Urban
-
పట్టణ వినియోగ పెంపునకు బ్లూప్రింట్
పట్టణ వినియోగం ఆర్థిక వృద్ధికి కీలకం. అయితే కొన్ని కారణాల వల్ల పట్టణ వస్తువినియోగం గతంతో పోలిస్తే తగ్గుతుంది. దీన్ని పెంచితేనే దేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుంది. ఇందుకోసం బడ్జెట్లో వ్యూహాత్మక విధానాన్ని పాటిస్తూ, కొన్ని అంశాలపై దృష్టి సారించాలని నిపుణులు చెబుతున్నారు. పట్టణ వినియోగాన్ని పెంచడానికి కొన్ని సూచనలు చేస్తున్నారు.మౌలిక సదుపాయాల అభివృద్ధిపట్టణ వినియోగం పెరగాలంటే ఆధునిక మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టడం చాలా అవసరం. రవాణా నెట్వర్క్ను మెరుగుపరచడం, డిజిటల్ కనెక్టివిటీని విస్తరించడం, యుటిలిటీలను అప్గ్రేడ్ చేయడం వంటివాటిపై దృష్టి పెట్టాలి. సమర్థవంతమైన ప్రజా రవాణా వ్యవస్థ పట్టణ జీవనాన్ని మరింత సౌకర్యవంతంగా, ఆకర్షణీయంగా మారుస్తుంది. ఇది అధికంగా ఖర్చు చేసేందుకు ప్రోత్సహిస్తుంది.రిటైల్ వ్యవస్థపట్టణ వినియోగాన్ని పెంచడానికి శక్తివంతమైన రిటైల్ వ్యవస్థను, వాణిజ్య ప్రదేశాలను ఏర్పాటు చేయడం చాలా ముఖ్యం. నివాస, వాణిజ్య, వినోద ప్రాంతాలను మిళితం చేసేలా సదుపాయాలు సిద్ధం చేయాలి. స్థానిక వ్యాపారాలు, స్టార్టప్లను ప్రోత్సహించడం వల్ల సమ్మిళిత ఆర్థిక వాతావరణాన్ని పెంపొందించవచ్చు.చౌకగా గృహాలుడిస్పోజబుల్ ఆదాయం(ఖర్చులు పోను మిగిలే ఆదాయం) వస్తువుల వినియోగాన్ని పెంచడానికి, సరసమైన గృహాలను కొనుగోలు చేయడానికి తోడ్పడుతుంది. తక్కువ ధరకు లభించే గృహాలను ఏర్పాటు చేసే ప్రాజెక్టులు జీవన వ్యయాలను తగ్గిస్తాయి. వస్తువులు, సేవలపై ఎక్కువ ఖర్చు చేసేలా దోహదం చేస్తాయి. ఇది స్థానిక వ్యాపారాలకు ఊతమిస్తుంది.పర్యాటకాన్ని ప్రోత్సహించడంపట్టణ వినియోగానికి పర్యాటక రంగం గణనీయంగా దోహదం చేస్తుంది. పర్యాటక ఆకర్షణ స్థలాలను అభివృద్ధి చేయడం, ఆతిథ్య సేవలను మెరుగుపరచడం, సాంస్కృతిక, వారసత్వ ప్రదేశాలను కాపాడడం వల్ల సందర్శకులను ఆకర్షించవచ్చు. ఖర్చును పెంచవచ్చు. సమర్థవంతమైన మార్కెటింగ్ ప్రచారాలు, ట్రావెల్ ఏజెన్సీలతో భాగస్వామ్యాలు పట్టణ పర్యాటకానికి సహాయపడతాయి.ప్రజా సేవలను మెరుగుపరచడంఅభివృద్ధి చెందుతున్న పట్టణ వాతావరణానికి ఆరోగ్య సంరక్షణ, విద్య, భద్రత వంటి నాణ్యమైన ప్రజా సేవలు చాలా అవసరం. ఈ విభాగాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల నివాసితుల జీవన నాణ్యత మెరుగుపడుతుంది. ఇది స్థానికులకు, పెట్టుబడిదారులకు నగరాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది.సుస్థిర పద్ధతులుసుస్థిర పద్ధతులను అవలంబించడం వల్ల దీర్ఘకాలిక పర్యావరణ వ్యవస్థను పెంచవచ్చు. గ్రీన్ బిల్డింగ్స్, రెన్యూవబుల్ ఎనర్జీ, వేస్ట్ మేనేజ్ మెంట్ వంటి కార్యక్రమాలు మరింత సుస్థిరాభివృద్ధికి తోడ్పాటును అందిస్తాయి.ఇదీ చదవండి: సామాన్యుడు కేంద్ర బడ్జెట్ గురించి ఎందుకు తెలుసుకోవాలి..?అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యంపట్టణ ప్రజల అవసరాలు, ప్రాధాన్యతలను అర్థం చేసుకోవాలి. ప్రజా సంప్రదింపులు, ఫీడ్ బ్యాక్ యంత్రాంగాలు, భాగస్వామ్య ప్రణాళికలతో మెరుగైన సేవలందించవచ్చు. అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేస్తే నిజంగా అవసరమయ్యే ప్రాజెక్టుల రూపకల్పన జరుగుతుంది. ఇది అధిక వినియోగానికి దారితీస్తుంది.ఆర్థిక ప్రోత్సాహకాలుపన్ను రాయితీలు, సబ్సిడీలు, గ్రాంట్లు వంటి ఆర్థిక ప్రోత్సాహకాలను అందించడం వల్ల పట్టణ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టడానికి వ్యాపారాలను ప్రోత్సహించవచ్చు. ఈ ప్రోత్సాహకాలు ఆర్థిక కార్యకలాపాలను పెంచుతాయి. ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తాయి.సాంకేతిక పరిజ్ఞానంసాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం ద్వారా లావాదేవీలను మరింత సౌకర్యవంతంగా, సమర్థవంతంగా జరుపవచ్చు. డిజిటల్ చెల్లింపు వ్యవస్థలు, ఇ-కామర్స్ ప్లాట్ఫామ్లు, స్మార్ట్ సిటీ పరిష్కారాలు వినియోగ ప్రక్రియలను క్రమబద్ధీకరిస్తాయి. -
నగరాలు నిండిపోతున్నాయ్..!
సాక్షి, అమరావతి: నగరాలు నిండిపోతున్నాయి. సమీప గ్రామాలు సైతం పట్టణాల్లో విలీనమవుతున్నాయి. మరో పదేళ్లల్లో దేశజనాభాలో 40 శాతం పట్టణాల్లోనే స్థిర నివాసం ఏర్పరచుకుంటారని కేంద్రం అంచనా వేస్తోంది. దీనికి తగ్గట్టుగా చర్యలు తీసుకోకపోతే ప్రమాదమని కేంద్రం భావిస్తోంది. దీంతో పట్టణీకరణపైనా, మౌలిక సదుపాయాల కల్పన పైనా కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టి పెట్టింది.పట్టణీకరణపై అధ్యయనం కోసం ప్రత్యేకంగా కమిటీని వేయడంతో పాటు వచ్చే ఐదు దశాబ్దాలు మన నగరాలు ఎలా అభివృద్ధి చెందాలనే అంశంపై ప్రణాళిక సిద్ధం చేస్తోంది. 2022లో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఇటీవల తన నివేదికను కేంద్రానికి సమర్పించింది. దీనిప్రకారం 2036 నాటికి దేశంలో పట్టణ జనాభా 60 కోట్లకు చేరుతుందని, 2047 నాటికి 80 కోట్లకు పెరుగుతుందని అంచనా వేసింది. ఈ క్రమంలో పట్టణీకరణ సమీప భవిష్యత్లో అత్యవసరమని నివేదిక పేర్కొంది. అంతేకాకుండా భవిష్యత్ నగరీకరణ ప్రణాళిక, సంస్కరణలను సిఫారసు చేసింది.ఆలిండియా అర్బన్ ప్లానింగ్ సర్వీస్ అవశ్యంపట్టణ ప్రణాళికను పర్యవేక్షిస్తున్న శిక్షణ పొందిన నిపుణులకు ప్రాధాన్యతనిస్తూ, టౌన్ ప్లానింగ్లో అర్హత కలిగిన ప్లానర్లను నియమించుకోవడానికి ‘ఆలిండియా అర్బన్ ప్లానింగ్ సర్వీస్’ అవసరాన్ని నివేదిక పునరుద్ఘాటించింది. ఇది ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్, ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీస్ తరహాలో ఉండాలని పేర్కొంది. దీంతోపాటు నేషనల్ అర్బన్ అండ్ రీజినల్ ప్లానింగ్ అథారిటీని రూపొందించడానికి, బలోపేతం చేయడానికి టౌన్ అండ్ కంట్రీ ప్లానర్స్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని సూచించింది.పట్టణాలకు ఆర్థిక స్థిరత్వంపట్టణ స్థానిక సంస్థలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనేది సిఫార్సుల ముఖ్యాంశాల్లో ఒకటి. ఒక నగరం బడ్జెట్ మొత్తం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 1 శాతం కంటే తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. నగరాలు, పట్టణాల్లో వసూలు చేసే ఆక్ట్రాయ్ పన్నుల ద్వారా ఆదాయం సమకూరే అవకాశం లేనందున నగరాల్లో చేపట్టే ప్రాజెక్ట్లకు ఆర్థిక వనరులను మల్టీ లేటరల్ లోన్లు, దేశీయ టర్మ్లోన్లు, పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యం, మునిసిపల్ బాండ్లు, ఇతర ఆదాయ మార్గాల ద్వారా నిధులు సమకూర్చుకోవాలని సూచించింది. తమిళనాడు తరహాలో పట్టణాభివృద్ధికి నిధులు సమకూర్చుకోవాలని తెలిపింది.అలాగే పట్టణ స్థానిక సంస్థలు (యూఎల్బీ)లు సమర్థవంతమైన పనితీరుతో స్వతహాగా ఆర్థిక వనరులను పెంచుకోవాలని, జీఎస్టీ రాబడిలో కొంత భాగాన్ని పంచుకోవడం తప్పదని కమిటీ సిఫారసు చేసింది. ఉదాహరణకు... మహారాష్ట్రలో వసూలు చేసే జీఎస్టీలో స్థానిక సంస్థల పన్నులు కూడా ఉన్నాయని, ఆ మొత్తాన్ని యూఎల్బీలకు ఇస్తున్నట్టు పేర్కొంది. వీటితో పాటు 10 లక్షల జనాభా ఉన్న నగరాల్లో ‘నగర ఆర్థిక అభివృద్ధి కౌన్సిళ్లు’ ఏర్పాటు చేయాలని కమిటీ సిఫారసు చేసింది. స్థానిక వ్యాపారాలు, పరిశ్రమలకు చెందిన నిపుణులతో ఈ స్టాండింగ్ కమిటీ ఉండాలని పేర్కొంది.ఇది కేవలం సలహా సంఘంగా మాత్రమే కాకుండా పట్టణ స్థానిక సంస్థల్లో నైపుణ్యాలు, సామర్థ్యాల కొరతను పూరించడానికి వాటితో సంఘటితం కావాలని సూచించింది. ఈ సూచనలను అసోం, గుజరాత్, హరియాణా, జమ్మూ–కశ్మీర్, కేరళ, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలో పరిస్థితుల అధ్యయనం తర్వాత చేసినట్టు నివేదికలో పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో ఇదే తరహా విధివిధానాలను అనుసరిస్తున్నట్లు తెలిపింది.పెరుగుతున్న జనాభా.. తగ్గుతున్న సాగుభూమిపట్టణ జనాభా 1961లో 79 మిలియన్ల నుంచి 2011లో 388 మిలియన్లకు పెరిగింది, 2030 నాటికి 630 మిలియన్లకు చేరుతుందని అంచనా. ఈ సమయంలో తలసరి సాగు భూమి 1950–51లో 0.83 హెక్టార్లు ఉండగా, ఇది 2015–16 నాటికి 0.12 హెక్టార్లకు తగ్గిపోయింది. 2030 నాటికి ఇది మరింత క్షీణించి 0.08 హెక్టార్లకు తగ్గుతుందని అంచనా. ఈ పరిస్థితి చాలా ప్రమాదకరమని నివేదిక హెచ్చరించింది. ఈ క్షీణత ఆహార భద్రత, స్థిర వ్యవసాయం, గ్రామీణ జీవనోపాధికి గణనీయ సవాళ్లను విసురుతోందని ఆందోళన వ్యక్తం చేసింది.చాలా దేశాల్లో నగరాలు బహుళజాతి సంస్థల్లా నడుస్తూ, సొంతంగా నిధులు సమకూర్చుకుంటుంటే, మన దేశంలో ఇంకా నిధుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడుతున్నాయని పేర్కొంది. ప్రస్తుతం నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 75 శాతానికి పైగా నిధులు సమకూరుస్తుండగా, యూఎల్బీలు తమ రాబడి నుంచి 15 శాతం మాత్రమే ఖర్చు చేస్తున్నాయి. నగరాల మౌలిక సదుపాయాల అవసరాల్లో 5%మాత్రమే ప్రైవేట్ వనరుల ద్వారా నిధులు వస్తున్నాయని.. వీటిని మరింత పెంచాల్సిన అవసరముందని పేర్కొంది. పట్టణీకరణను నివారించాలని సూచనపరిశ్రమలు, వ్యాపార ప్రాంతాల (బ్రౌన్ఫిల్డ్) కోసం వ్యవసాయ క్షేత్రాలను అభివృద్ధి చేయాలనే రియల్టర్ల ఆశ పట్టణ విస్తరణలకు దారితీసింది. ఫలితంగా పర్యావరణం క్షీణించడం, వ్యవసాయ యోగ్యమైన భూమిని కోల్పోవడంతో పాటు పట్టణీకరణ విపరీతంగా పెరుగుతోందని నివేదిక పేర్కొంది. -
కాన్వాస్పై.. సిటీ లైఫ్వ్..
నగరవ్యాప్తంగా అర్బన్ స్కెచ్చర్ల ఈవెంట్లు లైవ్ స్కెచ్లతో జీవనశైలికి చిత్రరూపం హబ్సిగూడలోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ శాస్త్రవేత్తలకు గత నవంబరు 9న ఓ వైవిధ్యభరిత అనుభవం ఎదురైంది.. తమ ప్రాంగణంలోకి వచి్చన కొందరు ఔత్సాహిక చిత్రకారులు తమ ల్యాబ్స్ సహా పరిసరాలను బొమ్మలుగా గీస్తుంటే ఆసక్తిగా గమనించడం అంతకు ముందెన్నడూ ఎరుగని అనుభూతి. ‘ఇది మా 298వ స్కెచ్ంగ్ ట్రిప్. శాస్త్రవేత్తల పని చూసినప్పుడు ఎంతో అబ్బురం అనిపించింది. ఆ పని, పరిసరాలు మా కళకు స్ఫూర్తిని అందించాయి’ అంటూ అర్బన్ స్కెచ్చర్స్ ప్రాంతీయ అడ్మిన్స్లో ఒకరైన సయ్యద్ జీషన్ అహమద్ చెప్పారు. నగరాన్నే తమ కాన్వాస్గా మార్చుకుని వారాంతాల్లో లైవ్స్కెచ్ డ్రైవ్ నిర్వహిస్తున్న అర్బన్ స్కెచ్చర్స్ ఈ నెలలో 300వ మైలురాయిని చేరుకుంది. ఈ అరుదైన సందర్భాన్ని వీరు నెల రోజుల వేడుకగా మార్చారు. ‘ఒక రోజులో ఒకే ఈవెంట్ జరుపుకునే బదులు, నెల అంతటా నిర్వహించాలని అనుకున్నాం’ అని అర్బన్ స్కెచర్స్ సహ వ్యవస్థాపకుడు సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ ఫరాజ్ ఫర్షోరి చెప్పారు. స్కెచ్ వేద్దాం రా.. బొమ్మలు వేద్దాం రా.. అంటూ ఆహా్వనించే ఈ అర్బన్ స్కెచ్చర్స్ అనే గ్రూప్ అమెరికాలో గాబ్రియేల్ క్యాంపెనారియో అనే వ్యక్తి వాషింగ్టన్లో ప్రారంభించిన ఒక అంతర్జాతీయ వేదిక. నగరాల్లో తమకు నచి్చన ప్రదేశాన్ని ఎంచుకుని లైవ్ స్కెచ్ వేసే ఔత్సాహిక చిత్రకారుల నెలవు. నగరంలో ఈ గ్రూపు నవంబర్ 2017లో ట్యాంక్ బండ్లోని బోట్ క్లబ్ను స్కెచ్ చేయడంతో దాని మొదటి ఈవెంట్ నిర్వహించింది. అప్పటి నుంచి వివిధ ప్రదేశాల్లో వారానికో రెండు గంటల సెషన్ చొప్పున దాదాపు 30–60 మంది సభ్యులు నగర విశేషాలను కాగితంపై బంధిస్తున్నారు. వీరంతా బొమ్మలు గీశాక వాటిని ఆన్లైన్లో పోస్ట్ చేస్తారు. అలా వీరి అభిరుచి వివిధ రంగాలకు చెందిన వ్యక్తులను ఒకచోట చేర్చింది. ‘మాలో చాలా మంది ప్రొఫెషనల్స్ కాదు, దీనిని వారాంతపు అభిరుచిగా కొనసాగిస్తున్నవారు మాత్రమే’ అని ఫరాజ్ చెప్పారు. అర్బన్ స్కెచ్చర్స్కు చెందిన జీషన్ అహ్మద్ మాట్లాడుతూ.. ‘ఇషాక్, ఫరాజ్ ఫర్షోరీ ఆధ్వర్యంలో హైదరాబాద్ చాప్టర్ ఒక ఐదుగురు మాత్రమే హాజరైన చిన్న స్కెచ్ మీట్తో ప్రారంభమైంది, ఇప్పుడు 7–70 సంవత్సరాల వయసు గల ఎందరో సభ్యులకు విస్తరించింది’ అన్నారు. ‘ఇది కళ ద్వారా హైదరాబాద్ ఆత్మను సంగ్రహించే’ ప్రయత్నంగా ఫరాజ్ అభివరి్ణంచారు.కళాత్మక అనుబంధం.. ‘నా పరిసరాలను శ్రద్ధగా గమనించడానికి రికార్డ్ చేయడానికి ఇది గొప్ప మార్గం’ అన్నారు అమెరిగో ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ డీ హు. తాను 2021లో వాషింగ్టన్లో ఉన్నప్పుడు అర్బన్ స్కెచ్చర్స్లో చేరారు. ప్రస్తుతం నగరంలో నివసిస్తున్న డీ హు కేఫ్లు, డాక్టర్ అపాయింట్మెంట్లకు కూడా తన స్కెచ్బుక్ తీసుకెళతారు. తాను స్కెచ్ గీసిన ప్రతి ప్రదేశం తన జీవితంలో భాగమే. ఇది ఫొటో తీయడం కంటే గాఢంగా అనిపిస్తుంది’ అంటూ చెప్పారామె. గత వారం అర్బన్ స్కెచ్చర్స్ వర్క్షాప్లో భాగమైన నరేష్ మాట్లాడుతూ, ‘నేను కళ ద్వారా ప్రపంచ సౌందర్యాన్ని కనుగొనాలని అనుకుంటున్నాను’ అని అన్నారు. ‘నాలాంటి ఆసక్తిగల కొత్త వ్యక్తులను కలవడం ద్వారా కొందరు స్నేహితులను సంపాదించుకున్నాను. ఇది నా దినచర్యకు భిన్నం.. ప్రశాంతతని అందించే కళాత్మక థెరపీలా అనిపిస్తుంది’ అన్నారు సుజిత. తన 12 ఏళ్ల కూతురితో ఈ ఈవెంట్కు హాజరైన మరో గృహిణి మాట్లాడుతూ.. ‘నా బిడ్డ కేవలం సోషల్ మీడియాతో మమేకం అయిపోవడం నాకు ఇష్టం లేదు. తను స్క్రీన్లకు మించిన జ్ఞాపకాలను పొందాలని కోరుకుంటున్నాను’ అన్నారు.ట్రిపుల్ సెంచురీ.. ఈవెంట్ల సందడి.. ఈ నెల తమ ఈవెంట్ల సంఖ్య 300కి చేరుకున్న సందర్భంగా వీరు మరింత తరచూ స్కెచి్చంగ్ ట్రిప్స్ ఏర్పాటు చేస్తున్నారు. గత ఆదివారం అబిడ్స్లో ఈ గ్లోబల్ కమ్యూనిటీ ఆఫ్ ఆరి్టస్ట్స్ సభ్యులు సండే బుక్ ఫెయిర్, తాజ్ మహల్ హోటల్, మొజామ్జాహి మార్కెట్లను స్కెచ్గా వేశారు. గత డిసెంబర్ 8న బంజారాహిల్స్లో జరిగిన స్కెచ్చింగ్ సెషన్లో లామకాన్, జీవీకే మాల్, సిటీ సెంటర్ షాపింగ్ ఏరియా కవర్ చేశారు. ఇక డిసెంబర్ 22లోపు.. ఓల్డ్ సిటీలో బారా గల్లి, హుస్సేనీ ఆలం, చారి్మనార్.. వీరి మెనూలో ఉన్నాయి.ఎవరైనా సరే వెల్కమ్.. ‘సమూహంలో చేరడానికి నైపుణ్యం స్థాయి ఏదీ అడ్డంకి కాదు. ప్రొఫెషనల్ ఆరి్టస్ట్ కానవసరం లేదు. అయితే ఇందులో పాల్గొనేవారు తమ సొంత స్టేషనరీని తీసుకురావాలని, ఎంచుకున్న ప్రదేశంలో కనిపించిన దేనినైనా సరే స్కెచ్గా గీయవచ్చు’ అని జీషన్ వివరించారు. వర్ధమాన చిత్రకారులు రాణించడంలో సహాయపడుతూ వాటర్ కలర్స్, స్కెచి్చంగ్, చార్క్కోల్ డ్రాయింగ్ వంటి ప్రాథమిక విషయాలపై ఉచిత వర్క్షాప్లను కూడా అర్బన్ స్కెచ్చర్స్ నిర్వహిస్తోంది. వారాంతాల్లో ఈ సెషన్లకు హాజరు కావాలనిఇ అనుకున్నవారు సోషల్ మీడియా పేజీల ద్వారా మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు. -
పట్టణ–గ్రామీణ ప్రాంతాల మధ్య తగ్గుతున్న ‘డిజిటల్ డివైడ్’
సాక్షి, హైదరాబాద్: భారత్లో పట్టణ–గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్న ‘డిజిటల్ డివైడ్ ’అనేది క్రమంగా తగ్గుతోంది. రోజువారీ జీవన విధానం, అలవాట్లలో వచ్చిన మార్పులుచేర్పులతోపాటు అందరికీ ఆధునిక సాంకేతిక పరిజాŠక్షనం అందుబాటులోకి రావడమే దీనికి ప్రధాన కారణం. డిజిటల్ విప్లవం అనేది వివిధ రూపాల్లో విస్తరించడంతో అందరికీ అన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. మరీ ముఖ్యంగా గ్రామీ ణ ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్ సౌకర్యాలు మెరుగుపడడంతోపాటు స్మార్ట్ఫోన్లు, ఇతర ఎల్రక్టానిక్ గాడ్జెట్లు అందుబాటులోకి వచ్చాయి.దీంతో ఆధునిక సాంకేతికతను పట్టణ, గ్రామీణ తేడాలు లేకుండా ఉపయోగించుకోగలుగుతున్నారు. 95.1 శాతం కుటుంబాలు (గ్రామీణ ప్రాంతాల్లో 94.2 శాతం, పట్టణాల్లో 97.1 శాతం) టెలిఫోన్/ మొబైల్ సౌకర్యాలు కలిగి ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. గతంతో పోలి్చతే..ఇది మెరుగైన పరిస్థితి కాగా, మొబైల్ టెక్నాలజీ వినియోగంలో రాబోయే రోజుల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్యఉన్న చిన్న వ్యత్యాసం కూడా చెరిగిపోతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 79వ రౌండ్ నేషనల్ నేషనల్ శాంపిల్ సర్వే తాజాగా 79వ రౌండ్ నేషనల్ నేషనల్ శాంపిల్ సర్వే (ఎన్ఎస్ఎస్)లో భాగంగా 2022 జూలై నుంచి 2023 జూన్ మధ్య కాలంలో మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ నిర్వహించిన కాంప్రహెన్సివ్ అన్యూవల్ మాడ్యువల్ సర్వేలో అనేక అంశాలు, కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. అండమాన్, నికోబార్లోని కొన్ని గ్రామాల్లో మినహా దేశవ్యాప్తంగా సర్వే చేశారు. ఈ సర్వేలో భాగంగా మొత్తం 3,02,086 కుటుంబాలను (గ్రామీణ ప్రాంతాల్లో 1,73,096, పట్టణ ప్రాంతాల్లో 1,28,990) కలిశారు. మొత్తంగా 12,99,988 (గ్రామాల్లో 7,85,246 మంది, పట్టణాల్లో 5,14,742 మంది) మంది నుంచి వివరాలు సేకరించారు.మొబైల్, ఇంటర్నెట్ వినియోగం, ఐసీటీ స్కిల్స్, ఔట్ ఆఫ్ ప్యాకేట్ మెడికల్ ఎక్స్పెండీచర్, విద్య తదితర అంశాలపై ఈ సర్వే జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్ వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో మొత్తంగా 95.7 శాతం గ్రామీణ యువత (పట్టణాల్లో 97 శాతం) మొబైల్ ఫోన్లు వినియోగిస్తున్నట్టు వెల్లడైంది. 15–25 ఏళ్ల మధ్యనున్న గ్రామీణ యువత 82 శాతం (పట్టణాల్లో 92 శాతం) ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు. సర్వేలోని ముఖ్యాంశాలు ⇒ 15–24 ఏజ్ గ్రూప్లో 78.4 శాతం యువత అటాచ్డ్ఫైల్స్తో మెసేజ్ పంపగలుగుతున్నారు. ఈ వయసులోని వారే 96.9 శాతం (వీరితో పురుషులు 97.8%, మహిళలు 95.9%) చదవడం, రాయడంతో పాటు సాధారణ ⇒ గణాంకాలు చేస్తున్నారు. 71.2 శాతం మంది కాపీ అండ్ పేస్ట్ టూల్స్ వినియోగిస్తున్నారు. 26.8 శాతం మాత్రమే ఆన్లైన్ సెర్చ్, ⇒ ఈ–మెయిల్స్ పంపడం, ఆన్లైన్ బ్యాంక్ నిర్వహణ చేయగలుగుతున్నారు. దేశంలో 9.9 శాతం కుటుంబాలకు (పట్టణ ప్రాంతాల్లో 21.6 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 4.2 శాతం) డెస్్కటాప్లు, ల్యాప్టాప్లు, ఇతర పరికరాలు కలిగి ఉన్నారు. ⇒ 18 ఏళ్లకు పైబడిన వారిలో 94.6 శాతం మందికి వ్యక్తిగత, ఉమ్మడి బ్యాంక్ ఖాతా, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూట్స్లో అకౌంట్, మొబైల్ మనీ సరీ్వస్ ప్రొవైడర్ ఖాతా కలిగి ఉన్నారు. ⇒ తాము నివసిస్తున్న ప్రాంతాల నుంచి 500 మీటర్లలోపు దూరంలోనే లోకెపాసిటీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ (బస్సు,కారు, టాక్సీ, ఆటో వంటివి) సౌకర్యాలు 93.7 శాతం పట్టణ ప్రాంత జనాభాకు అందుబాటులో ఉన్నాయి. -
పల్లె చిన్నబోతోంది
సాక్షి, అమరావతి: దేశంలోని గ్రామాల్లో జనాభా తగ్గిపోతుంటే.. పట్నాల్లో జనాభా మాత్రం వేగంగా పెరుగుతోంది. గత పుష్కర కాలంలో దేశంలో పల్లె జనాభా 4.1 శాతం తగ్గిపోయింది. 2011 జనాభా లెక్కలతో పోల్చితే 2023 జూలై నాటికి అంచనా వేసిన జనాభా లెక్కల మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో గ్రామీణ జనాభా తగ్గిపోయి పట్టణాల్లో జనాభా పెరుగుతోందని కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2011 తర్వాత కేరళలో పల్లె జనాభా ఏకంగా 28.3 శాతం తగ్గిపోయింది. ఆంధ్రప్రదేశ్లో గత 12 సంవత్సరాల్లో గ్రామీణ జనాభా 7.1 శాతం మేర తగ్గింది. 2023 జూలై నాటికి అంచనా లెక్కల ప్రకారం బీహార్ మొత్తం జనాభాలో 87.7 శాతం గ్రామాల్లోనే ఉంది. అస్సాంలో 84.4 శాతం, ఒడిశాలో 81.1 శాతం, ఉత్తరప్రదేశ్లో 75.9 శాతం, రాజస్థాన్లో 73.3 శాతం జనాభా గ్రామాల్లోనే ఉంది. పట్టణీకరణ పెరగడంతో పాటు ఉద్యోగావకాశాలకు గ్రామాలను వదిలి ప్రజలు పట్టణాలకు తరలి వెళ్తుండటంతో పల్లె జనాభా తగ్గిపోయి పట్టణ జనాభా పెరుగుతోంది.ఇవీ లెక్కలు..» 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో మొత్తం జనాభాలో గ్రామాల్లో ఉన్న వారు 68.9 శాతం » 2023 జూలై నాటికి అంచనా మేరకు మొత్తం జనాభాలో గ్రామీణ జనాభా 64.8 శాతం» 2011 జనాభా లెక్కల ప్రకారం కేరళలో మొత్తం జనాభాలో గ్రామీణ జనాభా 52.3 శాతం» 2023 జూలై నాటికి అంచనా మేరకు కేరళ గ్రామీణ జనాభా 24.0 శాతం» 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ మొత్తం జనాభాలో 70.4 శాతం గ్రామాల్లో ఉంటే.. 2023 జూలై నాటికి అంచనా వేసిన లెక్కల ప్రకారం గ్రామీణ జనాభా 63.3 శాతానికి తగ్గింది » 2011 జనాభా లెక్కలతో పోల్చి చూస్తే 2023 జూలై అంచనా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ జనాభా 10,76,389 తగ్గింది. » ఇదే సమయంలో పట్టణ జనాభా 49,06,590 పెరిగింది » 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో మొత్తం జనాభా 4,93,86,799 ఉండగా ఇందులో గ్రామీణ జనాభా 3,47,76,389, పట్టణ జనాభా 1,46,10,410 ఉంది» 2023 జూలై నాటికి అంచనాల మేరకు ఆంధ్రప్రదేశ్లో మొత్తం జనాభా 5,32,17,000 ఉండగా ఇందులో గ్రామీణ జనాభా 3,37,00,000, పట్టణ జనాభా 1,95,17,000 ఉంది -
అర్బన్ అగ్రికల్చర్ సుస్థిర అభివృద్ధికి దోహదం!
