southindia
-
అంతిమంగా సినిమా బతకాలి: మమ్ముట్టి
మలయాళ పరిశ్రమలో జస్టిస్ హేమా కమిటీ నివేదిక ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఈ నివేదికలో పేర్కొనడంతో ఇందుకు నైతిక బాధ్యత వహించి, ‘అమ్మ’ (అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్) అధ్యక్షుడు మోహన్లాల్తో పాటు కమిటీ సభ్యులందరూ రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. కాగా హేమా కమిటీ నివేదికపై ఆల్రెడీ మోహన్లాల్ స్పందించారు. తాజాగా మరో అగ్రనటుడు మమ్ముట్టి ఈ అంశం గురించి సోషల్ మీడియాలో సుధీర్ఘమైనపోస్ట్ను షేర్ చేశారు. ఈపోస్ట్ సారాంశం ఈ విధంగా...⇒ ఓ సంస్థకు సంబంధించి ఒక విధానం ఉంటుంది. మొదట నాయకత్వం స్పందించిన తర్వాతే సభ్యులు మాట్లాడితే బాగుంటుంది. ప్రస్తుతం నేను ‘అమ్మ’లో సభ్యుడిని మాత్రమే. అందుకే నేను కాస్త ఆలస్యంగా స్పందిస్తున్నాను. ⇒సినిమా అనేది సమాజానికి ప్రతిబింబం. సమాజంలో జరుగుతున్న మంచి చెడులు సినిమాల్లోనూ ఉంటాయి. అయితే సినిమాలపై సమాజం దృష్టి చాలా దగ్గరగా ఉంటుంది. జరుగుతున్న ప్రతి అంశాన్ని గమనిస్తుంటారు. ఒక్కోసారి చిన్న అంశాలు కూడా పెద్ద స్థాయి చర్చలకు కారణమవుతుంటాయి. అందుకే ఇండస్ట్రీలో ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా ఇండస్ట్రీ వాళ్ళు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ⇒ ఓ దురదృష్టకర సంఘటన (2017లో జరిగిన దిలీప్– భావనా మీనన్ల ఘటనను ఉద్దేశించి కావొచ్చు) జరిగిన నేపథ్యంలో ఇండస్ట్రీపై అధ్యయనం చేయాల్సిందిగా ప్రభుత్వం జస్టిస్ హేమా కమిటీని నియమించింది. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండేలా ఆ నివేదికలో పేర్కొన్న సూచనలు, సలహాలు, పరిష్కారాలను స్వాగతిస్తున్నాం. అయితే ఈ అంశాలను అమలు చేయడానికి మలయాళ చిత్ర పరిశ్రమలో అన్ని అసోసియేషన్లు ఏకతాటి పైకి రావాలి. ఇక హేమా కమిటీ పూర్తి నివేదిక కోర్టులో ఉంది. కమిటీకి అందిన ఫిర్యాదులపైపోలీసులు నిజాయితీగా విచారణ చేస్తున్నారు. దోషులను కోర్టు శిక్షిస్తుంది. హేమా కమిటీ సిఫార్సులు అమ్మలయ్యేలా చట్టపరమైన కార్యాచరణ జరగాలి... అంతిమంగా సినిమా బతకాలి. -
పాఠాలు నేర్పినవారందరికీ ధన్యవాదాలు
హీరోయిన్గా పదిహేనేళ్ల విజయవంతమైన కెరీర్ని పూర్తి చేసుకుంటూ, ఇంకా అగ్రశ్రేణి హీరోయిన్ల జాబితాలో ఒకరిగా రాణిస్తుండటం అంటే అంత సులభమైన విషయం కాదు. ఈ లిస్ట్లో చాలా తక్కువమంది హీరోయిన్లు ఉంటారు. తాజాగా శ్రుతీహాసన్ పేరు ఈ లిస్ట్లో చేరింది. తండ్రి కమల్హాసన్ నటించిన ద్విభాషా (తమిళం, హిందీ) చిత్రం ‘హే రామ్’ (2000)లో చైల్డ్ ఆర్టిస్టుగా తొలిసారి స్క్రీన్పై కనిపించారు శ్రుతీహాసన్. చైల్డ్ ఆర్టిస్టుగా మరో సినిమా చేయలేదు కానీ.. ‘హే రామ్’ రిలీజైన తొమ్మిదేళ్లకు హిందీ చిత్రం ‘లక్’ (2009)తో కథానాయికగా కెరీర్ను ఆరంభించారు శ్రుతి.ఆ తర్వాత సూర్య ‘సెవెన్త్ సెన్స్’, ధనుష్ ‘త్రీ’, రామ్చరణ్ ‘ఎవడు’, అల్లు అర్జున్ ‘రేసుగుర్రం’ రవితేజ ‘క్రాక్’ .. ఇటీవల చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, ప్రభాస్ ‘సలార్: సీజ్ఫైర్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు శ్రుతి. నటిగా–గాయనిగా–సంగీత దర్శకురాలిగా... ఇలా మల్టీ టాలెంట్తో దూసుకెళుతున్నారు శ్రుతీహాసన్. కథానాయికగా పదిహేనేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రుతీహాసన్ స్పందిస్తూ – ‘‘అప్పుడే పదిహేనేళ్లు పూర్తయ్యాయంటే నమ్మశక్యంగా లేదు.నేను పెరిగిన మ్యాజికల్ ఇండస్ట్రీలోనే ఇంతకాలం నేను ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా మిగతా జీవితాన్ని కూడా ఇండస్ట్రీతోనే ముడివేస్తాను. ఇండస్ట్రీలో నాకు అందమైన పాఠాలు నేర్పినవారందరికీ ధన్యవాదాలు. అలాగే నన్ను ఆదరించిన ప్రేక్షకులు, నా అభిమానులకు థ్యాంక్స్. వీళ్లే లేకపోతే నేను ఇలా ఉండేదాన్ని కాదు’’ అన్నారు. రజనీకాంత్ ‘కూలీ’, ప్రభాస్ ‘సలార్: శౌర్యంగాపర్వం’, అడవి శేష్ ‘డెకాయిట్’ చిత్రాల్లో నటిస్తున్నారు శ్రుతీహాసన్. -
రఘువరన్కు భిన్నంగా వారసుడు.. ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా?
నటుడు రఘువరన్ పేరు వినగానే విలక్షణమైన పాత్రలే గుర్తుకొస్తాయి. టాలీవుడ్తో పాటు దక్షిణాది చిత్రాల్లో ప్రతినాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్ చిత్రాలలోనూ రఘువరన్ తనదైన నటనతో ఆకట్టుకున్నారు. సినిమాల్లో నటించే సమయంలో నటి రోహిణిని పెళ్లాడారు. వీరిద్దరికీ ఓ కుమారుడు కూడా జన్మించారు. అతనికి రిషివరన్ అనే పేరు పెట్టారు. అయితే 2004లో వీరిద్దరు విడిపోయారు. ఆ తర్వాత చివరి రోజుల్లో ఆల్కహాల్కు బానిస అయిన రఘువరన్ 2008 మార్చి 19న కన్నుమూశారు.అయితే ప్రస్తుతం అతని కుమారుడు రిషి వరన్ తండ్రి బాటలోనే దూసుకెళ్తున్నాడు. 26 ఏళ్ల రిషివరన్ నటుడిగా కాకుండా సంగీతంలో రాణిస్తున్నాడు. సినిమాల్లో నటనకు బదులు రిషివరన్ సంగీత రంగంలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికే అతను కొన్ని ఇంగ్లిష్ ఆల్బమ్లు రిలీజ్ చేశాడు. రఘువరన్కి సైతం సంగీతంపై కూడా చాలా ఆసక్తి ఉండేది. సినిమా అవకాశాలు పెరగడంతో నటనలో బిజీ అయిపోయాడు. ప్రస్తుతం రిషివరన్ తండ్రిలాగే కొడుకు కూడా సంగీతంలో కొనసాగుతున్నాడు.కాగా.. గతంలో రఘువరన్ ఎంతో ఇష్టంగా కంపోజ్ చేసి, పాడిన ఆరు పాటలను ఆయన మరణం తరువాత ఓ ఆల్బమ్గా తీసుకొచ్చారు. గతంలో రజనీకాంత్ చేతులమీదుగా ఈ ఆల్బమ్ను ఆయన భార్య రోహిణి, రిషి వరన్ అందుకున్నారు. ఏది ఏమైనా రఘువరన్ విలక్షణమైన నటనతో జనం మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. రఘువరన్ తన కెరియర్లో 150కు పైగా సినిమాలలో నటించారు. టాలీవుడ్లో శివ, బాషా ,పసివాడు ప్రాణం వంటి సినిమాలలో నటించి బాగానే పేరు సంపాదించిన రఘువరన్.. చివరిగా ఆటాడిస్తా సినిమాలో కనిపించారు. ఆయన మాజీ భార్య రోహిణి బాలనటిగా పరిచయమై ఆ తర్వాత కథానాయికగా, ఆపై క్యారెక్టర్ ఆర్టిస్ట్గా దక్షిణాది ప్రేక్షకులను అలరించింది. ఇప్పటికీ ఆమె సినిమాల్లో కొనసాగుతున్నారు. -
నిద్రలేని రాత్రులు గడిపా.. ఆ తెలుగు హీరోతో చేయాలనుంది: యానిమల్ బ్యూటీ
యానిమల్ చిత్రంతో ఒక్కసారిగా స్టార్ డమ్ సొంతం చేసుకున్న నటి త్రిప్తి డిమ్రీ. ఈ చిత్రంలో ఆమె నటనకు బాలీవుడ్తో పాటు దక్షిణాదిలోనూ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ సూపర్ హిట్ చిత్రంలో జోయా పాత్రలో అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో త్రిప్తి ఒక్కసారిగా ఓవర్నైట్ స్టార్ అయిపోయింది. అంతే కాకుండా రణ్బీర్ కపూర్తో కెమిస్ట్రీ అదిరిపోయిందంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. కొందరైతే ఏకంగా మీరే మాకు నేషనల్ క్రష్ అంటూ పోస్టులు పెడుతున్నారు. అంతలా ఫేమ్ తెచ్చుకున్న భామ తర్వాత ఏ ప్రాజెక్ట్లో చేయనుందన్న విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. సౌత్ సినిమాల్లో నటించనున్నట్లు వస్తోన్న వార్తలపై తాజా ఇంటర్వ్యూలో స్పందించారు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. త్రిప్తి మాట్లాడుతూ.. 'నేను ఇప్పటిదాకా సౌత్లో ఏ సినిమాకు సంతకం చేయలేదు. నాకు ఇక్కడ కూడా అవకాశాలు వస్తే బాగుంటుందని కోరుకుంటున్నా. దక్షిణాదిలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించాలని ఉంది' అంటూ మనసులో మాటను బయట పెట్టేసింది ముద్దుగుమ్మ. అని తెలిపారు. ఆ తర్వాత యానిమల్ చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. యానిమల్ విడుదలకు ముందు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపినట్లు చెప్పుకొచ్చింది. నా ప్రతిభకు ప్రశంసలు దక్కడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఇదిలా ఉండగా యానిమల్ తర్వాత త్రిప్తికి ఇన్స్టాలో ఫాలోయింగ్ భారీగా పెరిగింది. కాగా.. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోయే సినిమాలో త్రిప్తి డిమ్రీని ఎంపిక చేయాలంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. -
స్టార్ హీరో కొత్త చిత్రం.. టైటిల్ ఫిక్స్!
మార్క్ ఆంటోనీ చిత్రం తర్వాత కోలీవుడ్ హీరో విశాల్ మరో చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా ఆయన చిత్రానికి సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహిస్తుండగా.. తాజాగా టైటిల్ ప్రకటించారు మేకర్స్. ఇంతకు ముందు హరి.. పూజై, తామిర భరణి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. ఈ మూవీని స్టోన్ బెంచ్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంతో హ్యాట్రిక్ సాధించడానికి డైరెక్టర్ హరి రెడీ అయిపోయారు. సాధారణంగా అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్ టైనర్ కథా చిత్రాల కేరాఫ్గా మారిన హరి.. ఈ సినిమా కూడా అలాంటి నేపథ్యంలోనే రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఇసుక మాఫియా నేపథ్యంలో సాగే యాక్షన్ కథా చిత్రమని యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. దీనికి రత్నం అనే టైటిల్ ఖరారు చేసినట్లు తాజా సమాచారం. తాజాగా దీనికి సంబంధించి విడుదల చేసిన టీజర్లో నటుడు విశాల్ ఒక వ్యక్తి తలను నరికే సన్నివేశం ఉంది. ఈ ఒక్క సీన్ చూస్తేనే మరో పక్క కమర్షియల్ ఎంటర్టైనర్గా ఇది ఉంటుందని చెప్పవచ్చు. ఈ చిత్ర షూటింగ్ను కారైక్కుడి, తూత్తుక్కుడి, చైన్నె ప్రాంతాల్లో చిత్రీకరించినట్లు యూనిట్ వర్గాలు వర్గాలు తెలిపారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు గౌతమ్ మీనన్, సముద్రఖని, యోగి బాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. Well here it is finally, my 34th film. Happy to share THE FIRST LOOK of #RATHNAM, unleashing the combo with hari sir for the third time The action begins and looking forward to summer 2024 release. Hope u all like it. Hardwork never fails. God bless. Tamil -… pic.twitter.com/7tmHn0FrJV — Vishal (@VishalKOfficial) December 2, 2023 -
జవాన్ డైరెక్టర్ భారీ స్కెచ్.. ఆ ఇద్దరు స్టార్స్తో మూవీ!
