TRS Government
-
ఎక్కడికక్కడే బీజేపీ నేతలు అరెస్ట్.. కిషన్ రెడ్డి స్పందన ఇదే..
Kishan Reddy.. సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు తెలంగాణలో రాజకీయ సంచలనాలు చోటుచేసుకుంటున్నాయి. ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద బీజేపీ ఆందోళనలు, దీక్ష నేపథ్యంలో బండి సంజయ్ సహా కొందరు బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, బీజేపీ నేతల అరెస్ట్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నాను. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కేసీఆర్ అభద్రతా భావంతో ఉన్నారు. విష ప్రచారం చేయడం, అక్రమ కేసులు పెడుతున్నారు. సీఎం కార్యాలయమే స్వయంగా టీఆర్ఎస్ మంత్రులు, ప్రజా ప్రతినిధులను రెచ్చగొట్టి.. బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం జరుగుతోంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే బీజేపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు. వినాశకాలే.. విపరీత బుద్ధి అన్నట్టుగా.. త్వరలోనే కేసీఆర్ కుటుంబ, ప్రజా వ్యతిరేక పాలన నుంచి ప్రజలకు త్వరలోనే విముక్తి కలుగుతుంది. ప్రజలు కూడా ఇదే ఆశిస్తున్నారు’’ అని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. వరుస అరెస్టులపై బీజేపీ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈరోజు సాయంత్రం 5-6 గంటల వరకు అన్ని మండలాల్లో పార్టీ ఆఫీసుల వద్ద నిరసనలు తెలపాలని నిర్ణయించింది. నల్లబ్యాడ్జీలు ధరించి శాంతియుతంగా నిరసన దీక్ష చేపట్టాలని నేతలు పిలుపునిచ్చారు. మరోవైపు.. ఉప్పుగల్, కూనూర్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో బీజేపీ ఫ్లెక్సీలకు టీఆర్ఎస్ కార్యకర్తలు నిప్పంటించారు. ఇది కూడా చదవండి: మేము తలుచుకుంటే బీజేపీ నేతలు మిగులుతారా.. తలసాని మాస్ వార్నింగ్ -
మునుగోడులో సర్పంచ్లకు ఫోన్లు చేస్తున్నారు: రాజగోపాల్రెడ్డి ఫైర్
Munugode Politics.. మునుగోడు పాలిటిక్స్ ఒక్కసారిగా వేడాక్కాయి. నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ప్రస్తుత రాజకీయాలపై కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి స్పందించారు. రాజగోపాల్రెడ్డి శుక్రవారం మునుగోడులో మీడియాతో మాట్లాడుతూ.. నా రాజీనామా తర్వాతే ప్రభుత్వంలో కదలిక వచ్చింది. నా రాజీనామా తర్వాతే చేనేత కార్మికులకు పెన్షన్ ప్రకటించారు. మునుగోడు నియోజకవర్గంలో రోడ్లు వేస్తున్నారు. ఇప్పుడే నియోజకవర్గంలో అభివృద్ధిపై దృష్టి పెడుతున్నారు. అందరు సర్పంచ్లకు ఫోన్లు చేస్తున్నారు. నా రాజీనామాతోనే ఫండ్స్ రిలీజ్ చేశారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర ప్రభుత్వం నిధులను అడ్డుకుంటోంది. ప్రభుత్వం వివక్షతో ప్రవర్తిస్తోంది. మొన్నటి వరకు మునుగోడుపై మాట్లాడితే సీఎం కేసీఆర్ స్పందించలేదు. కానీ, నా రాజీనామా తర్వాత సీఎం కేసీఆర్ మునుగోడుకు వస్తున్నారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిధులు కేటాయించలేదు. కానీ.. ఉప ఎన్నికల్లో గెలిచేందుకు మాత్రం వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధపడుతున్నారంటూ మండిపడ్డారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు.. -
వచ్చేది కాంగ్రెస్సే.. నాదే నాయకత్వం
వికారాబాద్, పరిగి: ‘కేసీఆర్ పుర్రెలో పురుగు తిరిగింది.. ఎన్నికలకు పోవాలనుకుంటుండు.. డిసెంబర్లోనే ఎన్నికల నగారా మోగుతుంది. మరో 11 నెలల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుంది. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. దానికి నేనే నాయకత్వం వహిస్తా..’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పారు. శుక్రవారం పరిగిలో జరిగిన కార్యక్రమంలో, ఏఐసీసీ డేటా అనలిటిక్స్ విభాగం చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తితో కలిసి కార్యకర్తలకు రేవంత్ పార్టీ డిజిటల్ సభ్యత్వ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో చేరినోళ్లే, కాంగ్రెస్ సభ్యత్వం ఉన్నోళ్లే ప్రభుత్వ సం క్షేమ పథకాలు పొందటంలో ముందు వరుసలో ఉంటారని చెప్పారు. ఉద్యమకారులు, పేద, బడుగు బలహీన వర్గాల సంక్షేమం ఒక్క కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. గాంధీ కుటుంబం జోలికొస్తే అంతు చూస్తాం గాంధీ కుటుంబాన్ని చూస్తే మోదీకి తడిసిపోతుందని, అం దుకే పాత కేసులు తిరగదోడి ఈడీ ద్వారా సోనియా, రాహుల్లకు నోటీసులు ఇప్పిస్తున్నారని రేవంత్ విమర్శిం చారు. గాంధీ కుటుంబం జోలికొస్తే అంతు చూస్తామని, బీజేపీని బట్టలూడదీసి కొడతామన్నారు. సోనియా, రాహుల్ ను రాజకీయంగా ఎదుర్కోలేకే ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఈడీ నోటీసులకు నిరసనగా ఈ నెల 13న సంస్థ కార్యాలయాన్ని ముట్టడించి కాంగ్రెస్ సత్తా చాటుదామని పిలుపునిచ్చారు. డిజిటల్ కార్డులు పరిగిలోనే మొదలు సోనియా, రాహుల్ల తర్వాత పరిగిలోనే మొదటగా డిజిటల్ కార్డులు అందజేస్తున్నామని రేవంత్ తెలిపారు. కార్డు ఉన్నవారికి రూ. 2 లక్షల ప్రమాద బీమాతో పాటు అనేక ఉపయోగాలున్నాయని స్పష్టం చేశారు. పరిగిలో 50 వేల మెజార్టీతో రామ్మోహన్రెడ్డి గెలువటం ఖాయమని జోస్యం చెప్పారు. ‘పేదలకు భూములు ఎవరు పంచారు? ఇంది రమ్మ ఇళ్లు ఎవరిచ్చారు? మొదట రుణమాఫీ చేసిందెవరు? ఆరోగ్యశ్రీ ఎవరు తెచ్చారు? బ్యాంకులను జాతీయం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా...?’ అంటూ గుర్తు చేశారు. డిజిటల్ కార్డుతో ఢిల్లీ నుంచే పర్యవేక్షణ డిజిటల్ కార్డు ద్వారా పార్టీ అధిష్టానం ఢిల్లీ నుంచే ప్రతి కార్యకర్తను చూస్తుందని ప్రవీణ్ చక్రవర్తి చెప్పారు. కార్యకర్త పనితీరును కూడా దీనిద్వారా అంచనా వేస్తామన్నారు. డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు వేం నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సమైక్య పాలకులది నేరపూరిత నిర్లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: సమైక్య పాలకుల నేరపూరిత నిర్లక్ష్యం వల్లే నీటి పారుదల రంగానికి పూర్తిగా నష్టం జరిగిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చెప్పారు. ఇన్నాళ్లూ పరాయి పాలకుల చేతిలో పరాదీనమైన తెలంగాణ ఇప్పుడు బంగారు తునక అని అభివర్ణించారు. టీటీడీపీ అధ్యక్ష పదవికి ఇటీవల రాజీనామా చేసిన ఎల్.రమణ, శుక్రవారం తెలంగాణ భవన్ వేదికగా కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. రమణకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేసీఆర్.. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. నా లైన్ ఎవరూ మార్చలేరు ‘రాష్ట్రం వస్తుందని ముందు నుంచే మేము బలంగా నమ్మాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేము చేసిన పనుల గురించి డబ్బా కొట్టు కోవాల్సిన అవసరం లేదు. కానీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టమని ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. మేము చేపట్టిన ఎజెండాతో అనేక మార్పులు కనిపిస్తున్నాయి. రాష్ట్రాన్ని గాడిలో పెట్టడంలో మేము విఫలమైతే భవిష్యత్తు తరాలకు నష్టం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మునుపే పునర్నిర్మాణంపై బాగా ఆలోచించి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయ డం ద్వారానే శాంతి సాధ్యమవుతుందని భావించాం. అందులో భాగంగానే మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, వ్యవసాయ రంగం బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాం. మీ దీవెనలు, అండదండలు, సహకారం ఉన్నన్ని రోజులు ప్రపంచంలో ఎవరూ నా లైన్ మార్చలేరు. నేను కలగన్న తెలంగాణను వంద శాతం చేరుకుంటా.. ’అని కేసీఆర్ స్పష్టం చేశారు. చేనేతకు చేయూత: ‘చేనేత రంగం సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు చేపట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో చేనేత కార్మికుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని చేపట్టిన కార్యక్రమాలు కొంత ఉపశమనం ఇస్తున్నాయి. తాజాగా రైతుబీమా తరహాలో చేనేత కార్మికులకు కూడా బీమా పథకం అమలు చేయాలని అధికారులను ఆదేశించాం. ఒకటి రెండు నెలల్లో ఈ కార్యక్రమం ఆచరణలోకి వస్తుంది. ఉద్యమ సమయంలో ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలను పార్టీ తరఫున ఆదుకున్నాం. సూరత్తో పాటు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన కార్మికుల నైపుణ్యాన్ని స్థానికంగా వాడుకుని ఉపాధి కల్పించేందుకు ‘కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్’ఏర్పాటు చేశాం. ఇక్కడ ఏర్పాటయ్యే భారీ స్పిన్నింగ్ మిల్లుల ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. రాష్ట్రంలోని చేనేత, మరమగ్గాల కార్మికుల వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించా. చేనేత కార్మికులు కూడా పాత పద్ధతిలో కాకుండా వినూత్నంగా పని చేయడాన్ని అలవరుచుకోవాలి. చేనేత రంగానికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది..’అని సీఎం పేర్కొన్నారు. -
నిజామాబాద్ ‘ఎమ్మెల్సీ’గా కవిత నామినేషన్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి మాజీ ఎంపీ, సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో కలసి కలెక్టరేట్కు చేరుకున్న కవిత.. రెండు సెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ సి. నారాయణరెడ్డికి అందజేశారు. ఉదయం హైదరాబాద్లోని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి నివాసంలో ఆమె జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. నిజామాబాద్ చేరుకుని అత్తమామలు, భర్త అనీల్రావు ఆశ్వీరాదం తీసుకున్న అనంతరం నామినేషన్ వేసేందుకు కలెక్టరేట్కు చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న కవిత మళ్లీ రావడంతో అనుచరులు, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. నామినేషన్ వేసేందుకు వచ్చిన కవితకు పార్టీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఇదిలా ఉండగా, స్థానిక సంస్థల్లో టీఆర్ఎస్కు స్పష్టమైన మెజారిటీ ఉంది. జిల్లా పరిషత్, మండల పరిషత్లు, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు మొత్తం 824 ఉండగా, ఇందులో 550 పైగా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే ఉన్నారు. దీంతో ఈ ఎన్నికల్లో కవిత విజయం ఖాయంగా కనిపిస్తోంది. -
వినియోగదారుల ఫోరాల్లో మహిళా సభ్యులు లేరు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర, జిల్లా వినియోగదారుల ఫోరాల్లో మహిళా సభ్యులు ఒక్కరు కూడా లేకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో తెలియజేయాలని హైకోర్టు వివరణ కోరింది. రాష్ట్ర వినియోగదారుల ఫోరం 12 జిల్లాల్లోని వినియోగదారుల ఫోరాల్లో ఖాళీగా ఉన్న 24 మంది మహిళా సభ్యుల పోస్టులు భర్తీ చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ కరీంనగర్ వినియోగదారుల మండలి అధ్యక్షుడు ఎన్.శ్రీనివాస్ పిల్ దాఖలు చేశారు. ఫోరాల్లో మహిళా సభ్యుల నియామకాల భర్తీ విషయంపై వివరణ ఇవ్వాలని శుక్రవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్రెడ్డిలతో కూడిన ధర్మాసనం ప్రభుత్వాన్ని కోరింది. -
అప్పుడు లేని మాంద్యం ఇప్పుడెలా?
