాలను ఆధార్తో అనుసంధానం చేయడం ద్వారా వివిధ పథకాలు, కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. నత్తనడకన సాగుతున్న ఈ సర్వే ఎప్పుడు ముగుస్తుందోనని వివిధ వర్గాల వారు పెదవి విరుస్తున్నారు. – కాకినాడ సిటీ జిల్లావ్యాప్తంగా 64 మండలాలు ఉండగా, ఏజెన్సీలోని 11 మండలాల్లో సాంకేతికంగా నెట్వర్క్ ఇబ్బందులు తలెత్తాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆయా మండలాల్లో మాన్యువల్గా చేపట్టాలని నిర్ణయించి, మిగిలిన మండలాల్లో సర్వే కొనసాగిస్తున్నారు. జూలై 8న ప్రారంభమైన ఈ సర్వే నత్తనడకన సాగుతోంది. తొలుత తలెత్తిన సాంకేతిక సమస్యలు ప్రస్తుతం లేకపోయినప్పటికీ, క్షేత్ర స్థాయిలో గణాంకాల సేకరణ నెమ్మదిగా సాగుతున్నట్టు కనిపిస్తోంది. పర్యవేక్షణ కొరవడడమే ఇందుకు కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతంతమాత్రమే.. పట్టణ, నగర ప్రాంతాల్లో సర్వే అంతంతమాత్రంగా సాగుతోంది. ప్రభుత్వం ఈ ప్రక్రియను రెండు దశల్లో జూలై, ఆగస్టు నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించినప్పటికీ, మరో నెల గడువు పొడిగించింది. ఈ నెలాఖరు నాటికి సర్వే పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలోని కాకినాడ, రాజమహేంద్రవరం, పెద్దాపురం, రామచంద్రపురం, అమలాపురం డివిజన్లలోని 51 గ్రామీణ మండలాలు, అర్బన్ ప్రాంతాలకు సంబంధించి రెండు కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీలు, 3 నగర పంచాయతీల్లోని 4,804 బ్లాకుల్లో 2011 జనాభా లెక్కల ప్రకారం సుమారు 50 లక్షల మంది వివరాలు సేకరించాల్సి ఉంది. ఇప్పటి వరకూ 33,98,595 మంది వివరాలను సేకరించారు. దీంట్లో 51 గ్రామీణ మండలాల్లో 26,12,700 మంది వివరాలు సేకరించగా, అత్యల్పంగా రౌతులపూడి మండలంలో 7,107 మంది వివరాలు సేకరించారు. కదలని ప్రక్రియ అర్బన్ ప్రాంతాల్లో సర్వే ముందుకు కదలని పరిస్థితి. మొత్తం 7,03,148 మంది వివరాలు సేకరించగా, అత్యల్పంగా గొల్లప్రోలు నగర పంచాయతీలో 17,135 మంది వివరాలు సేకరించారు. రాజమహేంద్రవరం కార్పొరేషన్లో 2,07,579, కాకినాడలో 2,03,956 మంది వివరాలు సేకరించారు. అలాగే అమలాపురం మున్సిపాలిటీలో 38,659, రామచంద్రపురంలో 23,484, మండపేటలో 45,541, తునిలో 33,787, పెద్దాపురంలో 23,807, సామర్లకోటలో 36,172, పిఠాపురం మున్సిపాలిటీలో 31,375, ఏలేశ్వరం నగర పంచాయతీలో 19,715, ముమ్మిడివరంలో 21,920 మంది వివరాలు సేకరించారు. వేగవంతానికి చర్యలు జిల్లాలో ప్రజా సాధికార సర్వే వేగవంతానికి చర్యలు చేపట్టాం. మరో పది రోజుల గడువు ఉంది. గడువులోపు సర్వే పూర్తయ్యేలా పర్యవేక్షించడమే కాకుండా, పట్టణ, మండల, డివిజన్ అధికారులతో ప్రతిరోజూ సమీక్షిస్తున్నాం. – ఎస్.సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ -
‘స్మార్ట్ పోలీసింగ్’పై పోటీలు
వరంగల్ : పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాల సందర్భంగా వరంగల్ రూరల్ పోలీసు శాఖ అధ్వర్యంలో వివిధ అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు వరంగల్ రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్ఝూ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో స్మార్ట్ పోలీసింగ్(స్మార్ట్ పోలీసింగ్ రోల్ ఆఫ్ సోషల్ మీడియా ఇన్ కమ్యూనిటీ పోలీసింగ్) అన్న అంశంపై ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫొటోగ్రఫీ, షార్ట్ఫిల్మ్ అంశాల్లో ఎవరైనా పాల్గొనవచ్చన్నారు. అలాగే ఉత్తమ కథనం, ఛానల్స్లో ప్రసారమైన వార్తాకథనం అంశాల్లో విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడి యా జర్నలిస్టులకు పోటీలు ఉంటాయన్నారు. ప్రజలు, ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లు, షార్ట్ ఫిల్మ్ మేకర్స్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్మలిస్టులు పోలీసుల ఇమేజ్–ప్రతిభ పెంచేలా ఉండే ఫొటోలు, షార్ట్ఫిల్్మ లు, ఉత్తమ వార్త కథనాలను జిల్లా పోలీసు కార్యాలయంలోని పోలీస్ పీఆర్ఓ తాళ్లపల్లి రామారావుకు హార్డ్, సాఫ్ట్ కాపీలను ఈ నెల 20వ తేదీలోగా పూర్తి చిరునామాతో పంపించాలని తెలిపారు. పూర్తి వివరాలకు 94409 04670 నంబర్కు ఫోన్చేయాలని తెలిపారు. బహుమతుల వివరాలు.. ‘స్మార్ట్ పోలీసింగ్–రోల్ ఆఫ్ సోషల్ మీడియా’ అనే అంశంపై పోలీసుల సేవ తెలిపేలా 10 నిమిషాలకు మించని తక్కువ నిడివిగల షార్ట్ఫిల్్మలను, 11“14 సైజు గల ఫొటోలు, పత్రికల్లో ప్రచురితమైన వార్తలు, ఛానెల్స్లో ప్రసారమైన వార్తా కథనాలు ఈ పోటీలకు స్వీకరిస్తామన్నారు. ఫొటోలు, షార్ట్ఫిల్్మలు ఉత్తమవార్త, ఉత్తమ వార్తా కథనం(ఎలక్ట్రానిక్ మీడియా) వార్తలన్నీ 2016 జనవరి 1వ తేదీ నుంచి 31 జులై 2016లోపు ఉండాలన్నారు. ఈ నిబంధనల ప్రకారం ఉన్న ఎంట్రీలను పరిగణిస్తామని ఎస్పీ వివరించారు. జిల్లా స్థాయిలో ప్రథమ స్థానానికి ఎంపిౖకైన వారికి రూ.10 వేలు, ద్వితీయ స్థానానికి రూ.5 వేలు, తృతీయ స్థానానికి రూ.3 వేలు ఇస్తామని వీటితోపాటు 5 ప్రత్యేక జ్యూరీ నగదు బహుమతులు అందజేస్తామన్నారు. ఈ పోటీల్లో మూడు స్థానాల్లో ఎంపికైన వాటిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. రాష్ట్ర స్థాయి విజేతలకు అంశాలవారిగా మొదటి బహుమతికి రూ.50 వేలు, రెండో బహుమతికి రూ.25 వేలు, మూడో బహుమతికి రూ.10 వేలు, 5 స్పెషల్ జ్యూరీ అవార్డులు అందిస్తామన్నారు. ఈ ఎంట్రీలను జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక జ్యూరీ కమిటీ పారదర్శకంగా పరిశీలించి ఎంపిక చేస్తుందన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 21న విజేతలకు నగదు బహుమతులు అందజేయనున్నట్లు ఎస్పీ తెలిపారు. -
స్పైస్ జెట్.. మొబైల్ చెకిన్ సేవలు!
