Venugopal
-
డైవర్ట్ చేయడానికే ఈ డ్రామాలు ..
-
పవన్కు ఇది తగునా?
పవన్ కల్యాణ్కు ‘మెకాలే’ తెలుసు. పద్దెనిమిదవ శతా బ్దంలో మెకాలే ఏమి చెప్పాడో కూడా తనకి తెలుసు. ఇన్ని తెలిసిన పవన్ కల్యాణ్కు ఇరవయ్యొకటో శతాబ్దంలో తాను ఏమి చెప్ప కూడదో తెలియకపోవడం మాత్రం విచారకరం!నిజానికి పవన్కి తెలుసో లేదో గానీ, లేదా అతను ఏ అర్థంలో వాడాడో గానీ – ‘సాంస్కృతిక సామ్రాజ్య వాదం’ అనే పద ప్రయోగం మెకాలే నాటికి లేదు. 1960ల నాటిది. హెర్బర్ట్ షిల్లెర్ దాన్ని (మొదటిగా కాకపోయినా) వివరించాడు.ఒకవేళ విదేశీ పాలకులు తమ పరిపాలనను స్థిరపరచుకోడానికి తమ భాషను, ఆచారాల్ని, సంప్ర దాయాల్ని తెచ్చి బలవంతంగా మన మీద రుద్దే ప్రయత్నాన్ని దృష్టిలో పెట్టుకొని పవన్ మాట్లాడాడు అనుకున్నా అది పూర్తిగా మెకాలేకి వర్తించక పోవచ్చు. సరే మన చర్చ మెకాలేది కాదు. వదిలేద్దాం. మెకాలేది గతం. పవన్ది వర్తమానం. అతనొక బ్రిటిష్ హిస్టోరియన్. బ్రిటిష్ భాష, బ్రిటిష్ సంస్కృతి, శిక్షా స్మృతి – ఇంకా అనేక బ్రిటిష్ పరంపరల బానిస మెకాలే. బ్రిటిష్ ఉద్యోగి. బ్రిటిష్ పౌరుడు మెకాలే. కాబట్టి ఆ యూరోపియన్ సంస్కృతి గొప్పదనాన్ని మన మీద రుద్దాలని చూశాడనుకుందాము. పవన్ చెప్పినట్లు అతనిది ‘సాంస్కృతిక సామ్రాజ్యవాదమే’ అనుకొందాము. మరి ఇప్పుడు పవన్ మాట్లాడుతున్నది ఏమిటి? దీన్ని ఏమంటారు?అన్ని మతాల, అన్ని కులాల ఓట్లతో గెలిచి,అందరి ప్రతినిధిగా ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడతానని ప్రమాణం చేసి, ఇప్పుడు ‘వారాహి’ సభలో ‘సనాతన ధర్మాన్ని కాపాడతానని, నేను ముమ్మాటికీ హిందువునేనని, దాని కోసం ప్రాణాలైనా అర్పిస్తానని’ చెప్పడం చూస్తుంటే పవన్ ఒక ‘హిందూ సాంస్కృతిక సామ్రాజ్యవాది’గా కనిపిస్తున్నారు. అంతేకాకుండా ‘అల్లాను, మహమ్మద్ ప్రవక్తను, క్రీస్తును విమర్శిస్తే ఒప్పుకుంటారా’ అంటూ ఒక హిందూ ఉగ్రవాదిగా కూడా మాట్లాడుతున్నారు. గెలవకముందు ‘నాకు కులం లేదు, మతం లేదు; నేను దేశాన్నీ, జాతినీ ప్రేమిస్తాను’ అని చెప్పి, గెలిచాక ‘నేను హిందువుని, సనాతన ధర్మాన్ని ఆరాధి స్తాను’ అని చెప్పడం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రెండు నాల్కల ధోరణిని బయట పెడుతుంది.‘నేను హిందువు’ని అని స్కూల్ సర్టిఫికెట్లో చెప్పినట్లుగా, ‘వారాహి సభ’లో కూడా చెప్పడమేనా? చేగువేరా, భగత్ సింగ్ పుస్తకాలు చదివి నేర్చుకున్నది ఇదేనా? మనం ఏదైనా చెబితే ఒక వంద మంది వింటారు. కానీ అదే పవన్ చెబితే లక్ష మంది వింటారు. అలాంటి పాపులారిటీ వున్న పవన్ ఇలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేయవచ్చునా? విశ్వనాథ సత్యనారాయణకు రామాయణం అనేది ఒక ‘కల్పవృక్షం’గా కనిపించింది. అదే రామా యణం రంగనాయకమ్మకు ‘విషవృక్షం’గా అనిపించింది. అయ్యప్పను గద్దర్ విమర్శించాడు. అయ్యప్ప పుట్టుక మీద, అతని భక్తుల దీక్ష మీద గద్దర్కి వున్న విమర్శ అది.సనాతన ధర్మం మీద, రాముని మీద ఈ రోజున పవన్ కల్యాణ్ చాలా ప్రేమను కురిపిస్తున్నాడు. అది అతని హక్కు. తమిళులకు ఏ రోజునా రాముడి మీద గౌరవం లేదు. సనాతన ధర్మం మీద ప్రేమ అంత కన్నా లేదు. అలా లేకపోవడానికి వారి కారణాలు వాళ్లకి ఉన్నాయి. ద్రవిడ సంస్కృతిలో రావణాసురు డికి వున్న చోటు రాముడికి లేదు. ఆ కోణంలో సనా తన ధర్మం అనేది ఉదయనిధి స్టాలిన్కి ఒక వైరస్ లాగా అనిపించి వుండవచ్చు.హిందూ దేవుళ్ళ మీద ఎలాగైతే విమర్శలు ఉన్నాయో, అలాగే క్రీస్తుని, అల్లాని, మహమ్మద్ ప్రవక్తని విమర్శించిన వాళ్ళూ ఉన్నారు. బైబిల్, ఖురాన్ల మీద రాసిన విమర్శలూ ఉన్నాయి. ఇదంతా ఏమీ చూడని పవన్ కల్యాణ్ అందర్నీ పట్టుకొని ‘సూడో సెక్యులరిస్టులు’ అని అంటున్నాడు.‘సనాతన ధర్మంలో అంటరానితనం వుంది.లింగ వివక్ష వుంది. అన్యాయం వుంది. అధర్మం వుంది’ అనుకున్న వాళ్ళు హిందూ మతం నుంచి వెళ్లిపోయారు. వేరే మతాల్లో చేరిపోయారు. దానికి కొన్ని వందల ఏళ్ళ చారిత్రక సందర్భం ఉంది. పవన్ ఇలా మాట్లాడటం వెనుక కూడా ఒక చారిత్రక సందర్భం ఉంది. జగన్ని ఒక సీటుకు పరి మితం చేయాలనుకోవడం ఆ సందర్భం కావచ్చు. లేదా తాను సీఎం కావడం భవిష్యత్తు సందర్భం కావచ్చు.జీవ శాస్త్రం ప్రకారం మనందరికీ ప్రాణం ఒక్కటే ఉంటుంది. ఆ ప్రాణాన్ని నిలుపుకోవడానికి చాలా అవసరాలూ, సందర్భాలూ ఉంటాయి. ప్రాణం పోవ డానికి, లేదా ఇచ్చేయడానికి మాత్రం ఒకే సందర్భం ఉంటుంది. కానీ పవన్ కల్యాణ్కు మాత్రం చాలా ప్రాణాలు ఉంటాయి. అవి ఇచ్చేయడానికి కూడా చాలా సందర్భాలు ఉంటాయి.దేశం కోసం ఒకసారి ఇచ్చేస్తారు. భారత జాతి కోసం ఇంకోసారి ఇచ్చేస్తారు. చేగువేరా కోసం, భగత్ సింగ్ కోసం లేదా వారి ఆదర్శాల కోసం మరొకసారి ఇచ్చేస్తారు. జగన్ని ఓడించడానికో, లేదా కూటమిని గెలిపించడానికో కూడా ఇచ్చేస్తుంటారు. ఇప్పుడు చివరగా సనాతన ధర్మాన్ని గెలిపించడానికి ఒక హిందువుగా ప్రాణాల్ని ఇచ్చేస్తానని చెబుతున్నారు.పవన్ కల్యాణ్ను ఒక హిందువుగా ఎంచి ఎవ్వరూ ఓట్లు వేయలేదు. సినిమా నటుడిగా, కాపు కులానికి చెందిన వాడిగా, కూటమిలో భాగస్థునిగా గెలిపించుకున్నారు. ఆ గెలిపించుకున్న వారంతా పవన్ గురించి ఇప్పుడు ఏమనుకోవాలి? తమను తాము హిందువుగా అనుకోని సమూహాలు ఈ దేశంలో చాలానే ఉన్నాయి. వారంతా ఇప్పుడు పవన్ గురించి ఏమనుకోవాలి?‘పవనిజం’ అంటే ఇదేనా? అలాంటప్పుడు దీన్ని ‘హిందూయిజం’ అని కదా అనాలి? దక్షిణ భారత మద్దతు కోసం ఉత్తర భారతాన్ని విమర్శించడం,ఆంధ్రా వారి మద్దతు కోసం తెలంగాణాను విమర్శించడం, తెలంగాణా వారి మద్దతు కోసం తెలంగాణను కీర్తించడం, ఇప్పుడు మళ్ళీ ఆర్యుల్ని కీర్తించడం కోసం ద్రావిడుల్ని విమర్శించడం! ఇలాంటి అవకాశ వాద రాజకీయాల ద్వారా పవన్ సాధించగలిగింది ఏముంటుంది?పవన్లో ఇప్పుడు చేగువేరా లేడు. భగత్ సింగ్ లేడు. థెరిస్సా లేరు. గద్దర్ కూడా లేడు (వీళ్లంతా నిజంగా ఉన్నారని కాదు). మోడీ మాత్రమే ఉన్నాడు!ఎన్. వేణుగోపాల్ వ్యాసకర్త మానవ హక్కుల కార్యకర్తమొబైల్: 98494 49012 -
లడ్డూలో ‘కుట్ర’ కోణం
సాక్షి, హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారనడంలో కుట్రకోణం దాగి ఉందని భారత వ్యవసాయ పరిశోధన సంస్థ పాలక మండలి సభ్యుడు బద్రవాడ వేణుగోపాల్ సంచలన విషయాలు వెల్లడించారు. జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ (ఎన్డీడీబీ) ఇచ్చిన నివేదికలోనే అసలు కుట్ర దాగి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.ఆ నివేదికపై సమగ్ర విచారణ జరిపించాలని, కోట్లాది మంది భక్తుల మనోభావాలపై తీవ్రమైన దాడి చేసేందుకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. రాష్ట్రపతితో పాటు భారత ప్రధాన మంత్రి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లకు కూడా ఆ లేఖను పంపారు. ఆ లేఖలో ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి. వ్యాపార ప్రయోజనాల కోసమే ఆ భేటీ∙టీటీడీ లడ్డూ వివాదానికి లోపభూయిష్టమైన ఎన్డీడీబీ కాఫ్ రిపోర్టుతో పాటు టీటీడీ, ఎన్డీడీబీ, రాష్ట్రీయ గోకుల్ మిషన్ (ఆర్జీఎం) పెద్దల అనుమానాస్పద వ్యాపార భేటీలు ఉత్ప్రేరకాలుగా మారాయి. ఈ నివేదిక తదనంతర పరిణామాలతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల విశ్వాసం దెబ్బతింది. ఈ విషయానికి లభించిన విపరీత ప్రచారం టీటీడీ విశ్వసనీయతను దెబ్బ తీసింది. ⇒ జూలై 6న నెయ్యి శాంపిళ్లను పరీక్ష కోసం పంపగా, అంతకంటే ముందు అంటే జూలై 5న టీటీడీ ఈవో జె.శ్యామలరావు, ఎన్డీడీబీ చైర్మన్ మీనేశ్.సి.షా, ఎన్ డీడీబీ మాజీ చైర్మన్ ఆర్జీఎం అదనపు కార్యదర్శి వర్షా జోషిల మధ్య భేటీ జరిగింది. ఈ భేటీ అనేక అను మానాలకు తావిస్తోంది. ⇒ ఈ భేటీ కారణంగానే నెయ్యి కల్తీ జరిగిందని వచ్చిన నివేదిక వెనుక రాజకీయ దురుద్దేశాలున్నాయేమోననే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ ముగ్గురి చర్యల కారణంగా లడ్డూ ప్రసాదానికి ఉన్న విశ్వసనీయత దెబ్బతింది. ఇందుకు వారే బాధ్యత వహించాలి. వ్యాపార లావాదేవీల కోసం వారి దురాశపూరిత వైఖరి క్షమించరానిది. వారు కఠిన శిక్షలు ఎదుర్కోవాలి. వారి ఆస్తులన్నింటినీ సీజ్ చేసి, ధార్మిక సంస్థలకు దానం చేయాలి. ఈ వ్యవహారంతో సూక్ష్మ సంబంధమున్న ఎవరినైనాసరే జైలుకు పంపాలి. ⇒ వాస్తవాలను పరిశీలించి ఆరోపణల వెనుక ఉన్న నిజాలను తెలుసుకోవడం కంటే హడావుడి ప్రకటనలకే రాజకీయ నాయకులు ప్రాధాన్యమిచ్చారు. అదే నిజ మైతే సదరు రాజకీయ నాయకులు కూడా న్యాయ పరంగా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. లడ్డూ పవిత్రతను కాపాడడం, మతపరమైన ఆచా రాలను సంరక్షించడం అత్యవసరం. ఇలాంటి రాజ కీయ అపస్వరాలు వినిపిస్తున్న వేళ దేవాలయాల నిర్వ హణను మత పెద్దలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏకపక్షంగా నియామకం⇒ వ్యాపార లావాదేవీల కోసం టీటీడీ ఈవో శ్యామ లరావుతో భేటీ అయిన ఎన్డీడీబీ చైర్మన్ మీనేశ్.సి.షా, వర్షాజోషీల ట్రాక్ రికార్డు వివాదాస్పదం. అధికార, ఆర్థిక దుర్వినియోగాలకు సంబంధించి ఆరోప ణలు వీరిపై వచ్చాయి. 2021 మే 31న వర్షాజోషి ఎన్డీడీబీ చైర్మన్గా రిటైర్ అయ్యారు. ఆ తర్వాత ప్రస్తుత చైర్మన్ మీనేశ్.సి.షాను ఆమె ఏకపక్షంగా నియ మించారు. ⇒ డిప్యూటీ జనరల్ మేనేజర్ హోదాలో ఉన్న షాను అనేక హోదాలు దాటించి మరీ చైర్మన్, ఎండీగా నియమించారు. ఈ ఇద్దరు దేశీయ పశు సంపదను పెంపొందించడం కంటే బహుళ జాతి సంస్థల ప్రయోజనాల కోసం విదేశీ రకాలను, జెర్సీ ఆవులను ప్రోత్సహించడంపైనే దృష్టి పెట్టి పని చేశారు. ఇది ప్రధాని మోదీ ఆలోచనకు, ఆయన హయాంలో నడుస్తున్న రాష్ట్రీయ గోకుల్ మిషన్కు విరుద్ధం. వీరిద్దరిపై ఆర్జీఎంకు సంబంధించి రూ.4,109 కోట్లు, నేషనల్ డెయిరీ ప్లాన్–1కు సంబంధించి రూ.2,242 కోట్ల నిధుల దుర్వినియోగంపై కూడా ఆరోపణలున్నాయి.వాళ్లే జవాబుదారీ⇒ టీటీడీ ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు కాఫ్ ఇచ్చిన రిపోర్టుపై సమగ్ర విచారణ జరిపించాలి. ఇందుకు బాధ్యులైన అధి కారులతో పాటు కోట్లాది మంది భక్తులను తప్పుదోవ పట్టించినందుకు టీటీడీ ఈవో జె. శ్యామలరావుతో పాటు ఎన్డీడీబీ చైర్మన్ మీనేశ్.సి.షాలను జవాబుదారులుగా చేయాలి. ⇒ ఎన్డీడీబీ చైర్మన్గా మీనేశ్.సి.షా నియామకమే నేరపూరితం. ఆయన పదోన్నతి లభించేందుకు దారి తీసిన పరిస్థితులపై విచారణ జరిపించాలి. ⇒ విదేశీ రకాలను ప్రోత్సహించి, స్వదేశీ పశు సంపద కార్యక్రమాలను నిర్వీర్యం చేయడంలో ఎన్డీడీబీ చైర్మన్గా, రాష్ట్రీయ గోకుల్ మిషన్ అదనపు కార్య దర్శిగా వర్షాజోషి తన హోదాను దుర్విని యోగం చేయడంపై కూడా విచారణ జరిపించాలి. ⇒ దేశంలోని అన్ని దేవాలయాల్లో దేశీయ ఆవు నెయ్యి ని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలి. ⇒ మీనేశ్.సి.షా, వర్షాజోషిల హయాంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ , పశుసంపద వృద్ధి (సీడీడీ) కార్య క్రమాల్లో జరిగిన ఆర్థిక అక్రమాలపై విచారణ జరిపించాలి. ⇒ ఈ విచారణ పూర్తి పారదర్శకంగా, జవాబుదారీగా ఉండేందుకు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా ఉన్నత స్థాయి అధికారితో విచారణ జరిపించాలి. కోట్లాది మంది భక్తుల విశ్వాసాలను పునరుద్ధరించడంతో పాటు ఈ వ్యక్తుల కారణంగా నష్టపో యిన రైతులకు మోదీ ప్రభుత్వం పట్ల ప్రజా విశ్వాసం కలిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలి. -
మనిషిలోని చీకటి కోణాల ఆవిష్కర్త!
కాశీభట్ల వేణుగోపాల్ అనే పేరు తెలుగు సాహిత్యంలో సుపరిచతమే. ఆ పేరుతో పాటు అతను ‘ఏవో మనో చీకటి కోణాల్ని గురించి రాస్తాడట’ అని కూడా పరిచయమే. కాశీభట్లను ఏమీ చదవనివాళ్లు కూడా ఈ మాత్రపు ప్రాథ మిక అవగాహనతో అతడి పట్ల ఒక కొండ గుర్తును ఏర్పరుచుకుంటారు. ఒక ప్రశస్త కుదింపునకు గురైన రచయితలలో కాశీభట్ల ముందుంటాడు.కాశీభట్ల మొదటి నవల ‘నేనూ–చీకటి’ వచ్చినప్పుడు దానిలోని చైతన్య స్రవంతి శైలి వల్ల అతడిని హత్తుకున్నవాళ్లు కొందరైతే, బండ కేసి బాదిన వాళ్లు కొల్లలు. ఎక్కువ మంది భాషాపాటవానికి అచ్చె రువొందారు. కాశీభట్లకు కవితాత్మకంగా వచనం రాయడం ఇష్టం. అది శేషేంద్ర ప్రభావం. కథా కథ నాన్ని సంక్లిష్టమైన చైతన్య స్రవంతిలో రాయడం ఇష్టం. ఇదేమో జేమ్స్ జాయిస్ ప్రభావం. రెండవ నవల ‘తపన’కు చాలా గుర్తింపు వచ్చింది కానీ మూడో నవల ‘దిగంత తాత్వికంగా ఉన్న నవల. సార్త్రే అస్తిత్వవాద ధోరణి ఈ నవలంతా పరుచుకొని ఉంది.నవలల్లో నైనా, కథల్లోనైనా కాశీభట్ల ఒకే దృష్టికోణంతో కథాకథనం చేస్తాడు. అది ప్రధాన పాత్ర మానసిక కోణం నుంచి జరుగుతుంది. కాబట్టి రచయిత ఆలోచనల్ని పాత్ర ఆలోచనలకు రంగరించడం సులభమయ్యింది. ఈ సందర్భంగానే చెప్పు కోవాల్సిన విష య మేమంటే... కాశీభట్ల సాహిత్యంలో స్త్రీ పాత్ర గొంతుకతో కథాకథనం జరగలేదు. స్త్రీలుంటారు గానీ స్త్రీల మానసిక కోణం ఉండదు. ఆయా పాత్రల ఒంటరి ఆలోచనలు (వాటినే రచ యిత చీకటి ఆలోచనలు అంటాడు) కథకు ఉత్ప్రేరకాలు. సర్వ సాధారణంగా బాహ్య ప్రపంచానికి అభ్యంతరకరంగా ఉండే ప్రవ ర్తనల్ని సృష్టించుకొని వాటి పర్యవసానాల ఆధారంగా కథను నడపడం కాశీభట్ల శైలి. పాత్ర ఆలోచనలో ఒకానొక మైక్రో సెకెనులో తలెత్తే ఆలోచనా శకలం, సభ్య సమాజ ఆలోచనకు అభ్యంతరకరంగా ఉంటుందనీ, అలా అభ్యంతరంగా ఉన్నప్పటికీ నెగెటివ్ ఆలోచనా శకలాలు పుట్టడమే సహజమనీ, వాటిని చూపించి మానవుడిని నగ్నంగా ఎత్తి చూపడమే తన సాహిత్య లక్ష్య మనీ గట్టిగా నమ్మాడు కాశీభట్ల. తన మొదటి నవల నుంచి చివరి నవల ‘అసంగతం’ దాకా దీన్ని చెప్పడానికే రాశానంటాడు.ఒకే ఒక్క సత్యం ‘మానవుడి మొదటి ఆలోచన దిగంబరమైనది’ అంటాడు. అదే కాశీభట్ల ఉద్దేశ్యంలో ‘చీకటి’. తన నవలలూ, కథలూ నిండా చీకటిని ఎన్ని రూపాల్లో చెప్పాడో ఎవరైనా పరిశోధన చేయెచ్చు. చీకటి ఒక ప్రలోభం. చీకటి ఒక కోరిక. చీకటి ఒక క్రియ. చీకటి ఒక ప్రయాణం. ఒక్కోసారి కాశీభట్ల సాహిత్యంలో చీకటే వెలుగు. చీకటిని గౌరవంగా తమోనమః అంటాడు. ఇక నేను అనే వాడు అన్ని సంద ర్భాల్లోనూ తన ప్రధాన పాత్ర. ఈ పాత్ర మనసు లోపలి దుర్మార్గ ఆలోచనల్ని, అభ్యంతరకరమైన యోచనల్నీ, అవి చర్యలుగా మారి, పాత్ర చుట్టూ ఉన్న సమాజంలోని చెడు, ప్రలోభం, దుర్మార్గం లాంటి చీకటులకు దోహదపడటాన్ని చిత్రిస్తాడు.విపరీతంగా ప్రపంచ సాహిత్యాన్ని చదివాడు. తెలుగు, ఇంగ్లీషు, సంస్కృతం, కన్నడ భాషల్లో పట్టు ఉండటం వల్ల... కథన భాష మణిప్రవాళం కావడం, తను రాసే వస్తువు పట్లా, అంశం మీదా గట్టి విషయ సేకరణా, తర్ఫీదు ఉండటంతో తను అనుకున్న వస్తువుతో ఆటలాడినంత సులభంగా రాస్తాడు. తన కేంద్రంగా రాస్తాడు. పాఠక కేంద్రాన్ని ఎట్టి పరిస్థి తుల్లోనూ అంగీకరించడు. కథాకథనంలో వాడే ప్రతీక లనో, అన్వయాలనో ఎవరైనా ప్రశ్నిస్తే, ‘మీరు సోమరి పాఠకులు. నన్ను చదవకున్నా ఫర్వాలేదు’ అంటాడు. అయితే ఈ కఠిన శైలి ‘కాలం కథల’లోనూ ఇటీవల రాసిన ‘చీకటీ గలు’, ‘అసత్యానికి ఆవల’, ‘అసంగతం’ నవలల్లో కొంత సరళమవడం చూడొచ్చు.కాశీభట్లను తాత్వికంగా చూసినప్పుడు నిరీశ్వర వాది. సొంత జీవితంలో తన బ్రాహ్మణత్వాన్ని తెంచి అవతలకి విసిరి వేసి డీ కాస్ట్ అయినవాడు. తొలి రోజుల్లో నక్సలైట్ భావాల పట్ల కూడా ఆసక్తి చూపినవాడు. ఇదంతా తన పాత్రల రూపంలో రికార్డు అయ్యే వుంది. ఒక ఇంటర్వ్యూలో కాశీభట్ల నిహిలిస్టును అన్నాడు. ప్రతి దాన్నీ అనుమానిస్తానన్నాడు. రేషనాలిటీ ఏదో మేరకు తన ఆలోచనల్లో భాగమైన రచయిత. తెలుగులో సీరియస్ సాహిత్యంతో మనసా కర్మణా నిజాయితీగా నిలబడ్డాడని చెప్పగలం. తనదైన సాహిత్య శైలి అపూర్వం అని అనవచ్చుగానీ అదే సమ యంలో త్రిపురనీ, వడ్డెర చండీదాస్నూ అతని ముందువారని గుర్తించకుండానూ ఉండలేం.– జి. వెంకటకృష్ణ, వ్యాసకర్త కవి, విమర్శకులు -
సీఎం జగన్ తోనే సామాజిక న్యాయం...