సాక్షి, హైదరాబాద్: ఆరు నెలల కింద ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమయంలో లేని మాంద్యం ఇప్పుడెలా వచ్చిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే డి.శ్రీధర్బాబు ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం సైతం బడ్జెట్లో ఎక్కడా మాంద్యం గురించి ప్రస్తావించలేదని తెలిపారు. కానీ ప్రస్తుత పూర్తిస్థాయి బడ్జెట్లో మాత్రం 15 నెలల నుంచి మాంద్యం ఉందని చెప్పి బడ్జెట్కు కోత పెట్టారని విమర్శించారు. ఆదివారం శాసనసభలో బడ్జెట్పై చర్చలో ఆయన మాట్లాడారు. వాహనాలు, ట్రాక్టర్ల కొనుగోళ్లు 30 శాతం తగ్గాయని చెబుతున్నారని, కానీ మాంద్యానికి ఇది ప్రామాణికం కాదని తెలిపారు. రెవెన్యూ మిగులు ఉన్న సమయంలో రాష్ట్ర బడ్జెట్ ఎలా తగ్గిందో చెప్పాలన్నారు. గతేడాది కన్నా ఈ ఏడాది బడ్జెట్లో కీలకమైన విద్యా శాఖకు 24 శాతం, వైద్యానికి 25 శాతం, గ్రామీణాభివృద్ధికి 32 శాతం తక్కువగా కేటాయింపులు చేశారని పేర్కొన్నారు. కాళేశ్వరం చూసే చేరాం: ఎమ్మెల్యే గండ్ర టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. రైతుల సంక్షే మం కోసం ప్రభుత్వం అనేక పథకాలు తెచ్చిందని, రైతు బంధుతో రైతుల్లో ధీమా పెంచారని తెలిపా రు. సీఎం కేసీఆర్ చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు ఎనలేని ప్రయోజనం కలుగుతోందని, దాన్ని చూసే 12 మంది కాంగ్రెస్ సభ్యులం టీఆర్ఎస్లో చేరామన్నారు. -
ఎవరిపై కేసు పెట్టాలి: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రగతిభవన్లో కుక్క చనిపోతే డాక్టర్ మీద కేసు పెట్టారని, అదే జ్వరాలతో ప్రజలు చని పోతుంటే ఎవరిపై కేసు పెట్టాలని ప్రభుత్వాన్ని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. శనివారం అసెంబ్లీ హాల్ బయట ఆయన మాట్లాడుతూ.. అధికారులను బ్లీచింగ్ పౌడర్ వేయమంటే డబ్బులు లేవంటున్నారని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని అడిగారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రక్త పరీక్షలు చేయలేని పరిస్థితుల్లో ఈ సర్కార్ ఉందని మండిపడ్డారు. టీఆర్ఎస్ ఓనర్ల పంచాయితీపై స్పందిస్తూ ఈటల జెండా ఓనర్లం అనడంలో తప్పులేదన్నారు. గతంలో బతుకుదెరువు కోసం తాను కూడా టీఆర్ఎస్లోకి వెళ్లి వచ్చానని చెప్పుకొచ్చారు. -
ఎంఐఎంను ప్రతిపక్షంగా ఎలా గుర్తిస్తారు ?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వార్షిక బడ్జెట్పై ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీయాలని సీఎల్పీ నిర్ణయించింది. సోమవారం నిర్వహించిన సీఎల్పీ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. బడ్జెట్, యురియ, ప్రజారోగ్యం, ఎస్సీ,ఎస్టీ సబ్ప్లాన్, నిరుద్యోగ భృతి, ప్రాజెక్టుల్లో అవినీతిపై చర్చ జరిగింది. టీఆర్ఎస్ ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వ తీరును పలువురు నేతలు ప్రస్తావించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు బడ్జెట్లో కేటాయింపులు లేకపోవడం, ఎరువుల కొరతపై రాష్ట్ర్ర ప్రభుత్వాన్నిఎండగట్టాలని సీఎల్పీ నిర్ణయించింది. అనంతరం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఎంఐఎంను ప్రతిపక్ష పార్టీగా ఎలా గుర్తిస్తారంటూ ప్రశ్నించారు. టీఆర్ఎస్, ఎంఐఎం ఫ్రెండ్లీ పార్టీలు అని చెప్పారు కదా..ప్రెండ్లీ పార్టీలు అధికార, ప్రతిపక్ష పాత్ర పోషిస్తాయా అని ప్రశ్నలు సంధించారు. ఈ అంశంపై స్పీకర్కు లేఖ రాయాలని సీఎల్పీ నిర్ణయించింది. -
బీజేపీలో చేరిన రేవూరి ప్రకాశ్
సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ సీనియర్ నేత రేవూరి ప్రకాశ్రెడ్డి, మాజీ ఎంపీ రవీంద్రనాయక్ బీజేపీలో చేరారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యం లో బుధవారం ఢిల్లీ వెళ్లిన నేతలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మురళీధర్రావు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించగా.. లక్ష్మణ్ పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మురళీధర్రావు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రజావ్యతిరేక పాలనపై పోరాడే సత్తా ఒక్క బీజేపీకే ఉందని, రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందనేందుకు నేతల వరుస చేరికలే నిదర్శనమని పేర్కొన్నారు. ఓర్వలేక తప్పుడు కేసులు: లక్ష్మణ్ రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేక టీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి బీజేపీ కార్యకర్తలు, నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తోందని లక్ష్మణ్ ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో కృత్రిమంగా యూరియా కొరత సృష్టించి కేంద్ర ప్రభుత్వంపై నెపంనెట్టి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకొనే ప్రయత్నం చేస్తోందన్నారు. యూరియా డిమాండ్ను అంచనా వేయ డంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, వ్యవసా య ప్రణాళిక లేకపోవడంతో కరీంనగర్, నిజామా బాద్లో రైతులు ఆందోళన చేస్తున్నారని చెప్పారు. కాగా, టీడీపీని వీడి బీజేపీలో చేరే ముందు చంద్రబాబుతో మాట్లాడినట్టు రేవూరి తెలిపారు. రవీంద్రనాయక్ మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలతో ప్రజల కలలు నెరవేరడం లేదన్నారు. -
40 శాతం మందికి రైతు బంధు అందలేదు
సాక్షి, హైదరాబాద్: రైతు బంధు పథకంలో తీవ్ర జాప్యం జరుగుతుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. గురువారమిక్కడ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 40 శాతం మంది రైతులకు రైతు బంధు నిధులు అందలేదని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే ఆ రైతులకు రావాల్సిన నిధులను వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ఇంతవరకు అమలు చేయలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరత వల్ల రైతులకు నష్టం వాటిల్లుతుందన్నారు. కొరత వల్ల రైతులు బహిరంగ మార్కెట్లో అధిక ధరకు యూరియాను కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. రైతులకు అవసరమైన యూరియాను వెంటనే సరఫరా చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. -
టీఆర్ఎస్ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుంది: బీజేపీ
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని జుమ్మెరాత్ బజార్లో రాణి అవంతి విగ్రహ ఏర్పాటుపై బుధవారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. విగ్రహ ఏర్పాటును పోలీసులు అడ్డుకోవడంతో పాటు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై లాఠీచార్జ్ విధించారు. ఈ సంఘటనపై బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ రామచంద్ర రావు అడిషినల్ డీజీపీ జితేందర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాలలో రాణి అవంతి భాయి విగ్రహాలు అనేకం ఉన్నాయని, పోలీసులు కావాలనే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై దాడి చేశారని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, ఎమ్ఐఎమ్తో దోస్తీ కట్టి హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుడా రాష్ట్రంలో బీజేపీని అణిచివేసే ప్రయత్నం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జ్యూమెరాత్ బజార్లో 2009 లోనే రాణి అవంతి విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, గడిచిన పది సంవత్సరాలలో మూడు సార్లు విగ్రహాన్ని మార్చారని మండిపడ్డారు. విగ్రహాన్ని ఏర్పాటు చేయకుండా అడ్డుకున్నందుకు రేపు గోషామహల్ నియోజకవర్గంలో బంద్ నిర్వహిస్తున్నామని, ఎట్టిపరిస్థితుల్లోనూ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తీరుతామని రామచంద్ర రావు స్పష్టం చేశారు. -
ఓడినా నైతిక విజయం నాదే: కొండా
సాక్షి, హైదరాబాద్: చేవెళ్ల నుంచి ఎంపీగా ఓడినా నైతిక విజయం తనదేనని కాంగ్రెస్ పార్టీ నేత కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. చేవెళ్లలో చివరి వరకు గెలుపు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపినప్పటికీ, పట్టణ ఓటర్లను ప్రత్యర్థులు కొనుగోలు చేయడంతో తాను ఓడిపోయానని వివరించారు. శక్రవారం ఆయన గాంధీభవన్లో ఎమ్మెల్యే పైల ట్ రోహిత్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్కుమార్లతో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ పోలీసులు, అధికారులను తన స్వలాభం కోసం వాడుకుందని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి నానా ఇబ్బందుల కు గురిచేసిందని ఆరోపించారు. రాజేంద్రనగర్, శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ నేతలని లక్ష్యంగా చేసుకున్నారని, సమావేశాలకు అనుమతులివ్వకుండా అడ్డుకున్నారన్నారు. రాజకీయంగా తనను పూర్తిగా అణగదొక్కేందుకు టీఆర్ఎస్ ప్రయత్నించిందని తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో కాం గ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల మనసులు గెలుచుకుందని, నేతలు, కార్యకర్తలు నిరాశ చెందాల్సిన అవసరం లేదని విశ్వేశ్వర్రెడ్డి సూచించారు. -
టీఆర్ఎస్కు బ్రహ్మరథం పడుతున్నారు : మంత్రి జగదీశ్ రెడ్డి
సాక్షి, పెన్పహాడ్ (సూర్యాపేట) : నాలుగున్నరేళ్ల పాలనలో మా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసే ప్రజలు గ్రామాలకు వెళ్తున్న తమకు, టీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని విద్యుత్, ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని సింగారెడ్డిపాలెం, అనంతారం, పొట్లపహాడ్, దూపహాడ్, లింగాల గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో టీఆర్ఎస్ పార్టీకి వస్తున్న ప్రజాదరణను చూసి భయపడిపోయిన ప్రతిపక్షాలు ప్రజాకూటమి పేరుతో జతకట్టాయన్నారు. ప్రజాదరణ ముందు ఈ కూటమి మట్టికొట్టుకుపోనుందని ఎద్దేవా చేశారు. మాకు అధికారమే ముఖ్యం కాదని.. అభివృద్ధే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. నాలుగున్నరేళ్లలో సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్లాం.. దేశంలో ఇప్పటివరకు ఎక్కడా జరగని అభివృద్ధి, ఏ రాష్ట్రంలో చేపట్టని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు అవుతున్నాయని తెలిపారు. 14ఏళ్లు పోరాడి సాధించుకున్న తెలంగాణలో టీఆర్ఎస్తోనే మన బతుకులు మారతాయన్నారు. రైతులు వ్యవసాయంలో పెట్టుబడులు పెట్టి అప్పుల పాలయ్యారని వ్యవసాయం బతికిస్తేనే ఊర్లు బాగుంటాయని ఉద్దేశంతో రూ.లక్ష రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 24గంటల ఉచిత విద్యుత్ను అందిస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని సోనియా, మోదీ రాష్ట్రాల్లో ఎక్కడా ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిందన్నారు. తెలంగాణను దోచుకోవడానికి రెండు ఆంధ్రా పార్టీలు పగటి దొంగలుగా వస్తున్నాయని అన్నారు. టీఆర్ఎస్ అభివృద్ధిని అడ్డుకోవడానికి కాంగ్రెస్కు రూ.500కోట్ల ఇచ్చి చంద్రబాబునాయుడు చేతిలో తోలు బొమ్మలుగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఉన్నారని పేర్కొన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి ఎస్సార్ఎస్పీ కాల్వల ద్వారా సాగునీరు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని చంద్రబాబు నాయుడు అడ్డుకునేందుకు 35ఉత్తరాలు రాశారని గుర్తు చేశారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే చంద్రబాబుకు వేసినట్లే అన్నారు. మహిళలకు బతుకమ్మ చీరలు రాకుండా కాంగ్రెస్ నాయకులే అడ్డుపడ్డారన్నారు. అనంతరం అనంతారం, సింగారెడ్డిపాలెం గ్రామాల్లో వివిధ పార్టీలకు చెందిన వారు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎంపీపీ భుక్యా పద్మ, ఒంటెద్దు నర్సింహారెడ్డి, నెమ్మాది భిక్షం, మారిపెద్ది శ్రీనివాస్, మిర్యాల వెంకటేశ్వర్లు, పుట్ట రేణుకాశ్రీనివాస్గౌడ్, దంతాల వాణివెంకన్న, మామిడి అంజయ్య, చిట్టెపు నారాయణరెడ్డి, పొదిల నాగార్జున, సామ వెంకటరెడ్డి, పేర్ల శ్రీధర్, మున్నా వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
రైతుబంధుకు యూఎన్వో గుర్తింపు
సాక్షి,బాన్సువాడ: రైతుల అభివృద్ధి కోసం ప్రపంచంలో అమలు చేస్తున్న 20 వినూత్న పథకాలలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన రైతుబంధు, రైతుబీమా పథకాలను ఐక్యరాజ్య సమితి గుర్తించడం గర్వకారణమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఇది తెలంగాణకు, రాష్ట్ర రైతాంగానికి దక్కిన గొప్ప గౌరవమన్నారు. శనివారం పట్టణంలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతు సంక్షేమం అనే గొప్ప ఆశయంతో ఈ రెండు పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రపంచానికి ఆదర్శమని అన్నారు. రైతులు అప్పుల ఊబి నుంచి బయటపడి తలెత్తుకొని తిరగాలన్నదే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. అందుకే వ్యవసాయానికి అవసరమైన కరెంట్ను 24 గంటలు ఉచితంగా, నాణ్యతతో సరఫరా చేస్తున్నామన్నారు. ఎరువులు, విత్తనాలకు కొరత లేకుండా చేశామని చెప్పారు. పెట్టుబడికి రైతుబంధు ద్వారా ఆర్థిక వెన్నుదన్ను ఇస్తున్నామన్నారు. రైతులకు సలహాలు ఇవ్వడానికి ప్రతి 5000 ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తీర్ణ అధికారిని నియమించామని అన్నారు. మద్దతు ధరతో పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నామన్నారు. రైతుల కోసం భారీగా గోదాములు నిర్మించామన్నారు. దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5లక్షల బీమాతో ధీమా కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, అమలు చేస్తున్న పథకాలతో ఇప్పటికే రాష్ట్రంలోని రైతులకు భరోసా వచ్చిందని పోచారం అన్నారు. తమ వెనక ప్రభుత్వం ఉంది అనే బలం వచ్చిందని, టీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్ర రైతులకు ఇంకా మంచి రోజులు రాబోతున్నాయన్నారు. -
రూ. 1600 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి
సాక్షి,అర్వపల్లి: గత 60 ఏళ్లలో జరగని అభివృద్ధి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ హయాంలో నాలుగేళ్లలో రూ. 1600 కోట్లతో జరిగిందని టీఆర్ఎస్ జిల్లా నాయకుడు దావుల వీరప్రసాద్ చెప్పారు. తుంగతుర్తి టీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిశోర్కుమార్ గెలుపు కోసం గురువారం సీతారాంపురంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కిశోర్కుమార్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బందెల అర్వపల్లి, రాసాల సైదులు, బందెల వెంకన్న, చిత్రాల వీరయ్య, బందెల శశికాంత్, కుర్రె రమేశ్, ఎ. భద్రయ్య, బైరబోయిన రామలింగయ్య, పెద్దయ్య, కె. శ్రీకాంత్, జి. రామ్మూర్తి, ఎస్. వెంకన్న, ఎ. వెంకన్న, కె. భిక్షం, ఎ. సంతు, ఎ. ప్రవీణ్, పి. శ్రీను, ఎ. లింగయ్య, వీరమల్లు, ఎ. సంతు, దావుల లింగయ్య, కె. నాగరాజు, పి. ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయం తుంగతుర్తి : త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పూసపల్లి శ్రీనివాస్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్తోనే సాధ్యమన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయన్నారు. తుంగతుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత గాదరి కిశోర్కుమాదే అని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు కారుగుర్తుకు ఓటేసి టీఆర్ఎస్పార్టీని గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో వెంకటనారాయణ, జలేందర్, రాములు, సంతోష్, భిక్షం, వెంకన్న, హరీశ్ తదితరులు పాల్గొన్నారు. -
పర్సెంటేజీలకే ప్రాధాన్యమిచ్చారు
సాక్షి,చౌటుప్పల్ : టీఆర్ఎస్కు ఓట్లేసి గెలిపిస్తే మునుగోడును ఏమాత్రం అభివృద్ధి చేయకపోగా కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ప్రతి పనిలో కమీషన్లు, పర్సంటేజీలకే ప్రాధాన్యత ఇచ్చారని బీజేపీ మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గంగిడి మనోహర్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని తంగడపల్లి గ్రామానికి చెందిన వందమంది యువకులు, మహిళలు గురువారం మనోహర్రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గ్రామంలో జరిగిన సమావేశంలో మనోహర్రెడ్డి మాట్లాడుతూ నాలుగేండ్ల టీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబాటుకు గురైందన్నారు.నియోజకవర్గాన్ని పూర్తి అవినీతిమయంగామార్చార్చారని ఆరోపించారు. తనకు ఎలాంటి పదవి లేకున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి రూర్బన్ పథకం కింద చౌటుప్పల్ మండలానికి రూ.100 కోట్ల నిధులు మంజూరు చేయించానని పేర్కొన్నారు. మార్పు కోసం కమలం పువ్వు గుర్తుపై ఓటేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు అరిగె రమేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు దోనూరి వీరారెడ్డి, దూడల భిక్షంగౌడ్, ఎస్సీమోర్చా రాష్ట్ర కమిటీ సభ్యుడు ఉబ్బు భిక్షపతి, వైస్ ఎంపీపీ కాయితి రమేష్, నాయకులు రామనగోని శంకర్, పాలకూర్ల జంగయ్య, కంచర్ల గోవర్థన్రెడ్డి, అరిగె లింగస్వామి, నారెడ్డి అంజిరెడ్డి, ఊడుగు వెంకటేశం, యాదయ్య, మల్లికార్జున్, అరిగె వీరాస్వామి, తమ్మకొండ శ్రీశైలం, శివకుమార్, కట్ట కృష్ణ, రాదారపు సత్తయ్య, పబ్బు వంశీ, లక్ష్మణ్, బత్తుల జనార్దన్, చీరకూరి వెంకటేశం, ఇట్టగోని మహేష్, రాజు, ఆలె నాగరాజు, బలిగె శ్రీను, పాల్గొన్నారు. -
చిందు కళాకారులకు అండగా టీఆర్ఎస్
సాక్షి,హుస్నాబాద్: కళామతల్లిని నమ్ముకొని కళాకారుల వృత్తితో జీవిస్తున్న చిందు కళాకారులను టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని మాజీ ఎమ్మెల్యే సతీష్కుమార్ అన్నారు. మంగళవారం పట్టణంలోని వీఎల్ రెడ్డి గార్డెన్లో చిందు కళాకారుల ఆశీర్వాద సభను నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే సతీష్కుమార్ మాట్లాడుతూ సినిమాలు, సీరియల్స్ వల్ల చిందు కళాకారులకు ఆదరణ తక్కువైందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ వచ్చిన తర్వాతనే చిందు, యక్షగానంతో పాటు అన్ని కళాకారులకు అండగా నిలిచి వారి బాగోగులను చూస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపిందని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, మార్కెట్ కమిటి చైర్మన్ ఎడబోయిన తిరుపతిరెడ్డి, టీఆర్ఎస్ మండల అద్యక్షుడు వెంకట్రాంరెడ్డి, టీఆర్ఎస్ పట్టణ ఇంచార్జీ కాసర్ల అశోక్బాబు, పట్టణ అద్యక్షుడు అన్వర్ పాష, చిందు కళాకారుల సంఘం జిల్లా అద్యక్షుడు గడ్డం నాగరాజు, కౌన్సిలర్లు గాదెపాక రవీందర్, ఇంద్రాల సారయ్య, నాయకులు మేకల వీరన్న యాదవ్, చిట్టి గోపాల్రెడ్డి, క్రాంతిరెడ్డి, గడ్డం మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రచారాస్త్రంగా పునరుజ్జీవం
మోర్తాడ్(బాల్కొండ): శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవన పథకం పూర్తయిన తరువాత కలిగే ప్రయోజనాలను వివరి స్తూ రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందాలని అధికార పార్టీ టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా కదులుతోంది. పునరుజ్జీవన పథకానికి కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టు అంశాలను రైతులకు తెలియజేప్పే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆ పార్టీ అ భ్యర్థులు రైతులను, యువ నాయకులను కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు స్టడీ టూర్ కోసం ఆదివారం పంపించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ భా గంలో గోదావరి నదిపై మహారాష్ట్ర ప్ర భుత్వం బాబ్లీ ప్రాజెక్టును నిర్మించడంతో వరద నీటికి అడ్డుకట్ట పడింది. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకముందు వరద నీరు గోదావరి నదిలోకి చేరి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి మట్టం ఆశిం చిన విధంగానే పెరిగేది. బాబ్లీ ప్రా జెక్టు నిర్మాణం తరువాత వరదలు అధికంగా వస్తేనే శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ భాగం నుంచి నీరు తరలివస్తోంది. ఈ నేథ్యంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు పునరుజ్జీవన పథకానికి శ్రీకా రం చుట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వరద కాలువను ఉపయోగించుకుని రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని మళ్లించడానికి పునరుజ్జీవన పథకాన్ని అమలు చేస్తున్న విషయం విదితమే. రూ.1,064 కోట్ల వ్యయంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవన పథకానికి గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగానే పునరుజ్జీవన పథ కం పనులు సాగుతున్నాయి. ముప్కాల్ వద్ద పంప్హౌజ్ నిర్మాణం పనులు సా గుతుండగా కాళేశ్వరం ప్రాజెక్టు పనులు కూడా వేగంగానే కొనసాగుతున్నాయని స్టడీ టూర్కు వెళ్లిన నియోజకవర్గం రైతులు, యువకులు తెలిపారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీటిని తరలించేది ఇలా... కాళేశ్వరం పరిసరాల్లో భారీ వర్షం కురిస్తే అనేక టీఎంసీల నీరు గోదావరి నది ద్వారా సముద్రంపాలవుతుంది. భారీ వర్షాలు కురిసిన సమయంలో దాదాపు వెయ్యి టీఎంసీల నీరు సముద్రం పాలైన సందర్భాలు ఉన్నాయి. ఆనీటిని సద్వినియోగం చేసుకోవడానికే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. కాళేశ్వరం నుంచి అన్నారం, సుందిల్లల వద్ద నిర్మించిన పంప్హౌజ్ల నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు అక్కడి నుంచి మిడ్మానేర్ డ్యామ్కు ఎగువ భాగంలో ఉన్న వరద కాలువలోకి నీటిని వదులుతారు. వరద కాలువలోకి చేరిన నీరు 40 మీటర్ల ఎత్తున ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి రివర్స్ పంపింగ్ ద్వారా రోజుకో టీఎంసీ చొప్పున నీటిని మళ్లించాలని డిజైనింగ్ చేశారు. అయితే ఆశించిన విధంగా నీటిని తరలించడానికి వీలు ఉంటే రోజుకు ఒక టీఎంసీ కాకుండా రెండు టీఎంసీల నీటిని తరలించవచ్చని ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు. వరద కాలువ రివర్స్ పంపింగ్ ద్వారా రూ.500 కోట్ల ఆదా... కాళేశ్వరం నీటిని మిడ్మానేరు నుంచి మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు అక్కడి నుంచి హల్దీవాగు ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టుకు తరలించాలని ముందుగా నిర్ణయించారు. నిజాంసాగర్ ప్రాజెక్టును నింపిన తరువాత మంజీర నదిలోకి మిగులు జలాలను విడిచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు తరలించాలని ప్రతిపాదించారు. ఇలా చేయడం వల్ల రోజుకు అర టీఎంసీ నీటిని మాత్రమే శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు తరలించవచ్చు. ఈ విధానం వల్ల ఒక ఏడాదికి రూ.600 కోట్ల విద్యుత్ బిల్లును ప్రభుత్వం భరించాల్సి ఉంది. అయితే వరద కాలువ ద్వారా రివర్స్పంపింగ్ చేయడం వల్ల రోజుకు ఒకటి నుంచి రెండు టీఎంసీల నీటిని తరలించడమే కాకుండా రూ.100 కోట్ల విద్యుత్ బిల్లును మాత్రమే ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. నీటిపారుదల శాఖలో పని చేసిన ఒక రిటైర్డ్ ఇంజినీర్ ఇచ్చిన సలహా ప్రకారం తాజా మాజీ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి చొరవ చూపడంతో సీఎం కేసీఆర్ వరద కాలువ రివర్స్ పంపింగ్కు ఆమోదం తెలిపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వరద కాలువ, కాకతీయ కాలువలలో నిరంతరం నీరు... పునరుజ్జీవన పథకం పూర్తి అయితే వరద కాలువ, కాకతీయ కాలువలలో నిరంతరం నీటిని ప్రవహించేలా చేసే అవకాశం ఉంది. వరద కాలువ రివర్స్ పంపింగ్ కోసం వినియోగించడం వల్ల ఈ కాలువలో నీరు ఉంటుంది. అలాగే కాకతీయ కాలువ ద్వారా దిగువ భాగానికి నీటిని విడుదల చేయనుండటంతో నిరంతరం నీరు నిలువ ఉండే అవకాశం ఉంటుంది. ఫలితంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద జల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యానికి మించి జరుగుతుంది. రెండు కాలువల్లో నీరు నిలిచి ఉంటే చెరువులను నింపుకోవడంతో పాటు, పంపు సెట్ల ద్వారా పంట పొలాలకు సాగునీటిని తరలించడానికి అవకాశం ఉంది. వరద కాలువలో నీరు నిలువ ఉంటే కాలువకు సిమెంట్ లైనింగ్ లేక పోవడంతో భూగర్భ జలాలు ఎంతో వృద్ధి చెందుతాయని రైతులు భావిస్తున్నారు. వరద కాలువకు ఎడమవైపున ఏర్పాటు చేసిన తూమ్లు ఆరు మీటర్ల ఎత్తులో ఉన్నాయి. ఈ తూమ్ గేట్లను ఇంకా కిందికి దించితే తక్కువ సమయంలోనే చెరువులను నింపడానికి పరిస్థితులు అనుకూలిస్తాయి. వరద కాలువలో నీటిని నిలువ ఉంచడం వల్ల బాల్కొండ నియోజకవర్గంలోని మరో పదివేల ఎకరాలకు సాగునీటిని అందించడానికి అవకాశం కలుగుతుంది. ఒక్క పునరుజ్జీవన పథకం పూర్తి జరిగితే ఎన్నో ప్రయోజనాలను రైతులకు అందించవచ్చని టీఆర్ఎస్ నాయకులు తమ ప్రచారంలో వివరించాలని భావిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే ఎంతో మేలు... కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి జరిగితే ఎంతో మేలు కలుగనుంది. ఈ రోజు రైతులం ప్రాజెక్టును సందర్శించాం. కాళేశ్వరం నీరు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు చేరితే రైతులకు మూడు పంటలకు సాగునీరు అందుతుంది. ఎంతో విలువైన పంటలను పండించడానికి అవకాశం ఉంది. – కౌడ భూమన్న, రైతు, తొర్తి మాకు అవగాహన కలిగింది కాళేశ్వరం ప్రాజెక్టు ను సందర్శించడం వల్ల వరద కాలువ రివర్స్ పంపింగ్పై అవగాహన కలిగింది. వరద కాలువ ద్వారా రివర్స్ పంపింగ్ చేసి నీటిని ప్రాజెక్టుకు తరలిస్తే ఎంతో ప్రయోజనం కలుగుతుంది. రాజకీయాలు ముఖ్యం కాదు. ప్రజలకు సాగునీరు అందడం ముఖ్యమని గుర్తించాలి. – తక్కూరి సతీష్, మోర్తాడ్ సాగునీటి సమస్యలు తీరనున్నాయి వరద కాలువ రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీరు చేరితే సాగునీటి సమస్యలు ఎన్నో తీరనున్నాయి. రైతుల కష్టాలు తీరి నాణ్యమైన పంటలను పండించవచ్చు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టు గురించి అందరు తెలుసుకోవాలి. – భోగ సుమన్, చౌట్పల్లి -
టీఆర్ఎస్పై ప్రజల్లో వ్యతిరేకత: దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని కేంద్ర మాజీమంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వలేదని ప్రజలు టీఆర్ఎస్ను తిడుతున్నారని, మోదీకి ఉన్న ఆదరణను బీజేపీకి అనుకూలంగా మార్చుకోవాలని కార్యకర్తలకు సూచించారు. టీఆర్ఎస్ నాలుగున్నరేళ్ల పాలనలో 18 వేల ఉద్యోగాలే ఇచ్చిందని, ఉద్యోగాల భర్తీలో విఫలమైం దని విమర్శించారు. నిరుద్యోగులు ప్రభుత్వంపై కోపంతో ఉన్నారన్నారు. రాష్ట్రంలో నవంబర్ లేదా డిసెంబర్లో ఎన్నికలు జరిగే అవకాశముందని, పార్టీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలన్నారు. టీఆర్ఎస్తో బీజేపీకి పొత్తు ఉండదన్నారు. కొత్త జోన్లను ఆమోదించినందుకు రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు. ‘జోనల్’ ఆమోదాన్ని స్వాగతిస్తున్నాం: లక్ష్మణ్ రాష్ట్రంలో కొత్త జోన్లకు కేంద్రం ఆమోదం తెలపడాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఒక ప్రకటనలో తెలిపారు. జోనల్ వ్యవస్థ ఆమోద ప్రక్రియను సత్వరమే పరిష్కరించి, తెలంగాణ పట్ల కేంద్రానికి ఉన్న నిబద్ధతను చాటుకున్నారన్నారు. దీంతో రాష్ట్రంలో నియామకాలు వేగంగా జరిగేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ, ఇతర అనుమతులు ఇవ్వడంలో, సంక్షేమ పథకాలకు నిధులలివ్వడంలో ప్రధాని రాష్ట్రానికి పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. -
ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం
నర్సంపేట రూరల్: ప్రజా సమస్యలపై తెలంగాణ జనసమితి (టీజేఎస్) పార్టీ నిరంతరం పోరాడుతోందని ఆ పార్టీ అధినేత ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నా రు. భూముల క్రమబద్ధీకరణ, సాదాబైనామా తదితర కార్యక్రమాలతో భూములపై హక్కులను కల్పించి, నేడు కాలరాసేందుకు ప్రభుత్వం యత్ని స్తోందన్నారు. ప్రభుత్వం పంపిణీ చేసిన పాస్పుస్తకాల్లో 90శాతం ఏదో ఒక తప్పులు ఉన్నాయని, వాటిని సరిచేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించ డం లేదన్నారు. పోడు రైతులపై ఫారెస్ట్ అధికారుల దాడులు పెరుగుతున్నాయని తెలిపారు. ఆయా సమస్యల పరిష్కారం కోసం సోమవారం అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట చేపడుతున్న ధర్నాలను విజయవంతం చేయాలని కోరారు. టీజేఎస్ గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి అన్ని స్థాయిల్లో కమిటీలను వేయనున్నట్లు తెలిపారు. టీజేఎస్ రాష్ట్ర నాయకులు అంబటి శ్రీనివాస్, చాపబాబు, బొనగాని రవీందర్, షేక్జావీద్, బొట్ల పవన్, భూక్యగోపాల్నాయక్, అంగోతు వినోద్, మామిండ్ల ఐలయ్య, బుల్లెట్ వెంకన్న, నందగిరి రజనీకాంత్, బందెల సదానందం, గుంటి సంజీవ, రాజశేఖర్, జాఫర్, యాకుబ్, హనుమంత్, లక్ష్మయ్య, శివ, అనిల్ పాల్గొన్నారు. పెద్దకోర్పోలు గ్రామంలో... నెక్కొండ(నర్సంపేట): టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై తెలంగాణ జన సమితి పార్టీ పోరా డుతోందని ఆ పార్టీ అధినేత ప్రోఫెసర్ కోదండరాం అన్నారు. చైతన్యయాత్రలో భాగంగా నెక్కొం డ మండలం పెద్దకోర్పోలు గ్రామంలో ఆదివారం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలో కోట్లాది రూపాయలు దుర్వినియోగం అయ్యాయని, నిధులు, నీళ్లు, ఉద్యోగాలు, ఉపాధి మార్గాలను మరిచిన ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్పాలని అన్నారు. 60 ఏళ్లలో రూ.63వేల కోట్ల అప్పు ఉంటే.. నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలో అప్పులను రెట్టింపు చేశారని అన్నారు. భూ ప్రక్షాళనతో సమస్యలు పరిష్కారం కాకపోగా రైతులకు కొత్త చిక్కులు తెచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని విమర్శించారు. టీజేఎస్ సోమవారం చేపట్టే రైతు దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ అంబటి శ్రీనివాస్, వరంగల్ కన్వీనర్ బోనగాల రవీందర్, వెంకన్న, వినోద్నాయక్ పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడుతున్న ప్రొఫెసర్ కోదండరాం -
52 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ అసమర్థత కారణంగానే బీసీలకు రిజర్వేషన్లు దక్కటం లేదని కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. బీసీలకు రిజర్వేషన్లు కల్పించటంలో కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదని కేసీఆర్ అనటం బట్ట కాల్చి మీదెయ్యటమేనని, ఉల్టా చోర్ కోత్వాల్ కో డాంటే అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. పంచాయతీరాజ్ చట్టాన్ని వెంటనే సవరించి బీసీలకు 52 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని, అసెంబ్లీని సమావేశపర్చాలని డిమాండ్ చేశారు. ‘నేను అన్యాయం చేస్తా కోర్టులు కూడా న్యాయం చెయ్యొద్దు అన్నట్టుగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు. 1999లో 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. ఇప్పుడు కూడా అలాగే పెట్టడం ఎలా న్యాయం అవుతుంది? కుల గణన చేయకుండా రిజర్వేషన్లు ఎలా ఇస్తారు? తెలంగాణలో 52 శాతం బీసీలు ఉన్నారని సమగ్ర సర్వేలో మీరే చెప్పి ఇప్పుడు 34 శాతం రిజర్వేషన్లు చాలని ఎలా అంటారు? మిగిలిన 18 శాతం వారికి అక్కర్లేదా?’ అని శ్రవణ్ ప్రశ్నించారు. కోర్టులో మీ వ్యవహారాన్ని తప్పుబడుతున్న సందర్భంగానైనా కళ్లు తెరవాలని సూచించారు. సీఎం మీద ఒత్తిడి తేవాల్సిన బాధ్యత బీసీ సంఘాల మీద ఉందని అభిప్రాయపడ్డారు. 52 శాతం రిజర్వేషన్లకు కాంగ్రెస్ మద్దతు ఉందని, ఇదే విషయాన్ని ఉత్తమ్కుమార్ రెడ్డి అనేక వేదికల మీద ప్రకటించారని తెలిపారు. కోర్టుకు కులాల వెనుకబాటుతనం గురించి సరిగా వివరిస్తే న్యాయం చేయెద్దని అంటారా అని ప్రశ్నించారు. బీసీలను ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరించి 52 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కోరారు. ఉద్యమంలో.. రాష్ట్రం వస్తే అస్తిత్వం వస్తాదని పోరాడిన చిన్న చిన్న కులాలకు రిజర్వేషన్లు అక్కర్లేదా అని ప్రశ్నించారు. రాజకీయ అంటరానితనం అనుభవిస్తున్న తాను ఈ కేసు వేసినట్టు తెలిపారు. -
వైఎస్సార్ను కేసీఆర్ ఆదర్శంగా తీసుకోవాలి
సాక్షి,కొత్తపల్లి (కరీంనగర్) : నిరుపేద ముస్లింలకు ఉద్యోగ, విద్య అవకాశాలు కల్పించేందుకు రిజర్వేషన్ల అమలులో వైఎస్ రాజశేఖరరెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదర్శంగా తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కె.నగేశ్ సూచించారు. కొత్తపల్లి(హెచ్) మండలం చింతకుంట, శాంతినగర్ మసీదుల్లో ఆదివారం జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొని మాట్లాడారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ అమలు చేసి వారి అభ్యున్నతికి పాటుపడింది కేవలం వైఎస్ఆర్ అని గుర్తు చేశారు. ప్రధానంగా టీఆర్ఎస్ ఎన్నికల మెనిఫెస్టోలో ఉన్న 12 శాతం రిజర్వేషన్ అమలుకు కేంద్రంపై కేసీఆర్ ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. కేవలం దుస్తులు, విందులతో సంతృప్తిపరిస్తే ముస్లింల పేదరికం పోదని, ఓటు బ్యాంకుగా వినియోగించుకోకుండా వారికి ఉన్నత విద్యతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ముస్లింలకు అతి పవిత్రమైన మాసం రంజాన్ అని అన్నారు. జిల్లా కార్యదర్శి ఎండీ అహ్మద్ బేగ్, పట్టణ కార్యదర్శి సుంకరి సునీల్కుమార్, నాయకుడు ఎండీ సర్ఫోద్దీన్ పాల్గొన్నారు. తెలంగాణలో ఆర్థిక దోపిడీ గంగాధర(చొప్పదండి) : రాష్ట్రంలో అవసరం లేని నియామకాలు చేస్తూ రూ.లక్షల వేతనాలు, మంత్రి హోదాను కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక దోపిడీకి పాల్పడుతోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నగేశ్ విమర్శించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే ఎంతోమంది ప్రభుత్వ ప్రతినిధులు, సలహాదారులున్నా.. రాజకీయ పునరావాసం కల్పించడానికి నియామకాలు జరుపుతున్నారని విమర్శించారు. ఇప్పటికే ఢిల్లీలో ఇరువురు ప్రభుత్వ ప్రతినిధులుండగా.. వారికే ఎలాంటి పనులు లేకున్నా మరో వ్యక్తి జగన్నాథంను ప్రభుత్వ ప్రతినిధిగా నియమించారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన పనులు మానుకొని ఇలాంటి నియామకాలు చేసుకుంటూ పోతే ప్రభుత్వం విశ్వాసం కోల్పోతుందని అన్నారు. -
వెలుగుల వేడుక
-
ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా టీఆర్ఎస్ పాలన
కాజీపేట : ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు కొనసాగడం వల్లే తెలంగాణ జన సమితి ఆవిర్భావం జరిగిందని వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి అంబటి శ్రీనివాస్ అన్నారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిధులు, నీళ్లు, నియామకాల పేరుతో సీమాంధ్ర నాయకులతో కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజా వ్యతిరేకతో కూడిన కుటుంబ పాలన సాగుతోందని విమర్శించారు. మిగులు బడ్జెట్తో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ అస్పష్టమైన విధానాలతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని ఆరోపించారు. జిల్లా కోఆర్డినేటర్ బోట్ల భిక్షపతి మాట్లాడుతూ ఆదివారం ఎర్రగట్టు గుట్ట కింద ఉన్న బాలాజీ ఫంక్షన్హాల్లో నిర్వహించే రాజ కీయ శిక్షణ తరగతులను విజయవంతం చే యాలన్నారు. రాజేంద్రప్రసాద్, రాజేందర్, పులి సత్యం, తిరునహరి శేషు, శ్యాంసుందర్రెడ్డి, అశోక్రెడ్డి, ఛత్రపతిశివాజీ, డా.కృష్ణ, శ్రావణ్, శ్రీకాంత్, శివ పాల్గొన్నారు. -
దోపిడీ పాలనను ప్రజలకు వివరించాలి
గంభీరావుపేట(సిరిసిల్ల) : టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలన, దోపిడీ విధారనాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలని ఉమ్మడి కరీం నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం పార్టీశ్రేణులను కోరారు. మండలా నికి చెందిన పలువురు యువకులు బుగ్గ కృష్ణమూర్తి నేతృత్వంలో మృత్యుంజయం, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, రాష్ట్ర నాయకుడు కేకే మహేందర్రెడ్డి సమక్షంలో గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి మృత్యుంజయం పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అంతకుముందు గ్రామంలో కృష్ణమూర్తి ఆధ్వర్యంలో యువకులు ర్యాలీ నిర్వహించారు. గొల్లపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మృత్యుంజయం, పొన్నం ప్రభాకర్, కేకే మ హేందర్రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ చలవతోనే తెలంగాణ ఏర్పాటైం దన్నారు. స్వరాష్ట్రం సిద్ధించాక ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన కేసీఆర్.. రాష్ట్రంలో నియంత పా లన కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. రానున్న ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణ పాఠం చెబుతారని హెచ్చరించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆకునూరి బాలరాజు, సాహెబ్, బండారి బాల్రెడ్డి, ఎస్కే గౌస్, లక్ష్మారెడ్డి, కరికే శ్రీనివాస్, కదిరే శ్రీనివాస్, శ్రీనివాస్రెడ్డి, బానోత్ రాజునాయక్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. -
రైతు కళ్లలో ఆనందం చూడాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్) : దాదాపు అరవై ఏళ్లుగా అరిగోస పడిన తెలంగాణ రైతాంగం కళ్లలో ఆనందం చూసేందుకే సీఎం కేసీఆర్ రైతులకు రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. స్థానిక జెడ్పీహాల్లో రైతుబంధు పథకంలో భాగంగా పట్టా పాసుపుస్తకాలు, చెక్కుల పంపిణీపై బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. అనంత రం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చారన్నారు. ప్రతి అన్నదాత కళ్లలో ఆనందం చూడాలనే ఈ పథకం అమలు చేస్తున్నామని చెప్పారు. రైతే రాజులా బ తికే విధంగా చేయాలన్నాదే సీఎం కేసీఆ ర్ లక్ష్యమన్నారు. పాస్ పుస్తకాల కోసం ఒక్కప్పుడు రైతుల, రెవెన్యూ కార్యాలయాల చుట్టు కాళ్ల అరిగేలా తిరిగే పరిస్థితి ఉండేదని, స్వరాష్ట్రంలో అధికారులే గ్రామాలకు వెళ్లి పాస్ బుక్కులు పంపిణీ చేస్తారన్నారు. రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేసి రైతులకు ఒక్క రూపాయి ఖర్చు కాకుండా భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టామన్నారు. ప్రస్తుతం భూ రికార్డులో కాస్తు కాలం తొలగించి సులభతరం చేశామన్నారు. పెట్టుబడి కింద రైతులకు పంపిణీ చేసేందుకు రూ.6 వేల కోట్లు సిద్ధంగా ఉన్నాయని, వాటిలో రూ.4 వేల కోట్లు ఇప్పటికే ఆర్బీఐలో డిపాజిట్ చేశామన్నారు. తెలంగాణ రైతులకు సాగు, ఎరువులు, విద్యుత్, పెట్టుబడి ఇలా అనేక రకాలుగా రైతుల మేలు కోసం చేస్తున్న కార్యక్రమాలతో రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టా యని కేంద్రం నివేదికలు వెల్లడించా యన్నారు. ప్రతి అభివృద్ధి పథకానికి అడ్డుపడే అలవాటు ఉన్న ప్రతిపక్షాలు రైతు పెట్టుబడి పథకాన్ని కూడా అడ్డుకుంటాయేమోనని అనుమానం వ్యక్తం చేశారు. త్వరలోనే షెడ్యూల్ ప్రకటన.. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 10వ తేదీ నుంచి పాసు పుస్తకాలు, చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. కార్యక్రమంపై గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం కల్పించాలని కోరారు. పోస్టర్లు, బ్యానర్లతో ప్రచారం చేయాలన్నారు. త్వరలోనే పంపిణి షెడ్యుల్ను ప్రకటించనున్నట్లు వివరించారు. చెక్కులతోపాటు వెంటనే డబ్బులను డ్రా చేసుకునే విషయాన్ని రైతులకు చెక్కుల పంపిణీ సమయంలోనే వెల్లడించాలని సూచించారు. ప్రజాప్రతినిధులకు సమాచారం.. రైతులకు పెట్టుబడి పథకం అమలు చేస్తున్న సీఎం దేశంలో ఎక్కడ లేదని ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్, ఆల వెంకటేశ్వర్రెడ్డి, ఎస్ఆర్ రెడ్డి, రాంమోహన్రెడ్డిలు అన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జా గ్రత్తలు తీసుకోవాలని కోరారు. పంపిణీ తేదీలను ఎమ్మెల్యేలతోపాటు, స్తానిక ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వాలని కోరారు. గ్రామాల వారీగా పంపిణీ తేదీలను త్వరలోనే వెల్లడించనున్నట్లు వివరించారు. కార్యక్రమంపై గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం కల్పించాలన్నారు. రైతు పెట్టుబడి ఆర్ఎస్ఎస్లకే. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రైతు పెట్టుబడి పథకంలో వచ్చే పెట్టుబడి నగదును వదులుకుంటే ఆర్ఎస్ఎస్ కార్పస్ ఫండ్కు జమ చేస్తామని మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్గౌడ్, ఆల వెంకటేశ్వర్రెడ్డి, రాంమోహన్రెడ్డి, ఎస్ఆర్రెడ్డిలు సూచించారు. ఆర్థికంగా ఉన్న ప్రజాప్రతినిధు లు తమకు వచ్చే పెట్టుబడిని స్వచ్ఛందంగా వదులుకోవాలని వారు పిలుపునిచ్చారు. వదులుకుంటే కార్పస్ ఫండ్కు.. ఎండల తీవ్రత వల్ల చెక్కల పంపిణి ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు సాయంత్రం 5 నుంచి 7 వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ రొనాల్డ్రోస్ అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని ముందుకు పోతున్నట్లు తెలిపారు. స్థానికంగా రైతు సమన్వయ సమితిలు, ప్రజాప్రతినిధుల కలుపుకొని కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే బ్యాంకర్లను సమాయత్తం చేసినట్లు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం నూతనంగా ముద్రించిన పాసుపుస్తకాలు, చెక్కులను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ బస్వరాజ్గౌడ్, జేసీ వెంకట్రావ్, సబ్కలెక్టర్ కృష్ణాదిత్య, వ్యవసాయాధికారి సుచరిత, రైతుబంధు పథకం ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాల అభివృద్ధే టీఆర్ఎస్ ధ్యేయం
నాగారం : గ్రామాల అభివృద్ధే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. శనివారం మండలంలోని ఈటూరు, మాచిరెడ్డిపల్లి గ్రామాల్లో రూ.30 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే ఈటూరు గ్రామంలో రూ.4.50లక్షలతో నిర్మించిన హెల్త్సబ్సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. కార్యక్రమంలో పీఆర్ డీఈఈ ప్రభు, ఏఈఈ శ్రీనివాస్, డీటీవో డాక్టర్ కోటా చలం, డాక్టర్ కిరణ్కుమార్, ఎంపీపీ కొమ్మినేని సతీష్, జెడ్పీటీసీ పేరాల పూలమ్మ, సర్పంచ్లు చిల్లర చంద్రమౌళి, శీల స్వరూపకృష్ణమూర్తి, కల్లెట్లపల్లి శోభన్, గుండగాని అంబయ్య, పొదిల రమేష్గౌడ్, పానుగంటి నర్సింహారెడ్డి, కల్లెట్లపల్లి ఉప్పలయ్య పాల్గొన్నారు. -
కోమటిరెడ్డిని...ఎదుర్కోలేకనే..
