-
హీరోయిన్ పూజా హెగ్డేకి బంపరాఫర్.. ఏకంగా 10 ఏళ్ల తర్వాత!
పూజా హెగ్డే.. కాదు కాదు బుట్టబొమ్మ అంటే తెలుగు ప్రేక్షకులు టక్కున గుర్తుపట్టేస్తారు. కొన్నాళ్ల క్రితం తెలుగులో వరస సినిమాలతో హిట్ కొట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరస ఫ్లాప్స్ దెబ్బకు పూర్తిగా సైలెంట్ అయిపోయింది. ఇక ఈమె కెరీర్ ఖతం అని అందరూ ఫిక్సయ్యారు. ఇలాంటి టైంలో ఈమెకి క్రేజీ బంపరాఫర్ చెంతకు చేరింది. ఇంతకీ ఏంటి సంగతి?(ఇదీ చదవండి: తెలుగు సీరియల్ నటి కేసులో ట్విస్ట్.. ప్రియుడు సూసైడ్!)కోలీవుడ్లో రేర్ కాంబో సెట్ కాబోతుంది. సూర్య 'కంగువ' మూవీ చేస్తున్నాడు. ఈ ఏడాదే థియేటర్లలోకి రానుంది. మరోవైపు తన 44వ చిత్రాన్ని కూడా రెడీ చేసేస్తున్నాడు. దీనికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకుడు. సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్టెయిన్మెంట్స్, కార్తీక్ సుబ్బరాజ్ కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారు. రీసెంట్గానే అధికారిక ప్రకటన వచ్చింది. ఇప్పుడు ఈ మూవీలోనే పూజా హెగ్డేని హీరోయిన్ అనుకుంటున్నారట.పదకొండేళ్ల క్రితం 'మాస్క్' అనే తమిళ సినిమాతోనే హీరోయిన్ అయిన పూజా హెగ్డే.. మధ్యలో విజయ్తో 'బీస్ట్'తో రీఎంట్రీ ఇచ్చింది. కానీ అది దెబ్బకొట్టింది. ప్రస్తుతం ఫ్లాప్స్ వల్ల పూర్తిగా ఛాన్సుల్లేక సైలెంట్ అయిపోయిన ఈమెకు.. సూర్య మూవీలో ఛాన్స్ అంటే బంపరాఫర్ అనే చెప్పొచ్చు. ఒకవేళ ఇది హిట్ అయితే మాత్రం మళ్లీ సౌత్లో పాగా వేసే ఛాన్స్ ప్లస్ కోరుకున్న బ్రేక్ రావొచ్చు. మళ్లీ రష్మిక లాంటి ట్రెండింగ్ బ్యూటీస్ పోటీ పడొచ్చు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి సుహాస్ లేటెస్ట్ హిట్ మూవీ.. మూడు వారాల్లోనే స్ట్రీమింగ్) -
యావరేజ్ స్టూడెంట్
‘మెరిసే మెరిసే’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన పవన్ కుమార్ కొత్తూరి హీరోగా మారారు. ఆయన హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘యావరేజ్ స్టూడెంట్ నాని’. స్నేహా మాలవ్య, సాహిబా భాసిన్, వివియా సంత్ హీరోయిన్లుగా నటించారు. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి బ్యానర్పై పవన్ కుమార్ కొత్తూరి, బిషాలీ గోయెల్ నిర్మించిన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్.ఈ సందర్భంగా పవన్ కుమార్ కొత్తూరి మాట్లాడుతూ– ‘‘యూత్ఫుల్ లవ్, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘యావరేజ్ స్టూడెంట్ నాని’. అన్ని వర్గాల ప్రేక్షకులకు మా సినిమా నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఝాన్సీ, రాజీవ్ కనకాల, ‘ఖలేజా’ గిరి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్ బి. కొడకండ్ల, కెమెరా: సజీష్ రాజేంద్రన్. -
డర్టీ ఫెలో రెడీ
శాంతి చంద్ర హీరోగా, దీపికా సింగ్, ‘మిస్ ఇండియా 2022’ సిమ్రితి హీరోయిన్లుగా ఆడారి మూర్తి సాయి దర్శకత్వం వహించిన చిత్రం ‘డర్టీ ఫెలో’. గూడూరు భద్రకాళీ సమర్పణలో జీయస్ బాబు నిర్మించిన ఈ చిత్రం ఈ 24న రిలీజ్కి రెడీ అయింది. ఈ సినిమా ట్రైలర్ని ‘బింబిసార’ మూవీ ఫేమ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘డర్టీ ఫెలో’ ట్రైలర్ బాగుంది.ఈ సినిమా విజయం సాధించి, యూనిట్కి మంచి పేరు రావాలి’’ అన్నారు. శాంతి చంద్ర, మూర్తి సాయి ఆడారి మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన చిత్రం ‘డర్టీ ఫెలో’. మా సినిమాలోని అన్ని పాటలకు మంచి స్పందన వచ్చింది. మా చిత్రంలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రామకృష్ణ .యస్, సంగీతం: డా. సతీష్ కుమార్ .పి. -
హిట్ లిస్ట్ టీజర్ బాగుంది: సూర్య