2030 నాటికి ప్రపంచాన్ని మెరుగ్గా తీర్చిదిద్దుకోవటానికి ఐక్యరాజ్యసమితి 2015లో ప్రపంచ దేశాలకు నిర్దేశించిన లక్ష్యాలే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్.డి.జి.లు). ఇవి 17 రకాలు. ఈ లక్ష్యాల సాధన కృషి స్థితిగతులపై సమీక్షకు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఈనెల 22–23 తేదీల్లో కీలక శిఖరాగ్రసభ ‘ఫ్యూచర్ 2024’ జరగనుంది. ఈ నేపథ్యంలో అర్బన్ అగ్రికల్చర్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఏ విధంగా ప్రభావితం చేస్తోందో తెలుసుకునేందుకు ఒక అధ్యయనం జరిగింది. యూనివర్సిటీ ఆఫ్ గ్రోనింగెన్ (నెదర్లాండ్స్)కు చెందిన డాక్టర్ ప్రజల్ ప్రధాన్ సారథ్యంలోని పరిశోధకుల బృందం ఈ అధ్యయనం నిర్వహించింది. అర్బన్ అగ్రికల్చర్ ఎస్.డి.జి.ల సాధన కృషిపై చూపుతున్న సానుకూల ప్రభావాలతో ΄ాటు ప్రతికూల ప్రభావాలను చర్చించే 76,000 పరిశోధన పత్రాల్లో నుంచి 1,450ని ఎంపిక చేసి అధ్యయనం చేయటం విశేషం. ఈ తాజా అధ్యయన ఫలితాలను జర్నల్ సెల్స్ రి΄ోర్ట్ సస్టయినబిలిటీలో ప్రచురితమయ్యాయి.అర్బన్ అగ్రికల్చర్.. అంటే? నగరాలు, నగరాల పరిసరప్రాంతాల్లో ఇళ్లపైన, ఖాళీ స్థలాల్లో చేపట్టే వ్యవసాయ కార్యకలా΄ాలనే అర్బన్ అగ్రికల్చర్గా చెప్పచ్చు. నగర, పట్టణప్రాంతాల్లో ఇంటిపంటలు, మిద్దె తోటలు, పెరటి తోటలు, పశుపోషణ, పాడి పరిశ్రమలు. కోళ్లు, చేపల పెంపకం.. వంటి కార్యకలా΄ాలన్నీ ఈ కోవలోకే వస్తాయి. 17 ఎస్.డి.జి.లన్నిటితోనూ అర్బన్ అగ్రికల్చర్కు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధం ఉంది. నాణానికి అవతలి వైపు..అర్బన్ అగ్రికల్చర్ వల్ల అభివృద్ధి లక్ష్యాల సాధనకు అంతా మేలే జరుగుతుందని చెప్పలేమని, చెడు కూడా జరుగుతోందని డాక్టర్ ప్రజల్ ప్రధాన్ స్పష్టం చేశారు. ‘అర్బన్ అగ్రికల్చర్ సుస్థిర అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తోంది. అయితే, ప్రతికూల ప్రభావాన్ని బాగా తగ్గించే అర్బన్ అగ్రికల్చర్ పద్ధతులను ΄ాటించగలిగినప్పుడే దాని ద్వారా ప్రయోజనాలు ఒనగూడతాయి. ఐరాస 2024 ఫ్యూచర్ సమ్మిట్ లక్ష్యాల సాధనకు అర్బన్ అగ్రికల్చర్ దోహదపడేదైనప్పటికీ మరో కోణాన్ని కూడా ఆవిష్కరించటం కోసం ఈ అధ్యయనం చేశాం’ అన్నారాయన. వుహాన్ యూనివర్సిటీ (చైనా) అసోసియేట్ రిసెర్చ్ ప్రోఫెసర్ యుయాన్ఛావ్ హు మాట్లాడుతూ ‘ఎస్.డి.జి.ల సాధన కృషికి అర్బన్ అగ్రికల్చర్ ఎంతగానో దోహదం చేస్తుంది. అయితే, విభిన్న ప్రదేశాల్లో ఈ కార్యకలా΄ాల వల్ల ఎదురయ్యే సవాళ్లను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అధిగమించటం ముఖ్యం’ అన్నారు. అర్బన్ అగ్రికల్చర్ కార్యకలాపాలలో సుస్థిరతకు దోహదం చేసే పద్ధతులను అనుసరించటం ద్వారా ప్రతికూల ప్రభావాలను తగ్గించవచ్చు. వాతావరణ మార్పులను తట్టుకునే విధంగా నగరాల అభివృద్ధికి ఇది దోహదం చేస్తుంది. ‘అర్బన్ అగ్రికల్చర్ వల్ల చేకూరే అనుకూల, ప్రతికూల ప్రభావాల గురించి అందుబాటులో ఉన్న సైంటిఫిక్ లిటరేచర్ను విశ్లేషించడానికి మా అధ్యయనం ద్వారా కృషి చేశాం. మొత్తంగా చూసినప్పుడు అర్బన్ అగ్రికల్చర్ వల్ల ఆహారం, విద్య, సాంఘిక సదుపాయాలను కల్పించటంతో పాటు జీవవైవిధ్యాన్ని పెంపోందించేందుకు సుస్థిరత ఎలా చేకూరుతుందో శాస్త్రబద్ధంగా ఈ అధ్యయనం రుజువులు చూపింది’ అని డాక్టర్ ప్రజల్ ప్రధాన్ వివరించారు. తాజా పోషకాహారం లభ్యతపోషకాలతో కూడిన తాజా ఆహారోత్పత్తులను స్థానికంగానే అందుబాటులోకి తేవటం.. దూరప్రాంతాల నుంచి ఆహారాన్ని తరలించాల్సిన అవసరాన్ని తగ్గించటం.. ఆహారోత్పత్తుల్ని వందల కిలోమీటర్ల నుంచి తీసుకురావటానికి ఖర్చయ్యే ఇంధనాన్ని ఆదా చేయటం ద్వారా కాలుష్యాన్ని(ఫుడ్ మైల్స్ను) తగ్గించటం.. వివిధ సామాజిక వర్గాల ప్రజల మధ్య సాన్నిహిత్యాన్ని పెం΄÷ందించటం.. మానసిక ఆరోగ్యాన్ని పెం΄÷ందించటం వంటివి అర్బన్ అగ్రికల్చర్ ప్రయోజనాలని ఈ అధ్యయనం తేల్చింది. బీజింగ్ ఫారెస్ట్ యూనివర్సిటీ (చైనా) పరిశోధక విద్యార్థి దయ రాజ్ సుదేబ్ ఇలా అన్నారు:‘అవకాశాలను ఉపయోగించుకునేలా ప్రజలు, సంస్థలు, ప్రభుత్వాలు అర్బన్ అగ్రికల్చర్ పద్ధతుల్లో సుస్థిర లక్ష్యాల సాధన దిశగా పరివర్తన తేవాలి..’ప్రతిబంధకాలుశుద్ధమైన, చవక ఇంధనం లభ్యతకు సంబంధించి 3,6,7 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, జలచరాల జీవన భద్రతకు సంబంధించి 11,12,14,16 ఎస్.డి.జి.లకు సంబంధించి అర్బన్ అగ్రికల్చర్ ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. నీరు, ఇంధనం, ఎరువులు, పురుగుమందుల అధిక వాడకం వల్ల నేల, నీరు కలుషితం కావటం.. వనరులు ఉన్న వారికే ప్రయోజనాలను పరిమితం చేయటం ద్వారా పేదలకు ఫలితాలను అందించలేని పరిస్థితులు నెలకొనటం వంటి ప్రతిబంధనాలు అర్బన్ అగ్రికల్చర్కు ఉన్నట్లు ఈ అధ్యయనం గుర్తించింది. ఈ సవాళ్లను సమర్థవంతంగా అధిగమించడానికి చర్యలు తీసుకుంటే అర్బన్ అగ్రికల్చర్ సుస్థిర అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందనటంలో సందేహం లేదు. -
పట్టణ యువతలో 61శాతం మందికి కంప్యూటర్ నైపుణ్యం
సాక్షి, అమరావతి : దేశంలో కంప్యూటర్ నైపుణ్యం పట్టణ యువతలో 61 శాతం ఉండగా అదే గ్రామీణ యువతలో కేవలం 34 శాతమే ఉందని ఇండియా ఎంప్లాయిమెంట్ రిపోర్ట్–24 వెల్లడించింది. కంప్యూటర్ నైపుణ్యాల సామర్థ్యం రాష్ట్రాల మధ్య వైవిధ్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆ నివేదిక తెలిపింది. కెమెరా, మోడమ్, ప్రింటర్ వంటి పరికరాలు ఇన్స్టాల్ చేసే సామర్థ్యం పట్టణ యువతలో ఉందని.. అయితే గ్రామీణ యువతలో అది ఎనిమిది శాతమేనని పేర్కొంది.ఇలా వివిధ రకాల కంప్యూటర్ నైపుణ్యాల్లో దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉన్నాయని వివరించింది. ఇక ఫైళ్లను బదిలీచేసే సామర్థ్యం మినహా చాలా నైపుణ్యాల్లో కర్ణాటక ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉంది. ఫైల్ లేదా ఫోల్డర్ను కాపీ చేయగల లేదా తరలించగల సామర్థ్యం ఆంధ్రప్రదేశ్ యువతలో 45.56 శాతం ఉంటే కేరళ యువతలో 90.28 శాతం.. తమిళనాడు యువతలో 72.28 శాతం, కర్ణాటక యువతలో 64.36 శాతం, తెలంగాణలో 53.83 శాతం ఉన్నట్లు రిపోర్ట్ తెలిపింది.అలాగే, డూప్లికేట్ లేదా టూల్స్ను కాపీచేసి పేస్ట్ చేయగల సామర్థ్యంతో పాటు సమాచారాన్ని ట్రాన్స్ఫర్ చేయగల నైపుణ్యం ఆంధ్రప్రదేశ్ యువతలో 43.30 శాతం ఉందని ఆ నివేదిక తెలిపింది. ఇది కేరళ యువతలో 89.30 శాతం, తమిళనాడు యువతలో 70.45 శాతం, కర్ణాటక యువతలో 60.24 శాతం, తెలంగాణలో 50.40 శాతం ఉంది.ప్రెజెంటేషన్ల సామర్థ్యం కేరళలో ఎక్కువ..ఇక జోడించిన ఫైల్తో ఈ–మెయిల్ పంపగల సామర్థ్యం ఆంధ్రప్రదేశ్ యువతలో 36.38 శాతం ఉంటే కేరళ యువతలో అత్యధికంగా 73.34 శాతం, తమిళనాడులో 55.33 శాతం, కర్ణాటకలో 45.04 శాతం, తెలంగాణలో 45.46 శాతం సామర్థ్యం ఉంది. ప్రెజెంటేషన్ సాఫ్ట్వేర్తో ఎలక్ట్రానిక్ ప్రెజెంటేషన్లను సృష్టించగల సామర్థ్యం ఆంధ్రప్రదేశ్ యువతలో 10.18 శాతం ఉండగా కేరళ యువతలో 40.33 శాతం, తమిళనాడులో 26.10 శాతం, కర్ణాటకలో 22.33 శాతం, తెలంగాణలో 14.27 శాతం ఉందని రిపోర్ట్ వెల్లడించింది.గ్రామీణంలో ‘నెట్’ వినియోగం 25 శాతమే..అలాగే, దేశంలో 15 ఏళ్ల వయస్సు నుంచి 29 ఏళ్లలోపు యువత ఇంటర్నెట్ వినియోగం గ్రామీణ ప్రాంతాల్లో 25.30 శాతం ఉండగా పట్టణ ప్రాంతాల్లో 57.53 శాతం ఉందని తెలిపింది. వర్గాల వారీగా ఇంటర్నెట్ వినియోగాన్ని పరిశీలిస్తే.. ఎస్టీ వర్గాల్లో 20.39 శాతం, ఎస్సీల్లో 24.96 శాతం, వెనుకబడిన వర్గాల్లో 34.28 శాతం, సాధారణ వర్గాల్లో 50.15 శాతం ఇంటర్నెట్ ఉందని రిపోర్ట్ తెలిపింది. మెజారిటీ యువత మాధ్యమిక లేదా ఉన్నతస్థాయి విద్యను అభ్యసిస్తున్నారని, దీంతో పాటు కంప్యూటర్లు, ఇంటర్నెట్, డిజిటల్ నైపుణ్యాల యాక్సెస్ యువత జనాభాలో కూడా పెరిగిందని.. అయితే సాంకేతిక నైపుణ్యాలను, సామర్థ్యాన్ని పెంచేందుకు యువతకు తగిన శిక్షణ ఇవ్వాల్సి ఉందని ఆ నివేదిక అభిప్రాయపడింది. -
పట్టణ తలసరి వ్యయంలో తెలంగాణ టాప్
సాక్షి, హైదరాబాద్: సగటు భారతీయుడి నెలవారీ ఖర్చు పట్టణాల్లో రూ.6,459 ఉంటే, అదే గ్రామీణ ప్రాంతాలకు వచ్చేసరికి రూ.3,773గా ఉన్నట్లు ఓ నివేదిక తేల్చింది. పట్టణ ప్రాంతాల్లో ఆహారేతర నెలవారీ ఖర్చు రూ.3,929 కాగా ఆహారానికి సంబంధించి రూ.2,530 వ్యయం చేస్తున్నట్లు తెలిపింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఆహారేతర ఖర్చు నెలకు రూ.2,023 కాగా ఆహారానికి రూ. 1,750 వ్యయం చేస్తున్నారు. పెద్ద రాష్ట్రాల్లో సగటు పట్టణ నెలవారీ తలసరి వ్యయంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నట్లు వెల్లడించింది. నిత్యావసరాల ధరలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సగటు భారతీయుడి నెలవారీ ఖర్చులు ఎలా ఉంటాయి? వేటికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు? పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వ్యయాల తీరు ఎలా ఉంటుంది? ఇవన్నీ అందరికీ ఆసక్తిని కలిగించే అంశాలే. ఈ నేపథ్యంలోనే..‘హౌస్హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ (గృహావసరాల వినియోగ ఖర్చు) (మంత్లీ పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్–ఎంపీసీఈ (నెలవారీ తలసరి ఖర్చు) సర్వే 2022–23’పేరిట కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఓ సర్వే నిర్వహించింది. గతంలో కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ సర్వే పేరిట ప్రతి ఐదేళ్లకు సర్వే నిర్వహిస్తుండగా, చివరగా 2011–12లో దీనిని నిర్వహించారు. ఇప్పుడు పదేళ్ల తర్వాత తాజా సర్వే నిర్వహించారు. అయితే సర్వేకు అనుసరించిన విధానం (మెథడాలజీ)లో మార్పుల కారణంగా గతంలో నిర్వహించిన అధ్యయనాలతో దీనిని పోల్చలేదని నేషనల్ సర్వే ఆర్గనైజేషన్ (ఎన్ఎస్వో) తెలిపింది. కాగా ఇటీవల విడుదల చేసిన ఈ సర్వే వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ తర్వాత ఢిల్లీ, హిమాచల్ పెద్ద రాష్ట్రాల్లో సగటు పట్టణ నెలవారీ తలసరి వ్యయంలో రూ.8,251తో తెలంగాణ టాప్లో ఉండగా, ఢిల్లీ (రూ.8,250), హిమాచల్ప్రదేశ్ (రూ.8,083) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే మొత్తంగా చూస్తే చండీగఢ్ (రూ.12,577) మొదటి స్థానంలో ఉండగా, సిక్కిం (రూ.12,125), అండమా¯న్ అండ్ నికోబార్ (రూ.10,268), గోవా (రూ.8,761), అరుణాచల్ ప్రదేశ్ (రూ.8,649) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక పట్టణాల్లో శ్రీమంతులుగా ఉన్న టాప్ 5 శాతం మంది రూ.20,824 వ్యయం చేస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో రూ.10,501 ఖర్చు చేస్తున్నారు. మరోవైపు దిగువ స్థాయిలో ఉన్న 5 శాతం మంది పట్టణాల్లో రూ.2,001, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,373 ఖర్చు చేస్తున్నట్లు నివేదిక వివరించింది. -
‘ప్రగతి’ పయనంలో మహిళా శక్తి
సాక్షి, అమరావతి: పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల్లో ప్రతి మహిళ స్వయంశక్తితో ఎదిగేందుకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) మరో అడుగు ముందుకేసింది. ప్రభుత్వం అందించిన వివిధ పథకాల నిధులతో స్వయం ఉపాధి వైపు ప్రోత్సహించడంతో పాటు, వారు ఆర్థికంగా మరింత ఎదిగేందుకు ‘మహిళా పట్టణ ప్రగతి యూనిట్ల’ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. స్వయం ఉపాధిపై ఆసక్తి గల 142 మంది పట్టణ మహిళా సంఘాల సభ్యుల(ఎస్హెచ్జీ)కు ఆసక్తి ఉన్న రంగాలలో పూర్తిస్థాయిలో శిక్షణనిచ్చింది. ఆయా పరిశ్రమలు పర్యావరణ హితమైనవిగా ఉండేలా ముందే జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందులో సూక్ష్మ పరిశ్రమల స్థాపన, వ్యాపార విధానాలు, ముడిసరుకు లభ్యత వంటి అంశాలపై తర్ఫీదునిచ్చారు. ఒక్కో యూనిట్కు సగటున రూ.2.50 లక్షల చొప్పున దాదాపు రూ.4 కోట్ల నిధులను మెప్మా ఇందుకోసం వెచ్చించింది. ఇప్పటికే యంత్రాల కొనుగోలు ప్రక్రియ పూర్తవగా, మరో 10 రోజుల్లో యూనిట్లను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ చేపట్టారు. యూనిట్లు ఏర్పాటు తర్వాత స్థానికంగా ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు కూడా మెప్మా ఎండీ విజయలక్ష్మి ముందస్తు చర్యలు తీసుకున్నారు. శిక్షణ పొందిన ట్రేడ్స్లో నిపుణులతో అవసరమైన సహకారం అందించనున్నారు. ఆరు ట్రేడ్లలో 142 మందికి శిక్షణ పూర్తి నాలుగున్నర ఏళ్లలో వివిధ పథకాల ద్వారా రాష్ట్రంలో 25 లక్షల మంది పట్టణ పొదుపు సంఘాల మహిళలతో జగనన్న మహిళా మార్టులు, ఆహా క్యాంటీన్లు, అర్బన్ మార్కెట్లు ఏర్పాటు చేయించి మెప్మా విజయం సాధించింది. మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు విస్తత మార్కెట్ కల్పించేందుకు ఈ–కామర్స్ సంస్థలతోనూ ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు అదే మహిళలతో పరిశ్రమలు నెలకొల్పి, పర్యావరణ హితమైన సరికొత్త ఆలోచనలను ప్రోత్సహించేందుకు మహిళా ‘ప్రగతి యూనిట్లు’ ఏర్పాటుపై పూర్తిస్థాయి శిక్షణనిచ్చారు. అన్ని మునిసిపాలిటీల్లోని మహిళా సంఘాలు తీర్మానాలు చేసిన ప్రాజెక్టుల్లో కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ వర్క్, పేపర్ ప్లేట్ల తయారీ, క్లాత్ బ్యాగ్స్ తయారీ, స్క్రీన్ ప్రింటింగ్, ఆర్టీఫిషియల్ జ్యూవెలరీ, కర్పూరం, దీపం వత్తులు, సాంబ్రాణి తయారీ, కారం, మసాలా పొడులు, మిల్లెట్స్ ప్రాసెసింగ్లో శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన 142 మందికి ప్రభుత్వమే యంత్రాలు, ముడిసరుకును ఉచితంగా ఇచ్చి మొత్తం 111 యూనిట్లను పట్టణాల్లో ఏర్పాటు చేస్తున్నారు. మెప్మాతో మెరుగైన జీవితం టైలరింగ్లో అనుభవం ఉంది. ఇంట్లోనే కుట్టుపని ప్రారంభించా. వ్యాపారాన్ని విస్తరించాలని అనుకుంటున్నా. ఎలా చేయాలో తెలియదు. పట్టణ మహిళా సంఘంలో సభ్యురాలిని కావడంతో మెప్మాను సంప్రదించాను. వారు కంప్యూటర్పై ఎంబ్రాయిడరీ వర్క్లో శిక్షణ ఇచ్చారు. ఇది నాకెంతో ఉపయోగపడుతుంది. ముడిసరుకు సేకరణ, వ్యాపారం, మార్కెటింగ్ అంశాల్లో పూర్తి శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వమే ఉచితంగా యంత్రాలను అందించడం చాలా ఆనందంగా ఉంది. – టి.తనూజ స్రవంతి, విశాఖపట్నం నాపై నమ్మకం పెరిగింది సొంతంగా పరిశ్రమ పెట్టి కనీసం నలుగురికి ఉపాధి కల్పించాలన్న కోరిక ఉంది. కానీ ఎలా చేయాలో తెలియదు. ఇంట్లోనే క్లాత్ బ్యాగ్లు కుడుతుంటాను. వాటిపై అవసరమైన బ్రాండింగ్ కోసం మరో చోటకు వెళ్లాల్సి వస్తోంది. వ్యాపారంపైనా అవగాహన లేదు. ఈ ఏడాది ఎస్హెచ్జీలో చేరాను. మెప్మా ‘మహిళా పట్టణ ప్రగతి యూనిట్ల’ ఉచిత శిక్షణలో స్క్రీన్ ప్రింటింగ్, జ్యూట్ బ్యాగ్ల తయారీ, వ్యాపార మెళకువలు తెలుసుకున్నాను. నేను పూర్తిస్థాయిలో వ్యాపారం చేయగలనన్న నమ్మకం లభించింది. – బి.రాజేశ్వరి, ఏలూరు మహిళా ప్రగతి లక్ష్యంగా శిక్షణ మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలనేది సీఎం జగన్మోహన్రెడ్డి ఆశయం. అందుకు అనుగుణంగా మెప్మా ఆధ్వర్యంలో జగనన్న మహిళా మార్టులు, ఆహా క్యాంటీన్లు, అర్బన్ మార్కెట్లు వంటివి ఏర్పాటు చేసి విజయం సాధించాం. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి మహిళా ప్రగతి యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం. మహిళలు కోరుకున్న రంగాల్లో ఉచిత శిక్షణ ఇచ్చాం. ఇంటిని చక్కదిద్దుకుంటూనే పిల్లల బాగోగులు చూసుకుంటున్న మహిళలకు మెప్మా అండగా ఉంటుంది. పరిశ్రమలు స్థాపించి నిర్వహించగల సామర్థ్యం మహిళలకు ఉంది. మార్కెటింగ్ విషయంలో మెప్మా వారికి అండగా నిలబడుతుంది. పదిరోజుల్లో 111 యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం. యూనిట్లు ఏర్పాటు తర్వాత వారు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు సహకారం అందిస్తాం. – వి.విజయలక్ష్మి, ఎండీ, మెప్మా -
సిటీ ఓటేస్తదా.. టూరేస్తదా..
అసలే అర్బన్ ఓటర్ల నిరాసక్తత... దానికి తోడు వారాంతపు సెలవులు.. వెరసి అర్బన్ ఓటింగ్ శాతంపై ప్రభావం చూపుతుందా? అనే ఆందోళన రాజకీయ పార్టీల నేతల్లో వ్యక్తమవుతోంది. చాలా నియోజకవర్గాల్లో అర్బన్ ఓటింగ్ బాగా పుంజుకున్న నేపథ్యంలో లాంగ్ వీకెండ్ ఎఫెక్ట్ ఏ మేరకు ఉంటుందన్న చర్చ జరుగుతోంది. సాక్షి, హైదరాబాద్: సాధారణంగా కార్పొరేట్ ఐటీ ఉద్యోగులు వారాంతపు సెలవుల్ని రకరకాలుగా ప్లాన్ చేస్తుంటారు. ఏ మాత్రం అవకాశం దొరికినా సొంతూర్లకు , హాలిడే టూర్స్కి చెక్కేస్తుంటారు. ఈ నేపధ్యంలో పోలింగ్ తేదీ నవంబరు 30 గురువారం కావడంతో శుక్రవారం ఒక్కరోజు సెలవు పెడితే...4రోజుల పాటు లాంగ్ వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేయవచ్చు కదా అనే ఆలోచన వారిలో వచ్చే అవకాశం లేకపోలేదు. ఇప్పుడు ఇదే విషయం రాజకీయ పార్టీల్లో టెన్షన్ పుట్టిస్తోంది. మరోవైపు రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలో పట్టణీకరణ జోరు కొనసాగుతోన్న నేపధ్యంలో కొన్ని ప్రాంతాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగిందని ఎన్నికల సంఘం గణాంకాలు తెలియజేస్తున్నాయి. పటాన్ చెరు...ఓటర్ల జోరు... గత 2018తో తాజా 2023 మధ్య చూస్తే.. పటాన్ చెరులో ఓటర్ల సంఖ్యలో అత్యధికంగా 35శాతం వృద్ధి నమోదైంది. అదే సమయంలో ఓటర్ల సంఖ్యాపరంగా చూస్తే అతిపెద్ద అసెంబ్లీ నియోజకవర్గంగా శేరిలింగంపల్లి తన స్థానాన్ని నిలుపుకుంది. ఐటీ పరిశ్రమకు చిరునామాకు తోడుగా.. ఇటీవల వేగవంతమైన హౌసింగ్ బూమ్ కారణంగా హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలోని శేరిలింగంపల్లిలో గతంలో 5,75,542 లక్షల మంది ఓటర్లు ఉండగా అది 21.2శాతం పెరిగి 6,98,079 లక్షలకి చేరింది. ఇది రాష్ట్ర వ్యాప్త సగటు అయిన 13.15శాతంపెరుగుదలతో చాలా ఎక్కువ. రాష్ట్రవ్యాప్తంగానూ... పట్టణ ఓటర్ల పెరుగుదల హైదరా బాద్ పశ్చిమ ప్రాంతాలకే పరిమితం కాలేదు. నకిరేకల్ (ఎస్సీ) 28శాతం, ఆసిఫాబాద్ (ఎస్టీ) 20, కామారెడ్డి 19, కరీంనగర్ 19, నిజామాబాద్ (అర్బన్) 18శాతంతో ఓటర్లు భారీగా పెరిగారు. తెలంగాణ లోని పాత పట్టణ కేంద్రాలైన ఖమ్మం 15, వరంగల్ పశి్చమ 15, వరంగల్ తూర్పు 16శాతం ఓటర్ల సంఖ్య పెరిగింది. గ్రేటర్ పరిధిలో స్వల్పమే... ఇందుకు భిన్నంగా హైదరాబాద్లోని పలు నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య స్వల్పంగా మాత్రమే పెరిగింది. నాంపల్లి, మలక్పేట్, ముషీరాబాద్, చాంద్రాయణగుట్ట, యాకుత్పురా, సనత్నగర్లో ఓటరు సంఖ్య పెరుగుదల శాతం సింగిల్ డిజిట్కే పరిమితమైంది. రిజర్వుడ్ నియోజకవర్గాలుగా ఉన్న అశ్వారావుపేట, భద్రాచలం, వైరా, మధిర, స్టేషన్ ఘనపూర్ కూడా సింగిల్ డిజిట్ వృద్ధిని మాత్రమే నమోదు చేశాయి. ఇక అత్యల్పంగా ఓటర్ల వృద్ధి నమోదైన ప్రాంతం మెదక్లోని దుబ్బాక. ఈ నియోజకవర్గంలో కేవలం 2% ఓటర్లు మాత్రమే పెరిగారు. పట్టణ ఓటర్లు ఏం చేస్తారో ఓటింగ్ ఉదాసీనత’కు పేరొందిన పట్టణ ఓటర్ల సంఖ్య పెరగడంతో నేతల్లో ఒకింత ఆందోళన పెరి గింది. శని, ఆదివారాలు సెలవు ఉన్న ప్రైవేట్ కంపెనీల్లోని సిబ్బంది ఓటింగ్ రోజైన గురువారం కూడా కలిపి లాంగ్ వీకెండ్లో భాగం చేసుకుంటే మాత్రం అది కచ్చితంగా ఓటింగ్ శాతాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
మొక్కలు పెంచాలనుకుంటే చాలు.. అపార్ట్మెంట్లో కూడా పెంచొచ్చు!
పట్టణాల్లోని చిన్న అపార్ట్మెంట్వాసుల నోటి నుంచి తరచుగా వినిపించే మాట ‘మొక్కలు అంటే మాకు చాలా ఇష్టం. కాని స్థలం ఎక్కడిది?’ ‘స్థలం పెద్దగా అక్కర్లేదు. పెంచాలనే సంకల్పం ఉంటే చాలు’ అంటుంది బిహార్కు చెందిన కమల్సింగ్. ఉద్యోగ నిమిత్తం బెంగళూరులో ఉంటున్న కమల్సింగ్ తన చిన్న అపార్ట్మెంట్ బాల్కనీలో రకరకాల మొక్కలు పెంచుతుంది. ‘వంటగది వ్యర్థాలతో కంపోస్ట్ను ఎలా తయారుచేయాలి?’ అనే విషయం నుంచి ఏ మొక్కలను ఎలా పెంచాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వరకు... ఎన్నో విషయాలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తోంది. ఆమె ఇన్స్టాగ్రామ్ పేజీ ‘అర్బన్ హోమ్ వైబ్స్’కు ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు. ‘స్టార్ట్ వేర్ యూ ఆర్ విత్ వాటెవర్ యూ హ్యావ్’ అంటున్న కమల్సింగ్ స్ఫూర్తితో ఎంతో మంది పట్టణ వాసులు తమ బాల్కనీలో మొక్కల పెంపకానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చి ‘మేము సైతం’ అంటున్నారు. (చదవండి: వెరైటీగా బనానా ఆమ్లెట్ ట్రై చేయండిలా!) -
అర్బన్ కౌలు రైతుల పాట్లు!..కొద్దిపాటి స్థలంలోనే సిటీ ఫార్మింగ్!