మునుగోడు : కోమటిరెడ్డి బ్రదర్స్ను రాజకీయంగా ఎదుర్కోలేకనే శాసనసభా సభ్యత్వాలను టీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసిందని టీపీసీసీ అధికార ప్రతినిధి నారబోయిన రవి విమర్శించారు. శనివారం మునుగోడులో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ అసమర్థ పాలన గూర్చి ప్రజలకు వివరిస్తున్నారనే కాంగ్రెస్ పార్టీ నాయకులపై ప్రభుత్వం కక్ష పెంచుకుందన్నారు. వారికి ప్రభుత్వ పరంగా ఇచ్చిన గన్మెన్లని తొలగించడం సిగ్గు చేటన్నారు. టీఆర్ఎస్ నాయకులు ఎన్ని ఎత్తులువేసినా 2019లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ నెల 9న కోర్టు ఇచ్చే తీర్పులో కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి అనుకూలంగా వస్తుందని, అందుకు సీఎం కేసీఆర్ తలవంచక తప్పదన్నారు. సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వేమిరెడ్డి జితెందర్రెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు జంగిలి నాగరాజు, బీసం విజయ్, అబ్బరబోయిన బాలక్రిష్ణ, ఆరేళ్ల సైదులు, నారబోయిన శరత్, దొటి మహేష్ యాదవ్ పాల్గొన్నారు. -
‘సొంతింటి కల సాకారమే లక్ష్యం’
నిర్మల్రూరల్ : పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇవ్వడమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర గృహనిర్మాణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్రూరల్ మండలంలోని రత్నాపూర్క్లాండీ గ్రామంలో గురువారం డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కల సాకారం చేయడమే లక్ష్యంగా డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు చేపడుతోందన్నారు. వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ల ద్వారా ఏప్రిల్ నుంచి రూ.లక్షా 116 అందిస్తోందన్నారు. కస్తూరిబా పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు, మెరుగైన వసతులు కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు చేసుకునే వారికి కేసీఆర్ కిట్, 75శాతం సబ్సిడీపై యాదవులకు గొర్రెలు పంపిణీ చేస్తున్నామన్నారు. నిరుద్యోగ యువతకు జాబ్మేళాలు నిర్వహించి ఉద్యోగాశకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఎఫ్ఏసీఎస్ చైర్మన్ రాంకిషన్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ దేవేందర్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ రామేశ్వర్రెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్గౌడ్, ఎన్ఆర్ఈజీఎస్ సభ్యుడు హరీశ్రావు, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ సభ్యుడు మహేశ్రెడ్డి, నాయకులు ముత్యంరెడ్డి, అల్లోల మురళీధర్రెడ్డి తదితరులున్నారు. -
కల.. నెరవేరిన వేళ
నిర్మల్రూరల్ : ఆదిలాబాద్ జిల్లాలోనే తొలి మోడల్ బెడ్రూం ఇళ్లను నిర్మల్రూరల్ మండలంలోని తన సొంత ఊరైన ఎల్లపెల్లిలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి బుధవారం ప్రారంభించారు. 45మంది లబ్ధిదారుల ఇళ్లను స్వయానా ప్రారంభించి అందించారు. 125 గజాల స్థలాన్ని ఒక్కో ఇంటికి కేటాయించి 560 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఇంటిని నిర్మించారు. ఒక్కో ఇంటికి రూ.6.29 లక్షల(రూ. 5.04 లక్షలు ఇంటినిర్మాణానికి, రూ.లక్షా 25వేలు మౌలిక సదుపాయాల కోసం) ఖర్చు చేశారు. మంత్రి ప్రత్యేక చొరవ తీసుకోవడంతో ఎనిమిది నెలల స్వల్ప కాలవ్యవధిలోనే 45 ఇళ్ల నిర్మాణం పూరైంది. గ్రామ సభ ద్వారా 45నిరుపేద కుటుంబాలను లబ్ధిదారులుగా ఎంపిక చేసి వారికి ఇళ్లను అందజేశారు. ప్రతీ ఇంటికి రెండు పడక గదులు, హాల్, కిచన్తో పాటు ప్రత్యేకంగా వాషింగ్ ఏరియా, కామన్ బాత్రూంతో పాటు పడక గదికి అటాచ్డ్ బాత్రూంను కూడా నిర్మించారు. సొంతింటి కల నెరవేరుస్తాం: మంత్రి జిల్లాలో ప్రతీ నిరుపేద ‘సొంతింటి’ కల నెరవేరుస్తామని రాష్ట్ర గృహనిర్మాణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి స్పష్టం చేశారు. ఎల్లపెల్లిలో డబుల్ బెడ్ రూం ఇళ్లను బుధవారం ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. వచ్చే ఏడాది మార్చి నాటికి అన్ని డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేస్తామన్నారు. హైదరాబాద్లో లక్ష ఇళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో లక్ష 70వేల ఇళ్లను నిర్మిస్తున్నామన్నారు. భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించి ఇస్తున్నామన్నారు. ఈ నిర్మాణాల కోసం ఇసుకను ఉచితంగా సరఫరా చేయడంతో పాటు సిమెంట్, స్టీల్ను కూడా మార్కెట్ రేటు కంటే తక్కువ రేటుకు అందిస్తున్నామన్నారు. షేర్వాల్ టెక్నాలజీతో త్వరితగతిన డబుల్ ఇళ్లను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ టెక్నాలజీతో కేవలం పది రోజుల్లోగా 10 డబుల్ బెడ్ రూం ఇళ్లను పూర్తి చేయవచ్చనన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంటే వాటిని జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు ఓర్వలేని తనంతో విమర్శలు చేస్తున్నాయన్నారు. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఎల్లపెల్లి మొదటి ‘డబుల్ మోడల్ కాలనీ’ అని పేర్కొన్నారు. గేటెడ్ కమ్యూనిటీ తలపించేలా : కలెక్టర్ ఎల్లపెల్లిలో లబ్ధిదారులకు అందజేసిన డబుల్ ఇళ్లు గేటెడ్ కమ్యూనిటీని తలపించేలా ఉందని జిల్లా కలెక్టర్ ప్రశాంతి అన్నారు. ఇళ్లు పొందిన లబ్ధిదారులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గృహనిర్మాణ శాఖ స్పెషల్ సీఎస్ చిత్రారామచంద్రన్, జెడ్పీ చైర్పర్సన్ శోభారాణి, మంత్రి సతీమణి విజయలక్ష్మి, గృహనిర్మాణ శాఖ చీఫ్ ఇంజినీర్ సత్యమూర్తి, మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేశ్చక్రవర్తి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, నిర్మల్, సారంగాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్లు దేవేందర్రెడ్డి, రాజ్ మహ్మద్, ఎంపీపీ దౌలాన్బీ, భూదాత సంపత్రెడ్డి, కాంట్రాక్టర్ లక్కడి జగన్మోహన్రెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త మురళీధర్రెడ్డి, సర్పంచ్ పిట్ల భీంరావు, ఎఫ్సీఎస్ చైర్మన్ రాంకిషన్రెడ్డి, టీఆర్ఎస్ యువ నాయకుడు గౌతమ్రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కలలో కూడా ఊహించలేదు.. ఇసుంటి ఇల్లు కట్టుకుంటామని మేము కలలో కూడా ఉహించలేదు. ఇండ్లు చాలా బాగున్నాయి. డబుల్ బెడ్ రూం, హాల్, కిచన్ ఎంతో అందంగా, నాణ్యతతో నిర్మించిఇచ్చారు. ప్రభుత్వానికి మా కృతజ్ఞతలు. -
కేసీఆర్ మోసాలను చూసే కాంగ్రెస్లోకి చేరికలు
తిప్పర్తి : ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయకపోవడంతోనే కాంగ్రెస్లో చేరుతున్నారని డీసీసీబీ డైరెక్టర్ సంపత్రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని పజ్జూరులో పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి గ్రామాల్లో అభివృద్ధి శూన్యమన్నారు. ప్రజ లను మోసపూరిత మాటలతో మభ్యపెడుతూ కాలం వెళ్లదీస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో పలు అభివృ ద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సిం గం సత్తయ్య, మండల అధ్యక్షుడు జూకూరి రమేష్, ఎంపీటీసీ కి న్నెర అంజి, దొంతినేని నాగేశ్వర్రావు, సురిగి రామకృష్ణ, జంజారాల సైదులు, దొడ్డ సోమయ్య, కస్పరాజు అయోధ్య, పల్లెసైదులు, భాస్కర్, ఆనందం, లింగస్వామి, యాదగిరి, బాలయ్య, భి క్షం, నర్సింహ, వార్డు సభ్యులు పల్లె సైదులు, నాగమ్మ ఉన్నారు. -
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాం
వరంగల్ : టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్వర్యంలో చేçపడుతున్న రెండో విడత ‘ప్రజా పరిరక్షణ చైతన్య బస్సుయాత్ర’ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈనెల 3న ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. హన్మకొండలోని కాంగ్రెస్ భవన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 3న (మంగళవారం) సాయంత్రం బస్సుయాత్ర భూపాలపల్లికి చేరుకుంటుందన్నారు. 4న మధ్యాహ్నం 2గంటలకు స్టేషన్ ఘనపూర్, అదే రోజు సాయంత్రం 6గంటలకు పాలకుర్తిలో యాత్ర కొనసాగుతుందన్నారు. 5వ తేదీ సాయంత్రం 6గంటలకు నర్సంపేటలో కొనసాగించి వరంగల్లో రాత్రి బస చేస్తారని తెలిపారు. 6న పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాలలో, 7వ తేదీన కొత్తగూడెం జిల్లా ఎల్లందు టేకులపల్లి, పినపాక మండలంలో యాత్ర కొనసాగుతుందన్నారు. 8న డోర్నకల్, మహబూబా బాద్లో యాత్ర నిర్వహిస్తారన్నారు. 9వ తేదీ ఉదయం భద్రాచలం వెంకటాపురంలో బిల్ట్ కార్మికులతో పీసీసీ బృందం చర్చిస్తుందని తెలిపారు. సాయంత్రం 5గంటలకు ములుగు సభలో పాల్గొంటారని, 10వ తేదీ సాయంత్రం 4 గం టలకు వర్ధన్నపేటలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న అనంతరం బస్సు యాత్ర ముగుస్తుందన్నారు. బస్సుయాత్రను విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు విజయరామారావు, వేం నరేందర్రెడ్డి, కొండేటి శ్రీధర్, సీతక్క, డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాసరావు, నాయకులు ఇనుగాల వెంకట్రాంరెడ్డి, నమిండ్ల శ్రీనువాసు, రవళీ, రహత్ పర్వీన్, మహ్మద్ అయూబ్, కొత్తపెల్లి శ్రీనివాస్, బిన్ని లక్ష్మన్, రమణారెడ్డి, రోహిత్సింగ్ఠాకూర్, మండల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ బస్సు యాత్ర సందర్భంగా ఏర్పాటు చేయనున్న సభ జరిగే కేడీసీ మైదానాన్ని నాయకులు సందర్శించి పరిశీలించారు. -
ప్రభుత్వం పెట్టుబడి వర్గాలకు కొమ్ముకాస్తోంది
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ ఓ వైపు పార్లమెంట్లో జనాభా ప్రాతిపదికన విద్య, వైద్యంలో రిజర్వేషన్లు కల్పించాలని ఆందోళన చేస్తూ.. మరో వైపు కేజీ టూ పీజీ ఉచిత నిర్భంధ విద్య అమలు చేస్తామని చెప్పి పెట్టుబడి వర్గాలకు కొమ్ముకాస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. గరువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. బడుగు బలహీన వర్గాలతో పాటు బీసీలకు ఎంత రిజర్వేషన్లు ఇస్తారో చెప్పకుండా, రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు కల్పించకుండా ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లు ఆమోదించుకున్నారని ఆరోపించారు. ప్రతి పక్షాలు బిల్లు వ్యతిరేకించినా.. అమరుల త్యాగం ద్వారా వచ్చిన తెలంగాణలో ప్రజాస్వామ్య హక్కు కాలరాస్తు ఈ బిల్లు ఆమోదించుకున్నారని అన్నారు. ప్రధాన ప్రతిపక్షాన్ని బయటకు పంపి ఏకపక్షంగా రిజర్వేషన్లు, ఇతర అంశాలపై స్పష్టత ఇవ్వకుండా చేశారన్నారు. అన్నింటిపైనా స్పష్టత వచ్చే వరకు బిల్లును ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. -
ప్రతి హామీని అమలుపర్చిన ఘనత టీఆర్ఎస్దే
పెద్దవూర : ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలుపర్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని ఎంపీపీ వస్తపురి మల్లిక, టీఆర్ఎస్ జిల్లా నాయకులు ఎంసీ కోటిరెడ్డిలు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో రామాలయం పక్క వీధిలో రూ.5 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించి మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ను, రైతు పెట్టుబడికి ఎకరాకు రూ.4వేలు అందిస్తున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే అని అన్నారు. బంగారు తెలంగాణ సాధనకు సీఎం కేసీఆర్ నిర్విరామంగా కృషి చేస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేని తనాన్ని ప్రదర్శిస్తున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఎక్కలూరి శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ కూతాటి భానుశ్రీదేశ్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కర్నాటి విజయభాస్కర్రెడ్డి, మేరెడ్డి జైపాల్రెడ్డి, బోయ నరేందర్రెడ్డి, నడ్డి లింగయ్యయాదవ్, ఏఎంసీ డైరెక్టర్ నడ్డి లక్ష్మయ్యయాదవ్, పులిమాల కృష్ణారావు, వస్తపురి నర్సింహ, కర్నాటి ప్రతాప్రెడ్డి, డైమండ్ బ్రదర్స్, ప్రదీప్రెడ్డి, నాగేశ్వర్రావు, వెంకట్రెడ్డి, శ్రీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుమలగిరి : గ్రామాల అభివృద్ధిలో భాగంగా నాగార్జునసాగర్ నియోజకవర్గానికి 12.69 కోట్ల ఎన్ఆర్ఈజీఎస్ నిధులు మంజూరైనట్లు టీఆర్ఎస్ జిల్లా నాయకుడు ఎంసీ కోటిరెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని రంగుండ్ల తండాలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా మంజూరైన రూ. 5 లక్షల సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో హాలియా వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ ఎక్కలూరి శ్రీనివాస్రెడ్డి, ఎంపీపీ అల్లి నాగమణిపెద్దిరాజు యాదవ్, గ్రామ సర్పంచ్ ఆంగోతు భగవాన్ నాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆంగోతు సూర్యభాషా నాయక్, ఎంపీటీసీ బుర్రి రాంరెడ్డి, మాజీ ఎంపీపీ చవ్వా బ్రహ్మనందరెడ్డి, నిడమనూరు సింగిల్విండో వైస్ చైర్మన్ కేతావత్ భిక్షా నాయక్, నాగేండ్ల కృష్ణారెడ్డి, ఆంగోతు ఫకీర, జవహర్నాయక్, చల్ల సోమశేఖర్, దుబ్బ శివాజీ, చింతలచెరువు శ్రీను, బాబురావు నాయక్, ఆంగోతు మంగ్తా పాల్గొన్నారు. -
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి
రామన్నపేట : కేంద్రరాష్ట్ర, ప్రభుత్వాల వైఫల్యాలను కాంగ్రెస్ కార్యకర్తలు ఎండగట్టాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పిలుపునిచ్చారు. ఆదివారం జనంపల్లి గ్రామంలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వంటి నాయకులు పదవులను సైతం త్యాగంచేసి అధిష్టానంపై ఒత్తిడి తేవడం వల్లనే సోనియాగాంధీ తెలంగాణరాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందన్నారు. కాంగ్రెస్ హాయాంలో ధర్మారెడ్డిపల్లి కాలువ ద్వారా నార్కట్పల్లి చెరువులను నింపామన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రసన్న రత్నాకర్ దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్వాతంత్య్ర సమరయోధుడు వేమవరపు మనోహర్పంతులు, యూత్కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షుడు మందడి ఉదయ్రెడ్డి నాయకులు నీల దయాకర్, మందడి రవిందర్రెడ్డి, నక్క యాదయ్య, బండ ఉపేందర్రెడ్డి, బద్దుల రమేష్,సంగిశెట్టి సుదర్శన్, కైరంకొండ చక్రపాణి, చలమల్ల లింగారెడ్డి, ఆగు మల్లయ్య, బైరు హరిక్రిష్ణ, నక్క ప్రవీన్, వంగాల సంపత్కుమార్, గట్టు గోపాల్, వంగాల గోపాల్, మారయ్య, గట్టు నరేష్,వంగాల రవి, గట్టు క్రిష్ణ, వంగాల గోవర్దన్, గట్టు సురేందర్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్తోనే కష్టాలు తీరుతాయి
దండేపల్లి(మంచిర్యాల) : మాటలతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు పడుతున్న కష్టాలు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తీరిపోతాయని ఏఐసీసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్రావు అన్నారు. దండేపల్లి మండల కేంద్రంతో పాటు మండలంలోని కాసిపేటలో ఆదివారం వివిధ పార్టీలకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసి న సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చిన సీఎం కేసీఆర్ వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో రైతులకు ఎకరాకు రూ. 4వేల పంట పెట్టుబడి అని కొత్త నాటకం మొదలు పెట్టారన్నారు. అనంతరం టీఆర్ఎస్, టీడీడీపీ, బీజేపీలకు చెందిన సుమారు 500ల మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ప్రేంసాగర్రావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి మొరుపుటాల మల్లేశ్, మహిళా అధ్యక్షురాలు శకుంతల, బీజేపీ మండల అ« ద్యక్షుడు బోడకుంట వెంకటేష్, టీఆర్ఎస్ నుం చి రైతు సమన్వయ సమితి సభ్యురాలు బొలి శెట్టి మల్లేశ్వరి, గంగయ్య, దేవేందర్తో పాటు వారి అనుచర వర్గాలు కాంగ్రెస్లో చేరారు. మంచిర్యాల మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కమలాకర్రావు, గూడెం పీఏ సీఎస్ చైర్మన్ తోట లక్ష్మయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అ«ధ్యక్షురాలు పడాల మాధవి, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఖలీద్, మాజీ ఎం పీపీలు శకుంతల, కాంతారావ్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