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన చిత్రం జవాన్. ఈ ఏడాది విడుదలైన ఈ చిత్రంలో నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి వంటి సౌత్ సూపర్స్టార్స్ ఎక్కువగా నటించారు. దర్శకుడు కూడా తమిళనాడుకు చెందిన అట్లీ కావడం విశేషం. కాగా ఈ చిత్రం రూ.1100 కోట్లకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్ హిట్గా నిలిచింది. (ఇది చదవండి: ఐదు భిన్నమైన గెటప్స్లో కనిపించనున్న కంగువ) ఇక కోలీవుడ్లో దళపతిగా అభిమానులు పట్టం కట్టిన నటుడు విజయ్ ఆ మధ్య నటించిన చిత్రం బిగిల్. అందులోనూ నయనతారనే హీరోయిన్ కావడం మరో విశేషం. ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహించగా.. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఇక జవాన్, బిగిల్ చిత్రాల్లో మరో కామన్ విషయం హీరోలు ద్విపాత్రాభినయం చేయడం. ఇప్పటివరకు అపజయం ఎరుగని దర్శకుడిగా అట్లీ నిలిచారు. కాగా ఆయన తదుపరి చిత్రం ఏంటనే విషయంపై ఫ్యాన్స్లో ఆసక్తి నెలకొంది. దీనిపై తాజాగా ఒక ఆసక్తికరమైన వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. జవాన్ హీరో షారుక్ ఖాన్, బిగిల్ హీరో విజయ్తో ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారన్నదే లేటెస్ట్ టాక్. జవాన్ చిత్రంలో షారుక్ఖాన్తో కలిసి విజయ్ అతిథి పాత్రలో మెరవనున్నారనే ప్రచారం జరిగింది. కానీ అది వాస్తవం కాదని తెలిసిపోయింది. అయితే విజయ్తో కలిసి నటించడానికి తాను సిద్ధమని షారుక్ ఖాన్ జవాన్ చిత్రం సమయంలోనే వెల్లడించారు. అదేవిధంగా షారుక్ ఖాన్తో కలిసి నటించిన డానికి తాను సిద్ధమేనని విజయ్ కూడా అన్నారు. కాగా ఇటీవల ఒక ప్రముఖ హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ తన దర్శకత్వంలో చిత్రం చేయడానికి ముందుకు వచ్చినట్లు అట్లీనే స్వ యంగా ఇటీవల ఓ భేటీలో పేర్కొన్నారు. ఈ చిత్రానికి కథను సిద్ధం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. దీంతో ఇది షారుక్ ఖాన్, విజయ్ కలిసి నటించిన చిత్రం అవుతుందనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ రావాలంటే కొద్ది కాలం ఆగాల్సిందే. అదేవిధంగా ఇది బాలీవుడ్ చిత్రం అవుతుందా? లేక హాలీవుడ్ చిత్రం అవుతుందా అన్నది కూడా తెలియాల్సి ఉంది. (ఇది చదవండి: పిల్లలు కావాలని హీరోను పెళ్లి చేసుకున్నా: స్టార్ హీరోయిన్) -
విదేశీ చిత్రంలో టాలీవుడ్ సీనియర్ నటి.. పోస్ట్ వైరల్!
దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నటి రాధిక శరత్ కుమార్. డేరింగ్ అండ్ డాషింగ్ నటిగా 1978లో భారతీరాజా దర్శకత్వం వహించిన కిళక్కే పోగుమ్ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యారు. ఆ చిత్రం విజయం తర్వాత నటిగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. (ఇది చదవండి: మెగా ఫోన్ పట్టనున్న రామ్ చరణ్ విలన్!) తమిళం, తెలుగు, మలయాళం, హిందీ ఇలా పలు భాషల్లో ప్రముఖ హీరోల సరసన కథానాయకిగా నటించి బహుభాషా నటిగా రాణించారు. ఆ తర్వాత కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి వివిధ రకాల పాత్రలో ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. కాగా 2001 వివాహం చేసుకున్నారు. అలా తన 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో విజయాలను చూసిన రాధిక శరత్ కుమార్ నిర్మాతగాను కొన్ని చిత్రాలు చేశారు. అదే విధంగా సినిమాలు కూడా నిర్మిస్తున్నారు. తాజాగా స్వదేశీ భాషలను అధిగమించి ఫ్రెంచ్ చిత్రంలో నటించడం విశేషం. ప్రస్తుతం రాధిక శరత్ కుమార్ ఆ చిత్రంలో నటించడానికి ఫ్రాన్స్ దేశానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె ఆ చిత్ర షూటింగ్లో తన ఫొటోలను తన ఇన్స్టాలో పంచుకున్నారు. అందులో తాను ఫ్రెంచ్ చిత్రంలో నటించడానికి ప్రోత్సహించిన తన భర్త శరత్ కుమార్కు కృతజ్ఞతలు చెప్పారు. ప్రస్తుతం రాధిక శరత్ కుమార్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. (ఇది చదవండి: ఈ హీరోయిన్ని గుర్తుపట్టారా? నాలుగే సినిమాలు, టీమిండియా క్రికెటర్తో పెళ్లి!) View this post on Instagram A post shared by Radikaa Sarathkumar (@radikaasarathkumar) -
మళ్లీ మెగాఫోన్ పట్టనున్న ప్రముఖ నటి!!
నటిగా రోహిణి 1974లోనే బాలనటిగా తెరంగేట్రం చేశారు. తర్వాత కథానాయకిగా పలు చిత్రాల్లో నటించి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నారు. అంతే కాదు ఈమెలో మంచి డబ్బింగ్ కళాకారిణి, దర్శకురాలు కూడా ఉన్నారు. 2005లోనే చిన్న చిన్న ఆశై అనే చిత్రానికి దర్శకత్వం వహించారు.ఆ తరువాత ఒక డాక్యుమెంటరీ చిత్రం కూడా చేశారు. (ఇది చదవండి: కన్నీరు పెట్టుకున్న శోభ, యావర్.. నేడు షో టైమింగ్స్లో మార్పు) తాజాగా మరోసారి మెగా ఫోన్ పట్టడానికి సిద్ధమైనట్లు సమాచారం. యదార్థ ఘటనలతో ఇప్పటికే చాలా చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో పలు చిత్రాలు విజయాన్ని సాధించాయి. జైభీమ్, సూరారై పోట్రు వంటి చిత్రాలు ఈ కోవలోకి వస్తాయి. కాగా ఆ మధ్య తమిళనాడునే ఉలిక్కిపడేలా చేసిన వాచ్ఛాత్తి హింసా సంఘటన ఇప్పుడు వెండితెరకెక్కనుంది. దీనికి నటి రోహిణి దర్శకత్వం వహించనున్నారని సమాచారం. కాగా దీనికి రచయిత ఆదవన్ దీక్షగా మాటలు,కథనం రాస్తున్నారు. ఇందులో జై భీమ్ చిత్రం ఫేమ్ లిజోమోల్ జోస్ ప్రధాన పాత్రను పోషించనున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
నిద్రలోనూ అవే కలలు వస్తున్నాయి.. అయినా తప్పకుండా చేస్తా: రాఘవ లారెన్స్
ఇటీవలే చంద్రముఖి-2 సినిమాతో ప్రేక్షకులను అలరించిన కోలీవుడ్ స్టార్ రాఘవ లారెన్స్. ప్రస్తుతం ఎస్జే సూర్యతో కలిసి జగిర్తాండ డబుల్ ఎక్స్ చిత్రంలో నటిస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరక్కించారు. అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం దీపావళి కానుకగా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో రాఘవ లారెన్స్ మాట్లాడారు. చంద్రముఖి- 2 ఫ్లాప్ గురించి ఆయన స్పందించారు. (ఇది చదవండి: మరో సక్సెస్ఫుల్ హీరో వచ్చాడు – హీరో నాని ) రాఘవ మాట్లాడుతూ..'చంద్రముఖి -2 సినిమాకు నా డబ్బులు నాకు వచ్చేశాయి. జీవితంలో అన్నీ మనమే గెలవాలని లేదు కదా. గ్రూప్ డ్యాన్సర్ నుంచి డ్యాన్సర్ మాస్టర్ అయితే చాలని భావించా. అక్కడి నుంచే దర్శకుడిని, హీరోను అయ్యాను. నా గ్లామర్కు హీరో అవకాశాలు ఇవ్వడమే దేవుడిచ్చిన పెద్ద వరం. మళ్లీ అందులో ఫ్లాప్, హిట్ గురించి అస్సలు ఆలోచించకూడదు. 'జిగిర్తాండ డబుల్ ఎక్స్' డబ్బింగ్ పూర్తయ్యాక చూశా. ఇందులో మంచి స్టోరీ ఉంది. సినిమా హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది. ఎంత పెద్ద హీరో సినిమా చేసినా, డ్యాన్స్ చేసినా కథ లేకపోతే సినిమా ఆడదు. కంటెంట్ బలంగా ఉండాలంటే దర్శకుడు కూడా అంతే బలంగా ఉండాలి. కార్తీక్ సుబ్బరాజు విషయంలో నాకు ఎలాంటి డౌట్స్ లేవు.' అని అన్నారు. (ఇది చదవండి: అమర్దీప్కి ఎలిమినేషన్ భయం.. ఇలా అయిపోయాడేంటి?) అయితే కాంచన-4 ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు సార్.. అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానమిస్తూ.. అన్ని దెయ్యాల సినిమాలు తీసి మనశ్శాంతిగా ఉండటం లేదు. రాత్రి కూడా కలలో అవే గుర్తుకొస్తున్నాయి. దీంతో నా మైండ్ కాస్తా పిచ్చి పిచ్చిగా అయిపోయింది. కానీ ఏదో ఒక రోజు ఆ సినిమాను తప్పకుండా చేస్తా' అని అన్నారు. Any Muni Fans here ?🙋🏻🔥 #RaghavaLawrence pic.twitter.com/LEqbZCq2r1 — Anchor_Karthik (@Karthikk_7) October 10, 2023 -
ఇప్పుడు సౌత్పైనే అందరి దృష్టి.. ఆ స్టార్ హీరో విలన్ రోల్ చేస్తాడా.. !
ప్రస్తుతం బాలీవుడ్ సూపర్ స్టార్స్ కన్ను సౌత్ ఇండస్ట్రీపై పడింది. అగ్రనటులు సైతం దక్షిణాదిలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. విలన్ క్యారెక్టర్లోనూ నటించేందుకు వెనుకాడడం లేదు. ఇప్పటికే సంజయ్దత్ శాండల్వుడ్ మూవీ కేజీఎఫ్–2లో విలన్గా నటించారు. నటుడు వివేక్ ఒబెరాయ్ వివేగం చిత్రంలో అజిత్కు విలన్గా నటించారు. అలాగే నటుడు జాకీష్రాఫ్ సైతం దక్షిణాది చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. తాజాగా సామాజిక మాధ్యమాల్లో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. నటుడు విజయ్ లియో చిత్ర షూటింగ్ పూర్తిచేసి త్వరలోనే మరో చిత్రానికి సిద్ధమవుతున్నారు. (ఇది చదవండి: కిందపడ్డ ఎంగిలి మెతుకులు తిన్న రైతుబిడ్డ.. బయటేమో మరోలా..) వెంకట్ప్రభు దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందులో భారీ తారాగణం నటించబోతున్నట్లు కోలీవుడ్ టాక్. ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంతో పాటు ఈ సంస్థ జయంరవి హీరోగా తనీఒరువన్- 2 చిత్రాన్ని నిర్మించనుంది. దీనికి మోహన్రాజా దర్శకత్వం వహించనున్నారు. అయితే ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఓ న్యూస్ తెగ వైరలవుతోంది. ఈ రెండు చిత్రాలలో ఒకదానిలో బాలీవుడ్ సూపర్స్టార్ అమీర్ఖాన్ను విలన్గా నటింపజేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. విజయ్కు విలన్గా అమీర్ఖాన్ను నటింపజేసే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఇందులో నిజమెంతమనేది తెలియాల్సి ఉంది. అసలు ప్రతినాయకుడిగా నటించడానికి అంగీకరిస్తారా? అనేది గమనార్హం. అయితే లియో చిత్రంలో సంజయ్దత్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. (ఇది చదవండి: 'జవాన్' సినిమాను నిలబెట్టిన ఈ ఆరుగురు.. ఇప్పటి వరకు తీసిన సినిమాలు ఇవే) -
స్టార్ హీరో సినిమాకు ఓకే చెప్పిన విజయేంద్ర ప్రసాద్.. పాన్ ఇండియా రేంజ్లో!