అర్బన్ కౌలు రైతుల పాట్లు కనెక్టికట్.. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఒకటి. కనెక్టికట్ రాష్ట్రంలో అధిక జనసాంద్రత గల నగరం బ్రిడ్జ్పోర్ట్. జీవన వ్యయం దేశంలోనే అత్యధికంగా ఉండే కనెక్టికట్లో.. తాజా కూరగాయలు, పండ్లు అందుబాటులో లేని ప్రాంతాలకు ఆహారాన్ని స్థానికంగానే పండించి అందించడానికి అర్బన్ ఫార్మర్స్ కృషి చేస్తున్నారు. నగరీకరణ కారణంగా వ్యవసాయ భూములను పెద్ద ఎత్తున నివాస ప్రాంతాలుగా మార్చటం వల్ల నగరంలో పావు ఎకరం చోటు కౌలుకు దొరకటమే గగనంగా ఉందని బ్రిడ్జ్పోర్ట్ నగర రైతులు వాపోతున్నారు. అందుబాటులో ఉన్న చిన్న పాటి స్థలాలతోనే సిటీ ఫార్మింగ్ చేసే వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు సరిపెట్టుకుంటున్నారు. బ్రిడ్జ్పోర్ట్ యువరైతు ట్రావిస్ స్టీవర్ట్ 20 సెంట్ల పెరటి స్థలాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. భారలోహాలతో కలుషితమైన నేల కావటంతో ఎత్తు మడుల్లో కూరగాయలను పండిస్తున్నాడు. అందుబాటులో ఉన్న స్థలాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ హైడ్రోపోనిక్ పద్ధతిలోనూ పంటలు పండించటంతో పాటు గుడ్లు పెట్టే కోళ్లను, చిన్నపాటి ట్యాంకుల్లో తిలాపియా వంటి చేపలను సైతం పెంచుతున్నాడు. ‘ఒకప్పుడు సరదాగా కూరగాయలు పెంచేవాడిని. ఇప్పుడు అదే నాకు ఉపాధిగా మారింది. ఇదొక జీవన విధానం అని నమ్ముతున్నా. దీంతో పాటు పిల్లలకు మార్షల్ ఆర్ట్స్ నేర్పుతున్నా’ అన్నాడు స్టీవర్ట్. షాన్ జోసెఫ్ అనే మరో యువ సిటీ ఫార్మర్ తన భాగస్వామి రిచర్డ్ మేయర్స్తో కలసి నగరంలోనే కౌలుకు తీసుకున్న అరెకరంలో వ్యవసాయం చేస్తున్నాడు. ఆయనకు ఏడేళ్ల ప్రాయం నుంచే తోట పని అలవాటుంది. అలాగని చదువుకోలేదనుకునేరు సుమా! నోగటక్ వ్యాలీ కమ్యూనిటీ కళాశాల నుంచి హార్టికల్చర్ డిగ్రీ పొందాడు. కార్పొరేట్ ఉద్యోగంలో చేరిన కొన్నాళ్లకే మానుకోవాల్సి వచ్చింది. ఏడేళ్ల క్రితం ఒకామె తన ఇంటి పక్కన ఖాళీగా ఉన్న అరెకరం స్థలాన్ని కౌలుకు ఇవ్వటంతో అక్కడ ‘పార్క్ సిటీ హార్వెస్ట్’ పేరుతో సిటీ ఫార్మింగ్ మొదలుపెట్టారు. బ్రిడ్జ్పోర్ట్లో 20 సెంట్ల పెరటి స్థలాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్న అర్బన్ రైతు ట్రావిస్ స్టీవర్ట్ తమ ఉత్పత్తులను స్థానిక రైతు మార్కెట్లలో విక్రయిస్తుంటారు. అక్కడ ఏడాదికి 7 నెలలే ఆరుబయట పంటల సాగుకు అనుకూల వాతావరణం ఉంటుంది. అందుకని, ఇంట్లోనే చిన్న కంటెయినర్లలో ఏడాది పొడవునా పెరిగే మైక్రోగ్రీన్స్తో పాటు ఆలివ్ ఆయిల్, కొవ్వొత్తులు, మసాలా మిశ్రమాలు, హెర్బల్ టీ, హాట్ సాస్, ఊరగాయలు, దుస్తులను కూడా తమ వెబ్సైట్ ద్వారా అమ్ముతూ ఈ నల్లజాతి యువ సిటీ ఫార్మర్స్ ఆదాయం పొందుతున్నారు. జాతీయ వ్యవసాయ గణాంకాల సంస్థ ప్రకారం కనెక్టికట్ ప్రజల్లో మూడో వంతు మంది నల్లజాతీయులు, ఆదివాసులే. అయితే, అర్బన్ ఫార్మర్స్ సహా మొత్తం రైతుల్లో వీళ్లు 2 శాతం మంది మాత్రమే ఉన్నారు. భూ లభ్యత, శిక్షణ, వనరుల లేమి పెద్ద సవాళ్లుగా నిలిచాయి. వీరికి న్యాయబద్ధమైన వాటా మేరకు తాజా ఆహారాన్ని స్థానికంగా పండించి అందుబాటులోకి తేవడానికి అర్బన్ అగ్రికల్చర్, ఫుడ్ జస్టిస్ కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయి. అమెరికా వ్యవసాయ శాఖ పట్టణ వ్యవసాయానికి మద్దతు ఇచ్చే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. కనెక్టికట్ వ్యవసాయ వ్యవస్థలో అర్బన్ ఫార్మర్స్ కీలకమైన భాగమని అందరూ అంగీకరిస్తున్నారు. రాష్ట్రంలో పండించే పంటల్లో అద్భుతమైన వైవిధ్యం ఉంది. ఆయా పంటలను సాగు చేసే వారి సంఖ్యను పెంపొందించాలి అని ప్రభుత్వమూ భావిస్తోంది. ఇష్టమైన పని.. ఆదాయం.. భారంగా అనిపించని ఇష్టమైన పనిని ఎంపిక చేసుకున్నాను. నాకు ముగ్గురు అబ్బాయిలు. వారికి నేను చూపించాలనుకున్నది, చెప్పాలనుకున్నది ఏమిటంటే.. తాము ఆనందంగా చేయగలిగిన పని ఏదో ఎవరికి వారు కనుగొనగలగాలి. ఆ పని ద్వారా ఆదాయం పొందే ఉపాయమూ చేయాలి. – షాన్ జోసెఫ్, అర్బన్ ఫార్మర్, బ్రిడ్జ్పోర్ట్ పతంగి రాంబాబు Prambabu.35@gmail.com (చదవండి: దేశీ వరి పరిరక్షకుడు డా.దేబల్ దేవ్కు ప్రతిష్టాత్మక పురస్కారం!) -
ఎవరికి వారు పెంచుకునేలా..వెటరన్ ఇంటిగ్రేటెడ్ ఫామ్!
ఉద్యోగ విరమణ అనంతరం విశ్రాంత జీవితంలో తనకు నైపుణ్యం ఉన్న రంగంలో కృషిని కొనసాగించడం ఇటు తనకు, అటు సమాజానికి మేలు జరుగుతుందని నమ్మే వ్యక్తి వెస్లీ రొసారియో. తన నమ్మకాన్ని ఆచరణలో పెట్టి వాహ్ అనిపించుకుంటున్నారు. ఫిలిప్పీన్స్కు చెందిన వెస్లీ చేపలు, రొయ్యల పెంపకంలో నిపుణుడు. బ్యూరో ఆఫ్ ఫిషరీస్ అండ్ ఆక్వాటిక్ రిసోర్సెస్ రీసెర్చ్ సెంటర్ అధ్యక్షుడిగా ఉన్నత స్థాయిలో సేవలందించి దగుపన్ నగరంలో మూడేళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేశారు. ఉద్యోగ బాధ్యతల రీత్యా బదిలీల వల్ల టపుయాక్ జిల్లాలోని తమ పూర్వీకుల ఇంటిని ఖాళీగా ఉంచాల్సి వచ్చింది. అక్కడ ఎవరూ లేకపోయేసరికి ఆ ఇంటితో పాటు వెయ్యి చదరపు మీటర్ల పెరడు కూడా నిరుపయోగంగా పాడు పడింది. రిటైరైన తర్వాత ఆయన ఇంటికి చేరుకొని కొద్ది నెలల్లోనే ఫిష్టెక్ అర్బన్ ఇంటిగ్రేటెడ్ అర్బన్ ఫార్మింగ్ శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పటంతో ఇంటికే కాదు పెరటికి కూడా కళ వచ్చింది. ఇంటిపట్టునే కూరగాయలు, ఆకుకూరలు, కోళ్లతో పాటు చేపలను కూడా నిశ్చింతగా ఎవరికివారు పెంచుకొని ఇంటిల్లపాదీ పౌష్టికాహారాన్ని ఆస్వాదించవచ్చని వెస్లీ రొసారియో తన అర్బన్ ఇంటిగ్రేటెడ్ ఫామ్లో ఆచరించి చూపుతున్నారు. యూత్, సెకండ్ యూత్ అన్న తేడా లేకుండా బ్యాచ్ల వారీగా అందరికీ శిక్షణ ఇస్తున్నారాయన. ట్యాంకు నుంచి అజోలాను వెలికితీస్తున్న రొసారియో వెస్లీ రొసారియో పెరటి తోటలో మొత్తం ఎనిమిది (మీటరు వెడల్పు, మూడు మీటర్ల పొడవైన) చిన్న చెరువులు ఉన్నాయి. నేలపై తవ్విన చెరువుతో పాటు సిల్పాలిన్ షీట్, ఫైబర్తో చేసిన కృత్రిమ చెరువులు కూడా ఉన్నాయి. రీసర్కులేటరీ ఆక్వా చెరువు కూడా అందులో ఒకటి. కూరగాయలు, ఆకుకూరలు సాగయ్యే మడులతో పాటు కంటెయినర్లు ఉన్నాయి. హైడ్రోపోనిక్స్ వ్యవస్థలో ఆకుకూరలు, ఔషధ మొక్కలు పెంచుతున్నారు. ఆక్వాపోనిక్స్ వ్యవస్థ అదేవిధంగా ఆక్వాపోనిక్స్ వ్యవస్థ ఉంది. చేపల విసర్జితాలు, వాటికి వేసే మేత వ్యర్థాలతో కూడిన ఆ నీరు పోషకవంతమై ఆకుకూరలకు ఉపయోగపడుతోందని వెస్లీ రొసారియో తెలిపారు. నేలపై ఉన్న చెరువులో జెయింట్ గౌరామి, తిలాపియా, ఫంగాసియస్, క్యాట్ఫిష్లు పెరుగుతున్నాయి. నాటు కోళ్లు, బాతులకు ఆయన ప్రధానంగా అజోలాని పండించి మేతగా వేస్తున్నారు. అజోలాను నీటిలో వేస్తే చాలు, పెరుగుతుంది. ప్రాసెసింగ్ అవసరం లేదు. నేరుగా చేపలు, జంతువులకు, పక్షులకు మేతగా వేయొచ్చని ఆయన అన్నారు. అజోలా పెరిగే చెరువుల్లో దోమలు గుడ్లుపెట్టే అవకాశం ఉండబోదన్నారు. చెరువు నీటిలో చేపలు పెంచుతూనే, ఆ చెరువు నీటిపై తేలాడే మడు(ఫ్లోటింగ్ బెడ్)లను ఏర్పాటు చేసి అజోలాను పెంచుతుండటం విశేషం. సందర్శకులకు హైడ్రోపోనిక్స్ గురించి వివరిస్తున్న వెస్లీ రొసారియో చేపల తలలు, తోకలు, రెక్కలు, పొలుసులు, లోపలి భాగాలు వంటి వ్యర్థాలను సేకరించి మీనామృతం తయారు చేసి, పంటలపై పిచికారీ చేస్తే బలంగా పెరుగుతాయని రోసారియో తెలిపారు. వంకాయలు, మిరపకాయలు, బెండకాయకాయలు తదితర కూరగాయలను పండిస్తాం. బాతులు, నాటు కోళ్లు గుడ్లు పెడుతున్నాయి. పట్టణ ప్రజలు పెరట్లో చేపలు, కూరగాయలు పెంచుకోవడానికి శ్రద్ధ కావాలే గానీ పెద్దగా పెట్టుబడి అవసరం లేదు అంటున్నారు రొసారియో. అనుభవాలను పంచుకోవడం చాలా రిలాక్సింగ్గా ఉంది నేను పదవీ విరమణ తర్వాత జీవితం ఉండేలా చూడాలనుకున్నాను. నన్ను బిజీగా ఉంచుకోవడానికి ఏమి చేయాలో ముందుగానే ప్లాన్ చేసాను. నా వృత్తిపరమైన జీవితమంతా ఫిషరీస్లో పనిచేశాను కాబట్టి ఫిష్టెక్ ఇంటిగ్రేటెడ్ అర్బన్ ఫామ్ని ఏర్పాటు చేశాను. నా అనుభవాలను పంచుకోవడం చాలా రిలాక్సింగ్గా ఉంది. అలాగే, వచ్చి సలహాలు అడిగే మాజీ సహోద్యోగులతో సంబంధాలు కొనసాగటం సంతోషంగా ఉంది. – వెస్లీ రొసారియో, దగుపన్ నగరం, ఫిలిప్పీన్స్ (చదవండి: పెద్ద విస్తీర్ణంలో ప్రకృతి సేద్యం ఎలా చేయాలంటే..!) -
ఆ ఐదు దేశాల్లో..ఎంత అర్బన్ అగ్రికల్చర్ ఉందో తెలుసా!
ఆర్థికాభివృద్ధితో నిమిత్తం లేకుండా అభివృద్ధి చెందిన/చెందుతున్న/పేద దేశాలన్నిటిలోనూ ఏదో ఒక స్థాయిలో అర్బన్ అగ్రికల్చర్ ఊపందుకుంది. అయితే, అర్బన్ గార్డెన్లలో ఏ వనరులు వాడుతున్నారు? ఎంత ఆహారం పండిస్తున్నారు? వంటి గణాంకాలు లేకపోతే పాలకులు విధాన నిర్ణయాలు తీసుకోవటం కష్టం. ఈ లోటును పూడ్చడానికి ఐదు పాశ్చాత్య దేశాల్లో (ఫ్రాన్స్, జర్మనీ, పోలండ్, యునైటెడ్ కింగ్డమ్, అమెరికా)ని 72 అర్బన్ వ్యవసాయ క్షేత్రాలను/గార్డెన్లను 15 మంది పరిశోధకులు అధ్యయనం చేయగా, పరిమితులకు లోబడి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో కొందరు స్వచ్ఛందంగా కలసి సాగు చేసుకుంటున్న గార్డెన్లు, ఇళ్ల దగ్గర ఖాళీల్లో గృహస్థులు సాగు చేసుకుంటున్నవి, కేవలం అమ్మకం కోసం సాగు చేస్తున్న అర్బన్ క్షేత్రాలు వీటిలో ఉన్నాయి. మట్టిలో సాగు చేసే గార్డెన్లకే పరిమితమై అధ్యయనం చేశారు. హైడ్రోపోనిక్స్ వంటì ‘ప్లాంట్ ఫ్యాక్టరీ’ల జోలికి పోలేదు. పరిశోధకులు స్వయంగా ఈ క్షేత్రాలను, గార్డెన్లను పరిశీలించి వివరాలను నమోదు చేసుకున్నారు. అధ్యయనానికి ఎంపిక చేసిన గార్డెన్లు, అర్బన్ ఫామ్స్లో కొన్ని దశాబ్దాలుగా నడుస్తున్నవి వున్నాయి. ఫ్రాన్స్ గార్డెనర్లు సగటున 36 ఏళ్లుగా ఇంటిపంటలు పండించుకుంటున్నారు. కమ్యూనిటీ గార్డెన్ – ‘మెరైనర్స్ హార్బర్ ఫామ్’, న్యూయార్క్. కిలో పంటకు.. దిగుబడిలో గార్డెన్లను బట్టి చాలా హెచ్చుతగ్గులున్నాయి. గ్రామీణ పొలాలతో పోల్చితే అనుభవజ్ఞులు నిర్వహించే అర్బన్ గార్డెన్లలో ఉత్పాదకత అధికంగా ఉంది. సరదా కోసం నిర్వహించే లీజర్ గార్డెన్లలో దిగుబడి అంతంత మాత్రమే. కిలో కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు పండించడానికి సగటున 0.53 చదరపు మీటర్ల భూమి, 71.6 లీటర్ల నీరు, 5.5 కిలోల కంపోస్ట్ అవసరమని ఈ అధ్యయనంలో తేల్చారు. సొంతంగా నీరు పోసుకునే వ్యక్తిగత గార్డెన్లలో కన్నా డ్రిప్ వాడే గార్డెన్లలో ఎక్కువ నీరు ఖర్చవుతోంది! వ్యక్తిగత తోట – బోషుమ్, జర్మనీ చదరపు మీటరు స్థలంలో పండిస్తున్న ఉత్పత్తిలో వ్యత్యాసం చాలానే ఉంది. 0.2 నుంచి 6.6 కిలోల మధ్యలో ఉంది. నాన్టెస్ (ఫ్రాన్స్)లో అమ్మకం కోసం (గ్రీన్హౌస్ ఉంది) పంటలు పండిస్తున్న అర్బన్ ఫామ్లో చ.మీ. భూమిలో ఉత్పాదకత అత్యధికంగా 6.7 కిలోలు వస్తోంది. చ.మీ.కి ఫ్రాన్స్లో ఓ వ్యక్తి 2,069 కేలరీల ఆహారాన్ని పండిస్తుంటే, పోలండ్లో ఓ గార్డెనర్ 52.8 కేలరీలు పండిస్తున్నారు. స్థానిక వాతావరణం, వ్యక్తిగత శ్రద్ధ తదితర అంశాలపై ఫలితాలు ఆధారపడి ఉంటాయన్నది తెలిసిందే. అర్బన్ క్షేత్రం – కాలేజ్ పియర్ మెండెస్ ఫ్రాన్స్, పారిస్, ఫ్రాన్స్ పురుగు మందులు.. మొత్తం 128 రకాల పంటలు కనిపించాయి. ఒక పంట నుంచి 83 పంటలు సాగు చేసే గార్డెనర్లు, ఫామ్స్ ఉన్నాయి. సగటున 16–20 పంటలు ఎక్కువ మంది సాగు చేస్తున్నారు. వాటంతట అవే పెరిగే తినదగిన ఆకుకూరలు, ఔషధ మొక్కలు, పూలు అదనం. 40% గార్డెన్లు/అర్బన్ ఫామ్స్లో ఏ ఇంధనాన్నీ వాడకపోవటం విశేషం. ఈ పాశ్చాత్య అర్బన్ క్షేత్రాల్లో, గార్డెన్లలో సేంద్రియ ఎరువులతో పాటు, రసాయనాలను కూడా వినియోగిస్తున్నట్లు గమనించారు. కలెక్టివ్ గార్డెన్–యూకే, వ్యక్తిగత తోట – డార్ట్మాండ్, జర్మనీ 22% గార్డెనర్లు ..కంపోస్టుతోపాటు రసాయనిక ఎరువులు కూడా వాడుతున్నారు. 51% వ్యక్తిగత గార్డెన్లు, 22% అర్బన్ ఫామ్స్లో పురుగుమందులు కూడా వాడుతున్నారు. అయితే, సామూహిక అర్బన్ గార్డెన్లలో మాత్రం పురుగుమందులు అసలు వాడట్లేదు. విష రసాయనాల వల్ల కలిగే నష్టం గురించి వీటి నిర్వాహకులకు స్పష్టమైన అవగాహన, పట్టుదల ఉందని అర్థం చేసుకోవచ్చు. ఐదు దేశాల్లోని అధ్యయనం చేసిన గార్డెన్లు, అర్బన్ పొలాలు అర్బన్ ఫామ్ – మడ్లార్క్స్, యూకే(హెచ్) వ్యక్తిగత గార్డెన్ – లెస్ ఎగ్లాంటియర్స్, నాంటెస్, ఫ్రాన్స్ - పంతంగి రాంబాబు, సీనియర్ న్యూస్ ఎడిటర్, సాగుబడి డెస్క్ (చదవండి: ఆ విద్యార్థులు ఎందరికో స్ఫూర్తి..చిట్టి మొక్కలతో గట్టిమేలే చేస్తున్నారుగా!) -
ఐబీడీపై ఏఐజీ అధ్యయనం
సాక్షి, సిటీబ్యూరో: పట్టణ ప్రాంతాలకే పరిమితమైన జీర్ణకోశ సంబంధిత వ్యాధి ఇన్ల్ఫమేటరీ బొవెల్ డిసీజ్ (ఐబీడీ)గ్రామీణ ప్రాంతాల్లోనూ వేగంగా వ్యాపిస్తోందని ఏఐజీ ఆసుపత్రి ఛైర్మన్ డి.నాగేశ్వర్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై తమ ఆసుపత్రి అధ్యయన ఫలితాలను ప్రతిష్టాత్మక లాన్సెట్ ప్రచురించిన నేపథ్యంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో 15 లక్షల మందికి పైగా ఈ వ్యాధితో బాధపడుతున్నారని అంచనా కాగా, తాము గ్రామాల్లో 30 వేల మంది బాధితులను గుర్తించడం ద్వారా అది గ్రామీణ ప్రాంతాలకు కూడా బాగా విస్తరించినట్టు వెల్లడైందన్నారు. తమ తొలి దశ అధ్యయనం ప్రకారం గ్రామీణుల్లో ఈ వ్యాధి 0.1 శాతం మాత్రమే కాగా రెండో దశలో 5.1 శాతానికి పెరిగిందన్నారు. శిశువులకు తల్లిపాలు అందకపోవడం, యాంటీబయాటిక్స్ వినియోగం...తో పాటు గ్రామాల్లోనూ ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగం పెరగడం, పాశ్చాత్య జీవనశైలి వంటివి గ్రామాల్లో ఐబీడీ విజృంభణకు కారణమన్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఐబీడీ వ్యాప్తిపై ప్రతీఒక్కరిలో అప్రమత్తత అవగాహన పెరగాలన్నారు. సమావేశంలో ఏఐజీ ఆసుపత్రి ఐబీడీ సెంటర్ డైరెక్టర్, డాక్టర్ రూపా బెనర్జీ అధ్యయనం తీరుతెన్నులను వివరించారు. -
ఆ విద్యార్థులు ఎందరికో స్ఫూర్తి..చిట్టి మొక్కలతో గట్టిమేలే చేస్తున్నారుగా!
చారిత్రాత్మక డబ్లిన్ నగరంలో ఐదుగురు పాఠశాల విద్యార్థులు కలసి అర్బన్ అగ్రికల్చర్ రంగంలో చేపట్టిన సేవా కార్యక్రమం ఇటీవల వార్తల్లోకెక్కింది. పౌష్టికాహార భద్రతను కల్పించే ట్టి మొక్కల్ని స్వయంగా తామే పెంచి ఇతరులకు ఉచితంగా పంచి పెడుతున్నారు. కరోనా కష్టకాలంలో ప్రారంభమైన ఈ మంచి పనికి ఇప్పుడు డబ్లిన్ నగరపాలకుల మద్దతు లభించటం విశేషం. ఐర్లండ్ రాజధాని డబ్లిన్. మొదటి ముప్పై ప్రపంచ స్థాయి నగరాల్లో ఇదొకటి. సమకాలీన విద్యకు, కళలకు, పరిపాలనకు, పరిశ్రమలకు కేంద్ర బిందువు. ఈ చారిత్రక నగరం బ్రిటిష్ సామ్రాజ్యంలో కొంతకాలం పాటు రెండో అతిపెద్ద నగరంగా విలసిల్లింది. 1922లో దేశ విభజన తర్వాత ‘ఐరిష్ ఫ్రీ స్టేట్’ రాజధానిగా మారింది. తర్వాత ఈ దేశం పేరు ఐర్లండ్గా మార్చారు. అర్జున్ కరర్–పరేఖ్, మరో నలుగురు డబ్లిన్ హైస్కూల్ విద్యార్థులు తమ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉండే పిల్లల పౌష్టికాహార భద్రత గురించి పరితపిస్తుంటారు. ఆ పిల్లలకు మంచి ఆహారాన్ని కొని లేదా విరాళంగా సేకరించి పంపిణీ చేయకుండా పోషకాల గనులైన మైక్రోగ్రీన్స్ (ట్టి మొక్కలు)ను స్వయంగా పండిం ఇస్తుండటం విశేషం. ఐదారు అంగుళాల ఎత్తులోనే ఆకుకూరలను కత్తిరించి పచ్చగానే సలాడ్గా మైక్రోగ్రీన్స్ను తింటే పౌష్టికాహార లోపం తీరుతుంది. సాధారణ ఆకుకూరల్లో కన్నా ఇందులో పోషకాలు చాలా రెట్లు అధికంగా ఉంటాయి. అందువల్ల సాధారణ ఆహారంతో పాటు కొద్ది గ్రాముల మైక్రోగ్రీన్స్ తీసుకుంటే పౌష్టికాహార లోపం తీరుతుందని నిపుణులు చెబుతున్నారు. నాలుగేళ్ల క్రితం అర్జున్ తన 16వ ఏట లైసెన్స్ తీసుకొని మరీ తమ గ్యారేజ్లో వర్టికల్ గార్డెన్ ట్రేలను ఏర్పాటు చేసి మైక్రోగ్రీన్స్ పెంపకాన్ని ప్రారంభించాడు. ‘గార్డెనర్స్ ఆఫ్ గెలాక్సీ (జీజీ)’ పేరిట తొలుత వ్యాణిజ్య సంస్థగా ప్రారంభింనప్పటికీ తదనంతరం లాభాపేక్ష లేని సంస్థగా మార్చాడు. జీజీ బృందంలో అతనితో పాటు నీల్ కరర్–పరేఖ్, ప్రెస్టన్ చియు, నికో సింగ్ ఉన్నారు. ఈ బృందానికి అర్జున్, నీల్ల తల్లి వీణ దేవరకొండ అండగా ఉన్నారు. డీయూఎస్డీ న్యట్రిషనల్ సర్వీసెస్ డైరెక్టర్ ఫ్రాంక్ కాస్ట్రో వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం అందిస్తున్నారు. తాము పెంచిన మైక్రోగ్రీన్స్ను డబ్లిన్ యూనిఫైడ్ స్కూల్ డిస్ట్రిక్ట్ (డీయూఎస్డీ) పరిధిలోని స్కూల్ పిల్లలకు, ఆకలితో బాధపడే పేదలు తలదాచుకునే స్థానిక షెల్టర్లకు విరాళంగా అందిస్తున్నారు. ‘మైక్రోగ్రీన్స్ పెంపకానికి అలమెడా కౌంటీ నుంచి హోమ్ గ్రోయర్స్ లైసెన్స్ కూడా తీసుకున్నాను. కోతకు సిద్ధమైన మైక్రో గ్రీన్స్ నానబెట్టిన విత్తనాలను ట్రేలలో కొబ్బరిపొట్టు ఎరువులో చల్లి, 9–12 రోజుల తర్వాత ఐదారు అంగుళాల ఎత్తు పెరిగిన బఠాణీ తదితర రకాల మైక్రోగ్రీన్స్ను శుభ్రమైన కత్తెర్లతో కత్తిరించి, పేపర్ బ్యాగ్స్లో పెట్టి పంపిణీ చేస్తున్నాం. ఈ పనులను మొదటి రెండేళ్లు నేనే చేసేవాడిని. తర్వాత మిగతా వారిని చేర్చుకున్నాను’ అంటున్నాడు అర్జున్. డబ్లిన్ నగరపాలకులు మినీ గ్రాంట్ల పేరిట 1,500 డాలర్లను అందజేసి ప్రోత్సహిస్తుండటం విశేషం. ‘డబ్లిన్ హైస్కల్లో సలాడ్లకు మైక్రోగ్రీన్స్ను జోడించడం అద్భుతంగా ఉందని న్యట్రిషన్ సర్వీసెస్ డైరెక్టర్ ఫ్రాంక్ కాస్ట్రో అన్నారు. ‘మా చొరవ ప్రత్యేకమైనదని మేం నమ్ముతున్నాం. సమాజంలో మార్పు తెస్తున్నందుకు గర్విస్తున్నాం. ప్రజలకు సహాయం చేయడం మంచి అనుభతినిస్తుంది. నేను ఆహార అభద్రతతో పోరాడటానికి సహాయం చేయాలనుకున్నాను. ఒంటరిగా చేయలేకపోయిన పనిని మేం కలసి చేస్తున్నాం’ అన్నారు జీజీ వైస్ ప్రెసిడెంట్ హరి గణేష్ (16). పై చదువులకు వెళ్లాక కూడా ఈ పని కొనసాగించాలని, మరింత మందికి మైక్రోగ్రీన్స్ అందించాలని ఈ యువ అర్బన్ ఫార్మర్స్ ఆశిస్తున్నారు. ఈ విద్యార్థుల పని స్ఫూర్తిదాయకం ‘గార్డెనర్స్ ఆఫ్ ది గెలాక్సీ సభ్యులైన ఈ విద్యార్థులు ఎంతో మంచి పని చేస్తున్నారు. తమ ప్రాంతంలో విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని తీర్చాలని వీరు కంకణం కట్టుకోవడం చాలా స్ఫర్తిదాయకంగా ఉంది. ఆరోగ్యకరమైన మైక్రోగ్రీన్స్ను పండించడం కొనసాగించడానికి డబ్లిన్ సిటీ యూత్ అడ్వైజరీ కమిటీ మంచి గ్రాంట్ ఇవ్వటం చసి చాలా సంతోషిస్తున్నాను. – మెలీసా హెర్నాండెజ్, డబ్లిన్ నగర మేయర్ పతంగి రాంబాబు (చదవండి: ఐక్యరాజ్యసమితి ప్రశంసలు అందుకున్న 'తెలుగు మహిళ') -
18 నెలలుగా పెరగనే లేదు!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఉద్యోగుల సగటు వేతన ఆదాయంలో పెరుగుదల కనిపించడం లేదని పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్) తెలిపింది. 2023–24 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో ముగిసిన 18 నెలల కాలంలో వారి వేతనంలో ఎలాంటి ఎదుగుదల లేదని పేర్కొంది. రూ. 14,700 దగ్గరే ఆగిపోయినట్లు వివరించింది. అయితే పట్టణ ప్రాంతాల్లో సగటు ఉద్యోగి (శాలరీడ్ పర్సన్) నెలవారీ సగటు వేతనం మాత్రం రూ. 20,030 నుంచి 7.5 శాతం పెరిగి రూ. 21,647కు చేరుకున్నట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ నివేదిక తెలిపింది. పీఎల్ఎఫ్ఐ డేటా ప్రకారం చూస్తే గ్రామీణ ప్రాంతాల్లోని దినసరి కూలీ లేదా వేతనం 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ. 302తో పోలిస్తే 2023–24 తొలి త్రైమాసికంలో రూ. 368కు పెరిగింది. అదే పట్టణ ప్రాంతాల్లోని క్యాజువల్ లేబర్ రోజుకూలీ రూ. 385 నుంచి రూ. 464కు పెరిగింది. దేశంలోని కార్మికశక్తిలో 46 శాతం మంది వ్యవసాయ దిగుబడులపై ఆధారపడి ఉన్నారని... కానీ ఈ ఏడాది తీవ్ర వాతావరణ మార్పులు వారికొచ్చే నెలసరీ ఆదాయాలపై ప్రతికూల ప్రభావం చూపొచ్చని నివేదిక అభిప్రాయపడింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, నిర్మాణ రంగాల్లో... పట్టణాల్లో ఉత్పత్తి, సర్వీసెస్, ఇతర రంగాల్లో ఉద్యోగులు కేంద్రీకృతమైనట్లు పీఎల్ఎఫ్ఎస్ నివేదిక వెల్లడించింది. ప్రైవేటులో ఉపాధిలేమి.. పట్టణ ప్రాంతాల్లోని ఉద్యోగులు ప్రైవేటు రంగంలోని ఐటీ, స్టార్టప్ సెక్టార్లలో ఎక్కువగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ప్రతికూల పరిస్థితుల కారణంగా ఈ ఉద్యోగులకు అవకాశాలు దక్కకపోవడంతో ఉపాధిలేమి కూడా వెంటాడుతోందని నిపుణులు చెబుతున్నారు. గతేడాదితో పోలిస్తే ‘నెలవారీ హైరింగ్ ట్రెండ్స్’ దాదాపు 7 శాతం తగ్గిపోయినట్లు ‘ఫౌండిట్ ఇనసైట్స్ ట్రాకర్’ వెల్లడించింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీస్స్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగంలోని మొత్తం 27 పరిశ్రమల్లో 10 శాతం ఉద్యోగాల కల్పన తగ్గినట్లు ట్రాకర్ పేర్కొంది. ఏయే రంగాల్లో వృద్ధి... ఫౌండిట్ ఇన్సైట్స్ ట్రాకర్ అధ్యయనం ప్రకారం... గతేడాది నుంచి పరిశీలిస్తే కేవలం 9 రంగాల్లో మాత్రమే ఈ–రిక్రూట్మెంట్ కార్యకలాపాలు పెరిగాయి. ఇందులోనూ షిప్పింగ్/మెరైన్ పరిశ్రమ అత్యధికంగా 45 శాతం వృద్ధిని నమోదు చేసింది. డేటా ఆధారంగా వ్యూహాలు రూపొందించుకొనే అడ్వర్టయిజింగ్, మార్కెటింగ్–పీఆర్ పరిశ్రమలు 28 శాతం రిక్రూట్మెంట్ యాక్టివిటీ పెరుగుదల సాధించాయి. రిటైల్, ట్రావెల్, టూరిజం రంగాలు గతేడాదితో పోచ్చితే 27 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ద్రవ్యోల్బణం పెరుగుదలే కారణం... దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుదలతో గ్రామీణ ప్రాంతాల్లో వేతనాలు పెరగట్లేదు. దీంతో ఈ ప్రాంతాల్లోని ఉద్యోగుల నిజ వేతనాలు (రియల్ వేజ్) పెరగక ఇబ్బందిపడుతున్నారు. పట్టణ ప్రాంతాలోన్లూ అదే పరిస్థితి నెలకొంది. పైకి చూస్తే వేతనం ద్వారా నిర్ణిత ఆదాయం వస్తున్నట్లు కనిపిస్తున్నా గత నెలతో పోలిస్తే ద్రవ్యోల్బణం పెరుగుదల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. జనం చేతుల్లో డబ్బుల్లేక వారి కొనుగోలు శక్తి తగ్గుతోంది. దీనికితోడు ఉపాధి హామీ పనిదినాలు తగ్గడం గ్రామీణ ప్రాంత దినసరి కూలీలపై మరింత ప్రభావం చూపుతోంది. గ్రామీణ భారతంలో సగటు వేతన జీవులు ఉసూరుమంటున్నారు..అత్తెసరు వేతన ఆదాయంతో బతుకుబండిని భారంగా లాగుతున్నారు..పల్లెల్లో చాలీచాలని ఆదాయంతో సర్దుకుంటున్నారు. కేంద్ర గణాంక శాఖ పరిధిలోని నేషనల్ శాంపిల్ సర్వే కార్యాలయం 2023–24 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి సంబంధించి విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్) నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఈ సర్వే ప్రకారం దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో వేతన జీవి సగటు ఆదాయం గత ఏడాదిన్నర నుంచి రూ. 14,700 వద్దే నిలిచిపోయింది. మరోవైపు ఓ ప్రైవేటు సంస్థ చేపట్టిన మరో అధ్యయనం ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పట్టణ ప్రాంత ఉద్యోగి సగటు ఆదాయం రూ. 21,647గా నమోదైంది. -
సంక్షోభం నేర్పిన పాఠం! నగరాల్లోకి 'పెరటి తోటలొచ్చాయ్'!