ఇప్పటికే ప్రయాణీకులకు ఎప్పటికప్పుడు సరికొత్త సేవలు అందించడంలో ముందున్న విమానయాన సంస్థ స్పైస్ జెట్.. కొత్తగా స్మార్ట్ చెక్-ఇన్ సేవలను ప్రారంభించింది. గంటలదరబడి క్యూలైన్లలో బోర్డింగ్ పాస్ ల కోసం, చెకిన్ కోసం వేచి చూడాల్సిన అవసరం లేకుండా స్మార్ట్ ఫోన్ యాప్.. స్మార్ట్ చెక్-ఇన్ ను రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో కొత్తగా ప్రవేశ పెట్టింది. ప్రయాణీకులు గంటలకొద్దీ సమయాన్ని వృధా చేసుకోకుండా ఉండేందుకు స్పైస్ జెట్ మరో కొత్త సేవను అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్ చెక్- ఇన్ పేరున కొత్త యాప్ ను ప్రవేశపెట్టింది. ఈ నూతన యాప్ ను స్మార్ట్ ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకొని దీనిద్వారా ఎయిర్ పోర్టులో నిమిషాల్లో చెకిన్ అయ్యే అవకాశం కల్పించింది. హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మొదటిసారి స్మార్ట్ చెక్-ఇన్ సేవలను ప్రారంభించింది. ఈ సరికొత్త సేవతో ప్రయాణీకులు చెకింగ్ కోసం క్యూలో నిలబడాల్సిన పని ఉండదు. ఈ సేవలను కేంద్ర పౌర విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు ప్రారంభించారు. ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించడంలో స్పైస్ జెట్ ముందుంటుందని ఈ సందర్భంలో ఆయన తెలిపారు. త్వరలో ఈ సేవలను అన్ని విమానాశ్రయాల్లో ప్రవేశ పెట్టేందుకు చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి వెల్లడించారు. యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్న విమాన ప్రయాణీకులు.. విమానాశ్రయంలోని చెక్ ఇన్ ప్రాంతంలోకి చేరగానే ఫోన్లకు ఓ అలర్డ్ వస్తుంది. దాన్ని అంగీకరించిన వెంటనే ఫోన్ లోకి బోర్డింగ్ పాస్ వచ్చి చేరుతుంది. ఈ కొత్త స్మార్ట్ చెక్-ఇన్ సేవ ను వినియోగించుకుంటే ప్రయాణం హడావుడితోపాటు ప్రయాణీకులు చెకిన్ కోసం టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. -
జర్మనీ మొదటి స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్!
చెన్నైః ఒడిషాలోని భువనేశ్వర్, కేరళలోని కొచ్చి, తమిళనాడులోని కోయంబత్తూర్ లను స్మార్ట్ సిటీలుగా మార్చేందుకు సాయం అందిస్తామని గతంలో జర్మనీ హామీ ఇచ్చింది. అందులో భాగంగా ముందుగా తమ ప్రాజెక్టును కోయంబత్తూరు నుంచి ప్రారంభించేందుకు జర్మనీ సంసిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇండియాకు వచ్చిన జర్మన్ అంబాసిడర్ మార్టిన్ నే.. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో సమావేశం అయ్యారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టును ముందుగా కోయంబత్తూర్ లో ప్రారంభించనున్నట్లు తెలిపారు. భారత్ లో మూడు నగరాలను స్మార్ట్ సిటీలుగా మార్చేందుకు సాయం అందిస్తామని జర్మనీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదే నేపథ్యంలో ఇండియాకు వచ్చిన జర్మన్ అంబాసిడర్ మార్టిన్ నే తమిళనాడు ముఖ్యంత్రి జయలలితను స్టేట్ సెక్రెటేరియల్ లో కలిసినట్లు తమిళనాడు ప్రభుత్వం ఓ అధికారిక ప్రకటన ద్వారా తెలిపింది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు సహాయం అందించేందుకు సంసిద్ధంగా ఉన్న జర్మనీ.. ముందుగా కోయంబత్తూర్ నుంచి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నట్లు జర్మన్ అంబాసిడర్ నే.. తెలిపారని వెల్లడించింది. ఈ నేపథ్యంలో వ్యాపారవేత్తల ప్రాతినిథ్యంతో కూడిన ఓ బృదం జూలై 20న కోయంబత్తూర్ సందర్శించి, కోయంబత్తూర్ నగర మేయర్, ఇతర అధికారులతో మిగిలిన చర్చలు జరపనున్నట్లు తెలిపింది. ప్రాజెక్టులకు తమవంతు సహాయం అందించేందుకు ముందుకు వస్తున్నజర్మన్ ప్రభుత్వానికి ఈ సందర్భంగా జయలలిత కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తమిళనాడులో బ్యాంకింగ్ గ్రూప్ కెఎఫ్ డబ్ల్యూ సహా.. మరిన్ని జర్మన్ కంపెనీలు పెట్టుబడులను పెట్టేందుకు ముందుకు రావాలని ఆమె కోరారు. -
హైటెక్ పెన్ వచ్చేసింది!