టాలీవుడ్ బ్లాక్బస్టర్ చిత్రాలకు కథలు అందించిన రచయిత విజయేంద్రప్రసాద్. మగధీర, బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి ఆల్టైమ్ హిట్స్ను అందించారు. అయితే తాజాగా మరో స్టార్ హీరోకు కథను అందించేందుకు సిద్ధమయ్యారు. శాండల్వుడ్ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ నటిస్తున్న తాజా చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ పనిచేస్తున్నారు. టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తండ్రి ఆయన ఇప్పటి వరకు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో 25 చిత్రాలకు పైగా కథలను అందించారు. తాజాగా కన్నడ హీరో కిచ్చాకు సైతం కథ సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఈ విషయాన్ని సెప్టెంబర్ 2న కిచ్చా సుదీప్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ రివీల్ చేశారు. (ఇది చదవండి: అవార్డులు నాకు చెత్తతో సమానం.. స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్! ) కిచ్చా సుదీప్ కథానాయకుడుగా ప్రముఖ కన్నడ చిత్ర నిర్మాణ సంస్థ ఆర్సీ స్టూడియోస్ భారీ బడ్జెట్లో చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి ఆర్.చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు. కిచ్చా సుదీప్ మరోసారి కబ్జా దర్శకుడు ఆర్ చంద్రుతో జతకట్టబోతున్నారు. ఈ ముగ్గురు కాంబినేషన్లో ఆర్సీ స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మించనున్నట్లు అందులో పేర్కొన్నారు. ఈ ఏడాదిలో ఈ సంస్థ నిర్మించిన ఐదు చిత్రాలు వరుసగా తెరపైకి రాబోతున్నట్లు తెలిపారు. అదేవిధంగా కిచ్చ సుదీప్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రంలో పని చేయడానికి ప్రపంచ స్థాయి టెక్నీషియన్లను, నటీనటులను ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. (ఇది చదవండి: సలార్ రిలీజ్ ఆ నెలలోనే.. వైరలవుతున్న ట్వీట్!) -
మొన్న సెలవులు.. ఇప్పుడేమో ఏకంగా జైలర్ స్పెషల్ షోలు..!
సూపర్ స్టార్ రజినీకాంత్, తమన్నా జంటగా నటించిన తాజా చిత్రం జైలర్. నెల్సన్ దర్శకత్వంలో సన్ పిక్చర్ నిర్మించిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్, బాలీవుడ్ స్టార్ నటుడు జాకీష్రాఫ్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, తెలుగు నటుడు సునీల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతమందించగా.. ఆగస్టు 10న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చేసింది. తొలిరోజే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తోంది. తొలి రోజే ఏకంగా రూ.52 కోట్లు రాబట్టింది. తమిళం, తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ మంచి టాక్తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో చెన్నైలో రిలీజ్ రోజే కొన్ని కంపెనీలు ఉద్యోగులకు సెలవులు ప్రకటించగా.. తాజాగా మరో కంపెనీ ముందడుగేసింది. (ఇది చదవండి: 'మీరు చేయకపోతే చాలామంది ఉన్నారని చెప్పాడు'.. క్యాస్టింగ్ కౌచ్పై బుల్లితెర నటి!) తాజాగా ర్యాపిడో సంస్థ రజినీకాంత్పై తమ అభిమానాన్ని చాటుకుంది. ముఖ్యమైన నగరాల్లో బైక్, ఆటో ట్యాక్సీ సేవలు అందించే ర్యాపిడో సంస్థ తమ డ్రైవర్లకు అదిరిపోయే న్యూస్ చెప్పింది. ర్యాపిడో ఆటో ట్యాక్సీ సేవలు అందించే కెప్టెన్స్ కోసం జైలర్ ప్రత్యేక షో వేయనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని ర్యాపిడో సంస్థ స్వయంగా ప్రకటించింది. చెన్నైలో ఆగస్టు 12న కృష్ణవేణి థియేటర్లో కేవలం వారి కోసమే ప్రత్యేక స్క్రీనింగ్ వేయనున్నట్లు తెలిపింది. సంస్థ నిర్ణయంతో 500కు పైగా ర్యాపిడో ఆటో డ్రైవర్లకు తమ అభిమాన హీరో తలైవా జైలర్ చిత్రాన్ని చూసే అవకాశం దక్కింది. సంస్థ నిర్ణయం పట్ల ర్యాపిడో కెప్టెన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ర్యాపిడో సహ వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి వారి సేవలను కొనియాడారు. కాగా.. జైలర్ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో టికెట్స్ భారీగా బుకింగ్స్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ర్యాపిడో సంస్థ వారి కోసం ప్రత్యేక షో వేయనుంది. దీనికి సంబంధించిన ఫొటోలు సైతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. (ఇది చదవండి: జైలర్ కోసం జపాన్ నుంచి అభిమానులు) -
జైలర్ రిలీజ్.. ఆ సెంటిమెంట్ ఫాలో అవుతున్న తలైవా!
చిత్ర పరిశ్రమలో సెంటిమెంట్కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే ఒక చిత్రం హిట్ అయితే.. అదే తరహాలోనే సెంటిమెంట్ ఫాలో అవుతుంటారు. అలా సెంటిమెంట్ను ఫాలో అయ్యేవారిలో తలైవా ముందుంటారు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్, తమన్నా జంటగా నటించిన మరి కొద్దిగంటల్లో థియేటర్లలో సందడి చేయనుంది. (ఇది చదవండి: భోళా శంకర్ నిర్మాతలతో ప్రాణహాని.. పోలీసులకు ఫిర్యాదు) ఈ నేపథ్యంలోనే తలైవా తన సెంటిమెంట్ను ఫాలో అవుతున్నారు. రజనీకాంత్ తన చిత్రం విడుదల సమయంలో హిమాలయాలకు వెళ్లేవారు. అదే సెంటిమెంట్ను ఫాలో అవుతూ ఎప్పటిలాగే సినిమా రిలీజ్కు ముందు హిమాలయాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఆ మధ్య ఆరోగ్య సమస్యల కారణంగా కొంతకాలంగా హిమాలయాలకు వెళ్లలేదు. అలాంటిది జైలర్ చిత్రం రిలీజ్ కానుండడంతో రజనీకాంత్ హిమాలయాలకు వెళ్లినట్లు సమాచారం. గతంలో కూడా తలైవా ఇలాగే సినిమా విడుదలకు ముందు హిమాలయాలకు వెళ్లారు. సూపర్ స్టార్ అభిమానుల్లో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ప్రీమియర్ షోల టికెట్స్ అన్నీ అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. చెన్నై, బెంగళూరు నగరాల్లో ఏకంగా కొన్ని కంపెనీలు సెలవులు ప్రకటించడం ఆయనకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థమవుతోంది. కాగా.. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, బాలీవుడ్ స్టార్ జాకీ ష్రాఫ్, తెలుగు నటుడు సునీల్, యోగిబాబు, రమ్యకృష్ణ, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తదితరులు ముఖ్యపాత్ర పోషించారు ఇదిలా ఉండగా జైలర్ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వలేదు. అయితే కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతులు ఇవ్వడం మరో విశేషం. దీంతో ఆయన పలువురు సూపర్ స్టార్ అభిమానులు బెంగళూరుకు పరుగులు తీస్తున్నారు. కాగా జైలర్ చిత్రాలు చూడటానికి చైన్నెలోని ఒక ఐటీ కంపెనీ తమ ఉద్యోగులకు సెలవు ప్రకటించడం మరో విశేషం. (ఇది చదవండి: జైలర్కు 'తెలుగు' సెంటిమెంట్.. రజనీకాంత్కు అసూయ ఎందుకు? ) -
సైమా అవార్డ్స్- 2023.. రాజమౌళి చిత్రానికి 11 నామినేషన్స్!
సినీ ఇండస్ట్రీలో దక్షిణాదిలో అవార్డుల పండుగకు సర్వం సిద్ధమైంది. ప్రతిష్ఠాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ - 2023లో పోటీపడే చిత్రాల జాబితా రిలీజ్ అయింది. అయితే అవార్డుల నామినేషన్స్లో టాలీవుడ్ బ్లాక్ బస్టర్, ఆస్కార్ అవార్డ్ దక్కించుకున్న ఆర్ఆర్ఆర్ మూవీ ఏకంగా 11 విభాగాల్లో స్థానం దక్కించుకుంది. ఆ తర్వాత స్థానంలో 10 విభాగాల్లో నామినేషన్స్తో సీతారామం చిత్రం నిలిచింది. (ఇది చదవండి: ఓటీటీకి వచ్చేసిన జగపతిబాబు మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) తెలుగులో ఉత్తమ చిత్రం కేటగిరిలో ఎన్టీఆర్, రామ్చరణ్, రాజమౌళి కాంబోలో తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్, సిద్ధు జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు, నిఖిల్ మిస్టరీ అడ్వెంచర్ ఫిల్మ్ కార్తికేయ-2, అడవి శేష్ మేజర్తో పాటు.. మరో బ్లాక్బస్టర్ మూవీ సీతారామం పోటీలో నిలిచాయి. తమిళంలో అత్యధికంగా 10 నామినేషన్స్ పొన్నియిన్ సెల్వన్-1 చిత్రానికి దక్కించుకుంది. ఆ తర్వాత కమల్హాసన్-లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వచ్చిన విక్రమ్ 9 విభాగాల్లో నామినేషన్స్కు ఎంపికైంది . కన్నడలో రిషబ్ శెట్టి బ్లాక్ బస్టర్ హిట్ కాంతార, యశ్ యాక్షన్ మూవీ కేజీయఫ్-2 చిత్రాలకు 11 కేటగిరిల్లో నామినేషన్స్ దక్కాయి. మలయాళంలో ఈసారి ఆరు చిత్రాలు ఉత్తమ చిత్రం కేటగిరిలో పోటీపడుతున్నాయి. అమల్ నీరద్ దర్శకత్వంలో మమ్ముటి నటించిన భీష్మ పర్వం చిత్రానికి 8 నామినేషన్స్ రాగా, టోవినో థామస్ థల్లుమాల మూవీకి ఏడు నామినేషన్స్ వచ్చాయి. కాగా.. సౌత్ సినిమా ఇండస్ట్రీలో నిర్వహించే ప్రతిష్ఠాత్మక సైమా అవార్డ్స్- 2023) ఈవెంట్ ఈ ఏడాది సెప్టెంబరు 15, 16 తేదీల్లో దుబాయ్లో జరగనున్న సంగతి తెలిసిందే. (ఇది చదవండి: 'మేడ్ ఇన్ హెవెన్' లో ట్రాన్స్ వుమెన్.. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా?) #SIIMA2023 nominations are out. In Telugu RRR Directed by S.S Rajamouli Starring Jr.NTR & Ram Charan has 11 Nominations is leading while Sita Ramam Directed by Hanu Raghavapudi Starring Dulquer Salmaan & Mrunal Thakur with 10 Nominations is close Second. #NEXASIIMA #SIIMAinDubai pic.twitter.com/M3DsQ7btLQ — SIIMA (@siima) August 1, 2023 #SIIMA2023 Nominations. In Tamil Mani Ratnam’s Ponniyin Selvan:1 Starring Vikram, Trisha & Aishwarya Rai leads with 10 nominations while Lokesh Kanagaraj’s Vikram Starring Kamal Haasan, Vijay Sethupathi & Fahadh Faasil with 9 Nominations is close Second. #NEXASIIMA… pic.twitter.com/sXAxDz7cuk — SIIMA (@siima) August 1, 2023 #SIIMA2023 Nominations. In Kannada Kantara Directed by and Starring Rishab Shetty with 11 Nominations, while KGF Chapter 2 Directed by Prashanth Neel, Starring Yash with 11 Nominations are in top position. #NEXASIIMA #SIIMAinDubai pic.twitter.com/hWh4ZDrw0z — SIIMA (@siima) August 1, 2023 #SIIMA2023 Nominations. In Malayalam Bheeshma Parvam Directed by Amal Neerad Starring Mammootty is leading with 8 Nominations while Thallumaala Directed by Khalid Rahman & Starring Tovino Thomas and Kalyani Priyadarshan with 7 Nominations is close Second #NEXASIIMA #SIIMAinDubai pic.twitter.com/Va8wuh2PRW — SIIMA (@siima) August 1, 2023 -
నిత్యా మీనన్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఇక మిమ్మల్ని చూడలేనంటూ!
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ నిత్యామీనన్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. తాను ఎంతగానో ప్రేమించే అమ్మమ్మ చనిపోయారు. ఈ విషయాన్ని నిత్యా తన ఇన్స్టాలో షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. అమ్మమ్మ, తాతయ్యతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఇది చూసిన నిత్యా అభిమానులు ధైర్యంగా ఉండాలంటూ పోస్టులు పెడుతున్నారు. (ఇది చదవండి: నాన్న బాటలోనే రాణిస్తా.. సేవలు కొనసాగిస్తా..ఘట్టమనేని సితార) నిత్యా ఇన్స్టాలో రాస్తూ.. 'ఒక శకం ముగిసింది. మిమ్మల్ని చాలా మిస్సవుతున్నా. గుడ్ బై అమ్మమ్మ అండ్ మై చెర్రీమ్యాన్. ఇప్పటి నుంచి మరో కోణంలో చూసుకుంటా.' అంటూ ఎమోషనలైంది. కాగా.. అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన నటి నిత్యామీనన్. నితిన్ సరసన ఇష్క్ సినిమాతో గుర్తింపు దక్కించుకుంది. ఆమె తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళంలో దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించింది. తెలుగులో గుండెజారి గల్లంతయ్యిందే, జనతా గ్యారేజ్, 100 డేస్ ఆఫ్ లవ్, ఒక్క అమ్మాయి తప్ప, ఇంకొక్కడు లాంటి చిత్రాల్లో నటించింది. (ఇది చదవండి: జబర్దస్త్ అవినాష్ తల్లికి గుండెపోటు! స్టంట్స్ వేసిన వైద్యులు) View this post on Instagram A post shared by Nithya Menen (@nithyamenen) -
లోక్ సభ సీట్లు పెంపు..దక్షిణాది రాష్ట్రాలకు టోపీ!
-
PS2 Collections: రెండు రోజుల్లో వందకోట్లు.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పర్వం!
మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పొన్నియిన్ సెల్వన్-2. విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీని మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈనెల 28న విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. (ఇది చదవండి: ఘనంగా పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 యాంథెమ్ లాంఛ్) పొన్నియన్ సెల్వన్- 2 బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల మార్క్ను దాటేసింది. ఇండియాలో రెండో రోజు దాదాపు రూ.28.50 కోట్ల గ్రాస్ సాధించగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.51 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రిలీజైన తొలిరోజు రూ.38 కోట్ల రాబట్టిన ఈ చిత్రం రెండు రోజుల్లోనే 100 కోట్ల సాధించింది. (ఇది చదవండి: అవి వేసుకోవడం మన కల్చర్ కాదు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!) కాగా.. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్-1 పాన్ ఇండియా రేంజ్లో సత్తా చూపించింది. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దాదాపు 450 కోట్లు వసూళ్లు చేసింది. ఈ చిత్రంలో శరత్ కుమార్, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. శాండల్వుడ్ నటుడు, దర్శకుడు టపోరి సత్య కన్నుమూశారు. కిడ్నీ ఫెయిల్యూర్తో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన కోలుకోలేక తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆయన మృతి సంతాపం తెలిపారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు సంతానం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో కుటుంబానికి ఆధారమైన టపోరి సత్య మృతి తీరని శోకాన్ని మిగిల్చింది. సత్య తల్లి మాట్లాడుతూ..' సత్య ఆసుపత్రిలో వారం రోజులు ఐసీయూలో ఉన్నారు. ఆయన ఎప్పుడూ సినిమాలకే అంకితమయ్యారు. నన్ను, నా కుటుంబాన్ని ఆదుకుంటానని సత్య మాటిచ్చాడు. అతని మరణం మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.' అని కన్నీటి పర్యంతమయ్యారు. సత్య భౌతికకాయాన్ని బనశంకరిలోని ఆయన నివాసంలో అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. ఇవాళ సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. యోగేష్, నందిత జంటగా నటించిన నంద లవ్ నందిత చిత్రంలో టపోరి సత్య విలన్గా నటించారు. 2008లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత మేళా అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం మరో సినిమా తీసేందుకు సిద్ధమయ్యారు. ఈ ఘటనతో కన్నడ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఇటీవలే ఓ బుల్లితెర నటుడు సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. -
షకీలా గొప్పమనసు.. సంబంధం లేకపోయినా అండగా నిలిచింది!
సౌత్ ఇండస్ట్రీలో షకీలా పేరు తెలియని ఉండరేమో. అంతలా పేరు సంపాదించింది ఆమె. అయితే ఆమె ఎక్కువగా మళయాళ శృంగార చిత్రాలలో నటించింది. తమిళంలో ప్లేగర్ల్స్ అనే చిత్రంతో ఆమె సినీ కెరీర్ ప్రారంభించింది. అయితే ఈ సినిమాలో సిల్క్ స్మిత ప్రధాన కథానాయికగా నటించింది. ఆ తర్వాత కిన్నెర తుంబికళ్ అనే మళయాళం చిత్రంతో మొదటిసారిగా గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు 110 సినిమాల్లో నటించిన షకీలా తమిళం, మళయాళం, తెలుగు, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించింది. ఒకప్పుడు దక్షిణ చిత్రసీమలో ఎక్కువ పారితోషికం తీసుకొన్న నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఆ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. షకీలా నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట దగ్గర కోటలో పెరిగింది. అయితే గత 15 ఏళ్ల నుంచి అడల్ట్ సినిమాలకు ఆమె దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలే చేస్తున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. సమస్య ఉన్న చోటుకు వెళ్లి దాన్ని పరిష్కరించటానికి తన వంతు కృషి చేస్తున్నారు. తాజాగా షకీల ఓ అపార్ట్మెంట్ వాసులకు అండగా నిలిచారు. అసలేం జరిగిందంటే.. చెన్నైలోని చూలైమేడులో చిత్ర రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఉంది. అందులో పెద్ద సంఖ్యలో కుటుంబాలు నివాసముంటున్నాయి. అయితే ఆ అపార్ట్మెంట్ యజమాన్యం వారి నుంచి అక్రమంగా మెయింటెన్స్ వసూలు చేస్తోంది. దాదాపు వారి నుంచి రూ.9 వేలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అంత డబ్బులు కట్టలేమంటూ అపార్ట్మెంట్ వాసులు ఆందోళనకు దిగారు. దీంతో యాజమాన్యం వారిని ఇబ్బందులకు గురి చేస్తోంది. వారి అపార్ట్మెంట్కు మాత్రమే నీళ్లు రాకుండా నిలిపేసింది. ఈ చర్యలతో గత మూడు రోజుల నుంచి నరకయాతన అనుభవిస్తున్నారు. వేధింపులు భరించలేక వారంతా ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. అయితే ఈ విషయం తెలుసుకున్న షకీల అపార్ట్మెంట్ దగ్గరకు చేరుకున్నారు. నిరసన తెలుపుతున్న మద్దతుగా నిలిచారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. షకీలకు ఎలాంటి సంబంధం లేకపోయినా వారికి మద్దతుగా నిరసన చేయడం చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. -
సూపర్ హిట్ కాంబినేషన్.. 37 ఏళ్ల తర్వాత మళ్లీ!
1986లో వచ్చిన చిత్రం లేడీస్ టైలర్ సినిమా మీకు గుర్తుందా? అప్పట్లో ఆ మూవీ ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, అర్చన జోడీగా నటించారు. ఈ సినిమాలో జంటగా నటించిన రాజేంద్రప్రసాద్, అర్చనల కెమిస్ట్రీని సినీ ప్రేక్షకులు అంత సులువుగా మరచిపోలేరు. అయితే ఇప్పుడేంటీ అనుకుంటున్నారా? అయితే మళ్లీ అదే జోడీ తెరపై సందడి చేయనుంది. దాదాపు 37 ఏళ్ల తర్వాత మరోసారి స్క్రీన్ పంచుకోబోతోంది ఈ జంట. రాజేంద్ర ప్రసాద్, అర్చన ప్రధాన పాత్రల్లో తాజాగా తెరకెక్కుతోన్న చిత్రం ‘షష్ఠి పూర్తి’. రూపేష్ కుమార్ చౌదరి, ఆకాంక్షా సింగ్ జంటగా పవన్ ప్రభ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. హీరోగా నటించడంతో పాటు రూపేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాాగ చెన్నైలోని సంగీతదర్శకుడు ఇళయరాజా స్టూడియోస్లో ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ఆరంభమైంది. తొలి సీన్కి ఇళయరాజా కెమెరా స్విచాన్ చేయగా.. నిర్మాత ఆర్బి చౌదరి క్లాప్ ఇచ్చారు. రూపేష్ కుమార్ చౌదరి మాట్లాడుతూ..'లేడీస్ టైలర్’ తర్వాత రాజేంద్రప్రసాద్, ఇళయరాజా కాంబినేషన్లో ‘ఆస్తులు అంతస్తులు, చెట్టు కింద ప్లీడర్, ఏప్రిల్ 1 విడుదల లాంటి మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. చాలా ఏళ్ల తర్వాత ఈ లెజెండ్స్ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. అలాగే ‘లేడీస్ టైలర్’ తర్వాత రాజేంద్ర ప్రసాద్, అర్చన నటిస్తున్న చిత్రమిదే. ఈ సినిమాలో మొత్తం నాలుగు పాటలు ఉన్నాయి. ఈ మూవీ న్యూ ఏజ్ ఫ్యామిలీ డ్రామా. జూలైలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.' అని అన్నారు. #LadiesTailor duo #RajendraPrasad & #Archana reunited after 37 years for the film #Shastipoorthi "Shoot starts this month and release in August “ says @ActorRupesh An #Ilaiyaraaja musical#RupeshKumarChaudhary @aakanksha_s30 #PavanPrabha #ThotaTharrani @BrindhaGopal1… pic.twitter.com/nCNwXPp0sz — Phani Kandukuri (@phanikandukuri1) April 1, 2023 -
సౌత్ సినిమాల్లో ఇప్పటికీ అదే ధోరణి.. రాహుల్ దేవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దక్షిణాది సినిమాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు నటుడు రాహుల్ దేవ్. ఇప్పటికీ వారు ఇంకా 1970-80ల్లో వచ్చిన ధోరణినే అనుసరిస్తున్నాయని అన్నారు. వారు చూపించేవి నిజ జీవితంలో జరగపోయినా.. దక్షిణాది సినిమాలు బాగానే నడుస్తున్నాయని రాహుల్ దేవ్ చెప్పారు. ఇటీవల ఆవ్న గ్యాస్లైట్ అనే క్రైమ్ థిల్లర్లో కనిపించారు. ఈ మూవీ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. సారా అలీ ఖాన్, చిత్రాంగద సింగ్, విక్రాంత్ మాస్సే ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రాహల్ను.. బాలీవుడ్తో పోలిస్తే ఎక్కువ ప్రాంతీయ చిత్రాలలో నటించడంపై ప్రశ్నించారు. దీంతో రాహుల్ దేవ్ సౌత్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ తనను చాలా తక్కువగా ఉపయోగించుకుందని అన్నారు. అయితే టాలీవుడ్ పలు సూపర్హిట్ సినిమాల్లో నటించారు రాహుల్ దేవ్. రాహుల్ మాట్లాడుతూ.. 'సృజనాత్మకతను ఏ విధంగానైనా చెప్పొచ్చు. మీరు దక్షిణాది వైపు చూస్తే, వారి సినిమాలు బాగా ఆడుతున్నాయి, కానీ అవన్నీ 1970- 80ల చిత్రాల ధోరణినే ఇప్పటికీ ఫాలో అవుతున్నారు. అప్పటీ కథనే మళ్లీ చెబుతున్నారు. వారి డైలాగ్లు, నటీనటుల జీవితం కంటే పెద్దవి. కొన్ని ఓవర్ ది టాప్ యాక్షన్, ఫైట్ సీక్వెన్స్లు ఉన్నాయి. కానీ కథ పాతదే అయినా అదే కథను చెప్పే విధానం.. ప్రేక్షకులను మెప్పించడం చాలా ముఖ్యం. కాబట్టి కథను వ్యక్తీకరించిన విధానం, ఆడియన్స్ దానిని ఎలా రిసీవ్ చేసుకుంటారనేదే ముఖ్యం. అలాంటి పాత్రలు నాకు వస్తాయని ఆశిస్తున్నా'. అని అన్నారు. తన నటన జీవితంపై మాట్లాడుతూ..' ఓటీటీలతో ప్రస్తుత నటుడి నైపుణ్యం చాలా సహజంగా మారిపోయింది. ఉదాహరణకు నిజ జీవితంలో ఇద్దరు వ్యక్తులు మధ్య ఫైటింగ్ జరుగుతోంది. అందులో ఎవరిదీ తప్పు అని మనం నిర్ణయిస్తాం. అదే సినిమా విషయాకొనిస్తే అదే ఎక్కువమంది ఇష్టపడతారు. సినిమాల్లో అదే ఫైట్ను ఆ ధోరణితో చూడరు. అంటే సృజనాత్మకత ఒక వ్యక్తీకరణ మాత్రమే. ఇది మీరు ఏ విధంగానైనా వ్యక్తీకరించవచ్చు.' అని అన్నారు. కాగా.. ఛాంపియన్, ఓంకార, టోర్బాజ, రాత్ బాకీ హై వంటి చిత్రాలలో రాహుల్ నటించారు. ఇటీవల కిచ్చా సుదీప్తో కలిసి కన్నడ చిత్రం కబ్జాలో కూడా కనిపించారు. ఇందులో ఉపేంద్ర, శ్రియ శరణ్ కూడా నటించగా.. ఈ చిత్రం గత నెలలోనే విడుదలైంది. -
కాఫీకి పిలిచి రూమ్కు రమ్మన్నాడు: స్టార్ హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. డర్టీ పిక్చర్, షేర్ని, కహాని’ వంటి సినిమాలతో ఫేమ్ సాధించింది. అయితే బాలీవుడ్ బ్యూటీ ప్రస్తుతం లేడీ ఓరియెంటెండ్ సినిమాలపైనే ఫోకస్ పెట్టింది. అయితే తాజాగా విద్యాబాలన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన విద్యా బాలన్ క్యాస్టింగ్ కౌచ్ సంచలన కామెంట్స్ చేసింది. కెరీర్లో తనకెదురైన అనుభవాలను ఈ సందర్భంగా వివరించింది. విద్యాబాలన్ మాట్లాడుతూ.. ' దక్షిణాది సినిమాల్లో పని చేసేందుకు ప్రయత్నిస్తున్నా రోజులవి. ఓ యాడ్ ఫిల్మ్ కోసం డైరెక్టర్ను కలిసేందుకు చెన్నై వెళ్లా. అక్కడ కాఫీ షాప్లో మాట్లాడుకుందామని దర్శకుడితో చెప్పా. అయితే అతను నన్ను రూముకి వెళ్లి మాట్లాడుకుందామని అడిగాడు. అప్పుడే అతని ఆలోచన నాకర్థమైంది. అప్పుడే నేను గది లాక్ చేయకుండా కొంచెం తెరిచి ఉంచా. దీంతో ఆ దర్శకుడు ఏమీ మాట్లాడకుండా ఐదు మిషాల తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయాడు.' అంటూ చెప్పుకొచ్చింది నటి. ఆ సమయంలో తాను తెలివిగా వ్యవహరించడం వల్లే తప్పించుకున్నానని పేర్కొంది. అయితే ఆ దర్శకుడు ఎవరనేది మాత్రం వెల్లడించలేదు. ఇప్పటికీ ఆ సంఘటనను మర్చిపోలేకపోతున్నానని విద్యా బాలన్ చెబుతోంది. ఆ తర్వాత కూడా ఇలాంటి సంఘటనలు ఎదుర్కొన్నట్లు తెలిపింది. వాటితో మానసికంగా ఇబ్బందులు పడ్డానని.. బయట పడేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని వెల్లడించింది. ఆ సంఘటనతో దర్శకుడు సినిమా నుంచి తొలగించి.. బాడీ షేమింగ్ చేశారని వాపోయింది. కాగా.. 2005లో వచ్చిన ‘పరిణీత’ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన భామ.. 2011 లో వచ్చిన ‘డర్టీ పిక్చర్’ సినిమాతో పాపులర్ అయింది. -
అడగ్గానే రిప్లై.. వివాదంలో ప్రముఖ నటుడు.!