కోవిడ్–19 మహమ్మారి ప్రభావాల నుంచి కోలుకుంటున్న దశలో శ్రీలంకను 2022లో మరో సంక్షోభం చుట్టుముట్టింది. ఆహారం, ఇంధన కొరతతో కూడిన పెద్ద ఆర్థిక సంక్షోభం దేశాన్ని కుదిపేసింది. రసాయనిక ఎరువులను దిగుమతి చేసుకోవడానికి డబ్బులేకపోయింది. ఈ సంక్షోభం తీవ్రత ఎంతంటే.. ప్రజలు తమ ఆహారపు అలవాట్లను మార్చుకోవాల్సి వచ్చింది. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అంచనా ప్రకారం సంక్షుభిత శ్రీలంకలో ప్రజలు భోజనాల సంఖ్యను 37% తగ్గించుకున్నారు. తినే ఆహారాన్ని 40% తగ్గించుకున్నారు. తక్కువ ఇష్టపడే ఆహారాలను తినటం 68% తగ్గించుకోవాల్సి వచ్చింది. కొలంబో మున్సిపల్ కౌన్సిల్(సీఎంసీ) ఆవరణలో పచ్చికను తొలగించి కూరగాయలు సాగు చేస్తున్న దృశ్యం బయటి నుంచి ఆహారోత్పత్తులు నగరానికి రావటం తగ్గినప్పుడు ఉన్న పరిమితులకు లోబడి నగరంలోనే కూరగాయలు, పండ్లు వంటివి పండించుకోవటం తప్ప వేరే మార్గం లేదు. దేశ రాజధాని కొలంబో అతిపెద్ద నగరమైన కొలంబో(అప్పటి) మేయర్ రోసీ సేననాయక (మార్చి 19న ఆమె పదవీ కాలం ముగిసింది) ఈ దిశగా చురుగ్గా స్పందించారు. కొలంబో మునిసిపల్ కౌన్సిల్ (సీఎంసీ) మద్దతుతో నగరంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో ఆహార పంటలను పండించేలా చొరవ చూపారు. ప్రజలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో కూరగాయలు, పండ్ల సాగు ప్రారంభమైంది. కొలంబో విస్తీర్ణం 37 చ.కి.మీ.లు. జనాభా 6.26 లక్షలు (2022). నిజానికి ప్రజల స్థాయిలో టెర్రస్ కిచెన్ గార్డెనింగ్ ప్రయత్నాలకు కొలంబో గతం నుంచే పెట్టింది పేరు. అయితే, పాలకులు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. సెంట్రల్ కొలంబోలో కూరగాయల మొక్కలతో ఏర్పాటు చేసిన క్రిస్మస్ ట్రీ కరోనాకు ఆర్థిక/ఆహార సంక్షోభం తోడైతే తప్ప కొలంబో మున్సిపల్ కౌన్సిల్(సీఎంసీ)కి, శ్రీలంక ప్రభుత్వానికి అర్బన్ అగ్రికల్చర్ ప్రాధాన్యత ఏమిటో తెలిసిరాలేదు. నగరంలో ఖాళీ స్తలాలు ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నంతలో ఆకుకూరలు, కూరగాయల సాగుకు కౌన్సిల్ పచ్చజెండా చూపటమే కాదు.. మొదటి పెరటి తోట కొలంబో టౌన్ హాల్ చుట్టూ ఉన్న పచ్చిక బయలు లోనే ఏర్పాటైంది. సోవియట్ యూనియన్ కుప్పకూలిన తర్వాత 30 సంవత్సరాల క్రితం క్యూబాలోని హవానాలో కూడా ఇలాగే జరిగింది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ కార్యాలయం ఎదుట పచ్చికను తొలగించి కూరగాయ పంటల సాగుకు శ్రీకారం చుట్టిన సందర్భం అది. ఉపయోగించని ప్రతి అంగుళం ఖాళీ స్తలాల్లో ఇంటి పెరటిలో, బాల్కనీలలో, ఇంటి పైకప్పులలోనూ కూరగాయలు పండించమని నివాసితులను, పాఠశాల విద్యార్థులను సీఎంసీ ప్రోత్సహించింది. కొలంబో సిటీ కౌన్సిల్ ఆవరణలో సాగవుతున్న కూరగాయలను పరిశీలిస్తున్న మాజీ మేయర్ రోసీ సేననాయక తదితరులు Good morning from our rooftop terrace #SriLanka #naturelovers #GoodMorningTwitterWorld pic.twitter.com/SkFGeLFr6V— Devika Fernando (@Author_Devika) June 28, 2023 60%గా ఉన్న అల్పాదాయ వర్గాల ప్రజలకు అర్బన్ అగ్రికల్చర్ చాలా అవసరమని సీఎంసీ భావిస్తోంది. కోవిడ్డ మహమ్మారికి ముందు నగరంలో కూరగాయల సాగు ఆవశ్యకతను సీఎంసీలో ఏ విభాగమూ గుర్తించ లేదు. ఇప్పుడు వచ్చిన మార్పు గొప్పది. ఈ సానుకూల ప్రయత్నాలకు శ్రీలంక కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చింది, ప్రభుత్వ ఉద్యోగులందరూ పంటలు పండించడానికి శుక్రవారం ఇంట్లోనే ఉండేందుకు వీలు కల్పించింది. సేంద్రియ ఎరువుల ఉత్పత్తికి, నగర పరిసరాల్లో పడావుపడిన వరి పొలాలు, ఖాళీ ప్రభుత్వ స్తలాలను సాగు చేయడానికి సైన్యాన్ని కూడా నియోగించారు. ప్రైవేటు సంస్థలు కూడా కదిలాయి. సెంట్రల్ కొలంబోలో పూర్తిగా వివిధ కూరగాయ మొక్కలతో రూపొందించిన క్రిస్మస్ చెట్టును ఏర్పాటు చేశారు. పంతంగి రాంబాబు, సీనియర్ న్యూస్ ఎడిటర్, సాక్షి సాగుబడి డెస్క్ (చదవండి: దుబాయ్ సిగలో 'రూఫ్టాప్ సేద్యం) -
ఇండియాలో శరవేగంగా విస్తరిస్తున్న పట్టణ ప్రాంతాల జనాభా
భారతదేశంలో పట్టణ ప్రాంతాల జనాభా వేగంగా పెరుగుతోంది. మూడు దశాబ్దాల క్రితం ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు దేశంలో పట్టణీకరణకు మంచి ఊపునిచ్చాయి. పట్టణ ప్రాంతాల జనసంఖ్య వృద్ధితోపాటు దేశ ఆర్థికవ్యవస్థలో నగరాలు, పట్టణాల వాటా కూడా మరింత వేగంగా పెరుగుతోంది. ఇండియాలో పట్టణ ప్రాంతాల జనాభా 1961లో 8.23 కోట్ల నుంచి 1981 నాటికి 16.60 కోట్లకు పెరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 37.7 కోట్ల పట్టణ ప్రాంతాల జనాభా 2021 నాటికి 48 కోట్లకు చేరుకుందని అంచనా వేశారు. అంటే దేశ జనాభాలో ఐదో వంతుకు పైగా పట్టణాలోనే జీవిస్తోందన్న మాట. ఇక్కడ ఆసక్తికర విషయం ఏమంటే 2001–2011 దశాబ్దంలో దేశంలో పట్టణ జనాభా ఎన్నడూ లేనంత గ్రామీణ ప్రాంతాల్లో కంటే ఎక్కువగా వృద్ధిచెందింది. పెరిగిన 18 కోట్ల 14 లక్షల జనాభాలో పట్టణ ప్రాంతాల జనం 9 కోట్ల 10 లక్షలు కాగా, గ్రామీణ ప్రాంతాలది 9 కోట్ల 40 లక్షలు. 2011 నుంచీ పట్టణ ప్రాంతాల్లో జనసంఖ్య శరవేగంతో పెరుగుతోంది. మొత్తం దేశ జనాభాలో ఇదివరకు 18 శాతం ఉన్న పట్టణ ప్రాంతాల జనాభా 2021 నాటికి 37 శాతానికి పెరిగిందని అంచనా. ఐక్యరాజ్యసమితి-హేబిటెట్ ప్రపంచ నగరాల జనాభా (2022) నివేదిక ప్రకారం భారత పట్టణ ప్రాంతాల జనాభా 2025 నాటికి 54.74 కోట్లు, 2030కి 60.73 కోట్లు, 2035 నాటికి 67.45 కోట్లకు పెరుగుతుందని అంచనా. భారత స్వాతంత్య్రానికి 100 ఏళ్లు నిండిన మూడు సంవత్సరాలకు అంటే 2050 కల్లా పట్టణ ప్రాంతాల జనసంఖ్య 81.4 కోట్లకు పెరిగిపోతుందని ఐరాస అంచనాలు సూచిస్తున్నాయి. అంటే, దేశంలో పట్టణాల జనాభా గ్రామీణ జనాభా కంటే చాలా ఎక్కువ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో పట్ణణ ప్రాంతాలపైనా పెరిగిన శ్రద్ధ దక్షిణాదిన మూడో పెద్ద రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కూడా పట్ణణ ప్రాంతాలు వేగంగా విస్తరిస్తున్నాయి. అదీగాక, నగరాలు, పట్టణాలుగా అంటే మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ హోదా రాని పెద్ద గ్రామాలు పట్టణ ప్రాంతాల సౌకర్యాలతో నవ్యాంధ్రలో వృద్ధిచెందుతున్నాయి. పట్టణ హోదా ఇంకా దక్కని ఇలాంటి పెద్ద గ్రామాలను ‘సెన్సస్ టౌన్లు’ అని పిలుస్తారు. కాస్త వెనుకబడిన ప్రాంతాలుగా గతంలో భావించిన చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పట్టణ జనాభా బాగా అభివృద్ధి చెందిన జిల్లాలతో సమానంగా పెరుగుతోందని 2011 జనాభా లెక్కలు తేల్చిచెప్పాయి. నాలుగేళ్ల క్రితం రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచీ గ్రామీణ ప్రాంతాలతో సమానంగా పట్టణ ప్రాంతాల ప్రగతిపై దృష్టి సారించింది. వార్డు వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టి పట్టణ ప్రాంతాల పేద, మధ్య తరగతి సహా అన్ని వర్గాల ప్రజలకు ఎలాంటి బాదరబందీ లేకుండా జీవనం సాఫీగా సాగడానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. ఇంకా, నగరాలు, పట్టణాల్లో నెలవారీ జీతాలు వచ్చే ఉపాధి లేని ఆటో డ్రైవర్లు వంటి ఆధునిక వృత్తుల్లో ఉన్న దిగువ మధ్యతరగతి వారికి అనేక సంక్షేమ పథకాలు రూపొందించి ఏపీలో అమలుచేస్తున్నారు. అశాంతి, అలజడికి త్వరగా గురయ్యే అవకాశాలున్న పట్టణ ప్రాంతాల ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి వైఎస్సార్సీపీ సర్కారు చేపట్టిన అనేక చర్యల వల్ల ఆంధ్రా పట్టణాలు, నగరాలు శాంతి, సౌభాగ్యాలతో నేడు వర్ధిల్లుతున్నాయి. విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ, రాజ్యసభ సభ్యులు -
ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. వారికోసం ‘టీ-9 టికెట్’.. ప్రయోజనాలివే
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ, పట్టణ ప్రయాణికులకు ఆర్థికభారం తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. పల్లె వెలుగు బస్సులో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటీజన్ల కోసం ‘టీ-9 టీకెట్’ అందుబాటులోకి తెచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీ-24, టీ-6, ఎఫ్-24 టీకెట్లను ఇప్పటీకే అందిస్తోన్న సంస్థ.. తొలిసారిగా గ్రామీణ, పట్టణ ప్రయాణికుల సౌకర్యార్థం టీ-9 టీకెట్ ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. హైదరాబాద్లోని బస్ భవన్లో శుక్రవారం ‘టీ-9 టీకెట్’ పోస్టర్ను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ ఆవిష్కరించారు. ఈ టీకెట్ ఈ నెల 18(ఆదివారం) నుంచి పల్లె వెలుగు బస్సుల్లో కండక్టర్ల వద్ద అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. ►‘టీ-9 టీకెట్’ పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటీజన్స్కు వర్తిస్తుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఈ టీకెట్ చెల్లుబాటు అవుతుంది. ►ఈ టీకెట్ ద్వారా 60 కిలోమీటర్ల పరిధిలో ఒక్కసారి రానూపోను ప్రయాణం చెయొచ్చు. ► ‘టీ-9 టీకెట్’ కు రూ.100 ధరగా టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. టోల్ గేట్ చార్జీలపైన మినహాయింపు ఇచ్చింది. దీంతో ఈ టీకెట్ ద్వారా ఒక్కోక్కరికి రూ.20 నుంచి రూ.40 వరకు ఆదా అవుతుందని సంస్థ ప్రకటీంచింది. ►60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటీజన్లు వయసు ధృవీకరణ కోసం తమ ఆధార్ కార్డును కండక్టర్లకు చూపించి టీ-9 టీకెట్ పొందవచ్చు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఈ టీకెట్లను కండక్టర్లు ఇస్తారు. ►తెలంగాణ రాష్ట్ర పరిధిలోనే ఈ టీకెట్ చెల్లుబాటు అవుతుంది. చదవండి: Hyderabad: నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ రూట్లో వెళ్లకండి! ‘పల్లె వెలుగు బస్సుల్లో ప్రతి రోజు సగటున 15 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. అందులో మహిళలు, సీనియర్ సిటీజన్లు ఎక్కువగా ఉన్నారు. వారికి ఆర్థికభారం తగ్గించాలనే ఉద్దేశంతోనే పల్లెవెలుగు బస్సుల్లో ‘టీ-9 టీకెట్’కు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం శ్రీకారం చుట్టీంది. ఈ టీకెట్ తో రూ.100 చెల్లించి 60 కిలోమీటర్ల పరిధిలో రానూపోను ప్రయాణించవచ్చు. గ్రామీణ, పట్టణ ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని సంస్థను ఆదరించాలి’ అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ కోరారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటీకే టీ-24, టీ-6, ఎఫ్-24 టీకెట్లను అందుబాటులోకి తెచ్చామని, వాటీకి ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన వస్తోందని గుర్తు చేశారు. ఆ టీకెట్లకు మంచి స్పందన వస్తుండటంతో తొలిసారిగా గ్రామీణ, పట్టణ ప్రయాణికుల కోసం ‘టీ-9 టీకెట్’ను తీసుకువచ్చామని చెప్పారు. ఈ టీకెట్ కు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు. ‘టీ-9 టీకెట్’ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సంస్థ చీఫ్ ఆపరేటీంగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి.రవిందర్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటీల్, ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్(ఈడీ)లు, పీవీ ముని శేఖర్, పురుషోత్తం, కృష్ణ కాంత్, సీటీఎం జీవన్ ప్రసాద్, సీఎంఈ రఘునాథరావు, సీఈఐటీ రాజశేఖర్, సీఎఫ్ఎం విజయపుష్ఫ, తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో అధికారం చేపట్టాలంటే అర్బన్ ఓటర్లు కీలకం
-
పట్టణ రోడ్ల నిర్వహణకు ప్రత్యేక యాప్
సాక్షి, అమరావతి: పట్టణ ప్రాంతాల్లోని రోడ్లు, వీధిలైట్లు, డ్రెయినేజీల నిర్వహణకు రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనుంది. ప్రస్తుతం కొంతమేర టెక్నాలజీ వాడుతున్నప్పటికీ.. ఇకపై గుంతల గుర్తింపుతోపాటు అన్ని పనులకు ఉపయోగపడేలా ప్రత్యేకంగా ‘యాప్’ను రూపొందిస్తున్నారు. గత వారం మునిసిపల్ విభాగంపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ తరహా పనులకు డిజిటల్ విధానాన్ని అమలు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. సీఎం సూచనలకు అనుగుణంగా యాప్ను అందుబాటులోకి తెస్తున్నట్టు సీడీఎంఏ ప్రవీణ్కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. ఉన్నతస్థాయి అధికారులు పరిశీలించేలా.. రోడ్లపై గుంతల పూడ్చివేత నుంచి రోడ్డు పక్కనున్న మొక్కలు, చెట్ల వరకు అన్ని వివరాలను ఈ యాప్లో పొందుపరచనున్నారు. ప్రాథమిక స్థాయిలో వార్డు సచివాలయంలోని ఎమినిటీ కార్యదర్శి వివరాలు అప్లోడ్ చేస్తే వెనువెంటనే స్థానిక మునిసిపల్ కమిషనర్తో పాటు సీడీఎంఏలోని ఉన్నతస్థాయి అధికారులు సైతం పరిశీలించేలా యాప్ను రూపొందిస్తున్నారు. దీనివల్ల రోడ్ల మరమ్మతుల విధానం సులభతరం అవుతుందని, రెండో దశ గుంతల పూడ్చివేతను ఈ విధానంలోనే చేపట్టనున్నామని సీడీఎంఏ ప్రవీణ్కుమార్ వివరించారు. మొదటి దశలో రూ.58.20 కోట్లతో మొత్తం 123 యూఎల్బీల్లో 41,412 గుంతలను పూడ్చినట్టు చెప్పారు. ఇకపై యాప్ ద్వారా రోడ్ల నిర్వహణతో పాటు మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో వీధిలైట్లు, డ్రెయినేజీలతో పాటు వాటిని ఆనుకుని ఉన్న చెట్లు, మొక్కలను కూడా యాప్ ద్వారా పర్యవేక్షిస్తామని వివరించారు. అప్లోడ్ చేసిన వెంటనే పనులు ప్రస్తుతం వార్డు సచివాలయం పరిధిలోని రోడ్లపై పడే గుంతలను వార్డు ఎమినిటీ కార్యదర్శి ఫొటోలు తీసుకుని, వాటిని కంప్యూటర్ ద్వారా అప్లోడ్ చేస్తున్నారు. వీటిని స్థానిక యూఎల్బీల్లో అధికారులు పరిశీలించి, ఉన్నతస్థాయి అనుమతి తీసుకుని పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలో పనులు చేపట్టడం ఆలస్యం అవుతోంది. ఇకపై అలాంటి వాటికి తావు లేకుండా వార్డు ఎమినిటీ కార్యదర్శి ఫొటో అప్లోడ్ చేయగానే వెంటనే అది స్థానిక మునిసిపల్ కమిషనర్, ఇంజనీర్తో పాటు సీడీఎంఏలోని సంబంధిత విభాగం ఉన్నతాధికారికి చేరుతుంది. ఫొటో సైతం ఎక్కడ తీశారో అక్షాంశాలు, రేఖాంశాలతో నమోదవుతుంది. వార్డు సచివాలయం పరిధిలో ఎన్ని కి.మీ. మేర రోడ్లు ఉన్నాయి, వాటిలో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు ఎన్ని, ఆయా మార్గాల్లోని వీధిలైట్లు, రోడ్డుకు ఆనుకుని ఉన్న మురుగు కాలువలు, మొక్కలు, చెట్లు వంటి వాటి వివరాలు సైతం అప్లోడ్ చేయనున్నారు. ఆయా మార్గాల్లో గుంతలు పడినా, ఎవరైనా తవ్వకాలు చేపట్టినా గుర్తించి వాటి ఫొటోలను యాప్లో ఉంచుతారు. ఉన్నత స్థాయిలో పర్యవేక్షణ ఉండటంతో ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే చర్యలు తీసుకునేందుకు అవకాశం కలుగుతుందని మునిసిపల్ అధికారులు చెబుతున్నారు. -
టొయాటో హైరైడర్ హైబ్రిడ్ ఎస్యూవీ, వాటికి గట్టిపోటీ
సాక్షి, ముంబై: టయోటా కిర్లోస్కర్ మోటార్ ప్రపంచ ఈవీ దినోత్సవం సందర్భంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అర్బన్ క్రూయిజర్ హైరైడర్ హైబ్రిడ్ ఎస్యూవీని శుక్రవారం లాంచ్ చేసింది. వీటి ధరలరూ. 15.11 లక్షల (ఎక్స్-షోరూమ్)గా సంస్థ ప్రకటించింది. నాలుగు వేరియంట్లలో లభ్యం కానున్న దీని టాప్-స్పెక్ నియో డ్రైవ్ (మైల్డ్-హైబ్రిడ్) వేరియంట్ రూ. 17.09 లక్షలు, హై వేరియంట్ ధర రూ. 18,99,000 (ఎక్స్-షోరూమ్)గా ఉండనుంది. 2022 జూలైలో దీన్ని తొలిసారి పరిచయం చేసిన సంస్థ దాదాపు రెండు నెలల తర్వాత దీన్ని తీసుకొచ్చింది. ఇప్పటికే మోడల్ కోసం అధికారిక బుకింగ్లను ప్రారంభించింది. టయోటా ఇండియా డీలర్షిప్లలోకి రానుంది. ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ మొదలైన వాటికి గట్టి పోటీ ఇవ్వనుంది. అలాగే త్వరలోనే ధరను ప్రకటించనున్న మారుతి సుజుకి గ్రాండ్ విటారా హైబ్రిడ్ ఎస్యూవీకి కూడి ఇది పోటీగా నిలవనుందని అంచనా. టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ వేరియంట్ వారీ ధరలు (ఎక్స్-షోరూమ్) S eDrive 2WD హైబ్రిడ్ రూ. 15.11 లక్షలు G eDrive 2WD హైబ్రిడ్ రూ. 17.49 లక్షలు V eDrive 2WD హైబ్రిడ్ రూ. 18.99 లక్షలు V AT 2WD నియో డ్రైవ్ రూ. 17.09 లక్షలు టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్తో బలమైన హైబ్రిడ్ టెక్తో e-CVTతో వస్తుంది. ఇది 91 bhp & 122 Nm ఉత్పత్తి చేస్తుంది. అయితే ఎలక్ట్రిక్ మోటార్ 79 bhp, 141 Nm ను ప్రొడ్యూస్ చేస్తుంది. అర్బన్ క్రూయిజర్ హైరైడర్కు ఇంత అద్భుతమైన స్పందన లభిస్తోందంటూ వినియోగదారులకు అసియేట్ వైస్ ప్రెసిడెంట్, సేల్స్ అండ్ మార్కెటింగ్ అతుల్ సూద్ ధన్యవాదాలు తెలిపారు. ఫీచర్లు: టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ నియో డ్రైవ్ , సెల్ఫ్ ఛార్జింగ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ పవర్ట్రెయిన్తో అందుబాటులో ఉంటుంది. 6 ఎయిర్బ్యాగ్లు, EBDతో కూడిన ABS, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 9 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్, వైర్లెస్ ఛార్జర్, హెడ్-అప్ డిస్ప్లే, యాంబియంట్ ఇంటీరియర్ లైటింగ్, 7అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి టాప్ ఫీచర్లుఇందులోఉన్నాయి. టయోటా iConnect టెక్నాలజీ సహా క్రూయిజ్ కంట్రోల్, 55 ప్లస్ ఫీచర్లు లభ్యం. -
ఇంటి పంట: రూఫ్టాప్ పొలం.. 5.7 ఎకరాలు!