‘‘హిట్ లిస్ట్’ మూవీ టీజర్ చాలా బాగుంది. సినిమా ఇంకా బాగుంటుందని ఆశిస్తున్నాను. విజయ్ కనిష్కతో పాటు టీమ్కి ఈ మూవీ మంచి సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని హీరో సూర్య అన్నారు. తమిళ దర్శకుడు విక్రమన్ తనయుడు విజయ్ కనిష్క హీరోగా సముద్ర ఖని, శరత్కుమార్, గౌతమ్ వాసుదేవ మీనన్ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘హిట్ లిస్ట్’. సూర్య కతిర్ కాకల్లార్, కె. కార్తికేయన్ దర్శకత్వం వహించారు.దర్శకుడు కేఎస్ రవికుమార్ నిర్మించారు. ఈ మూవీని శ్రీ శ్రీనివాస స్క్రీన్స్, శ్రీ శ్రీనివాస ఇన్ఫ్రా, బెక్కం ్ర΄÷డక్షన్స్ సంస్థలు తెలుగులో రిలీజ్ చేస్తున్నాయి. త్వరలో రిలీజ్ కానున్న ఈ సినిమా టీజర్ని సూర్య లాంచ్ చేశారు. ‘‘యాక్షన్, సస్పెన్స్, క్రైమ్ జానర్లో రూపొందిన చిత్రం ‘హిట్ లిస్ట్’. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్కి మంచి స్పందన వచ్చింది. తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది’’ అన్నారు మేకర్స్. -
భైరవ స్పెషల్ పర్సన్ బుజ్జి
తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు? అంటే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. తమ అభిమాన హీరో పెళ్లి ఎప్పుడా అని ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ వివాహంపై ఎప్పటికప్పుడు రూమర్లు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అయితే పెళ్లి వార్తల గురించి ప్రభాస్ ఎప్పుడూ స్పందించలేదు. తాజాగా శుక్రవారం ఉదయం ‘‘డార్లింగ్స్... ఫైనల్లీ నా జీవితంలోకి చాలా ప్రత్యేకమైన వ్యక్తి ప్రవేశించనున్నారు.. వేచి చూడండి’ అంటూ ఇన్స్టాగ్రామ్లో ప్రభాస్ చేసిన పోస్ట్ వైరల్గా మారింది.ఈ పోస్ట్ పెళ్లి గురించేనా? ఆయన పరిచయం చేయబోతున్న ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు? అనే చర్చ జరిగింది. కాగా శుక్రవారం సాయంత్రం ప్రభాస్ సోషల్ మీడియా ద్వారా ‘‘డార్లింగ్స్... బుజ్జిని మీకు పరిచయం చేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అని మరో పోస్ట్ షేర్ చేశారు. దాంతో ప్రభాస్ పెట్టిన ఈ రెండు పోస్ట్లు ‘కల్కి 2898 ఏడీ’ సినిమా ప్రచారంలో భాగం అనే టాక్ తెర పైకి వచ్చింది.. ఈ చిత్రంలో భైరవ పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా... బుజ్జి పేరుతో ఓ పాత్ర ఉంది. ఆ బుజ్జి ఎవరు అనేది ఈరోజు సాయంత్రం తెలిసిపోతుంది. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్వినీదత్ నిర్మిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ జూన్ 27న విడుదల కానుంది. -
కన్నప్పలో కాజల్
విష్ణు మంచు టైటిల్ రోల్ చేస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’. శివ భక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా ఈ సినిమాని దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. మంచు మోహన్బాబు నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది. కాగా ‘కన్నప్ప’ సినిమాలో కాజల్ అగర్వాల్ ఓ కీలక పాత్రలో నటించనున్నట్లుగా చిత్ర యూనిట్ శుక్రవారం వెల్లడించింది.ఇంకా ఈ సినిమాలో మోహన్బాబు, శరత్కుమార్, మోహన్లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే ఈ సినిమా టీజర్ ప్రస్తుతం ఫ్రాన్స్లో జరుగుతున్న 77వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో రిలీజ్ కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘మోసగాళ్ళు’ (2021) మూవీ కోసం విష్ణు మంచు, కాజల్ అగర్వాల్ స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. మళ్లీ ఇప్పుడు ‘కన్నప్ప’ కోసం కలిశారు. -
ఎన్టీఆర్ డ్రాగన్?
ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది. ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభం అవుతుందని, చిత్రీకరణ ప్రధానంగా విదేశాల్లో ఉంటుందనే టాక్ ఎప్పట్నుంచో వినిపిస్తోంది. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కావొచ్చనే ఊహాగానాలూ ఇటీవల తెరపైకి వచ్చాయి. తాజాగా ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ను మేకర్స్ పరిశీలిస్తున్నారని ఫిల్మ్నగర్ సమాచారం.కాగా ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి సరికొత్త వివరాలు వెల్లడి కానున్నాయని తెలిసింది. మరోవైపు ‘డ్రాగన్’ టైటిల్ హక్కులు బాలీవుడ్ దర్శక–నిర్మాత కరణ్ జోహార్ దగ్గర ఉన్నాయని, దర్శకుడు ప్రశాంత్ నీల్ అండ్ టీమ్ అడగడంతో ఈ టైటిల్ను కరణ్ ఇచ్చేశారని బాలీవుడ్ సమాచారం. మరి.. ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్లోని సినిమాకు ఫైనల్గా ‘డ్రాగన్’ టైటిల్ ఖరారవుతుందా? వెయిట్ అండ్ సీ. -
బుల్లితెర నటి కేసులో ట్విస్ట్.. ప్రియుడు సూసైడ్!