కన్నుమ్ కన్నుమ్, విమల్ పులివాల్ వంటి కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించిన మరిముత్తుకు పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో ఆతను పూర్తిస్థాయి నటుడిగా మారిపోయాడు. జీవా, పరియేరుమ్ పెరుమాళ్, కొంబన్ వంటి పలు హిట్ చిత్రాల్లో నటించిన ఆయన ప్రస్తుతం సీరియల్స్లోనూ నటిస్తున్నారు. ముఖ్యంగా తిరుచెల్వం దర్శకత్వం వహించిన కౌంటర్-స్విమ్మింగ్ సీరియల్లో అతని పాత్ర మంచి గుర్తింపు వచ్చింది. అలా నటనలో దూసుకెళ్తున్న మరిముత్తు తాజాగా ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. అంతే కాకుండా ప్రముఖ దర్శకులైన వసంత్, ఎస్.జె.సూర్య, మణిరత్నం, సీమాన్ వద్ద సహాయ దర్శకుడిగా కూడా పనిచేశాడు. సోషల్ మీడియాలో ఓ మహిళ నేను మీకు కాల్ చేయొచ్చా అంటూ ఓ క్యాప్షన్ పెట్టింది. అరకొర దుస్తులు ధరించిన ఫోటోను షేర్ చేసింది. ఈ పోస్ట్ చూసిన నటుడు మరిముత్తు వెంటనే ట్విటర్ ఖాతాలో రిప్లై ఇచ్చారు. అందులో ఏకంగా తన మొబైల్ నంబర్ కూడా పెట్టారు. ఇది చూసిన నెటిజన్స్ షాక్ తిన్నారు. ఆ తర్వాత నంబర్ ట్రూ కాలర్లో చెక్ చేశారు. ఆయనదే కావడంతో ప్రస్తుతం ఈ అంశం కోలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిపై మరిముత్తు తనయుడు అఖిలన్ వివరణ ఇచ్చాడు. ఆ పోస్ట్ చేసింది మా నాన్న కాదని చెప్పారు. ఎవరో కావాలనే అలా చేశారని అన్నారు. మా నాన్న నంబర్ చాలామందికి తెలుసని.. అందుకే ఎవరో దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. తన వివరణ తర్వాత ఆ నకిలీ రికార్డును తొలగించారు. On behalf of @ActorMarimuthu (his official account) - The account that has commented with his phone number doesn’t belong to him and his phone number is out in the public for quite sometime and it has been misused here. I kindly request @Schumy_Official to remove this post 🙏🏾 — Akilan Marimuthu (@akilangm) February 26, 2023 -
సౌత్ సినిమాలపై రకుల్ కామెంట్స్.. నెటిజన్స్ ఫైర్
తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ గుర్తింపు దక్కించుకున్న బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్ సినిమాలతో బిజీగా మారిపోయింది. బాలీవుడ్లో ఆమె నటించిన చిత్రాలు ఛత్రివాలి, డాక్టర్ జి, 'థ్యాంక్ గాడ్', కట్ పుట్లి, రన్వే 34, అటాక్ విభిన్న పాత్రల్లో రకుల్ నటించింది. ప్రస్తుతం కమల్ హాసన్ మూవీ ఇండియన్- 2లో కనిపించనుంది. ఇదిలా ఉండగా తాజాగా రకుల్ చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. గత కొద్ది రోజులుగా సౌత్ వర్సెస్ బాలీవుడ్ అంటూ వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల బాలీవుడ్ నటుడు సౌత్ సినిమాల్లో లాజిక్ ఉండదంటూ ఘాటు కామెంట్స్ చేశారు. రకుల్ మాట్లాడుతూ.. 'సోషల్ మీడియాలో ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తున్నారు. బాలీవుడ్, సౌత్ మూవీస్ రెండూ ఒకటే అని.. వాటిని వేర్వేరుగా చూడొద్దని హితవు పలికింది. దేశంలో ప్రతిభగల దర్శకులు ఉన్నారని.. వారు మంచి సినిమాలు చేయడం మనకే గర్వకారణం.' అంటూ చెప్పుకొచ్చింది. అయితే రకుల్ చేసిన కామెంట్స్పై నెటిజన్స్ మండిపడుతున్నారు. బాలీవుడ్ సినిమాలను సౌత్ చిత్రాలతో పోలుస్తుంటే కోపం వస్తోందా అని ప్రశ్నిస్తున్నారు. గతంలో దక్షిణాది చిత్రాలతోనే గుర్తింపు వచ్చిన విషయాన్ని మర్చిపోయావా అంటూ ట్రోల్ చేస్తున్నారు. కాగా..గతేడాది కేవలం బాలీవుడ్ చిత్రాల్లోనే రకుల్ నటించింది. -
సౌత్ సినిమాలు లాజిక్ లెస్.. బాలీవుడ్ నటుడు విమర్శలు
బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ కంటే సౌత్ సినిమాల్లో సీన్స్ ఊహకందని విధంగా ఉంటాయని ఎద్దేవా చేశారు. తెలుగు, తమిళం, కన్నడ చిత్రాల్లో కొన్ని సీన్స్ సంబంధం లేకుండా ఉంటాయన్నారు. అలాగే పాటలు కూడా ప్రేక్షకులు ఊహించని విధంగా ఉంటాయని విమర్శించారు. సౌత్ సినిమాల్లో అసలు లాజిక్ కొంచెం కూడా ఉండదన్నారు. సినిమాలు హిట్ అయినా కూడా స్క్రిప్ట్ తెరకెక్కించడంలో తప్పులు చేస్తారని అన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకూ హాజరైన నసీరుద్దీన్ సౌత్ చిత్రాలపై విమర్శలు చేశారు. సౌత్ ఇండస్ట్రీలకు ఇది కొత్తేమీ కాదని నసీరుద్దీన్ అంటున్నారు. నసీరుద్దీన్ షా మాట్లాడుతూ..' తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో సినిమాలు హిట్ అయినా.. వాటిలో చాలా లాజిక్ లెస్ సీన్స్ ఉంటాయి. సినిమాల్లో కొన్ని సన్నివేశాలు ఊహకి అందని విధంగా ఉంటాయి. వాటిలో పిచ్చి పిచ్చి పాటలు ఒకటి. హిట్ సినిమాలు అయినా కనీసం లాజిక్ పాటించరు. చిత్రీకరణలో చాలా లోపాలు ఉంటాయని' ఘాటుగా విమర్శించారు. ఇది చూసిన నెటిజన్లు నసీరుద్దీన్ షాను ట్రోల్స్ చేస్తున్నారు. అయితే మరోవైపు హిందీ చిత్రాల కంటే దక్షిణాది చిత్రాలకు ప్రేక్షకులను ఎక్కువ ఆకట్టుకుంటున్నాయని నసీరుద్దీన్ చెప్పారు. దక్షిణాది చిత్రాలను చాలా కష్టపడి తీస్తారని.. హిందీ సినిమాల కంటే హిట్ అవుతాయనడంలో సందేహం లేదన్నారు. అయితే గత కొన్నేళ్లుగా బాలీవుడ్ చిత్రాలు అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాయి, అయితే 'కేజీఎఫ్', 'పుష్ప: ది రైజ్', కాంతార, 'ఆర్ఆర్ఆర్' వంటి సౌత్ చిత్రాలు హిందీ చిత్రాల బాక్సాఫీస్ను దాటేశాయి. కాగా.. నసీరుద్దీన్ షా.. ఆస్మాన్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన 'కుట్టే'లో టబు, అర్జున్ కపూర్, రాధిక మదన్, కొంకణా సెన్శర్మ, కుముద్ మిశ్రా, శార్దూల్ భరద్వాజ్ కలిసి నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. అతను తదుపరి 'తాజ్-డివైడెడ్ బై బ్లడ్' పేరుతో రాబోయే హిస్టారికల్ డ్రామా సిరీస్లో అక్బర్ చక్రవర్తిగా కనిపించనున్నారు. -
ఇది వారికే అంకితమిస్తున్నా: రిషబ్ శెట్టి ఎమోషనల్ పోస్ట్
ఎలాంటి అంచనాలు లేకుండా పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటిన చిత్రం కాంతార. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. కేవలం రూ. 16కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ. 400కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు రిషబ్శెట్టి. అదే సినిమాకుగాను ‘దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’లో ఆయన మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్గా అవార్డు అందుకున్నారు. తనకు అవార్డు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ రిషబ్ సోషల్ మీడియాలో ఓ లేఖ పోస్ట్ చేశారు. ముంబయిలో సోమవారం ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. లేఖలో రిషబ్ శెట్టి రాస్తూ.. 'ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియడంలేదు. ‘కాంతార’ అవకాశం ఇచ్చిన హోంబలే ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ, నిర్మాత విజయ్ కిరగందూర్ సర్కు ధన్యవాదాలు. హోంబలే సంస్థతో కలిసి మరిన్ని చిత్రాలకు కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నా. కాంతార భాగమైన చిత్రబృందం, నా జీవిత భాగస్వామి ప్రగతిశెట్టి లేనిదే ఈ అవార్డు లేదు. వారి సహకారంతోనే ఇది సాధ్యమైంది. ఈ అవార్డును కర్ణాటక ప్రజలు, దివంగత నటుడు పునీత్ రాజ్కుమార్, భగవాన్ (దివంగత దర్శకుడు)సర్కు అంకితమిస్తున్నా. నన్ను అభిమానించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.' అని రిషబ్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీక్వెల్ను తెరకెక్కించే పనిలో ఉన్నారు రిషబ్. తదుపరి చిత్రంలో హీరో తండ్రి పాత్రను ప్రధానంగా చూపిస్తారని తెలుస్తోంది. -
అభిమానితో ప్రేమ.. ఆ తర్వాత.. కాంతార హీరో ప్రేమకథలో ట్విస్టులు
కన్నడ హీరో రిషబ్ శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కాంతార సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందాడు రిషబ్ శెట్టి. ఇక కాంతార మూవీ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఎలాంటి అంచనాలు లేకండా ప్రాంతీయ సినిమాగా వచ్చిన పాన్ ఇండియా స్థాయిలో కలేక్షన్స్ రాబట్టింది. కేవలం రూ. 15 కోట్లతో నిర్మించిన కాంతార ఏకంగా రూ. 400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ప్రపంచవ్యాప్తంగా బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. దీంతో రిషబ్ శెట్టి గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు. ఆయన వ్యక్తిగత జీవితంపై పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. అయితేరి షబ్ శెట్టిది లవ్ మ్యారేజ్. ఆయన భార్య పేరు ప్రగతి. ఇవాళ వాలెంటైన్స్ డే సందర్భంగా ఆయన ప్రేమ పెళ్లిపై ప్రత్యేక కథనం. అభిమానితో ప్రేమ సాధారణంగా హీరోలు తమ ఇండస్ట్రీలోని పరిచయమున్న వారితో ప్రేమలో పడట సహజం. కానీ అభిమానితో ప్రేమలో పడటం అంటే చాలా అరుదు. కానీ రిషబ్ శెట్టి జీవితంలో అదే జరిగింది. ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన అమ్మాయితో ఆయన ప్రేమలో పడ్డారు. ఓ ఈవెంట్లో ఆమెను చూసిన మనసు పారేసుకున్నారు. ఆ తర్వాత ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకున్నారట. ఓ ఈవెంట్లో 2016లో పరిచయమైన ప్రగతిని 2017లో వివాహం చేసుకున్నారు రిషబ్ శెట్టి. వీరి ప్రేమ ఎలా మొదలైందంటే.. కిరాక్ పార్టీ ఫేమ్ రక్షిత్ శెట్టితో ఓ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించారు. రిషబ్కు వీరాభిమాని అయిన ఆ ఈవెంట్కు వెళ్లింది. అక్కడే ఆమెను చూశారు రిషబ్. ఇంటికెళ్లి ఫోన్లో ఫేస్ బుక్ చూస్తే ఆ అమ్మాయి రిక్వెస్ట్ పెట్టిందట. ఆమె రిక్వెస్ట్ ఏడాది తర్వాత చూసి యాక్సెప్ట్ చేశారట. ఇక అప్పటి నుంచి చాటింగ్, ఫోన్ కాల్స్ మొదలయ్యాయి. పట్టుబట్టి మరీ ఒప్పించిన ప్రగతి అయినా ప్రగతి ఇంట్లో వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. రిషబ్ జీవితంలో ఇంకా స్థిరపడలేదని వద్దని చెప్పారు. కానీ ప్రగతి పట్టుబట్టి మరీ కుటుంబ సభ్యులను ఒప్పించింది. ఆ తర్వాత 2017లో వీరి ప్రేమ పెళ్లి జరిగింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రిషబ్ సినీ కెరీర్ రిషబ్ కెరీర్ విషయానికొస్తే ఫిల్మ్ డైరెక్షన్లో డిప్లొమా చేశారు. కన్నడ స్టార్ డైరెక్టర్ ఏమ్మార్ రమేశ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన నిర్మాత, దర్శకుడిగా రెండు చిత్రాలు చేస్తున్నారు. -
కీర్తి సురేశ్ పెళ్లి.. వరుడు ఎవరో తెలిసిపోయింది..!
