Volcano
-
అమెరికాలో అగ్నిపర్వతం బీభత్సం
-
ఇండోనేషియాలో పేలిన అగ్ని పర్వతం.. ఆరుగురు మృతి
జకర్తా: ఇండోనేషియాలో అగ్ని పర్వతం పేలింది. ఇక్కడి ఫ్లోర్స్ ద్వీపంలోని మౌంట్ లెవోటోబి లాకీ లాకీ అగ్నిపర్వతం బద్దలైంది. ఈ విపత్తులో పలు ఇళ్లు దగ్ధమయ్యాయని, ఆరుగురు మృతి చెందారని ఇండోనేషియా విపత్తు నిర్వహణ సంస్థ మీడియాకు తెలిపింది.ఫ్లోర్స్ ద్వీపంలో అగ్నిపర్వత విస్ఫోటనం కారణంగా బూడిద దాదాపు 2000 మీటర్ల ఎత్తు వరకూ వ్యాపించింది. సమీపంలోని గ్రామాన్ని వేడి బూడిద చుట్టుముట్టింది. ఈ ఘటనలో పలు ఇళ్లు దగ్ధమయ్యాయి. ఆరుగురు మృతిచెందారు. ఈ పర్వత విస్ఫోటనం కారణంగా సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నట్లు ఇండోనేషియా విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ ప్రమాదంలో కూలిన ఇళ్ల కింద కొందరు సమాధి అయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.వులాంగిటాంగ్ జిల్లాలో సంభవించిన ఈ అగ్నిపర్వతం పేలుడు కారణంగా సమీపంలోని పులులారా, నవోకోటే, హోకెంగ్ జయ, క్లాటన్లో, బోరు కెడాంగ్ గ్రామాలు ప్రభావితమయ్యాయి. ఇండోనేషియాలో గత రెండు వారాల్లో ఇది రెండవ అగ్నిపర్వత విస్ఫోటనం. అక్టోబర్ 27న జరిగిన విస్ఫోటనంలో దట్టమైన బూడిద ఉవ్వెత్తున్న ఎగసిపడింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.ఇది కూడా చదవండి: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో సూపర్ యాప్ -
అగ్నిపర్వతంపై.. ఆ ఇద్దరు మహిళలు
కరీంనగర్: దేశ చరిత్రలో అరుదైన ఘటన ఆవిష్కృతమైంది. ఆసియాఖండంలో ఏకై క అగ్నిపర్వతం అండమాన్ నికోబార్ దీవుల్లోని బెరన్ ఐలాండ్లో ఉంది. ఆ అగ్నిపర్వతంపై మొదటిసారిగా ఇద్దరు మహిళలు అడుగుపెట్టారు. ప్రపంచ చరిత్రలో అగ్నిపర్వతంపై అడుగుపెట్టిన మహిళలుగా చరిత్రకెక్కారు. ఆ ఇద్దరిలో ఒకరైన మహమ్మద్ పర్వీన్ సుల్తానా కరీంనగర్వాసి కావడం గమనార్హం. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సెస్, డెహ్రాడూన్, ఇస్రో వారిప్రత్యేక పరిశోధన ప్రాజెక్టులో భాగంగా డాక్టర్ మమతా చౌహాన్ ప్రధాన శాస్త్రవేత్త సారథ్యంలో వివిధ రంగాల పరిశోధకుల బృందంలో ఒకరిగా కరీంనగర్లోని కోతిరాంపూర్కు చెందిన మహమ్మద్ పర్వీన్ సుల్తానా గతనెల 29న బెరన్ ఐలాండ్లోని అగ్నిపర్వతంపై మొదటిసారిగా అడిగీడారు. పరిశోధనలో భాగంగా అగ్నిపర్వతం భౌగోళిక పరిణామాలు, శాసీ్త్రయవిశ్లేషణ, అగ్నిపర్వత ప్రకృతి విపత్కర పరిస్థితులపై అంచనా, అవగాహనకు అక్కడ లభించిన నమూనాలను సేకరించారు. ఐలాండ్లోని డిగ్లీపూర్ నుంచి రంగౌత్ వరకు సుమారు వంద కిలోమీటర్లకు పైగా వివిధ ప్రాంతాలలో ఉన్న మడ్ వోల్కనోవాలను పరిశీలించి నమూనాలు సేకరించారు. -
ఐస్ల్యాండ్లో మరోసారి బద్దలైన అగ్ని పర్వతం.. (ఫొటోలు)
-
వాట్ బంగారు ధూళినా..! దుమ్ము తోపాటు ఎగజిమ్ముతూ..