వర్చువల్ రియాల్టీ కెమెరాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఉన్నది ఉన్నట్లుగా సహజంగా దృశ్యాలను సాక్షాత్కరింపజేసే ఎన్నో ఆధునిక పరికరాలూ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయి. అయితే మనం అనుకున్న, కనిపించిన రంగును స్కాన్ చేసి తనలో నింపుకునే ఆధునిక పరిజ్ఞానంతో కూడిన స్మార్ట్ పెన్ ఇప్పుడు మనముందుకొచ్చేసింది. చిత్రకారులు, డిజైనర్లు తమకు కావలసిన రంగులను ఎలాంటి మిక్సింగ్ లేకుండానే రూపొందించుకొని, కాన్వాస్ పై కళారూపాలను చిత్రించే అవకాశం దగ్గరలోనే ఉంది. ప్రపంచంలోనే మొట్టమొదటి కలర్ పికింగ్ పెన్ అందుబాటులోకి వచ్చేసింది. కుంచె, రంగుల అవసరం లేకుండానే ప్రకృతి చిత్రాలను, కళారూపాలను ఆవిర్భవింపచేసే అవకాశం కనిపిస్తోంది. మనకు దగ్గరలో కనిపించిన ఏ వస్తువునైనా స్కాన్ చేసి, దాని రంగును తనలోకి తీసుకోగలిగే ఈ హైటెక్ పెన్ ఇప్పుడు కళాకారులకు సైతం ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉంది. ఈ స్మార్ట్ పెన్ లో పొందుపరచిన కలర్ సెన్సార్, మైక్రో ప్రాసెసర్లు మనం అనుకున్న రంగులను గుర్తించి స్కాన్ చేస్తాయి. ఆకులు, పూలు, పళ్ళు వంటి రంగురంగుల ప్రకృతి దృశ్యాలతోపాటు ఎటువంటి వస్తువు పైన పెట్టినా.. పెన్ లోని సెన్సార్ ఆ వస్తువులోని రంగును స్కాన్ చేసి, అదే రంగును షేడ్ తో సహా మనకు అందిస్తుంది. చిత్రాన్ని స్కాన్ చేసుకున్న అనంతరం పిక్చర్ లోని కలర్ కు అనుగుణంగా పెన్ లోని స్మార్ట్ ఇంక్ కాట్రిజ్ రంగులను మార్చుకుంటుంది. ఈ కాట్రిజ్ లో ఉండే ఇంకుతో మైళ్ళకొద్దీ రాసేందుకు వీలవుతుందని సృష్టికర్తలు చెప్తున్నారు. అంతేకాదు ఈ స్క్రిబుల్ పెన్ ఇంక్.. నీటిని పీల్చదని, వెలిసిపోదని చెప్తున్నారు. ఈ స్మార్ట్ పెన్ కూడ రెండు రకాలుగా మార్కెట్లో అందుబాటులోకి వస్తుందని, ఒకటి.. నిజమైన ఇంకుతో పేపర్ మీద రాసుకునేందుకు వీలుగానూ, మరోటి చిత్రాలను స్కాన్ చేసి స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లలో వాడుకునేందుకు గాను వీలుంటుందంటున్నారు. యూఎస్బీ కేబుల్ తో ఒకసారి ఛార్జింగ్ పెడితే ఏడు గంటల పాటు పని చేస్తుందని చెప్తున్నారు. 249 డాలర్లతో అంటే సుమారు 17 వేల రూపాయలతో ఈ స్మార్ట్ పెన్ ను ఆన్ లైన్లో ముందుగానే బుక్ చేసుకునే అవకాశం ఉన్నట్లు వెబ్ సైట్లో వివరించారు. -
25 శాతం ఉద్యోగాలు రోబోట్స్ చేస్తాయ్!