నేను శైలజా సినిమాతో టాలీవుడ్ ఫేమ్ సాధించిన నటి కీర్తి సురేశ్. చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకుంది. సావిత్రి బయోపిక్లో మహానటి సినిమాతో జాతీయ అవార్డును కూడా అందుకుంది. ఇటీవల ఈ ముద్దుగుమ్మ పెళ్లిపై నెట్టింట్లో చర్చ నడుస్తోంది. గతంలో ఓ సంగీత దర్శకుడితో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వినిపించాయి. కీర్తి సురేశ్ దక్షిణాదికి చెందిన ప్రముఖ హీరోను పెళ్లి చేసుకోబోతుందని గాసిప్స్ గుప్పుమన్నాయి. అయితే ఆమె సన్నిహితులు మాత్రం నటి తన క్లాస్మేట్తో రిలేషన్షిప్లో ఉన్నట్లు వెల్లడించారు. వీరిద్దరి వివాహానికి ఆమె తల్లిదండ్రులు కూడా ఒకే చెప్పినట్లు సమాచారం. కీర్తి తన క్లాస్మేట్తో పదమూడు సంవత్సరాలకు పైగా రిలేషన్ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నందున పెళ్లిని వాయిదా వేసుకుంది భామ. కాగా.. కీర్తి సురేశ్ క్లాస్మేట్ కేరళలోని ఓ రిసార్ట్ యజమానిగా తెలుస్తోంది. దీనిపై త్వరలోనే మరింత స్పష్టత రానుంది. కీర్తి సురేష్ తర్వాత వెండితెరపై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ దసరాతో అలరించనుంది. శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో ఆమె నేచురల్ స్టార్ నానితో స్క్రీన్ షేర్ చేసుకోనుంది. మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్లో కనిపంచనున్నారు. వీటితోపాటు పలు తమిళచిత్రాల్లో నటిస్తున్నారు. -
నీకన్నా బాగా చూసుకునే వ్యక్తి ఈ ప్రపంచంలోనే లేరు: శృతిహాసన్
తెలుగు, తమిళ భాషల్లో గుర్తింపు తెచ్చుకున్న నటి శృతిహాసన్. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో కథానాయికగా నటిస్తూ అగ్రనాయికల్లో ఒకరుగా పేరు సంపాదించుకున్నారు. ఇటీవల సంక్రాంతికి విడుదలైన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాల్లో నటించింది తమిళ భామ. బాక్సాఫీస్ వద్ద ఈ రెండు సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నాయి. సోషల్ మీడియాలోనూ ఎప్పుడు యాక్టివ్గా ఉంటోంది. కాగా.. ఈ కోలీవుడ్ భామ శాంతను హజారికాతో రిలేషన్షిప్లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా శ్రుతి హాసన్, తన ప్రియుడు శాంతను హజారికాతో ఫోటోను తన ఇన్స్టాలో స్టోరీస్లో పోస్ట్ చేశారు. తన ప్రేమను వెల్లడిస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ కూడా చేసింది. తన ఇన్స్టాలో స్టోరీస్లో రాస్తూ..' ఈ ప్రపంచంలో నీకంటే సంతోషంగా నన్ను ఎవరూ చూసుకోలేరు' అంటూ ఫన్నీ ఎమోజీలు జతచేసింది. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఇటీవల వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్కు శృతి హాసన్ హాజరు కాకపోవడంతో ట్రోల్స్కు గురైంది. దీంతో తాను అనారోగ్య కారణాలతోనే హాజరు కాలేదని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. కాగా.. ఆమె ప్రశాంత్ నీల్ రాబోయే యాక్షన్ చిత్రం సలార్లో ప్రభాస్కు జోడీగా కనిపించనుంది. హోంబలే ఫిలింస్ బ్యానర్పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, మధు గురుస్వామి, ఈశ్వరీరావు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
జూనియర్ ఎన్టీఆర్ చిత్రంలో జాన్వీ.. రెమ్యూనరేషన్ వింటే షాక్..!
జాన్వీ కపూర్ అంటే బాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. దివంగత శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ బాలీవుడ్ సినిమాల్లో బిజీగా ఉంది. ఇటీవలే మిలి చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతోంది. తాజాగా జాన్వీ కపూర్పై ఓ వార్త చక్కర్లు కొడుతోంది. సౌత్ సినిమాల్లో నటించేందుకు రెమ్యూనరేషన్ భారీగా డిమాండ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. (ఇది చదవండి: ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. రామ్చరణ్కు షారూక్ ఖాన్ విజ్ఞప్తి) సౌత్ సినిమాల్లో నటించేందుకు భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చిత్రంలో నటించేందుకు జాన్వీ కపూర్ సంతకం చేసినట్లు తెలుస్తోంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న, సీతారామం బ్యూటీ మృనాల్ ఠాకూర్ కంటే ఎక్కువగా డిమాండ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఆమె ఎంత డిమాండ్ చేసిందన్నా విషయం ఇప్పటివరకు ఎవరూ వెల్లడించలేదు. ఆమె డిమాండ్కు చిత్ర నిర్మాతలు అంగీకరిస్తే సౌత్ సినిమాల్లో జాన్వీ కపూర్ కనిపించనుంది. ప్రస్తుతం జాన్వీ కపూర్ బావాల్, మిస్టర్ అండ్ మిసెస్ మహి చిత్రాల్లో నటిస్తున్నారు. -
ఏంటీ సమంత ఇలా మారిపోయావ్.. షాకవుతున్న ఫ్యాన్స్..!
హీరోయిన్ సమంత అంటే దక్షిణాది చిత్ర పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవలే యశోద చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో పలువురి ప్రశంసలు కూడా అందుకుంది. అయితే అదే సమయంలో మయోసైటిస్ వ్యాధి బారిన పడి కొద్దిరోజులు విరామం తీసుకుంది. ఆ తర్వాత ఎక్కడా కూడా సమంత బహిరంగంగా కనిపించలేదు. దీంతో ఆమె ఆరోగ్యంపై పలు రకాల వదంతులు కూడా వచ్చాయి. వీటన్నింటికీ చెక్ పెడుతూ ముంబయి ఎయిర్ పోర్ట్లో ప్రత్యక్షమై కనిపించింది భామ. మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకున్నాక బయట కనిపించడం ఇదే మొదటిసారి. వైట్ అండ్ వైట్ డ్రెస్లో ముంబయి ఇవాళ ఎయిర్పోర్ట్లో కనిపించింది. దీంతో అభిమానులు సామ్ ఈజ్ బ్యాక్ అని కామెంట్లు పెడుతున్నారు. కాకపోతే సమంతని చూసి చాలా మంది షాకవుతున్నారు. ఏంటీ ఇలా మారిపోయిందని షాకవుతున్నారు. మరికొందరేమో ఆమె ఆత్మ విశ్వాసానికి సెల్యూట్ అంటూ పోస్ట్ చేస్తున్నారు. సినిమాల విషయానికొస్తే.. ‘ద ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ ప్రతినాయక పాత్రలో మెప్పించింది. ఆ తర్వాత సామ్ నటించిన లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘యశోద’లో తన నటనతో అదరగొట్టింది. తాజాగా ‘శాకుంతలం’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది సమంత. The Most Powerful Lady I Have Ever Seen🖤 All are seeing @Samanthaprabhu2 Just Walking All I can See is her CONFIDENCE, Battling with the hardest obstacles, Hiding her Pain behind the glasses with that never giveup attitude🔥 Boss Woman 👑 #Samantha #SamanthaRuthPrabhu pic.twitter.com/J0uX8zaxTl — Sai Sunil Reddy (@SaiSunil452) January 6, 2023 -
కేజీఎఫ్ హీరోతో పాండ్యా బ్రదర్స్.. ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్..!
కేజీఎఫ్ మూవీ సృష్టించిన సంచలన అంతా ఇంతా కాదు. రెండు భాగాలు రిలీజై బాక్సాఫీస్ బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు యశ్. బాలీవుడ్తో సహా దక్షిణాదిలో యశ్ అంటే తెలియని వారు ఉండరు. తాజాగా ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఎందుకంటే క్రికెట్లో బిజీగా ఉండే పాండ్యా బ్రదర్స్ యశ్తో దిగిన ఫోటో అభిమానులను కట్టి పడేస్తోంది. ఈ ఫోటోను హార్దిక్ పాండ్యా తన ఇన్స్టాలో షేర్ చేయడంతో అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. హార్దిక్ ఫోటోలను షేర్ చేస్తూ..' కేజీఎఫ్-3' అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఆ ఫోటోల్లో కృనాల్ పాండ్యా కూడా ఉన్నారు. పాన్-ఇండియా స్టార్తో దిగిన ఫోటోలు సినీ ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. మరికొందరైతే కన్నడ పరిశ్రమకు దక్కినన గొప్ప గౌరవం అంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా.. కేజీఎఫ్ మూడో భాగం ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పటికే ప్రకటించారు. అయితే కథ ఇంకా సిద్ధం కాలేదని తెలిపారు. View this post on Instagram A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93) -
నా పనిమనిషి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, ఇప్పుడేమో..: నటి ఆవేదన
ప్రముఖ మలయాళ నటి, మోడల్ పార్వతి నాయర్, ఆమె పనిమనిషి మధ్య కొద్ది రోజులుగా వివాదం నడుస్తున్న తెలిసిందే. ఇప్పటికే అతనిపై నటి పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ఆమె ఇంట్లో ఖరీదైన వస్తువులు పోయాయంటూ పోలీసులను ఆశ్రయించింది పార్వతి నాయర్. ఆ తర్వాత సుభాష్ మీడియా ముందుకొచ్చి పార్వతిపై సంచలన ఆరోపణలు చేశాడు. ఆమె ఇంట్లోకి రాత్రిళ్లు ఎవరెవరో వస్తున్నారని ఆరోపించాడు. ఇది చూసిన కారణంగానే తనపై కక్ష కట్టిందని అన్నారు. ఈ నేపథ్యంలోనే సుభాష్ ఆరోపణలపై పార్వతి తాజాగా మీడియాతో వెల్లడించారు. (చదవండి: పనిమనిషి ఆరోపణల్ని తీవ్రంగా ఖండించిన నటి పార్వతీనాయర్) పార్వతి నాయర్ మాట్లాడుతూ.. 'అక్టోబర్లో మా ఇంట్లో ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు పోయాయి. నేను అప్పుడు షూటింగ్లో ఉన్నా. అప్పుడు ఇంట్లో ఉన్నది సుభాష్ ఉన్నాడని పోలీసులకు చెప్పా. ఆ తర్వాత నుంచి నన్ను బ్లాక్ మెయిల్ చేయటం మొదలుపెట్టాడు. మొదట్లో నేను భయపడ్డా. తర్వాత అతడి మాటలు పట్టించుకోలేదు. తప్పు చేయకపోతే అతను ఎందుకు భయపడుతున్నాడు. ఆమె మాట్లాడుతూ.. 'నా పరువుకు నష్టం కలిగించేలా మాట్లాడినందుకు దావా కూడా వేశా. అతడు చెప్పిన ప్రతీ విషయం అబద్ధం. కేసును తప్పుదోవ పట్టించటానికి ఇలా చేశాడు. అతడు తప్పు చేశాడని నా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. నేను చట్టప్రకారం ముందుకు వెళ్లాలని చూస్తున్నా. అతడు ఓ అనాథ అని నాకు మొదట్లో చెప్పాడు. ఇప్పుడు మాత్రం అతడి తరఫున వాళ్లు నాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. నాకు చాలా బాధగా ఉంది. నేను పని చేస్తున్న ప్రొడక్షన్ వాళ్లు నన్ను అడుగుతున్నారు. నాకు మానసికంగా ఇబ్బంది ఎదురవుతోంది' అని ఆవేదన వ్యక్తం చేసింది. -
సౌత్ సినిమాలు చూసి నవ్వుకునేవారు.. యశ్ సంచలన కామెంట్స్
కేజీఎఫ్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతలా స్టార్ గుర్తింపు తీసుకొచ్చింది ఆ చిత్రం. ఆ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్గా ఎదిగిపోయాడు. తాజాగా ముంబైలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో సినిమాలపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. గతంలో సౌత్ సినిమాలను చూసి ఉత్తరాది ప్రజలు ఎగతాళి చేసేవారని అన్నారు. (చదవండి: బ్రహ్మస్త్ర-2లో కేజీఎఫ్ హీరో.. కరణ్ జోహార్ క్లారిటీ..!) కానీ ప్రస్తుతం సౌత్ సినిమాలు బాక్సాఫీస్ను శాసిస్తున్నాయని తెలిపారు. అయితే ఇండియాను ప్రముఖంగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమగా మాత్రమే పరిగణించేవారని వెల్లడించారు. దక్షిణాది సినిమాలు హిందీ చిత్రాలతో పోటీపడాలంటే కష్టతరంగా భావించేవారు. కానీ రాజమౌళి మూవీ బాహుబలి తర్వాత ఇది పూర్తిగా మారిపోయిందని యశ్ అన్నారు. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ తర్వాతే ఉత్తరాది వాళ్లు దక్షిణాది చిత్రాలపై మక్కువ పెంచుకున్నారని తెలిపారు. సౌత్ సినిమాకు ఇంతలా ప్రాచుర్యం సొంతం చేసుకుందంటే ప్రధాన కారణం జక్కన్నే అని యశ్ అన్నారు. ‘కేజీయఫ్’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన తాజాగా ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో దక్షిణాది చిత్రాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యశ్ మాట్లాడుతూ.. '10 సంవత్సరాల క్రితమే డబ్బింగ్ చిత్రాలు బాగా ప్రాచుర్యం పొందాయి. కానీ మొదట్లో అందరూ భిన్నమైన అభిప్రాయాలతో చూడటం ప్రారంభించారు. సౌత్ సినిమాలంటే జనాలు ఎగతాళి చేసేవారు. 'ఇదేం యాక్షన్ .. అందరూ అలా ఎగిరిపోతున్నారు' అని నవ్వుకునేవారు. కానీ చివరికి వారు కళారూపాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభించారు. అంతే కాకుండా దక్షిణాది సినిమాలు తక్కువ ధరకు అమ్ముడయ్యేవి. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’తో మా చిత్రాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇప్పుడు సౌత్ సినిమాలను అందరూ గుర్తిస్తున్నారు.' అని అన్నారు. కేజీయఫ్-3’ గురించి మాట్లాడుతూ.. ఆ ప్రాజెక్ట్ ఇప్పుడే ఉండదని, అది పట్టాలెక్కడానికి చాలా సమయం పడుతుందని, ప్రస్తుతానికి వేరే ప్రాజెక్ట్లపై తన దృష్టి ఉందని, త్వరలోనే కొత్త సినిమా వివరాలు ప్రకటిస్తానని అన్నారు. (చదవండి: పారితోషికం రెట్టింపు చేసిన కేజీఎఫ్ బ్యూటీ!) -
సమంత ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఆ మూవీ క్రేజీ అప్డేట్..!