ఇచ్చోడ(బోథ్) : టీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ అన్నారు. మండలంలోని కోకస్మన్నూర్లో రూ.2 లక్షలతో చేపడుతున్న బుద్ధ విహార్ అదనపు గదుల నిర్మాణానికి ఆదివారం ఆయన భూమిపూజ చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు. కోకస్మన్నూర్లో బుద్ధవిహార్ అదనపు గదులకు రూ.2లక్షలు, మున్నూర్కాపు కమ్యూనిటీ భవన నిర్మాణం కోసం రూ.5లక్షలు నిధులు మంజూరు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కృష్ణకుమార్, కృష్ణారెడ్డి, జ్ఞానేశ్వర్, బజార్హత్నూర్ ఎంపీటీసీ నారాయణ, బజార్హత్నూర్ మండల కన్వీనర్ నాణం రమణ, చిలుకూరి భూమన్న, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ ఎన్నికల రథానికి.. జెండాపై రైతన్న
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నాగేటి సాళ్లకు నిధుల వరద పారించింది. గతంలో ఎన్నడూలేని విధంగా వ్యవసాయానికి భారీగా కేటాయింపులు చేసింది. రాష్ట్ర బడ్జెట్లో ఏకంగా 26 శాతం నిధులను సాగుకే మళ్లించింది. సాధారణ ఎన్నికల ముందు ప్రవేశపెడుతున్న చివరి పూర్తిస్థాయి బడ్జెట్ కావడంతో అన్నదాతలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఇప్పటివరకు సంక్షేమ పథకాలు, సాగు, తాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఈసారి రైతులోకాన్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నించింది. కొత్త రాష్ట్రం ఏర్పడగానే మొదటి బడ్జెట్లో రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేసిన సర్కారు ఈసారి.. వారికోసం రెండు భారీ వరాలు ప్రకటించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ముందుగానే ప్రకటించినట్టుగా వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందించే పథకానికి రూ.12 వేల కోట్లు కేటాయించింది. ఏటా ఎకరానికి రూ.8 వేల చొప్పున రైతులకు ఆర్థిక సాయం అందించే బృహత్తర పథకాన్ని ప్రకటించింది. పునాస పంటలకు ఏప్రిల్లో, యాసంగి పంటలకు నవంబర్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపింది. దీనికితోడు రైతు కుటుంబాలకు భరోసా ఇచ్చేందుకు ‘రైతు బీమా పథకం’ అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది నుంచే రాష్ట్రంలోని రైతులందరికీ రూ.5 లక్షల బీమా సదుపాయం కల్పించేందుకు బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించింది. ఈ రెండు పథకాలు మినహా బడ్జెట్లో కొత్త వరాలేమీ ప్రకటించలేదు. రైతులకిచ్చే వడ్డీలేని పంట రుణాలకు రూ.500 కోట్లు, వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు రూ.522 కోట్లు కేటాయించింది. ట్రాక్టర్లు, సేద్యపు పరికరాలతోపాటు నాటు వేసే యంత్రాలను సబ్సిడీపై అందిస్తామని వెల్లడించింది. ప్రభుత్వానికి రైతులకు అనుసంధానంగా రాష్ట్ర రైతు సమన్వయ సమితిని ఏర్పాటు చేసింది. పంట ఉత్పత్తులకు మార్కెట్లో మంచి ధర రానట్లయితే రైతు సమన్వయ సమితి నేరుగా వాటిని కొనుగోలు చేస్తుందని, అందుకు తగిన నిధులను సమకూరుస్తామని భరోసానిచ్చింది. 2018–19 సంవత్సరానికి మొత్తం రూ.1.74 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం అందులో రూ.20,820 కోట్లు వ్యవసాయం, అనుబంధ రంగాలకే వెచ్చించనుంది. సాగునీటికి గతేడాది మాదిరే.. వ్యవసాయం తర్వాత సాగునీటి రంగానికి రెండో ప్రాధాన్యమిచ్చింది. లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించే భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి గతేడాది తరహాలోనే రూ.25 వేల కోట్ల బడ్జెట్ కేటాయించింది. కోటి ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంలో భాగంగా ప్రాజెక్టులపై ఖర్చు చేసే నిధులు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తుకు వెచ్చించే నిధులు రైతు ప్రయోజనాలను ఉద్దేశించినవే కావటం గమనార్హం. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సబ్సిడీకి రూ.4,984 కోట్లు కేటాయించింది. వచ్చే ఏడాదిలో సాధారణ ఎన్నికలు జరుగనున్నాయి. మరోసారి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నా.. అది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్గా ఉంటుంది. అందుకే సాధారణ ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్లో అన్ని వర్గాలపై ప్రభుత్వం వరాలు కురిపిస్తుందన్న ప్రచారం జరిగింది. కానీ ఆకర్షనీయ పథకాల జోలికి వెళ్లకపోవడం గమనార్హం. రైతుల తర్వాత మైనారిటీలు రాష్ట్రంలో మొత్తం 76 లక్షల మంది రైతులున్నారు. వారిని ఆకట్టుకోవటమే లక్ష్యంగా ప్రభుత్వం భారీ కసరత్తు చేసింది. అన్నదాతల తర్వాత మైనారిటీలను ఆకట్టుకునేందుకు ఎక్కువ నిధులు వెచ్చించింది. కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన దేశ బడ్జెట్లో మైనారిటీలకు రూ.4,400 కోట్లు కేటాయిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం రూ.2,000 కోట్లు వెచ్చించిందని మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. బీసీలు, ఎంబీసీలకు పాత నిధులే గతేడాది బీసీల సంక్షేమానికి భారీగా నిధులు కేటాయించిన ప్రభుత్వం వాటిని ఖర్చు చేయటంలో మాత్రం ఆసక్తి కనబరచలేదు. బీసీల్లో అత్యంత వెనుకబడిన కులాలకు (ఎంబీసీలు) గతేడాది రూ.వెయ్యి కోట్లు కేటాయించినా నిధులు ఖర్చు చేయలేదు. అయినా ఈసారి రూ.వెయ్యి కోట్లు కేటాయించింది. బీసీలు, ఎస్సీ, ఎస్టీ యువతకు భారీ సబ్సిడీపై స్వయం ఉపాధి యూనిట్లు మంజూరు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. మూడేళ్లుగా ఆచరణలో విఫలమైంది. ఈసారి ఆర్థిక చేయూతనిచ్చే స్వయం ఉపాధి పథకాలకు రూ.1,682 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో దాదాపు 38 లక్షల మంది లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న ఆసరా పెన్షన్లకు రూ.5,366 కోట్లు కేటాయించింది. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్పులకు రూ.3,282 కోట్లు కేటాయించింది. అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి నిధికి(సీడీపీ) రూ.480 కోట్లు వెచ్చించనుంది. వరుసగా నాలుగేళ్లు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన మిషన్ భగీరథ పథకానికి రూ.1,803 కోట్లు, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి రూ.1,500 కోట్లు కేటాయించింది. బడ్జెటేతర నిధులతో వీటిని పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గ్రామ పంచాయతీలకు రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ప్రభుత్వం తరఫున అందిస్తామని ప్రకటించిన సీఎం.. బడ్జెట్లో ఈ మేరకు నిధులు సర్దుబాటు చేశారు. గ్రామ పంచాయతీల నిధికి రూ.1,500 కోట్లు, మున్సిపాలిటీలకు రూ.1,000 కోట్ల కేటాయింపులు చేసింది. కార్పొరేషన్లకు కూడా రూ.700 కోట్ల ప్రత్యేక నిధిని ప్రకటించింది. ముఖ్యమంత్రి నిధి 3 వేల కోట్లు గతంలో ముఖ్యమంత్రి ప్రత్యేక అభివృద్ధి నిధికి బడ్జెట్ నుంచి కేటాయింపులు చేయటంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం ఈసారి రూ.3000 కోట్లు కేటాయించినా బడ్జెట్లో ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్ఆర్ఐ శాఖకు ఈసారి రూ.100 కోట్లు కేటాయించింది. దీంతో ప్రవాస తెలంగాణవాసుల అభివృద్ధి, సంక్షేమానికి కొత్త కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా గల్ఫ్లో ఉన్న తెలంగాణవాసుల కష్టాలు తీర్చేందుకు ఈ నిధులను వెచ్చించే అవకాశాలున్నాయి. బడ్జెట్ 2018-19 మొత్తం బడ్జెట్: 1,74,453.83 ప్రగతి పద్దు: 1,04,757.90 నిర్వహణ పద్దు:69,695.93 ( రూ. కోట్లలో) బడ్జెట్పై సాక్షి మరిన్ని కథనాల కోసం క్లిక్ చేయండి -
టీఆర్ఎస్ ఉద్యమ స్పూర్తి ఏమైంది?
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కు అనుకూలంగా జైరాం రమేష్ నిర్ణయం తీసుకున్నారని టీఆర్ఎస్ మంత్రులు తప్పు పట్టడంపై కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. విభజన హామీలపై పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ప్రతిష్టాత్మకంగా భావించే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు సాధిందలేదన్నారు. నాలుగు సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ఉద్యమ స్పూర్తి ఏమైందన్నారు. జై తెలంగాణ నుంచి జై ఆంధ్ర వరకు టీఆర్ఎస్ స్పూర్తి వెళ్లిందని ఎద్దేవా చేశారు. సీబీఐ విచారణ భయం వల్ల టీఆర్ఎస్ కేంద్రంతో కుమ్మక్కై తెలంగాణకు ద్రోహం చేస్తుందని జీవన్ రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ నేతలు ఇంకా గాలిలో మేడలు కడుతున్నారని.. ఏ ఒక్క హామీ కూడా కేసీఆర్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. మరో వైపు ప్రభుత్వం నిర్వహించిన రైతు సమన్వయ సమితులు.. ప్రభుత్వ సమావేశమా? పార్టీ సమావేశమా? అని ఆయన ప్రశ్నించారు. రైతులకు గిట్టుబాటు ధరలను ప్రభుత్వం కేటాయించడం లేదని.. కేంద్రంపై నెపం నెట్టి కేసీఆర్ చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు. గుత్తా సుఖేందర్ రెడ్డి ఉద్యమ నాయకుడు అయితే, తమ పార్టీ నాయకులు కూడా ఉద్యమకారులే అని జీవన్ రెడ్డి తెలిపారు. -
అమ్మాయి నవ్వింది!
హుస్నాబాద్రూరల్: ఆడ పిల్ల పెళ్లా...! అబ్బో.. అనుకునే సామాన్య కుటుంబాలు ఆడపిల్ల పుట్టిదంటే కష్టాలు మొదలవుతాయని ఉహించుకొంటారు. అలాంటి వివక్షను రూపుమాపేందుకు తెలంగాణ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టి ఆడపిల్లల తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం అందిస్తూ అండగా నిలబడుతోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఎంబీసీ కుటుంబాలకు చెందిన 3 లక్షల కు పైగా కుటుంబాలకు ఆర్థిక సహా యం అందించింది. వచ్చే ఏప్రిల్ నుంచి పథకం కింద ఇచ్చే ఆర్థిక సాయాన్ని రూ.75,116 నుంచి రూ.1,00,116Sకు పెంచనుంది. జిల్లాలో 58,165 మంది కిశోర బాలికలు ఉండగా ఇందులో 50 వేల మందికి ఆరేళ్లలో ప్రయోజనం చే కూరనుంది. 4 వేల వరకు 18 ఏళ్లు దా టిన బాలికలకు తక్షణ లబ్ధి కలగనుంది.తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగేళ్ల క్రితం కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కుటుంబాలకు చెందిన అడపిల్లల పెళ్లిలకు 51వేల ఆర్థిక సహాయం అందజేసింది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకాన్ని బీసీలు, ఓసీలలోని పేద కుటుంబాలకు వర్తింపజేస్తూ పథకం నగదు ప్రోత్సాహకాన్ని రూ.75,116లకు పెంచింది. ఆడబిడ్డలను కన్నవారిలో ఆనందం ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ కింద ఇచ్చే ప్రోత్సాహకాలను లక్షకు పెంచడంతో ఆడబిడ్డలను తల్లిదండ్రుల్లో కాస్త ఊరట కనిపిస్తోంది. ప్రభుత్వ సహాయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. హుస్నాబాద్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 7వేల మంది కిశోర బాలికలు, 2వేల మంది పెళ్లి వయస్సు వచ్చిన యువతులు ఉండగా జిల్లాలో దాదాపు 40వేల మంది కిశోర బాలికలు, 12వేల వరకు పెళ్లి వయస్సు వచ్చిన ఆడపడచులకు ప్రయోజనం చేకూరనుంది. -
‘ఇది మాటల ప్రభుత్వమే’
సిరికొండ(నిజామాబాద్ రూరల్) : టీఆర్ఎస్ ప్రభుత్వం చేతల ప్రభుత్వం కాదని, కేవలం మాటల ప్రభుత్వమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గ ఇన్చార్జి కేశ్పల్లి ఆనంద్రెడ్డి ఆరోపించారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఒక రోజు నిరాహార దీక్షను మంగళవారం నిర్వహించారు. దీక్షలో కూర్చున్న ఆనంద్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పిట్టల దొరలాగా ఉత్తుత్తి మాటలు చెబుతూ నాలుగేళ్లుగా పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా చేసిందేమీ లేదన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని మాయమాటలు చెప్పి గద్దెనెక్కి ఇప్పుడెమో పెద్దల జపం చేస్తున్నాడని దుయ్యబట్టారు. తన కుటుంబసభ్యులకు ఒక్కో పదవి కట్టబెట్టి తెలంగాణను తన జాగీరులాగా చేసుకొని కుటుంబ పాలన చేస్తున్నాడని ఆరోపించారు. అనంతరం ఉప తహసీల్దార్ శ్రీనివాస్కు వినతిపత్రం అందజేశారు. నాయకులు బస్వా లక్ష్మీనర్సయ్య, మండలాధ్యక్షుడు లింబాగౌడ్, రామస్వామి, రాజేశ్వర్, బొర్రన్న, రాజన్న, రమేశ్రెడ్డి, రాజేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. -
మహిళలను అణగదొక్కుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం
బిచ్కుంద(జుక్కల్) : టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలను అణగదొక్కుతుందని మహిళలు తగిన బుద్ధి చెబుతారని కాంగ్రెస్ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అరుణతార అన్నారు. మంగళవారం బిచ్కుందలో మహిళ సంఘాలతో సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వ స్తే రివాల్వండ్ ఫండ్ కింద ప్రతి సంఘానికి లక్ష నగదు గ్రాంట్ ఇస్తామన్నారు. గ్రామంలో సమాఖ్య సంఘం భవనాలకు రూ.15లక్షలు, మండల సమాఖ్య భవనాలకు రూ.30లక్షలతో నిర్మిస్తామన్నారు. మహిళల కోసం మేనిఫె స్టో ప్రకటించిన పీసీసీ చీఫ్ ఉత్తంకుమార్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ యూత్ నాయకులు మ హ్మద్ యాషిన్, దేవాడ మాజి సర్పంచ్ ఈర్షెట్టి, ఎమ్మర్పీ స్ నాయకులు విజయ్, మారొతి పాల్గొన్నారు. రేపు కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ పిట్లం(జుక్కల్) : బిచ్కుందలో గురువారం కాంగ్రెస్ పార్టీ బహిరంగసభ నిర్వహించనున్నట్లు పార్టీ ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు తాహెర్బిన్ హందాన్ తెలిపారు. ఆయన మంగళవారం పిట్లంలో విలేరులతో మాట్లాడారు. పీసీసీ చీఫ్ ఆదేశాలతో పార్టీని బలోపేతానికి రిజర్వ్డ్ నియోజకవర్గం జుక్కల్లో ఈ బహిరంగ సభను నిర్వహించనున్నామన్నారు. నిజాంసాగర్ నుంచి బిచ్కుంద వరకు బైక్ ర్యాలీ తీస్తామని, దీనిలో కార్యకర్తలు భారీగా పాల్గొనాలన్నారు. మాజీ ఎమ్మెల్యే గంగారాం, కాంగ్రెస్ పా ర్టీ మండల అధ్యక్షుడు రాంరెడ్డి, సర్పంచ్ గంగారాం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, పట్టణ అధ్యక్షుడు బొడ్ల రాజు, సూరత్రెడ్డి, శివ,సాయిరెడ్డి, అశోక్, మొయిన్ పాల్గొన్నారు. -
గవర్నర్ ప్రభుత్వానికి భజన చేస్తున్నాడు: వీహెచ్
హైదరాబాద్ : గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి భజనచేస్తున్నాడని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు వ్యాఖ్యానించారు. విలేకరులతో మాట్లాడుతూ..రాష్ట్రంలో హత్యలు, అశాంతి పెరిగిపోయాయన్నారు. దేశంలోనే హత్యల్లో తెలంగాణ నెంబర్ వన్గా నిలిచిందని వ్యాఖ్యానించారు.రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, రెండు రోజుల్లోనే 7 హత్యలు జరిగాయన్నారు. నల్గొండ జిల్లాలో మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హత్యల్లో,అరాచకాల్లో నెంబర్ వన్గా కొనసాగుతున్నారని విమర్శించారు. శాంతి భద్రతలను కాపాడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, రాష్ట్రంలో జరుగుతున్న హత్యా రాజకీయాలపై కేంద్ర హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్కు లేఖ రాస్తానని తెలిపారు. -
బీటీ–3పై ఏం చేయాలి?