సిటీ ఫార్మింగ్.. నగరవాసులు ఇప్పుడు అమితంగా ఇష్టపడుతున్న హెల్దీ గ్రీన్ యాక్టివిటీ! అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలన్న తేడా లేదు. ప్రపంచవ్యాప్తంగా నగరాలు, పట్టణాలు తామర తంపరగా విస్తరిస్తున్న నేపథ్యంలో సిటీ ఫార్మింగ్ ఊపందుకుంది. కాంక్రీటు అడవిలో మనోల్లాసాన్నిచ్చే పచ్చదనం ఉంటే చాలని గతంలో అనుకునే వారు. రసాయన అవశేషాల్లేని ఆహారం కూడా నగరంలోనే పండించుకొని తాజా తాజాగా వండుకు తినటం అలవాటు చేసుకుంటున్నారు. పర్యావరణ స్పృహతో పాటు అమృతాహార స్పృహ తోడైందన్నమాట! సిటీ ఫార్మింగ్ అనేది ఒక పట్టణ/నగరంలో ఖాళీ స్థలాల్లో, మేడలపైన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను పెంచడం. సాధారణంగా పెరటి తోటలు, కంటైనర్ గార్డెనింగ్, వర్టికల్ గార్డెనింగ్, హైడ్రోపోనిక్స్, ఆక్వాపోనిక్స్ ద్వారా పండించి.. ఇంటిపట్టున వండుకోవటం లేదా ఆ దగ్గర్లో వారికి అందించటం దీని లక్ష్యం. అయితే, న్యూయార్క్ నగరంలో సిటీ ఫార్మింగ్ కొత్త పుంతలు తొక్కుతోంది. ఆరోగ్యాభిలాషులు వేలాదిగా తమ సొంత మేడల పైన, ప్రభుత్వ/ప్రైవేటు ఖాళీ స్థలాల్లో సేంద్రియ ఇంటి పంటలు పండించుకుంటున్నారు. న్యూయార్క్ నగరపాలకులు నాలుగేళ్ల క్రితమే ఈ ట్రెండ్ను పసిగట్టి ప్రోత్సాహానికి చట్టాలు చేశారు. ప్రత్యేక వెబ్సైట్ను ఏర్పాటు చేసి ఔత్సాహికులకు అన్ని రకాలుగా చేయూతనిస్తున్నారు. వేలాది వ్యక్తిగత, కమ్యూనిటీ కిచెన్ గార్డెన్స్ పుట్టుకురావడానికి ఈ చర్యలు దోహదపడ్డాయి. అంతేకాదు.. సిటీ ఫార్మింగ్ ద్వారా అమృతాహారోత్పత్తి భారీ వ్యాపారావకాశంగా మారిపోయింది. భారీ వాణిజ్య సముదాయ విస్తారమైన బహుళ అంతస్తుల సువిశాల భవనాలపైన ఎకరాలకు ఎకరాల్లోనే ‘అత్యాధునిక అర్బన్ పొలాలు’ మట్టితో సహా ప్రత్యక్షమవుతున్నాయి. ఎడాపెడా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను సైతం సేంద్రియంగా పండించేసి.. అక్కడికక్కడే ఖరీదైన రెస్టారెంట్లు, హోటళ్లలో వండి వార్చుతున్నారు. చిల్లర దుకాణదారులకు విక్రయిస్తున్నారు. మేడల మీద మట్టి పొలాలను సృష్టించే సర్వీస్ ప్రొవైడర్లూ పుట్టుకొచ్చాయి. అటువంటి సంస్థల్లో ముఖ్యమైనది ‘బ్రూక్లిన్ గ్రేంజ్ రూఫ్టాప్ ఫామ్’. ఎంతో గౌరవం.. థ్రిల్ కూడా! నగరాల్లో నివసిస్తున్నప్పటికీ ప్రకృతితో సంబంధాన్ని కొనసాగించడం చాలా ముఖ్యం. వాతావరణ మార్పులు విసిరే పెను సవాళ్లను ఎదుర్కోవడంలో.. మన ఆరోగ్యాన్ని పెంపొందించడంలో పట్టణంలోని ఆకుపచ్చని ప్రదేశాలు కీలక పాత్ర పోషిస్తాయి. కర్బన ఉద్గారాలు, అధిక ఉష్ణోగ్రతలు, మురుగు నీరు వంటి సమస్యలతో సతమతమవుతున్న మన నగరాలకు సిటీ ఫామ్స్ ఊరటనిస్తాయి. అంతేకాదు, మనుషుల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. ఈ పనిచేయడం మాకు ఎంతో గౌరవం, థ్రిల్ కూడా! – గ్వెన్ షాంట్జ్, సహ వ్యవస్థాపకురాలు, క్రియేటివ్ డైరెక్టర్, బ్రూక్లిన్ గ్రేంజ్ రూఫ్టాప్ ఫామ్స్, న్యూయార్క్ బ్రూక్లిన్ గ్రేంజ్ ద గ్రేట్! బ్రూక్లిన్ గ్రేంజ్ సంస్థ బ్రూక్లిన్, క్వీన్స్లో గత పన్నెండేళ్లలో మూడు భారీ వాణిజ్య భవనాలపైన రూఫ్టాప్ ఫామ్లను నెలకొల్పి కూరగాయలు, ఆకుకూరలను పండిస్తోంది. ఇవి చిన్నా చితకా ఫామ్స్ కాదండోయ్.. మూడూ కలిపి 5.7 ఎకరాలు! బ్రూక్లిన్ గ్రేంజ్ సంస్థ ఆరంతస్థుల ‘లాంగ్ ఐలాండ్ సిటీ’ వాణిజ్య భవనంపై ఎకరం విస్తీర్ణంలో 2010లో తొలి సిటీ ఫామ్ను నిర్మించింది. ప్రత్యేకంగా తయారు చేసుకున్న టన్నులకొద్దీ సేంద్రియ మట్టి మిశ్రమాన్ని భవనం శ్లాబ్పై పరిచి.. ఎత్తుమడులపై ఉద్యాన పంటలు పండిస్తోంది. వాన నీటి మొత్తాన్నీ వొడిసిపట్టుకొని, ఆ నీటితోనే పంటలు పండిస్తున్నారు. 2012లో 12 అంతస్తుల బ్రూక్లిన్ నేవీ యార్డ్ భవనంపై 1.5 ఎకరాల్లో సిటీ ఫామ్ను నెలకొల్పింది. 2019లో విస్తారమైన సన్సెట్ పార్క్ భవనంపై ఏకంగా 3.2 ఎకరాల్లో మట్టి పోసి పంటలు పండిస్తోంది. ఏటా 22,000 కిలోల సేంద్రియ కూరగాయల దిగుబడి పొందటం విశేషం. న్యూయార్క్ మాదిరిగానే అనేక ప్రపంచ నగరాలు నవతరం ఆహారోత్పత్తి కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి! – పంతంగి రాంబాబు prambabu.35@gmail.com చదవండి: భారీ వర్షాలు.. ఇంటి పంటలు.. ఎత్తు మడులు ఎంతో మేలు! -
అందమైన కలలకు రూపం.. 'నగరవనం'
నెల్లిమర్ల: జిల్లా కేంద్రమైన విజయనగరానికి కూత వేటు దూరంలో చుట్టూ పచ్చని కొండలు..దగ్గర్లోనే నది..సమీపంలోనే వెయ్యేళ్ల క్రితం నిర్మించిన జైన దేవాలయం వీటి మధ్యలో 25 హెక్టార్ల సువిశాలమైన అటవీ ప్రాంతం. ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న నగరవనం సందర్శకుల అందమైన కలలకు మరో రూపం కానుంది. అందమైన నగరవనంలోకి త్వరలోనే సందర్శకులను అనుమతించడానికి సంబంధిత అధికారులు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇక్కడ ఇప్పటికే రూ 42 లక్షలతో చిల్డ్రన్ పార్క్, వైల్డ్ లైఫ్ సెంటర్, వాకింగ్ ట్రాక్, రాశి వనం ఏర్పాటుచేశారు. సమీపంలో ఉన్న కొండపైకి ట్రెక్కింగ్ పాత్, సైకిల్ పార్క్, ఓపెన్ ఆడిటోరియం, కాలువ పార్క్ అందుబాటులోకి తీసుకురానున్నారు. నగర వనానికి ప్రహరీ నిర్మించి, రక్షణ కల్పించనున్నారు. నెల్లిమర్ల పట్టణానికి విచ్చేసే ప్రధాన రహదారి నుంచి నెల్లిమర్ల పారిశ్రామిక వాడకు వెళ్లే రహదారిలో సారిపల్లి సెంట్రల్ నర్సరీ ఉంది. ఈ నర్సరీలో నగర వనం ఏర్పాటు చేయాలని 2015లో అటవీశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే అప్పటి టీడీపీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులు మంజూరు చేయకపోవడంతో ఇప్పటికీ పనులు పూర్తికాక, ప్రారంభానికి నోచుకోని దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చొరవ తీసుకుని నగర వనాన్ని ప్రారంభించాలని, సందర్శకులకు అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పించింది. దీని కొసం అవసరమైన చర్యలు చేపట్టాలని తాజాగా అటవీశాఖ అధికారులకు కలెక్టర్ ఎ. సూర్యకుమారి ఆదేశాలు జారీచేశారు. దీంతో డీఎఫ్ఓ శంబంగి వెంకటేష్ తాజాగా నగర వనాన్ని సందర్శించారు. ఇంకా అవసరమైన ఏర్పాట్లు, సౌకర్యాలను కల్పించి వచ్చే ఏడాది వేసవి ప్రారంభానికి సందర్శకులను అనుమతించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. నగర వనం ద్వారా జిల్లా వాసులకు ఆహ్లాదంతో పాటు ఆరోగ్యాన్ని అందించడమే లక్ష్యమని చెబుతున్నారు. వచ్చే ఏడాది అందుబాటులోకి సారిపల్లి సెంట్రల్ నర్సరీలో ఏర్పాటుచేస్తున్న నగర వనాన్ని వచ్చే ఏడాది సందర్శకులకు అందుబాటులోకి తీసుకొస్తాం. 25 హెక్టార్ల సువిశాలమైన ప్రదేశంలో ఇప్పటికే రూ.42 లక్షలతో పలు సౌకర్యాలు, ఏర్పాట్లు పూర్తిచేశాం. ప్రహరీ, ఆర్చ్ నిర్మిస్తాం. అలాగే ఓపెన్ ఆడిటోరియం, ట్రెక్కింగ్ పాత్, కాలువ, పార్క్ తదితరాలను ఏర్పాటు చేయడానికి చర్యలు చేపడతాం. సందర్శకులకు ఆహ్లాదంతో పాటు ఆరోగ్యం అందించడమే నగర వనం లక్ష్యం. శంబంగి వెంకటేష్, డీఎఫ్ఓ, విజయనగరం (చదవండి: డబుల్ ధమాకా ఆఫర్! 15 వేలు ఇస్తే ప్రమోషన్...కోరిన చోట పోస్టింగ్) -
మైండ్ హెల్త్: పల్లె మహిళే మెరుగు..
పల్లె మహిళ పట్టణ మహిళను దాటి ముందుకెళుతుందా?! ‘అవును’ అనే అంటున్నారు మానసిక నిపుణులు. సమస్యలు ఎదురైనా ఏ మాత్రం జంకక పరిష్కార దిశగా అడుగు వేయడంలో పల్లె మహిళే పట్టణ మహిళ కన్నా ముందంజలో ఉందని పెన్సిల్వేనియా ఉమెన్ హెల్త్ స్టడీ ఓ నివేదికను రూపొందించింది. 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసున్న పట్టణ–గ్రామీణ మహిళలపై వీరు చేసిన స్టడీ ద్వారా ఆసక్తికర విషయాలు తెలియ జేశారు. మానసిక సమస్యలు గ్రామీణ మహిళ కన్నా పట్టణ మహిళల్లో ఎక్కువ శాతం ఉన్నట్టు గమనించారు. దీనికి సంబంధించిన కారణాలను విశ్లేషించారు. పల్లె జీవనమే సాంత్వన ‘పట్టణ మహిళ కుటుంబంలో ఉన్నప్పటికీ మానసికంగా ఒంటరితనాన్నే ఫీలవుతుంది. వచ్చిన ఆదాయానికి, పెరుగుతున్న ఖర్చులకు పొంతన ఉండదు. ఇంటర్నెట్ వాడకం కూడా ఇందుకు కారణమే. పల్లెల్లోనూ ఈ ప్రభావం ఉన్నప్పటికీ అక్కడ శారీర శ్రమకు సంబంధించిన పనులు ఎక్కువ. దీనికి తోడు వెన్నంటి భరోసాగా ఉండే వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. తమ సమస్యలను తమలోనే దాచుకుని బాధపడరు. చుట్టుపక్కల ఇళ్ల వారిలో ఎవరికో ఒకరికి చెప్పుకుని ఊరట పొందుతారు. అక్కడ అవకాశాలు తక్కువ. అలాగే, అసంతృప్తులూ తక్కువే’ అంటారు క్లినికల్ సైకాలజిస్ట్ రాధిక. ఎప్పుడైతే సెన్సిటివ్గా, సమస్యలు లేకుండా పెరుగుతారో వారిలో అభద్రతా భావం ఎక్కువ అంటారు నిపుణులు. పల్లెల్లో చిన్నప్పటి నుంచే కష్టపడే తత్త్వం ఉంటుంది. ఇంటి పనులు, బయట పనులు ఒక అలవాటుగా చేసుకుపోతుంటారు. తమకు అవి కావాలనీ, ఇవి కావాలనీ అంచనాలు, ఆశలు పెద్దగా ఉండవు. శారీరకపరమైన పనుల్లో కలిగే అలసట మనసును కూడా సేద తీరుస్తుంది. వాస్తవానికి దగ్గరగా ఉండేలా చేస్తుండటం కూడా మానసిక సమస్యలను దూరం చేస్తుందంటారు నిపుణులు. యాక్సెప్టెన్సీ ఎక్కువ వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఉండటం వల్ల దేనిమీదా ఎక్కువ ఆశలు పెట్టుకోరు. అవి తమ జీవిత భాగస్వామి నుంచైనా సరే. ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు పెట్టాలి.. అనే విషయాల పట్ల సరైన అవగాహన ఉంటుంది. రిసోర్స్ మేనేజ్మెంట్ పల్లెవాసులకే బాగా తెలుసు. అందుకే ఎక్కువ ఒత్తిడికి లోనవరు. వారికి వాతావరణ పరిస్థితుల కారణంగా వచ్చే సమస్యలే అధికం. మిగతావన్నీ వాటి ముందు చిన్నవిగానే కనిపిస్తాయి. పిల్లలకు కూడా ఆ వాస్తవాన్ని పరిచయం చేస్తారు. ఇల్లు, సమాజం నేర్పే పాఠాలు వారిలో మానసిక స్థైర్యాన్ని పెంచుతాయి. పట్టణప్రాంతాల్లో అవకాశాలు కోకొల్లలు. వాటి వల్ల వచ్చే సమస్యలు అంతే! అవి అందరికీ అందుబాటులో ఉండవు. వాటిని అందుకోవడం కోసం ఎలా పరుగులు పెట్టాలా అనే ఆలోచనతో ఉంటుంది పట్టణ మహిళ. తన చుట్టూ ఉన్నవారితో పోల్చుకోవడంతో తనను తాను తక్కువ చేసుకుంటుంది. ఫలితంగా రోజు రోజుకూ తనపై తనకు ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. పల్లెటూరులో ఉన్నవాళ్లు కదా వాళ్లకేం తెలుసు అనేది పట్టణవాసుల అలోచన. కానీ, పల్లెటూరులో ఎప్పుడూ కష్టమే ఉంటుంది. వాటిని ఎదుర్కొనే సమర్థతా ఉంటుంది. నీడపట్టున ఉండే నగరవాసులే కష్టాన్ని ఎదుర్కోలేని సున్నితత్త్వం ఉంటుంది. పట్టణ మహిళ మారాలి పల్లెటూరులో ఉన్నప్పుడు ఏడుపు వస్తే పరిగెత్తుకెళ్లి అమ్మ ఒడిలో తలదాచుకోవడం తెలుసు. చెట్టు కింద సేద తీరడం తెలుసు. మట్టికి దగ్గరగా ఉంటే మానసిక ఒత్తిడి తగ్గుతుందని తెలుసు. పట్టణ జీవనంలో ఎవరికి వారే. ఎవరితోనూ పంచుకోలేని సమస్యలు. కష్టాలు వస్తే ఎదుర్కొనే ధైర్యం సన్నగిల్లుతోంది. అందుకే, ముందు ఇంట్లో మహిళ మనస్తత్వం మారాలి. నెలకు ఒకసారైనా పట్టణం వదిలి, పల్లె వాతావరణంలోకి వెళ్లగలగాలి. ఒత్తిడి దశలను దాటే మార్గాలను పల్లెలే పరిచయం చేస్తాయని గ్రహించాలి. స్వచ్ఛందంగా సమాజానికి ఏ చిన్న పని చేసినా, మానసిక సాంత్వన లభిస్తుందని గ్రహించాలి. పిల్లలకు కూడా ‘నేను పడిన కష్టాన్ని నా పిల్లలు పడకూడదు’ అనుకోకుండా వారికి మన భారతీయ మూలాలను తెలియజేయాలి. – రాధిక ఆచార్య, క్లినికల్ సైకాలజిస్ట్ -
ఎన్నికల బరిలో ‘విజయ్ మక్కల్ ఇయక్కం’
Actor Vijay's fans plan to contest urban local body polls: నటుడు విజయ్ రాజకీయ తెరంగేట్రంపై చాలాకాలంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయన తండ్రి, దర్శకుడు ఎస్ఎం. చంద్రశేఖర్ విజయ్ మక్కల్ ఇయక్కం అంటూ పార్టీ పేరును కూడా రిజిష్టర్ చేయించారు. ఈ విషయంలోనే తండ్రి, కొడుకుల మధ్య విభేదాలు తలెత్తాయి. అయితే విజయ్కి రాజకీయాల్లోకి రావాలన్న కోరిక ఉందని, తన రాజకీయ రంగ ప్రవేశానికి పునాదులు చేసుకుంటున్నారనేది ప్రస్తుత పరిస్థితులను చూస్తే స్పష్టమవుతోంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విజయ్ అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 160 వార్డుల్లో పోటీ చేసి 129 వార్డులలో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో విజయ్ తన పేరును గానీ, ఫొటోలు గానీ వాడరాదని ఆంక్షలు విధించినా అభిమానులు గ్రామీణ ప్రాంతాలలో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసి విజయాన్ని కైవసం చేసుకున్నారు. అనంతరం వారంతా విజయ్ను కలిసి ఫొటోలు దిగి పండుగ చేసుకున్నారు. చదవండి: (నరకం చూపించిన భర్త.. ఐదు నెలల గర్భిణి ఆత్మహత్య) ఇది రాజకీయ వర్గాలను షాక్కు గురి చేసిందనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే నెల 19న జరగనున్న నగరపాలక ఎన్నికల్లో విజయ్ మక్కల్ ఇయక్కం పేరుతో పోటీ చేయడానికి విజయ్ తన అభిమానులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీని గురించి విజయ్ మక్కల్ ఇయక్కం అధ్యక్షుడు బుస్సీ ఆనంద్ గురువారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో నగర పాలక ఎన్నికల్లో అభిమానులు విజయ్ మక్కల్ ఇయక్కం పేరుపై పోటీ చేయవచ్చునని పేర్కొన్నారు. -
భారత్లో మొట్టమొదటిసారి.. ఉద్యోగుల మీద దావా!
Urban Company Sues Women Employees: దేశంలో మొట్టమొదటిసారి ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుందనే చర్చ నడుస్తోంది. సాధారణంగా హక్కుల ఉల్లంఘనల మీద ఉద్యోగులు కంపెనీల మీద కోర్టుకు వెళ్లడం చూస్తుంటాం. అయితే ప్రైవేట్ స్టార్టప్ కంపెనీనే ఉద్యోగులపై దావా వేసిన ఘటన ఇప్పుడు చోటు చేసుకుంది. గురుగ్రామ్(హర్యానా) నగర వేదికగా హోం అండ్ బ్యూటీ సర్వీసులు అందించే ‘అర్బన్ కంపెనీ’.. మహిళా ఉద్యోగిణులపై కోర్టుకెక్కింది. కంపెనీ తీసుకొచ్చిన కొత్త నిబంధనలు తమ తమ ఆదాయాన్ని దారుణంగా దెబ్బ తీస్తున్నాయంటూ.. మహిళా ఉద్యోగిణులు రోడ్డెక్కి నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ల నిరసనను వ్యతిరేకిస్తూ unfair labor practices కింద గురుగ్రామ్ జిల్లా కోర్టుకు వెళ్లింది అర్బన్ కంపెనీ. దీంతో ఉద్యోగిణులు ఉన్నపళంగా నిరసనలను విరమించినట్లు సమాచారం. మ్యానిక్యూర్ సేవల నుంచి కార్పెట్ క్లీనింగ్, చిన్న చిన్న రిపేర్లు.. తదితర సేవలను మొబైల్ యాప్ ద్వారా అందిస్తోంది అర్బన్ కంపెనీ. ఇందుకోసం వేల సంఖ్యలో భాగస్వాములతో(ఆడామగా ఉద్యోగులతో) ఒప్పందం చేసుకుంటోంది. అయితే ఆమధ్య కంపెనీ ఓ కొత్త నిబంధన తీసుకొచ్చింది. దాని ప్రకారం.. సబ్స్క్రిప్షన్ స్కీమ్ తోపాటు భాగస్వాములు(ఉద్యోగిణులు) ముందుగా కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు ప్రతి నెలా కనీస సంఖ్యలో ఉద్యోగాలు, కొత్త భాగస్వామ్య వర్గాలు, కస్టమర్ల కోసం తీసుకొచ్చిన తగ్గింపు పథకం పాటించాల్సి వస్తుంది. ఈ పరిమితులన్నింటి వల్ల తమ ఆదాయానికి గండిపడుతోందన్నది ఉద్యోగిణుల(భాగస్వాముల) అభ్యంతరం. భాగస్వామి పాయింట్తో కొట్టింది! ఈ కొత్త పాలసీకి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల కంటే ముందునుంచే.. ‘బెటర్ పే, వర్కింగ్ కండిషన్’ డిమాండ్లతో అక్టోబర్ నుంచే ఉద్యోగిణులు రోడ్డెక్కడం గమనార్హం. సుమారు 50 మంది ఉద్యోగిణులు గురుగ్రామ్లోని కంపెనీ ముందు నినాదాలతో రాత్రింబవలు ప్రదర్శనలు చేపడుతున్నారు. ఈ తరుణంలో నలుగురు మహిళా ఉద్యోగిణుల పేర్లను చేర్చి మరీ దావా వేసింది అర్బన్ కంపెనీ. వాళ్ల(ఉద్యోగిణుల) చర్యలను అనైతికం, అన్యాయంగా పేర్కొంది కంపెనీ. పైగా వాళ్లను ఉద్యోగిణులుగా కాకుండా ‘భాగస్వాములు’గా దావాలో పేర్కొనడం కేసును మలుపు తిప్పింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు సదరు భాగస్వాములకు(ఉద్యోగిణులకు) లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. అంతేకాదు అర్బన్ కంపెనీ ఆఫీస్ ప్రాంగణంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఊహించని ఈ పరిణామంతో మహిళా ఉద్యోగిణులు బుధవారం తమ నిరసనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. తమ నిరసనలు మాత్రం కొనసాగుతాయని దావాలో పేర్కొనబడిన ఓ ఉద్యోగిణి చెప్తుండడం విశేషం. ఇదిలా ఉంటే మహిళా ఉద్యోగిణులను భాగస్వామ్యులుగా ప్రకటించుకుంటూ దేశవ్యాప్తంగా 35 వేల మందితో పని చేస్తోంది అర్బన్ కంపెనీ. భారత్తో పాటు అసీస్, సింగపూర్లోనూ సేవలిందిస్తోంది. ఇప్పుడు భాగస్వాములనే కారణాన్ని కోర్టులో పేర్కొంటూ.. వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. గిగ్ సెక్టార్లో వణుకు మన దేశంలో యాభై లక్షల మందికి పైగా గిగ్(చిన్న చిన్న పనులు.. ప్రదర్శనలు, ఇతరత్ర సేవలు.. స్టార్టప్ తరహా కంపెనీల్లో) ఎంప్లాయిస్ ఉన్నట్లు ఆల్ ఇండియా గిగ్ వర్కర్స్ యూనియన్ చెప్తోంది. వీళ్ల వల్ల గిగ్ ఎకానమీ సమర్థవంతంగా నడుస్తోంది. అర్బన్ కంపెనీ వ్యవహారం ఉద్యోగుల్లో అభద్రత భావాన్ని కలిగిస్తోందని, తద్వారా గిగ్ సెక్టార్కు చాలా మంది దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆల్ ఇండియా గిగ్ వర్కర్స్ యూనియన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే వీళ్ల హక్కుల రక్షణకు ఎలాంటి చట్టం సమర్థవంతంగా అమలు కావడం లేదు. ఫుడ్ డెలివరీ, రైడ్ ఇలాంటి యాప్స్లో పని చేసే ఉద్యోగులకు భద్రత కరువైంది. కరోనా పరిస్థితుల తర్వాత ఇది మరీ ఘోరంగా ఉంటోంది. ఈ తరుణంలో ఈ ఏడాది అక్టోబర్లో 35వేలమంది గిగ్ ఎంప్లాయిస్తో కూడిన ఓ యూనియన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఉబెర్, ఒలా, జొమాటో, స్వీగ్గీ.. ఇలా కంపెనీల నుంచి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ కలిగించాలంటూ ఉన్నత న్యాయస్థానాన్ని వేడుకుంది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ‘సోషల్ సెక్యూరిటీ చట్టం’ను 2020లోనే ప్రతిపాదించినప్పటికీ.. అది ఇంకా అమలుకు నోచుకోవడం లేదు. -సాక్షి, వెబ్ స్పెషల్ -
Statistics Survey: ధనిక, పేదల మధ్య భారీ అంతరం
న్యూఢిల్లీ: దేశంలో ధనిక, పేదల మధ్య భారీ అంతరం కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా 10 శాతం పట్టణ వాసుల్లో సగటున ఒక్కో కుటుంబం వద్ద 1.5 కోట్ల మేర ఆస్తులు ఉండగా.. దిగువనున్న పేదల వద్ద రూ.2,000 (ఒక్కో కుటుంబం) మించి లేదు. జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) నిర్వహించిన ‘ఆల్ ఇండియా డెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సర్వే 2019’లో ఈ వివరాలు తెలిశాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి పట్టణాలతో పోలిస్తే మెరుగ్గానే ఉంది. అగ్రస్థాయి 10 శాతం కుటుంబాల వద్ద సగటున రూ.81.17 లక్షల ఆస్తులు ఉంటే.. పేద కుటుంబాల సగటు ఆస్తి రూ.41,000గా ఉంది. ఈ విధంగా చూస్తే పట్టణాల కంటే పల్లెల్లోనే పెదల పరిస్థితి కాస్త మెర్గుగా ఉందని ఈ సర్వే పేర్కొంది. గతేడాది జనవరి నుంచి డిసెంబర్ మధ్య 77వ జాతీయ శాంపిల్ సర్వేలో భాగంగా ఎన్ఎస్వో ఈ వివరాలను సమీకరించింది. -
పల్లె, పట్టణ ప్రగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు (కేసీఆర్) ఆదివారం సమీక్ష నిర్వహించారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంపై సీఎం సమావేశమయ్యారు. జిల్లాల వారీగా పనుల పురోగతిని కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమాల తదుపరి లక్ష్యాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. చదవండి: హైదరాబాద్: ముగ్గురు మహిళల అదృశ్యం కలకలం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. వెబ్సైట్ నిలిపివేత! -
Urban Eco Farming: వీకెండ్స్ వ్యవసాయం