మహాభారతం ఆధారంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'శాకుంతలం'. ఈ చిత్రానికి దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వ వహిస్తున్నారు. ఈ మూవీలో సమంత టైటిల్ రోల్ పోషిస్తోంది. నటిస్తోంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన చిత్రబృందం ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చింది. ఈ మూవీని 3డీలో విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్రబృందం ట్వీట్ చేసింది. (చదవండి: సమంత 'శాకుంతలం' నుంచి క్రేజీ అప్డేట్.. రిలీజ్ డేట్ అప్పుడే) ఇటీవలే సుదీప్ నటించిన విక్రాంత్ రోణ సైతం 3డీలో కనువిందు చేసిన విషయం తెలిసిందే. తాజాగా సమంత శాకుంతలం 3డీలో అలరించేందుకు సిద్ధమైంది. ‘శాకుంతలం ఇప్పుడు 3డీలో రానుంది. ఈ సినిమా కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం అని ట్విటర్లో వెల్లడించింది. ఈ విషయంపై గతంలోనే వార్తలు వచ్చినా ఇప్పుడు అధికారికంగా ప్రకటించింది.ఈ వార్త విని సమంత ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. సమంత ప్రధాన పాత్రలో రూపొందిస్తున్న ఈ చిత్రానికి నీలిమ గుణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శకుంతల పాత్రలో సమంత, దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాత దిల్రాజు సమర్పిస్తుండగా.. మణిశర్మ సంగీతమందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. #Shaakuntalam Also In 3D. A new release date will be announced soon! https://t.co/iFeTe4X60U@Gunasekhar1 @Samanthaprabhu2 @ActorDevMohan #ManiSharma @neelima_guna @GunaaTeamworks @SVC_official @neeta_lulla @tipsofficial #EpicLoveStory #MythologyforMilennials#Shaakuntalam3D pic.twitter.com/gAPy7InS5D — Gunaa Teamworks (@GunaaTeamworks) November 4, 2022 -
ఆ వ్యాధి అంత డేంజరా.. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ మృతి
కోలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. తమిళ యువ సంగీత దర్శకుడు రఘురామ్ కన్నుమూశారు. ఇటీవలే కామెర్ల వ్యాధి బారిన పడిన ఆయన చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. దీంతో యావత్ కోలీవుడ్ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది. రఘురాం మృతి పట్ల ఆయన స్నేహితులు, సహచరులు, సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. తమిళంలో 2017లో వచ్చిన ‘ఒరు కిదైయిన్ కరుణై మను’ చిత్రానికి సంగీతమందించారు. 2011లో ‘రివైండ్’, ‘ఆసై’ తో పాటు మూడు తమిళ చిత్రాలకు సంగీతం అందించారు. కామెర్లు బారిన పడిన ఆయన చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరగా.. ఆరోగ్యం క్షీణించడంతో మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. -
నయన్ దంపతుల సరోగసి.. ఊహించిందే జరిగింది..!
నయనతార దంపతుల వివాదంపై చర్చ అంతా ఇంతా కాదు. పెళ్లైన నాలుగు నెలలకే ఈ జంట కవల పిల్లలకు జన్మనివ్వడం హాట్టాపిక్గా మారింది.సరోగసి విధానంలో నిబంధనలు పాటించలేదంటూ వార్తలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తమిళనాడు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మంగళవారం విచారణ పూర్తయింది. (చదవండి: నయన్ దంపతుల సరోగసిపై ప్రభుత్వం ఏం తేల్చనుంది?) తాజాగా తమిళనాడు ప్రభుత్వానికి విచారణ కమిటీ తన నివేదికను సమర్పించింది. నయనతార దంపతుల సరోగసి చట్టబద్ధమేనని తేల్చింది. 2021 నవంబర్లోనే సరోగసికి అగ్రిమెంట్ జరిగిందని కమిటీ తన నివేదికలో వెల్లడించింది. దీంతో నయన్ దంపతుల సరోగసి వివాదానికి తెరపడనుంది. -
పొన్నియన్ సెల్వన్ కలెక్షన్ల సునామీ.. వారం రోజుల్లో రూ.325 కోట్లు వసూల్!
దర్శకుడు మణిరత్నం ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన చిత్రం పొన్నియిన్ సెల్వన్- పార్ట్ 1 బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు కొల్లగొడుతోంది. కల్కి రాసిన పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం మొదటివారంలో ప్రపంచవ్యాప్తంగా రూ.325 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. కేవలం ఒక్క తమిళనాడులోనే రూ.130 కోట్లకుపైగా కలెక్షన్లతో దూసుకెళ్తోేంది. తమిళంలో గతంలో విడుదలైన రోబో 2.0, విక్రమ్ తర్వాత పొన్నియిన్ సెల్వన్ మూడోస్థానంలో కొనసాగుతోందని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ త్రినాథ్ వెల్లడించారు. సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో తమిళం, హిందీ, తెలుగు, మలయాళం, కన్నడలో రిలీజైంది. పదో శతాబ్దంలోని చోళ రాజుల ఇతివృత్తం ఆధారంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్లో చిత్రీకరించారు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ సినిమాలో చియాన్ విక్రమ్, ఐశ్వర్యరాయ్, త్రిష, కార్తి, జయం రవి, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రదానం.. ఉత్తమ చిత్రంగా 'సూరారై పోట్రు'
దేశ రాజధాని ఢిల్లీలో 68వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. దేశవ్యాప్తంగా చిత్ర పరిశ్రమలో సత్తా చాటిన నటీనటులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆవార్డులు ప్రదానం చేశారు. డిల్లీలోని విఘ్నయన్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రసార, సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ హాజరయ్యారు. 2020వ సంవత్సరానికి గాను 68వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను గతంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకులు జి.ఆర్.గోపినాథ్ జీవిత కథను స్ఫూర్తిగా తీసుకుని తెలుగు దర్శకురాలు సుధా కొంగర తమిళంలో తెరకెక్కించిన 'సూరరై పోట్రు' జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఇందులో ప్రధాన పాత్రల్లో నటించిన సూర్య ఉత్తమ నటుడిగా, అపర్ణా బాలమురళి ఉత్తమ నటిగా పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి తన భార్యతో జ్యోతిక కలిసి హాజరయ్యారు తమిళ హీరో సూర్య. సమాజంలోని కుల వివక్షను కళ్లకు కడుతూ తెరకెక్కిన 'కలర్ ఫొటో' తెలుగులో ఉత్తమ చిత్రంగా అవార్టు గెలుచుుకంది. సంప్రదాయ నృత్యానికి పట్టం కడుతూ.. రూపొందించిన తెలుగు చిత్రం 'నాట్యం' ఉత్తమ నృత్యాలు, మేకప్ విభాగాల్లో పురస్కారాలు అందుకుంది. పాటలతో అలరించిన 'అల వైకుంఠపురములో' చిత్రం సంగీత విభాగంలో అవార్డు కైవసం చేసుకుంది. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ సైన్యాధిపతి తాన్హాజీ జీవిత గాథతో హిందీలో తెరకెక్కిన 'తాన్హాజీ: ది అన్ సంగ్ వారియర్' ఉత్తమ సమగ్ర వినోదాత్మక చిత్రంగా అవార్డు సొంతం చేసుకుంది. అందులో తానాజీ పాత్రలో నటించిన అజయ్ దేవగణ్, సూర్యతో కలసి ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నారు. -
Kamal Haasan: రెండేళ్ల తర్వాత సెట్స్లో అడుగుపెట్టిన కమల్.. ఫోటోలు వైరల్
కమల్ హాసన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఇండియన్ 2’. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో కమల్ హాసన్ సేనాపతి పాత్రలో కనిపించనున్నారు. కొన్నేళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ను ప్రారంభించగా సెట్స్లో అగ్నిప్రమాదం సంభవించడం, ఆ ఆతర్వాత కోర్టు కేసులతో దాదాపు రెండేళ్ల పాటు షూటింగ్ నిలిచిపోయింది. ప్రస్తుతం ఇండియన్ 2 షూటింగ్ తిరిగి ప్రారంభం కావడంతో కమల్ హాసన్ సెట్స్లో సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను కమల్ సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. (చదవండి: Rakul Preet Singh: ‘ఇండియన్ 2’ సెట్లో అడుగుపెట్టిన రకుల్) ఈ ఫోటోల్లో దర్శకుడు శంకర్, కమల్ చర్చించుకుంటున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత కమల్ సెట్స్లో అడుగు పెట్టడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో కమల్కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. అంతే కాకుండా ఈ సినిమా కోసం అందాల భామ హార్స్ రైడింగ్ కూడా నేర్చుకుంటోంది. ఈ చిత్రంలో సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, బాబీ సింహా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రెండేళ్ల క్రితం సెట్స్లో అగ్నిప్రమాదం సంభవించి ముగ్గురు సిబ్బంది మృతి చెందడంతో షూటింగ్ నిలిపేశారు. #Indian2 from today. @Udhaystalin @shankarshanmugh @LycaProductions @RedGiantMovies_ pic.twitter.com/TsI4LR6caE — Kamal Haasan (@ikamalhaasan) September 22, 2022 -
అందుకే ఆయన పొన్నియిన్ సెల్వన్లో భాగం కాలేదు: మణిరత్నం
కోలీవుడ్లో తెరకెక్కిన ఎన్నో హిట్ చిత్రాలకు పనిచేసిన పాటల రచయిత 'వైరముత్తు'. అంతటి పేరు ప్రఖ్యాతలు ఉన్నా ఆయన.. ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన పలు చిత్రాలకు గతంలో సాహిత్యమందించారు. వైరముత్తు పాటలు సినీ ప్రియుల్ని కట్టిపడేసేలా ఉంటాయి. మరీ తాజాగా మణిరత్నం రూపొందించిన కొత్త చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’లో మాత్రం వైరముత్తు ఎందుకు లేరు. దీనికేమైనా ప్రత్యేక కారణాలున్నాయా అన్న చర్చ నడుస్తోంది. అయితే ఇటీవల జరిగిన ఓ సమావేశంలో అడిగిన ప్రశ్నకు తాజాగా మణిరత్నం స్పందించారు. 'వైరముత్తు టాలెంట్ విషయంలో ఎలాంటి సందేహం లేదు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సైతం వైరముత్తు టాలెంట్ను మెచ్చుకునేవారు. నేను ఆయనతో కలిసి ఎన్నోసార్లు పనిచేశా. ఆయన సాహిత్యాన్ని నా సినిమాల్లో ఉపయోగించా. అతనొక అద్భుతం. అయితే వైరముత్తును మించిన కొత్త టాలెంట్ ప్రస్తుతం పరిశ్రమలో ఉంది. కొత్త తరానికి ప్రోత్సాహమందించాలి’ అందుకే అని మణిరత్నం వివరణ ఇచ్చారు. గతంలో వైరముత్తుపై మీటూ ఆరోపణలు రావడంతో దూరం పెట్టారని కోలీవుడ్లో వార్తలొస్తున్నాయి. (చదవండి: పొన్నియిన్ సెల్వన్ ఆ నటితో చేద్దామనుకున్నా: మణిరత్నం) అయితే గతంలో వైరముత్తు తమను వేధింపులకు గురి చేశాడంటూ కొంతమంది మహిళలు ‘మీటూ’ వేదికగా ఆరోపించారు. ప్రముఖ గాయని చిన్మయి సైతం ఆయనపై ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే వైరముత్తుతో పనిచేసేందుకు పలువురు సినీ ప్రముఖులు వెనకాడుతున్నట్లు అప్పట్లోనే కోలీవుడ్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. మణిరత్నం, వైరముత్తు చివరి చిత్రం 'చెక్క చివంత వానం' (2018). ఈ చిత్రంలో 'మజై కురువి' 'భూమి భూమి' లాంటి హిట్ సాంగ్స్ ఉన్నాయి. పొన్నియిన్ సెల్వన్ కోసం ఇళంగో కృష్ణన్ మూడు పాటలు, కబిలన్, శివ అనంత్, కృతికా నెల్సన్లు మరో మూడు పాటలు రాశారు. -