-
హైదరాబాద్లో ఎన్ఐఏ సోదాలు
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు గురువారం హైదరాబాద్లో వీక్షణం పత్రిక ఎడిటర్, వరవరరావు అల్లుడు ఎన్. వేణుగోపాల్తోపాటు రచయిత, పౌరహక్కుల నేత రవిశర్మ నివాసాల్లో సోదాలు జరిపారు. తెల్లవారుజామున 4 గంటలకే హిమాయత్నగర్లోని ఎన్. వేణుగోపాల్ ఇంటితోపాటు ఎల్బీ నగర్ శ్రీనివాసనగర్ కాలనీలోని రవిశర్మ ఇంట్లో సోదాలు నిర్వహించారు. పలు పుస్తకాలు, కొన్ని అనుమానాస్పద డాక్యుమెంట్లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 10న గచ్చిబౌలిలోని ఎన్ఐఏ కార్యాలయానికి విచారణ కోసం హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. ఆ కేసు ఆధారంగా దర్యాప్తు... మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు సంజయ్ దీపక్రావును గతేడాది సెప్టెంబర్ 15న కూకట్పల్లి పీఎస్ పరిధిలోని మలేసియా టౌన్షిప్లో సైబరాబాద్ పోలీసులు, తెలంగాణ ఇంటెలిజెన్స్ సిబ్బంది అరెస్ట్ చేశారు. ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ ఏడాది జనవరి 3న ఎన్ఐఏ అధికారులు మరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సంజయ్ దీపక్రావుతో ఎన్. వేణుగోపాల్, రవిశర్మకు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణల దృష్ట్యానే ఈ సోదాలు జరిగినట్లు సమాచారం. ఈ కేసులో వేణుగోపాల్ను 22వ నిందితుడిగా పేర్కొన్న ఎన్ఐఏ... రవిశర్మతోపాటు కేరళకు చెందిన మరో ముగ్గురిని సైతం నిందితులుగా చేర్చింది. కబలి దళం పేరిట సమావేశాలు నిర్వహించి ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రయత్నించినట్లు ఎఫ్ఐఆర్లో ఆరోపించింది. ఇదే కేసు దర్యాప్తులో భాగంగా గురువారం తెలంగాణతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, కేరళలోనూ సోదాలు నిర్వహించినట్టు ఎన్ఐఏ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సోదాల్లో మావోయిస్టు సాహిత్యంతో పాటు ఆరు సెల్ఫోన్లు, రూ. 1,37,210 నగదు స్వా«దీనం చేసుకున్నట్టు ఎన్ఐఏ అధికారులు పేర్కొన్నారు. పౌరహక్కుల సంఘాల ఖండన వేణుగోపాల్, రవిశర్మ ఇళ్లపై ఎన్ఐఏ దాడులను పౌరహక్కుల సంఘాల నాయకులు ఖండించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇష్టానుసారంగా దాడులు చేయకుండా సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలు ఇవ్వాలని ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేయగా అక్రమ కేసులు ఎత్తివేయాలని, ఉపా చట్టాన్ని రద్దు చేయాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణరావు డిమాండ్ చేశారు. నిర్బంద వ్యతిరేక వేదిక తెలంగాణ సైతం ఈ అరెస్టులను ఖండించింది. విచారణకు హాజరవ్వాలన్నారు: రవిశర్మ మన్సూరాబాద్: రవిశర్మ మీడియాతో మాట్లాడుతూ 10న విచారణకు హాజరుకావాలని ఎన్ఐఏ అధికారులు ఆదేశించారని చెప్పారు. 2016లో జనజీవన స్రవంతిలో కలిసినప్పటి నుంచి తాను ఎలాంటి మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొనడం లేదని స్పష్టం చేశారు. 2019లో స్థానిక పోలీసులు, 2021లో ఎన్ఐఎ అధికారులు తన ఇంట్లో సోదాలు చేసినా ఎలాంటి ఆధారాలు లభించలేదని గుర్తుచేశారు. ఇది పూర్తిగా అబద్ధపు కేసు: ఎన్.వేణుగోపాల్ ఎన్ఐఏ అధికారులు తనపై నమోదు చేసినది పూర్తిగా అబద్ధపు కేసని వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ ఆరోపించారు. ‘నేను ఒక మాస పత్రిక నడుపుతున్నాను. నేను ప్రస్తుతం విరసంలో లేను’అని మీడియాకు విడుదల చేసిన ఓ వీడియోలో ఆయన పేర్కొన్నారు. 2013లో నయీం బెదిరింపు లేఖలపై తాను రాసిన పుస్తకాలను ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారన్నారు. తన మొబైల్ ఫోన్ను సీజ్ చేశారని, ఈ నెల 10న విచారణకు హాజరుకావల్సిందిగా నోటీసులు ఇచ్చారని వేణుగోపాల్ పేర్కొన్నారు. -
T Congress: ఎమ్మెల్యేగా ఓడిపోతే ఇక అంతే..
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయా లని ఆశించి టికెట్ రాక భంగపడిన తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కేసీ వేణుగోపాల్ తనదైన శైలిలో బుజ్జగించా రు. పార్టీకి మంచి రోజులు వస్తున్నాయంటూ నచ్చజెప్పారు. భవిష్యత్తులో ప్రాధాన్యత ఇస్తామని హా మీ ఇచ్చారు. పలువురికి ఎంపీ సీట్లపై హామీ ఇచ్చినట్లు కూడా సమాచారం. నారాయణఖేడ్పై మీరే తేల్చుకోండంటూ నిర్ణయాన్ని ‘ఆ ఇద్దరికే’వదిలిపెట్టారు. ఒకరోజు పర్యటనకు గాను గురువారం హైదరాబాద్కు వచ్చిన ఆయన అర్ధరాత్రి వరకు తాజ్కృష్ణా హోటల్లో తెలంగాణ కాంగ్రెస్ నేతల తో సమావేశమయ్యారు. టికెట్లు రాని దాదాపు 15 మంది నేతలను పిలిపించి ఆయన స్వయంగా మాట్లాడారని సమాచారం. ముఖ్యంగా నారాయణఖేడ్ అసెంబ్లీ టికెట్ విషయంలో నెలకొన్న వివాదాన్ని ఆయన పరిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులకు ఎంపీ టికెట్ల విషయంలో హామీ ఇచ్చినట్టు గాందీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మీ ఇద్దరూ తేల్చుకోండి నారాయణఖేడ్ అసెంబ్లీ టికెట్ను జహీరాబాద్ మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్కు కాంగ్రెస్ పార్టీ కేటాయించింది. అయితే మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల కిష్టా రెడ్డి కుమారుడు సంజీవరెడ్డి కూడా ఈ టికెట్ ఆశించారు. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు నేతలను పిలిపించిన కేసీవీ ఎవరికి టికెట్ కావాలో తేల్చుకుని తన దగ్గరకు వస్తే వారికే బీఫారం ఇస్తానని చెప్పినట్టు తెలిసింది. దీంతో ఆ ఇద్దరు నేతలు ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడుకున్నారని, ఈ భేటీలో భాగంగా సంజీవరెడ్డి అసెంబ్లీకి, షెట్కార్ లోక్సభకు పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని, అందుకే చివరి నిమిషంలో బీఫారంను సంజీవరెడ్డికి ఇచ్చారని సమాచారం. షెట్కార్ను జహీరాబాద్ లోక్సభకు పోటీ చేయిస్తామని కేసీవీ స్పష్టమైన హామీ ఇవ్వడంతో నారాయణఖేడ్ కథ సుఖాంతమైంది. చదవండి: కాంగ్రెస్ అభ్యర్థుల ఖర్చు కేసీఆరే ఇస్తున్నారు మరికొందరికి కూడా.. ఇదే కోవలో కాంగ్రెస్ నేతలు బలరాం నాయక్, పారిజాతా నర్సింహారెడ్డి, గాలి అనిల్కుమార్, నాగరిగారి ప్రీతం, అద్దంకి దయాకర్, శివసేనారెడ్డి, బల్మూరి వెంకట్, బెల్లయ్య నాయక్ తదితరులతో కేసీవీ విడివిడిగా సమావేశమయ్యారు. వీరిలో బలరాం నాయక్ (మహబూబాబాద్), గాలి అనిల్కుమార్ (మెదక్)లకు లోక్సభ టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. అద్దంకి దయాకర్ (వరంగల్)ను కూడా పార్లమెంటుకు పోటీ చేయిస్తామని చెప్పినట్టు సమాచారం. ఎమ్మెల్యేగా ఓడిపోతే ఇక అంతే.. ఈ సమావేశాల్లో భాగంగా కేసీవీ మరో ఆసక్తికరమైన అంశాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు పట్టుపట్టి ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేస్తున్న నాయకులు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాల్సిందేనని, ఒకవేళ ఓటమి పాలైతే మాత్రం మళ్లీ ఎంపీ టికెట్లకు పోటీకి రాకూడదని ఆయన సూచించినట్టు తెలిసింది. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డిలతో కేసీవీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇద్దరు యువ నాయకులకు పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని, టికెట్ రానంత మాత్రాన అసంతృప్తి చెందాల్సిన పని లేదని చెప్పారని గాం«దీభవన్ వర్గాలు తెలిపాయి. బల్మూరి గురించి బోసురాజు ఏదో చెప్పబోగా.. ‘వెంకట్ గురించి అధిష్టానానికి తెలు సు. ఈ ప్రభుత్వంపై పార్టీ పక్షాన గట్టి పోరాటం చేశాడు. 60కి పైగా కేసులు నమోదయ్యాయి. జైలు కు కూడా వెళ్లి వచ్చాడు. రాహుల్గాంధీ జైలుకు వెళ్లి వెంకట్ను పరామర్శించారు..’అని వేణుగోపాల్ అ న్నారు. వెంకట్ రాజకీయ భవిష్యత్తుపై తాను వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటానని, పార్టీ కూడా వెంకట్కు తగిన ప్రాధాన్యతనిస్తుందని హామీ ఇచ్చినట్టు సమాచారం. కాగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి బల్మూరి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో వైపు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫోన్లో కేసీవీ తో మాట్లాడారని తెలుస్తోంది. అయితే ఆయన ఏం మాట్లాడారనేది పార్టీ వర్గాలు గోప్యంగా ఉంచాయి. కాగా వేణుగోపాల్ శుక్రవారం ఉదయం 6:30 సమయంలో ఢిల్లీ వెళ్లారు. -
నిర్మాత వేణుగోపాల్ మృతి
‘నక్షత్రం’(2017) సినిమా నిర్మాతల్లో ఒకరైన ఎస్వీఎస్ వేణుగోపాల్(60) బుధవారం రాత్రి మృతిచెందారు. కాచిగూడ నుంచి మహబూబ్నగర్ వెళుతున్న రైలు నుంచి ఆయన ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందారు. సీరియల్స్ నిర్మాతగా ఆయన బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితులే. ‘ఆనందో బ్రహ్మ’ (1996) సీరియల్తో నిర్మాతగా ఆయన ప్రస్థానం మొదలైంది. దాదాపు పది సీరియల్స్ నిర్మించారాయన. ‘ప్రియురాలు పిలిచె’ ఆయన తీసిన చివరి సీరియల్. ‘తులసీదళం’ సీరియల్కి నంది అవార్డు అందుకున్నారు వేణుగోపాల్. సినిమా నిర్మాతగా ‘నక్షత్రం’ ఆయన తొలి చిత్రం.. అదే చివరి చిత్రం కూడా. హీరో చిరంజీవి నటించిన తొలి టీవీ షో ‘విజయం వైపు పయణం’ కి వేణుగోపాల్ నిర్మాత. ఈ షోకి యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వం వహించారు. వేణుగోపాల్కి భార్య, ఇద్దరు కుమారులున్నారు. వేణుగోపాల్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. నేడు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా ‘నక్షత్రం’ సినిమా నిర్మాతల్లో ఒకరైన సజ్జు మాట్లాడుతూ ‘‘వేణుగోపాల్గారు రైలు నుంచి ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నాడన్నది అవాస్తవం. ఆయనకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు’’ అన్నారు. -
సీఎం జగన్తోనే సామాజిక న్యాయం
సాక్షి, చిత్తూరు: నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ అణగారిన వర్గాలను అక్కున చేర్చుకుని అన్నింటిలోనూ అధిక ప్రాధాన్యత ఇచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సామాజిక న్యాయం సాధ్యమైందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ చెప్పారు. సామాజిక సాధికారత సాధించిన తరువాతే ప్రజల వద్దకు బస్సు యాత్ర ద్వారా వస్తు న్నామన్నారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా గురువారం సాయంత్రం చిత్తూరు నగరంలో అశేష జనం మధ్య జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ ఈ నాలుగున్నరేళ్ల పాలనలో అన్ని పథకాలు, అన్ని రంగాల్లో సామాజిక న్యాయాన్ని పాటించి, అన్ని వర్గాలకు మేలు చేశారని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ, బీసీ సంక్షేమ శాఖల మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఐదుగురిని డిప్యూటీ సీఎంలను చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. 1931 తర్వాత బీసీ కులగణన జరగలేదని, మళ్లీ ఇప్పుడే సీఎం జగన్ దేశ చరిత్రలో నిలిచిపోయేలా బీసీ కులగణనకు పచ్చ జెండా ఊపారని కొనియాడారు. టీడీపీ పాలనలో సామాజిక న్యాయం ఎండమావిగా ఉండేదన్నారు. పైగా, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలను చంద్రబాబు సహా టీడీపీ నేతలు చులకన చేశారని గుర్తుచేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అన్ని స్థానాలనూ వైఎస్సార్సీపీ గెలవడం తథ్యమని చెప్పారు. మైనారిటీలను మోసం చేసిన టీడీపీ: అంజాద్ బాషా డిప్యూటీ సీఎం అంజాద్బాషా మాట్లాడుతూ.. టీడీపీ పాలనలో మైనారిటీలకు తీరని మోసం చేశారని విమర్శించారు. సీఎం జగన్ సామాజిక న్యాయాన్ని బాధ్యతగా భావించి అన్ని వర్గాలకు సమన్యాయం చేశారని, ఇందుకు తానే ప్రత్యక్ష సాక్ష్యమని అన్నారు. మైనారిటీ వర్గానికి చెందిన తనను డిప్యూటీ సీఎంను చేశారని, ఇది చరిత్రలో నిలిచిపోయే విషయమన్నారు. ఎన్నికలకు మూడు నెలల ముందు మాత్రమే చంద్రబాబుకు మైనారిటీలు గుర్తుకొచ్చి, మొక్కుబడిగా ఓ మంత్రి పదవి ఇచ్చారని చెప్పారు. అందుకు భిన్నంగా సీఎం జగన్ మొదటి కేబినెట్లోనే మైనారిటీ సామాజికవర్గానికి అవకాశం కల్పించారని తెలిపారు. మైనారిటీ మహిళను శాసన మండలి డిప్యూటీ చైర్మన్ను చేశారన్నారు. టీడీపీ పాలనలో మైనారిటీల సంక్షేమానికి కేవలం రూ.2,665 కోట్లే ఖర్చు చేశారని, సీఎం జగన్ పాలనలో ఈ నాలుగున్నరేళ్లలో ఏకంగా రూ.23,176 కోట్లు మైనారిటీల సంక్షేమానికి ఖర్చు చేశారని చెప్పారు. రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావు మాట్లాడుతూ.. బీసీ పార్టీగా డప్పు వాయించుకునే టీడీపీ బీసీలను దగా చేసిందని దుయ్యబట్టారు. ఎన్నికల్లో బీసీలను వాడుకొని, తరువాత తీసి పడేసేదని అన్నారు. వైఎస్ జగన్ రాకతో బీసీలకు మహర్దశ పట్టిందన్నారు. సీఎం వైఎస్ జగన్ నలుగురు బీసీలను రాజ్యసభకు పంపారన్నారు. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధితోపాటు సామాజిక న్యాయం చేస్తున్న సీఎం జగన్మోహన్రెడ్డికే ప్రజలందరూ అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. బడుగుల అభివృద్ధికి సీఎం జగన్ నిరంతర కృషి: డిప్యూటీ సీఎం నారాయణస్వామి డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ బడుగుబలహీన వర్గాల అభ్యున్నతికి సీఎం జగనన్న నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. రాజకీయ సమానత్వం పాటించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని చెప్పారు. పుంగనూరులో టీడీపీ కార్యకర్తలు, నాయకులను రెచ్చిగొట్టి చంద్రబాబు విధ్వంసం సృష్టించారన్నారు. పోలీసులను తీవ్రంగా గాయపరిచి వారిని కనీసం పరామర్శించలేదని చెప్పారు. పైగా, చిత్తూరు జిల్లా ఎస్పీ, పోలీసుల అంతు చూస్తామని నారా లోకేశ్ అనడం దుర్మార్గమన్నారు. -
హైదరాబాద్ వేదికగా తొలిసారి!
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో ఇటీవలే నియామకమైన అత్యున్నత విధాన నిర్ణాయక మండలి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) హైదరాబాద్లో తొలిసారిగా సమావేశం కానుంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులకు నూతనోత్సాహం తేవడం, కాంగ్రెస్ వైపు ప్రజల దృష్టి మళ్లించడం లక్ష్యంగా ఈ సమావేశాలను నిర్వహించనుంది. గత నెల 20న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సీడబ్ల్యూసీని పునర్వ్యవస్థీకరించిన విషయం తెలిసిందే. 16, 17 తేదీల్లో కొత్త కమిటీ తొలి సమావేశం కోసం హైదరాబాద్ను ఎంచుకున్నారు. సోమవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ వివరాలను వెల్లడించారు. 17న విస్తృతస్థాయి సమావేశం తర్వాత అనంతరం భారీ బహిరంగ సభను నిర్వహించనున్నామని.. తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అందించే 5 గ్యారెంటీ హామీలను ప్రకటించనున్నామని వివరించారు. 17న నియోజకవర్గాల్లో బస ఈ నెల 17న బహిరంగ సభ ముగిశాక అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో తమకు కేటాయించిన చోటికి వెళ్లి రాత్రి బస చేస్తారు. 18న ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయా నియోజకవర్గాల్లో జరిగే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థానిక నేతలతో కలసి మధ్యాహ్న భోజనం చేస్తారు. అయితే ఈ నెల 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఉన్న నేపథ్యంలో.. నియోజకవర్గాల పర్యటన నుంచి ఎంపీలకు మినహాయింపు ఇచ్చినట్టు కేసీ వేణుగోపాల్ తెలిపారు. సోనియా, రాహుల్, ప్రియాంక.. అంతా.. హైదరాబాద్లో జరిగే సీడబ్ల్యూసీ భేటీ తొలిరోజు సమావేశాల్లో.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీతోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు సహా మొత్తం 39 మంది సీడబ్ల్యూసీ సభ్యులు, 32 మంది శాశ్వత ఆహ్వానితులు, 9 మంది ప్రత్యేక ఆహ్వానితులు, నలుగురు ఎక్స్ అఫీషియో సభ్యులు పాల్గొననున్నారు. రెండోరోజు 17న జరిగే విస్తృతస్థాయి సీడబ్ల్యూసీ సమావేశంలో వర్కింగ్ కమిటీ సభ్యులతోపాటు అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఆఫీస్ బేరర్లు పాల్గొంటారు. గత ఐదేళ్లలో ఢిల్లీ వెలుపల సీడబ్ల్యూసీ సమావేశం జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. 2019 మార్చి 12న గుజరాత్లోని అహ్మదాబాద్లో సీడబ్ల్యూసీ భేటీ జరిగింది. తర్వాత ఢిల్లీలోనే ఈ భేటీలు నిర్వహించారు. ఈసారి హైదరాబాద్లో జరగనున్నాయి. -
కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీలో ఉత్తమ్
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం నూతనంగా 16 మంది సభ్యులతో కేంద్ర ఎన్నికల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కీలక కమిటీలో తెలంగాణ నుంచి పార్టీ ఎంపీ ఉత్తమ్కుమార్ రెడ్డికి చోటు కల్పించారు. మల్లికార్జున ఖర్గే ఈ కమిటీని ఏర్పాటు చేయగా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో మల్లికార్జున ఖర్గే, సోనియా గాందీ, రాహుల్ గాందీ, అంబికా సోని, అదీర్ రంజన్ చౌదరి, సల్మాన్ ఖుర్షీద్, మధుసూదన్ మిస్త్రీ, ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి, టీఎస్ సింగ్ దేవ్, కేజే జార్జ్, ప్రీతమ్ సింగ్, మహమ్మద్ జావేద్, అమీ యాజ్ఞిక్, పీఎల్ పునియా, ఓంకార్ మార్కం, కేసీ వేణుగోపాల్లు ఉన్నారు. ఉత్తమ్ సేవలను అధిష్టానం గుర్తించింది వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)తో సమానంగా పరిగణించే కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)లో ఎంపీ ఉత్తమ్కుమార్ రెడ్డికి చోటు లభించడం పట్ల రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సీఈసీలో తెలుగు రాష్ట్రాల నుంచి గత మూడు, నాలుగు దశాబ్దాలుగా ఎవరికీ అవకాశం లభించలేదు. ఈ పదవిలో ఆయన ఐదేళ్ల పాటు కొనసాగనున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసే ఈ కమిటీలో ఉత్తమ్కు హైకమాండ్ స్థానం కల్పించడం విశేషం. రాష్ట్ర మంత్రిగా, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, అధ్యక్షునిగా, 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఆయన పార్టీకి చేసిన సేవలను అధిష్టానం గుర్తించిందని, ఆయన నిబద్ధతకు ఇదో నిదర్శనమని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ అధిష్టానానికి, గాంధీ కుటుంబానికి ఉత్తమ్పై ఉన్న నమ్మకం మరోమారు రుజువైందని చెపుతున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఫైటర్ పైలట్ గా సేవలందించిన ఉత్తమ్కుమార్, భారత రాష్ట్రపతి కార్యాలయంలో ఉన్నతోద్యోగిగా పనిచేస్తున్న సమయంలో రాజకీయాల్లోకి వచ్చారు. 1994లో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన మూడు దశాబ్దాలుగా పార్టీలో కొనసాగుతున్నారు. -
‘సీఎం జగన్తోనే నా పయనం’
సాక్షి, దర్శి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే తన రాజకీయ పయనం ఉంటుందని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ స్పష్టం చేశారు. కొన్ని మీడియా సంస్థలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. తన కుమారుడి వివాహం, సొంత పనుల కారణంగా రెండు నెలలుగా నియోజకవర్గానికి దూరంగా ఉండాల్సి వచ్చిందన్నారు. కాగా, ప్రకాశం జిల్లా దర్శిలోని తన కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ ఎలా చెబితే అలా నడుచుకుంటానని స్పష్టంచేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో దర్శి నియోజకవర్గంలో తిరిగి వైఎస్సార్సీపీ గెలుస్తుందన్నారు. దర్శి పట్టణం, నియోజకవర్గంలో ఇంటింటికీ మంచినీటి సరఫరా కోసం త్వరలో టెండర్లు పిలుస్తున్నట్టు తెలిపారు. దర్శిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం నిర్మాణానికి రూ.6 కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు. ఎన్నికల కోడ్ ముగిశాక గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళతానని చెప్పారు. -
దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన మంత్రి వేణుగోపాల్
-
16న సీడబ్ల్యూసీ సమావేశం
సాక్షి, న్యూఢిల్లీ: ఈనెల 15న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కానుందని ఏఐసీసీ కార్యదర్శి వేణుగోపాల్ ప్రకటించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులతో పాటు పలు విషయాలను కమిటీ చర్చిస్తుందన్నారు. మే తర్వాత సీడబ్లు్యసీ సమావేశం జరగడం ఇదే తొలిసారి. సమావేశంలో గతంలో ధిక్కార స్వరం వినిపించిన జీ23 గ్రూపు నేతలు ఎలా ప్రవర్తిస్తారని ఆసక్తి నెలకొంది. అలాగే పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికపై చర్చను లేవనెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఈ విషయంపై జీ–23 నేతలు లేఖ రాయడం ద్వారా సంచలనం సృష్టించారు. తాజాగా గ్రూపులోని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ పార్టీ నాయకత్వంపై మాటల దాడి చేశారు. పారీ్టలో ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారని, లేఖ రాసి ఒక సంవత్సరం గడిచినప్పటికీ, అధ్యక్ష ఎన్నిక కోసం చేసిన డిమాండ్ నెరవేరలేదని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. పంజాబ్లో పరిణామాలు, అంతర్గత కలహాలు, ఉత్తర్ప్రదేశ్ లఖీంపూర్ ఖేరీ ఘటన సహా ఇతర రాజకీయ పరిణామాలపై సమావేశంలో విస్తృత చర్చలు జరగవచ్చని అంచనా. -
ఫైబర్గ్రిడ్.. మదర్ ఆఫ్ స్కామ్స్!