ముంబైః మరో పదేళ్ళలో ఉద్యోగ వ్యవస్థ పూర్తిగా మారిపోయే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత ఉద్యోగాల్లో నాలుగో వంతు ఉద్యోగాలు రోబోట్స్, స్మార్ట్ సాఫ్టవేర్లతో నిర్వహించే అవకాశం కనిపిస్తోందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అంచనా వేస్తోంది. మరోవైపు ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ వ్యవస్థ.. 'ఎమోజీ'ల రూపకల్పన కూడ మరో దశాబ్ద కాలంలో అతి పెద్ద ఉద్యోగంగా మారే అవకాశం కనిపిస్తోంది. దీనంతటికీ వెనుక బిగ్ డేటా ప్రధాన పాత్ర పోషించనుంది. రోబోట్స్, స్మార్ట్ సాఫ్ట్ వేర్ లు.. పావుశాతం ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం సమీప భవిష్యత్తులో కనిపిస్తున్నట్లు సర్వేలను బట్టి తెలుస్తోంది. దీంతో కేవలం జాబ్స్ స్వభావం మారడమే కాక, సంస్థల పనితీరులో కూడ ప్రధాన మార్పు సంభవించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఇటీవల ప్రతి విషయంలోనూ బిగ్ డేటా ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డేటా సైన్స్ కీలకాంశమైపోయింది. దీంతో ప్రఖ్యాత విద్యా సంస్థలు సైతం డేటా సైన్స్, బిగ్ డేటా ను అందుబాటులోకి తెస్తున్నాయి. యువ శ్రామికులను నిపుణులుగా తీర్చిదిద్దడంలో 'బిగ్ డేటా' కీలకంగా మారింది. ప్రస్తుతం నగరాల్లో బిగ్ డేటా అగ్రస్థానాన్ని ఆక్రమిస్తోందని బిగ్ డేటా ను బోధించే మహేంద్రా మెహతా చెప్తున్నారు. ఒకప్పుడు బిగ్ డేటా విశ్లేషణలను అభివృద్ధి పరిచేందుకు భారీ పెట్టుబడులు అవసరమయ్యేవని, ఇప్పుడు ఆ పరిస్థితిలో తీవ్ర మార్పు సంభవించినట్లు ఆయన చెప్తున్నారు. చిన్న పెట్టుబడితో కూడ అభివృద్ధి చేసే అవకాశం రావడంతో ఇప్పుడు చిన్నపాటి కంపెనీలు, వ్యాపార సంస్థలు కూడ సాఫ్ట్ వేర్ జోలికి పోకుండా బిగ్ డేటాను ఆశ్రయిస్తున్నట్లు నిపుణులు చెప్తున్నారు. పరిశోధనాత్మక విధానాలకు, సంస్థల్లో ప్రావీణ్యతను అభివృద్ధి పరిచేందుకు బిగ్ డేటా ఎనలటిక్స్ ఎంతగానో సహాయపడుతుంది. నిజానికి అత్యాధునిక విషయాలను అందుబాటులోకి తెచ్చే బిగ్ డేటా ప్రయోజనాలను వినియోగించుకోలేని సంస్థలు.. వారి పోటీతత్వాన్ని సైతం కోల్పోయే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బిగ్ డేటా లో శిక్షణ, తర్ఫీదుపొందడం కూడ..భవిష్యత్తు కెరీర్ కు భారీ ప్రయోజనాలను కల్పిచే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ విప్లవాత్మక డేటా సైన్స్ పావు వంతు ఉద్యోగాలను తన పేరులో వేసుకునే అవకాశం కూడ ఉంది. -
ఫిట్నెస్ కోసం మరో స్మార్ట్ వాచీ!
టెక్నాలజీ రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. అందులో భాగంగానే స్మార్ట్ వాచీల పరంపర కొనసాగుతోంది. ఒక్కో కంపెనీ ఒక్కో రకమైన సౌకర్యంతో స్మార్ట్ వాచీలను రూపొందిస్తున్నాయి. పోటాపోటీగా మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ వాచీలు మార్కెట్లో అందుబాటులో ఉండగా... తాజాగా గార్మిన్ ఇండియా వ్యాయామానికి పనికొచ్చే మరో కొత్త స్మార్ట్ వాచీని అందుబాటులోకి తెచ్చింది. గుండె కొట్టుకునే రేటుతోపాటు, ఫిట్నెస్ను సూచించే స్మార్ట్ నోటిఫికేషన్స్ టెక్నాలజీతో కూడిన 'వావోస్మార్ట్ హెచ్ ఆర్' యాక్టివిటీ ట్రాకర్ను విడుదల చేసింది. టచ్ స్క్రీన్ తో కూడిన వావోస్మార్ట్ యాక్టివిటీ ట్రాకర్లో ఇంచుమించుగా స్మార్ట్ ఫోన్లో ఉండే టెక్స్ట్, కాల్స్, ఈ మెయిల్, క్యాలెండర్, సోషల్ మీడియా అలర్ట్స్, మ్యూజిక్ వంటి ఎన్నో సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. అతిపెద్ద సన్ లైట్ రీడబుల్ డిస్ ప్లే తో 'వావ్ స్మార్ట్ హెచ్ ఆర్' ట్రాకర్ ఎప్పుడూ పనిచేస్తుంది. 24 గంటలూ పనిచేసే ట్రాకర్... గుండె కొట్టుకునే రేటు, నడక, మెట్లు ఎక్కడం, కేలరీలు తగ్గడం వంటి లెక్కలన్నింటినీ ఎప్పటికప్పుడు సూచిస్తుంటుంది. రోజువారీ జీవితంలోని కార్యకలాపాలు, సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనేవారికి వావ్ స్మార్ట్ హెచ్ ఆర్ విప్లవాత్మక ఉత్పత్తిగా చెప్పుకోవచ్చని గార్మిన్ ఇండియా నేషనల్ సేల్స్ మేనేజర్ అలి రిజ్వి చెప్తున్నారు. ఏ సమయంలోనైనా చేతికి పెట్టుకోగలిగేలా ఎంతో తేలిగ్గా, సౌకర్యవంతంగా ఈ ట్రాకర్ ఉంటుందన్నారు. ఒకసారి చార్జి చేస్తే ఏడు రోజుల పాటు పనిచేస్తుందని, ఈ పరికరాన్ని వినియోగించే వారు చేతి నుంచి తీయాల్సిన పని కూడా పెద్దగా ఉండదని అంటున్నారు. అమెజాన్లో ప్రస్తుతం ఈ ట్రాకర్ రూ. 14,999కు అందుబాటులో ఉంచారు. -
జేబులో పట్టే కొత్త రోబో ఫోన్...