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బుల్లితెర నటుడు చందు బలవన్మరణానికి పాల్పడ్డారు. హైదరాబాద్లోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అల్కాపూర్ కాలనీలో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. చందు ప్రస్తుతం త్రినయిని, రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం లాంటి సీరియల్స్లో నటించారు. కాగా.. 2015లో శిల్పను ప్రేమ వివాహం చేసుకున్న చందుకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.కాగా.. ఇటీవలే రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరాం మృతి చెందిన సంగతి తెలిసిందే. గత ఆరేళ్లుగా చందుకు టీవీ నటి పవిత్ర జయరాంతో పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే పవిత్ర పుట్టినరోజు సందర్భంగా తనను రమ్మంటుంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే కాకుండా ఓ యూట్యూబ్ ఛానెల్తో తనకు బ్రెయిన్ వ్యాధి ఉందని వెల్లడించారు. కాగా.. పవిత్రతో సహజీవనం చేసిన చందు ఆమెను గుర్తు చేసుకుంటూ ఆవేదన చెందారు. ఈ నేపథ్యంలో చందు సూసైడ్ చేసుకోవడం ఒక్కసారిగా టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటనతో సీరియల్ నటి పవిత్ర జయరాం యాక్సిడెంట్ కేసు కీలక మలుపులు తిరగనుంది. -
ఓటీటీలోకి సుహాస్ లేటెస్ట్ హిట్ మూవీ.. మూడు వారాల్లోనే స్ట్రీమింగ్
మరో క్రేజీ సినిమా ఓటీటీ రిలీజ్కి రెడీ అయిపోయింది. సుహాస్ హీరోగా నటించిన ఆ సినిమా పేరే 'ప్రనస్న వదనం'. విడుదలకు ముందే అంచనాలు ఏర్పరుచుకున్న ఈ చిత్రం.. థియేటర్లలోకి వచ్చిన తర్వాత బాగుందనే టాక్ సొంతం చేసుకుంది. కాకపోతే కాన్సెప్ట్ కాస్త కొత్తగా ఉండటంతో జనాలకు అనుకున్న స్థాయిలో రీచ్ కాలేకపోయింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో అలరించేందుకు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.తెలుగులో ఈ మధ్య కాలంలో సుహాస్ పేరు బాగా వినిపిస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటికే 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' మూవీతో హిట్ కొట్టిన ఈ యంగ్ హీరో.. రీసెంట్గా 'ప్రసన్న వదనం'తో వచ్చాడు. మే 3న థియేటర్లలోకి వచ్చింది. హీరోకి ఫేస్ బ్లైండ్నెస్ అనే కథ ఆసక్తికరంగా అనిపించింది. సినిమా కూడా బాగానే ఉందని చూసినవాళ్లు అభిప్రాయపడ్డారు. ఇప్పుడీ మూవీ మూడు వారాల్లోనే అంటే మే 24 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: భూ వివాదంలో ట్విస్ట్.. క్లారిటీ ఇచ్చిన జూ.ఎన్టీఆర్ టీమ్)'ప్రసన్నవదనం' కథేంటి?సూర్య (సుహాస్) ఓ రేడియో జాకీ. ఓ యాక్సిడెంట్ కారణంగా ప్రొసోపగ్నోషియా అనే పరిస్థితి వస్తుంది. ఇది ఓ లోపం. అదేంటంటే ఇతడికి మొహాలు గుర్తుండవు, కనిపించవు. అన్నీ గుర్తుంటాయి ముఖాలు తప్ప. దీన్ని ఫేస్ బ్లైండ్నెస్ అంటారు. ఈ సమస్యతో ఉన్నోడు కాస్త ఓ హత్యలో సాక్షి అవుతాడు. అసలా మర్డర్ చేసిందెవరు? లోపమున్న హీరో నిందుతుల్ని ఎలా పోలీసులకు పట్టిస్తాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ.ఇలాంటి థ్రిల్లర్ సినిమాలు థియేటర్లలో చూడాలంటే కాస్త కష్టం కానీ ఓటీటీలో మాత్రం క్రేజీగా ఆడేస్తాయి. ప్రస్తుతం అటు థియేటర్, ఇటు ఓటీటీలో పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు. వచ్చే వారం ఓటీటీలోకి వచ్చేస్తుంది కాబట్టి 'ప్రసన్నవదనం'.. డిజిటల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ఛాన్సులు గట్టిగా ఉంటాయనమాట.(ఇదీ చదవండి: ఘోర ప్రమాదం.. స్పాట్లో చనిపోయిన స్టార్ హీరో బంధువులు)Without a Face, But Not Without Courage..💪A Hero's Journey Beyond Sight!🎭A gripping thriller-drama #PrasannaVadanamOnAha Premieres May 24th!(24 hours early access for aha gold subscribers)@ahavideoIN @ActorSuhas @payal_radhu @RashiReal_ @ManikantaJS @ReddyPrasadLTC… pic.twitter.com/NG4CmDnW94— ahavideoin (@ahavideoIN) May 17, 2024 -
డర్టీ ఫెలో ట్రైలర్ రిలీజ్