సాక్షి, హైదరాబాద్: జీవ వైవిధ్యానికి ప్రమాద కరమైన బీటీ–3 పత్తి విత్తనాన్ని ఏం చేయాలన్న దానిపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఈ అంశంపై ఏర్పాటు చేసిన ‘క్షేత్రస్థాయి తనిఖీ, శాస్త్రీయ మూల్యాం కన కమిటీ (ఎఫ్ఐఎస్ఈసీ)’పరిశీలన ము మ్మరం చేసింది. పత్తి అధికంగా సాగుచేసే గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్ర దేశ్లలో.. అనుమతిలేని బీటీ–3 విత్తనం ఏమేరకు వ్యాప్తి చెందిందో అధ్యయనం చే స్తోంది. అందులో భాగంగా 12 మంది సభ్యుల బృందం గురు, శుక్రవారాల్లో తెలం గాణలోని గద్వాల, మంచిర్యాల, వికా రాబాద్ జిల్లాల్లో పర్యటించింది. రాష్ట్ర విత్తన సేంద్రియ ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ కె.కేశవు లు నేతృత్వంలో రైతులను కలసి విచారించిం ది. ఆయా జిల్లాల్లో పత్తి పంటలను, జిన్నింగ్ మిల్లులను, విత్తన శుద్ధి ప్లాంట్లను పరిశీలిం చి, విత్తన నమూనాలను సేకరించింది. బీటీ–3కి అనుమతి లేకున్నా పలు చోట్ల ఆ విత్తనాన్ని వేశారని గుర్తించింది. అనంతరం హైదరాబాద్లో విత్తన కంపెనీలు, డీలర్లు, విత్తనోత్పత్తిదారులతో సమావేశమైంది. దిశా నిర్దేశం చేయండి అనధికార, పర్యావరణ కాలుష్య కారకమైన బీటీ–3 పత్తి విత్తనాలను అరికట్టడంపై స్పష్టమైన నిబంధనలతో అన్ని రాష్ట్రాలకు దిశానిర్దేశం చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి కేంద్ర బృందాన్ని కోరారు. తగిన ముందు జాగ్రత్తలు చేపట్టాలని, ఆ విత్తనాలను క్రమబద్ధీకరించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. కొన్నేళ్లుగా అనధికార బీటీ–3 పత్తి విత్తనాలు విక్రయిస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదని జాతీయ, రాష్ట్ర విత్తన సంఘాల ప్రతినిధులు, విత్తనోత్పత్తిదారులు కేంద్ర బృందానికి స్పష్టం చేశారు. అనధికార పత్తి విత్తనాలను పూర్తిగా నియంత్రించాలని డిమాండ్ చేశారు. కొందరు విత్తనోత్పత్తిదారులు చేసిన తప్పులకు విత్తన డీలర్లు ఇబ్బందులపాలు కావాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఈ సమస్యను అధిగమించటానికి తగిన నిబం ధనలు రూపొందించాలని.. విత్తనాల గుర్తిం పుపై డీలర్లకు, రైతులకు శిక్షణ ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. దేశానికి కావలసిన పత్తి విత్తనాల్లో 40 శాతం వరకు రాష్ట్రం నుంచే సరఫరా చేస్తున్నామని.. అనుమతి లేని బీటీ–3 పత్తి విత్తనాల వల్ల వాతావరణం కలుషితమవుతుందని రాష్ట్ర విత్తన సేంద్రియ ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ కె.కేశవులు పేర్కొన్నారు. బీటీ–3 పత్తిలో హెచ్టీ లక్షణాన్ని కనుగొని విత్తన ధ్రువీకరణ చేయటానికి ప్రైవేటు పత్తి సంకరజాతి రకాల నోటిఫికేషన్ అడ్డంకిగా ఉందని కేంద్ర ప్రభుత్వ జీవ సాంకేతిక విభాగం ముఖ్య శాస్త్రీయ అధికారి వి.ఎస్.రెడ్డి చెప్పారు. కేంద్ర బృందానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ సూచనలివీ.. 1. చట్టవిరుద్ధ బీటీ–3 పత్తి విత్తనోత్పత్తిని, అమ్మకాలను నియంత్రించే చర్యలు చేపట్టాలి. 2. అన్ని రాష్ట్రాల లాఎన్ఫోర్స్మెంట్ అథారిటీలు చేపట్టాల్సిన తక్షణ చర్యలను గుర్తించి మార్గదర్శకాలు రూపొందించాలి. 3. బీటీ–3 పత్తి విత్తనోత్పత్తిపై, గ్లైఫోసేట్ అమ్మకాలపై పర్యవేక్షణకు మార్గదర్శకాలు రూపొందించాలి. 4. విత్తన ఉత్పత్తిదారుల వద్ద లేదా ప్రొసెసింగ్ ప్లాంట్లలో బీటీ–3 పత్తి విత్తనాలను తనిఖీ చేసి వెంటనే నాశనం చేసేలా విధివిధానాలు రూపొందించాలి. 5. బీటీ–3 పత్తి వాడకం, గ్లైఫోసేట్ దుష్ప్రభావాలపై రైతులకు అవగాహన కల్పించాలి. 6. బీటీ–3లో హెచ్టీ లక్షణం పరీక్ష కోసం ప్రొటోకాల్స్ రూపొందించాలి. -
ప్రజల ఆకాంక్షల ప్రతిబింబం
సందర్భం తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమ కేంద్రమైన జనగామ నుంచి అక్టోబర్ 6న సీపీఐ ప్రారంభించిన పోరుబాట జనగామ, భువనగిరి యాదాద్రి, సూర్యాపేట, మేడ్చల్, హైదరాబాద్ మీదుగా రంగారెడ్డి జిల్లాలో ప్రవేశించింది. డిసెంబర్ 3 వరకు కొనసాగనున్న పోరుబాటలో రోడ్షో, బహిరంగసభలలో వేలాది మంది విద్యార్థి, యువజనులు, బడుగు బలహీనవర్గాల ప్రజలు స్పందిస్తూ, మద్దతి వ్వడం విశేషం. ప్రధానంగా నూతన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేరడం లేదనే ఆవేదనలు ప్రతి రోడ్షో, బహిరంగసభలలో వ్యక్తమవుతున్నాయి. పోరుబాట రోడ్షోలలో, బహిరంగసభలలో.. కేసీఆర్ ఆర్భాటంగా ప్రకటించిన ఏ హామీ అమలైందో చెప్పమని ప్రజలు ప్రశ్నించే స్థితి ఏర్పడటం గమనార్హం. తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కొత్తదనమేమీ కానరావడం లేదని, మార్పులు చోటు చేసుకోలేదని, అవినీతి విచ్చలవిడిగా కొనసాగుతోందని, నిరుపేదలు నిరసిస్తున్నారు. గత ప్రభుత్వ కాలంలో ఉన్న కొన్ని సంక్షేమ పథకాలకు పేరు మార్చి, వాటికి ముద్దు పేర్లు పెట్టి ముచ్చటగా ప్రజలను నమ్మించగలిగారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి పథకాల ప్రచారం ఆకాశాన్ని అంటింది. నీళ్లు, నిధులు, నియామకాలు, భూ పంపిణీ, ఆత్మగౌరవ పరిపాలన వంటి ప్రధానమైన హామీల అమలు నిర్వీర్యం కావడంతో ప్రజల్లో నిరాశ అలుముకుంటోంది. కొలువులు 2 లక్షలు ఖాళీగా ఉన్నా 16వేల ఉద్యోగాలు మాత్రమే కల్పించడంతో కొలువుల కొట్లాట తీవ్రతరమవుతోంది. సాగునీటి ప్రాజెక్టుల పట్ల ప్రభుత్వ వైఖరి ఏకపక్ష, నియంతృత్వ పోకడలకు అడ్డాగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలోని ప్రాజెక్టుల అంచనాల వ్యయం రూ.94 వేల కోట్లు, ఇప్పుడది 1 లక్ష 91 వేల కోట్లకు చేరుకోవడంతో ప్రాజెక్టుల అమలు తీరు ప్రశ్నార్థకమైంది. నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తానన్న వాగ్దానం గాల్లో కలిసింది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాల అమలుకు అప్పులు పాపం లాగా పెరిగిపోతున్నాయి. ఆఖరుకు ప్రభుత్వ భూములను ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేయడం కేసీఆర్ మార్క్ పరిపాలనకు అద్దంపడుతోంది. కోకాపేటలోనున్న 623 ఎకరాలు ప్రభుత్వ భూమే అని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. గత ప్రభుత్వాల కాలంలో చెరువుశిఖాలు, ప్రభుత్వ భూములు రియల్ఎస్టేట్ పరమయ్యాయనే చర్చ ఉంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఆర్ఎస్లో చేరిన జంప్ జలానీలు, రియల్ఎస్టేట్ వ్యాపారులు విశృంఖలంగా భూములను ఆక్రమించుకుంటుంటే, అడ్డుపడుతున్న కలెక్టర్లను నిలదీస్తూ కించపరుస్తున్న తీరు గర్హనీయం. దళితులకు మూడెకరాల భూమి ప్రహసనంగా మారి బెజ్జెంకి మండలంలోని గూడెం గ్రామానికి చెందిన దళిత యువకుడు శ్రీనివాసును బలిగొన్నది. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ప్రకటనలకే పరిమితమయ్యింది. వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా ప్రజలకు మెరుగైన వైద్యం ఎలా అందుబాటులోకి వస్తుంది? కార్మిక సంఘాల మధ్య కూడా చిచ్చుపెట్టి సింగరేణి ఎన్నికలో ‘‘ఆపరేషన్ ఆకర్‡్ష’’కు ప్రయత్నించడం దిగజారుడుతనమే. గతంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ఎనిమిది రకాల వస్తువులు అందిస్తే, ఈ ప్రభుత్వం ఒక్క బియ్యాన్నే సరఫరా చేయడం వలన చౌకధరల దుకాణాలను నడపలేమని డీలర్లు సమ్మెకు పూనుకొంటున్నారు. పత్తిరైతులు మార్కెట్లో క్వింటాల్కు రూ. 2,000 లకు కొనుగోలు చేయడంతో తమకు గిట్టుబాటు కావడం లేదని వాపోతున్నారు. ఆసరా పెన్షన్లలో భార్యాభర్తల్లో ఒక్కరికే ఇవ్వడం పట్ల కూడా అసహనం పెరుగుతోంది. గ్రామపంచాయతీ, మున్సిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు క్రమబద్ధీకరణ గురించి అర్జీలు ఇస్తున్నారు. కేసీఆర్ ప్రగతి భవన్కే పరిమితమవడంతో సచివాలయం మూగబోయింది. ఆత్మగౌరవ పరిపాలన అనుకుంటే ఆత్మవంచనా పాలన సాగుతోంది. ప్రజా ప్రాతినిధ్యానికి కేసీఆర్ పాలనలో స్థానం లేదు. పోరుబాటలో భాగంగా ఊళ్ళలో తిరుగుతున్నప్పుడు ప్రజల నుంచి వెల్లువలా వినతిపత్రాలు అందుతున్నాయి. అందులో సింహభాగం అంటే 70–80 శాతం డబుల్ బెడ్రూమ్లు, నివాస స్థలాల గురించే ఉండటం గమనార్హం. లక్షలలో ఇళ్లు కడతామని చెప్పి మూడున్నర ఏళ్లలో మూడున్నర వేల ఇళ్లు కూడా పూర్తి చేయలేకపోవడంతో ప్రజలలో ఉద్యమనేతపై విశ్వాసం సన్నగిల్లుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా డబుల్ బెడ్ రూమ్లు కట్టిస్తామని, కొన్ని చోట్ల శంఖుస్థాపన చేశారని, ఇప్పుడేమో అవి ప్రైవేట్ భూములని తప్పించుకుంటున్నారని పలువురు వాపోయారు. ఇలాంటి తరుణంలో సీపీఐ చేపట్టిన పోరుబాట ప్రజలకు ఒకింత భరోసా, విశ్వాసాన్ని పెంపొందించడంలో ప్రధాన పాత్ర పోషిం చడం, ప్రజల ఆదరణ పోరుబాటకు లభించడంతో మాపై గురుతరమైన బాధ్యత పెరుగుతున్నది. తెలంగాణలో సాయుధ పోరా టం ద్వారా నైజాంను గద్దెదించడంలో ప్రధానపాత్ర పోషించిన సీపీఐ నేడు పోరుబాటతో ప్రజా సమస్యల పరిష్కారానికి మరింత పునరంకితం కానున్నది. - చాడ వెంకటరెడ్డి వ్యాసకర్త సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మొబైల్ : 94909 52301 -
ఎక్కడి గొర్రెలు అక్కడికే!
అల్లాదుర్గం(మెదక్): గొర్రెల పంపిణీ వ్యవహారం రానురాను ప్రహసనంగా మారుతోంది. లబ్ధిదారులు గొర్రెలను తాము పెంచుకోవడానికి ఆసక్తి చూపకపోవడంతో అవి చేతులు మారుతున్నాయి. అధికారులు కూడా దీనిని నివారించలేకపోతున్నారు. గొల్లకుర్మలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దే శంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి గ్రామంలో సంఘాలు ఏర్పాటు చేసి విడతలవా రీగా ఒక్కో లబ్ధిదారునికి 21 గొర్రెల చొప్పున అందజేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన గొర్రెలను పెంచుకుంటూ వారు జీవనోపాధి పొందుతారని స ర్కారు ఆశించింది. పంపిణీ చేసిన గొర్రెల పెంపకం సజావుగా జరుగుతుందా..లేదా పర్యవేక్షించేందుకు ఓ కమిటీని వేయనున్నట్లు ప్రకటించిం ది. ఇతర రాష్ట్రాల నుంచి జీవాలను తెచ్చి పంపిణీ చేసింది. కమిటీలను వేయకపోవడంతో ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడికే గొర్రెలను తరలించి లబ్ధిదారులు యథేచ్చగా అమ్ముకుంటున్నారు. వాటిని అమ్మినా, కొన్నా కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించినా ఫలితం కనిపించ డం లేదు. దాదాపు జిల్లా అంతటా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఉదాహరణకు....అల్లాదుర్గం మండలంలో ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలను లబ్ధిదారులు యథేచ్ఛగా అమ్ముకుంటున్నారు. మండలంలోని మందాపూర్లో 23, ముప్పారంలో 39, చిల్వెరలో 30, వెంకట్రావ్పేటలో 14, రాంపూర్లో 13 యూనిట్లను అందజేశారు. ముప్పారం, చిల్వెర గ్రామాలకు చెందినవారు ఇప్పటికే సగం వరకు గొర్రెలను అమ్ముకున్నారు. ఇటీవల ముప్పారం గ్రామంలో రెండు టాటా ఎసీలలో గొర్రెలను తరలి స్తుండగా ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది. ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేసిన గొర్రెలను ఏడాది వరకు అమ్మవద్దనే నిబంధనలు ఉన్నాయి. అల్లాదుర్గం మండలంలో మాత్రం మూడు నెలలకే అమ్మేశారు. అయినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఏర్పాటు కాని పర్యవేక్షణ కమిటీలు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గొర్రెల పథకం నీరుగారిపోతోంది. గొర్రెల పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పినప్పటి కీ అది అమలుకు నోచుకోలేదు. ఎంపీడీఓ, తహసీల్దార్, పశువైద్యాధికారితో కలిపి పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉంది. అవి ఏర్పడే లోపు గొర్రెలన్నీ మాయమయ్యేలా ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు. -
నజరానా.. హైరానా!