టోక్యో... జపాన్కు చెందిన బహుళ జాతి సంస్థ 'షార్ప్' ఇప్పుడు మీ జేబులో చక్కగా ఇమిడిపోయే కొత్త రోబో ఫోన్ను అందుబాటులోకి తెస్తోంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా రోబోట్ ఫోన్ను ఈ సంస్థ పరిచయం చేస్తోంది. రోబోహోన్ పేరిట రానున్న ఈ స్మార్ట్ ఫోన్... అన్ని ఎండ్రాయిడ్, స్మార్ట్ ఫోన్లలాగే కాల్స్ మాట్లాడేందుకు, ఫోటోలు తీసేందుకు, మ్యాప్లు చూపించేందుకు ఉపయోగపడుతుంది. దీనితోపాటు.. డ్యాన్స్ చేయడం కూడా ఈ ఫోన్లో ప్రత్యేకత. చిన్నపాటి టచ్ స్క్రీన్ ఉండే ఈ బుజ్జి రోబో ఫోన్లో ఒక్కో స్క్రీన్ మీద కేవలం నాలుగు ఐకాన్లు మాత్రమే కనిపించే అవకాశం ఉంది. ప్రసిద్ధ టోక్యో ప్రొఫెసర్.. అండ్ రోబోటిసిస్ట్.. టొమోటకా తకహాషి అభివృద్ధి పరచిన ఈ కొత్త పరికరాన్ని వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. రోబోహోన్ ప్రయోగం ద్వారా ప్రాథమికంగా ఈ ఫోన్.. మాట్లాడే సౌకర్యం కలిగి ఉంటుంది. టచ్ స్క్రీన్ లో మరోభాగం ఇంటర్నెట్. ఫోన్ వెనుక భాగంలో రెండు అంగుళాల టచ్ స్క్రీన్ ఉంటుంది. ముఖం భాగంలో లోపల కెమెరా, ప్రొజెక్టర్ అమర్చారు. ఈ ఫోన్కు అదనంగా కనిపించే రోబోట్ చేతులు, కాళ్ళు అది నడిచేందుకు వీలుగా ఉంటాయి. అయితే ఈ ఫోన్ మీరు కోరితే డాన్స్ కూడా చేస్తుంది. ఫోన్లో టెక్స్ట్ సందేశాలతో పాటు... ప్రొజెక్టర్ ఆధారంగా ప్రాజెక్ట్ ఫొటోలు, వీడియోటెక్స్ కనిపించే అవకాశం ఉంది. ఓ బొమ్మను నిలబెట్టినట్లే ఈ ఫోన్ను ఎక్కడైనా నిలబెట్టి ఫోటోలు తీయొచ్చు. యూజర్ వాయిస్ను, ముఖాన్ని గుర్తించగలిగే సామర్థ్యం కూడ ఈ ఫోన్కు ఉన్నాయి. అయితే వచ్చే ఏడాది మార్కెట్లోకి రానున్న ఈ కొత్త ఫోన్ ధర వివరాలు మాత్రం కంపెనీ ఇంకా బయట పెట్టలేదు. -
స్కావెంజర్ల నుంచి క్యాబ్ డ్రైవర్లుగా..!
ఇతరుల మలినాలను నెత్తినెత్తుకొని స్కావెంజర్లుగా పనిచేసిన వారి బతుకుల్లో ప్రస్తుతం కాస్త వెలుగులు నిండే పరిస్థితి కనిపిస్తోంది. ఇండియా రాజధాని ఢిల్లీలో తాజాగా కనిపిస్తున్న కొత్త మార్పు... మరి కొద్ది రోజుల్లో దేశంలోని ఇతర నగరాలకు వ్యాపించనుంది. కుల ప్రాతిపదికన తరతరాలుగా చేపడుతున్న వృత్తుల్లో అత్యంత నీచ స్థితిలో ఉన్న సఫాయీ కర్మచారీ వృత్తి, వివక్షలో చిక్కుకున్న జీవితాలు మెరుగు పరిచేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రయత్నంలో భాగంగా హస్తినలో వచ్చిన మార్పు కొన్ని కుటుంబాను తలెత్తుకుని గర్వంగా జీవించేలా చేస్తోంది. రోడ్లు ఊడుస్తూ, టాయిలెట్లు క్లీన్ చేస్తూ, డ్రైనేజీలు కడుగుతూ గడిపిన వారి తల్లిదండ్రుల జీవన విధానానికి ఇప్పుడా 250 మంది యువతులు స్వస్థి చెప్పారు. వేలల్లో జీతాలు వచ్చే క్యాబ్ డ్రైవర్లుగా మారారు. తమకు దగ్గరలోని పార్కుల్లోనే మార్సల్ ఆర్ట్స్ లో శిక్షణ పొంది, కాస్తంత ఆంగ్ల భాషనేర్చుకొని, మురికి వాడ నుంచి ఊబర్, ఓలా వంటి కమర్షియల్ టాక్సీ డ్రైవర్లుగా మారుతున్నారు. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సామాజిక న్యాయం, సాధికారత విభాగం ఢిల్లీ నగరంలోని పలు ప్రాంతాలనుంచి 9 వందల మంది మహిళలకు శిక్షణను ఇవ్వడం ప్రారంభించింది. ఇది ఒక్క ఢిల్లీ నగరానికే కాక దేశంలోని ముంబై, బెంగళూరు, కోల్ కతా, చెన్నై నగరాల్లో కూడ అమలు చేస్తామని మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ చెప్పారు. మా అమ్మ ఆ ఉద్యోగాన్ని పదేళ్ళ పాటు చేసింది. కానీ మేం మా జీవితాలు కాస్త మెరుగు పడతాయని ఆశిస్తున్నాం అంటుంది... రద్దీ ప్రాంతంలో డ్రైవింగ్ నేర్చుకుంటున్న ఇరవై రెండేళ్ళ ఓ ట్యాక్సీ డ్రైవర్. ఇక్కడ శిక్షణ తీసుకుంటున్న వారంతా 17 నుంచి 25 ఏళ్ళ మధ్య వయసుండి, ఢిల్లీలోని మాదంగీర్, సంగం విహార్, లాల్ కౌన్, అంబేద్కర్ నగర్ల నుంచి వచ్చిన వారే. వీరిలో కొందరు పదో తరగతి, ఇంటర్ వరకూ చదివిన వారు కూడ ఉన్నారు. ఇటువంటి వారు కొందరు శిక్షణ అనంతరం తాము స్వయంగా ట్రావెల్ ఏజెన్సీలను నిర్వహించుకుంటామని చెప్తున్నారు. కొందరైతే ఇటువంటి మార్పు తమ జీవితాల్లో వస్తుందని ఊహించలేదంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మోటార్ డ్రైవింగ్ స్కూళ్ళనుంచి మొదటిగా పది కార్లతో ఈ శిక్షణ తరగతులు మొదలు పెట్టారు. అయితే శిక్షణ ప్రారంభమైనప్పుడు మహిళల్లో ఆత్మ విశ్వాసం తక్కువగానే కనిపించినా ఇప్పుడు ఎంతో ఉత్సాహంగా డ్రైవింగ్ నేర్చుకొంటున్నారని గ్రేటర్ కైలాష్ ఆఫీస్ లోని నాగరాజ్ అంటున్నారు. అయితే మహిళలు ట్యాక్సీ డ్రైవర్లుగా ఉండాలంటే వారికి సెక్యూరిటీ పరమైన ఇబ్బందులు కూడ వచ్చే అవకాశం ఉంది. దీంతో సుమారు మూడు వేలమంది క్యాబ్ డ్రైవర్లకు ఢిల్లీలోని సిటీ పార్క్ లో మ్యానరిజమ్ పాఠాలు కూడ నేర్పుతున్నాం అంటున్నారు సీనియర్ ఎస్ జే ఈ అధికారి మునియప్ప నాగరాజ్. ప్రభుత్వం ద్వారా అమల్లోకి తెచ్చిన ఈ కార్యక్రమం వల్ల ఎంతోమంది జీవితాలు బాగుపడే అవకాశం ఉందని, అయితే అసలు మొత్తం ఢిల్లీలో సుమారు అరవై వేలమంది పఫాయీ కార్యికులకు కనీసం నెల జీతం వచ్చే అవకాశం కూడ లేదని ఓ ఎన్జీవో సంస్థ సభ్యురాలు దును రాయ్ అంటున్నారు. ఇటువంటి వారికి ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించాలని ఆమె సూచిస్తున్నారు. -