శాంతి చంద్ర, దీపిక సింగ్, మిస్ ఇండియా(2022) సిమ్రితి హిరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం డర్టీ ఫెలో. ఆడారి మూర్తి సాయి దర్శకత్వంలో గుడూరు భద్ర కాళీ సమర్పణలో రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై జి. యస్. బాబు నిర్మించారు. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర మూవీ దర్శకులు మల్లిడి వశిష్ఠ శుక్రవారం నాడు ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ మాట్లాడుతూ.. శాంతిచంద్ర హీరోగా నటించిన డర్టీఫెలో సినిమా ట్రైలర్ రిలీజ్ చేశాం. ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు. చిత్ర హీరో శాంతిచంద్ర మాట్లాడుతూ.. మా సినిమా ట్రైలర్ రిలీజ్ చేసి టీమ్ను అభినందించిన మల్లిడి వశిష్ఠ గారికి ధన్యవాదములు. మే 24న డర్టీ ఫెలో సినిమా రిలీజ్ అవుతుంది. ఇటీవల మధుర ఆడియో ద్వారా రిలీజ్ అయిన అన్ని పాటలు మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది అన్నారు. -
'దర్శిని' సినిమా రివ్యూ
వికాస్, శాంతిప్రియ జంటగా నటించిన సినిమా 'దర్శిని'. డాక్టర్ ప్రదీప్ అల్లు దర్శకత్వం వహించగా, ఎల్వీ సూర్యం నిర్మాత వ్యవహరించారు. సైన్స్ ఫ్రిక్షన్ థ్రిల్లర్ కథతో తీసిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?సంతోష్(వికాస్), ప్రియ(శాంతిప్రియ), లివింగ్ స్టోన్(సత్య) ఫ్రెండ్స్. ముగ్గురూ కలిసి ఔటింగ్ కోసం సైంటిస్ట్ డాక్టర్ దర్శిని ఫామ్ హౌస్కి వెళ్తారు. అనుకోకుండా ఓ గదిలో సెన్సార్ ఉన్న పెన్ దొరుకుతుంది. దాని బటన్ ప్రెస్ చేయగానే స్క్రీన్పై భవిష్యత్ చూపిస్తుంది. మరోవైపు అదే ఫామ్ హౌస్లో దర్శిని శవంలా కనిపిస్తుంది. ఇకపోతే ఓ పోలీస్ తన చెల్లి కనపడట్లేదని ఇక్కడికి వస్తాడు. ముగ్గురు ఫ్రెండ్స్కి ఎవరో ఫోన్ చేసి బెదిరిస్తూ ఉంటారు. అసలు దర్శిని ఎలా చనిపోయింది? ముగ్గుర్ని బెదిరించేది ఎవరు? ఆ భవిష్యత్తు మిషిన్ కథేంటి? అనేదే సినిమా స్టోరీ.(ఇదీ చదవండి: స్థల వివాదంలో ట్విస్ట్.. క్లారిటీ ఇచ్చిన జూ.ఎన్టీఆర్ టీమ్)ఎలా ఉందంటే?టైమ్ ట్రావెల్ కథలు.. పిల్లల నుంచి పెద్దోళ్ల వరకు ఇంట్రెస్ట్ కలిగిస్తుంటాయి. అలా భవిష్యత్ చూపించే మెషీన్ అనే కాన్సెప్ట్తో స్టోరీ బాగానే అనుకున్నారు. కానీ కథనం మాత్రం కాస్త సాగదీశారు. సైన్స్ ఫిక్షన్ కథతో పాటు ఇందులో ప్రేమకథ కూడా ఉంటుంది. ఇంటర్వెల్కి ముగ్గురు ఫ్రెండ్స్ని ఎవరో చంపబోతున్నట్టు ట్విస్ట్ ఇచ్చి, సెకండాఫ్పై క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. ఇక ఇంటర్వెల్ తర్వాత ఒక్కో ట్విస్ట్ రివీల్ చేసుకుంటూ వెళ్తారు. అయితే తక్కువ పాత్రలతో దాదాపు ఒకే ఇంట్లో సినిమా అంతా తీశారు. కొన్ని సన్నివేశాల్లో భయపెట్టారు!ఎవరెలా చేశారు?'దర్శిని'లో చేసిన వాళ్లందరూ కొత్తవాళ్లే. ప్రధాన పాత్రల్లో చేసిన వికాస్, శాంతి ప్రియ పర్వాలేదనిపించారు. లివింగ్ స్టోన్ పాత్ర చేసిన సత్య నవ్వించగా, మిగిలిన వాళ్లు ఫరిది మేరకు యాక్ట్ చేశారు. టెక్నికల్ విషయాలకొస్తే.. సినిమాటోగ్రఫీ ఇంకాస్త బెటర్గా ఉండాల్సింది. పాటలు ఓకే. దర్శకత్వం కూడా చాలా మెరుగుపరుచుకోవాల్సింది. నిర్మాణ విలువలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి.(ఇదీ చదవండి: నేను హ్యాపీగా లేను.. హీరోయిన్ ఛాన్స్ అని చెప్పి: ఈషా రెబ్బా) -
భూ వివాదంలో ట్విస్ట్.. క్లారిటీ ఇచ్చిన జూ.ఎన్టీఆర్ టీమ్
భూవివాదంలో జూ.ఎన్టీఆర్.. ఏకంగా తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించాడు. శుక్రవారం ఉదయం సడన్గా ఈ న్యూస్ బయటకొచ్చింది. పలు వెబ్ సైట్స్తో పాటు మీడియా ఛానెల్స్లోనూ ఇది వచ్చింది. దీంతో అసలేం జరిగిందా అని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఈ విషయంలో తారక్ టీమ్ ట్విస్ట్ ఇచ్చింది. అసలు ఈ గొడవతో ఇతడికి సంబంధమే లేదని తేల్చి చెప్పింది.(ఇదీ చదవండి: ఘోర ప్రమాదం.. స్పాట్లో చనిపోయిన స్టార్ హీరో బంధువులు)అసలేం జరిగింది?జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 75లోని ఓ ఫ్లాట్ని ఎన్టీఆర్ 2003లో కొన్నాడు. గీత లక్ష్మి అనే మహిళ దీన్ని విక్రయించింది. అయితే 1996లో ఆ ల్యాండ్ మీద పలు బ్యాంకుల్లో గీతలక్ష్మి కుటుంబం లోన్స్ తీసుకుంది. ఈ విషయాన్ని దాచిపెట్టి ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసి ఎన్టీఆర్కి అమ్మేశారు. కానీ ఫ్లాట్ అమ్మేటప్పుడు కేవలం ఒక్క బ్యాంకులో మాత్రమే లోన్ ఉందని చెప్పి, దాన్ని క్లియర్ చేసిన తర్వాత తారక్కి భూమి తాలుకూ పేపర్లు తీసుకున్నారు.