సాక్షి, అమరావతి: ఫైబర్గ్రిడ్ ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలు పెద్దఎత్తున జరిగాయని, ఈ విషయంలో గత టీడీపీ ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడిందని, దీనిని కుంభకోణం అనడం కంటే.. మదర్ ఆఫ్ స్కామ్స్ అన టం కరెక్టు అని పేస్ పవ ర్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమి టెడ్ ఎండీ, ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ తీవ్రంగా విమర్శించారు. టెండర్ వేసిన సమయంలో తాను వైఎస్సార్సీపీ సభ్యుడిని కూడా కాదని, ఒక ఔత్సాహిక పారిశ్రామిక వేత్తగా అన్ని అర్హతలతో ఫైబర్గ్రిడ్ ప్రాజెక్టు కోసం పేస్ పవర్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున టెండర్ వేశానన్నారు. కానీ, ఎటువంటి అర్హతలేని, బ్లాక్లిస్ట్లో ఉన్న టెరాసాఫ్ట్ కన్సార్టియంకు అప్పటి టీడీపీ ప్రభుత్వం దొడ్డిదారిన టెండర్ ఖరారు చేసిందని ఆరోపించారు. నిజానికి ఫైబర్గ్రిడ్ మొదటి దశ పనుల కోసం చేపట్టిన రూ.329 కోట్ల టెండరు ఎంపికలోనే పెద్ద స్కాం జరిగిందన్నారు. ఆ తర్వాత సెటాప్ బాక్సులు, సీసీ కెమెరాలు, భారత్ నెట్ ఫేజ్–2లకు సంబంధించి మొత్తం రూ.3,113 కోట్లకు టెండర్లు పిలిచారని.. ఈ వ్యవహారంలో గత తెలుగుదేశం ప్రభుత్వం భారీ స్కామ్కు పాల్పడిందని ఆయన వివరించారు. వీటన్నింటిపై సీఐడీతో సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఫైబర్ గ్రిడ్ టెండర్కు సంబంధించి వాస్తవాలను ప్రజల ముందు ఉంచడానికి మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. టెండరు వెనుక పెద్ద కుట్ర ‘అర్హతలేని టెరాసాఫ్ట్కు ఫైబర్ గ్రిడ్ టెండరు కట్టబెట్టడం వెనక పెద్ద కుట్రే నడిచింది. టెరాసాఫ్ట్ కన్సార్టియం నిబంధనలకు విరుద్ధంగా రెండు ప్రైస్బిడ్లు వేశారు. మాకు అన్ని అర్హతలు ఉన్నా పక్కన పెట్టారు. పేస్ పవర్ సిస్టమ్స్ ప్రైవేటే లిమిటెడ్ తరఫున నేను టెండర్ వేశాను. కానీ, టీడీపీ ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని ఫైబర్ గ్రిడ్ స్కాంకు పాల్పడింది. టెండరు ఖరారుకు 2 నెలల ముందు బ్లాక్లిస్టులో ఉన్న టెరాసాఫ్ట్కు దొడ్డిదారిన క్లియరెన్స్ ఇచ్చారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక పారదర్శకంగా టెండర్లు ఈ–ప్రొక్యూర్మెంట్ వేదికగా ఫైబర్గ్రిడ్ టెండర్లు పిలిచారు. బిడ్డర్ తప్పనిసరిగా కంపెనీగా ఉండాలి అనే నిబంధన ఉంది. ఆ కంపెనీకి ఆ రంగంలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. ఏ కంపెనీ కూడా బ్లాక్లిస్ట్ అయి ఉండకూడదు. నాలుగు కంపెనీలు టెండర్లు వేశాయి. వీటిలో మూడు కంపెనీలకు అర్హత లేదు. కానీ, ఆ మూడు కలిసి ఒక సంస్థగా ఏర్పడ్డాయి, టెండర్ నిబంధనలను ఉల్లంఘించినా వాటిని అనర్హులుగా గుర్తించలేదు. టెరాసాఫ్ట్ సంస్థ బ్లాక్లిస్టులో ఉంటే పట్టించుకోలేదు. దొడ్డిదారిన బ్లాక్లిస్ట్ను ఎత్తివేయించుకున్నారు. అదే వైఎస్ జగన్ సీఎం అయ్యాక టెండర్ల విధానాన్ని పూర్తి పారదర్శకంగా ఉంచేందుకు ఏకంగా చట్టం తెచ్చారు. జ్యుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ విధానం ప్రవేశపెట్టారు. 2014–19 వరకూ అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితి ఎక్కడా ఎప్పుడూ కనిపించనేలేదు. పాత్రధారులు, సూత్రధారులను శిక్షించాలి నిజానికి.. ఫైబర్ గ్రిడ్ తొలిదశ ప్రాజెక్టు రూ.329 కోట్లు అని చెప్పారు. ఇదికాక.. సెటాప్ బాక్సులు, సీసీ కెమెరాలు, భారత్ నెట్ ఫేజ్–2కు సంబంధించి మూడు టెండర్లను పిలిచి వారికి అనుకూలమైన కంపెనీలకే కట్టబెట్టారు. ప్రాజెక్టు మొదటి దశ టెండర్లలోనే ఇంత స్కామ్ జరిగినప్పుడు, మిగిలిన మూడు టెండర్లలో ఎంత కుంభకోణం జరిగిందో ఊహించుకోవచ్చు. ఒక ప్రజాప్రతినిధిగా, బాధ్యతగల పౌరుడిగా, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫైబర్గ్రిడ్ కుంభకోణంలోని వాస్తవాలను ప్రజలకు చెప్పేందుకే మీడియా ముందుకు వచ్చాను. ఈ స్కాంపై విచారణ జరుపుతున్న సీఐడీ.. ఇందులో ఉన్న పాత్రధారులు, సూత్రధారులను, అప్పటి అధికారులను, వారి వెనకున్న టీడీపీ ప్రభుత్వంలోని పెద్దలను కఠినంగా శిక్షించాలి. ఆ రోజు మా కంపెనీకి రావాల్సిన టెండర్లు మాకు దక్కకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎంత దారుణంగా అధికార దుర్వినియోగం చేశారో ప్రజలు అర్ధం చేసుకోవాలి’. -
చంద్రబాబు చేనేతల గురించి మాట్లాడే అర్హత లేదు : వేణుగోపాల్
-
Corona: టీటీ మాజీ ప్లేయర్ చంద్రశేఖర్ మృతి
న్యూఢిల్లీ: భారత్ టేబుల్ టెన్నిస్ (టీటీ) మాజీ క్రీడాకారుడు, ‘అర్జున అవార్డు’ గ్రహీత వేణుగోపాల్ చంద్రశేఖర్ (64) కరోనాతో కన్నుమూశారు. మూడుసార్లు జాతీయ చాంపియన్గా నిలిచిన చంద్రశేఖర్ 1982 కామన్వెల్త్ క్రీడల్లో సెమీఫైనల్ చేరారు. క్రీడాకారుడిగా కెరీర్ ముగిశాక ఆయన కోచ్గా మారారు. ప్రస్తుత యువ ఆటగాడు సత్యన్, జాతీయ మాజీ చాంపియన్ ఎస్.రామన్ ఆయన శిష్యులే. చనిపోయే సమయానికి చంద్రశేఖర్ చెన్నైలోనే ఎస్డీఏటీ–మెడిమిక్స్ టీటీ అకాడమీకి హెడ్ కోచ్గా వ్యవహరిస్తున్నారు. -
అస్తమించిన యుద్ధ వీరుడు.. సీఎం జగన్ సంతాపం
తిరుపతి (అన్నమయ్య సర్కిల్): దేశ సరిహద్దుల్లో శత్రువుతో వీరోచిత పోరాటం చేసి పదవీ విరమణ పొందిన యుద్ధవీరుడు మాజీ మేజర్ జనరల్ సి.వేణుగోపాల్ (95) అనారోగ్యంతో కన్నుమూశారు. మంగళవారం తిరుపతిలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1927 నవంబర్ 14న జన్మించిన వేణుగోపాల్ దేశానికి సేవ చేయాలనే తపనతో ఆర్మీలో హవల్దార్గా చేరి నేషనల్ డిఫెన్స్ అకాడమీ (డెహ్రాడూన్)లో సీటు సాధించారు. అనంతరం లెఫ్టినెంట్ కల్నల్ హోదాకు ఎదిగి, మేజర్ జనరల్ హోదాలో పదవీ విరమణ చేశారు. దేశానికి చేసిన సేవకు గుర్తింపుగా రాష్ట్రపతి చేతుల మీదుగా ‘పరమ విశిష్ట సేవా మెడల్’, ‘మహా వీరచక్ర’ అవార్డులు అందుకున్నారు. 36 ఏళ్లు ఆర్మీలో కొనసాగిన ఆయన దేశ సేవకే తన జీవితాన్ని అంకితం చేస్తూ వివాహానికి సైతం దూరంగా ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 18న తిరుపతి వేదికగా జరిగిన సాయుధ దళాల స్వర్ణోత్సవాల కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయన గృహానికి వెళ్లి సత్కరించారు. వేణుగోపాల్ కొన్నేళ్లుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. సీఎం జగన్ సంతాపం మాజీ మేజర్ జనరల్ సి.వేణుగోపాల్ (95) మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. చదవండి: ఏబీఎన్ రాధాకృష్ణ భార్య మృతి.. సీఎం జగన్ సంతాపం -
సరిహద్దుల్లో చిన్న అలజడి రేగినా రక్తం మరిగిపోతుంది
తిరుపతి (అన్నమయ్య సర్కిల్): ఆయన వయసు 95 ఏళ్లు.. పూర్తిగా మంచానికే పరిమితమయ్యారు. అయినా.. నిత్యం దేశం కోసమే ఆలోచిస్తారు. దేశ సరిహద్దుల్లో ఏవైనా అలజడులు తలెత్తినట్టు తెలిస్తే మదనపడిపోతారు. ఆ రోజూ భోజనం కూడా సరిగా చేయరు. ఆయన పేరు సి.వేణుగోపాల్.. రిటైర్డ్ మేజర్ జనరల్. ఆర్మీలో పని చేస్తున్నప్పుడు శత్రు దేశాలను వణికించారు. భారత్–పాక్ యుద్ధ సమయంలో భారత జవాన్ల సత్తా ఏమిటో శత్రు సైన్యానికి రుచి చూపించిన ఆ మహాయోథుడు తిరుపతిలో శేష జీవితాన్ని గడుపుతున్నారు. 1971లో ఇండియా, పాకిస్తాన్ సరిహద్దులో జరిగిన యుద్ధంలో ఇండియన్ ఆర్మీ సాధించిన విజయాన్ని పురస్కరించుకుని తిరుపతి కేంద్రంగా గురువారం ‘స్వర్ణిమ్ విజయ్ వర్‡్ష’ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరవుతున్నారు. నాటి యుద్ధంలో పాల్గొన్న ప్రధాన అధికారుల్లో ఒకరైన రిటైర్డ్ మేజర్ జనరల్ సి.వేణుగోపాల్ను ఆయన ఇంటికి వెళ్లి సీఎం సత్కరించనున్నారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ను ‘సాక్షి’ పలకరించింది. ఆయన ఏమన్నారంటే.. దేశం కోసం పోరాడాలనే ఆలోచనే.. మాది తిరుపతి సరోజినిదేవి రోడ్డు ప్రాంతంలో ఓ సాధారణ కుటుంబం. 1927 నవంబర్ 14న పుట్టాను. మా తల్లిదండ్రులు చిన్నస్వామి, రుక్మిణమ్మలకు మేం 9 మంది సంతానం. నేను రెండో వాడిని. అందరూ వివిధ ప్రాంతాల్లో సెటిలయ్యారు. నాకు చిన్నప్పటి నుంచి దేశ సేవ చేయాలనే తపన ఒక్కటే ఉండేది. ఎలాగైనా సైన్యంలో చేరాలని ఆరాటపడేవాడిని. ఆర్మీలో హవల్దార్గా చేరి నేషనల్ డిఫెన్స్ అకాడమీ (డెహ్రాడూన్)లో సీటు సాధించాను. కఠోర శిక్షణ పొంది గుర్కా రైఫిల్స్లో చేరి లెఫ్ట్నెంట్ కల్నల్ హోదాకు ఎదిగాను. ఈశాన్య రాష్ట్రాల్లో గుర్కా రైఫిల్స్ మలౌన్ రెజిమెంట్లో పనిచేస్తూ మేజర్ జనరల్ హోదాలో పదవీ విరమణ చేశాను. 1971 డిసెంబర్ 4న శుత్రు సైన్యం సరిహద్దులోని వుథాలి, దర్శన ప్రాంతాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేయగా.. ఇండో–పాక్ యుద్ధం జరిగింది. అందులో నేను సభ్యుడిగా.. బెటాలియన్కు నాయకుడిగా ఉంటూ సైన్యాన్ని అప్రమత్తం చేసి విజయం సాధించాం. దేశసేవకు గుర్తింపుగా రాష్ట్రపతి చేతుల మీదుగా ‘పరమ్ విశిష్ట్ సేవా మెడల్’ (పీవీఎస్ఎం), మహావీర్ చక్ర (ఎంవీసీ) అవార్డులు అందుకున్నాను. 1950 నుంచి 1986 వరకు సుమారు 36 ఏళ్లు ఆర్మీలో కొనసాగాను. ఇప్పటికీ దేశ సరిహద్దులో శత్రుసైన్యాలు అలజడి చేస్తే రక్తం మరిగిపోతుంది. 95 ఏళ్ల వయసులో శరీరం సహకరించకపోయినా దేశం కోసం పోరాడాలనే ఆలోచనే తప్ప మరో వ్యసనం లేదు. అందుకే వివాహం చేసుకోలేదు. ఎవరికైనా సరే వ్యక్తి ప్రయోజనాలు ముఖ్యం కాదు. దేశ ప్రయోజనాల కోసం ఆలోచించే సమాజం కావాలి. అందుకు యువత నడుం కట్టాలి. టెక్నాలజీ మాత్రమే ప్రపంచం కాదు. దేశమే ప్రధానం.. ఆ తరువాతే టెక్నాలజీ. ప్రతి పౌరుడూ రోజుకు కనీసం 5 నిమిషాలపాటు దేశం కోసం ఆలోచన చేయాలి. అప్పుడే దేశం మనకు కోరిన కోర్కెలను తీరుస్తుంది. జై జవాన్.. భారత్ మాతాకీ జై’ అంటూ ముగించారు. నేటి నుంచి తిరుపతిలో సాయుధ దళాల స్వర్ణోత్సవాలు సాక్షి, తిరుపతి/సాక్షి,అమరావతి: ఆధ్యాత్మిక నగరం తిరుపతి సాయుధ దళాల స్వర్ణోత్సవాలకు సిద్ధమైంది. దాయాది పాకిస్తాన్పై భారత సాయుధ దళాల అద్భుత విజయానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ‘స్వర్ణిమ్ విజయ్ వర్‡్ష’ కార్యక్రమాల్లో భాగంగా తిరుపతిలో గురువారం నుంచి శనివారం వరకు స్వర్ణోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. 1971 డిసెంబర్ 4న బంగ్లాదేశ్ విముక్తికి పాక్తో జరిగిన యుద్ధంలో భారత్ చిరస్మరణీయమైన విజయం సాధించింది. ఆ యుద్ధంలో పాల్గొని పరమవీర చక్ర, మహావీర చక్ర అవార్డులు పొందిన రిటైర్డ్ మేజర్ జనరల్ సి.వేణుగోపాల్(95). వీరచక్ర అవార్డు పొందిన విశాఖకు చెందిన సన్యాసినాయుడు, కాకినాడకు చెందిన కేజే క్రిస్టోఫర్ కుటుంబ సభ్యులను సీఎం సన్మానిస్తారు. తిరుపతికి చేరుకున్న విజయ జ్వాల స్వర్ణిమ్ విజయ్ వర్‡్ష కార్యక్రమంలో భాగంగా ఢిల్లీలో బయలుదేరిన విజయ జ్వాల (విక్టరీ ప్లేమ్) హైదరాబాద్ నుంచి బుధవారం తిరుపతికి చేరింది. విజయ జ్వాలకు ఆర్మీ అధికారులు తిరుపతి ఎస్వీ వర్సిటీ పరిపాలనా భవనం వద్ద ఘన స్వాగతం పలికారు. -
రూ. 30 వేల కోట్లు కడతాం
న్యూఢిల్లీ: రుణ బాకీలను సెటిల్ చేసుకునేందుకు, 13 గ్రూప్ కంపెనీలపై దివాలా చర్యలను ఆపివేయించుకునేందుకు వీడియోకాన్ గ్రూప్ మాజీ ప్రమోటరు వేణుగోపాల్ ధూత్ కుటుంబం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా రుణదాతలకు రూ. 30,000 కోట్లు కడతామంటూ ఆఫర్ చేసింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనను రుణదాతల కమిటీ (సీవోసీ) ముందు ఉంచినట్లు ధూత్ వెల్లడించారు. రుణదాతలు, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) దీనికి అంగీకరించిన పక్షంలో ఈ ఏడాది ఆఖరు నాటికి సెటిల్మెంట్పై తుది నిర్ణయం రావచ్చని భావిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ (సీఐఆర్పీ) కింద చర్యలు ఎదుర్కొంటున్న 15 గ్రూప్ కంపెనీలకు గాను 13 సంస్థలకు సంబంధించి ఈ ఆఫర్ను ప్రతిపాదించినట్లు ధూత్ చెప్పారు. కేఏఐఎల్, ట్రెండ్ అనే రెండు సంస్థలను ఇందులో చేర్చలేదని వివరించారు. ‘వచ్చే 30 నుంచి 60 రోజుల్లోగా దీనిపై తుది నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నాను‘ అని ధూత్ పేర్కొన్నారు. దివాలా పరిష్కార ప్రక్రియను వేగవంతం చేసేందుకు, మరింత మెరుగైన విలువను రాబట్టేందుకు ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ మొత్తం 15 గ్రూప్ కంపెనీల కేసులను కలిపి విచారణ జరుపుతోంది. -
రిట్ దాఖలు చేసిన వేణుగోపాల్
సాక్షి, హైదరాబాద్: పోలీసులు తనపై అక్రమంగా కేసులు బనాయించారని, ముందస్తు బెయిల్ మంజూరు చేయాల ని కోరుతూ సీనియర్ జర్నలిస్ట్, వీక్షణం మాసపత్రిక సంపాదకుడు ఎన్.వేణుగోపాల్ హైకోర్టును ఆశ్రయించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం, తెలంగాణ ప్రజా భద్రతా చట్టం కింద తనపై అక్రమ కేసు బనాయించారని, ఇది భావప్రకటనా స్వేచ్ఛను హరించడమేనని హైకోర్టుకు తెలిపారు. ఈ రిట్ను గురువారం న్యాయమూర్తి జస్టిస్ గండికోట శ్రీదేవి విచారించారు. ఈ కేసు పూర్తి వివరాలు, బెయిల్ మంజూరు అంశాలపై వైఖరిని తెలపాలని పోలీసులను ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేశారు. హైదరాబాద్లో ఈ నెల 12న ఎన్.రవిశర్మ, బి.అనూరాధను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో హఠాత్తుగా వేణుగోపాల్ పేరును నిందితుడిగా చేర్చి పోలీసులు ఆయనను వేధింపులకు గురిచేస్తున్నారని వేణుగోపాల్ తరఫు న్యాయవాది రఘునాథ్ రిట్ దాఖలు చేశారు. ఆ ఇద్దరి రిమాండ్ కేసు డైరీలో ఉద్దేశపూర్వకంగా ఆయనను ఏడో ముద్దాయిగా పేర్కొన్నారన్నారు. -
జర్నలిస్టులలో దీపధారి–రాఘవాచారి
ఎనభై సంవత్సరాలు నిండిన జీవితంలో అరవై సంవత్సరాల ప్రజా జీవితం, అందులో నలభై సంవత్సరాల పాత్రికేయ జీవితం గడిపి, విలువలతో, విద్వత్తుతో, విస్పష్టమైన దృక్పథంతో, ప్రపంచం పట్ల అపారమైన ప్రేమతో అజాత శత్రువుగా జీవించి సోమవారం ఉదయం హైదరాబాద్లో మరణించిన చక్రవర్తుల రాఘవాచారి (సెప్టెంబర్ 10, 1939 – అక్టోబర్ 28, 2019) జీవితమూ, కృషీ, ప్రవర్తన ఉదాహరణప్రాయమైనవి, ఆదర్శప్రాయమైనవి. పాత వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం శాతాపురం గ్రామంలో సంపన్న భూస్వామ్య శ్రీవైష్ణవ కుటుంబంలో చక్రవర్తుల వెంకట వరదాచార్యులు, కనకవల్లి దంపతుల సంతానంలో చివరివాడుగా జన్మించిన రాఘవాచారి కుటుంబ ఆచారాన్ని అనుసరించి ఇంట్లోనే సంస్కృతం, ఉర్దూ, తెలుగు, తమిళం చదువుకున్నారు. మతాచార పరులైనప్పటికీ కుటుంబానికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం పట్ల సానుభూతి ఉండడం, గెరిల్లాలకు ఇంట్లో ఆశ్రయం ఇవ్వడం, సమీప బంధువు ఒకరు గెరిల్లాగా పనిచేస్తూ పోలీసు కాల్పుల్లో చనిపోవడం ఆయన తొమ్మిది, పదేళ్ల వయసు నాటికే కలిగిన అనుభవాలు. పాఠశాల విద్య హనుమకొండలో, పీయూసీ హైదరాబాదులో చదివి, బీఎస్సీ కోసం 1957లో వరంగల్ ఆర్ట్స్ కాలేజి చేరేనాటికే ఆయనలో వామపక్ష భావాలు బలపడ్డాయి. అక్కడే కళాశాల విద్యార్థి సంఘం కార్యదర్శిగా కూడా ఉండి, ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం చదవడానికి వచ్చేసరికి ఆయన అప్పటి కమ్యూనిస్టు పార్టీ అనుబంధ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులయ్యారు. కులాచారపరంగా వేదాధ్యయనమూ ఉపనయనమూ జరిగి, తొమ్మిదో ఏటి నుంచి పద్దెనిమిదో ఏటి దాకా పూజా పునస్కారాలు చేసిన వ్యక్తే, జంధ్యం ధరించిన వ్యక్తే ఒకటొకటిగా వాటన్నిటినీ వదిలేశారు. ఆ వదిలేయడం కూడా ఏదో ఉద్వేగం కొద్దీ కాదు, క్రమక్రమంగా అధ్యయనంతో దృక్పథం బలోపేతమవుతుండగా కమ్యూనిస్టుగా మారి 1960 నాటికి కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. అలా బ్రాహ్మణ భూస్వామ్య విలువల్లో పుట్టి పెరిగి, తనలో తాను సంఘర్షణతో, ప్రశ్నలతో, చర్చలతో, అధ్యయనంతో ప్రజానుకూల ప్రగతిశీల వామపక్ష అభిప్రాయాలు పెంపొందించుకుని కొత్త విలు వల కమ్యూనిస్టు కార్యకర్తగా మారారు. ఆ విలువలతోనే అరవై ఏళ్లకు పైగా జీవించారు. ఉద్వేగంతో కొన్ని విలువలు ఏర్పడతాయి, కానీ అధ్యయనంతో వాటిని స్థిరపరచుకోవాలి అని ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఈ ప్రయాణం సులభంగా సాగిందేమీ కాదు. చదువుకున్న న్యాయశాస్త్ర విద్యతో న్యాయవాదిగా మారి ఉంటే ఏమై ఉండేవారో తెలియదు గానీ, డిగ్రీ రోజుల నుంచే సామాజిక విషయాల మీద రచన అలవాటు ఉండడంతో పత్రికారచనలోకి వచ్చారు. పార్టీ చీలిక సందర్భంగా మొహిత్ సేన్, తానూ కలిసి రాఘవాచారిని న్యాయవాద వృత్తి ఆలోచన నుంచి తప్పించి విశాలాంధ్రలోకి తీసుకువచ్చామని సంస్మరణ సభలో కందిమళ్ళ ప్రతాపరెడ్డి అన్నారు. అలా ఆయన 1965లో విశాలాంధ్ర దినపత్రికలో విలేకరిగా చేరడం న్యాయవ్యవస్థకు జరిగిన నష్టమేమో గాని, తెలుగులో వామపక్ష పత్రికా రచనకు అందిన అద్భుతమైన కానుక. అప్పటికే ఆయనకు ఇంగ్లిష్ రచనలో కూడా ప్రావీణ్యం ఉండడంతో పేట్రియట్, లింక్ పత్రికలకు హైదరాబాద్ లోనూ, ఢిల్లీలోనూ కూడా కరెస్పాండెంట్గా పని చేశారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ ప్రధాన కార్యదర్శిగా జర్నలిస్టు ఉద్యమ నిర్మాణంలో పనిచేశారు. విశాలాంధ్ర దినపత్రికకు సంపాదకుడిగా 1972 నుంచి 2000 వరకు ఇరవై ఎనిమిది సంవత్సరాలు పని చేసి, అతి ఎక్కువ కాలం సంపాదకుడిగా ఉన్న ఏకైక వ్యక్తి అయ్యారు. ఈ ఇరవై ఎనిమిది సంవత్సరాలలో ఆయన రాసిన వేలాది సంపాదకీయాలతో పాటు, తీర్చిదిద్దిన పాత్రికేయులు వందల మంది ఉన్నారు. విశాలాంధ్ర ఒక కమ్యూనిస్టు పార్టీ దినపత్రిక గనుక పత్రికా రచన చరిత్రలో దానికి, సంపాదకుడిగా రాఘవాచారిగారికి దక్కవలసిన స్థానం దక్కకపోయినా, ఆయన వ్యక్తిత్వంలోని ఇతర ప్రభావశీల అంశాలు ఆయనను అపురూపమైన తెలుగు మేధావిగా నిర్ధారించాయి. ఆయన ఒక గొప్ప ఉపన్యాసకుడు. విషయం ఏదైనా, సభా నిర్వాహకులెవరైనా, కొన్నిసార్లు ఆయన భావాలను వ్యతిరేకించేవారైనా ఆయన ఉపన్యాసకుడిగా ఉండాలని కోరుకునేవారు. ఆయన ఉపన్యాసమంటే ఒక ప్రవాహంలా సాగేదేమీ కాదు, నింపాదిగా సాగుతున్నట్టే ఉండేది. కానీ హాస్యం, చమత్కారం, విద్వత్తు నిండిన ఆయన ఉపన్యాసం ఎంతసేపు సాగినా వినాలనిపించేట్టు ఉండేది. అది ఐదు పది నిమిషాల చిన్న ఉపన్యాసమైనా, గంటకు పైగా వివరంగా సాగే ఉపన్యాసమైనా అందులో ఇంగ్లిష్, ఉర్దూ, సంస్కృతం, తెలుగు సాహిత్యాల నుంచీ, సమాజం నుంచీ ఎన్నో ఉటంకింపులు ఉండేవి. ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నట్టు ఆయన జ్ఞాపకశక్తి విస్తారమైనది. ఉటంకింపులు షేక్ స్పియర్వి అయినా, కాళిదాసువైనా, మార్క్స్, లెనిన్లవి అయినా, గాంధీవైనా ఉపన్యాసం మధ్యలో, తెచ్చిపెట్టుకున్నట్టుగా కూడా కాకుండా, చాలా సహజంగా, అనివార్యంగా వచ్చినట్టుగా ఇమిడిపోయేవి. శ్రోతలకు తెలియని సమాచారం, తెలిసిన సమాచారంలోనే కొత్త కోణాలు, అతి సులభమైన, వివరమైన పద్ధతిలో ఉండేవి. అందువల్ల విజయవాడలో ఆయన ఉపన్యాసం లేకుండా జరిగిన సభలు అరుదు. ఆయన శ్రోతగా వచ్చి కూచున్నా మాట్లాడమని పిలిచిన సందర్భాలెన్నో. అన్నిటికీ మించి ఆయన ఒక అద్భుతమైన మానవీయమైన మనిషి. అంత జ్ఞానసంపన్నుడై కూడా అత్యంత నిరాడంబరంగా, అందరితోనూ ఆప్యాయంగా ఉండేవారు. నడుస్తున్న గ్రంథాలయంగా, విజ్ఞాన సర్వస్వంగా పేరు తెచ్చుకుని కూడా కొత్త విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి చూపేవారు. తనకన్న ముప్ఫై నలభై సంవత్సరాల చిన్నవారితో కూడా గౌరవంగా ప్రవర్తించేవారు. పూర్తిగా వ్యతిరేకమైన భావజాలం ఉన్నవారి నుంచి కూడా గౌరవాద రాలు పొందిన అజాతశత్రువు. నలభై సంవత్సరాలుగా నాకు తెలిసి ఆయన ఆహార్యం తెల్లని మల్లెపూవు లాంటి దుస్తులే. ఆహార్యంలో మాత్రమే కాదు ఆయన హృదయంలోనూ, మానవ సంబంధాలలోనూ అటువంటి స్వచ్ఛమైన మల్లెపూల సుగంధాన్నే నింపుకున్నారు. వందల సంపుటాల ఉద్గ్రంథం లాంటి జ్ఞానసంపదను మల్లెపూల పరిమళంలా వ్యక్తిగత సంభాషణల్లోనూ, సభల్లోనూ వెదజల్లారు. ఎన్ వేణుగోపాల్ వ్యాసకర్త వీక్షణం పత్రిక సంపాదకులు మొబైల్: 98485 77028 -