పునీత్ రాజ్ కుమార్ బయోపిక్ ! క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
Director Santhosh Gave Clarity On Puneet Raj Kumar Biopic: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంటే ఇప్పుడు తెలియనివారుండరు. పునీత్ మరణాంతరం ఆయన చేసిన గొప్పతనం అందరికీ తెలిసింది. అన్నిటికిమించి ఆయన చనిపోయాక సేవా కార్యక్రమాలు ఆగిపోకూడదని రూ. 8 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన మహానుభావుడు పునీత్ రాజ్ కుమార్. అలాంటి వ్యక్తిపై బయోపిక్ రానుంది. ఇంతకుముందు పునీత్ రాజ్ కుమార్ బయోపిక్ రానుందని కన్నడ నాట పుకార్లు వచ్చాయి. వీటిపై దర్శకకుడు సంతోష్ ఆనంద్ రామ్ స్పందించారు. పునీత్ మరణించిన తర్వాత ఒక అభిమాని ఆయనపై బయోపిక్ నిర్మించే ఆలోచన ఉందా అని ట్వీటర్లో ప్రశ్నించగా, 'బయోపిక్ తీయడానికి నా శాయశక్తుల ప్రయత్నిస్తాను' అని దర్శకుడు సంతోష్ తెలిపారు. I’ll try my level best to bring this idea on screen 🙏 #appusirliveson https://t.co/ivcPkm7HyF — Santhosh Ananddram (@SanthoshAnand15) November 21, 2021 చదవండి: పునీత్ రాజ్ కుమార్ భార్య ఎమోషనల్ పోస్ట్.. అప్పుకు అంకితంగా చాలా మంది అభిమానులు పునీత్ బయోపిక్ రావాలనే ఆలోచనను స్వాగతించారు. ఆయన ఫ్యాన్స్ అతన్ని అప్పు అని పిలుస్తారు. ఒక అభిమాని 'అవును, నిజంగా చాలా గొప్ప ఆలోచన. దయచేసి మా ప్రియమైన అప్పు బయోపిక్తో రండి' అని ట్వీట్ చేశాడు. మరొకరు 'దయచేసి మా అప్పు సర్ బయోపిక్ తీయండి. ఆయన మంచితనాన్ని రేపటి తరానికి చాటుదాం. అప్పు ఈ ప్రపంచంలో మంచి గుర్తింపుతో చిరస్మణీయుడవుతాడు.' రాసుకొచ్చారు. ఈ బయోపిక్తో అప్పును మరోసారి బిగ్ స్క్రీన్పై చూసి తరిస్తాం. మీ దర్శకత్వంతో ఆయనకు ఉత్తమ నివాళి అవుతుంది.' అని ఇంకొకరు ట్వీట్ చేశారు. గతేడాది విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన యువరత్న చిత్రంతో పునీత్ రాజ్ కుమార్ చివరిసారిగా తెరపై కనిపించారు. దీనికి సంతోశ్ ఆనంద్ రామ్ దర్శకత్వం వహించారు. నాలుగేళ్ల క్రితం కూడా పునీత్ 'రాజకుమార' సినిమాను డైరెక్ట్ చేశారు సంతోష్. ఈ సినిమా కన్నడ ఇండస్ట్రీలో రికార్డులు తిరగరాయడమే గాక రూ. 45 కోట్లు వసూలు చేసింది. అలాగే పునీత్ చివరిగా నటించిన కన్నడ చిత్రం 'జేమ్స్'. దీనికి ఒక యాక్షన్ సీక్వెన్స్, డబ్బింగ్ తప్ప మిగతా షూట్ అంతా పూర్తి చేశారు పునీత్ రాజ్ కుమార్. అయితే ఈ సినిమాను థియేటర్లలో విడదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు మూవీ మేకర్స్. చదవండి: పునీత్ రాజ్ కుమార్కు అరుదైన గౌరవం.. 'కర్ణాటక రత్న' అవార్డు ప్రదానం -
కొత్త బిజినెస్లోకి ఎంట్రీ ఇస్తున్న కమల్హాసన్
విలక్షణ నటుడు కమల్హాసన్ ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. ఒక మంచి ఉద్దేశ్యంతోనే ఆయన ఈ ప్రయాణం ఆరంభిస్తున్నారు. యువతకు ఖాదీని దగ్గర చేయాలని, నేత కార్మికులకు చేయూత అందించాలని ‘హౌస్ ఆఫ్ ఖద్దర్’ ఫ్యాషన్ బ్రాండ్ను లాంచ్ చేయనున్నారు. ‘‘మన దేశానికి ఖాదీ ఓ గర్వకారణం. అన్ని వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉంటుంది. చలికాలంలో ఉండే అసౌకర్యాన్ని, వేసవి కాలంలో ఉండే వేడి నుంచి మనకు ఉపశమనం ఇస్తుంది. యువతకు ఖాదీని మరింత చేరువ చేయాలని, చేనేత కళాకారుల స్థితిగతులను మెరుగుపరచాలన్నది నా ఆలోచన’’ అన్నారు కమల్హాసన్. కాగా వచ్చే నెల కమల్ అమెరికా వెళ్లాలనుకుంటున్నారట. అక్కడి చికాగో నగరంలో తన బ్రాండ్ని ఆవిష్కరించాలనుకుంటున్నారని సమాచారం. నవంబరు 7న కమల్ పుట్టినరోజు. ఆ రోజే ‘హౌస్ ఆఫ్ ఖద్దర్’ ఆవిష్కరణ ఉంటుందని టాక్. కమల్, ఆయన కుమార్తె శ్రుతీహాసన్కి కాస్ట్యూమ్ డిజైనర్గా వ్యవహరిస్తున్న అమృతా రామ్ ఆధ్వర్యంలో ఈ ఫ్యాషన్ బ్రాండ్ దుస్తుల డిజైనింగ్ జరుగుతోందని తెలిసింది. -
థ్రిల్ అయిన సేతుపతి
‘‘డిఫరెంట్ థ్రిల్లర్గా రూపొందిన ‘ఎ’ చిత్రం టీజర్, ట్రైలర్, సినిమా బాగున్నాయి. ఒక మంచి సినిమా తీసిన యూనిట్కి అభినందనలు. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది’’ అని నటుడు విజయ్ సేతుపతి అన్నారు. నితిన్ ప్రసన్న, ప్రీతీ అస్రాని జంటగా యుగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎ’. అవంతిక ప్రొడక్షన్స్పై పతాకంపై గీతా మిన్సాల నిర్మించిన ఈ సినిమా మార్చి 5న విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్ను విజయ్ సేతుపతి ఇటీవల విడుదల చేశారు. ట్రైలర్కు మంచి స్పందన రావడంతో చిత్రబృందం విజయ్ సేతుపతిని కలిసి, తమ సినిమాకు సపోర్ట్గా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ‘‘డిఫరెంట్ థ్రిల్లర్గా తెరకెక్కిన చిత్రమిది. మా సినిమాలోని కొంత పార్ట్ని చూసిన విజయ్ సేతుపతిగారు ఎంతో థ్రిల్కి గురయ్యారు. ఆయన సపోర్ట్ మాకు ఉండడంతో సినిమా చూడాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఎక్కువగా ఉంది. పీవీఆర్ పిక్చర్స్ వారు మా సినిమాను విడుదల చేస్తున్నారు. విజయ్ కురాకుల సంగీతం అందించగా, అనంత్ శ్రీరామ్ అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు’’ అన్నారు. -
‘తలైవి’ వర్ధంతి : కంగనా స్టన్నింగ్ స్టిల్స్
సాక్షి, ముంబై: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి జయలలిత బయోపిక్కు సంబంధించిన స్టన్నింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న 'తలైవి' మూవీ సంబంధించి కొన్నివర్కింగ్ స్టిల్స్ ను ఆమె ట్విటర్లో షేర్ చేశారు. ముఖ్యంగా నేడు (శనివారం, డిసెంబరు 5) జయలలిత వర్ధంతి సందర్భంగా విప్లవ నాయకికి కంగనా నివాళులర్పించారు. మరో వారం రోజుల్లో సినిమా పూర్తికానుందని పేర్కొన్న కంగనా ఈ సందర్శంగా సూపర్ హ్యూమన్లా సినిమాను తెరకెక్కిస్తున్న విజయ్తోపాటు, తలైవి చిత్ర యూనిట్కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జయలలిత బయోపిక్ 'తలైవి-ది రివల్యూషనరీ లీడర్' లో కంగనా రనౌత్ లీడ్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. లాక్డౌన్ కారణంగా ఆరు నెలలపాటు వాయిదా పడిన ఈ మూవీ షూటింగ్ కార్యక్రమాలను శరవేంగా పూర్తి చేసుకుంటోంది. హితేష్ ఠక్కర్, తిరుమల్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ హిందీ, తమిళం తెలుగు భాషలలో విడుదల కానుంది. On the death anniversary of Jaya Amma, sharing some working stills from our film Thalaivi- the revolutionary leader. All thanks to my team, especially the leader of our team Vijay sir who is working like a super human to complete the film, just one more week to go 🙏 pic.twitter.com/wlUeo8Mx3W — Kangana Ranaut (@KanganaTeam) December 5, 2020 -
జీలకర్ర... బెల్లం
కాజల్ది పంజాబీ కుటుంబం. ఆమె చేసుకున్న అబ్బాయి గౌతమ్ది కాశ్మీరీ ఫ్యామిలీ. ఈ పంజాబీ–కాశ్మీరీ వెడ్డింగ్లో సౌతిండియా మీద ప్రేమను చూపించారు కాజల్. జీలకర్ర బెల్లాన్ని తమ పెళ్లిలో భాగం చేశారు. నార్త్ పెళ్లిలో సౌత్ సంప్రదాయాన్ని కూడా పాటించారు. ఈ విషయం గురించి కాజల్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకుంటూ – ‘‘గౌతమ్కు, నాకు సౌతిండియా మీద ఉన్న ప్రేమాభిమానాలే జీలకర్ర బెల్లాన్ని మా పెళ్లిలో భాగం చేశాయి. తెలుగు పెళ్లిలో వధూవరులు జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు. దీనికి ఎంతో ప్రాధాన్యం ఉంది. భార్యాభర్త కష్టనష్టాల్లోనూ కలిసే ఉండాలి అని చెబుతుంది జీలకర్ర బెల్లం’’ అని రాసుకొచ్చారు కాజల్. -
‘ఇంకా ఆ ఘడియ రాలేదు’
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘ఈ వేడుకకు వచ్చిన వారంతా ఏ విషయంపై ఎదురుచూస్తున్నారో ఊహించగలను, నేనేం చేసేది.. ఇంకా ఆ సమయం రాలేదు’ అని నటుడు రజనీకాంత్ వ్యాఖ్యానించారు. చెన్నైలో బుధవారం రాత్రి నిర్వహించిన ‘కాలా’ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుకలో ఆయన అనేక విషయాలను నర్మగర్భంగా ప్రస్తావించారు. రాజకీయ పార్టీ ప్రకటనపై మాత్రం ఇంకా జాప్యం జరగనున్నట్లు స్పష్టమైన సందేశం ఇచ్చారు. ‘‘గత నాలుగు దశాబ్దాలుగా నా పనైపోయిందని కొందరు హేళన చేస్తూనే ఉన్నారు. తమిళనాడు ప్రజలు, ఆ దేవుడు నేను ముందుకు సాగేలా చేస్తూనే ఉన్నారు. ఎవరెన్ని విమర్శలు, ఆక్షేపణలు చేసినా నా మార్గంలో నేను పయనిస్తూనే ఉంటా. దక్షిణాదిన నదుల అనుసంధానం నా కల. ఒకవేళ ఈ కల నెరవేరకపోయినా ఫరవాలేదు. మన ఆలోచనలే బలం, మంచి ఆలోచనలతో చెడు ఆలోచనలు తుడిచివేయండి, అపుడే జీవితం బాగుంటుంది. సినిమాల పరంగా అనేక విషయాలు మాట్లాడాను, అయితే అందరూ మరో విషయం కోసం ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. నేనేం చేసేది ఇంకా ఆ తేదీ రావాలి. సమయం వస్తుంది. ఆ దేవుని ఆశీర్వాదంతో తమిళనాడుకు, ప్రజలకు మంచి రోజులు వస్తాయి’’అని రజనీ ప్రసంగం ముగించారు. -
దక్షిణ భారత అథ్లెటిక్స్ పోటీలకు మేరికుమార్
నరసరావుపేట ఈస్ట్: దక్షిణ భారత అంతర్ రాష్ట్ర అథ్లెటిక్స్ పోటీలకు ఎస్ఎస్ఎన్ కళాశాల ఐబీఏ విద్యార్థి ఎస్ మేరికుమార్ ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా.పీఎన్వీడీ మహేష్ శుక్రవారం తెలిపారు. అక్టోబర్ 4, 5 తేదీల్లో కరీంనగర్లో జరిగే దక్షిణ భారత అంతర్ రాష్ట్ర అథ్లెటిక్స్ పోటీల్లో జావెలిన్త్రో విభాగంలో మేరికుమార్ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని వివరించారు. విద్యార్థిని కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు కపలవాయి విజయకుమార్, కార్యదర్శి నాగసరపు సుబ్బరాయగుప్తా, ఉపాధ్యక్షుడు పెనుగొండ వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్ మహేష్, వైస్ ప్రిన్సిపాల్ సోము మల్లయ్య, వ్యాయామ అధ్యాపకుడు వై మధుసూదనరావు తదితరులు అభినందించారు.