పోలీసు వ్యవస్థ ‘స్మార్ట్’గా ఉండాలి
దేశ భద్రతకు నిఘా సమాచారమే కీలకం: మోదీ పోలీసు అమరులను గౌరవించాలి.. పోలీసు వ్యవస్థకు చెడ్డ పేరు రావడానికి సినిమా పరిశ్రమే కారణం డీజీపీల సదస్సులో ప్రధాని వ్యాఖ్యలు గువాహటి: పోలీసు వ్యవస్థ ‘స్మార్ట్’గా ఉండాలని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ‘‘స్మార్ట్లో ఎస్ అంటే సెన్సిటివ్ (సున్నితత్వం), ఎం అంటే మోడరన్, మొబైల్ (ఆధునికం, సంచారం), ఏ అంటే అలర్ట్, అకౌంటబుల్ (అప్రమత్తం, జవాబుదారీతత్వం), ఆర్ అంటే రిలయబుల్, రెస్పాన్సివ్ (ఆధారపడతగ్గ, స్పందనగల), టీ అంటే టెక్నో-సావీ (సాంకేతికతను వినియోగించుకునే) అని నా ఉద్దేశం’’ అని ఆయన వివరించారు. ఉత్తమ పోలీస్ వ్యవస్థను అందించాలంటే పోలీసు బలగాలు ఈ విలువలను అలవరుచుకోవాలని.. తద్వారా పోలీసు బలగాల ప్రతిష్ట పెరుగుతుందని పేర్కొన్నారు. నిఘా సంస్థ (ఇంటెలిజెన్స్ బ్యూరో) ఆదివారం గువాహటిలో నిర్వహించిన 49వ వార్షిక డీజీపీల సదస్సులో ప్రధాని ప్రసంగించారు. దేశ భద్రత అనేది ఆయుధాల మీద ఆధారపడివుండదని.. నిఘా సమాచార సేకరణ మీద ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ‘‘ఆయుధాల కన్నా నిఘా సమాచార సేకరణ బలంగా ఉంటే.. సైనికులు, ఆయుధాల వినియోగం ప్రధానం కాబోదు’’ అని ఆయన చాణక్యుడి మాటలను ఉదహరిస్తూ వ్యాఖ్యానించారు. స్వాతంత్య్రానంతరం దేశం కోసం, దేశ ప్రజల భద్రత, శాంతి కోసం 33 వేలమంది పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో బలిదానం చేశారని.. ఆ అమరవీరులను దేశం గౌరవించాల్సిన అవసరముందన్నారు. ఈ పోలీసుల త్యాగాన్ని పౌరులు తెలుసుకునే అవకాశమే లేదని.. ఈ అమరవీరులు ఎవరో పోలీసులకూ తెలియదన్నారు. సామాన్యుడిని రక్షించేందుకు విధుల్లో మరణించిన పోలీసు అమరవీరులకు పోలీసు విభాగం పూర్తి గౌరవంతో అంత్యక్రియలను నిర్వహించే పూర్తి బాధ్యతను నిర్వర్తించేలా చూసేందుకు టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ప్రతి రాష్ట్రంలోనూ పోలీసు నియామకాలు, వారికి శిక్షణనిచ్చే పోలీసు అకాడమీల పాఠ్యాంశాల్లో.. విధి నిర్వహణలో చనిపోయిన పోలీసుల జీవితాలపై ఒక పుస్తకాన్ని తప్పనిసరిగా చేర్చాలని పేర్కొన్నారు. వారిపై ప్రతి రాష్ట్రమూ స్థానిక భాషలో ఈ-పుస్తకం తీసుకురావాలని పిలుపునిచ్చారు. సం‘క్షేమం’ అందించాలి... పోలీసులు తమ ప్రాణాలను ప్రమాదంలో ఉంచడం వల్ల వారి జీవితాలు పూర్తిగా ఆందోళనలతో నిండి ఉంటాయని.. వారి కుటుంబాలకు శాంతి, స్థిరత్వం అందించకపోతే పోలీసులు సమాజం కోసం పూర్తి స్థాయిలో పనిచేయలేరని.. పోలీసు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలని మోదీ పేర్కొన్నారు. సామాన్యుల దృష్టిలో పోలీసు వ్యవస్థకు చెడ్డ పేరు రావటానికి సినిమా పరి శ్రమే కారణమని తప్పుపట్టారు. సినిమాలు తీసేవారిని కలిసి.. పోలీసు వ్యవస్థలో ఉత్తమ గుణాన్ని చూపేలా చేయటానికి ప్రభుత్వం ఒక ప్రజాసంబంధాల సంస్థను నియమించుకోవాలన్నారు. ఉగ్రవాద దాడులకు ప్రవాస భారతీయులు కొందరు ఊతమిస్తున్నారని ఐబీ డెరైక్టర్ అసిఫ్ ఇబ్రహీం అన్నారు. ప్రధాని ప్రసంగిస్తున్నా నిద్రలో సీబీఐ చీఫ్! సీబీఐ డెరైక్టర్ రంజిత్సిన్హా వరుసగా రెండో రోజూ నిద్ర మత్తులో జోగుతూ మీడియా కంటికి చిక్కారు. శనివారం జరిగిన డీజీపీల 49వ వార్షిక సదస్సులో ఓవైపు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ ప్రసంగిస్తుంటే నిద్రలోకి జారుకున్న సిన్హా...ఆదివారం గువాహటిలో ఈ సదస్సులో స్వయంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తున్నా పట్టించుకోకుండా తన ‘పని’ కానిచ్చేయడం గమనార్హం. చొరబాటు మార్గాలను మూసివేస్తాం... పొరుగు దేశమైన బంగ్లాదేశ్ నుంచి అస్సాంలోకి అక్రమ చొరబాట్లకు ఉపయోగిస్తున్న రహదారులన్నిటినీ మూసివేస్తామని.. దీర్ఘకాలికంగా ఉన్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా బంగ్లాదేశ్తో భూమి బదిలీ ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతుందని మోదీ పేర్కొన్నారు. ఆయన గువాహటిలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఈమేరకు పేర్కొన్నారు. మణిపూర్లో స్పోర్ట్స్ యూనివర్సిటీ మణిపూర్లో త్వరలో క్రీడా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభిస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. ఆదివారం మణిపూర్లోని ఇంఫాల్లో జరిగిన ‘సాంగై మణిపూర్ టూరిజం ఫెస్టివల్’ ముగింపు కార్యక్రమంలో మోదీ ఈ ప్రకటన చేశారు. -
స్మార్ట్ ...స్మార్ట్ గా...