సేవే మద్దిశెట్టి అభిమతం, కమీషన్ల కదిరి
సాక్షి, దర్శి టౌన్ (ప్రకాశం): దర్శి నియోజక వర్గంలో ప్రధాన పోటీ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా మద్దిశెట్టి వేణుగోపాల్, టీడీపీ అభ్యర్థిగా కదిరి బాబూరావు మధ్య నెలకొంది. ప్రజాప్రతినిధులుగా ఓటర్ల తీర్పును కోరబోతున్న నేపథ్యంలో అభ్యర్థుల గుణ, గణాలను ప్రజలు ఈ విధంగా చర్చించుకుంటున్నారు. మద్దిశెట్టి వేణుగోపాల్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ♦ బీ.ఈ, డీఎంఎం, ఎం.బీఏ ఉన్నత విద్యను అభ్యసించారు. ♦ పలు సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కంపెనీలను యూఎస్ఏ, సింగపూర్లలో నెలకొల్పి, ఉపాధి కల్పిస్తున్నారు. ♦ ఒంగోలు పట్టణంలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేసి విద్యాభివృద్ధికి కృషి. ♦ ప్రజాసేవ చేయాలన్న తపనతో కనిగిరి నియోజక వర్గం పామూరు మండలం లక్ష్మినరసాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయడం. ♦ 2019లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో పోటీ. ♦ పనిని పట్టుదలతో ప్రణాళికబద్ధంగా పూర్తి చేయడం. ♦ మంచి స్వభావం, నచ్చని విషయాన్ని సుతి మొత్తంగా తిరస్కరించడం. ♦ నమ్మిన వారి కోసం ఎందాకైనా పోరాటం చేయడం. కదిరి బాబురావు, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ♦ బీఏ, ఎల్ఎల్బీ విద్యను అభ్యసించారు. ♦ వజ్రాల, గోల్డ్ ముత్యాల వ్యాపారిగా ప్రసిద్ధి ♦ ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన నాటి నుంచి బాలక్రిష్ణతో కలసి ప్రచార కార్యక్రమాలు పాల్గొనేవారు. 1987లో సీఎస్పురం ఎంపీపీగా, 2004లో దర్శి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2009లో కనిగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా టిక్కెట్ దక్కించుకున్నా సరే నామినేషన్ సక్రమంగా లేక పోవడంతో పోటీకి అనర్హడిగా మిగిలిపోయి ఇండిపెండెంట్కి మద్దతు ప్రకటించారు. 2014లో కనిగిరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ♦ కనిగిరి సీఎస్పురం మండలాల్లో ఉచితంగా ప్రభుత్వ పాఠశాలలకు స్థలాలు దానం ♦ తల్లిదండ్రుల పేరిట పేదలకు సాయం ♦ ప్రజలతో మమేకం కాలేక పోవడం ♦ సమస్యలను వినే ఓపిక తక్కువ ♦ తనకు నచ్చిన వారికోసం ఎంత వరకైనా పోరాటం ♦ కనిగిరి నియోజకవర్గంలో కమిషన్ల బాబురావుగా పేరు -
దర్శిలో భారీ మెజార్టీతో గెలుస్తా
-
స్వతంత్ర అభ్యర్థికి మరో పార్టీ గుర్తా..?
సాక్షి, దర్శి: నిబంధనలకు విరుద్ధంగా ప్రజాశాంతి పార్టీ గుర్తు అయిన హెలికాప్టర్ను ఇండిపెండెంట్ అభ్యర్థికి ఎలా ఇస్తారని దర్శి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్ ఆర్ఓ కృష్ణవేణిని నిలదీశారు. స్థానిక ఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ల ఉపసంహరణల అనంతరం అభ్యర్థుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో స్వతంత్య్ర అభ్యర్థి పరిటాల సురేష్కు హెలికాఫ్టర్ గుర్తును ఇస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో మద్దిశెట్టి కలుగజేసుకుని ఆ గుర్తు ప్రజాశాంతి పార్టీకి చెందినదని ఆపార్టీ ఆభ్యర్థి నామినేషన్ చెల్లలేదని చెప్పారు. ఆ గుర్తును మరలా స్వతంత్య్ర అభ్యర్థికి నిబంధనలకు విరుద్ధంగా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దీంతో ఆర్ఓ కృష్ణవేణి మాట్లాడుతూ గురువారం స్వతంత్య్ర అభ్యర్థి పరిటాల సురేష్ హెలికాఫ్టర్ గుర్తును కావాలని దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. నిబంధనల ప్రకారం గుర్తును కేటాయించామని బుకాయించారు. మద్దిశెట్టి మాట్లాడుతూ అభ్యర్థి తన నామినేషన్లో పలానా గుర్తులు కావాలని కోరలేదని, గుర్తులు కోరకపోతే నామినేషన్ చెల్లదని అయినా ఆ నామినేషన్ను ఎందుకు తిరస్కరించలేదని ప్రశ్నించారు. ఇండి పెండెంట్ అభ్యర్థులు సంతకం పెట్టి కింద డేట్ వేయలేదని నామినేషన్ను తిరస్కరించారని, గుర్తులు అడగకపోతే నామినేషన్ తిరస్కరించక పోవడంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఇలా పక్షపాత దోరణి మంచి పద్దతి కాదన్నారు. 25వ తేదీ నాటితో దరఖాస్తులు సమయం అయిపోయిందని 28వ తేదీన దరఖాస్తు తీసుకుని గుర్తును కేటాయించడం నిబందనలకు విరుద్ధం కాదా ? అని నిలదీశారు. ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారని ప్రశ్నించారు. హెలికాఫ్టర్ గుర్తు ఫ్యాన్ గుర్తును పోలి ఉండటం వల్ల ఓటర్లను అయోమయానికి గురిచేసేందుకు టీడీపీ నేతలు కనుసన్నల్లో ఇలాంటి పనులు చేయడం మంచి పద్ధతి కాదని ఆరోపించారు. ఆగుర్తు ఇవ్వడానికి లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ తతంగం అంతా అన్నీ పార్టీలకు చెందిన అభ్యర్థుల కళ్లెదుటే జరుగుతున్నా.. మిగితా పార్టీలు ఈ విషయంపై నోరుమెదపకపోవడం గమనార్హం. ఆర్ఓ కృష్ణవేణి మాత్రం నిబంధనలు చూపిస్తానని చెప్పి పొంతన లేని నిబంధలను చెప్తున్నారని మండి పడ్డారు. ఇంత దారుణంగా వ్యవహరిస్తున్న అధికారులు ఎన్నికలు సక్రమంగా జరగనిస్తారా అని మద్దిశెట్టి అనుమానాలు వ్యక్తం చేశారు. కృష్ణవేణి మాట్లాడుతూ తాను నిబంధనల ప్రకారమే గుర్తు కేటాయించానని మీకు అభ్యంతరం ఉంటే రిటన్గా రాసి ఇవ్వాలని కోరారు. అనంతరం మద్దిశెట్టి వేణుగోపాల్ విలేకరుల సమావేశం నిర్వహించి జరిగిన విషయాన్ని వివరించారు. కేవలం వైఎస్సార్ సీపీని దెబ్బతీయాలంటే ప్రజాభిమానం లేక అధికారులను ఉపయోగించుకుని ఈవిధంగా చేయడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. గెలవలేక ఇలాంటి నీచరాజకీయాలు చేసే పార్టీలకు ప్రజలు సరైన బుద్ది చెప్పాలని కోరారు. తమ అదిష్టానం దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లి ఆగుర్తు కేటాయింపుపై కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. -
దర్శిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్ధి మద్దిశెట్టి వేణుగోపాల్ ప్రచారం
-
కాంగ్రెస్ అభ్యర్థులపై స్క్రీనింగ్ కమిటీ కసరత్తు
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల బరిలో తెలంగాణ నుంచి నిలిచే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ కసరత్తు చేస్తోంది. మంగళవారం రాత్రి పార్టీ ప్రధాన కార్యదర్శి, సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కేసీ వేణుగోపాల్ ఇంట్లో సమావేశమయ్యారు. ఈ భేటీకి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా, ఇన్ చార్జి కార్యదర్శులు సలీం అహ్మద్ తదితరులు హాజరయ్యా రు. ఇప్పటికే ఒక్కో నియోజకవర్గానికి ఒకటి నుంచి మూడు పేర్లను ప్రతిపాదిస్తూ పీసీసీ జాబితా పంపిం ది. స్క్రీనింగ్ కమిటీ ఈ జాబితా నుంచి అభ్యర్థులను ఎంపికచేసి పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి సిఫారసు చేయనుంది. సోనియా, రాహుల్ సమక్షంలో కేంద్ర ఎన్నికల కమిటీ గురువారం అభ్యర్థుల జాబితాకు ఆమోద ముద్ర వేయనుంది. కాగా, టీఆర్ఎస్లో సీట్లు రాని సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్లో చేరితే వారికి టికెట్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇక ఏపీ అభ్యర్థుల ప్రాథమిక జాబితా బుధవారం ఢిల్లీకి చేరనుందని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. -
రాష్ట్రంలో అవినీతి తాండవిస్తోంది
సాక్షి, దొనకొండ: రాష్ట్రంలో అభివృద్ధి కంటే అవినీతే అధికంగా తాండవిస్తోందని వైఎస్సార్సీపీ దర్శి నియోజకవర్గ సమన్వయకర్త మద్దిశెట్టి వేణుగోపాల్ విమర్శించారు. మండలంలోని సంగాపురం, వీరేపల్లి గ్రామాల్లో పార్టీ మండల కన్వీనర్ కాకర్ల క్రిష్ణారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి గొంగటి శ్రీకాంత్రెడ్డితో కలిసి మంగళవారం రావాలి జగన్–కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని వీధుల్లో ఆయనకు ఆడపడుచులు అడుగడుగునా పూలమాలలతో స్వాగతం పలుకుతూ విజయ తిలకం దిద్దారు. జగనన్నను ముఖ్యమంత్రిని చేసేందుకు తామంతా కట్టుబడి ఉన్నామని, దానిలో భాగంగా నియోజకవర్గంలో పార్టీని గెలిపించుకుంటామని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మద్దిశెట్టి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అవినీతి ఎక్కువైందని, టీడీపీ పాలకులు అభివృద్ధి మరిచి గొప్పలు చెప్పుకునేందుకే పరిమితమయ్యారని ఆయన విమర్శించారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాలను ప్రతి ఒక్క కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలన్నారు. రానున్న ఎన్నికల్లో కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేసి జగనన్నను ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. గ్రామాల్లోని సమస్యలను అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అన్ని వర్గాలను కలుపుకునిపోతామని స్పష్టం చేశారు. తాగునీరు కరువైంది : మహిళల ఆవేదన తమ గ్రామానికి తాగునీరు కరువైందని, గుక్కెడు నీరు అందక అల్లాడుతున్నామని సంగాపురం మహిళలు మద్దిశెట్టి ముందు గగ్గోలు పెట్టారు. స్పందించిన మద్దిశెట్టి.. నీటి సమస్య పరిష్కరించేందుకు ట్యాంకర్తో నీటి సరఫరా చేయిస్తామన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే, సమస్యను శాశ్వితంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో భూ సమస్య ఎక్కువగా ఉంది... సంగాపురం గ్రామంలో భూ సమస్య ఎక్కువ ఉందని, టీడీపీ ప్రభుత్వంలో తమను పట్టించుకునే నాథుడు కరువయ్యాడని, ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎన్నోస్లారు విన్నవించినా పట్టించుకోలేదని స్థానికులు వాపోయారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాగానే గ్రామంలో భూ సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తామని మద్దిశెట్టి హామీ ఇచ్చారు. 15 కుటుంబాలు వైఎస్సార్ సీపీలో చేరిక... వీరేపల్లి గ్రామంలో టీడీపీ నుంచి 15 కుటుంబాలు వైఎస్సార్ సీపీలో చేరాయి. మద్దిశెట్టి వేణుగోపాల్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీలో తమకు అన్యాయం జరగడంతో వైఎస్సార్ సీపీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. ఆయా కార్యక్రమాలలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వల్లపునేని వీరయ్యచౌదరి, ఎంపీటీసీ సభ్యులు షేక్ గఫార్, విప్పర్ల సుబ్బయ్య, మాజీ సర్పంచులు కర్నాటి ఆంజనేయరెడ్డి, పాతకోట కోటిరెడ్డి, దేవేండ్ల వెంకట సుబ్బయ్య, మాచనూరి బాబు, జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి గుంటు పోలయ్య, జిల్లా ఎస్సీ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ చీరాల ఇశ్రాయేలు, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ జొన్నకూటి సుబ్బారెడ్డి, జిల్లా యూత్ కార్యదర్శి నూనె వెంకటరెడ్డి, వి.కోటేశ్వరరావు, భద్రయ్య, చిన్న వెంకటేశ్వర్లు, జిల్లా బీసీ సెల్ కార్యదర్శి బత్తుల వెంకట సుబ్బయ్య, జిల్లా పబ్లిసిటీ ప్రధాన కార్యదర్శి పత్తికొండ వెంకటసుబ్బయ్య, జిల్లా విద్యార్థి విభాగం కార్యదర్శి గుండాల నాగేంద్ర ప్రసాద్, జిల్లా ఎస్సీ సెల్ సంయుక్త కార్యదర్శి కొంగలేటి మోషె, వెన్నపూస చెంచిరెడ్డి, గుడిపాటి నాసరయ్య, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు సయ్యద్ యూనుస్, తమ్మనేని యోగిరెడ్డి, ప్రచార విభాగం మండల అధ్యక్షుడు గొంగటి పోలిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ఈరోజుల్లో సినిమా ఆడటమే కష్టం
‘‘హుషారు’ సినిమా ఫస్ట్ సాంగ్ రిలీజ్ రోజునే సినిమా బాగుందని, ఆడుతుందని చెప్పాను. నిజంగానే ప్రేక్షకులు ఆదరించారు. ఈరోజుల్లో సినిమా ఆడటమే కష్టం. అలాంటిది 50 రోజులు పూర్తి చేసుకోవడం అంటే సాధారణ విషయం కాదు. ‘హుషారు’ యూనిట్కు అభినందనలు’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. తేజస్ కంచర్ల, తేజ్ కూరపాటి, అభినవ్ మంచు, దినేష్ తేజ్, దక్షా నగార్కర్, ప్రియా వడ్లమాని, హేమా ఇంగ్లే ముఖ్య తారలుగా శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హుషారు’. బెక్కెం వేణుగోపాల్, రియాజ్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 14న విడుదలై 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిపిన 50 రోజుల వేడుకలో బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ– ‘‘మా సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఇంత పెద్ద విజయం సాధిస్తుందని నేను ఊహించలేదు. ‘హుషారు’ సినిమా కోసం ఏడాదిన్నర కష్టపడ్డాం. కష్టానికి మంచి ఫలితం వస్తుందనడానికి మా సినిమానే ఓ ఉదాహరణ’’ అన్నారు. ‘‘ఈ సినిమాకు పనిచేసిన ప్రతిరోజూ నా లైఫ్లో ఓ తీపి గుర్తు. ప్రేక్షకులు సినిమాను మళ్లీ మళ్లీ చూసి ఇంత పెద్ద హిట్ ఇచ్చారు’’ అని శ్రీహర్ష కొనుగంటి అన్నారు. తేజ్ కొర్రపాటి, దినేష్, తేజస్ కంచెర్ల, ప్రియా వడ్లమాని, దక్షా నగార్కర్ ఈ విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. -
పిల్ విచారణలో తీవ్ర వ్యాఖ్యలొద్దు: సుప్రీంకు కేంద్రం హితవు
న్యూఢిల్లీ: ప్రజాహిత వాజ్యాల (పిల్)ను విచారించే సమయంలో తీవ్ర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం బుధవారం హితవు చెప్పింది. దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ, జడ్జీలూ ఈ దేశ పౌరులేననీ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలేంటో జడ్జీలకు తెలుసునని స్పష్టం చేసింది. అయినా తామేమీ ప్రభుత్వాన్ని ప్రతి విషయంలోనూ విమర్శించడం లేదనీ, ముందు చట్టం ప్రకారం ప్రభుత్వం నడచుకోవాలని కోర్టు సూచించింది. దేశంలోని 1,382 జైళ్లలో ఖైదీల పరిస్థితి అమానవీయంగా ఉందంటూ దాఖలైన పిల్పై ధర్మాసనం విచారణ జరుపుతుండగా, అటార్నీ జనరల్ (ఏజీ) వేణుగోపాల్, జడ్జీల మధ్య ఈ సంభాషణ జరిగింది. ఏజీ మాట్లాడుతూ ‘నేను సుప్రీంకోర్టును విమర్శించడం లేదు. కానీ గతంలో సుప్రీం∙తీర్పులతో ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు’ అని అన్నారు. 2జీ స్పెక్ట్రం కేటాయింపులపై తీర్పు, రహదారులకు 500 మీటర్ల లోపు మద్యం దుకాణాలు ఉండకూడదంటూ ఇచ్చిన తీర్పులను ప్రస్తావించారు. లక్షన్నర కోట్లతో ఏమైనా చేయొచ్చుగా.. ఏజీ వ్యాఖ్యలకు న్యాయమూర్తులు స్పందిస్తూ ‘ మా తీర్పుల వల్ల కొన్ని ఉద్యోగాలు పోయుండొచ్చు. మా తీర్పుల వల్లే ప్రభుత్వానికి దాదాపు ఒకటిన్నర లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. దాంతో మీరేమైనా చేయొచ్చుగా? నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు చేయాల్సిన 30 వేల కోట్ల రూపాయలతో మీరు వాషింగ్ మెషీన్లు, ల్యాప్టాప్లు కొన్నారు’ అంటూ మండిపడ్డారు. కాగా, జైలు సంస్కరణలపై రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీ నియమిస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది. జైళ్లలో పెరుగుతున్న ఖైదీల రద్దీ సహా ఇతర సమస్యలపై కమిటీ అధ్యయనం చేసి నివేదిక సమర్పిస్తుందని వెల్లడించింది. -
డేటా లేకుండా రిజర్వేషన్లు ఎలా?