ఫైనాన్స్ రంగంలో పని చేసే విశాఖకు చెందిన ప్రణయశ్రీకి సెంటు పంట భూమి కూడా లేదు. కానీ, వారం వారం ఆమె తన కుటుంబంతో సహా పొలానికి వెళుతుంటారు. ఆమె కుటుంబంలో ఎవరికీ వ్యవసాయం తెలియదు. కానీ, వారే తమ కుటుంబానికి కావలసిన కూరగాయలను సేంద్రియ విధానంలో పండించుకుంటున్నారు. ఆశ్చర్యంగా ఉంది కదూ..! అవును.. ‘అర్బన్ ఏకో ఫార్మింగ్’ వినూత్న ప్రయత్నంతో ప్రణయశ్రీకి ఇది సుసాధ్యమవుతోంది.. ఇలా..! నగరవాసులైన నవతరం చేస్తున్న ఆధునిక సహజ వ్యవసాయ పోకడ ఇది. మన కూరగాయలు మనం పండించుకోవడానికి మనకి ఎకరాల కొద్దీ పొలం ఉండనక్కర లేదు. కుటుంబానికి మూడు మడులు (600 చదరపు అడుగులు) చాలు. సేంద్రియ ఆహారంపైన, వీకెండ్స్లో మనకి నచ్చిన కూరగాయాల్ని పండించుకోవచ్చు. అది కూడా ఎటువంటి హానికరమైన ఎరువులు వాడకుండా.. సేంద్రియ విధానంలోనే. విశాఖ, విజయనగరం శివారు ప్రాంతాల్లో ఈ తరహా వ్యవసాయం ఇప్పుడు నయా ట్రెండ్గా మారింది. ప్రస్తుతం సేంద్రియ ఆహారోత్పత్తులకు గిరాకీ పెరుగుతోంది. రసాయనాల్లేని ఆహారంపై ప్రజలు అవగాహన పెంచుకుంటున్నారు. వీలున్నవారు తమ ఇళ్లపైనే ’సేంద్రియ ఇంటి పంటలు’ పెంచుకుంటున్నారు. అయితే, ఆ అవకాశం లేని వారు నగరానికి దగ్గరలో ఇంటిపంట మడులను అద్దెకు తీసుకొని వారాంతాల్లో సేంద్రియ సేద్యం చేస్తున్నారు. విశాఖకు చెందిన ఉషా గజపతిరాజు తమ అపార్ట్మెంట్ భవనంపైనే సేంద్రియ కూరగాయలు, పండ్లను అనేక ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారు. ఇంటిపంటలపై ఎందరికో శిక్షణ ఇస్తున్నారు. అయితే, సేంద్రియ ఇంటిపంటల సాగుపై ఆసక్తి ఉండి, ఇంటిపై సాగు చేసుకునే అవకాశం లేక సతమతమయ్యే వారి కోసం ఉష కొత్త ఆలోచన చేశారు. విజయనగరం జిల్లా బసవపాలెంలో 30 ఎకరాలలో ’అర్బన్ ఎకో ఫామ్స్’ను ప్రారంభించి, ప్రజలను భాగస్వాములు చేస్తున్నారు. కుటుంబానికి మూడు మడులు అద్దెకిచ్చి.. వారాంతాల్లోæ వారే వచ్చి కూరగాయలు పండించుకునేలా మెలకువలను నేర్పిస్తున్నారు. ఆ పంటల బాగోగులను అర్బన్ ఎకో ఫామ్స్ సిబ్బంది చూసుకుంటారు. వినియోగదారులకు మడులు చూసుకోవడానికి వెళ్లలేకపోతే కూరగాయలను ఆ సిబ్బందే డోర్ డెలివరీ చేస్తారు. నలుగురున్న ఒక కుటుంబానికి నెలకి సరిపడా కూరగాయలు పండించడానికి మూడు ’బెడ్లు’ (600 చదరపు అడుగుల స్థలంలో మూడు ఎత్తు మడులు) అవసరం అవుతాయి. ఇందులో బీర, బీట్ రూట్, క్యారెట్, ముల్లంగి, తోటకూర, గోంగూర, స్వీట్ కార్న్, ఆనప, వంగ, కాకర, బెండ, దోస, మిరప, ఉల్లి కాడలు.. ఇలా అనేక రకాలైన పంటలను ఆ మడుల్లో సాగు చేస్తారు. వీటితో పాటు కొందరు వినియోగదారుల కోసం జామ, బొప్పాయి మొక్కలు కూడా నాటుతున్నారు. తృప్తిగా పండించుకొని తింటున్నాం.. మన పరిసరాలన్నీ కాలుష్యమయమే. ఇది ఎవరూ కాదనలేని నిజం. నగరాలు, పట్ణణాలైతే ఇక కాలుష్యంతో కలిసి జీవనం సాగించాల్సిందే. తిండిలో అన్నీ కెమికల్సే. ఇది అనేక జబ్బులకు కారణం అవుతోంది. ఇప్పుడిప్పుడే ఈ విషయాన్ని గ్రహిస్తున్న చాలామంది సేంద్రియ విధానంలో పండిస్తున్న ఉత్పత్తులంటే ఆసక్తి చూపుతున్నారు. సాధారణ కూరగాయల ధరలతో పోలిస్తే సేంద్రియ విధానంలో పండిన కూరగాయల ధరలు ఎక్కువగా ఉండటం, పైగా అవి నిజంగానే ఆర్గానిక్ వెజిటబుల్సా కాదా? అనే అనుమానం కూడా వస్తుంది. అటువంటి సమయంలో నాకు ’అర్బన్ ఎకో ఫామ్స్’ కోసం తెలిసింది. వెంటనే నేను కొన్ని మడులను అద్దెకు తీసుకున్నాను. అందులో కొన్ని రకాల కూరగాయల్ని పెంచుతున్నాను. నేను నెలకి కూరగాయలకు ఎంత ఖర్చు పెడుతున్నానో, దీనికీ అంతే ఖర్చు అవుతుంది. పైగా సేంద్రియ విధానంలో కూరగాయాల్ని నేనే పండించుకుని తింటున్నాననే తృప్తి కలుగుతోంది. నాకు వ్యవసాయం కొత్తే అయినా, క్రమక్రమంగా తెలుసుకుంటూ.. సేంద్రియ వ్యవసాయంలో మెలకువలు నేర్చుకుంటున్నాను. – మనిష్, విశాఖపట్నం వారానికోసారి పొలానికి పిక్నిక్ అర్బన్ ఎకో ఫామ్ నగర శివారు ప్రాంతంలో ఉండటంతో ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. చాలామంది వీకెండ్స్ ఎంజాయ్ చేసేందుకు ఇటువంటి ప్రదేశాలకు రావాలనుకుంటారు. ఇప్పుడు ఎకో ఫామ్స్లో ఫ్లాట్స్ తీసుకోవడం వలన వీకెండ్స్ ఎంజాయ్ చేయడంతో పాటు సొంతంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. కానీ ఉద్యోగం చేసే నాకు వ్యవసాయం తెలియదు. ఎకో ఫామ్స్లో నాకిష్టమైన కాయగూరల్ని పండించుకుంటున్నాను. నా కుటుంబంతో వారం, వారం ఇక్కడికి పిక్నిక్లా వచ్చి, వ్యవసాయం గురించి తెలుసుకున్నాను. మట్టితోనూ, మొక్కలతోనూ సమయాన్ని గడపడం ఆనందంగా ఉంది. ఇప్పుడు మేము పండించిన కాయగూరల్నే ఇంటిల్లపాదీ తింటున్నాం.’’ – డాక్టర్ జయ, విశాఖపట్నం చేస్తూ నేర్చుకోవడం..! నిజానికి నేను వత్తి రీత్యా డైటీషియన్ని. ఖాళీ సమయాల్లో టెరస్ర్ ఫార్మింగ్, చెత్త నుంచి కంపోస్టు తయారు చేయటం నేర్చుకున్నాను. ఈ క్రమంలో ప్రజలు సేంద్రియ ఉత్పత్తులపై చూపిస్తున్న ఆసక్తిని గమనించాను. అయితే, మార్కెట్లో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ పేరుతో లభించేవన్నీ నిజమైన ఆర్గానిక్ పదార్థాలు కావని భావించి.. నేనే స్వయంగా సేంద్రియ వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాను. ఇందులో ఆసక్తి ఉన్న వారిని భాగస్వాములను చేశాను. ఒక్కొక్కరికి ఫ్లాట్ల చొప్పున కొంత స్థలం కేటాయించి (గరిష్టంగా 600 అడుగులు) వారికి కావల్సిన కూరగాయలు పండిస్తాం. అలా పండించిన వాటిని వారానికోసారి వారి ఇంటికే స్వయంగా అందిస్తాం. విత్తనం నుంచి పంట చేతికొచ్చే వరకు సాగు చేసే విధానాన్ని ఫోటోలు తీసి కస్టమర్ల సెల్ఫోన్లకు పంపిస్తాను. ఆసక్తి ఉన్న వినియోగదారులు కావాలంటే వారే తమ ఫ్లాట్లలో పంటలు పండించుకుంటారు. చాలామంది వీకెండ్లో వచ్చి ఇక్కడ వ్యవసాయం చేస్తారు. వ్యవసాయంపై అవగాహన లేని వారికి మేం ఇక్కడ నేర్పిస్తాం. లెర్నింగ్ బై డూయింగ్ విధానంలో ఇక్కడ ఫార్మింగ్ సాగుతుంది. ఈ ఎకో ఫార్మ్లో 25 రకాలైన కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నాం. వీటిలో వినియోగదారులు తమ అభిరుచి మేరకు ఏవైనా 12 రకాలను ఎంచుకొని, వారి ఫ్లాట్స్లో పండించుకోవచ్చు లేదా మేమే వారి కోసం పండిస్తాం. ఫార్మింగ్ మొదలు పెట్టిన 40 రోజుల నుంచి ప్రతి వారం వినియోగదారుడికి 8 కిలోలు.. వారు పండించుకున్న కూరగాయలను, ఆకుకూరలను బాక్సులలో పెట్టి అందిస్తాం. 600 అడుగుల స్థలాన్ని అద్దెకివ్వడం నుంచి ఇంటికి కూరగాయలు అందించడం వరకు అన్ని మేమే చేస్తాం. వారి స్థలంలో వేసుకునే మొక్కలు, విత్తనాలు, సేంద్రియ ఎరువులన్నీ మేమే సమకూరుస్తాం. ఆవు పేడ, మూత్రం, మొక్కల ఆకులతో తయారు చేసిన ఎరువులే వాడతాం. వీకెండ్స్, హాలీడేస్లో ఇక్కడి వచ్చి స్వయంగా పండించుకోవడం వారికి ఆనందాన్ని ఇవ్వడంతో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో గడపడం వారికి మానసిక ఉల్లాసాన్ని కూడా కలిగిస్తుంది. – ఉషా గజపతిరాజు, (9949211022) ‘అర్బన్ ఏకో ఫార్మింగ్’ నిర్వాహకురాలు – బోణం గణేష్, సాక్షి ప్రతినిధి, విజయనగరం -
చిటికెలో చిట్టా
అర్బన్ ఇన్ఫర్మేషన్ సిస్టంను అందుబాటులోకి తెచ్చేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమవుతోంది. ఏ స్థానిక సంస్థ అయినా సమర్థంగా పనిచేయాలన్నా, ప్రజలకు ఉత్తమ సదుపాయాలు కల్పించాలన్నా ఎప్పటికప్పుడు ఆయా అంశాలకు సంబంధించిన తాజా సమాచారం అందుబాటులో ఉండాలి. గ్రేటర్లో కోటిమందికి వివిధ రకాల సేవలందిస్తున్న జీహెచ్ఎంసీ వద్ద ఇలాంటి సమాచారం లేకపోవడంతో ఆశించినంత స్థాయిలో రాణించలేకపోతోంది. సమస్త సేవలన్నింటినీ వెనువెంటనే అందించేందుకు జీఐఎస్ ఆధారిత, ప్రాదేశిక మ్యాప్లతో కూడిన అర్బన్ ఇన్ఫర్మేషన్ సిస్టంకు ప్రత్యేక వెబ్పోర్టల్ను అందుబాటులోకి తెచ్చేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమవుతోంది. సాక్షి, హైదరాబాద్: అర్బన్ ఇన్ఫర్మేషన్ సిస్టం కోసం ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేయడంతోపాటు పర్యవేక్షణకు ఉన్నత స్థాయిలో స్పెషలాఫీసర్ను నియమించనున్నారు. ఈ సిస్టం అందుబాటులోకి వస్తే జీఐఎస్ మ్యాపింగ్తో సహా ప్రతి ఆస్తికి సంబంధించిన సమాచారం కూడా అందుబాటులోకి రానుంది. నగర ప్రజలకు సేవలందించే వివిధ విభాగాలను సమన్వయం చేసుకొని దీన్ని రూపొందిస్తారు. టౌన్ప్లానింగ్, ఐటీ విభాగాలు ఇందులో ముఖ్యభూమిక వహించనున్నాయి. ఇది అందుబాటులోకి వస్తే, ఏ సమాచారం కావాలన్నా చిటికెలో తెలుస్తుంది. ఉదాహరణకు ఒక రోడ్డుకు సంబంధించిన సమాచారమే కావాలంటే.. దానిని ఎప్పుడు నిర్మించారు? దీనికోసం ఎన్ని ఆస్తులు సేకరించారు? వంటి వివరాలు సహా పూర్తి సమాచారం తెలుస్తుంది. అన్ని విభాగాలకు సంబంధించిన తాజా వివరాలు ఎప్పటికప్పుడు ఆటోమేటిక్గానే పోర్టల్లోకి చేరతాయి. తద్వారా అత్యంత తాజా సమాచారం తెలుస్తుంది. వివిధ విభాగాలు.. ⇔ ఐటీ, ఇంజినీరింగ్, ప్రాజెక్టులు, టౌన్ప్లానింగ్, బయోడైవర్సిటీ, రవాణా, ఫైనాన్స్, రెవెన్యూ.. అన్ని విభాగాల్లో జరిగే పనులు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతాయి. ⇔ తద్వారా నిర్ణీత సమయంలో ఎన్ని భవనాలను అనుమతులిచ్చారు.. ఎంత ఆస్తిపన్ను పెరిగింది.. వంటి వివరాలు తెలుసుకునే సదుపాయం ఉంది. ⇔ అంతేకాదు.. మలేరియా, డెంగీ వంటి కేసులు ఏ ప్రాంతంలో ఏ నెలలో ఎన్ని ఉన్నాయి వంటివి కూడా తెలిస్తే ముందు జాగ్రత్తలు తీసుకునే వీలుంది. జీహెచ్ఎంసీ విస్తీర్ణం నుంచి జోన్లు, సర్కిళ్ల వారీగా, మొత్తం నగరానికి సంబంధించి స్లమ్లెన్ని.. వాటిల్లో నివసిస్తున్నవారెందరు, ట్రాఫిక్ ఐలాండ్లు, ఓపెన్స్పేస్లు, జీహెచ్ఎంసీ మార్కెట్లు, ఎస్టేట్స్ దుకాణాలు, శ్మశానవాటికలు, ప్లేగ్రౌండ్స్, స్విమ్మింగ్పూల్స్, జిమ్లు, రోజుకు వెలువడే చెత్త, చెత్త రవాణా వాహనాలు, పారిశుద్ధ్య కార్మికులు, స్వచ్ఛ ఆటోలు , ఫాగింగ్ మిషన్లు.. నగరంలో నెలవారీ జననాలు, మరణాలు.. ప్రార్థనాలయాలు, స్కూళ్లు, ఆస్పత్రులు.. ఇలా సమస్త సమచారం అందుబాటులో ఉంటుంది. తద్వారా ఏ పని చేయాలన్నా అందుకు సంబంధించిన వనరులు, సమాచారం సిద్ధంగా ఉంటుంది. తద్వారా నిర్వహణ సామర్ధ్యం పెరుగుతుంది. కీలకంగా డేటాబేస్.. ఎప్పటికప్పుడు అప్డేట్.. ఆయా విభాగాల వారీగా ప్రస్తుతమున్న వనరులు, సిబ్బంది.. అది నిర్వహించే పనులు, పనిచేస్తున్నవారు, సంస్థాగత నిర్మాణం, ప్రస్తుత పరిస్థితి, వర్క్ఫ్లో, సమస్యల వంటివాటిని పరిగణనలోకి తీసుకోవడంతోపాటు భవిష్యత్ ప్రణాళికలు, వాటిని పూర్తిచేయాల్సిన సమయం, అందుకు అవసరమైన సమాచారంతోనూ సమాంతర వ్యవస్థ పని చేస్తుందని, అన్నింటికీ డేటాబేస్ కీలకంగా ఉంటుందని, అది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ తాజా పరిస్థితి అందుబాటులో ఉంటుందని సంబంధిత అధికారి తెలిపారు. ఐటీ పరిభాషలో.. ఐటీ పరిభాషలో మానిటరింగ్ అప్లికేషన్స్ ఇన్ఫర్మేషన్ సిస్టం, లేయర్ ఆపరేషన్స్, డేటా అప్డేట్, ఆటోమేటిక్ డాక్యుమెంట్ అడ్జస్ట్మెంట్, బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ ఎంక్వైరీ, ఈ– అప్లికేషన్స్, తదితరమైనవి ముఖ్య విభాగాలుగా ఈ సిస్టమ్ పని చేయనుంది. -
ఆగ్రా మెట్రోని ప్రారంభించనున్న ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : ఆగ్రా మెట్రో రైల్వే ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖారారైంది. డిసెంబర్ 7న ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా ఆగ్రా మెట్రో రైలు ప్రాజెక్టు ప్రారంభం కానుంది. తొలి విడతగా మూడు మెట్రో స్టేషన్లను ప్రారంభించనున్నారు. వర్చువల్ పద్దతిలో జరిగే ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో పాటు ప్రముఖులు పాల్గొంటారని ఆగ్రా జిల్లా మెజిస్టే్ట్ ఎన్ ప్రభుసింగ్ తెలిపారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను సమీక్షిస్తున్నామన్నారు. తొలివిడతలో తాజ్ఈస్ట్గేట్, బసాయ్, ఫతేహాబాద్ రోడ్డు స్టేషన్లు ఉన్నాయి. రూ.273 కోట్లతో ఫతేహాబాద్ 26 నెలల్లో పూర్తవుతుందని అంచనా. కేంద్ర క్యాబినెట్ మెట్రో ప్రాజెక్ట్కి ఫిబ్రవరి 28, 2019లోనే ఆమోదం తెలిపింది. అనుకూలమైన అర్బన్, సిటీ ప్రాంతాల్లో మొదటగా అభివృద్ధి చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజారవాణాకు అనుగుణంగా షాపింగ్ మాల్స్ తదితర ప్రాంతాలను ఎంచుకుని తోలి విడతలో ఫతేహాబాద్లో ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన డీఆర్పీ ప్రకారం రెండు కారిడార్లు కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొందాయి. నగరంలోని ప్రముఖ టూరిస్ట్ ప్రాంతాలైనా తాజ్మహల్, ఆగ్రాపోర్ట్, ఎత్మదుల్లా, సికింద్రాతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులు, మార్కెట్లు ఉన్నాయి. మొత్తం నగరంలో 27 స్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు. నగరంలో29.4 కి.మీ మేర మెట్రో రైల్వే కారిడార్ను నిర్మించనున్నారు. -
పట్టణ మహిళల్లో అధిక బరువు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పట్టణ మహిళలు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఆరోగ్య గణాంకాల విభాగం రూపొందించిన 2019–20 నివేదికలో పేర్కొంది. 15–49 ఏళ్ల వయసున్న మొత్తం మహిళల్లో 28.1 శాతం మంది అధిక బరువుతో బాధపడుతుండగా, పట్టణాల్లోనే 39.5 శాతం మంది అధిక బరువుతో ఉన్నారని తెలిపింది. అందులో తక్కువ బరువు ఉన్న మహిళలు 23.1 శాతం ఉన్నారు. కాగా, రాష్ట్రంలో మహిళలను రక్తహీనత వేధిస్తోంది. 15–49 ఏళ్ల వయసున్న మహిళల్లో 56.7 శాతం మంది రక్త హీనతతో బాధపడుతున్నారు. వీరిలో గర్భిణీలు 48.2 శాతం మంది ఉండటం గమనార్హం. అధిక రక్తపోటు, మధుమేహ సమస్యలను ఎదుర్కొంటున్న వారు కూడా ఉన్నారు. అధిక బీపీ ఉన్న మహిళలు 19.8 శాతం, పురుషులు 18.2 శాతం ఉన్నారు. డయాబెటిస్తో ఉన్న మహిళలు 6.9 శాతం, పురుషులు 6 శాతం ఉన్నారని కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో పౌష్టికాహార లోపం కారణంగా బాధపడుతున్న ఐదేళ్ల లోపు చిన్నారుల్లో వయసుకు తగ్గ ఎదుగుదల లేని వారు 28.1 శాతం కాగా, బక్కచిక్కిన పిల్లలు 18 శాతం, బరువు తక్కువగా ఉన్న వారు 28.5 శాతంగా నమోదయ్యారు. వైద్యం పొందడంలో మూడో స్థానం.. ఆరోగ్య పథకాలు, వివిధ బీమా పథకాల ద్వారా వైద్యం పొందే కుటుంబాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలో మూడో స్థానంలో ఉంది. రాష్ట్రంలో 66.4 శాతం కుటుంబాలకు ఈ సౌకర్యం ఉంది. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యంలో చికిత్స పొందుతున్నవారు 40.5 శాతం మంది ఉండగా, మిగిలిన వారు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నివేదిక పేర్కొంది. ఇవీ ఇతర వివరాలు.. ►ఆరోగ్య కార్యకర్తల ద్వారా జరిగే జననాలు రాష్ట్రంలో 91.4 శాతం ఉన్నాయి. ►రాష్ట్రంలోని చిన్న పిల్లల్లో పూర్తిస్థాయిలో టీకాలు పొందేవారు 68.1 శాతం. జాతీయ సగటు 62 శాతం. ►15–49 ఏళ్ల వయసు వారిలో వారానికోసారి మద్యం సేవించే మహిళలు 28.5 శాతం ఉంటే, పురుషులు 45.5 శాతం ఉన్నారు. ►15–49 ఏళ్ల వయసు వారిలో పొగాకు తాగేవారు 70.6% పురుషులు, 48.8% మంది మహిళలు ఉన్నారు. ►6 నెలలలోపు తల్లిపాలు తాగే పిల్లలు 67.3 శాతం. ►2011లో దేశ జనాభా 121 కోట్లు ఉం టే, 2016 నాటికి 129 కోట్లకు చేరు కుంది. 2021 నాటికి 136 కోట్లు, 2026 నాటికి 142.30 కోట్లు, 2031 నాటికి 147.50 కోట్లు, 2036 నాటికి 151.83 కోట్లకు చేరుకుంటుందని తెలిపింది. -
పట్టణ ప్రగతికి ప్రత్యేక సాఫ్ట్వేర్
సాక్షి, హైదరాబాద్: పట్టణ ప్రగతి అమలు కోసం మున్సిపల్ పరిపాలన శాఖ రూపొందించిన సాఫ్ట్వేర్ను మరింత సరళీకరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సూచించారు. ఈ నెల 24 నుంచి ప్రారంభమయ్యే పట్టణ ప్రగతి కార్యక్రమానికి సంబంధించి గురువారం బీఆర్కేఆర్ భవన్లో ఆయన సమీక్ష నిర్వహించారు. వార్డులు, మున్సిపాలిటీల వారీగా సమాచారం సేకరించడంతో పాటు, ప్రతీ వార్డుకు ఒక నోడల్ అధికారిని నియమించాలని, పట్టణ ప్రగతిలో పాల్గొనేందుకు మున్సిపాలిటీ స్థాయిలో అధికార బృందాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ప్రతీ వార్డు స్థాయిలో నాలుగు కమిటీలు ఏర్పాటు చేయడంతో పాటు ఒక్కో కమిటీలో 15 మంది సభ్యులు ఉండేలా చూడాలన్నారు. కమిటీల ఏర్పాటుతో పాటు కమిటీల సమాచారాన్ని అప్లోడ్ చేయడంలో కొన్ని జిల్లాలు వెనుకంజలో ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్యం, హరితహారం, కమ్యూనిటీ టాయిలెట్ల కోసం ప్రణాళిక, స్మశాన వాటికలు, నర్సరీల అభివృద్ధి, సమీకృత కూరగాయలు, మాంసం మార్కెట్లు, ఆట స్థలాలు, పార్కులు తదితరాలపై దృష్టి సారించాలన్నారు. నిరక్షరాస్యులను గుర్తించేందుకు సర్వే నిర్వహించాలన్నారు. పట్ట ప్రగతి కోసం ఫిబ్రవరి, మార్చి నెలకు సంబంధించి 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి జీహెచ్ఎంసీకి రూ.156 కోట్లు, ఇతర మున్సిపాలిటీలకు రూ.140 కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేసిందన్నారు. సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, సీడీఎంఏ సత్యనారాయణ, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దిశ చట్టంపై తిరుపతి అర్బన్ సీఐల ప్రశంసలు
-
అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని తెలీదా?
సాక్షి, విశాఖపట్టణం : విశాఖ నగర టీడీపీ పార్టీ అధ్యక్షుడు రెహ్మాన్, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ల మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. సంస్కారవంతమైన రాజకీయ నేతగా వ్యవహరించాలని రెహ్మాన్ వాసుపల్లికి లేఖ రాయడం చర్చనీయాంశమైంది. పార్టీ అధ్యక్షునిగా తనకు పగ్గాలు అప్పగించాలన్న నైతిక బాధ్యత కూడా లేదా? అని ఆయన లేఖలో ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా కూడా సరిగా వ్యవహరించట్లేదనేది తన వ్యక్తిగత అభిప్రాయమంటూ ఘాటుగా విమర్శించారు. ఇలాంటి వ్యవహారశైలిపై చంద్రబాబుకు నివేదిక ఇస్తానని లేఖలో పేర్కొన్న రెహ్మాన్, మూడు నెలలుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న వాసుపల్లిని ప్రవర్తన మార్చుకుని చురుకుగా పాల్గొనాలని అల్టిమేటమ్ జారీ చేశారు. -
అర్బన్ వాలంటీర్ పోస్టులకు 1.20 లక్షల దరఖాస్తులు
-
అందుబాటులో పౌర సేవలు
సాక్షి, అచ్చంపేట : పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా మున్సిపల్ కార్యాలయంలో పౌరసేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కేంద్రం ద్వారా 34రకాల సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రజలు తమ సమస్యలను ఫోన్, ఈమెయిల్, నేరుగా సంప్రదించి అధికారులకు తెలిపే వెసులుబాటును కల్పించింది. ఆయా సేవలకు దరఖాస్తు చేసుకునే వారు సమర్పించాల్సిన పత్రాలకు సంబంధించిన వివరాలను గోడలపై, బోర్డులపై రాసి ఉంచారు. సిటిజన్ చార్టర్ బోర్డును ఏర్పాటు చేశారు. దరఖాస్తు విధానం ఈవోడీబీ(ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్) సేవలను ఆన్లైన్ ద్వారా ఇంటి నుంచే పొందే వీలు ఉంటుంది. ఆయా పనుల నిమిత్తం కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. దరఖాస్తుదారుడికి తన దరఖాస్తుకు సంబంధించి జరుగుతున్న పని ఎప్పటికప్పుడు మొబైల్కు మెసేజ్ వస్తుంది. సిటిజన్ చార్టర్ నిబంధనల ప్రకారం గడువులోగా దరఖాస్తులను పూర్తి చేయాల్సి ఉంటుంది. మున్సిపల్ పరిధిలోని ఏదైనా విభాగంలో దరఖాస్తు చేయాలనుకునే వారు ఈ– ఆఫీస్ ద్వారా ఆన్లైన్ నమోదు చేయాలి. వచ్చిన దరఖాస్తులను కమిషనర్ పరిశీలించి అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నాయా లేదా అనే విషయాలను పరిశీలించిన అనంతరం అనుమతులు జారీ చేస్తారు. సేవలను వినియోగించుకోవాలి పట్టణ ప్రజలు పౌర సేవా కేంద్రం సేవలను వినియోగించుకోవాలి. గడువులోగా సర్టిఫికెట్లు పొందవచ్చు. పైరవీలకు తావే లేదు. 30కి పైగా సేవలు అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని సేవలు అందుబాటులోకి వస్తాయి. పారదర్శకత పెంచేందుకే సేవా కేంద్రం ఏర్పాటు చేశాం. – నాయిని వెంకటస్వామి, మున్సిపల్ కమిషనర్, అచ్చంపేట -
ఆపరేషన్ అర్బన్ మావోయిజం
సాక్షి, హైదరాబాద్: అడవుల్లో పట్టుకోల్పోతున్నాం.. కంచుకోటలనుకున్న ప్రాంతాలపై పట్టు సడలుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సిద్ధాంతాన్ని బతికించుకోవాలంటే ఏం చేయాలి? ఇదీ 14 ఏళ్లకు ముందే మావోయిస్టులు, వారి సిద్ధాంతకర్తల మధ్య జరిగిన మేధోమథనం. ఇందులో నుంచి పుట్టిందే ‘అర్బన్ మావోయిజం’. నగరాలు, పట్టణాల్లో నివసిస్తున్న సంఘటిత, అసంఘటిత వర్గాలను ఏకంచేసి ఉద్యమాలు నిర్వహించడమే ఈ వ్యూహం. 14 ఏళ్ల క్రితం మావో యిస్టులు రచించిన ఈ వ్యూహం.. గత కొంతకాలంగా వేగంగా విస్తరిస్తోంది. ఈ విషయం మాత్రం పోలీసుల రాడార్లోకి వచ్చింది ఈ ఏడాది జనవరిలోనే. భీమా–కోరేగావ్ ఘటన తర్వాత మహారాష్ట్ర పోలీసుల విచారణలో వెల్లడైన ఈ ‘గోల్డెన్ కారిడార్’వ్యవహారం.. ఏపీ, తెలంగాణ పోలీసులను ఆందోళనకు గురిచేస్తోంది. మావోయిస్టులంటే అడువుల్లోనే ఉండాలి.. పోలీసులు, ప్రజాప్రతినిధులపై దాడులు చేయాలన్న ఆలోచననుంచి కాస్త విభిన్నంగా.. నగరాలు, పట్టణాల్లో సైతం ఉద్యమాల నిర్వహణకు కార్యరూపం దాలుస్తున్నట్టు వరుసగా అర్బన్ మావోయిస్టుల అరెస్టులతో వెల్లడైంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఈ వ్యవహారంలో జరిగిన వరుస అరెస్టులతో.. పోలీస్ శాఖకు స్పష్టత వచ్చినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అర్బన్ మావోయిజం మావోయిస్టు పార్టీ 2004లో తీసుకున్న కీలక నిర్ణయం అర్బన్ నక్సలిజం. నగరాలు, పట్టణాల్లో పనిచేస్తున్న కార్మికులు, ఇతర వర్గాలను ఒకతాటిపైకి తీసుకొచ్చి ఉద్యమం రూపంలో తమకు అనుకూలంగా మార్చుకోవలన్నది ఈ వ్యూహం వెనక ఉద్దేశమని ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. పద్నాలుగేళ్ల క్రితం తీసుకున్న ఈ నిర్ణయం 2018 వరకు బయటకు రాకపోవడం యావద్భారత పోలీసు వ్యవస్థను ఆందోళనకు గురిచేసింది. ఇటీవల గుజరాత్లో ప్రధాని మోదీ అ«ధ్యక్షతన జరిగిన అఖిలభారత డీజీపీల సదస్సులో ఈ విషయం బయటి ప్రపంచానికి తెలిసింది. భీమా–కోరేగావ్ వ్యవ హారంలో మావోయిస్టు పార్టీకి పౌర హక్కుల నేతలు సహకరిస్తున్నారని.. వీరి ద్వారా నగరాలు, పట్టణాల్లో విద్యార్థులు, కార్మికులు, దళితులు, ఇతర వెనుకబడిన కులాల వారిని మావోయిస్టు పార్టీ వైపు ప్రేరేపిస్తున్నారని పుణే (మహారాష్ట్ర) పోలీసులు ఆధారాలు సేకరిం చారు. అందులో భాగంగా మోదీ హత్యకు కుట్రపన్నారన్న ఆరోపణలతో పౌరహక్కుల నేతలు వరవరరావు, సుధా భరద్వాజ్, గౌతమ్ నవలఖా, అరుణ ఫెరీరాలపై వివిధ అభియోగాల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ ఘటన అనంతరం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, బిహార్, చత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధప్రదేశ్ తదితర రాష్ట్రాల పోలీసులను కేంద్ర హోంశాఖ అప్రమత్తం చేసింది. చాపకింద నీరులా అర్బన్ మావోయిజాన్ని విస్తరించేందుకు నిధుల సమీకరణ, విప్లవ సాహిత్యం ప్రచురణ, వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారని హెచ్చరించింది. ‘గోల్డెన్ కారిడార్’వ్యూహంతో.. ఈ ఏడాది జనవరిలో ముంబైలోని కళ్యాణ్ రైల్వే స్టేషన్లో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) ఏడుగురు మావోయిస్టు సానుభూతిపరులను అరెస్ట్చేసింది. వీరంతా నల్గొండ జిల్లాకు చెందిన వారు. వీరు ముంబైలోని పారిశ్రామిక ప్రాంతమైన కామ్రాజ్నగర్, విక్రోలి, రాంబాయి అంబేద్కర్నగర్లో నివాసం ఉంటూ అక్కడ వలస కార్మికులుగా ఉన్న తెలంగాణ వారిని మావోయిస్టు పార్టీ వైపు ప్రేరేపించినట్టు గుర్తించారు. ఈ ఏడుగురికి.. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులతో సత్సంబంధాలున్నట్లు వెల్లడైంది. వీరి నుంచి భారీగా మావోయిస్టు పార్టీ విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకోవడం సంచలనం రేపింది. అయితే వీరంతా అర్బన్ మావోయిజం వ్యూహంలో భాగంగా ఏర్పడిన గోల్డెన్ కారిడార్ కమిటీలో పనిచేస్తున్నారని, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లోని పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికులను మావోయిస్టు పార్టీలో చేర్పించి.. ఉద్యమాలు, విధ్వంసకాండ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఏటీఎస్ గుర్తించింది. తాజాగా.. నక్కా వెంకట్రావ్! అర్బన్ మావోయిజం వ్యవహారం ఏమాత్రం బయటకు పొక్కకుండా వ్యూహాత్మకంగా సాగుతోందని గుర్తించిన నిఘా వర్గాలు.. తాజాగా మరో తెలుగు వ్యక్తి, ఎన్జీఆర్ఐ(జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ)లో టెక్నికల్ ఉద్యోగి నక్కా వెంకట్రావ్ను అరెస్టు చేశాయి. ఛత్తీస్గఢ్లోని రాజ్నంద్గావ్లో ఈ అరెస్టు జరిగింది. ఈ ఘటన తెలంగాణ, ఆంధప్రదేశ్ పోలీసులను ఉలిక్కిపడేలా చేసింది. వెంకట్రావ్ నుంచి డిటోనేటర్లు, మావోయిస్టు సాహిత్యం, ల్యాప్టాప్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈయన రాడికల్ స్టూడెంట్ యానియన్లో 80వ దశకం నుంచే క్రియాశీలకంగా ఉన్నారని.. ఇటీవల అరెస్టయిన మావోయిస్టు కీలక నేత కుమార్ సాయి అలియాస్ పహీద్ సింగ్తో వెంకట్రావ్కు సంబంధాలున్నట్టు గుర్తించామని దుర్గ్ ఐజీ జీపీ సింగ్ స్పష్టంచేశారు. అయితే వెంకట్రావ్ జార్ఖండ్, చత్తీస్గఢ్ల్లో అర్బన్ ప్రాంతాల్లో మావోయిస్టు నెట్వర్క్ ఏర్పాటుకు కృషిచేస్తున్నట్టు గుర్తించారు. వరుసగా అర్బన్ మావోయిజం దేశవ్యాప్త లింకులు వెల్లడవడం.. దీనికితోడు అరెస్టయిన వారంతా తెలుగువారే కావడం ఈ రెండు రాష్ట్రాల పోలీసులను ఆందోళనకు గురిచేస్తోంది. మన సంగతేంటి? ఇప్పటివరకు ఇతర రాష్ట్రాల్లో తెలుగువారు, మావోయిస్టు సానుభూతిపరులు అరెస్టవడంపై చర్చ జరుగుతుండగా, తెలంగాణలో పరిస్థితి ఏంటన్న దానిపై స్పెషల్ ఇంటెలిజెన్స్ బృందాలు రంగంలోకి దిగాయి. ఎన్నికల వేళ అలజడులకు అవకాశం ఇవ్వకుండా పనిచేసిన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇప్పుడు పూర్తిస్థాయిలో అర్బన్ మావోయిజం వ్యవహారంపై దృష్టిపెట్టినట్లు తెలిసింది. రాడికల్ స్టూడెంట్ యూనియన్, జీఆర్డీ (గ్రామ రక్షక దళాలు), మావోయిస్టు పార్టీకి అనుబంధంగా ఉన్న పలు కమిటీల కీలక సభ్యులపై దృష్టి సారించినట్టు తెలిసింది. యూనివర్సిటీలు, పారిశ్రామిక ప్రాంతాలు, దళిత సంఘాలు, కుల సంఘాల్లో ఉన్న కొంత మందిని ఉద్యమం వైపు ప్రేరేపించి నియామకాలు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. పీడిత, బాధిత వర్గాలను అర్బన్ మావోయిజం వైపు ఆకర్శించేదిశగా పలువురు అర్బన్ మావోయిస్టు మేధావులు పనిచేస్తున్నారని.. వారిపైనా నిఘా పెట్టామని రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారి ఒకరు సాక్షితో పేర్కొన్నారు. చాపకింద నీరులా కొనసాగుతున్న ఈ వ్యవహారం కొంత ఆందోళన పెడుతున్నప్పటికీ.. కట్టడి చేసేందుకు వ్యూహాత్మక చర్యలు తీసుకుంటున్నామని ఆయన సోమవారం వెల్లడించారు. -