మార్కెట్లో 3డీ టీవీల హవా.. జిల్లాలోని మార్కెట్లో 3డీ (డైమన్షన్ పిక్చర్) టీవీలు అమ్మకాలు కొనసాగుతున్నాయి. మామూలుగా థియేటర్లలో సినిమాలు చూడడం కంటే భిన్నంగా ఉండాలని భావించే వారు 3డీ టీవీలను కొనుగోలు చేస్తున్నారు. 3డీ టీవీతోపాటు ప్రత్యేకమైన కళ్ల అద్దాలు ఇస్తారు. అందులో సినిమాలు చూస్తే కొన్ని సన్నివేశాలు మన మీదకు వచ్చినట్లుగా అనుభూతి కలుగుతుంది. 3డీలో అలాంటి సినిమాలు చూడడం థ్రిల్లింగ్ గా ఉంటుంది. అంతేకాకుండా ఈ టీవీలో ఇంటర్నెట్ వినియోగించే సౌలభ్యం కూడా ఉంది. స్మార్ట్ టీవీలో ఇంటర్నెట్.. స్మార్ట్ టీవీకి ఎంతో క్రేజీ పెరిగింది. టీవీలో అనేక సౌలభ్యాలున్నాయి. ఖరీదెక్కువైనా ఉపయోగాలు కూడా బాగానే ఉన్నాయి. ఇంటర్నెట్ సౌకర్యం ఉంది. టీవీ కార్యక్రమాలు చూడడంతో టీవీలోనే ఇంటర్నెట్ కావాలనుకునే వారికి టీవీ ఎంతో ఉపయోగకరంగా ఉంది. కంప్యూటర్ తరహాలో టీవీలోనే ఇంటర్నెట్ వినియోగించవచ్చు. ప్రత్యేకంగా కంప్యూటర్ కొనుగోలు చేయనవసరం లేదు. విదేశాల్లో ఉన్న వారితో చిన్న స్క్రీన్ కంప్యూటర్లో ఇంటర్నెట్ సహాయంతో కెమెరాల ద్వారా నేరుగా మాట్లాడుకునే వారు. స్మార్ట్ టీవీలో కూడా ఇంటర్నెట్ సౌకర్యం ఉండడంతో పెద్ద తెర పై తమ వారితో మాట్లాడుకునే సౌలభ్యం ఉంది. ఇలా నెట్లోకి వెళ్లాలి.. స్మార్ట్, 3డీ టీవీల్లో ముందుగా నెట్లో అవాంతరాలు లేని నెట్ వర్క్ను ఎం పిక చేసుకోవాలి. టీవీలో హోం అనే ఆప్షన్ ఉంటుంది. అందులో వైఫై, నెట్ కనెక్షన్ వస్తుంది. నెట్లోకి వెళ్లగానే గూగుల్ సెర్చ్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత మనకు అవసరమైన గూగుల్, జీమెయిల్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇలా ఎందులోకైనా వెళ్లవచ్చు. స్క్రీన్ మిర్రర్.. 3డీ, స్మార్ట్ టీవీలకు స్క్రీన్ మిర్రర్ అనే సౌలభ్యం ఉంది. వైఫై సెల్ఫోన్లో ఉన్న సినిమాలు, పాటలు, ప్రోగ్రాంలను టీవీలకు అనుసంధానం చేస్తే టీవీలో కనిపిస్తుంది. కేవలం ఈ సౌలభ్యం స్మార్ట్ టీవీలకు మాత్రమే ఉంటుంది. నలుపు తెలుపు నుంచి.. స్మార్ట్ వరకు సుమారు మూడు దశాబ్దాల క్రితం నలుపు తెలుపు టీవీలు మార్కెట్ను శాసించాయి. ఆ తర్వాత కలర్ టీవీలు వచ్చాయి. రెండేళ్ల క్రితం వరకు కలర్ టీవీలు మార్కెట్ను ఏలాయి. అవి కనుమరుగయ్యాయి. ఎల్సీడీలు వచ్చాయి. వాటి వెనకాలే ఎల్ఈడీలు వచ్చాయి. వాటి అమ్మకాలు జరుగుతున్న తరుణంలో స్మార్ట్, 3డీ టీవీలు వచ్చాయి. దీంతో కొత్తగా కొనుగోలు చేయాలనుకునే వారు స్మార్ట్, 3డీ టీవీలకు ఆకర్షితులవుతున్నారు. కొద్ధి రోజుల్లో ఎల్సీడీ, ఎల్ఈడీలు కూడా కనుమరుగయ్యే పరిణామాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఆర్గానిక్ ఎల్ఈడీ మార్కెట్లోకి విడుదలయ్యాయి -
‘స్మార్ట్’ రూట్లో సిమ్ కార్డ్...