♦ నగదు ప్రోత్సాహకం కోసం రెండేళ్లుగా ఎదురుచూపు ♦ జిల్లాలో 62 ఏకగ్రీవ పంచాయతీలు ♦ నజారానా పెంచుతున్నట్లు ప్రకటన ♦ ఇప్పటికీ నయాపైసా విదల్చని సర్కార్ ♦ {పభుత్వం తీరుపై సర్పంచ్ల అసంతృప్తి ఏకగ్రీవ పంచాయతీలకు రిక్తహస్తం ‘ఎన్నికలు వద్దు ఏకగ్రీవం ముద్దు.. ఏకగ్రీవమైతే నజరానా’ అంటూ పంచాయతీ ఎన్నికలకు ముందు ప్రోత్సహించిన సర్కార్ ఇప్పుడు ముఖం చాటేస్తోంది. సర్పంచ్లను ఏకగ్రీవం చేసుకుని ప్రభుత్వం అందజేసే నజరానాతో పల్లెలు బాగుచేసుకుందామనుకున్న ప్రజల ఆశలపై నీళ్లు చల్లుతోంది. ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్లు రెండేళ్లుగా నజారానా కోసం ఎదురుచూస్తున్నా ఫలితం కానరావటంలేదు. గత పాలకుల కంటే నజారానా పెంచుతున్నట్లు ప్రకటించిన తెలంగాణ సర్కార్ ఇప్పటి వరకు నయాపైసా విదల్చలేదు. అభివృద్ధి నిల్ గ్రామాభివృద్ధిని కోరి గ్రామస్తులంతా రాజకీయాలకు అతీతంగా ఏకగ్రీవంగా సర్పంచ్లను ఎన్నుకుంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం అందలేదు. రెండేళ్లయినా నగదు ప్రోత్సాహకం ఇవ్వకపోవడంతో గ్రామాలు అభివృద్ధి చెందట్లేదు. అందోల్ కృష్ణ, చక్రియాల సర్పంచ్, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు సాక్షి, సంగారెడ్డి : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏకగ్రీవ మైనర్ పంచాయతీలకు నగదు ప్రోత్సాహకం రూ.7 లక్షలు, మేజర్ పంచాయతీలకు రూ.15 లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ ఏడాది బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించింది. జిల్లాలో 62 పంచాయతీలు ఏకగ్రీవం కాగా వీటిలో పలు పంచాయతీలకు సొంత భవనాలు లేవు. మౌలిక సదుపాయాలూ కరువయ్యాయి. ప్రభుత్వం ఇచ్చే ఈ ప్రోత్సాహక నగదుతో అభివృద్ధి పనులు చేపట్టవచ్చని సర్పంచ్లు భావించారు. అయితే నజరానా అందకపోవడంతో వారంతా నిరాశ చెందుతున్నారు. రెండేళ్లుగా ఎదురుచూపులు.. జిల్లాలో మొత్తం 1,066 పంచాయతీలకు 2013-జూలైలో 26, 29, 31 తేదీల్లో మూడు విడతలుగా ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 29 మండలాల్లోని 62 పంచాయతీలకు సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పట్నుంచి రెండేళ్లుగా సర్పంచ్లు తమకు రావాల్సిన నగదు ప్రోత్సాహకం కోసం ఎదురు చూస్తున్నారు. ఏకగ్రీవమైన పంచాయతీలకు అందే ప్రోత్సాహకాలతో సర్పంచ్లు గ్రామంలో పంచాయతీ, అంగన్వాడీ భవనాల నిర్మాణంతోపాటు రోడ్లు వేసుకోవచ్చు. అయితే ప్రభుత్వం ఇంకా నజారానా అందజేయకపోవటంతో తమ పల్లెల్లో అభివృద్ధి కుంటుపడుతోందని వాపోతున్నారు. కాగా 2009లో ఏకగ్రీవమైన పంచాయతీలకు ప్రభుత్వం మేజర్, మైనర్ పంచాయతీలకు అన్న తేడా లేకుండా అన్ని పంచాయతీలకు రూ.5 లక్షల చొప్పున నగదు ప్రోత్సాహకం అందజేసింది. ప్రస్తుత ప్రభుత్వం ఎప్పటికి ఇస్తుందోనని సర్పంచ్లు ఎదురుతెన్నులు చూస్తున్నారు. రెండేళ్లుగా ఎదురుతెన్నులే.. ప్రభుత్వం నజరానాను ప్రకటించినా నిధులు మంజూరు కాకపోవడంతో అభివృద్ధి కుంటుపడింది. నిధులు మంజూరైతే గ్రామంలో అంతర్గత రోడ్లు, మురుగునీటి కాలువలు, ఇతర చిన్న చిన్న అభివృద్ధి పనులు జరిగేవి. - పెద్దగోల్ల మల్లమ్మ, సర్పంచు కంబాలపల్లి ప్రభుత్వానికి లేఖ రాశాం జిల్లాలో 62 ఏకగ్రీవ పంచాయతీలకు నగదు ప్రోత్సాహకాలు మంజూరు చేయాలంటూ ప్రభుత్వానికి లేఖ రాశాం. బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించినందున త్వరలోనే నగదు ప్రోత్సాహకాలు అందజేసే అవకాశం ఉంది. - సురేశ్బాబు, డీపీఓ -
ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యం
కేజీ టూ పీజీ విద్య అమలుకు కృషి మంత్రి జూపల్లి కృష్ణారావు వీపనగండ్ల : రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు టీఆర్ఎస్ ప్రభుత్వం విధానాలను అమలు చేసి వారి శ్రేయస్సు కోసం నిర్ణయాలు తీసుకుంటుందని పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. బంగారు తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టడంతో పాటు నూతనంగా పలు ప్రాజెక్టులను నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు. గురువారం వీపనగండ్లలో స్వర్గీయ వంగూరు కృష్ణారెడ్డి విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40ఏళ్ల క్రితమే కృష్ణారెడ్డి నిస్వార్థంగా ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే ఉద్దేశంతో వీపనగండ్లలో పాఠశాల, హాస్టల్ను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. 1969తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని, ప్రజలను చైతన్యం చేశారని చెప్పారు. సమితి ప్రసిడెంట్గా, జిల్లా గ్రంథాలయ చైర్మన్గా ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా కేజీ టూ పీజీ విద్యను అమలు చేసి ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులు చదివేందుకు కృషి చేస్తుందన్నారు. విద్యతో పాటు రైతులకు, గ్రామాల్లో ప్రజలకు విద్యుత్ సమస్య తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు కలలుగన్న బంగారు తెలంగాణ ఏర్పాటే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఎం.లోకారెడ్డి, తహశీల్దార్ దానప్ప, ఎంపీడీఓ కృష్ణయ్య, సర్పం చ్ క్యాతం శివుడు, పీఏసీఎస్ చైర్మన్ జగ్గారి శ్రీధర్రెడ్డి, పెద్దగంగిరెడ్డి, భాస్కర్రెడ్డి, రాంచంద్రారెడ్డి, ఎత్తం బాలస్వామి, రవీందర్రెడ్డి, గోపి, రాకేష్, తదితరులు పాల్గొన్నారు. -
పంట రుణమాఫీ పథకంలో నకిలీలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా : పంట రుణాల మాఫీ పథకంలో అక్రమార్కులకు అధికారులు కళ్లెం వేశారు. రుణమాఫీ జాబితాలో అనర్హుల పేర్లు చొప్పించిన గుట్టును రట్టు చేసిన మండల కమిటీలు.. వారి అర్హతను రద్దు చేశాయి. ఫలితంగా వారికి ప్రభుత్వం విడుదల చేసిన పంటరుణ మాఫీ తొలివిడత నిధులను తిరిగి సర్కారు ఖాతాకు మళ్లించారు. జిల్లాలో 3,282 మంది బోగస్ లబ్ధిదారులకు సంబంధించి రూ. 6.44 కోట్లను యంత్రాంగం ఇటీవల వెనక్కు పంపింది. కొత్త రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేస్తూ అర్హులను గుర్తించాల్సిందిగా ఆదేశించింది. దీంతో చర్యలకు దిగిన జిల్లా యంత్రాంగం.. పలుమార్లు వడపోత అనంతరం జిల్లా వ్యాప్తంగా 2,10,257 మందిని అర్హులుగా గుర్తించింది. వీరికి రూ.1,032.41 కోట్లు మాఫీ చేయాల్సిందిగా పేర్కొంటూ జాబితాను ప్రభుత్వానికి సమర్పించింది. రుణ మాఫీని నాలుగు విడతల్లో చెల్లించనున్నట్లు ప్రకటించిన సర్కారు.. తొలివిడత కింద రూ.258.10 కోట్లు విడుదల చేసింది. యంత్రాంగం రూపొందించిన జాబితాలో అనర్హులున్నట్లు అప్పట్లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మాఫీ నిధులు రైతుల ఖాతాల్లో జమచేసేముందు మరోసారి పరిశీలన చేపట్టాలని నిర్ణయించింది. ఈక్రమంలో జిల్లా వ్యాప్తంగా 3,282 మందిని జాబితా నుంచి తప్పిస్తూ.. మిగతా 2,06,975 మంది రైతులకు మాఫీ నిధులు బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. అనంతరం జాబితా నుంచి తప్పించిన రైతుల వివరాలను పూర్తిస్థాయి పరిశీలన చేపట్టారు. ఇందులో పరిమితికి మించిన రుణాలు, బంగారు ఆభరణాల లోన్లు, నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు, ఖాతా నంబర్లలో డూప్లికేట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో వారి అర్హతను రద్దు చేశారు. మాఫీ రూ.1,006.84 కోట్లే.. రుణ మాఫీలో అనర్హుల పేర్లు తొలగించడంతో ప్రభుత్వానికి కొంత భారం తగ్గింది. తొలుత 2,10,257 మందిని అర్హులుగా గుర్తించి.. వారికి రూ.1,032.41 కోట్లు మాఫీ చేయాల్సిందిగా పేర్కొంటూ ప్రభుత్వానికి నివేదికలిచ్చారు. తాజాగా అనర్హులను జాబితా నుంచి తప్పించారు. ఫలితంగా లబ్ధిదారుల సంఖ్య 2,06,975కు తగ్గింది. అదేవిధంగా మాఫీ మొత్తం కూడా రూ.1,006.84 కోట్లకు చేరింది. అంటే ప్రభుత్వానికి రూ. 25.76కోట్ల భారం తగ్గింది. ఇందులో ఇప్పటికే రూ.251.71 కోట్లు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమచేసింది. తాజా ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మరో రూ. 251.71 కోట్లు ఇవ్వాల్సిందిగా జిల్లా వ్యవసాయశాఖ నివేదికను తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. -
‘ప్రత్యేక పనులకు’ పాతర
నీలగిరి : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్డీఎఫ్) కింద మంజూరైన పనులపై టీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టి సారించింది. సొంత రాజకీయ ప్రయోజనాలు, నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు లబ్ధి చేకూర్చేందుకే నిధుల కేటాయింపు జరిగిందని ఆరోపణల నేపథ్యంలో ఆ పనులను నిలిపివేయాలని నిర్ణయించింది. ఎన్ని పనులు...ఎక్కడెక్కడ.. గతేడాది అక్టోబర్ 1 తర్వాత ఎస్డీఎఫ్ కింద మంజూరైన పనుల వివరాలను తెలియజేయాల్సిందిగా జిల్లా ప్రణాళిక విభాగానికి ఇటీవల ఆదేశాలు వచ్చాయి. జిల్లాకు ఎన్ని పనులు మంజూరయ్యాయి..? ఎన్ని అసంపూర్తిగా ఉన్నా యి..? ఇప్పటికీప్రారంభం కాని పనులెన్ని..? తదితర వివరాలు కోరింది. పనిలోపనిగా ఇప్పటి వరకు ప్రారంభం కాని పనులు, అసంపూర్తిగా ఉన్న పనులను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో మన జిల్లాలో దాదాపు 7 కోట్ల రూపాయల పనులు ఎక్కడి కక్కడే ఆగిపోయాయి. అప్పటి ఎమ్మెల్యేల్లో ఉత్తమ్కుమార్రెడ్డి కోదాడకు, కుందూరు జానారెడ్డి, రాంరెడ్డి దామోదర్రెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్, బాలునాయక్లు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు స్పెషల్కోటా కింద ముఖ్యమంత్రి సిఫారసుతో 12.50కోట్ల రూపాయలు మంజూరు చేయించుకున్నారు. ఈ నిధులతో ఆయా నియోజకవర్గాల్లో 337 పనులు చేపట్టారు. వీటిలో 185 పనులు అసంపూర్తిగా ఉన్నాయి. నామినేటెడ్ పద్ధతిపై కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలే వీటిని దక్కించుకున్నారు. తమకు లాభసాటిగా ఉంటుందని, లింక్రోడ్లు, సిమెంట్ రోడ్లుకు ఈ నిధులు వెచ్చించారు. దీంతో అభివృద్ధి సంగతి ఎలా ఉన్నా... పార్టీ శ్రేణుల పంట పండింది. నియోజకవర్గాల వారీగా... ఆలేరు నియోజకవర్గానికి రూ.3.50కోట్లు మంజూరు చేశారు. 112పనులకుగాను 29 పనులు పూర్తయ్యాయి. మరో 23పనులు పురోగతిలో ఉం డగా, 60 పనులు ఇంకా మొదలు పెట్టలేదు. దేవరకొండ నియోజకవర్గానికి రూ.2కోట్లు మంజూరు చేశారు. 49 పనులకు గాను 32 పనులు పూర్తయ్యాయి. 14 పనులు పురోగతిలో ఉన్నాయి. 3 పనులు అసంపూర్తిగా ఉన్నాయి. సూర్యాపేట నియోజకవర్గానికి రూ. 3 కోట్లు మం జూరు అయ్యాయి. మొత్తం 128 పనులకు గాను 6 పనులు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన 122 పనులు అసంపూర్తిగానే ఉన్నాయి సాగర్ నియోజకవర్గానికి రూ.2 కోట్లు మంజూరు చేశారు. 46పనులకు గాను 24పనులు పూర్తయ్యా యి. మిగిలిన 22పనులు పురోగతిలో ఉన్నాయి. కోదాడ నియోజకవర్గానికి మంజూరైన రూ.2 కోట్లకు గాను చేపట్టిన రెండు పనులు పూర్తయినట్లు అధికారులు ఓ నివేదిక రూపొందించి ప్రభుత్వానికి పంపారు. నియోజకవర్గ నిధులదీ అదే పరిస్థితి.. నియోజకవర్గ అభివృద్ధి పథకం కింద చేపట్టిన పనులకూ ప్రభుత్వం బడ్జెట్ నిలిపేసింది. ఈ పథకం కింద ఒక్కో ఎమ్మెల్యేకు ఏడాదికి కోటిరూపాయలు ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఎన్నికల కోడ్ కారణంగా ఈ పనుల బడ్జెట్కు బ్రేక్ పడింది. దీంతో పనులు పూర్తయినా, బిల్లులు రాని పరిస్థితి నెలకొంది. 12 మంది ఎమ్మెల్యేలతో పాటు, ఇద్దరు ఎమ్మెల్సీలకు కలిపి రూ. 14 కోట్ల బడ్జెట్ ఉంటుంది. మొదటి ఆరునెలలకు గాను గత ఏడాది రూ. 7 కోట్లు విడుదల చేశారు. చివరి ఆరునెలలకు పనులకు సంబంధించి రూ. 7 కోట్లు ఇంకా పెండింగ్లో నే ఉన్నాయి. కొత్త ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడితేనే ఈ నిధులకు మోక్షం లభించే అవకాశముంది.