అయితే ఆ ఫ్లాట్ తనఖా పెట్టి లోన్ తీసుకుని, చెల్లించని కారణంగా ఆ భూమిపై హక్కులు తమవే అని పలు బ్యాంకులు నోటీసులిచ్చాయి. ల్యాండ్ విషయంలో సమగ్ర విచారణ చేయకుండానే డీఆర్టీ(రుణ వసూళ్లు ట్రైబ్యునల్) తీర్పిచ్చిందని.. ఈ ఆదేశాల్ని రద్దు చేయాలని ఎన్టీఆర్ తాజాగా తెలంగాణ కోర్టుని ఆశ్రయించినట్లు వార్తలొచ్చాయి. అయితే తారక్ కోర్టుకెళ్లారనేది నిజం కాదని, అలానే ఆ ఫ్లాట్ 2013లోనే తారక్ అమ్మేశారని ఇప్పుడు అతడి పేరు ఉపయోగించొద్దని చెబుతూ ఓ నోట్ రిలీజ్ చేసింది. అలానే ఈ ల్యాండ్ తో ఎన్టీఆర్ కి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. ఇకపోతే ప్రస్తుతం వెకేషన్లో ఉన్న ఎన్టీఆర్.. తన పుట్టినరోజుని విదేశాల్లోనే కుటుంబంతో కలిసి జరుపుకోబోతున్నాడు.(ఇదీ చదవండి: నేను హ్యాపీగా లేను.. హీరోయిన్ ఛాన్స్ అని చెప్పి: ఈషా రెబ్బా) -
బోర్ కొట్టేస్తుంది.. అలాంటి సినిమాలు చేద్దామనుకుంటున్నా
కీర్తి సురేశ్ టాలెంట్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 'మహానటి' మూవీతో నేషనల్ అవార్డు అందుకుంది. తనెంటో ప్రూవ్ చేసింది. దీని తర్వాత తెలుగు, తమిళ, మలయాళంలో వరస చిత్రాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంది. ఇన్ని సినిమాలు చేస్తున్నా గానీ ఓ విషయంలో సంతృప్తి పడకూడదని అంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినిమాలు గురించి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.(ఇదీ చదవండి: నేను హ్యాపీగా లేను.. హీరోయిన్ ఛాన్స్ అని చెప్పి: ఈషా రెబ్బా)''మహానటి' తర్వాత మరింత బాధ్యతగా సినిమాలు చేస్తున్నాను. కొన్ని కథా పాత్రలు నటీనటుల జీవితం, వృత్తి పరమైన ఇమేజ్ని మార్చేస్తాయి. ఇకపై మీ జర్నీ ఎలా ఉండాలనేది అవి డిసైడ్ చేస్తాయి. మంచి పాత్రలకు ఉండే బలం అది. 'మహానటి' విషయంలో నాకు అలాంటి అనుభవమే ఎదురైంది. దీని తర్వాత మంచి పాత్రలను ఎంపిక చేసుకుని నటించాలనే భావన కలిగింది''అయితే నేను చేసే అన్ని సినిమాలు అలాంటి ఫలితాన్ని అందిస్తాయని అనుకోవడం కరెక్ట్ కాదు. షూటింగ్ స్పాట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ పాత్రలోని ఎమోషనల్ వెంటాడుతుందంటే అది మంచి పాత్ర. అయితే అలాంటి మ్యాజిక్ కొన్నిసార్లే జరుగుతుంది. అలానే ఒకేలాంటి పాత్రలు చేస్తుంటే అభిమానులకు బోర్ కొడుతుంది. అందుకే ఛాలెంజింగ్ పాత్రల్లో నటించాలని అనుకుంటున్నాను' అని కీర్తి సురేశ్ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్) -
ఆ డైరెక్టర్ నన్ను చంపుతానని బెదిరించాడు.. నా వెంటే ఎయిర్పోర్టుకు..
హీరోయిన్ లయ.. అప్పట్లో యూత్కే కాదు ఫ్యామిలీ ఆడియన్స్కు కూడా ఫేవరెట్ హీరోయిన్. ఏ పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసే ఈ అందాల రాశి సినిమాలకు దూరమై దాదాపు పద్దెనిమిదేళ్లవుతోంది. మధ్యలో 'బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం' అనే సినిమాలో అమ్మవారి పాత్రలో కనిపించింది. తర్వాత సినిమాలవైపు కన్నెత్తి చూడలేదు. అమెరికాలో సెటిలైన ఈమె అక్కడ నాలుగేళ్లపాటు ఐటీ ఉద్యోగం చేసింది. తర్వాత అది వదిలేసి డ్యాన్స్ స్కూల్ పెట్టింది. కోవిడ్ తర్వాత దాన్ని కూడా మానేసి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉండటం మొదలుపెట్టింది.అందుకే ఇండియాకు వచ్చేశాతాజాగా ఓ షోలో పాల్గొన్న ఆమె ఎన్నో విషయాల గురించి మాట్లాడింది. 'నేను అమెరికా వెళ్లిపోయాక నా గురించి లేనిపోనివి ప్రచారం చేశారు. రోడ్డున పడ్డానని, అడుక్కుతింటున్నానని, ఇంకా ఎన్నో వదంతులు సృష్టించారు. అవి గుర్తు చేసుకున్నప్పుడల్లా బాధేస్తుంది. ఇప్పుడు నేను ఇండియాకు రావడానికి ప్రధాన కారణం.. సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాను. నితిన్ 'తమ్ముడు' సినిమాలో నటిస్తున్నాను' అని చెప్పుకొచ్చింది.నన్ను ఫాలో అవుతూ..అలాగే తన చేదు అనుభవాన్ని వెల్లడిస్తూ.. 'ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న డైరెక్టర్ నన్ను ఫాలో అయ్యాడు. బేగంపేటలో కారు పార్కింగ్ చేసే దగ్గరకు వచ్చి మీరు ఎలా వెళ్తారో చూస్తానని బెదిరించాడు. నేను ఎలాగోలా తప్పించుకుని ఎయిర్పోర్టుకు వెళ్లిపోయాను. కానీ ఆయన నన్ను ఫాలో అవుతూ అక్కడికీ వచ్చాడు. మీరు చంపుతానన్నా నేనేం చేయలేను.. ఇక్కడ ఎవరూ లేరు, మీ ఇష్టం చంపేయండన్నాను' అంటూ లయ ఆనాటి ఇబ్బందికర పరిస్థితిని గుర్తు చేసుకుంది. అయితే ఆ డైరెక్టర్ ఎవరన్నది మాత్రం బయటపెట్టలేదు.చదవండి: చేతికట్టు తొలగించి కేన్స్లో మెరిసిన ఐశ్వర్య రాయ్ -
ప్రభాస్ బ్యాచిలర్ లైఫ్ కు స్వస్తి ?