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు తక్కువ ప్రాతినిధ్యం ఉందని నిరూపించే సమాచారంతో రాష్ట్రాలు ఎందుకు ముందుకు రావడంలేదని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. నియామకాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు పరిమాణాత్మక సమాచారమే కీలకమని ఉద్ఘాటించింది. పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు క్రీమీలేయర్ను వర్తింపజేయాలన్న 12 ఏళ్ల నాటి కోర్టు తీర్పును కేంద్రం సవాలుచేయడం తెల్సిందే. ఆ పిటిషన్ను విచారిస్తూ సుప్రీం పైవిధంగా స్పందించింది. పదోన్నతుల్లో దళితులకు 23 శాతం కోటా ఉండాలని కేంద్రం ఉద్ఘాటించింది. 2006 నాటి ఎం.నాగరాజ్ కేసులో ఎస్సీ, ఎస్టీల పదోన్నతులకు వెనకబాటుతనం, తక్కువ ప్రాతినిధ్యాన్ని కోర్టు ప్రాదిపదికగా నిర్ధారించడం తెల్సిందే. దీంతో వారికి పదోన్నతులు దాదాపు నిలిచిపోయాయని, ఆ తీర్పును ఏడుగురు సభ్యుల బెంచ్ పునఃపరిశీలించాలని కేంద్రం కోరింది. ‘క్రీమీలేయర్పై 12 ఏళ్ల క్రితం వెలువడిన తీర్పు తప్పని నిరూపించాలంటే, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగిందనే సమాచారాన్ని గణాంకాలతో సహా సమర్పించాలి. ఇన్నేళ్లయినా ఆ వివరాలను రాష్ట్రాలు ఇంకా ఎందుకు సేకరించలేదు?’ అని కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. కేంద్రం తరఫున విచారణకు హాజరైన అటార్నీ జనరల్ వేణుగోపాల్ వాదిస్తూ..వెనకబడిన తరగతులుగా భావిస్తున్న ఎస్సీ, ఎస్టీలు వెనకబడిన వాళ్లమని ప్రత్యేకంగా నిరూపించుకోవాల్సిన అవసరంలేదన్న 1992 నాటి ఇందిరా సహానీ కేసును ఉదహరించారు. పరిమాణాత్మక సమాచారం అందుబాటులో ఉంటే నియామకాల్లో రిజర్వేషన్లు కల్పించే అధికారాలు రాష్ట్రాల పరిధిలోనే ఉంటాయని కోర్టు బదులిచ్చింది. వారికి తగిన ప్రాతినిధ్యం లేదని భావిస్తే, వేగంగా పదోన్నతులు కల్పించే బాధ్యత రాష్ట్రాలదే అని పేర్కొంది. -
‘సోషల్ హబ్’పై కేంద్రం వెనక్కి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సామాజిక మాధ్యమాలపై నిఘా కోసం తీసుకురావాలనుకున్న ‘సోషల్ మీడియా హబ్’పై కేంద్రం వెనక్కు తగ్గింది. సోషల్ మీడియా హబ్ ఏర్పాటుకు తాము జారీచేసిన నోటిఫికేషన్ను వెనక్కు తీసుకుంటామని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ హబ్కు సంబంధించిన పాలసీని సమీక్షిస్తామని కేంద్రం తరఫున అటార్నీ జనరల్ వేణుగోపాల్ కోర్టుకు విన్నవించారు. దీంతో కోర్టు సంబంధిత పిటిషన్ను కొట్టివేసేందుకు అంగీకరించింది. సోషల్ మీడియా, ఈ–మెయిల్స్లోని సమస్త సమాచారంపై నిఘా పెట్టేందుకు కావాల్సిన సాఫ్ట్వేర్ కోసం కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఇటీవల రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్(ఆర్ఎఫ్పీ)ను జారీచేసింది. దీన్ని సవాలు చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మహువా మొయిత్రా సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారణ సందర్భంగా ‘దేశాన్ని నిఘా రాజ్యంగా మార్చాలనుకుంటున్నారా?’ అని కేంద్రంపై కోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. ► రాజ్యాంగపరంగా ప్రాధాన్యత ఉన్న అంశాలను కోర్టులు విచారించేటప్పుడు దాన్ని లైవ్ స్ట్రీమింగ్ లేదా రికార్డింగ్ చేసే విషయమై మార్గదర్శకాలను రూపొందించాలని అటార్నీ జనరల్ను ఆదేశించింది. ► శారదా చిట్ఫంట్ కుంభకోణం కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం భార్య, న్యాయవాది నళినిపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారుల్ని కోర్టు ఆదేశించింది. శారదా కంపెనీ లా బోర్డు సమావేశాలకు హాజరైన నళిని ఫీజుగా రూ.కోటి అందుకున్నారని ఆరోపిస్తున్న ఈడీ అధికారులు ఆమెకు సమన్లు జారీచేయడం తెల్సిందే. ► దేశంలో సిజేరియన్ ఆపరేషన్లు చేపట్టడంపై మార్గదర్శకాలు జారీచేయాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిల్ను న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడంగా అభివర్ణించిన కోర్టు.. పిటిషనర్కు రూ.25,000 జరిమానా విధించింది. దీన్ని నాలుగు వారాల్లోగా సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించింది. -
పాతబస్తీలో రిటైర్డ్ జవాన్ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో ఓ రిటైర్డ్ జవాన్ గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తుపాకీతో కాల్చుకొని రిటైర్డ్ ఆర్మీ జవాన్ వేణుగోపాల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్ను పోలీసులు గుర్తించారు. ' నా చావుకు ఎవరూ కారణం కాదు' అని నోట్లో వేణుగోపాల్ పేర్కొన్నాడు. కుటుంబ సభ్యుల ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు విచారణ చేస్తున్నారు. -
సరికొత్త కళారూపం
కళకు ఎల్లలు లేవు. అది కళాకారుడి ఊహాశక్తికి సంబంధించిన విషయం. అందుకే తరాలు మారుతున్నకొద్దీ కళ కొత్త రూపాలను సంతరించుకుంటుంది. ఆ రూపాలు కళను ప్రేమించేవారికి నిత్యనూతన ఆనందాన్ని...అందులోకి ప్రవేశించాలి అనుకునేవారిలో నిరంతర ఆసక్తిని పెంపొందిస్తున్నాయి. గ్లిట్టర్ ఆర్ట్ గా పిలుచుకునే పెయింటింగ్ కళ కూడా ఇప్పుడు ఇదే వరుసలో ఉంది. కాన్వాస్ పై గమ్ తో మొత్తం పెయింటింగ్ వేసి...చూసే ప్రేక్షకుల్లో అమితమైన ఆసక్తిని రేకెత్తిస్తూ...చివర్లో ఆ కాన్వాస్ మీదికి రంగులు వెదజల్లడంతో కళారూపాన్ని ఆవిష్కరించడం సరికొత్త ప్రక్రియ. ప్రముఖ సాండ్ ఆర్టిస్ట్ వేణుగోపాల్ సాక్షి స్టూడియోలో రూపొందించిన అలాంటి ఒక కళారూపం మీరూ చూడండి.. -
యువకుడి ఆత్మహత్య
కళ్యాణదుర్గం: ఆస్తి పంపకాల్లో తనకు న్యాయం జరగలేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కళ్యాణదుర్గంలోని బ్రహ్మంగారిగుడి చింతతోపులో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన వివరాలు ఎస్ఐ శంకర్రెడ్డి తెలిపిన మేరకు ఇలా ఉన్నాయి. శెట్టూరు మండలం మాకోడికి గ్రామానికి చెందిన యల్లప్పకు ముగ్గురు కుమారులు. వీరిలో చిన్న కుమారుడు వేణుగోపాల్ (24) క్రేన్ యంత్రాన్ని ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. మూడు నెలల క్రితం బ్రహ్మసముద్రం మండలం పాలవెంకటాపురానికి చెందిన జ్యోతితో వివాహం జరిగింది. మారెంపల్లిలో భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. ఆస్తి పంపకాలలో తనకు న్యాయం జరగలేదని వేణుగోపాల్ భార్యతో చెప్పుకుని బాధపడేవాడు. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. రాత్రి 8 గంటలైనా ఇంటికి రాకపోవడంలో భార్య జ్యోతి మాకోడికిలోని కుంటుంబ సభ్యులకు సమాచారం అందించింది. వారు వెంటనే ఆచూకీ కోసం అన్వేషించారు. బ్రహ్మంగారి గుడి చింతతోపులో చెట్టుకు వేణుగోపాల్ ఉరివేసుకున్నట్లు శనివారం ఉదయం స్థానికుల నుంచి సమాచారం అందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ఆ సీఎం మళ్లీ హాయిగా కునుకేశారు
బెంగళూరు: ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి ఎంచక్కా కునుకుతీశారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో బీజేపీ వైఫల్యాలను ఎండగట్టేందుకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ వేణుగోపాల్ మీడియా సమావేంలో మాట్లాడుతున్నారు. వేణుగోపాల్ పక్కను కూర్చున్న సిద్ధరామయ్య మాత్రం ఇవేమీ తనకు పట్టవన్నట్లుగా హాయిగా నిద్రపోవడం చర్చనీయాంశమైంది. అయితే పలు ముఖ్య సందర్భాలలో ఆయన ఇలా నిద్రపోవడం ఇదేం తొలిసారి మాత్రం కాదు. సీఎం తీరుపై సొంత పార్టీ నేతలే ముక్కున వేలేసుకుంటున్నారు. 2014లో కర్ణాటక అసెంబ్లీలో ఓ బాలికపై అత్యాచార ఘటనపై చర్చ జరుగుతున్న సమయంలోనూ సీఎం గారు చక్కగా కునుకుతీసి విమర్శలపాలయ్యారు. గతంలో మైసూరులో జరిగిన ది ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 103వ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తున్న సమయంలోనూ ఆయన చల్లగా, హాయిగా నిద్రలోకి జారుకున్నారు. మాజీ ప్రధాని దేవేగౌడ శిష్యుడు అయిన సిద్దరామయ్య తన పాత గురువు లక్షణాలు కొన్ని వెంట తెచ్చుకున్నట్లు కనిపిస్తున్నారు. పలు సమావేశాలలో మాజీ ప్రధాని దేవేగౌడ నిద్రపోవడం.. సమావేశం పూర్తయిన తరువాత నిద్రలేవడం అందరికి తెలిసిందే. అయితే సీఎం సిద్ధరామయ్యకు అతినిద్ర జాడ్యం ఉందని.. ఈ సమస్య నుంచి బయటపడేందుకు యోగా చేస్తున్నారని ప్రచారంలో ఉంది. -
హోంవర్క్ చేయలేదనే భయంతో...
మదనపల్లె: హోం వర్కు చేయనందుకు టీచర్లు దండిస్తారనే భయంతో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిత్తూరు జిల్లా మదనపల్లె మండల కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మదనపల్లెకు చెందిన నర్సింహులు, పుష్పలత దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు వేణుగోపాల్(14) ఉన్నారు. పిల్లలు ముగ్గురూ మదనపల్లెలోని ఉండి చదువుకుంటుండగా ఆ దంపతులు జీవనోపాధి కోసం కర్ణాటక రాష్ట్రం చింతామణి వెళ్లారు. ఇలా ఉండగా, తొమ్మిదో తరగతి చదువుకుంటున్న వేణుగోపాల్ గత రెండు వారాలుగా స్కూలుకు వెళ్లటం లేదు. స్కూలుకు వెళితే హోం వర్కు చేయలేదని టీచర్లు దండిస్తారేమోనని తోబుట్టువులతో అంటుండేవాడు. శనివారం ఉదయం అక్క, చెల్లెలు పాఠశాలకు వెళ్లిన సమయంలో ఇంట్లోనే ఉరేసుకున్నాడు. మధ్యాహ్నం సమయంలో అక్క వచ్చి చూడగా వేణుగోపాల్ ఉరికి వేలాడుతూ కనిపించాడు. అతడు అప్పటికే చనిపోయినట్లు చుట్టుపక్కల వారు గుర్తించారు. ఈ మేరకు ఎస్సై నాగేశ్వరరావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
43 ఏళ్ల తరువాత డిజిటల్లో జయ చిత్రం
పురట్చి తలైవి, నేటి ముఖ్యమంత్రి జయలలిత, ముత్తురామన్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం సూర్యకాంతి. విద్యా ఫిలింస్ పతాకంపై వేణుగోపాల్ నిర్మించిన ఈ చిత్రానికి ముక్తా శ్రీనివాసన్ దర్శకుడు. భర్త కంటే భార్య అధికంగా సంపాదిస్తుందన్న ఈగో ఇతివృత్తంగా తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో 150 రోజలు ప్రదర్శింపబడి ఘన విజయాన్ని సాధించింది. ఇందులో పాటలన్నీ విశేష ప్రేక్షకాదరణను పొందాయి. ఈ చిత్రంలో పురట్చి తలైవి జయలలిత సొంతంగా రెండు పాటలు పాడడం విశేషం. అదే విధంగా ప్రఖ్యాత గీత రచయిత కన్నదాసన్ రాసి నటించిన పరమశివన్ కళుత్తిలిరిందు పాంబు కేట్టదు గరుడా సౌక్యమా అన్న పాట నేటికీ ఎవర్గ్రీన్ అనే చెప్పాలి. చో రామస్వామి, మనోరమ, కాత్తాడి రామమూర్తి, ఏఏఆర్.వాసు ముఖ్య పాత్రలు పోపించారు. ఏ తరం వారైనా చూసి ఆనందించే కథాంశంతో రూపొందిన ఈ చిత్ర శతదినోత్స వేడుకలో సినీ ప్రముఖులందరూ పాల్గొనడం విశేషం. అయితే అదే వేదికపై పురట్చి తలైవి తందై పెరియార్ అవార్డుతో ఘన సత్కారాన్ని అందుకోవడం మరో విశేషం. కాగా అప్పట్లో నలుపు తెలుపు రంగుల్లోనే ఆబాలగోపాలాన్ని అలరించిన సూర్యకాంతి చిత్రం 43 ఏళ్ల తరువాత సినిమా స్కోప్, డిజిటల్ హంగులతో మరోసారి తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. దీన్ని ఏపీ.ఫిలింస్ పతాకంపై గజలక్ష్మి రాష్ట్రవ్యాప్తంగా విడుదలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
సీబీఐ దర్యాప్తు ఎందుకు జరపడం లేదు?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను తెలంగాణ సీఎం కేసీఆర్ కు చంద్రబాబు తాకట్టు పెట్టారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ విమర్శించారు. కృష్ణా, గోదావరిపై తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు కడుతున్నా కేసుల భయంతో చంద్రబాబు మాట్లాడడం లేదని ఆరోపించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఓటుకు కోట్లు కేసులో సీబీఐ విచారణ ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు. ఉత్తరాఖండ్ సీఎం హరీశ్ రావత్ కేసుల విషయంలో సీబీఐ విచారణ జరుపుతున్నారని గుర్తు చేశారు. రుణమాఫీ కాకపోయినా చంద్రబాబు, లోకేశ్ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ ను విమర్శించడం తప్పా మహానాడులో టీడీపీ చేసిందేమీ లేదని పేర్కొన్నారు. ప్రజలకు పనికొచ్చే అంశాలపై చర్చ జరగలేదన్నారు. ప్రజల మెప్పు పొందలేమనే కోట్లు వెచ్చించి ఎమ్మెల్యేలను కొంటున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అసలు దొంగలు టీడీపీ నేతలేనని అన్నారు. అధికార నేతల స్వలాభం కోసం ఏపీ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడితే వైఎస్సార్ సీపీ చూస్తూ ఊరుకోదని వేణుగోపాల్ హెచ్చరించారు. -
కవిత్వంతో తొలి ములాఖాత్
ఒక్క కవితతో, ఒక్క పదబంధంతో, ఒక్క అభివ్యక్తితో నన్ను జీవితాంతం ప్రభావితం చేసిన వాళ్లున్నారు. వందలాది కవితలు రాసీ ప్రభావితం చేయని వాళ్లూ ఉన్నారు. ఒకానొక మానసిక స్థితిలో అత్యద్భుతం అనిపించిన కవితే మరొక మానసిక స్థితిలో ఎందుకూ కొరగానిదనిపించిన సందర్భమూ ఉంది. ఒక వయసులో, ఒక ఉద్వేగంలో అభిమాన కవులైనవాళ్లే ఇతరేతర విషయాల తెలివిడి వల్ల తమ స్థాయిని పోగొట్టుకున్నవాళ్లూ ఉన్నారు. పూర్తిగా ఇటునుంచి అటు అయిన సందర్భాలూ ఉన్నాయి. ‘‘మన కాలపు కవికి ఏకాంతమూ సమూహమూ రెండూ ప్రాథమిక విధులుగానే ఉన్నాయి’’ అని నాకు అత్యంత ఆప్తుడైన చిలీ మహాకవి పాబ్లో నెరూడా అన్న మాటలను అక్షరాలా నమ్ముతాను. ‘‘సామాజిక కవిత్వా’’నికీ, ‘‘ఆత్మాశ్రయ కవిత్వా’’నికీ విభజన రేఖ సున్నితమైనదో, ఊహాత్మకమైనదో అనుకుంటాను. సామూహికతలో భాగం కాని ఏకాంతం లేదనీ, ఏకాంతం లోకి చొచ్చుకురాని సామూహికత లేదనీ కూడా నా విశ్వాసం. కనుక ఆ రెండు ముద్రలు పడిన కవిత్వమూ నాకు నచ్చుతుంది. పన్నెండు సంవత్సరాల కింద వెలువడిన నా కవితా సంపుటం ‘పావురం’కు నేను రాసుకున్న ముందుమాట లోంచి... ‘‘కవిత్వం నా కన్నతల్లి. కవిత్వం నా తొలి పావురం. కవిత్వం అంటే భావప్రకటనో, ఆగ్రహ వ్యక్తీకరణో, పద విన్యాసమో, పశ్చాత్తాపమో, ఉద్వేగ ఉధృతో, ప్రశాంత పునరావలోకనమో, ఒత్తిడి నుంచి ఉపశమనమో, ఆనందోత్సాహమో, వెళ్లగక్కడమో... ఎన్ని నిర్వచనాలున్నాయో, అవి ఎప్పుడెప్పుడు ఎంతెంత నిజమో నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా నా పావురాన్నో, పావురం కొరతనో మననం చేసుకున్నప్పుడల్లా అది ఇట్లా వెలువడిందని మాత్రమే... లోకానికీ నాకూ పావురం ఉన్నప్పుడూ లేనప్పుడూ కూడ కవిత్వానికీ నాకూ పావురం కుదిరింది...’’ మనిషికి మొట్టమొదటి పావురం తల్లి అయితే బహుశా ఆ తర్వాతి పావురం శబ్దం మీద కావచ్చు. తనను ఆడించేవాళ్లు శబ్దం చేస్తారు. తన చుట్టూ ఉన్నవాళ్లు వాళ్లలో వాళ్లు శబ్దాలు చేసుకుంటారు. తనతో శబ్దాలు చేయడానికి ప్రయత్నిస్తారు. తాను శబ్దం చేస్తే తనవైపు చూస్తారు. కవిత్వమూ శబ్దమయ ప్రపంచమే గనుక కవిత్వం బాల్య సహజమైన, మానవ సహజమైన, సహజాతమైన ప్రవృత్తి కావచ్చు. కవిత్వంతో నా తొలి ములాఖాత్ శబ్దమే. మా బాపు గొంతెత్తి మంత్రాలు చదివేవాడు. నాకు ఊహ తెలిసేటప్పటికే ‘నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్ర పాదాక్షి శిరోరు బాహవే’ అని ఆయన చదువుతుండిన విష్ణు సహస్ర నామాల శ్లోకంలోని సహస్ర పాదాక్షి శిరోరు బాహవే అనే మాటల లయ మీద ఆసక్తి కలిగింది. ఆ తర్వాత బహుశా ఐదారేళ్ల వయసులో మేం బమ్మెర పోతన వంశీకులమని చెపుతూ, వంశవృక్షం చూపుతూ పోతన పద్యాల మీద ఆసక్తి కలిగించి, ఆ పద్యాలు చదువుతుంటే, ముఖ్యంగా మమ్మల్ని నిద్ర పుచ్చడానికి ‘నారాయణ కవచం’ చదువుతుంటే ఆ లయకు, ప్రతి పద్యం చివరా ‘గాచు గావుతన్’ లాంటి పునరుక్తికీ ఒక వింతలోకంలోకి ప్రవేశిస్తున్నట్టుండేది. అర్థం తెలియకుండానే కేవలం శబ్దం వల్ల కవిత్వంతో కలిసిన మైత్రి అది. ఇప్పటికీ లయబద్ధమైన కవిత్వం మీద ప్రేమ ఉండడం అందుకే కావచ్చు. వచన కవిత్వంలో కూడా యూఫనీ అవసరమని, చదవడంలో కూడా లయబద్ధమైన తూగు పాటించాలని అనుకోవడం అందుకే కావచ్చు. కవిత్వంలో శబ్దశక్తికి ఒక గీటురాయి ఉంది. పద సంయోజనం సరిగ్గా కుదిరిందా లేదా పైకి గొంతెత్తి చదువుకుంటే తెలుస్తుంది. అది మాత్రాఛందస్సు కూడ కానక్కరలేదు. పూర్తిగా వచన కవిత- వర్స్ లిబర్- స్వచ్ఛంద కవిత కావచ్చు. కాని విభిన్న పర్యాయపదాల నుంచి, వేరు వేరు తూకాల సమానార్థక పదాల నుంచి కవి ఏ పదం ఎందుకు ఎంచుకుంటున్నారు, ఆ పదానికీ ముందు వెనుకల పదాలకూ సంయోజనం సరిగా కుదిరిందా లేదా అనేది గొంతెత్తి చదివినప్పుడు, చదువుకున్నప్పుడు తెలుస్తుంది. శ్లోకాలలోని, గణబద్ధ పద్యాలలోని శబ్దంతో ప్రారంభమైన నా ములాఖాత్ ఆ తర్వాత ‘సృజన’ సాహితీ మిత్రులలో కవిత్వం పైకి చదివి వినిపించే బాధ్యతవల్ల మరింత గాఢమైంది. ప్రతినెలా కనీసం వంద కవితలు చదవవలసి ఉండేది. చాల కవితలు లోపల ఒక్కసారి కూడ గున్గునాయించుకోకుండానే మొదటిసారే పైకి చదవవలసి వచ్చేది. అది ఎంత గొప్ప భావమైనా శబ్ద సంయోజనం సరిగ్గా లేకపోతే ఆ భావం పలుకుతున్నట్టు అనిపించేది కాదు. (వ్యాసకర్త : ఎన్.వేణుగోపాల్) -
ఆటో డ్రైవర్ ఆత్మహత్య
సికింద్రాబాద్: కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తుకారాంగేట్ పోలీస్స్టేసన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..అడ్డగుట్టకు చెందిన వేణుగోపాల్(28) వృత్తిరిత్యా ఆటోడ్రైైవర్. మద్యానికి బానిసైన వేణుగోపాల్ తరచూ ఇంట్లో గొడవపడేవాడు. అయితే, సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. -
ప్రజల గొడవే... కాళోజీ ‘నా గొడవ’