స్కూల్ బస్సులు ఫిట్నెస్ లేకుంటే చర్యలు
అర్బన్ జిల్లా ఎస్పీ రాజకుమారి రాజమహేంద్రవరం క్రైం : స్కూల్, కళాశాల బస్సులు ఫిట్నెస్ లేకుంటే ఆ యాజమాన్యాలపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి హెచ్చరించారు. ఎస్కేవీటీ కళాశాలలో రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పరిధిలోని స్కూల్, కాలేజీ బస్సుల ఫిట్నెస్ను, నిర్వహణను శనివారం పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పరిధిలో 719 బస్సులకు 574కు ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఉన్నాయన్నారు. మే 15వ తేదీకి ఫిట్నెస్ సర్టిఫికెట్ల గడువు తేదీ ముగుస్తుందని రెన్యూవల్ చేయించుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్, రోడ్డు రవాణా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఐదు టీమ్లు ఏర్పాటు చేశామని ఇవి హైవేపై పెట్రోలింగ్ నిర్వహించి రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తాయన్నారు. డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి స్కూల్, కాలేజీ బస్సుల డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, క్లినర్ లేకుండా బస్సులు తీయవద్దన్నారు. విద్యార్థులు బస్సులో నుంచి చేతులు బయట పెట్టకుండా చూడాలన్నారు. ట్రాఫిక్ నోడల్ ఆఫీసర్ భరత్ మాతాజీ, సెంట్రల్ డీఎస్పీ జె.కులశేఖర్, ఎస్బీ డీఎస్పీ రామకృష్ణ, ట్రాఫిక్ సీఐలు చింతా సూరిబాబు, బాజీలాల్, వన్టౌన్ సీఐ రవీంద్ర, త్రీటౌన్ సీఐ మారుతీ రావు, ఎస్సై రాజశేఖర్, రోడ్ రవాణా శాఖల అధికారులు సాయినాథ్, పరందామ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అహుడాకు రూ.10 కోట్లు విడుదల
అనంతపురం న్యూసిటీ : అనంతపురం, హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(అహుడా) ఏర్పాటుకు ప్రభుత్వం రూ.10 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు బుధవారం ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాల వల్లవేన్ జీఓ 421 విడుదల చేశారు. వాస్తవంగా ఏడాదికి రూ.40 కోట్లు మంజూరు చేస్తారు. మొదటి విడతలో భాగంగా రూ.10 కోట్లు విడుదల చేశారు. అహుడాకు కార్యాలయం, అవసరమైన సామగ్రి, వాహనాలు, ఉద్యోగులకు వేతనాల కోసం ఈ నిధులను వినియోగించనున్నారు. ప్రభుత్వం గతేడాది నవంబర్లో అహుడా ఏర్పాటుకు జీఓ 279 విడుదల చేసిన విషయం విదితమే. అనంతపురం, హిందూపురంలోని 18 మండలాలకు సంబంధించి 180 గ్రామాలు అహుడా పరిధిలోకి వస్తాయి. అహుడా విస్తీర్ణం 3,120 చదరపు కిలోమీటర్లు. అహుడా పనులు వేగవంతం చేసేందుకే కమిషనర్గా ఉన్న పీవీవీఎస్ మూర్తికి అహుడా వైస్ ఛైర్మన్గా బాధ్యతలు అప్పగించారు. ఈ పనులు ఏ మేరకు వేగవంతం చేస్తారో వేచి చూడాలి. -
పల్లె–నగరం మధ్య తేడాలు
నగర గీతం అందమైన సహజ ప్రకృతి.. పల్లె – కృతకమైన అందాల ముల్లె.. పట్నం. పల్లె ఆత్మీయతల సంగమం – నగరంలో ఎవరికి వారే ఏకాకి. పల్లెలో స్వచ్ఛమైన ప్రకృతి – నగరంలో సమస్తం కలుషిత భరితం. పల్లెల్లోని మనుషుల మనసుల్లో మలినం లేదు – నగరాల్లో కుట్రలు, దగాలు, వంచనలు. పల్లెల్లో పరిమళించే మానవత్వం – నగరంలో అంతా యాంత్రికత. పల్లెల్లో డబ్బులేకున్నా పరిచయాలతో పనులు సమకూరుతాయి. నగరంంలో పైసా లేకుండా ఏ పనీ జరగదు. పల్లెల్లో పరస్పర గౌరవ మర్యాదలు – నగరంలో ఎవరూ ఎవ్వరినీ లక్ష్యపెట్టరు. నగర జీవికి తీరిక దొరకదు, కోరిక చిక్కదు. ఇక్కడ జీవితం చాలా ఖరీదైంది. ఎంత సంపాదించినా చాలదు. ఎంత డబ్బున్నా అంతకు మించిన విలాసవంతమైన జీవితం ఊరిస్తూ ఉంటుంది. అందుకే ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకొని డబ్బు సంపాదించాలనుకుంటారు. దీంతో తీరిక సమయం దొరకదు. ఏ కోరికలు నెరవేర్చుకోవడానికి అంత కష్టపడుతుంటారో ఆ అవకాశాలు మాత్రం ఎప్పటికీ అందని ద్రాక్షలాగే ఉండిపోతాయి. ఖరీదైన జీవనశైలి ఇక్కడి మనుషులకు పెను సవాలుగా నిలుస్తుంది. నగర జీవితంలోని ప్రతికూలాంశాలు – కఠిన వర్ణన: జగిత్యాలలో స్వేచ్ఛగా జీవిస్తూ తనకిష్టమైన కవిత్వం, కళారాధనలో హాయిగా గడిపే అలిశెట్టి ప్రభాకర్.. నగర జీవితంలో ఇరుక్కుపోయారు. పేదరికాన్ని, దీనస్థితినే కడుపారా అనుభవించిన ఈ యువ కవి తన అనుభవాలను అక్షరాయుధాలుగా చేసి కవితలు రాశారు. అందుకే ఆయన అనుభవాల్లో నగరంలోని ప్రతికూలాంశాలే ఎక్కువగా ఉన్నాయి. అవి ‘సిటీలైఫ్’ కవితల్లో ప్రతిఫలించాయి. నగరంలో జీవన విధానం: నగరంలో మనిషి జీవితం అంతుచిక్కని అయోమయం. కాలుష్యం కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతుంటుంది. నిరంతరం ప్రమాదాల అంచున ప్రయాణం. ఎప్పుడు, ఎక్కడి నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో చెప్పలేం. కాలంతో పోటీపడుతూ ఉరుకులు–పరుగులు పెట్టడం ఇక్కడి ప్రత్యేకత. ఎవరికీ తీరిక చిక్కదు. తీరని కోరికల చిట్టా పెరుగుతూనే ఉంటాయి. సహజమైన ఆనందం దుర్లభం. అంతా కృత్రిమం, యాంత్రికం, వంచనలమయం. అంతుచిక్కని రసాయనశాల లాంటి నగరంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఒకసారి ఈ పద్మవ్యూహం లాంటి నగరంలో ప్రవేశిస్తే బయటపడటం కష్టం. నగరజీవనం సంక్లిష్టంగా మారడానికి కారణాలు: శరవేగంగా పెరుగుతున్న జనాభా వల్ల సౌకర్యాలు సరిపడకపోవడం, అవసరాలు పెరిగిపోవడంతో జీవనవ్యయం ఖరీదవుతోంది. విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి తగినంత డబ్బు సంపాదించడం అవసరమవుతోంది. ఎంత సంపాదించినా చాలడం లేదు. అందుకే పోటీతత్వం పెరుగుతోంది. మనుషుల మధ్య ఆత్మీయతలకు బదులు అంతరం పెరిగిపోతుండటం వల్ల పరస్పరం మర్యాద, నమ్మకం స్థానంలో నిర్లక్ష్యం, వంచన పెరిగిపోతున్నాయి. సంపాదించే యంత్రాలుగా మారుతున్న మనుషుల్లో సున్నితత్వం, సహృదయత కొరవడి అకారణ ద్వేషాలు, పగలు–ప్రతీకారాలు అధికమవుతున్నాయి. ఎవరికి వారే యమునా తీరే. ఒకే కుటుంబంలోని మనుషుల మధ్య కూడా ఆత్మీయతలు లేవు. మమతాభిమానాలు కొరవడ్డాయి. నిర్లక్ష్యం, వేగం, అలసత్వం, బేఖాతరు లాంటి కారణాల వల్ల నిరంతరం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదాల బారినపడ్డవాళ్లను పలకరించి, పట్టించుకునేవారు కరువయ్యారు. అందరూ కలిసి జీవిస్తున్నా, ఒకరిపై మరొకరికి నమ్మకం లేకపోవడంతో అందరూ ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. ఇన్ని వైవిధ్యాల నడుమ గడిచే సిటీ జీవితం ఒక రసాయనశాలగా, పద్మవ్యూహంలా నానాటికీ అంతుచిక్కకుండా సంక్లిష్టంగా తయారవుతోంది. పై అంశాల ఆధారంగా ఏ ప్రశ్న వచ్చినా చక్కగా ఆలోచించి జవాబు రాసేందుకు విద్యార్థులు సంసిద్ధం కావాలి. మాదిరి ప్రశ్నలు 1.నగరగీతం పాఠం ఆధారంగా నగర జీవనంలోని మంచి, చెడులను విశ్లేషించండి? (6 మార్కులు) 2.పల్లె ప్రజలు నగరబాట పట్టడానికి కారణాలేమిటి? (3 మార్కులు) 3.పల్లె.. తల్లి ఒడి, పట్టణం.. ఇనప్పెట్టె. ఈ వాక్యాన్ని సమర్థించండి. 3 మార్కులు) 4.నగర గీతం పాఠం ద్వారా అలిశెట్టి ప్రభాకర్ ఏం చెప్పదలచుకున్నారు? (6 మార్కులు) 5.నగరంలోని ప్రతి మనిషీ పఠనీయ గ్రంథం అని కవి పేర్కొనడంలో అంతరార్థమేమిటి? (3 మార్కులు) 6.నగరాన్ని పద్మవ్యూహమని, రసాయనశాల అని కవి ఎందుకు అన్నాడో వివరించండి. (6 మార్కులు) -
నూతనంగా కర్నూలు అర్బన్ మండలం
కర్నూలు(అగ్రికల్చర్): కొన్నేళ్లుగా ఊరిస్తున్న కర్నూలు అర్బన్ మండలం కల సాకారం అయింది. జిల్లాలో కర్నూలు, కల్లూరు, నంద్యాల, ఆదోని అర్బన్ మండలాల ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం కర్నూలు అర్బన్ మండలం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి మెమో కూడా జారీ చేసింది. గతంలోనే సీసీఎల్ఏ అనిల్చంద్ర పునీట కర్నూలు అర్బన్ మండలం ఏర్పటు చేస్తున్నట్లుగా వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రకటించారు. తాజాగా ప్రభుత్వం కర్నూలు అర్బన్ మండలం ఏర్పాటుకు మెమో ఇచ్చింది. తర్వాత జీవో విడుదల చేయాల్సి ఉంది. -
ఉన్నతి’ని ఆశిస్తే.. ఉన్న కొలువుకే ఎసరు
ఉద్యోగభద్రతపై యూహెచ్సీల సిబ్బంది కలవరం నిర్వహణను ప్రైవేటు ఆస్పత్రులకు అప్పగించిన ప్రభుత్వం 16 ఏళ్ల సేవలకు గుర్తింపు ఇవ్వాలంటున్న ఉద్యోగులు సాక్షి, రాజమహేంద్రవరం : పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో (యూహెచ్సీ) 16 ఏళ్లుగా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తూ, ఇన్నేళ్ల సర్వీసు కారణంగా కొలువు ఎన్నటికైనా ప్రభుత్వ ఉద్యోగం అవుతుందని, బతుక్కి భరోసా దక్కుతుందని ఆశిస్తున్న వారికి ఉన్న ఉద్యోగమైనా ఉంటుందా, ఊడుతుందా అన్న ఆందోళన పట్టుకుంది. పట్టణాల్లో మురికివాడల్లో నివసించే పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు 2000లో ఏర్పాటు చేసిన యూహెచ్సీల నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం అపోలో, ధనుష్ ఆస్పత్రులకు అప్పగించింది. ఆ కేంద్రాల్లో పని చేస్తున్న వారి ఉద్యోగాలకు ఎలాంటి భంగమూ ఉండదని ప్రభుత్వం చెబుతున్నా వారిలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కార్పొరేట్ ఆస్పత్రుల నిర్వహణలోకి వచ్చిన తమను భవిష్యత్లో నిబంధనల మేరకు అర్హతలు, నైపుణ్యం లేవంటూ తొలగిస్తారేమోనన్న ఆందోళనలో ఆక్జిలరీ నర్స్ మిడ్వైఫ్ (ఏఎన్ఎం)లు, సీవోలు, వైద్య సహాయకులు ఉన్నారు. 19 కేంద్రాల్లో 95 మంది సిబ్బంది జిల్లాలో 19 యూహెచ్సీలు ఉండగా ఒక్కో కేంద్రంలో ఒక వైద్యుడు, ఇద్దరు ఏఎన్ఎంలు, ఒక సీవో, వైద్య సహాయకులు ఉన్నారు. జిల్లాలోని ఏడు పురపాలక సంఘాలు, కాకినాడ, రాజమహేంద్రరం కార్పొరేషన్ల పరిధిలోని మెుత్తం 19 కేంద్రాల్లో 95 మంది సిబ్బంది పని చేస్తున్నారు. వీటి నిర్వహణను చేపడుతున్న అపోలో, ధనుష్ సంస్థలు.. ‘ఇ–యూపీహెచ్సీ’ల పేరుతో పట్టణ పేదలకు వైద్య సేవలు అందించనున్నాయి. జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతంలోని యూహెచ్సీలను ధనుష్, మిగతా జిల్లాల్లో ఉన్న వాటిని అపోలో నిర్వహించనున్నాయి. ఆ రెండు సంస్థలూ మూడేళ్లపాటు ఈ సేవలు అందించనున్నాయి. ఇ–యూపీహెచ్సీల నిర్వహణకు అవసరమయ్యే నిధులు జాతీయ పట్టణ ఆరోగ్యమిషన్ (ఎన్యూహెచ్ఎం) ద్వారా కేటాయిస్తారు. ప్రస్తుతమున్న సేవలతోపాటు ప్రాథమిక ఆరోగ్య రక్షణ, టెలీ మెడిసిన్ సదుపాయాలు పట్టణ పేదలకు అందుబాటులోకి రానున్నాయి. ప్రయోగశాల, జనరల్ ప్రాక్టీషనర్, నర్సింగ్ సేవలను అదనంగా కల్పించనున్నారు. కొందరిని తొలగించిన ‘అపోలో’ అయితే ధనుష్ సంస్థ అప్పటికే ఉన్న సిబ్బందిని కొనసాగిస్తుండగా, అపోలో మాత్రం తమ పరిధిలోని యూహెచ్సీల్లో కొంత మందిని తొలగించింది. సిబ్బంది ఆందోళన చేయడంతో తొలగించిన వారిలో కొందరిని తిరిగి తీసుకుంది. ఇలాంటి పరిస్థితి భవిష్యత్లో ఉత్పన్నమైతే తమ బతుకులు అగమ్యగోచరంగా తయారవుతాయని సిబ్బంది వాపోతున్నారు. ఇప్పటి వరకూ ఈ కేంద్రాల్లో పని చేస్తూ వచ్చిన సిబ్బంది సగటు వయస్సు 40కి పైగా ఉందని, తమకు మరో ఉద్యోగం వచ్చే అవకాశం ఉండదని కలవరపడుతున్నారు. 2006లో 90 శాతం ప్రభుత్వోద్యోగాలు యూహెచ్సీలను 2000లో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం వీటి నిర్వహణను స్థానిక ఎన్జీవోలకు అప్పగించింది. సిబ్బందిని కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ విధానంలో నియమించింది. ఇక్కడ పని చేస్తున్న సిబ్బందికి ప్రతిభ, పని చే సిన కాలం ఆధారంగా ప్రభుత్వోద్యోగాల భర్తీలో రిజర్వేషన్ లభించింది. 2006లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో ఏఎన్ఎం పోస్టులను భర్తీ చేశారు. ఆ సమయంలో యూహెచ్సీల్లో పని చేస్తున్న ఏఎన్ఎంలలో దాదాపు 90 శాతం మందికి ప్రభుత్వోద్యోగాలు వచ్చాయి. ఇదే ఆశతో ప్రతి నెలా అరకొర జీతాలు కూడా రాకున్నా 16 ఏళ్లుగా పని చేస్తున్నారు. ఇప్పుడు కేంద్రాల నిర్వహణ ప్రైవేటు సంస్థల పరిధిలోకి వెళితే ఇన్నేళ్లూ తాము చేసిన సేవలకు గుర్తింపు లేకుండా పోతుందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకూ తాము చేసిన సేవలకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని, భవిష్యత్తులో భర్తీ చేయబోయే పోస్టుల్లో గతంలో లాగే తమకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. -
ఉన్నతి’ని ఆశిస్తే.. ఉన్న కొలువుకే ఎసరు!
ఉద్యోగభద్రతపై యూహెచ్సీల సిబ్బంది కలవరం నిర్వహణను ప్రైవేటు ఆస్పత్రులకు అప్పగించిన ప్రభుత్వం 16 ఏళ్ల సేవలకు గుర్తింపు ఇవ్వాలంటున్న ఉద్యోగులు సాక్షి, రాజమహేంద్రవరం : పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో (యూహెచ్సీ) 16 ఏళ్లుగా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తూ, ఇన్నేళ్ల సర్వీసు కారణంగా కొలువు ఎన్నటికైనా ప్రభుత్వ ఉద్యోగం అవుతుందని, బతుక్కి భరోసా దక్కుతుందని ఆశిస్తున్న వారికి ఉన్న ఉద్యోగమైనా ఉంటుందా, ఊడుతుందా అన్న ఆందోళన పట్టుకుంది. పట్టణాల్లో మురికివాడల్లో నివసించే పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు 2000లో ఏర్పాటు చేసిన యూహెచ్సీల నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం అపోలో, ధనుష్ ఆస్పత్రులకు అప్పగించింది. ఆ కేంద్రాల్లో పని చేస్తున్న వారి ఉద్యోగాలకు ఎలాంటి భంగమూ ఉండదని ప్రభుత్వం చెబుతున్నా వారిలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కార్పొరేట్ ఆస్పత్రుల నిర్వహణలోకి వచ్చిన తమను భవిష్యత్లో నిబంధనల మేరకు అర్హతలు, నైపుణ్యం లేవంటూ తొలగిస్తారేమోనన్న ఆందోళనలో ఆక్జిలరీ నర్స్ మిడ్వైఫ్ (ఏఎన్ఎం)లు, సీవోలు, వైద్య సహాయకులు ఉన్నారు. 19 కేంద్రాల్లో 95 మంది సిబ్బంది జిల్లాలో 19 యూహెచ్సీలు ఉండగా ఒక్కో కేంద్రంలో ఒక వైద్యుడు, ఇద్దరు ఏఎన్ఎంలు, ఒక సీవో, వైద్య సహాయకులు ఉన్నారు. జిల్లాలోని ఏడు పురపాలక సంఘాలు, కాకినాడ, రాజమహేంద్రరం కార్పొరేషన్ల పరిధిలోని మెుత్తం 19 కేంద్రాల్లో 95 మంది సిబ్బంది పని చేస్తున్నారు. వీటి నిర్వహణను చేపడుతున్న అపోలో, ధనుష్ సంస్థలు.. ‘ఇ–యూపీహెచ్సీ’ల పేరుతో పట్టణ పేదలకు వైద్య సేవలు అందించనున్నాయి. జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతంలోని యూహెచ్సీలను ధనుష్, మిగతా జిల్లాల్లో ఉన్న వాటిని అపోలో నిర్వహించనున్నాయి. ఆ రెండు సంస్థలూ మూడేళ్లపాటు ఈ సేవలు అందించనున్నాయి. ఇ–యూపీహెచ్సీల నిర్వహణకు అవసరమయ్యే నిధులు జాతీయ పట్టణ ఆరోగ్యమిషన్ (ఎన్యూహెచ్ఎం) ద్వారా కేటాయిస్తారు. ప్రస్తుతమున్న సేవలతోపాటు ప్రాథమిక ఆరోగ్య రక్షణ, టెలీ మెడిసిన్ సదుపాయాలు పట్టణ పేదలకు అందుబాటులోకి రానున్నాయి. ప్రయోగశాల, జనరల్ ప్రాక్టీషనర్, నర్సింగ్ సేవలను అదనంగా కల్పించనున్నారు. కొందరిని తొలగించిన ‘అపోలో’ అయితే ధనుష్ సంస్థ అప్పటికే ఉన్న సిబ్బందిని కొనసాగిస్తుండగా, అపోలో మాత్రం తమ పరిధిలోని యూహెచ్సీల్లో కొంత మందిని తొలగించింది. సిబ్బంది ఆందోళన చేయడంతో తొలగించిన వారిలో కొందరిని తిరిగి తీసుకుంది. ఇలాంటి పరిస్థితి భవిష్యత్లో ఉత్పన్నమైతే తమ బతుకులు అగమ్యగోచరంగా తయారవుతాయని సిబ్బంది వాపోతున్నారు. ఇప్పటి వరకూ ఈ కేంద్రాల్లో పని చేస్తూ వచ్చిన సిబ్బంది సగటు వయస్సు 40కి పైగా ఉందని, తమకు మరో ఉద్యోగం వచ్చే అవకాశం ఉండదని కలవరపడుతున్నారు. 2006లో 90 శాతం ప్రభుత్వోద్యోగాలు యూహెచ్సీలను 2000లో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం వీటి నిర్వహణను స్థానిక ఎన్జీవోలకు అప్పగించింది. సిబ్బందిని కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ విధానంలో నియమించింది. ఇక్కడ పని చేస్తున్న సిబ్బందికి ప్రతిభ, పని చే సిన కాలం ఆధారంగా ప్రభుత్వోద్యోగాల భర్తీలో రిజర్వేషన్ లభించింది. 2006లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో ఏఎన్ఎం పోస్టులను భర్తీ చేశారు. ఆ సమయంలో యూహెచ్సీల్లో పని చేస్తున్న ఏఎన్ఎంలలో దాదాపు 90 శాతం మందికి ప్రభుత్వోద్యోగాలు వచ్చాయి. ఇదే ఆశతో ప్రతి నెలా అరకొర జీతాలు కూడా రాకున్నా 16 ఏళ్లుగా పని చేస్తున్నారు. ఇప్పుడు కేంద్రాల నిర్వహణ ప్రైవేటు సంస్థల పరిధిలోకి వెళితే ఇన్నేళ్లూ తాము చేసిన సేవలకు గుర్తింపు లేకుండా పోతుందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకూ తాము చేసిన సేవలకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని, భవిష్యత్తులో భర్తీ చేయబోయే పోస్టుల్లో గతంలో లాగే తమకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. -
కుడాకు గ్రీన్ సిగ్నల్
– మంత్రిమండలి ఆమోదం కర్నూలు(టౌన్): కర్నూలు నగర పరిధి మరింత విస్తరించనుంది. చుట్టుపక్క మున్సిపాలిటీలు, నగర పంచాయతీలను కలుపుకొని కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా) ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం మంత్రి మండలి ఆమోదం తెలిపింది. కుడా పరిధిలో కర్నూలు, నంద్యాల, నందికొట్కూరు, డోన్ నగర పంచాయతీలు విలీనం కానున్నాయి. అదేవిధంగా కల్లూరు, జూపాడుబంగ్లా, మిడుతూరు, ఓర్వకల్లు, కోడుమూరు, వెల్దుర్తి, బేతంచెర్ల, పాణ్యం, గడివేముల, మహానంది మండలాలు కూడా ఈ పరిధిలోకి రానున్నాయి. మంత్రిమండలి ఆమోదంతో పాటు రివాల్వింగ్ ఫండ్ కింద రూ.50 కోట్లు మంజూరు చేసింది. 219 గ్రామాలను కలుపుకుని కర్నూలు పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) ఏర్పాటు కానుంది. నవ్యాంధ్రప్రదేశ్లో భాగంగా పలు పంచాయతీలను నగర పంచాయతీలుగా, నగర పంచాయతీలను మున్సిపాల్టీలుగా, మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా, కార్పొరేషన్లను పట్టణ అభివృద్ధి సంస్థలుగా ప్రభుత్వం అప్గ్రేడ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పట్టణాభివృద్ధి అథారిటీ బిల్ 2015 ముసాయిదాను ప్రభుత్వం సిద్ధం చేసింది. పట్టణాభివృద్ధి అథారిటీలకు ప్రభుత్వమే చైర్మన్లను నియమిస్తుంది. కుడాపై దృష్టి సారించిన అధికారులు కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీపై ఆరు నెలలుగా నగరపాలక అధికారులు కసరత్తు ప్రారంభించారు. 1994 సంవత్సరంలో కర్నూలు మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయింది. 2002 ఫిబ్రవరిలో కల్లూరు మేజర్ గ్రామ పంచాయతీని కర్నూలు కార్పొరేషన్లో విలీనం చేశారు. ప్రస్తుతం నగర విస్తీర్ణం 49.74 చదరపు కిలోమీటర్లు కాగా.. 2011 జనాభా లెక్కల ప్రకారం 4,23,829 మంది జనాభా ఉన్నారు. అలాగే మురికివాడల్లో నివసిస్తున్న జనాభా 1,43,797. –––––––––––––––––––––– మున్సిపాల్టీ/మండలాలు విస్తీర్ణం 2011 జనాభా లెక్కల చ.కి.మీ ప్రకారం –––––––––––––––––––––––––––– 1. కర్నూలు (అర్బన్) 355.72 4,06,737 2. కల్లూరు 327.01 1,96,288 3. గూడూరు (అర్బన్) 163.08 46,286 4. నందికొట్కూరు (అర్బన్) 177.13 83,748 5. జూపాడుబంగ్లా 226.70 37,686 6. మిడుతూరు 302.74 41,652 7. ఓర్వకల్లు 371.72 58,487 8. కోడుమూరు 287.06 74,594 9. వెల్దుర్తి 334.62 63,120 10. బేతంచర్ల 296.25 88,726 11. పాణ్యం 283.29 51,428 12. గడివేముల 243.53 42,310 13. నంద్యాల (అర్బన్) 217.08 2,83,368 14. మహానంది 259.64 38,487 15. డోన్ (అర్బన్) 430.28 1,20,232 ––––––––––––––––––––––––––––––––– మొత్తం 4224.82 16,19,587 –––––––––––––––––––––––––––––––– -
కర్నూలు అర్బన్ మండలానికి ప్రభుత్వ ఆమోదం
– ఆరు తహసీల్దార్ కార్యాలయాల నిర్మాణానికి నిధులు – వీడియో కాన్ఫరెన్స్లో సీసీఎల్ఏ కార్యదర్శి వెల్లడి కర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్రంలో మొదటి దశలో ఏడు అర్బన్ మండలాలు ఏర్పాటులో భాగంగా కర్నూలు అర్బన్ మండలం ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర భూ పరిపాలన శాఖ ముఖ్య కమిషనర్ కార్యదర్శి రామారావు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. కర్నూలు అర్బన్ మండల ఏర్పాటుపై త్వరలోనే మార్గదర్శకాలు ఇవ్వనున్నట్లుగా ప్రకటించారు. జిల్లాలో ఆరు తహసీల్దారు కార్యాలయాలకు సొంత భవానాలు నిర్మించేందుకు నిధులు విడుదల చేశామన్నారు. విడుదల చేసిన నిధులను మార్చిలోగా వినియోగించుకొని నిధులు ల్యాప్స్ కాకుండా చూడాలని తెలిపారు. ప్రజా సాధికార సర్వే ముగిసిన తర్వాత ‘మీ ఇంటికి మీ భూమి’ గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. నాలా టాక్స్ను లక్ష్యం మేరకు వసూలు చేయాలన్నారు. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చుకోవాలంటే 10 శాతం పీజు వసూలు చేయడంపై ప్రత్యేక దష్టి సారించాలన్నారు. కర్నూలు నుంచి వీడియో కాన్ఫరెన్స్లో డీఆర్ఓ గంగాధర్గౌడు, కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి వెంకటనారాయణ, డీ–సెక్షన్ సూపరింటెండెంటు ఈరన్న, ప్రొటోకాల్ సెక్షన్ సూపరింటెండెంటు ఆదినారాయణ, మీసేవ కేంద్రాల పరిపాలనాధికారి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
త్వరలో అర్బన్ మండలాల ఏర్పాటు..!