మొబైల్ ఫోన్లకు ఊపిరిగా నిలిచే సిమ్ కార్డులు ఇప్పుడు ‘స్మార్ట్’గా మారుతున్నాయి. సరికొత్త ఫీచర్లు, అత్యాధునిక భద్రతా ప్రమాణాలతో ఖాతాదారులను ఆకట్టుకునేందుకు టెలికం కంపెనీలు ఈ కొత్తతరం సిమ్లను అందిస్తున్నాయి. గడిచిన కొన్నేళ్లలో మొబైల్స్ ప్రస్థానానికి అనుగుణంగానే ఈ సిమ్లు కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇముడ్చుకుంటూ మార్పు చెందుతున్నాయి. అయితే, ఇప్పుడు సెల్ ఫోన్లను కేవలం మాట్లాడుకోవడానికే కాకుండా.. బ్యాంకింగ్, మొబైల్ షాపింగ్ ఇతరత్రా అనేక రోజువారీ కార్యకలాపాలకు కూడా కీలకంగా ఉపయోగించడం పెరుగుతోంది. స్మార్ట్ఫోన్ల హవాయే దీనికి ప్రధాన కారణం. దీంతో టెల్కోలు సిమ్లకు మరిన్ని హంగులు, ఫీచర్లను జతచేస్తున్నాయి. సబ్స్క్రయిబర్ ఐడెంటిఫికేషన్ మాడ్యూల్నే సంక్షిప్తంగా సిమ్గా పిలుస్తారు. దీనిలోని ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లో కస్టమర్లకు సంబంధించిన వివరాలు ఇతరత్రా డేటాను టెల్కోలు నిక్షిప్తం చేస్తాయి. నిర్ధాయక(వెరిఫికేషన్) కోడ్లకు అనుగుణంగా యూజర్లు సేవలు పొందేందుకు వీలవుతుంది. సిమ్లను ఒకప్పుడు మొబైల్ హ్యాండ్సెట్లలోనే వాడేవారు. ఇప్పుడు ఇంటర్నెట్ వినియోగానికి సంబంధించిన డాంగిల్స్, ట్యాబ్లెట్స్ పీసీల్లోనూ వీటి వాడకం అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. ‘వెరిఫికేషన్ కోడ్స్తో పాటు ఇప్పుడు సిమ్లలో వినియోగదారుల సమాచారానికి మరింత భద్రతను కల్పించేలా టెల్కోలు మార్పులు ప్రవేశపెడుతున్నాయి. సమాచార మార్పిడి వేగంగా జరిగేలా అత్యాధునిక సర్క్యూట్లను వాడటం.. మరింత ఎక్కువ డేటా నిల్వ సామర్థ్యం వంటివి కూడా ఇందులో ప్రధానమైనవి’ అని జీఎస్ఎం టెలికం ఆపరేటర్ల సంఘం(సీఓఏఐ) డెరైక్టర్ జనరల్ రాజన్ ఎస్. మాథ్యూస్ పేర్కొన్నారు. నయా రూట్: స్మార్ట్ఫోన్ యూజర్లకు అనువుగా చిన్న అప్లికేషన్లు/యుటిలిటీ ప్రోగ్రామ్(యాప్లెట్స్)లను సిమ్లలో ముందుస్తుగా నిక్షిప్తం చేసి ఇస్తున్నారని ఐఎంఐ మొబైల్ వైస్ ప్రెసిడెంట్(ప్రొడక్ట్ మేనేజ్మెంట్) సుదర్శన్ ధరమ్పురి చెబుతున్నారు. టెలికం ఆపరేటర్లకు మొబైల్ డేటా ప్లాట్ఫామ్ ఇతరత్రా సేవలను ఈ కంపెనీ అందిస్తోంది. ఈ యాప్లెట్స్ను సిమ్లను తీసుకున్న తర్వాత కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సంగీతం, ఇంటర్నెట్ వినియోగం, సెల్ఫ్కేర్ అప్లికేషన్లకు ఈ యాప్లెట్స్ కీలకంగా నిలుస్తాయని సుదర్శన్ అంటున్నారు. మొబైల్ వినియోగదారుడు తను వినియోగిస్తున్న టారిఫ్ ప్లాన్లపై అవగాహన పెంచుకోవడానికి, ఇంటర్నెట్ డేటా వినియోగం, టాప్అప్ అవసరాలు వంటివన్నీ ఈ సెల్ఫ్కేర్ అప్లికేషన్లతో సులువుగా చక్కబెట్టుకోవచ్చు. మాటిమాటికీ కస్టమర్ కేర్కు ఫోన్ చేయడం వల్ల అయ్యే వ్యయాలను ఇది గణనీయంగా తగ్గిస్తుంది కూడా. పోటీని తట్టుకోవడానికి టెల్కోలు అనేక రకాల అప్లికేషన్లను సిమ్కార్డుల్లో పొందుపరుస్తున్నాయని సీడీఎంఏ, యూనిఫైడ్ సర్వీస్ ప్రొవైడర్ల సంఘం సెక్రటరీ జనరల్ అశోక్ సూద్ చెప్పారు. ప్రస్తుతం స్టాండర్డ్, మైక్రో, నానో ఫార్మాట్లలో మూడు రకాల సిమ్ కార్డులు మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇంటర్నెట్ వినియోగంతోపాటు ప్రీ-లోడెడ్ డేటాతో వస్తున్నాయి. గతంలో 16 కేబీలకే పరిమితమైన డేటా సామర్థ్యం ఇప్పుడు 32 కేబీలకు పెరిగింది కూడా. కొన్ని టెల్కోలు 64 కేబీ సిమ్లనూ సరఫరా చేస్తున్నాయి. మరోపక్క అధిక సామర్థ్యం, ఫీచర్లున్న సిమ్ కార్డులను ఇవ్వడం వల్ల టెల్కోలకు వ్యయం పెరుగుతోంది. చాలా కంపెనీలు కొత్త కనెక్షన్తో పాటు ఉచితంగా సిమ్లను ఇస్తున్న(కొన్ని సర్కిళ్లు, స్కీమ్లు, డేటా యూజర్లకు) విషయం విదితమే.