కాళోజీ జయంత్యుత్సవంలో కడియం శ్రీహరి {పశ్నించేతత్వాన్ని అందరూ అలవరచుకోవాలి అమ్మంగి వేణుగోపాల్కు కాళోజీ పురస్కారం-2015 ప్రదానం హైదరాబాద్: ప్రజల గొడవను తన గొడవగా సమాజంలోని సమస్యలను రచనలు, ఉపన్యాసాల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన మహావ్యక్తి కాళోజీ అని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కితాబునిచ్చారు. బుధవారం రవీంద్రభారతిలో భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రజాకవి పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి ఉత్సవం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్కు కాళోజీ పురస్కారం -2015 ప్రదానం చేశారు. అనంతరం కడియం మాట్లాడుతూ కాళోజీ ఎవరికీ బయపడని ధీరత్వం ఉన్న వ్యక్తి అని అన్నారు. ప్రాంతాల వారీగా మాండలికాలు ఉన్నాయని, తెలంగాణ మాండలికం కూడా భాషే అని తన కవిత్వం ద్వారా స్పష్టం చేశారని తెలిపారు. ఆయనపై ఉన్న గౌరవంతో అధికారంలోకి రాగానే సీఎం కేసీఆర్ కాళోజీ కళాక్షేత్రం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ క్షేత్రానికి ప్రభుత్వం భూమి, నిధులు కేటాయించిందని చెప్పారు. కాళోజీ ప్రశ్నించేతత్వాన్ని అందరూ అలవర్చుకోవాలని సూచించారు. ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ ఎమర్జెన్సీ రోజుల్లో ధైర్యంగా తిరుగుతూ తన రచనలు చదువుతూ ప్రజల్లో ప్రసంగాలు చేసేవారన్నారు. విద్యార్థిగా ఉన్న రోజుల్లో కాళోజీతో కలసి పనిచేశానని చెప్పారు. రాజ్యహింసకు వ్యతిరే కంగా ‘మూమెంట్ ఫర్ అప్రెషన్’ స్థాపించారని, దానికి తానూ కాళోజీ నాయకత్వం వహించేవారమని తెలిపారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ కాళోజీ పేరిట భాషాదినోత్సవం నిర్వహించుకోవడం గర్వకారణమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి మాట్లాడుతూ ‘ఆగిపోయిన.. ముందుకు సాగలేవు నీవు’ అనే కాళోజీ కవితను స్ఫూర్తిగా తీసుకొని నేటితరం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ మాట్లాడుతూ మహనీయులకు మరణాలు ఉండవని, జయంతులు మాత్రమే ఉంటాయన్నారు. తెలంగాణ మట్టి గడ్డపై పుట్టిన ప్రతివారికీ తెలంగాణ స్ఫూర్తిని రగిలించిన మహారుషి కాళోజీ అని కొనియాడారు. ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్ మాట్లాడుతూ వచ్చే ఏడాది కాళోజీ జయంతిని వరంగల్లోని కళా క్షేత్రంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కడియం శ్రీహరికి సూచించారు. కాళోజీ పురస్కార స్వీకర్త డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్ మాట్లాడుతూ మహనీయుని పేరిట ఏర్పాటుచేసిన తొలి పురస్కారం తనకి ప్రదానం చేసిందుకు ప్రభుత్వానికి, సీఎంకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. మహాకవి కంటే ప్రజాకవి అయిన కాళోజీనే గొప్పవారన్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక సారథి గాయకుడు జంగిరెడ్డి బృందం కాళోజీపై పాడిన పాటలు ఆకట్టుకొన్నాయి. కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, డెరైక్టర్ మామిడి హరికృష్ణ, ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, సాహితీవేత్త డాక్టర్ ఎస్వీ సత్యనారాయణ, వి.ఆర్. విద్యార్థి, కాళోజీ కుమారుడు రవికుమార్ పాల్గొన్నారు. -
జేఈ లంచావతారం
బిల్లు మంజూరుకు రూ.23వేల లంచం తీసుకుంటూ పట్టుబడిన పంచాయతీ రాజ్ జేఈ రేపు కోర్టుకు హాజరుపర్చనున్న ఏసీబీ నర్సీపట్నం: పంచాయతీరాజ్ నర్సీపట్నం మండల ఇంజినీరింగ్ అధికారి అవినీతి నిరోధకశాఖ అధికారుల వలలో చిక్కారు. కాం ట్రాక్టర్ నుండి లంచం తీసుకుంటూ సోమవారం పట్టుబడ్డారు. ఏసీబీ డిఎస్పీ రామకృష ్ణప్రసాద్ విలేకర్లకు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. మండలంలోని కొత్తలక్ష్మిపురంలో రూ.5 లక్షలతో కాంట్రాక్టర్ రాజుమల్లు రోడ్డు, డ్రైనేజీ పను లు చేశారు. రూ.2లక్షలకు పైగా మొదటి బిల్లు చెల్లించారు. రెం డో బిల్లు మంజూరు చేయడానికి పంచాయతీ రాజ్ జేఈ సిహెచ్.వేణుగోపాల్ లంచం కావాలని రాజుమల్లును డిమాండ్ చేశారు. రూ.23,600లు చెల్లిస్తే కానీ బిల్లు మంజూరు కాదని చెప్పడంతో రాజుమల్లు ఏసీబీ అధికారులకు విషయం నివేదించాడు. దీంతో ఏసీబీ అధికారులు పన్నాగం వేశారు. అందులో భాగంగా ఉదయం ఫోన్ చేయగా మండల సర్వసభ్య సమావేశంలో ఉన్నానని, సాయంత్రం శారదనగర్లో ఉన్న ఇంటికి రావాలని రాజమల్లుకు జేఈ సూచించారు. జేఈ తన వద్ద అనధికారికంగా పని చేస్తున్న అసిస్టెంట్ కురచా నర్సింగరావు(శ్రీను) ద్విచక్రవాహనంపై సాయంత్రం ఇంటికి చేరుకున్నారన్నారు. రాజుమల్లు ఇచ్చిన డబ్బును నర్సింగరావు జేబులో పెట్టుకుంటున్న దశలో ఏసీబీ అధికారులు రంగ ప్రవేశం చేశారు. జెఈ వేణుగోపాల్, నర్సింగరావులను విచారించారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. వేణుగోపాల్ను అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో ప్రవేశ పెడతామని తెలిపారు. -
జెడ్ కేటగిరీ ఉపసంహరించలేదు
జగన్ భద్రతపై హైకోర్టులో ఏపీ ఏజీ ఏజీ స్టేట్మెంట్ను రికార్డ్ చేసిన న్యాయమూర్తి హోంశాఖ అధికారులకు నోటీసులు విచారణ 2 వారాలకు వాయిదా హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత జగన్మోహన్రెడ్డికి జెడ్ కేటగిరీ భద్రతను ఉపసంహరించలేదని ఏపీ అడ్వొకేట్ జనరల్(ఏజీ) పి.వేణుగోపాల్ మంగళవారం హైకోర్టుకు నివేదించారు. ఏజీ చెప్పిన విషయాన్ని రికార్డ్ చేసిన న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు, హోంశాఖ అధికారుల కు నోటీసులు జారీ చేస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు. మూడేళ్లుగా తనకు ఉన్న జెడ్ కేటగిరీ భద్రతను తొలగించి, (1+1) వ్యక్తిగత భద్రత సిబ్బంది, (1+1) ముఖ్య భద్రతాధికారిని మాత్రమే కేటాయించడాన్ని సవాలు చేస్తూ వైఎస్ జగన్ సోమవారం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని మంగళవారం జస్టిస్ రామ్మోహనరావు విచారించారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది డి.వి.సీతారామ్మూర్తి వాదనలు వినిపిస్తూ జగన్కు ప్రాణహాని ఉందన్న నిఘావర్గాల నివేదికలతో మూడేళ్ల నుంచి (6+6) వ్యక్తిగత భద్ర తాసిబ్బంది, (1+1) ముఖ్య భద్రతాధికారులతో జెడ్ కేటగిరీ భద్రత కొనసాగిస్తూ వస్తున్నారని, ఎ టువంటి నోటీసు ఇవ్వకుండా భద్రతను ఉపసంహరించారని తెలిపారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ భద్రత తొలగింపునకు సంబంధించిన ఉత్తర్వులను చూపాలని కోరారు. అధికారిక ఉత్తర్వులు జారీ చేయలేదని, ఈ నెల 13 నుంచి జెడ్ కేటగిరీ భద్రత సిబ్బంది రావడం మానేశారని సీతారామ్మూర్తి కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ సమయంలో అడ్వొకేట్ జనరల్ వేణుగోపాల్ జోక్యం చేసుకుంటూ జగన్కు జెడ్ కేటగిరీ భద్రతను తొలగిం చలేదని చెప్పారు. ఏజీ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ను రికార్డ్ చేసుకున్న న్యాయమూర్తి, ప్రతివాదులుగా ఉన్న హోంశాఖ అధికారులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను 2 వారాలకు వాయిదా వేశా రు. కాగా కుదించిన తన భద్రతను యథాతథం గా పునరుద్దరించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇ వ్వాలన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వై.వి. సుబ్బారెడ్డి అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ప్రాణహాని ఉన్న వ్యక్తుల జాబితాలో సుబ్బారెడ్డి పేరు లేదని, అందువల్లే ఆయనకు భద్రతను కుదించామన్న ఏజీ వాదనను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి రామ్మోహనరావు, విచారణను ఈ నెల 23కు వాయిదా వేశారు. -
ఆయన ఒక అంకెల మాంత్రికుడు
బాల్యంలో ఎక్కాలతో ఆటాడుకున్న ఆ బాలుడు గణాంకశాస్త్రంలో మేటి శాస్త్రజ్ఞుల సరసన నిలబడ్డారు. సాంఖ్యశాస్త్రం పేరు చెబితే నేటికీ డా॥సి.ఆర్.రావు గురించి తప్పక పేర్కొంటారు. 14 పుస్తకాలు, 350 పరిశోధనా పత్రాలు వెలువరించిన వీరు నేటికీ పరిశోధిస్తూనే ఉన్నారు. అమోఘమైన ప్రతిభ, అపారమైన పట్టుదల, అమితమైన భాషాభిమానం, అమేయమైన దేశ భక్తి - ఒకే వ్యక్తిలో మేళవించడం అసాధా రణ సందర్భం! అలాంటి వ్యక్తి జగదీశ్ చంద్రబోస్, శ్రీనివాస రామానుజం, సీవీ రామన్, హరగోవింద ఖొరానా, సత్యేంద్రనాథ్ బోస్, హోమీ జహంగీర్ భాభా, జి.ఎన్.రామచం ద్రన్, హరీష్ చంద్ర వంటి మహామహుల సరసన నిలవడం ఇంకా అపురూ పం!! ఈ అంకెల అద్భుతం, గణాంక శాస్త్ర శిఖరం పేరు డా॥కల్యంపూడి రాధాకృష్ణా రావు. ఈ పూర్తి పేరుతో పేర్కొంటే ఈయన తెలుగువాడని మనకు తెలియవచ్చు కానీ, ప్రపంచంలో చాలా మందికి తెలియకపో వచ్చు. ఎందుకంటే డా॥సి.ఆర్. రావుగానే వారు అంతర్జాతీయ కీర్తి పొందారు. 93 ఏళ్లు నిండిన ఈ ముదుసలి ఇంకా యావత్ ప్రపంచం గర్వించే రీతిలో నేటికీ స్టాటిస్టిక్స్ పరిశోధన చేస్తున్నారు. వారి దేశ భక్తి గురించి విశదం చేసే రెండు సందర్భాలు చూద్దాం. 1963లో డా॥సి.ఆర్.రావు గారికి భట్నాగర్ అవార్డు ప్రకటించారు. ఆ సమ యంలో మన దేశం చైనాతో యుద్ధంలో పోరాడుతోంది. అప్పటి ప్ర ధాని జవహర్లాల్ నెహ్రూ ఈ అవార్డు ప్రదానం చే స్తూ పదివేల రూపాయల నగదును రావు గారికి అం దించారు. ‘ఈ డబ్బు నాకన్నా దేశానికే ఎక్కువ అవసరమం’టూ ప్రధాన మంత్రి నిధికి విరాళంగా తిరిగి ఇచ్చారు. దాంతో నెహ్రూ పొంగిపోయి ఆయ న్ను కావులించుకున్నారు. ఇది 1963 ముచ్చట. 2010 సంగతి చూద్దాం. రావు జీవిత కాలపు కృషికి ఇండియా సైన్స్ అవార్డు పేర 25 లక్షల రూపా యల అవార్డును నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రదానం చేశారు. ఈ అవార్డును హైద రాబాద్లో స్వీకరిస్తూ - ఆ ధనంతో గణితం, గణాంకశాస్త్రం, కంప్యూటర్ సైన్స్ రంగాల కొరకు ప్రపంచస్థాయి సంస్థను ప్రారంభి స్తున్నట్లు ప్రకటించారు. దాంతో పొంగిపో యిన ప్రధాని రూ.15 కోట్లు మంజూరు చేశా రు. రావు సతీమణి భార్గవి తాను దాచుకున్న నగలు, ధనం ఈ సంస్థకు విరాళంగా ఇవ్వడం కొసమెరుపు. అలా ఏర్పడినదే సీఆర్ రావ్ అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేథమేటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్. జాతీయ, అంతర్జాతీ య విశ్వవిద్యాలయాలు ఆయనకు 30కి పైగా డాక్ట రేట్లు ఇచ్చాయి. అలా ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇచ్చిన గౌరవ డాక్టరేట్ను స్వీకరిస్తూ - థీసెస్సు రాని డాక్టరేటు తీసుకుంటానం టే, అప్పుడు తిరస్కరించి ఇప్పుడు పళ్లెంలో పెట్టి ఇస్తున్నారని ఆయన చమ త్కరించారు. దరఖాస్తు చే యడంలో రెండు రోజులు ఆలస్యమైందని నాటి ప్రిన్సిపల్ విస్సా అప్పా రావు, వైస్ చాన్స్లర్ సీఆర్ రెడ్డి కుదరదన్నా రు మరి. అప్పట్లోనే ఆర్మీ సర్వే యూనిట్లో మేథమేటిషియన్ ఉద్యోగం కోసం కలకత్తా వెళ్లారు. అక్కడ ఎంపిక కాలేదు, కానీ బస చేసిన హోటల్ దగ్గర పరిచయమైన సుబ్ర మణ్యం ఒక గొప్ప పనిచేశాడు. కలకత్తా ప్రెసిడెన్సీ కళాశాలలో స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూ ట్లో పనిచేస్తున్న డా॥మహల్నాబీస్ గారికి పరిచయం చేశారు. శిక్షకుడిగా చేరి, అక్కడే ఎంఏ స్టాటిస్టిక్స్ చేసి - అదే సంస్థలో పదవీ విరమణ చేశారు రావుగారు. సాంఖ్యశాస్త్రం లేదా గణాంకశాస్త్రం గురిం చి చెప్పుకొన్నప్పుడు రావు గురించి తప్పక పేర్కొంటారు. అంత గొప్పది మరి ఆయన కృషి. పాతికేళ్ల వయసులో ప్రతి పాదించిన ‘క్రామర్-రావ్’ ఇనీక్వాలిటీ ఎంతో పేరు గాంచింది. ఇంకా వారి పేరుతో పలు ఆవిష్కరణలున్నాయి. ఇవన్నీ అంతర్జాతీయ గౌరవాన్ని పొందిన సిద్ధాంతాలు. 14 పుస్తకాలు, 350 పరిశోధనా పత్రాలు వెలు వరించిన వీరు నేటికీ పరిశోధన చేస్తున్నారు. జీవిత వివరాలు: కర్ణాటకలో ఉండే హవి న హడగల్లిలో సి.దొరైస్వామి నాయుడు - లక్ష్మీకాంతమ్మ దంపతులకు 1920, సెప్టెంబర్ 10న రాధాకృష్ణ జన్మించాడు. అష్టమ సంతా నానికి శ్రీకృష్ణుడి పేరు పెట్టుకోవడం ఒక సం ప్రదాయం. గూడూరు, నందిగామ, నూజి వీడు, విశాఖపట్నంలలో విద్యాభ్యాసం సాగిం ది. తండ్రి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్గా పని చేస్తూ, బదిలీ కావడమే కారణం. తల్లి ప్రేర ణతో, చాలా చిన్న వయసులో ఎక్కాలే కాదు, వేటూరి ప్రభాకరశాస్త్రి చాటు పద్య మణిమం జరిని కూడా ఆరాధించాడు. ఎనిమిదో తరగతి నుంచి విశాఖపట్నంలోని మిసెస్ ఏవీఎన్ కాలేజీలో చదివారు. అక్కడే చదివిన విఖ్యాత శాస్త్రవేత్త సీవీ రామన్ తన తండ్రి పేర చంద్రశేఖర్ అయ్యర్ స్కాలర్షిప్ ఏర్పరి చా రు. దీన్ని సి.ఆర్.రావు రెండుసార్లు పొందడం విశేషం. (వ్యాసకర్త ఆకాశవాణి ప్రయోక్త) డా॥వేణుగోపాల్ -
బ్రహ్మోత్సవాలకు మెరుగ్గా సేవలందించాలి
తిరుమల: తిరుమలలో సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 4వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ప్రపంచ వ్యాప్తంగా వచ్చే భక్తులకు స్థానిక హోటల్ యజమానులు, కూరగాయల దాతలు మరింతగా సేవలు అందించాలని టీటీడీ అన్నదానం డెప్యూటీ ఈవో వేణుగోపాల్ పిలుపునిచ్చారు. స్థానిక అన్నమయ్య భవనంలో శుక్రవారం ఆయన హోటల్ యజమానులు, కూరగాయల దాతలతో వేర్వేరుగా సమీక్షించారు. మొదటగా హోటల్ యజమానుల సమావేశంలో డెప్యూటీ ఈవో వేణుగోపాల్ మాట్లాడుతూ గత ఏడాది బ్రహ్మోత్సవాలకు తిరుమలలోని వివిధ హోటళ్లు టీటీడీ పిలుపు మేరకు ముందుకు వచ్చి భక్తులకు విశేషంగా అల్పాహార వితరణ చేశారని కొనియాడారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు ఎక్కవ మందికి, మంచి నాణ్యతతో అల్పాహారాన్ని అందించాలని కోరారు. ఈ మేరకు హోటళ్ల యజమానులు కూడా సానుకూలంగా స్పందిస్తూ భక్తుల సేవే భగవంతుని సేవగా భావించి సేవలు అందిస్తామని తెలిపారు. అనంతరం జరిగిన కూరగాయల దాతల సమావేశం వేణుగోపాల్ మాట్లాడుతూ గత ఏడాది బ్రహ్మోత్సవాలకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు దాతలు దాదాపు 91 టన్నుల కూరగాయలను టీటీడీకి విరాళంగా అందజేశారన్నారు. ఈ ఏడాది అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు మరో 10 టన్నుల కూరగాయలను అందించాలని కోరారు. వివిధ రకాల కూరగాయలు విరాళంగా ఇవ్వటం వల్ల భక్తులకు రుచికరమైన అన్నప్రసాదాలను అందించగలమన్నారు. కూరగాయల దాతలు కూడా సానుకూలంగా స్పందించారు. అనంతరం టీటీడీ ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ శుచి, శుభ్రత, నాణ్యతతో కూడిన ఆహార పదార్ధాలను భక్తులకు అందించాలని హోటళ్ల యజమానులను కోరారు. ఈ కార్యక్రమంలో అన్నదానం క్యాటరింగ్ ఆఫీసర్ శాస్త్రి, ఏఈవో గీత, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
రిచ్ఇండియా ఎండీని నిలదీసిన ఏజెంట్లు
ఉదయగిరి రూరల్: రిచ్ ఇండియా కంపెనీ ఎండీ నేరెళ్ల వేణుగోపాల్ను పలువురు ఏజెంట్లు చుట్టుముట్టారు. తాము చెల్లించిన నగదు చెల్లించాలని నిలదీశారు. ఈ ఘటన సోమవారం ఉదయగిరిలో జరిగింది. ఏజెంట్ల కథనం మేరకు.. జలదంకి మండలం చోడవరానికి చెందిన వేణుగోపాల్ 2010లో రిచ్ ఇండియా సంస్థను ఏర్పాటు చేశారు. నెల్లూరు కేంద్రంగా వింజమూరు, నంద్యాల, పొద్దుటూరు, కర్నూలు, కందుకూరు లో బ్రాంచ్ ఆఫీసులు ఏర్పాటు చేసుకున్నారు. చెల్లించి న నగదుకు తక్కువ కాలంలోనే రెట్టిం పు ఇస్తామని ఆశచూపి ఏజెంట్ల ద్వారా సుమారు రూ.2.50 కోట్ల డిపాజిట్లు సేకరించారు. ఏడాది పాటు సక్రమం గా చెల్లించారు. అనంతరం నష్టాలు రావడంతో సంస్థ ఆస్తులను ‘విగార్’ కంపెనీకి అప్పచెప్పి నగదు పొందారు. ఆనగదుతో సీతారామపురం మండలం చింతోడు వద్ద పొలాలు కొనుగోలు చేసి శ్రీగంధం మొక్కలు నాటారు. బాండ్ల కాల పరిమితి ముగియడంతో ఏజెంట్లు నగదు చెల్లించాలని గతంలో అతన్ని పట్టుబట్టారు. ఆ సమయంలో చింతోడులోని పొలాలను ఇస్తానంటూ అగ్రిమెంట్ చేశారు. ఇటీవల ఆ పొలాలను పరిశీలించిన ఏజెంట్లు అవి ఎందుకూ పనికిరావని గుర్తించారు. తాము మోసపోయామని గ్రహించి ఎండీని నిలదీయాలని భావించారు. ఈ క్రమంలో నంద్యాల, వింజమూరు ప్రాంతాలకు చెందిన ఏజెంట్లు పొలం రిజిస్ట్రేషన్కు వేణుగోపాల్ను పిలవడంతో సోమవారం ఉదయగిరి వచ్చాడు. పోలీస్స్టేషన్ సమీపంలో ఏజెంట్లు ఆయన్ను చుట్టుముట్టి నగదు చెల్లించాలని డిమాండ్ చేశారు. పోలీసులు గమనించి వేణుగోపాల్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే తాము ఎలాంటి ఫిర్యాదు చేయలేదని, కేసులు అవసరం లేదని ఏజెంట్లు పేర్కొనడంతో ఆయనను వదిలేశారు. తన ఇంటితో పాటు పొలాలను రాసిచ్చేందుకు వేణుగోపాల్ సుముఖత వ్యక్తం చేయడంతో రాజీపడ్డారు. తమకు నంద్యాల బ్రాంచ్ పరిధిలో రూ.55 లక్షలు, వింజమూరు బ్రాంచ్ పరిధిలో రూ.45 లక్షలు రావాల్సి ఉందని ఏజెంట్లు తెలిపారు. -
కల్యాణ శ్రీనివాసం
అంగరంగ వైభవంగా శ్రీవారి కల్యాణం విశాఖపట్నం: విశాఖ తిరుమలైంది. బంగాళాఖాతం పాలకడలిగా మారింది. స్వర్ణభారతి స్టేడియం సకల దేవతలకు నెలవైంది. ఆదివారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ముందుగా విష్వక్సేనా ఆరాధనోత్సవంతో కల్యాణం ప్రారంభమైంది. శ్రీవారి నైద్యాధిపతి విష్వక్సేనుల ఆరాధన చేశారు. అనంతరం అంకురారోపణ కార్యక్రమం జరిగింది. స్వామివారి అత్యంత సన్నిహితుడు, సేవకుడు మన విన్నపాలని స్వామివారికి హనిస్సు రూపంలో చేర్చడానికి అగ్ని కార్యం జరిపారు. సామూహిక సంకల్పం జరిపారు. అనంతరం స్వామివారి దక్షిణ హస్తానికి, అమ్మవార్లు వామహస్తానికి కంకణధారణ చేశారు. తరువాత గోత్ర ప్రవరలు తెలిపారు. శ్రీదేవి, భూదేవిల గోత్ర నామాలు చెప్పిన అనంతరం మహా సంకల్పం చేశారు. స్వామివారిని నూతన వస్త్రధారణతో అలంకరించారు. అయ్యవారికి, అమ్మవార్లకు జీలకర్ర, బెల్లం పెట్టిన తరువాత కల్యాణం వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా స్టేడియం గోవింద నామాలతో దద్దరిల్లింది. కల్యాణం అనంతరం భక్తులు క్యూలో ఉండి స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మధుసూదనరావు, డా.జయంతి సావిత్రి ఆలపించిన అన్నమయ్య కీర్తనలు భక్తులకు అకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈఓ ఎం.జి.గోపాల్, ఎస్.ఓ. రఘనాథ్, ప్రధాన అర్చకుడు గురురాజ్, చాగంటి కోటేశ్వరరావు, అన్నదానం డిప్యూటీ ఈఈ వేణుగోపాల్, ఉత్సవాల ఇన్చార్జ్ సురేంద్రరెడ్డి, సూపరింటెండెంట్ వెంకటరమణ పాల్గొన్నారు. భక్తుల పరమానందం విశాఖపట్నం: శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు భక్తుల కనులపండువలా సాగుతున్నాయి. స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో ఈనెల 23 నుంచి ప్రారంభమైన వైభవోత్సవాలకు ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అఖిలాండకోటి బ్రహ్మండ నాయకుడైన శ్రీవేంకటేశ్వరస్వామి వారు కొలువైన తిరుమల ఆలయంలో రోజువారీ నిర్వహించే అన్నిరకాల సేవలను భక్తులు ఇక్కడే వీక్షిస్తున్నారు. ఉదయం 6 గంటలకు సుప్రభాతం,7 గంటలకు తోమాలసేవ, కొలువు, అర్చన, 8 గంటలకు నివేదన, శాత్తుమొర, 8.30 గంటలకు భక్తులచే సామూహిక సహస్రనామ తులసి అర్చన, 10 గంటలకు రెండో నివేదన, 10 గంటల తరువాత భక్తులకు వీలుగా సర్వదర్శనం, సాయంకాలం సహస్ర దీపాలంకరణసేవ, 6 గంటలకు కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు,7.30 గంటలకు రాత్రి కైంకర్యం, 8.30 గంటలకు స్వామివారికి ఏకాంత సేవ జరిపారు. తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో స్టేడియానికి చేరుకున్నారు. ఎటువైపు చూసినా భక్తులతో స్టేడియం జనసంద్రంగా మారింది. స్వామివారి కల్యాణం చూడడానికి సుమారు 25 వేల మంది భక్తులు ఇక్కడకు చేరుకున్నారు. భక్తి ప్రపత్తులతో వెంకన్న కల్యాణం వీక్షించారు. నేటి సేవ విశేషపూజ.. తిరుమలలో ప్రతి సోమవారం ఉదయం 6 గంటలకు జరిగే ప్రధాన సేవ విశేషపూజ. ఈ సేవలో సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపంలో శ్రీదేవి,భూదేవి సమేతంగా మలయప్ప స్వామికి జరుగుతుంది. ఈసేవ 1991 ఏప్రిల్ 8 నుంచి ప్రారంభించారు. తరువాత కాలంలో అర్జిత సేవగా రూపుదిద్దుకుంది. శ్రీవారి అలయం లో రెండవ అర్చన, రెండు నైవేద్యం తర్వాత దేవేరులతో కూడి శ్రీమలయ్యప్పస్వామి కల్యాణమండపానికి వేంచేస్తారు. వైఖానసాగమ శాస్త్రోక్తంగా హోమాలు నిర్వహిస్తారు. తరువాత శ్రీస్వామివారలకు (స్నపన) తిరుమంజనం నిర్వహిస్తారు. -
ఆంధ్రప్రదేశ్ ఏజీగా వేణుగోపాల్!