– రెవెన్యూ డివిజన్ కేంద్రంగా డోన్ –కసరత్తు చేస్తున్న ప్రభుత్వం కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు నగరపాలక సంస్థ సహా మున్సిపాలిటీ కేంద్రాలను అర్బన్ మండలాలుగా గుర్తించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అదే విధంగా జిల్లాలో ఒక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ముందుగా కర్నూలు నగరాన్ని అర్బన్ మండలంగా గుర్తించనున్నట్లు సమాచారం. నగరంలో 5 లక్షలకు పైగా జనాభా ఉండటంతో అర్బన్ మండలంగా గుర్తించాలనే ప్రతిపాదన కొన్నేళ్లుగా ఉంది. ఎట్టకేలకు ఇది కార్యరూపం దాల్చే అవకాశం ఏర్పడింది. కర్నూలును అర్బన్ మండలంగా గుర్తించిన తర్వాత నంద్యాల, ఆదోని మున్సిపాలిటీలను కూడా అర్బన్ మండలాలుగా గుర్తించనున్నారు. ఆ తర్వాత డోన్, ఎమ్మిగనూరు, నందికొట్కూరు, బనగానపల్లెలను ఆర్బన్ మండలాలుగా గుర్తించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకు అర్బన్ మండలాలు లేకపోవడం గమనార్హం. -
అభివృద్ధి పనుల్లో ప్రజాప్రతినిధులు సహకరించాలి
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కాకినాడ సిటీ: అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు సహకారం అందించాలని, తద్వారా ప్రజలకు వాటి ఫలితాలు అందుతాయని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ బి.రామాంజనేయులు తెలిపారు. గురువారం అంబేడ్కర్ భవన్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఇతర శాఖల నిధుల అనుసంధానంతో చేపట్టే పనులపై ప్రజాప్రతినిధులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ మొదటి విడతగా అన్ని జిల్లాల్లో ప్రజాప్రతినిధులకు, గ్రామ పంచాయతీలలో మౌలిక సదుపాయాల కల్పనపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. రెండో విడతగా పంచాయతీ సెక్రటరీ, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలకు సర్పంచ్ల ఆధ్వర్యంలో అవగాహన ఏర్పాటు చేస్తామన్నారు. పూర్తిస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలపై వారికి అవగాహన ఉండాలని, నిధుల కేటాయింపు, చేసిన ఖర్చుపై అవగాహన ఉంటేనే అభివృద్ధి సాధించగలమన్నారు. కలెక్టర్ అరుణ్కుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు మెరుగుపర్చడానికి ఉపాధి హామీ పథకం నిధులు ఇస్తామన్నారు. ఈ పథకంలో గత సంవత్సరం రూ.280 కోట్లు ఖర్చు చేయగా, ఈ సంవత్సరం 25 శాతం ఎక్కువ నిధులు కేటాయించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. పంచాయతీరాజ్ ఎస్ఈ వెంకటేశ్వరరావు, డీపీఓ శర్మ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఎం.రాజేశ్వరరావు, జెడ్పీ సీఈఓ కె.పద్మ ప్రసంగించారు. సర్పంచ్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, ఎంపీడీఓలు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ముందు జిల్లాలే..
కలెక్టర్ ప్రతిపాదించిన మండలాలు అర్బన్.. 1. మిర్యాలగూడ 2. సూర్యాపేట 3. భువనగిరి 4. కోదాడ 5. నల్లగొండ రూరల్.. 6. నేరడుగొమ్ము 7. కొండమల్లేపల్లి 8. మోటకొండూరు 9. తిరుమలగిరి 10. అడ్డగూడూరు 11. గట్టుప్పల్ 12. నాగారంబంగ్లా (అర్వపల్లిలోని నాలుగు గ్రామాలతోపాటు ఇతర మండలాల్లోని పలు గ్రామాలను కలిపి) 13. మాడ్గులపల్లి నల్లగొండ, యాదాద్రి, సూర్యాపేట ఖాయం మండలాలపై రెండు ప్రతిపాదనలు జిల్లాలో నూతనంగా 11 లేదా 13 మండలాలు నల్లగొండలోనే మిర్యాలగూడ నియోజకవర్గం అర్వపల్లి మండలం నుంచి నాలుగు గ్రామాలు మాత్రమే నాగారం బంగ్లాలోకి.. మిగతావన్నీ యథాతథం సీఎస్ నాజీవ్శర్మకు సమగ్ర నివేదికను అందజేసిన కలెక్టర్ సత్యనారాయణరెడ్డి సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాల విభజన బంతి రాష్ట్ర ప్రభుత్వ కోర్టులోకి చేరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సోమవారం హైదరాబాద్లో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశమయ్యారు. సుమారు ఏడు గంటలపాటు సాగిన సమావేశంలో నల్లగొండ జిల్లా కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి జిల్లా విభజనకు సంబంధించిన సమగ్ర నివేదికను సీఎస్కు అందజేశారు. ప్రస్తుతం ఉన్న నల్లగొండను సూర్యాపేట, యాదాద్రి, నల్లగొండ జిల్లాలుగా విభజించాలని ఇదివరకే ఖరారైన నేపథ్యంలో మండలాలలకు సంబంధించి రెండు ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. మొదటి ప్రతిపాదన ప్రకారం నల్లగొండ జిల్లాలో 11 కొత్త మండలాలు ఉన్నట్లు తెలిసింది. అర్బన్ మండలాలు మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరి, కోదాడ, నల్లగొండతోపాటు రూరల్ మండలాలుగా నేరడుగొమ్మ, కొండమల్లేపల్లి,మోటకొండూరు, తిరుమలగిరి, అడ్డగూడురు, గట్టుప్పల్ను ఏర్పాటు చేయవచ్చని సూచించారు. రెండో ప్రతిపాదన ప్రకారం 13 కొత్త మండలాలను ప్రతిపాదించారు. మొదటి ప్రతిపాదనలోని 11తోపాటు నాగారంబం గ్లా (అర్వపల్లి), మాడ్గులపల్లిని కొత్త మండలాలుగా ఏర్పాటు చేయవచ్చని నివేదికలో పేర్కొన్నారు. అర్వపల్లి మండలంలోని వర్ధమానుకోట, నాగారం, కొత్తపల్లి, మాచిరెడ్డిపల్లితోపాటు ఇతర మండలాల్లోని మరికొన్ని గ్రామాలను నాగారంబంగ్లా మండలంలో చేర్చారు. జిల్లాలు, మండలాలతోపాటు ఉద్యోగుల విభజన, కొత్త జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల ఏర్పాటుకు సంబందించిన స్థలాలు, తాత్కాలిక భవనాల ఎంపిక, నూతన మండలాల్లో చేర్చేగ్రామాల వివరాలు, ఇతర జిల్లాల నుంచి కొత్త జిల్లాల్లో చేర్చే మండలాల గురించి సమగ్ర నివేదికను సీఎస్కు కలెక్టర్ సమర్పించారు. నల్లగొండలోనే మిర్యాలగూడ.. ముందుగా ప్రతిపాదించినట్లు సూర్యాపేటలో కాకుండా మిర్యాలగూడ నియోజకవర్గాన్ని నల్లగొండ జిల్లాలోనే ఉంచాలని కలెక్టర్ నివేదించారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఈ ప్రతిపాదన చేసినట్లు సీఎస్కు సమర్పించిన నివేదికలో కలెక్టర్ పేర్కొన్నట్లు తెలిసింది. యాదాద్రిలోకి ఇతర జిల్లాల మండలాలు భువనగిరి కేంద్రంగా ఏర్పాటయ్యే యాదాద్రి జిల్లాలోకి నల్లగొండలోని జిల్లాతోపాటు వరంగల్, మెదక్ జిల్లాలకు చెందిన నాలుగైదు మండలాలు రానున్నాయి. ఈ మేరకు కలెక్టర్ ప్రతి పాదనలు చేశారు. అదేవిధంగా యాదాద్రి జిల్లా కోసం 13 వేల స్క్వేర్యార్డుల భవనాలు అందుబాటులో ఉన్నాయని.. సూర్యాపేట జిల్లాలో కలెక్టరేట్, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి నాలుగు స్థలాలను ఎంపిక చేసినట్లు నివేదికలో పొందుపరిచారు. కాగా, సమావేశంలో ముందుగా జిల్లాలను ఏర్పాటు చేయాలని అందరు అభిప్రాయ పడ్డారు. తొలుత జిల్లాలు ఏర్పాటు చేసి.. ఆ తర్వాత రెవెన్యూ డివిజన్లు, నూతన మండలాలను ఏర్పాటు చేయాలనే అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తామని.. ఈ మేరకు మరోసారి సీఎంతో సమావేశం ఉంటుందని సీఎస్ వెల్లడించినట్లు సమాచారం. -
‘నరక’ జీవనం!
ఎన్నికల హడావుడిలో తలమునకలయి ఉన్న కోల్కతాను పెను విషాదం చుట్టు ముట్టింది. అక్కడ నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్లో కొంత భాగం కూలి గురువారం మధ్యాహ్నం 24మంది దుర్మరణం చెందిన ఘటన అందరినీ దిగ్భ్రాంతిపరిచింది. దాదాపు 40 మీటర్ల మేర చేపట్టిన కాంక్రీటు నిర్మాణం 24 గంటలు గడవకుండానే భారీ శబ్దంతో కూలిపోయింది. ఆ కాంక్రీటుకు ఆలంబనగా అమర్చిన ఇనుప దూలాలు పడిపోవడంతో ఒక బస్సు, మూడు టాక్సీలు, ఇతర వాహనాలు దాని కింద చిక్కుకుపోయాయి. అనేకమంది పాదచారులు సైతం ప్రమాద సమయంలో అక్కడున్నట్టు సీసీ టీవీ ఫుటేజ్లోని దృశ్యాలు చెబుతున్నాయి. అక్కడికక్కడే 20మందికిపైగా మరణిస్తే మరికొందరు ఆస్పత్రులకు తీసుకెళ్తుండగా చనిపో యారు. మరో 88మంది గాయపడ్డారు. నగర జీవనం ఎంత అస్తవ్యస్థంగా, అరాచకంగా ఉంటుందో...అక్కడ అడుగడుగునా ప్రమాదాలెలా పొంచి ఉంటాయో ఈ విషాదఘటన మరోసారి వెల్లడించింది. ప్రమాదం జరిగిన బుర్రాబజార్ ప్రాంతం నిత్యం ఎంతో రద్దీగా ఉంటుంది. ఆసియాలోనే అతి పెద్ద హోల్సేల్ మార్కెట్లలో ఒకటి కావడంవల్ల అక్కడ వాహనాల తాకిడి, వాటితో వచ్చే ట్రాఫిక్ సమస్యలు అధికం. అందుకు పరిష్కారంగానే హౌరా వరకూ రెండున్నర కిలోమీటర్ల పొడ వునా ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఏడేళ్లుగా అది సాగుతూనే ఉంది. మరో 20 శాతం పనులు పూర్తయితే ఫ్లైఓవర్ జనానికి అందుబాటులో కొస్తుందనుకున్నంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఫ్లైఓవర్ల వంటి భారీ నిర్మాణాలు చేపట్టినప్పుడు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు, అలాంటి నిర్మాణాలకు అవసరమైన నిపుణత కొరవడటంవంటి కారణాలు జనానికి శాపంగా మారుతున్నాయి. హైదరాబాద్ నగరంలో సెక్రటేరియట్ సమీపంలో చంద్రబాబు సీఎంగా ఉండగా 1998లో పనులు మొదలెట్టిన తెలుగుతల్లి ఫ్లైఓవర్ నిర్మాణమే దీనికి ఉదాహరణ. దాని పనులు సగంలో ఉండగా ట్యాంక్బండ్ సమీపంలో ఉన్న అంబేడ్కర్ విగ్రహాన్ని వేరే చోటకు తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై దళిత సంఘాలనుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురుకావడం, రోడ్డు వెడల్పులో సమస్యలు ఎదురుకావడం పర్యవ సానంగా అది దీర్ఘకాలం నిలిచిపోయింది. దళిత సంఘాల అభీష్టానికి అను గుణంగా ఆ ఫ్లైఓవర్ డిజైన్ను ఎలా సవరించాలో అప్పటి ప్రభుత్వానికి అర్ధం కాలేదు. 2004లో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ప్రమాణం చేశాక అదంతా కొలిక్కి వచ్చి, పనులు చకచకా సాగి 2005 జనవరిలో ఫ్లైఓవర్ ప్రారంభమైంది. మొత్తంగా ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడానికి ఏడేళ్ల సమయం పట్టింది. ముందు చూపు లేకుండా, అవసరమైన ప్రత్యామ్నాయాలను ఆలోచిం చకుండా లేడికి లేచిందే పరుగన్నట్టు వ్యవహరిస్తే పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఇప్పుడు బుర్రాబజార్లో కూలిన ఫ్లైఓవర్ చరిత్రా అలాంటిదే. రోడ్డుకు అటూ ఇటూ భారీ భవంతులున్నాయి. వాటిని అవసరమైనంతమేర తొలగించి రోడ్డు వెడల్పుచేశాక పనులు ప్రారంభిస్తే నిర్మాణం అవరోధం లేకుండా సాగేది. అలా చేయకపోవడంవల్ల సమస్య కోర్టులకెక్కి ఇంత జాప్యం చోటుచేసుకుంది. 2009 ఫిబ్రవరిలో నిర్మాణం పనులు ప్రారంభంకాగా 2010 ఆగస్టుకల్లా పూర్తిచేయాలని అప్పట్లో అనుకున్నారు. ఇప్పటికి తొమ్మిదిసార్లు గడువు తేదీలు దాటిపోయాయి. తాజా గడువు వచ్చే ఆగస్టు. అందుకోసం ఆదరాబాదరగా పనులు చేపట్టడమే ప్రమాదానికి దారి తీసి ఉండొచ్చునని కొందరు నిపుణులు భావన. ఈ ఫ్లైఓవర్ డిజైన్లో లోపాలున్నాయని, అది కొన్ని భవంతులకు అత్యంత సమీపంనుంచి పోయేలా రూపొందించారని వారు చెబుతున్నారు. ప్రమాదానికి కారణం మీరంటే మీరని రాజకీయ పక్షాలు ఆరోపించుకుంటున్నాయి. ఇప్పుడు అక్కడ ఎన్నికల జాతర నడుస్తున్నది గనుక ఇది సాధారణమే. అయితే ప్రమాదం విధి లిఖితమని కంపెనీ ప్రతినిధి అనడం అమానవీయం, దుర్మార్గం. నగరాలు, పట్టణాలు ఎదుర్కొనే ట్రాఫిక్ రద్దీకి పరిష్కారమవుతాయ నుకున్న ఫ్లై ఓవర్లు, స్కైవేలు ఆచరణలో వాటికవే సమస్యలుగా మారడం, ఉన్న ఇబ్బందుల్ని మరింతగా పెంచడం చాలాచోట్ల కనిపిస్తోంది. 2010-14 మధ్య జరిగిన అసహజ మరణాల్లో ఫ్లైఓవర్లు, ఇతర నిర్మాణాలు కూలిన కారణంగా సంభవించినవే అధికమని జాతీయ క్రైం రికార్డుల బ్యూరో నిరుడు వెల్లడించింది. ఆ అయిదేళ్లలోనూ ఈ కేటగిరి కింద మొత్తంగా 13,473మంది చనిపోతే అందులో 47.3 శాతం...అంటే 6,233మంది ఫ్లైఓవర్లవంటి నిర్మాణాలు కూలి పోవడంవల్ల ప్రాణాలు కోల్పోయారని ఆ సంస్థ చెబుతోంది. పౌరులకు ఇవెంత ప్రమాదకరంగా పరిణమించాయో ఈ గణాంకాలే వివరిస్తున్నాయి. పట్టణీకరణ వల్ల తలెత్తే సమస్యలకు ఫ్లైఓవర్లు, స్కైవేలు, మెట్రో రైళ్లు, ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లు పరిష్కారమని ప్రభుత్వాల అధినేతలు విశ్వసిస్తున్నారు. ఈ-గవర్నెన్స్, పెనువేగంతో కూడిన బ్రాడ్బాండ్ వంటివి సమకూర్చి కళ్లు చెదిరేలా నగరాలను నిర్మిస్తే అవి దేశ, విదేశీ కార్పొరేట్లను ఆకర్షిస్తాయని...అందువల్ల పెట్టుబడులు వెల్లువలా వచ్చిపడతాయని, యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వారు నమ్ముతున్నారు. కానీ ఈ క్రమం నగరంలో మురికివాడల విస్తరణకు దోహదపడుతుందని వారు గుర్తించడంలేదు. ఇలాంటి అభివృద్ధి నమూనాలవల్ల నగర జీవనం అస్తవ్యస్థమవుతుందని, మౌలిక సదుపాయాల కల్పన పెద్ద సమస్యగా మారుతుందని, నేరాలు పెరుగుతాయని, కాలుష్యం ఆవరిస్తుందని తెలుసుకోవడంలేదు. ఈ వైఖరివల్ల వెనకబడిన ప్రాంతాలు శాశ్వతంగా వెనకబడే ఉంటున్నాయని అర్ధంకావడంలేదు. ఇలాంటి మనస్తత్వం మారనంత వరకూ నగరాలు నరకాలుగానే ఉంటాయి. సమస్యలతో సామాన్య జనం సతమతమ వుతూనే ఉంటారు. కోల్కతా విషాద ఘటనైనా పాలకులను పునరాలోచనలో పడేస్తుందని ఆశించాలి. -
పన్నులు పెంచాల్సిందే!
పట్టణాభివృద్ధిపై తుమ్మల కమిటీ సిఫారసులు ఆస్తుల బదలాయింపు రుసుమును 1.2% నుంచి 2.5%కి పెంచాలి వారంట్ టాక్స్ను 0.12% నుంచి 5 శాతానికి పెంచాలి ఆస్తిపన్ను గణనలో లోపాలను సరిదిద్దాలి ఆక్రమణల క్రమబద్ధీకరణను మళ్లీ చేపట్టాలి 6 స్మార్ట్ సిటీలు, 7 శాటిలైట్ సిటీలు నిర్మించాలి మున్సిపాలిటీల్లోని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సూచన సాక్షి, హైదరాబాద్: నిధులు లేక నీరసించిన మున్సిపాలిటీలన్నీ ఆదాయం పెంచుకోవడానికి పన్నుల మోత మోగించాల్సిందేనని తుమ్మల ఆధ్వర్యంలోని మంత్రివర్గ ఉపసంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. పన్ను వసూళ్లను పకడ్బందీగా చేపట్టాలని... ఆస్తి పన్ను గణనలో లోపాలను సరిదిద్ది, ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించింది. కాలం చెల్లిన పురపాలన, పట్టణాభిృద్ధి చట్టాలకు స్వస్తిపలికి కొత్త చట్టాలను రూపొందించుకోవాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఆరు స్మార్ట్ సిటీలు, ఏడు శాటిలైట్ టౌన్షిప్లను నిర్మించాలని ప్రతిపాదించింది. నగర, పురపాలక సంస్థల్లోని ఖాళీల భర్తీని తక్షణమే చేపట్టాలని ఉప సంఘం పేర్కొంది. ఆదాయం పెంపు, ఇతర ఆర్థిక అంశాలు స్వల్పకాలిక ప్రణాళికలు.. ప్రస్తుతం స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ల సందర్భంగా ఆస్తి విలువలో 4 శాతం స్టాంపు డ్యూటీ, 1.5 శాతం ట్రాన్స్ఫర్ డ్యూటీని రిజిస్ట్రేషన్ల శాఖ వసూలు చేస్తోంది. ఇందులో పురపాలికలకు రావాల్సిన ట్రాన్స్ఫర్ డ్యూటీని 1.5 శాతం నుంచి 2.5 శాతానికి పెంచాలి. ఈ భారం ప్రజలపై పడకుండా స్టాంపు డ్యూటీని 4 నుంచి 3 శాతానికి తగ్గించాలి. ఆస్తిపన్ను పెంపుపై కోర్టు కేసులకు అయ్యే ఖర్చుల కోసం వసూలు చేసే వారంట్ ట్యాక్స్ను 0.12 నుంచి 5 శాతానికి పెంచాలి. ఆస్తి పన్నుల గణనలో లోటుపాట్లు, అసలు కొన్ని భవనాలకు గణనే జరగకపోవడం వంటి వాటిని సరిదిద్దాలి. బీపీఎస్, ఎల్ఆర్ఎస్ (భూముల క్రమబద్ధీకరణ) ద్వారా వచ్చే ఆదాయాన్ని వినియోగించుకునే అధికారాన్ని పురపాలికల పాలకవర్గాలకు అప్పగించాలి. సాంకేతిక అనుమతుల కోసం పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగం వసూలు చేస్తున్న 3 శాతం స్క్రూటినీ చార్జీలను రద్దుచేయాలి. మున్సిపాలిటీల్లో మొత్తం 3,887 పోస్టులుండగా.. 2,155 ఖాళీగా ఉన్నాయి. తక్షణమే 1,329 ఖాళీలను భర్తీ చేయాలి. మిగతా పోస్టులను పదోన్నతి ద్వారా భర్తీ చేయాలి. కొత్త నగర పంచాయతీల్లో 260 కొత్త పోస్టులను మంజూరు చేయాలి. తక్షణమే 100 పోస్టులు భర్తీ చేయాలి. మధ్య, దీర్ఘ కాలిక ప్రణాళికలు రాష్ట్ర పురపాలక, పట్టౄభివద్ధి శాఖ పరిధిలో మూడు విభాగాలు, ఏడు సంస్థలు పనిచేస్తున్నాయి. సీడీఎంఏ, డీటీసీపీ, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ తదితర చోట్లలో పనిచేస్తున్న ఉద్యోగులను ఇతర విభాగాలు/సంస్థలకు బదిలీ చేసేందుకున్న ఇబ్బందులను తొలగించేందుకు ఏృీకత సర్వీసు రూల్స్ను తీసుకురావాలి. ఆస్తిపన్నుల గణనలో లోపాలను నిర్మూలించేందుకు ఉపగ్రహ (జీఐఎస్) పరిజ్ఞానం ఆధారంగా గణన చేపట్టాలి. ఇందుకు రూ. 5.04 కోట్లు కేటాయించాలి. కేబుల్ ఆపరేటర్ల నుంచి వసూలు చేసే వినోద పన్ను మొత్తాన్ని వాణిజ్య పన్నుల శాఖ క్రమం తప్పకుండా మున్సిపాలిటీలకు చెల్లించాలి. పట్టణ ప్రణాళిక స్వల్పకాలిక ప్రణాళికలో భాగంగా అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ పథకం (బీపీఎస్)ను మళ్లీ అమలు చేయాలి. 2014 జూన్ 2ను కటాఫ్ తేదీగా నిర్ణయించి ఆలోగా ఏర్పాటైన అక్రమ లే ఔట్లను క్రమబద్ధీకరించేందుకు ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలి. దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్నగర్ పట్టణాలకు రింగ్ రోడ్లను నిర్మించాలి. 12 మున్సిపాలిటీల్లో కాలం చెల్లిన మాస్టర్ప్లాన్లను సవరించాలి. కేంద్రం అమలుచేస్తున్న స్మార్ట్సిటీస్ పథకం కింద వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, రామగుండం, మహబూబ్నగర్ నగరాలను ప్రతిపాదించాలి. శాటిలైట్ టౌన్షిప్లుగా మేడ్చేల్, భువనగిరి, పెద్దఅంబర్పేట్, షాద్నగర్, సంగారెడ్డి పట్టణాలనుృఅభివద్ధి చేయాలి. కేంద్రం త్వరలో ప్రవేశపెట్టనున్న ృఅమత్’ పథకం కింద హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, రామగుండం, మహబూబ్నగర్, నల్లగొండ, సిద్దిపేట, మిర్యాలగూడ, ఆదిలాబాద్, సూర్యాపేట పట్టణాలను చేర్చే విధంగా ప్రయత్నించాలి. -
సిబ్బంది విభజనకు రంగం సిద్ధం!
విధివిధానాలు రూపొందించిన ఎస్పీలు డీజీపీ అనుమతి పొందిన జాబితా ప్రకారమే ప్రక్రియ పోలీసుల్లో తీవ్ర ఆందోళన ఇప్పటికే ట్రిబ్యునల్ను ఆశ్రయించిన కొందరు గుంటూరు పోలీస్ శాఖలో సిబ్బంది విభజనకు రంగం సిద్ధమైంది. దీనిపై గుంటూరు అర్బన్, రూరల్ పోలీస్ సిబ్బంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఇప్పటికే ట్రిబ్యునల్ను ఆశ్రయించడంతో ఈ విషయాన్ని అర్బన్, రూరల్ ఎస్పీలు రాజేష్కుమార్, పీహెచ్డీ రామక ృష్ణ సీరియస్గా తీసుకున్నారు. నిన్నటివరకూ ఆచితూచి అడుగులు వేయగా తాజా పరిణామంతో విభజన ప్రక్రియను వెంటనే చేపట్టి సమస్యకు తెరదించాలని నిర్ణయించుకున్నారు. గుంటూరు అర్బన్ జిల్లా పరిధిలో సిబ్బంది కొరత సమస్యగా మారడం, నేరాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో అర్బన్ ఎస్పీ దీనిపై ద ృష్టి సారించారు. రూరల్ ఎస్పీ రామక ృష్ణ, ముఖ్య అధికారులతో చ ర్చించి విభజనకు విధివిధానాలు సిద్ధం చేయాలని సూచించారు. నిబంధనల ప్రకారం పదోన్నతులు రావాలంటే రూరల్కు వెళ్లాలంటూ సుమారు 90 మంది కానిస్టేబుళ్లు, ఏఎస్సైలను అర్బన్ ఇన్చార్జిగా ఉన్నపుడు రూరల్ ఎస్పీ రామక ృష్ణ రూరల్ బదిలీ చేశారు. దీంతో అర్బన్ జిల్లా పరిధిలోని పోలీస్స్టేషన్లలో తీవ్ర సిబ్బంది కొరత ఏర్పడింది. జిల్లా పరిధిలో నేరాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. సిబ్బంది కొరత వల్లే నేరాలను అదుపు చేయలేకపోతున్నామని పలువురు అధికారులు అర్బన్ ఎస్పీ రాజేష్కుమార్కు పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. దీంతో 2010 నుంచి పెండింగ్లో ఉన్న సిబ్బంది విభజన ప్రక్రియను పూర్తి చేయాలని, గతంలో డీజీపీ ఆమోదించిన జాబితా ప్రకారం చేపట్టాలని ఎస్పీలు నిర్ణరుుంచుకున్నారు. 2008లోనే అర్బన్, రూరల్ జిల్లాలుగా విడిపోగా ఇప్పటికీ సిబ్బంది విభజన జరగకపోవడంపై రాష్ట్ర డీజీపీ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సిబ్బందికి ఇబ్బందులు కలుగకుండా వారి అంగీకారం తీసుకుని అటాచ్మెంట్లు ఇవ్వాలని ఎస్పీలు యోచిస్తున్నట్టు సమాచారం. ఎస్పీలపై ఒత్తిళ్లకు యత్నాలు.. విభజన ప్రక్రియపై ఆందోళన చెందుతున్న పలువురు సిబ్బంది పోలీస్ అధికారుల సంఘంతో చర్చలు జరిపారు. కొందరు బుధవారం హైదరాబాద్ వెళ్లి ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. హైదరాబాద్లోని తమ యూనియన్ల ద్వారా అక్కడి ఉన్నతాధికారులతో ఎస్పీలకు ఫోన్లు కూడా చేయించారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల ద్వారా ఎస్పీలపై ఒత్తిడి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. ఎవరికీ అన్యాయం జరగదు.. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా విభజన ప్రక్రియ ఆగదని అర్బన్ ఎస్పీ రాజేష్కుమార్ స్పష్టం చేశారు. విభజనను నిబంధన ప్రకారం చేపడతామని, ఎవరికీ అన్యాయం జరగదని పేర్కొన్నారు. ఎవరైనా కోర్టుకు వెళ్లినా అభ్యంతరం లేదన్నారు. రూరల్ జిల్లా నుంచి అర్బన్కు వచ్చేందుకు ఎవరికీ అభ్యంతరం ఉండదని భావిస్తున్నట్టు చెప్పారు.