-
Aishwarya Rajesh: సోయగంతో కవ్విస్తున్న ఐశ్వర్య రాజేష్ (ఫొటోలు)
-
డార్లింగ్ లైఫ్లోకి స్పెషల్ పర్సన్?.. ఆసక్తికర పోస్ట్ (ఫొటోలు)
-
కొన్నేళ్లుగా పోలీసుల రక్షణలో సూర్య ఇల్లు.. కారణం ఇదే
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇల్లు పోలీసుల రక్షణలో ఉంది. ఇలా రెండున్నరేళ్ల నుంచి ఆయన ఇంటికి ప్రభుత్వ ఖర్చుతో పోలీసు రక్షణ కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయంపై తమిళనాట చర్చ జరుగుతుంది. సూర్య కుటుంబం ప్రస్తుతం చెన్నైలో లేదు.. అయినా కూడా ఆ ఇంటికి పోలీసులు రక్షణ కల్పిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటి అనేది తెలుసుకుందాం.జై భీమ్తో వివాదంసూర్య, జ్యోతిక, దర్శకుడు టీజే జ్ఞానవేల్ కలిసి నిర్మించిన చిత్రం జై భీమ్. 2021లో అమెజాన్ ప్రైమ్లో ఈ చిత్రం విడుదలైంది. జైభీమ్లోని కొన్ని సన్నివేశాలు తమ సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయని 'రుద్ర వన్నియర్ సేన' సంఘం ఆరోపించింది. ఇరులార్ కమ్యూనిటీ (ఆదివాసీలు) సభ్యులకు కస్టోడియల్ టార్చర్ వెనుక తమ వర్గానికి చెందిన సభ్యులు ఉన్నట్లు సినిమాలో చూపించడాన్ని వారు తప్పుపట్టారు. సూర్యపై దాడి చేసిన వారికి లక్ష రూపాయల నగదు బహుమతి ఇస్తామని ఆ సంఘం తెలిపింది. 'రుద్ర వన్నియర్ సేన' సంఘానికి సూర్య బహిరంగ క్షమాపణ చెప్పడంతో పాటు నష్టపరిహారంగా రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో టీ నగర్లోని సూర్య ఇంటి వెలుపల ఐదుగురు సాయుధ పోలీసులను తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసింది.ఇప్పటికీ పోలీసుల రక్షణ ఎందుకు..?జై భీమ్ సినిమా సమస్య కొన్ని నెలల తర్వాత ముగిసినప్పటికీ, సూర్య ఇంటికి గత రెండున్నరేళ్లుగా నలుగురు పోలీసులు రక్షణగా ఉన్నారు. ప్రస్తుతం ఆ ఇంట్లో సూర్య కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. వారందరూ ఇప్పుడు ముంబైలో ఉన్న విషయం తెలిసిందే. అయినా ఆ ఇంటికి పోలీసుల రక్షణ ఎందుకు అనే ప్రశ్న తలెత్తింది. ఈ పరిస్థితిలో, నటుడు సూర్య ఇంటికి పోలీసు రక్షణ ఎవరి ఆదేశాల మేరకు కొనసాగుతుందని సామాజిక కార్యకర్త కృష్ణమూర్తి సమాచార హక్కు చట్టం కింద ప్రశ్నించారు. పోలీస్ కమిషనర్ వివరణపోలీస్ కమిషనర్ ఆదేశం మేరకు నవంబర్ 15, 2021న తాత్కాలిక భద్రత కల్పించామని, సూర్యకు ముప్పు పొంచి ఉన్నందున భద్రతా సమీక్ష కమిటీ నిర్ణయం మేరకు భద్రతను ఇప్పటికీ కొనసాగిస్తున్నామని సమాధానమిచ్చారు. సాధారణంగా బెదిరింపులకు గురైన వ్యక్తులకు పోలీసు రక్షణ కల్పించినప్పుడు సంబంధిత వ్యక్తి తప్పనిసరిగా పోలీసు శాఖకు రుసుము చెల్లించాలి. అలా అయితే, ప్రస్తుత పోలీసు రక్షణ కోసం సూర్య ఏమైనా డబ్బు చెల్లిస్తున్నారా అనే ప్రశ్న కూడా తలెత్తింది, దానికి సమాధానం లేదు. దీంతో గత రెండున్నరేళ్లుగా సూర్య ఇంటికి ప్రభుత్వ ఖర్చుతో భద్రత కల్పిస్తున్నట్లు తేలింది. ఇది ఎంతవరకు న్యాయమని సామాజిక కార్యకర్త కృష్ణమూర్తి ప్రశ్నించారు. ఇందులో తమిళనాడు ప్రభుత్వ నిర్లక్ష్యమని ఆయన అన్నారు. -
ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్
డార్లింగ్ ప్రభాస్ నుంచి సడన్ సర్ప్రైజ్ వచ్చింది. స్వతహాగా ఇంట్రావర్ట్ అయిన ఇతడు.. బయటకు కనిపించడం తక్కువ. ఇక మాట్లాడటం అయితే గగనం అని చెప్పొచ్చు. అలాంటిది ఇప్పుడు ఇన్ స్టాలో అందరూ అవాక్కయ్యేలా ఇన్ స్టాలో స్టోరీ పెట్టాడు. త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతున్నామని అంటున్నాడు. ఇంతకీ ఏంటి విషయం? ఏమై ఉండొచ్చు?(ఇదీ చదవండి: అది ఫేక్ న్యూస్.. రూమర్స్పై మహేశ్-రాజమౌళి మూవీ నిర్మాత క్లారిటీ)'బాహుబలి' తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయిన ప్రభాస్.. ఊపిరి సలపనంత బిజీగా మారిపోయాడు. గతేడాది 'సలార్'తో హిట్ కొట్టి మళ్లీ సక్సెస్ అందుకున్నాడు. త్వరలో 'కల్కి'గా రాబోతున్నాడు. జూన్ 27న థియేటర్లలోకి రాబోతుంది. రిలీజ్కి మరో 40 రోజులు కూడా లేదు. ఇంకా ప్రమోషన్స్ ఎప్పుడు మొదలుపెడతారా అని అందరూ వెయిట్ చేస్తుండగా.. ప్రభాస్ ఇన్ స్టాలో ఇంట్రెస్టింగ్ స్టోరీ పెట్టాడు.'డార్లింగ్స్.. ఫైనల్లీ నా జీవితంలోకి చాలా ప్రత్యేకమైన వ్యక్తి రాబోతున్నారు. వెయిట్ చేయండి' అని ప్రభాస్ తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. అయితే ఇది పెళ్లి గురించే అని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు బిజీ షెడ్యూల్లో ప్రభాస్ పెళ్లి చేసుకోవడం అసాధ్యం. కాబట్టి కొత్త మూవీ ప్రమోషన్ లేదా అంటే ఇంకేదైనా అయ్యిండొచ్చని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అదేంటో ప్రభాస్ చెప్పేవరకు వెయిట్ అండ్ సీ.(ఇదీ చదవండి: తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్) -
తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
-
అది ఫేక్ న్యూస్.. రూమర్స్పై మహేశ్-రాజమౌళి మూవీ నిర్మాత క్లారిటీ
'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' దర్శకుడు రాజమౌళి.. నెక్స్ట్ మూవీ మహేశ్ బాబుతో తీయనున్నాడు. ఇప్పటికే దీని గురించి అందరికీ తెలుసు. కాకపోతే ఎప్పుడు మొదలవుతుందనేది ఇంకా సస్పెన్స్. మరోవైపు ఈ మూవీ మొదలవడానికి ముందే బోలెడన్ని రూమర్స్ వస్తున్నాయి. ఇప్పుడు వాటిలో ఒక దానిపై నిర్మాతలే స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఏంటది?(ఇదీ చదవండి: వారంలోపే ఓటీటీలోకి వచ్చేసిన 'కృష్ణమ్మ' సినిమా)మహేశ్తో మూవీ ఉంటుందని చాన్నాళ్ల క్రితమే రాజమౌళి బయటపెట్టాడు. ప్రస్తుతం ఇంకా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మాత్రమే నడుస్తోంది. కానీ హీరోయిన్లు, ఇతర నటీనటుల గురించి బోలెడన్ని రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఇండోనేసియా నటిని హీరోయిన్ గా తీసుకున్నారని, ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె కూడా నటించబోతుందని అన్నారు. అలానే నాగార్జున కీలక పాత్ర చేయబోతున్నాడని కూడా టాక్ వినిపించింది.అయితే పైన వచ్చిన రూమర్స్ వేటికి స్పందించని నిర్మాణ సంస్థ.. వీరేన్ స్వామి అనే క్యాస్టింగ్ డైరెక్టర్ తమతో కలిసి పనిచేయట్లేదని క్లారిటీ ఇచ్చింది. అసలు ఈ రూమర్స్ ఎప్పుడొచ్చాయా అని నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మిగతా విషయాల కంటే పర్టిక్యూలర్గా ఈ విషయం కోసం ఎందుకు నోట్ రిలీజ్ చేసిందనేది మాత్రం అర్థం కాలేదు. చేస్తే చేశారు గానీ అలానే మూవీ ఎప్పుడు మొదలవుతుందో అనే అప్డేట్ ఇస్తే కాస్త ఫ్యాన్స్ అయిన ఖుషీ అయ్యేవారు!(ఇదీ చదవండి: తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్) -
తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
హైదరాబాద్, సాక్షి: టాలీవుడ్ అగ్రనటుడు జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. నగరంలో భూవివాదానికి సంబంధించిన ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో ల్యాండ్కు సంబంధించిన వివాదంలో జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75లో తనకు సంబంధించిన ప్లాట్ విషయంలో వివాదం తలెత్తడంతో ఆయన కోర్టుకు వెళ్లారు. 2003లో గీత లక్ష్మీ అనే వ్యక్తి నుంచి ఒక ప్లాట్ను ఎన్టీఆర్ కొన్నారు. అయితే,ఆ ల్యాండ్పై బ్యాంకులకు హక్కులు ఉన్నాయంటూ డీఆర్టీ (రుణ వసూళ్ల ట్రైబ్యునల్) ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించారు.1996లో ఆ ల్యాండ్ మీద పలు బ్యాంకుల వద్ద ప్రాపర్టీ మోర్ట్ గెజ్ ద్వారా గీత లక్ష్మి కుటుంబం లోన్స్ పొందింది. అయితే, జూనియర్ ఎన్టీఆర్కు అమ్మే సమయంలో ఆ విషయాన్ని గీత లక్ష్మి దాచిపెట్టింది. ఫేక్ డాక్యుమెంట్స్ ద్వారా ఇదే ల్యాండ్ మీద ఐదు బ్యాంకుల నుంచి గీత లక్ష్మి లోన్స్ తీసుకుంది. కానీ, ల్యాండ్ అమ్మే సమయంలో కేవలం ఒక్క బ్యాంకులో మాత్రమే మార్ట్ గేజ్ లోన్ ఉన్నట్లు ఎన్టీఆర్కు గీత లక్ష్మి చెప్పింది. ఆ సమయంలో చెన్నైలోని ఒక బ్యాంక్లో లోన్ క్లియర్ చేసి ఆ డాక్యుమెంట్స్ను ఎన్టీఆర్ తీసుకున్నారు. 2003 నుంచి ఆ ప్లాట్ ఒనర్గా తారక్ ఉన్నారు.అయితే 1996లోనే ఈ స్థలాన్ని తనఖా పెట్టి రుణం చెల్లించని కారణంగా ఆ ఆస్తిపై హక్కులు తమవేనని పేర్కొంటూ పలు బ్యాంకులు నోటీసులు ఇచ్చాయి. వీటిని రద్దు చేయాలంటూ ఎన్టీఆర్ కోర్టును ఆశ్రయించారు. ల్యాండ్ విషయంలో సమగ్ర విచారణ చేయకుండానే డీఆర్టీ (రుణ వసూళ్ల ట్రైబ్యునల్) ఆదేశాలు ఇచ్చిందంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. స్థలాన్ని అమ్మిన వారిపై కేసు పెట్టినట్లు తారక్ లాయర్ తెలిపారు. అయితే డాకెట్ ఆదేశాలు అందాల్సి ఉందని, కొంత సమయం ఇస్తే వాటి వివరాలు సమర్పిస్తామని చెప్పారు. జూన్ 6న విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. -
‘లవ్ మీ’ మూవీ ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
అబ్రాడ్కు వెళ్లిపోయిన రజనీకాంత్