అదనపు ఏజీగా దమ్మాలపాటి శ్రీనివాస్? నేడు ఉత్తర్వులు వెలువడే అవకాశం హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ)గా సీనియర్ న్యాయవాది పరాంకుశం వేణుగోపాల్ నియమితులు కానున్నారు. ఆయన నియామకానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు గురువారం వెలువడే అవకాశాలున్నాయి. అదనపు అడ్వొకేట్ జనరల్గా దమ్మాలపాటి శ్రీనివాస్ పేరు ఖరారైనట్లు తెలిసింది. ఆయన నియామకపు జీవో కూడా గురువారం వెలువడే అవకాశం ఉంది. ఏజీ పదవికి పలువురి పేర్లు వినిపించినప్పటికీ, అనూహ్యంగా పి.వేణుగోపాల్ పేరు ఖరారైంది. వేణుగోపాల్ పూర్వీకులు ఒరిస్సాలోని బరంపురంకు చెందిన వారు. తరువాత కాలంలో వారి కుటుంబం సికింద్రాబాద్లో స్థిరపడింది. 1954 నవంబర్ 23న వేణుగోపాల్ జన్మించారు. ఆయన విద్యాభ్యాసం మొత్తం సికింద్రాబాద్లోనే సాగింది. 1977లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అదే ఏడాది డిసెంబర్ 22న హైకోర్టు న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. సీనియర్ న్యాయవాది ఎన్.వి.రంగనాథన్ వద్ద జూనియర్గా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 1983లో అడ్వొకేట్ జనరల్కు సహకరించేం దుకు ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా నియమితులై 1989 వరకు ఆ బాధ్యతలు నిర్వర్తించారు. వేణుగోపాల్ 2002-03లో హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్గా ఉన్నారు. -
అమ్మా.. మజాకా!
పార్టీపై ప్రత్యేక నిఘా నిర్లక్ష్యపు మంత్రులపై వేటు మాజీలకు చోటు చెన్నై, సాక్షి ప్రతినిధి : మంత్రులపై వేటు, మాజీ మంత్రులకు చోటు ఇవ్వడం ద్వారా అమ్మా...మజాకా! అని మరోసారి రుజువుచేసుకున్నారు. అమ్మ మార్కు రాజకీయాన్ని మరోసారి ప్రదర్శించి పలువురి పార్టీ పదవులపై వేటు వేశారు. రాష్ట్రంలోని 39, పుదుచ్చేరిలోని ఒకటి కలుపుకుని మొత్తం 40 స్థానాల్లో గెలుపొందినపుడే కేంద్రంలో పట్టుసాధిస్తామని పార్టీ క్యాడర్కు అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత అనేకసార్లు నూరిపోశారు. ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో మంత్రిని ఇన్చార్జ్గా నియమించారు. 37 స్థానాల్లో గెలవగా కన్యాకుమారి, ధర్మపురి, పుదుచ్చేరి స్థానాల్లో పార్టీ పరాజయం పాలైంది. దేశమంతా అన్నాడీఎంకే విజయాన్ని ఆకాశానికి ఎత్తేసినా అమ్మ మాత్రం ఆ మూడు స్థానాలపై ఆలోచనలో పడ్డారు, తనదైన శైలిలో ఆరాతీశారు. అంతే ఇంకేముంది ముగ్గురు మంత్రులపై వేటుపడింది. కొందరు పార్టీ పదవులను కోల్పోయారు. కన్యాకుమారిలో అన్నాడీఎంకే అభ్యర్థి మూడోస్థానానికి దిగజారడంతో అక్కడి ఇన్చార్జ్ మంత్రి పచ్చయమ్మాల్ పదవి కోల్పోయారు. ఈరోడ్ ఇన్చార్జ్ మంత్రి దామోదరన్ అనారోగ్యం పేరున సరిగా ప్రచారం చేయకపోవడం, అభ్యర్థుల కోసం పార్టీ ఇచ్చిన నిధులను సక్రమంగా పంచకపోవడంతో మాజీగా మారిపోయారు. తిరువళ్లూరు ఎంపీ వేణుగోపాల్ రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొందినా అక్కడి ఇన్చార్జ్ మంత్రి బీవీ రమణకు వేటుతప్పలేదు. ఇది పార్టీలో సంభ్రమాశ్చర్యానికి గురిచేసింది. రమణ తొలగింపునకు సరైన కార ణాలను పార్టీ నేతలే అన్వేషిస్తున్నారు. అమ్మ కేబినెట్లో కీలక పోర్టుఫోలియోలను నిర్వర్తిస్తున్న కేపీ మునుస్వామి నుంచి తప్పించి సాధారణమైన కార్మిక సంక్షేమ శాఖను అప్పగించి చివరకు ఆ శాఖనుంచి కూడా తొలగించారు. ఎన్నికల సమయంలో అనేక చోట్ల ప్రజలు తాగునీటి సమస్య ఎదుర్కొన్నా తగిన నివారణ చర్యలను తీసుకోలేదన్న ఆరోపణ వుంది. పార్టీ క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడిగా ఉన్న మంత్రి కేపీ మునుస్వామిని తప్పించి ఎడప్పాడీ పళనిసామిని నియమించారు. కన్యాకుమారి, ధర్మపురిల్లో పార్టీ బాధ్యతలను నిర్వహిస్తున్నవారిపై కూడా జయ వేటువేశారు. మాజీలకు మళ్లీ చోటు సక్రమంగా పనిచేయనివారిపైనే కాదు సమర్థవంతంగా వ్యవహరించిన నేతలపైనా తన నిఘా ఉందని అమ్మ నిరూపించుకున్నారు. గతంలో మంత్రి పదవుల నుంచి తొలగింపునకు గురైన వేలుమణి, అగ్రి కృష్ణమూర్తి, గోకుల ఇందిర ఈ ముగ్గురు తాజా ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు విశేషంగా కృషి చేసినందుకు మెచ్చుకోలుగా అమ్మ మళ్లీ పదవులను కట్టబెట్టారు. మంగళవారం సాయంత్రం రాజ్భవన్లో గవర్నర్ కె.రోశయ్య సీఎం జయ సమక్షంలో వారి చేత ప్రమాణస్వీకారం చేయించారు. -
సామాజిక కళాచైతన్యం
గాజు బల్లపై గుప్పెడు ఇసుక పోసి చేతివేళ్లతో వేణుగోపాల్ చేసే చిత్రాలను చూస్తే కళ్లు తిప్పుకోలేం. మనసుని తాకుతూ మైమర పించే అతని శాండ్ ఆర్ట్ వెనకున్న రహస్యం ఆ కళకున్న ప్రత్యేకతఒక్కటే కాదు... సమాజాన్ని ఆలోచింపజేయాలన్న అతని దృఢ సంకల్పం కూడా. ఓ సాధారణ ఉపాధ్యాయుడిగా జీవితాన్ని గడుపుతున్న వేణుగోపాల్ శాండ్ ఆర్ట్ కళాకారుడిగా గుర్తింపుపొందడం వెనక పెద్ద కథే ఉంది. ఢిల్లీలో ‘నిర్భయ’ ఘటన జరిగినపుడు వేణుగోపాల్ ఐదునిమిషాలపాటు తీసిన శాండ్ ఆర్ట్ వీడియోను చూసినవారంతా కంటనీరు పెట్టుకున్నారు. మనదేశంలో మహిళలకు ఉన్న రక్షణ గురించి ఆ వీడియో ద్వారా వేణుగోపాల్ సంధించిన ప్రశ్నలు హృదయాన్ని కదిలించాయి. గాజు బల్లపై ఉన్న ఇసుకలో ముందుగా రాసుకున్న స్టోరీ బోర్డుని యథాతథంగా చిత్రీకరించడంలో ఆరితేరిన వేణుగోపాల్ దీన్ని కేవలం కళగానే కాకుండా ఆదాయమార్గంగా కూడా మలుచుకున్నాడు. హైదరాబాద్లోని గుడిమల్కాపూర్లో ఉండే వేణుగోపాల్ అతి సాధారణ కుటుంబం నుంచి పైకొచ్చాడు. తండ్రి యాదయ్య, తల్లి మల్లిక కష్టపడి తమ నలుగురు మగపిల్లల్నీ చదివించారు. ‘‘నేను నాలుగోవాణ్ణి. డిగ్రీ మధ్యలో మానేసి జెఎన్టియులో ‘అప్లయిడ్ విజువల్ కమ్యూనికేషన్’ కోర్సు చేశాను. ఆ తర్వాత ప్రైవేట్ ఆర్ట్ పబ్లికేషన్లో స్టోరీ బోర్డ్ ఆర్టిస్టుగా పనిచేశాను. తర్వాత ఓ ప్రైవేటు పాఠశాలలో ఆర్ట్ అండ్ డిజైనింగ్ టీచర్గా చేరాను. ఆ సమయంలో ఒకసారి శాండ్ ఆర్ట్కి సంబంధించిన వీడియోని చూశాను. అప్పటికే పెయింటింగ్లో పట్టున్న నాకు శాండ్ ఆర్ట్ నేర్చుకోవడం పెద్దగా కష్టం అనిపించలేదు. మొదట్లో సరదా కోసం సాధన చేశాను. ఒకరోజు మురళీధర్ ఆచార్య అనే వ్యవసాయ శాస్త్రవేత్తతో పరిచయం ఏర్పడింది. ఆయన నా శాండ్ ఆర్ట్ని చూసి చాలా ప్రోత్సహించారు. ‘‘వేలు, లక్షలు ఖర్చుపెడితేగాని ఓ క్రియేటివ్ వీడియో ప్రెజెంటేషన్ బయటికి రావడంలేదు. అదే శాండ్ ఆర్ట్తో అయితే చాలా సులువుగా వీక్షకులను ఆకట్టుకోవచ్చు’’ అని చెప్పారు. ‘‘నాకు మొదట్లో అర్థం కాలేదు. తర్వాత్తర్వాత శాండ్ఆర్ట్ని సమాజానికి చూపించడంలో ఉన్న ప్రత్యేకతను తెలుసుకున్నాను’’ అని చెప్పాడు వేణుగోపాల్. సామాజిక అంశాలపై... మొదట పూలు, చెట్లతో ప్రారంభించిన వేణుగోపాల్ మెల్లగా ఈ కళకు సామాజిక అంశాలను జోడించి ప్రదర్శించడం మొదలుపెట్టాడు. ఉమెన్డే, మదర్స్డే... ఇలా పలు సందర్భాల్లో ప్రత్యేకమైన కథను రాసుకుని దానికి తగ్గట్టుగా శాండ్ ఆర్ట్ని వేసి వీడియోలు తీసి యూట్యూబ్లో పెట్టాడు. ‘‘ఉమెన్స్డే, మదర్స్డే... అనే కాదు. పండగలప్పుడు కూడా వాటి చరిత్రలను తెలుపుతూ శాండ్ ఆర్ట్ వీడియోలు చిత్రీకరించాను. కొన్ని పాఠశాలలో ప్రదర్శనలు కూడా ఇచ్చాను. కొన్ని నెలలపాటు ఇలాంటి ప్రదర్శనలు ఇస్తూ గడుపుతుండగా... ఒకరోజు మా గురువుగారు ప్రొఫెసర్ గంగాధర్గారు శాండ్ఆర్ట్ని కమర్షియల్గా కూడా ఉపయోగించవచ్చని చెప్పారు. మొదట నికాన్ కెమెరా వాళ్లకి ఒక వీడియో తయారుచేశాను. ఫొటోకి ఉన్న విలువను చెబుతూ ఇరవై ఫ్రేముల్లో నేనిచ్చిన ప్రదర్శన వాళ్లకి చాలా బాగా నచ్చింది. దీంతో పాటు ఐఎన్జి వైశ్యాబ్యాంక్, యారో పబ్లికేషన్స్, బెంగుళూరులోని వియ్వేర్ కంపెనీలకు శాండ్ఆర్ట్ ప్రజెంటేషన్లు తయారుచేశాను’’ అని చెప్పే వేణుగోపాల్ శాండ్ ఆర్ట్ల ప్రజెంటేషన్లు చూస్తున్నంతసేపు అందమైన దృశ్యాలే తప్ప అతని చేతివేళ్లు కనిపించవు. సరదా కోసం నేర్చుకున్న కళ... సొంతానికే కాక సమాజానికీ ఉపయోగపడేలా చేసుకోవడంలో వేణుగోపాల్ ఆదర్శమే! రకరకాల అంశాలపై... వీలైనంతవరకూ శాండ్ఆర్ట్తో సమాజాన్ని ప్రభావితం చేసే అంశాలపై రకరకాల ప్రదర్శనలు ఇవ్వాలనేది నా లక్ష్యం. దీనికోసం నేను చాలా అంశాలపై కథలను తయారుచేసి పెట్టుకున్నాను. భ్రూణహత్యలు, బాల్యవివాహాలు, వరకట్నాలు, బాలకార్మికులు... ఇలా రకరకాల అంశాలపై కథలను సిద్ధం చేసుకున్నాను. ఇప్పటికే పర్యావరణంపై నేను చేసిన శాండ్ఆర్ట్లకు యూట్యూబ్లో చాలామంది అభిమానులు ఉన్నారు. ఇకముందు మరిన్ని విషయాలపై స్పందిస్తూ పాఠశాలలు, కళాశాలలు వేదికలుగా చేసుకుని ప్రదర్శనలు ఇవ్వాలనుకుంటున్నాను. - వేణుగోపాల్ -
కావేరీ తీరంలో తెలుగు కళా తోరణం
కొద్దికాలం క్రితం వరకు మేళా కుటుంబాల వారికి ప్రదర్శనలే వృత్తి. ఇప్పుడు కొందరు చదువుకుని ఉద్యోగాలు చేసుకుంటున్నా, ఏటా మేలత్తూరు వచ్చి ప్రదర్శనలలో పాల్గొని, ఆ కళ పట్ల తమ నిబద్ధతని చాటుకుంటున్నారు. తెలుగు భాష, సంస్కృతి, కళారూపాలు నిరంతరం ప్రభవించాలని ఆశించేవారూ, అవి ధ్వంసమైపోతున్నాయని కేవలం ఇక్కడ వీరావేశం ప్రదర్శించే వారూ కూడా కావేరీ తీరంలో ఉజ్జ్వలంగా వెలుగుతున్న ఆ దీప తోరణాన్ని ఒక్కసారి దర్శించడం మంచిది. లేదా ఆ వెలుగుల గురించి తెలుసుకున్నా మేలే. నాలుగు శతాబ్దాలుగా ఆ దీపతోరణం నిశ్చలంగా వెలుగుతోంది. తంజావూరు సమీపంలో తిరువయ్యూరు దగ్గర మేల త్తూరులో ఏటా మే మాసంలోనే వారం రోజులు నరసింహ జయంతి పేరిట ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ తిరువయ్యూరు దగ్గరే త్యాగరాజ స్వామి సమాధి ఉంది. నరసింహ జయంతికి ఆ ఊళ్లో నృత్య నాటకాలు గొప్పగా ప్రదర్శిస్తారు. అవన్నీ తెలుగు నాటకాలే. ఈ విషయం తెలిసిన వారు తెలుగునాట ఎందరున్నారో గానీ, అక్కడ నాలుగు వందల సంవత్సరాల నుంచి ఈ ప్రదర్శనలు జరుగుతున్నాయి. మేల త్తూరు భాగవత మేళా నాట్య విద్యా సంఘం(మే 10 -18), భాగవత నాట్య నాటక సంఘం (మే 24-31) కూడా ఈ ఉత్సవాలు జరుపుతున్నాయి. రెండో సంస్థ 74 సంవత్సరాల నుంచి ఉత్సవాలు నిర్వహిస్తున్నది. తమిళనాట ఉన్న మేలత్తూరు తెలుగు పల్లెను తలపిస్తుంది. ఆ గ్రామంలో వేంచేసి ఉన్న నరసింహస్వామి ప్రీత్యర్థం ఈ కళారూపాలను ప్రదర్శిస్తారు. ఆరు నెలల క్రితం ఈ గ్రామం వెళ్లి భాగవత మేళా నాటక బృందాల పెద్దలు కె. కుమార్, మహాలింగం గార్లను కలుసుకున్నపుడు కొన్ని విషయాలు తెలిశాయి. నరసింహస్వామి కోవెలలో పూజలు చేసి నాటక బృందాలు ప్రదర్శనలు ప్రారంభించడం సంప్రదాయం. నృసింహ జయంతికి మొదలయ్యే ఈ నాటకోత్సవాలకు ‘ప్రహ్లాద చరిత్ర’తోనే శ్రీకారం చుడతారు. ఏటా డిసెంబర్లో చెన్నైలో జరిగే సంగీత నృత్యోత్సవాలలో కొన్ని భాగవత మేళా ప్రదర్శనలు కూడా ఉంటాయి. అప్పుడే కె. నటరాజన్, కె. కుమార్ ప్రదర్శించిన ‘సతీ సావి త్రి’ చూడడం తటస్థించింది. రంగస్థలం మీద ఎడమ వైపున భాగవతులు మృదంగం, వేణువు వంటి వాయిద్యాల సహకారంతో ఇతివృత్తాన్ని గానం చేస్తుంటారు. మధ్య మధ్య ప్ర యోక్త దృశ్యాలనీ, పాటనీ అనుసంధానం చేస్తూ ఉంటాడు. గణేశ స్తుతి, హారతి, అరటిపళ్ల నైవేద్యాల తరువాత కథ ఆరంభమవుతుంది. బ్రాహ్మణులూ, అందులోనూ పురుషులు మాత్రమే ప్రదర్శించే ఈ నాటకాలు పన్నెండని చెబుతారు. అవి- ప్రహ్లాద చరిత్రతో పాటు రుక్మిణీ కల్యాణం, మార్కండేయ చరిత్ర, ఉషాపరిణయం, హరిశ్చంద్ర, సీతా కల్యాణం, పార్వతీ కల్యాణం, కంసవధ, హరిహర లీలావిలాసం, ధ్రువ చరిత్ర- వాటిని మేలత్తూరు వెంకటరామ శాస్త్రి రాశారు. మేలత్తూరుకు చెందిన కుమార్, మహాలింగం కుటుం బాలు తాము తెలుగువారమనే చెబుతాయి. కానీ మాట్లాడేది తమిళమే. తెలుగు చదవడం, రాయడం రాకున్నా ఈ తెలుగు నాటకాలను భట్టీయం వేసి ప్రదర్శిస్తారు. త్యాగరాజ స్వామి సంగీత సంప్రదాయంలోనే ఉన్నప్పటికీ, ఉచ్చారణ మీద తమిళ ప్రభావం గణనీయంగా గమనిస్తాం. మొదట వీటిని దైవ సన్నిధిలోనే ప్రదర్శించేవారు.ఇటీవలికాలంలో వీధిలో రంగస్థలం, విద్యుద్దీపాలను కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. అందుతున్న ఆధారాల ప్రకారం 14వ శతాబ్దంలో నరసింహస్వామి సన్నిధిలో ఒక ప్రదర్శన జరిగింది. 1510లో షోలింగాపురం(షోలింగర్) నరసింహస్వామి ఆలయంలో ఒక నృత్య నాటకం ప్రదర్శించారు. విజయనగర పాలకుడు అచ్యుతరాయల దేవేరి తిరుమలదేవి శ్రీరంగం వచ్చినపుడు ఒక ప్రదర్శన ఇవ్వవలసిందని కోరిందట. అచ్యుతప్పనాయకుడు (1561-1614) తన ఏలుబడిలో 510 బ్రాహ్మణ కుటుంబాలకు ఒక గ్రామాన్ని దానం చేసి, ఈ కళకు చేయూతనిచ్చాడు. తరువాత శాలియ మంగళం, నల్లూరు, ఊత్తుకారు, శూలమంగళం, తెప్పరహతనల్లూరు అనే గ్రామాలను కూడా దానం చేశాడు. వీటన్నిటినీ కలిపి అచ్యుతాబ్ది అం టారు. 1855 తరువాత ఈ ప్రాభవం కొంత సన్నగిల్లింది. కొంతకాలానికి భారతం నటేశ అయ్యర్, గణేశ అయ్యర్ వంటి వారి కృషితో మళ్లీ ప్రదర్శనలు మొదలయినాయి. కొద్దికాలం క్రితం వరకు మేళా కుటుంబాల వారికి ప్రదర్శనలే వృత్తి. ఇప్పుడు కొందరు చదువుకుని ఉద్యోగాలు చేసుకుంటున్నా, ఏటా మేలత్తూరు వచ్చి ప్రదర్శనలలో పాల్గొంటున్నారు. ఇప్పటికీ ఈ కుటుంబాలే ఈ కళకు ఆలంబన. కేంద్రం, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు, కొన్ని ప్రైవేటు సంస్థలు చేయూతనిస్తున్నాయి. ఆ కళాకాంతులను చూసైనా ఆనందిద్దాం! వ్యాసకర్త ఆకాశవాణి ప్రయోక -
మార్కెట్ శక్తుల్ని నియంత్రిస్తేనే..
తెలంగాణలో అభివృద్ధి: రాఘవులు మార్కెట్ శక్తుల వల్లే చెరువులు ధ్వంసం భూపంపిణీతోనే సామాజిక న్యాయం ఎస్వీకే ట్రస్ట్, సామాజిక న్యాయవేదిక ఆధ్వర్యంలో తెలంగాణ అభివృద్ధిపై సమావేశం మార్కెట్ శక్తులు ఆధిపత్యం చలాయించాయని, తెలంగాణలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వం మార్కెట్ శక్తులను నియంత్రించకుంటే అభివృద్ధి జరగదని సీపీఎం నేత బి.వి.రాఘవులు అభిప్రాయపడ్డారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్వీకే ట్రస్ట్, సామాజిక న్యాయ వేదిక సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ అభివృద్ధిపై రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాఘవులు మాట్లాడుతూ నూతన తెలంగాణ రాష్ట్రంలో సమగ్రాభివృద్ధిని కోరుకుంటున్నామన్నారు. తెలంగాణలో చెరువులు ధ్వంసమైన మాట వాస్తవమేనని.. మార్కెట్ శక్తుల వల్లే తెలంగాణతో పాటు సీమాంధ్ర, కర్ణాటక ప్రాంతాల్లోనూ చెరువులు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. తెలంగాణలో పాలక వర్గాలు జాగ్రత్తగా ఉండకపోతే ఉన్న పరిశ్రమలు నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉందని.. అదే జరిగితే ఇప్పుడున్న అభివృద్ధి కూడా సాధ్యం కాదని హెచ్చరించారు. తెలంగాణ అభివృద్ధి అంటే ఒక్క హైదరాబాద్ మాత్రమే కాదన్నారు. విద్య అనేది ఉపాధి కోసమే కాదని, వ్యక్తుల్లో చైతన్యాన్ని తెస్తుందని, ఇప్పుడు హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాల్లో చైతన్య, నారాయణ వంటి ప్రైవేటు విద్యాసంస్థలే రాజ్యమేలుతున్నాయని చెప్పారు. ప్రాథమిక విద్యను పటిష్టం చేయాలని సూచించారు. సామాజిక న్యాయం జరగాలంటే భూ పంపిణీ జరగాలన్నారు. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ కన్వీనర్ మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం వల్ల సామాజిక న్యాయంలో ఒక అడుగు ముందుకు వేశామన్నారు. ఆంధ్ర పాలకులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తీవ్రమైన అన్యాయం చేశారని విమర్శించారు. ఆంధ్ర ప్రాంతం వారు 200 సంవత్సరాలు విద్యలో ముందంజలో ఉన్నారని పేర్కొన్నారు. వ్యవసాయ సంఘం నాయకులు మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రైతుల ఆత్మహత్యలకు నిలయంగా మారిందన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.ఆర్.వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రొఫెసర్ పురేంద్రప్రసాద్, ప్రొఫెసర్ భూక్యా, క్రెడై సంస్థ సీఈఓ రాజేశ్వరరావు, కోవా సంస్థ ప్రతినిధి మజహర్హుస్సేన్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. -
ఏసీబీకి చిక్కిన ఎఫ్ఆర్ఓ
ములుగు, న్యూస్లైన్ : బిల్డింగ్ సబ్ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఏసీబీ అధికారులకు చిక్కిన సంఘటన ములుగు ఫారెస్ట్ కార్యాలయం శనివారం చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ సాయిబాబా కథనం ప్రకారం.. ములుగు ఫారెస్ట్ కార్యాలయంలో బీట్ ఆఫీసర్ల కో సం భవనాలు మంజూరయ్యాయి. ఈ భవన నిర్మాణ పనులను హన్మకొండకు చెందిన కాంట్రాక్టర్ రాజయ్య చేపట్టారు. నిబంధనల ప్రకారం బిల్డింగ్ కి 14 పిల్లర్లు నిర్మించాల్సి ఉండగా సదరు కాంట్రాక్టర్ 13 పిల్లర్లు మా త్రమే నిర్మిస్తున్నాడని, ఇం దుకు సంబంధించిన బిల్లు పై సంతకం చేయాలంటే తనకు రూ.50 వేలు లంచంగా ఇవ్వాలని రేంజ్ అఫీసర్ వేణుగోపాల్ డిమాండ్ చేశాడు. దీంతో సదరు కాంట్రాక్టర్ రూ.20 వేలు సమర్పించాడు. అయినా అతడు ఊరుకోకుండా మిగతా రూ.30 వే ల కోసం వేధించడంతో ఈ నెల 19వ తేదీన ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలోనే రాజయ్య నుంచి ఎఫ్ఆర్ఓ వేణుగోపాల్ తన కార్యాలయంలో రూ.12 వేలు తీసుకుంటుండగా అక్కడే పొంచి ఉన్న ఏసీబీ అధికారులు రెడ్ హ్యాం డెడ్గా పట్టుకున్నారు. అనంతరం కార్యాలయం లో ఇప్పటి వరకు పట్టుకున్న వాహనాలను, వాటికి అధికారులు తీసుకున్న లావాదేవీలను పరిశీలించారు. డీఎస్పీ వెంట సీఐలు పి. సాంబయ్య, రాఘవేందర్రావు, రియాజ్ ఉన్నారు. -
శివరాత్రికి ముస్తాబైన శైవక్షేత్రాలు
బంజారాహిల్స్, మహాశివరాత్రి వేడుకలకు శైవక్షేత్రాలు ముస్తాబయ్యాయి. గురువారం జరగనున్న శివరాత్రి వేడుకల సందర్భంగా ఆయా ఆలయాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలిరానుండటంతో ఇప్పటికే సౌకర్యాలు కల్పించారు. శివాలయాలు రంగురంగుల విద్యుత్ దీపాలు, రంగురంగుల పూలదండలతో శోభాయమానంగా వెలిగిపోతున్నాయి. ఆలయాల్లో భక్తుల సౌకర్యార్ధం బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎండలు మండిపోతుండటంతో కొన్ని చోట్ల చలవ పందిళ్లు వేశారు. చాలా ఆలయాల్లో శివపార్వతుల కల్యాణ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. రాత్రి జాగరణ చేసేందుకు పలు ఆలయాల్లో ప్రత్యేక భజనలు, భక్తిగీతాలపన కార్యక్రమాలు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. శివరాత్రి వేడుకలు ఇలా... శ్రీనగర్కాలనీలోని వెంకటేశ్వరస్వామి దేవస్థానం ఆవరణలో ఉన్న భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి దేవాలయంలో శివరాత్రి వైభవోపేతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎ.బాలాజీ తెలిపారు. గురువారం తెల్లవారుజామున 3 గంటలకే స్వామి వారికి అభిషేకంతో పర్వదిన వేడుకలు మొదలవుతాయన్నారు. ఫిలింనగర్లోని దైవ సన్నిధానంలో కొలువైన భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లోని కేర్ ఆసుపత్రి ఎదురుగా ఉన్న శివాలయంలో వేడుకల కోసం సన్నాహాలు పూర్తయ్యాయి. సుమారు 50 వేల మంది భక్తులు హాజరౌతారని అంచనా వేస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్నెంబర్ 12లోని కమాన్ను ఆనుకొని ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం ఆవరణలోని శివాలయంలో శివరాత్రి వేడుకలు కన్నలపండువగా నిర్వహించనున్నట్లు ఆలయ ఇంచార్జ్ పి.వేణుగోపాల్ గౌడ్ తెలిపారు. జూబ్లీహిల్స్ రోడ్నెంబర్ 15లో ఉన్న సీతారామ స్వామి ఆలయంలో ఆవరణలోని శివాలయంలో వేడుకలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పంజగుట్ట నిమ్స్ ఆసుపత్రిని ఆనుకొని ఉన్న భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.పంజాగుట్ట దుర్గానగర్కాలనీలో కొలువైన కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. ఖైరతాబాద్లోని వాసవీ సేవా కేంద్రంలో శివరాత్రి వేడుకలు నాలుగు రోజుల పాటు నిర్వహించనున్నారు. -
అప్పిలేపల్లిలో ఉద్రిక్తత
కుందుర్పి, న్యూస్లైన్ : కుందుర్పి మండలం అప్పిలేపల్లిలో ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శనివారం అర్ధరాత్రి ప్రదర్శించిన వీధి నాటకం ఉద్రిక్తతకు దారితీసింది. నాటకం మధ్యలో చేస్తున్న అశ్లీల నృత్యాల ప్రదర్శన ఆపాలని ఎస్ఐ కోరగా.. కళాకారులు బేఖాతరు చేస్తూ కొనసాగించారు. చివరకు ఎస్ఐ లైట్లు ఆర్పివేయడంతో జనం స్టేజీపైకి దూసుకొచ్చారు. ఈ క్రమంలో ఒక మహిళ స్పృహ తప్పిపడిపోయింది. దీంతో ఆగ్రహంతో రెచ్చిపోయిన జనం పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఎస్ఐ, కానిస్టేబుల్కు చెందిన రెండు బైక్లకు నిప్పుపెట్టారు. కళ్యాణదుర్గం డీఎస్పీ వేణుగోపాల్ , సర్కిల్ ఇన్స్పెక్టర్ వంశీధర్గౌడ్ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అప్పిలేపల్లిలో ఆదివారం నిర్వహించనున్న గావు ఉత్సవానికి నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. శనివారం అర్ధరాత్రి ‘బొబ్బిలి రాముడు’ సాంఘిక నాటకం ప్రదర్శించారు. మధ్య మధ్యలో కళాకారులు అశ్లీల నృత్యాలతో రెచ్చిపోయారు. దీంతో ఎస్ఐ శ్రీనివాసులు, మరో పది మంది పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అశ్లీల ప్రదర్శనలు చట్టరీత్యా నేరమని, వెంటనే ఆపేయాలని ఎస్ఐ సూచించారు. తాము రూ.90 వేలు వెచ్చించి నాటకం ప్రదర్శిస్తున్నామని, ఇప్పుడిలా ఆపాలంటే కుదరదని, తమకు సడలింపు ఇవ్వాల్సిందేనంటూ అశ్లీల నృత్యాలు కొనసాగించారు. ఓపిక నశించిన ఎస్ఐ స్టేజీపైకి వెళ్లి లైట్లు ఆర్పివేయడంతో జనం దూసుకొచ్చారు. తొక్కిసలాటలో వడ్డే రామక్క అనే మహిళ స్పృహ తప్పి కిందపడింది. ఆగ్రహించిన జనంలో కొందరు పోలీసులపైకి ఇసుక, కంకరరాళ్లు విసిరారు. ప్రాణ భయంతో పోలీసులు అక్కడి నుంచి పరుగులు తీశారు. అప్పటికీ శాంతించని కొందరు ఆకతాయిలు ఎస్ఐ శ్రీనివాసులు, కానిస్టేబుల్ రామాంజనేయులు అక్కడే వదిలి వెళ్లిన రెండు బైక్లకు నిప్పంటించారు. సమాచారం అందుకున్న డీఎస్పీ వేణుగోపాల్, సీఐ వంశీధర్ గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఎస్ఐకి, పోలీసు సిబ్బందికి రివార్డులు అశ్లీల నృత్య ప్రదర్శనను అడ్డుకుని, శాంతిభద్రతల పరిరక్షణలో తమ వంతు పాత్ర పోషించిన కుందుర్పి ఎస్ఐ శ్రీనివాసులుతోపాటు పది మంది పోలీసు కానిస్టేబుళ్లకు ఎస్పీ సెంథిల్కుమార్ రివార్డులు ప్రకటించారు. భయం గుప్పిట్లో అప్పిలేపల్లి దాడి ఘటనలో 18 మందిని పోలీసులు అరెస్ట్ చేయడంతో అప్పిలేపల్లి గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏమి జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. బంధు, మిత్రులతో ఆనందంగా ఉండాల్సిన ఆంజనేయస్వామి రథోత్సవం నాడు పోలీసుస్టేషన్లో కాలం గడపడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అనుమానితులతో పాటు గ్రామంలోని పెద్దమనుషులను, రాజకీయ నాయకులను సహితం కళ్యాణదుర్గం సర్కిల్ కార్యాలయానికి పిలిపించి విచారణ చేస్తున్నారు. ఈ ఘటనలతో జాతర కళ తప్పి.. వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. 20 మందిపై కేసు... 18 మంది అరెస్ట్ కళ్యాణదుర్గం రూరల్ : కుందుర్పి మండలం అపిలేపల్లి గ్రామంలో పోలీసులపై దాడి చేసిన ఘటనలో ఓంకార్, తిమ్మరాజులు, చిరంజీవి, నాగరాజు, తిమ్మప్పతో సహా 20 మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ వంశీధర్గౌడ్ తెలిపారు. వీరిలో 18 మందిని అరెస్ట్ చేశామన్నారు. ఈ విషయాన్ని ఆదివారం కళ్యాణదుర్గం రూరల్ పోలీస్స్టేషన్లో ఆయన విలేకరులకు వెల్లడించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడిచేశారన్న అభియోగంపై కేసు నమోదు చేశామని, నిందితులను రిమాండ్కు పంపించామని తెలిపారు. -
‘ఉపాధి’లో అక్రమాలు
కోరుట్ల రూరల్, న్యూస్లైన్ : ఉపాధి హామీలో అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. చేసిన పనికి ప్రభుత్వం కూలీలకు డబ్బులు విడుదల చేసినా వాటిని పంపిణీ చేసే కంపెనీ ప్రతినిధుల నిర్వాకం కారణంగా లబ్ధిదారులకు అందలేదు. మండలంలో ఉపాధి హామీ కూలీలకు గత ఏడాది ఏప్రిల్, మేలో నిర్వహించిన ఈజీఎస్ పని బాపతు రూ.27లక్షలు ఇప్పటికీ అందకపోవడంతో ఫినో కంపెనీ ప్రతినిధులపై కేసులు నమోదు చేయించాలని అడిషనల్ పీడీ శ్రీనివాస్ ఈజీఎస్ అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కా ర్యాలయ ఆవరణలో ఉపాధి హామీ అదనపు పీడీ శ్రీనివాస్ అధ్యక్షతన ఈజీఎస్ సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం బుధవారం నిర్వహించారు. మూడు రోజులుగా గ్రామాల్లో ఈజీఎస్ తని ఖీ బృందాలు తనిఖీలు నిర్వహించి సిద్ధం చేసిన నివేదికలు చదివి వినిపిం చారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ ప నులు, కూలీలకు డబ్బులు పంపిణీ, పిం చన్ల పంపిణీ, వ్యవహారాల్లో రూ.27లక్షలు అక్రమాలు జరిగినట్టు తనిఖీ బృం దాలు గుర్తించాయి. మండలంలోని 15 గ్రామాల్లో గత సంవత్సరం ఫిబ్రవరి 1 నుంచి నవంబర్ 30 వరకు రూ.1కోటి 27లక్షల పనులు నిర్వహించారు. ఈ డ బ్బులు ప్రభుత్వం విడుదల చేసింది. కా గా పనులకు సంబంధించిన డబ్బులను ఫినో కంపెనీ ద్వారా కూలీలకు పంపిణీ చేస్తున్నారు. ఇందులో రూ.1కోటి 27లక్షలకు రూ.1కోటి మాత్రమే కూలీలకు పం పిణీ చేయగా ఏప్రిల్, మే నెలలకు సం బంధించిన డబ్బులు రూ.27లక్షలు వారి కి అంద నట్టు తనిఖీల్లో వెల్లడైంది. దీంతో ఫినో కంపెనీ మండల కో-ఆర్డినేటర్ వేణుగోపాల్, సంబంధిత సిబ్బందిపై కేసులు నమోదు చేయించాలని ఎంపీడీవో ప్రభు, ఈజీఎస్ ఏపీవో కొమురయ్యను అదేశించారు. అలాగే ఐఎస్ఎల్ పథకంలో 580 మరుగుదొడ్ల గుంతలు తీయగా ఒక్కో లబ్ధిదారుడికి రూ.2వేల చొప్పున మంజూరై పే స్లిప్పులు జారీ చేసినా ఇంకా లబ్ధ్దిదారులకు మొత్తం అందలేదు. పలుగ్రామాల్లో టేకుమొక్కల పెంపకంలో ఫీల్డు అసిస్టెంట్లు అక్రమాలకు పాల్పడగా పింఛన్ల పంపిణీలో కూడా అవకతవకలు జరిగినట్టు తేలింది. 15 గ్రామాల్లో పనుల కొలతల్లో రూ.10,438 మేర పొరపాట్లు జరిగినట్లు గుర్తించి రికవరికీ ఆదేశించారు. కార్యక్రమంలో డీవీఓ వెంకటేశ్వర్లు, క్యూసీ అధికారి సంజీవ్రావు, ఏపీడీ పురుషోత్తం, సోషల్ఆడిట్ అధికారి గంప సత్యనారాయణ, ఈజీఎస్ ఎపీఓ కొమురయ్య, ఐకేపీ ఎపీఎం నరహరి, అన్ని గ్రామాల సర్పంచ్లు, ఫీల్డ్అసిస్టెంట్లు, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. -
మూడు రకాల ప్రేమలు
ప్రేమ ఇష్క్ కాదల్... భాషలే వేరు.. కానీ దీని భావం ఒక్కటే. ప్రేమ అనే ఆ అందమైన భావనను ప్రధానాంశంగా చేసుకుని బెక్కెం వేణుగోపాల్ (గోపి) నిర్మించిన చిత్రం ‘ప్రేమ ఇష్క్ కాదల్’. అగ్ర నిర్మాత డి.సురేష్బాబు సమర్పణలో షిర్డిసాయి కంబైన్స్ భాగస్వామ్యంతో లక్కీ మీడియా పతాకంపై ఈ చిత్రం రూపొందింది. పవన్ సాదినేని దర్శకత్వం వహించిన ఈ తతతచిత్రంలో హర్షవర్ధన్ రాణే, విష్ణు, హరీష్, వితిక షేరు, రీతూవర్మ, శ్రీముఖి హీరో హీరోయిన్లుగా నటించారు. వచ్చే నెల 6న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో హర్షవర్ధన్ మాట్లాడుతూ -‘‘మూడు కథలతో రూపొందిన ఈ చిత్రంలో నాదో కథ. నేను రాక్స్టార్గా నటించాను. ఇదే టీమ్తో నేను చేసిన ‘ఇన్ఫినిటీ’ అనే షార్ట్ఫిల్మ్ విజయం సాధించినట్లుగానే ఈ చిత్రం కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పారు. ఇది తనకు తొలి చిత్రం అనీ ఇందులో యువతకు కనెక్ట్ అయ్యే ప్లేబోయ్ పాత్ర చేశానని హరీష్ తెలిపారు. పల్లెటూరి నుంచి నగరానికి వచ్చే యువకుడి పాత్రను ఇందులో చేశానని విష్ణు చెప్పారు. -
సెంట్రల్ బ్యాంకులో దోపిడీకి యత్నం
రఘునాథపల్లి, న్యూస్లైన్ : మండలంలోని కంచనపల్లి సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో గుర్తుతెలియని దుండగులు దోపిడీకి యత్నించిన సంఘటన గురువారం ఆలస్యంగా వెలుగు చూసింది. గ్యాస్ కట్టర్తో బ్యాంకు వెనకాల నుంచిలోనికి దూరి చోరీకి యత్నించడంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. ఈ నెల 1న సాయంత్రం 6 గంటలకు విధులు ముగించుకున్న బ్యాంకు మేనేజర్ వేణుగోపాల్, సిబ్బంది బ్యాంకు తాళాలు వేసి ఇంటికి వెళ్లారు. 2న గాంధీ జయంతి సందర్భంగా సెలవు కావడంతో బ్యాంకు తెరవలేదు. గురువారం ఉదయం 9 గంటలకు బ్యాంకు మేనేజర్, సిబ్బంది వచ్చి చూసేసరికి వెనక ఉన్న తలుపులు, కిటికీలు తెరచి ఉండడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించా రు. బ్యాంకు వెనుకవైపు తలుపులను గ్యాస్ కట్టర్తో కట్ చేసి లోపలి గడియను చేతితో తీసిలోనికి ప్రవేశించారు. లోపల ఉన్న గదిలోని కిటికీ ఇనుపచువ్వలను గ్యాస్ కట్టర్తో తొలగించి స్ట్రాంగ్ రూంలోకి దూరారు. అందులోని లాకర్లను గ్యాస్ కట్టర్తో కట్ చేయడానికి దుండగులు విఫలయత్నం చేశారు. గ్యాస్ అయిపోవడంతోనే దాదాపు మూడు గంటల సేపు శ్రమించి వెనుదిరిగినట్లు తెలుస్తుంది. లాకర్లు పటిష్టంగా ఉండడంతో తెరుచుకోకపోవడంతో దుండగులు నిరాశకు గురై చోరీ యత్నాన్ని విరమించుకుని పరారైనట్లు పోలీసులు భావిస్తున్నారు. ఒకవేళ లాకర్లు తెరిచి ఉంటే అందులో ఉన్న రూ.7 లక్షలతోపాటు, తాకట్టు పెట్టిన 252 బంగారు ఆభరణాల ప్యాకెట్లు చోరీకి గురయ్యేవి. ఈ ఘటనతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బ్యాంకు మేనేజర్ వేణుగోపాల్ ఫిర్యాదు మేరకు జనగామ రూరల్ సీఐ ప్రవీణ్కుమార్, ఎస్సై సతీష్, సీసీఎస్ సీఐ శ్రీనివాస్, ఫింగర్ ప్రింట్ సీఐ రఘు బృందాలు రంగంలోకి దిగి బ్యాంకులో అణువణువు క్షుణ్ణంగా పరిశీలించారు. డాగ్స్క్వాడ్ బ్యాంకు పరిసర ప్రాంతాలను నిశితంగా పరిశీలించింది. భద్రతలో బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం గతంలోనూ ఇదే బ్యాంకులో చోరీ ుత్నం జరిగినా బ్యాంకు అధికారులు మాత్రం ఎలాం టి జాగ్ర త్తలు తీసుకోలేకపోయారు. బ్యాంక్ వెనుక ఖాళీస్థలం ఉండడంతో దుండగులు లోపలికి వెళ్లేందుకు సులువుగా మారింది. బ్యాంకులోని తలుపులు, కిటికీలు, లాకర్లపై గ్యాస్ కట్టర్ వాడినా బ్యాంక్లో అలారం మోగకపోవడం బ్యాంకు అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. బ్యాంకులోని సీసీ కెమెరాల్లో రికార్డయిన దుండగుల దృశ్యాలను గుర్తించి పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. సీబీఐ రీజనల్ మేనేజరు డీఆర్ చాల్లీ, సెక్యూరిటీ అధికారి శివరాం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
కొత్త ఎయిర్పోర్ట్కు సిద్ధం
చెన్నై, సాక్షి ప్రతినిధి: చెన్నైలో కొత్త ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్రం సిద్ధంగా ఉందని విమానయానశాఖ సహాయ మంత్రి వేణుగోపాల్ తెలిపారు. మీనంబాకం ఎయిర్పోర్ట్లో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ఎయిర్పోర్ట్ నిర్మాణాలకు సంబంధించి స్థలం ఎంపిక బాధ్యతను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించామని తెలిపారు. చెన్నైలో విమానాలు, ప్రయాణికుల సంఖ్య పెరుగుదలకు అనుగుణంగా కొత్త ఎయిర్పోర్ట్ ఆవశ్యతను గతంలో గుర్తించి మంజూరు చేశామని తెలిపారు. అయితే స్థలం ఎంపిక విషయంలో జాప్యం జరుగుతోందన్నారు. శ్రీపెరంబుదూరులో కొత్త ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించినందున రాష్ట్రం స్థల సేకరణ, ఎంపిక పనులు చేపట్టిందని వివరించారు. స్థలాన్ని అప్పగించగానే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. చెన్నై ఎయిర్పోర్ట్ను ప్రయివేటు పరం చేసే విషయం కేంద్ర పరిశీలనలో ఉందన్నారు. బాధ్యులపై చర్యలు చెన్నై ఇంటర్నేషనల్, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ల టెర్మినల్స్ సీలింగ్ కూలిన సంఘటనలపై మంత్రి సీరియస్ అయ్యారు. మొత్తం రూ.2.516 కోట్ల వ్యయంతో రెండు టెర్మినల్స్ నిర్మించారు. వీటిని ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఏప్రిల్లో ప్రారంభించారు. ఈ నాలుగు నెలల కాలంలో రెండుసార్లు సీలింగ్ పాక్షికంగా కూలింది. ఈ సంఘటనలపై విచారణ జరిపేందుకే తాను చెన్నై వచ్చినట్లు మంత్రి వేణుగోపాల్ మీడియాకు చెప్పారు. విచారణ పూర్తయిన తర్వాత కారకులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
వేణుగోపాల్ దీక్ష భగ్నం
జంగారెడ్డిగూడెం, న్యూస్లైన్ : జంగారెడ్డిగూడెంలో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తిరివీధి వేణుగోపాల్ దీక్షను శనివారం రాత్రి పోలీసులు భగ్నం చేశారు. ఎస్సై బీఎన్ నాయక్ ఆధ్వర్యంలో రెండు వాహనాల్లో పోలీసులు అంబులెన్స్తో దీక్షా శిబిరం వద్దకు వచ్చి వేణుగోపాల్ను ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. జేఏసీ ప్రతినిధులు, ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు తీవ్రంగా ప్రతిఘటించారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. చివరకు వేణుగోపాల్ను పోలీసులు బలవంతంగా అంబులెన్స్లో ఎక్కించి స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఏరియా ఆసుపత్రి వద్ద కూడా సమైక్యవాదులు జై సమైక్యాంధ్ర అంటూ నినదించారు. ఆసుపత్రిలో వేణుగోపాల్కు డాక్టర్ సునీత వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ పల్స్రేట్ తగ్గిందని, షుగర్ లెవల్స్ కూడా పడిపోయాయని, అందువల్ల వైద్యం తప్పదని తెలిపారు. వేణుగోపాల్ మాట్లాడుతూ ఆసుపత్రిలోనే దీక్ష కొనసాగిస్తానని ప్రకటించారు. వేణుగోపాల్ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశామని ఎస్సై నాయక్ తెలిపారు. అంతకుముందు వేణుగోపాల్ దీక్షకు మద్దతుగా రిలే దీక్షల్లో నోముల లీలావతి, జలగం మౌనిక, పట్నాల సాయి, పమిడిపల్లి బ్రహ్మాజీలు పాల్గొన్నారు. ప్రభుత్వ వైద్యులు డాక్టర్ కొడాలి సత్యనారాయణ వేణుగోపాల్కు వైద్య పరీక్షలు నిర్వహించారు. దీక్షా శిబిరాన్ని పలు రాజకీయ పార్టీల నాయకులు, సంస్థలు, సంఘాల ప్రతినిధులు సంఘీభావం తెలిపారు. పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొని సంఘీభావం తెలిపారు.