కోలీవుడ్ స్టార్ రజనీకాంత్కు తాను నటించిన చిత్రం పూర్తి కాగానే విశ్రాంతి కోసం ఆధ్యాత్మికత పర్యటనలకు వెళ్లడం పరిపాటి. అలా హిమాలయాలు, హరిద్వార్, ద్వారకేష్ వంటి ప్రదేశాలకు వెళ్లి ఒకటి రెండు వారాలు ధ్యానం, యోగా వంటి మానసికంగా నూతనోత్సాహాన్ని పొంది వస్తుంటారు. ప్రస్తుతం ఈయన కథానాయకుడిగా నటిస్తున్న వేట్టైయాన్ చిత్రాన్ని జై భీమ్ చిత్రం ఫేమ్ జ్ఞానవేల్ దర్శతక్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. నటుడు అమితాబ్ కీలక పాత్రను పోషించిన ఇందులో నటి దుషారా విజయన్, రిత్వికాసింగ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. కాగా రజనీకాంత్ ఈ చిత్రం షూటింగ్ను ఇటీవలే పూర్తి చేశారు. తదిపరి లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి కూలీ అనే టైటిల్ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ జూన్ నెలల్లో ప్రారంభం కానుంది. దీనికి అనిరుధ్ సంగీతాన్ని, గిరీష్ గంగాధరన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఇప్పటికే చిత్ర దర్శకుడు లోకేశ్ కనకరాజ్ ఫస్ట్ ఆఫ్ కథను సిద్ధం చేసి.. సెకండ్ ఆఫ్ పూర్తిచేసే పనిలో ఉన్నట్లు తెలిసింది. దీంతో రజనీకాంత్ రిలాక్స్ కోసం తాజాగా అబ్రాడ్కు వెళ్లారు. ఆయన చెన్నై విమానాశ్రయం నుంచి అబుదాబి వెళుతున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా మరో కొన్ని వారాలు అక్కడ గడిపిన తరువాత రజనీకాంత్ చెన్నైకి తిరిగి వస్తారని సమాచారం. சென்னை விமான நிலையத்திலிருந்து எதிஹாட் ஏர்வேஸ் விமானம் மூலம் அபுதாபி புறப்பட்டு சென்றார் நடிகர் ரஜினிகாந்த்...#Chennai | #Airport | #Actor | #Rajinikanth | #SuperStar | #AbuDhabi | #PolimerNews pic.twitter.com/j9JJvxcLlt— Polimer News (@polimernews) May 16, 2024 -
వారంలోపే ఓటీటీలోకి వచ్చేసిన 'కృష్ణమ్మ' సినిమా
ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో సత్యదేవ్, అతీరా రాజ్ జంటగా నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’. వీవీ గోపాలకృష్ణ దర్శకత్వంలో అరుణాచల క్రియేషన్స్పై కృష్ణ కొమ్మాలపాటి నిర్మించిన ఈ చిత్రం మే 10న విడుదల అయింది. అయితే, ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. విడుదలైన వారానికే ఓటీటీలోకి వచ్చేసింది.చిత్రపరిశ్రమలో విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ ‘కృష్ణమ్మ’ని విడుదల చేశాయి. ఇందులో సత్యదేవ్ నటనతో పాటు సెకండ్ పార్ట్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. కానీ కథా నేపథ్యం కాస్త సాగతీతగా ఉంటుంది. అయితే, ఎలాంటి ప్రకటన లేకుండా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’ వచ్చేసింది. మే 16 నుంచే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లో చూడలేని ప్రేక్షకులు ఈ వీకెండ్లో ఇంట్లోనే చూసేయండి.టాలీవుడ్లో మంచి ప్రతిభ ఉన్న నటుల్లో సత్యదేవ్ ఒకరు. వైవిధ్యభరితమైన కథలతో ప్రేక్షకుల్ని అలరించే ప్రయత్నం చేసేందుకు ఎప్పుడూ ఆయన ముందుంటారు. ‘కృష్ణమ్మ’ సినిమా కూడా స్నేహంతో ముడిపడి ఉన్న ప్రతీకార కథగా సాగుతుంది. ఇందులో బలమైన భావోద్వేగాలతో పాటు రా రస్టిక్ కోణం ఉన్నప్పటికీ.. కథలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్లి తీరు కాస్త సాగతీత వ్యవహారంగా ఉంటుంది.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
మరో రెండ్రోజులు వానలు
డాక్టర్ రోడ్ సేఫ్టీ: మాయా టాండన్
రోజు రూ.2 కోట్లకుపైగానే..
టీబీ నియంత్రణకు కృషిచేయాలి
కేంద్రాల వద్ద టార్పాలిన్లు కరువు..
చెంచుల అభిప్రాయం మేరకే ముందుకు..
ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
పాఠశాలల్లో అభివృద్ధి పనులు పూర్తిచేయాలి
అన్నదాతల అగచాట్లు
రోజు రూ.2 కోట్లకుపైగానే..
తప్పక చదవండి
- అనంతలో ఘోర ప్రమాదం: పెళ్లి షాపింగ్ చేసి తిరిగొస్తుండగా..
- తిరుమల: నేడు ఆగష్టు ఆర్జితసేవా టికెట్ల విడుదల
- అలాంటి సీన్స్ నా వల్ల కాదు.. కొందరు దర్శకులు కావాలనే..
- Naveen Patnaik: రాజకీయ పర్యాటకుల ప్రభావం సున్నా
- నేడు ఈఏపీ సెట్ ఫలితాలు
- ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
- Global Burden of Disease: సగటు జీవితకాలం పైపైకి..
- Delhi liquor scam: నిందితుల జాబితాలో ఆప్, కేజ్రీవాల్
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
- త్వరలో గ్రూప్–4 ఎంపిక జాబితా
Advertisement