అంటర్కాటికాలో ఉన్న ‘మౌంట్ ఎరిబస్’ ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన అగ్నిపర్వతం. ఇది బంగారు ధూళిని ఎగజిమ్ముతోంది. ఈ అగ్నిపర్వతం సముద్ర మట్టానికి 12,448 అడుగుల ఎత్తున ఉంది. ఇది ప్రతిరోజూ ఎగజిమ్మే ధూళిలో దాదాపు 80 గ్రాముల వరకు బంగారు ఉంటోంది. దక్షిణధ్రువ ప్రాంతంలో మంచుతో నిండి ఉన్న ఈ అగ్నిపర్వతాన్ని తొలిసారిగా 1841లో బ్రిటిష్ నావికాదళం అధికారి జేమ్స్ క్లార్క్ రాస్ కనుగొన్నాడు.అంటార్కిటికాలో 138 అగ్నిపర్వతాలు ఉన్నా, వాటిలో ఎరిబస్, డిసెప్షన్ ఐలండ్ అగ్నిపర్వతాలు మాత్రమే క్రియాశీలమైనవి. తొలిసారి గుర్తించే నాటికి ఎరిబస్ అగ్నిపర్వతం నిద్రాణంగానే ఉన్నా, 1972 నుంచి ఇది పొగను, ధూళిని ఎగజిమ్ముతూ క్రియాశీలంగా మారింది.ఈ అగ్నిపర్వతం అడుగున దాదాపు వెయ్యి డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో వెలువడే వాయువులు పైకి ఎగజిమ్మేటప్పుడు వెలువడే ధూళితో పాటు అడుగున ఉన్న బంగారం కూడా కరిగి బయటకు వస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అగ్నిపర్వతాల నుంచి వెలువడే ధూళిలో బంగారం బయటపడటం చాలా అరుదని కొలంబియా యూనివర్సిటీలోని లామెంట్–డోహర్తీ ఎర్త్ అబ్జర్వేటరీ శాస్త్రవేత్త కోనర్ బేకన్ చెబుతున్నారు. (చదవండి: మిణుగురుల్లా మిలమిలలాడే పూల మొక్కలు!) -
పేలిన అగ్ని పర్వతం.. సునామీ ముప్పు?
ఇండోనేషియాలో ఒక అగ్నిపర్వతం పేలడంతో స్థానికుల్లో భయాందోళనలు చెలరేగుతున్నాయి. ఈ పేలుడు దరిమిలా సునామీ ముప్పు పొంచివుంది. పేలుడు కారణంగా అగ్నిపర్వతంలోని కొంత భాగం సముద్రంలో పడిపోనున్నదని, ఫలితంగా 1871లో సంభవించిన మాదిరిగా భారీ సునామీ వచ్చే అవకాశం ఉందని స్థానిక అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో హైఅలర్ట్ ప్రకటించారు. ఇండోనేషియాలోని రుయాంగ్ అగ్నిపర్వతం గత కొన్ని రోజులుగా యాక్టివ్గా ఉంది. బూడిద, పొగను వెదజల్లుతోంది. అగ్నిపర్వతంలోని కొంత భాగం బలహీనంగా మారిందని, అది ఎప్పుడైనా సముద్రంలో పడవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది జరిగితే, ఇది భారీ సునామీ సంభవిస్తుందని, ఇది సమీపంలోని తీర ప్రాంతాలలో భారీ విధ్వంసం కలిగించవచ్చని స్థానిక అధికారులు అంటున్నారు. ALERT: Indonesia volcano eruption sparks tsunami fears, alert level raised to highest — Officials worry that part of the volcano could collapse into the sea and cause a tsunami, as happened in 1871. pic.twitter.com/idTYAjuImo — Insider Paper (@TheInsiderPaper) April 17, 2024 సునామీ ముప్పు నేపధ్యంలో తీర ప్రాంతాల్లోని వారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. అలాగే బీచ్లను సందర్శించడం, సముద్రంలోకి వెళ్లడం లాంటి పనులు చేయకూడదని అధికారులు తెలిపారు. మరోవైపు ప్రభుత్వం, విపత్తు నిర్వహణ సంస్థలు పరిస్థితిని పర్యవేక్షిస్తూ, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నాయి. -
Iceland : ఐస్లాండ్లో అగ్నిపర్వత విస్ఫోటనం (ఫొటోలు)
-
Iceland: అగ్ని పూలు
ఐస్లాండ్ దేశంలోని గ్రాండావ్ సిటీ సమీపంలోని అగ్నిపర్వతం బద్దలై భారీ ఎత్తున దుమ్ము, ధూళి, లావాలను వెదజల్లుతున్న దృశ్యం. డిసెంబర్ నుంచి ఈ సిలింగర్ఫెల్ అగ్నిపర్వతం బద్దలవడం వరసగా ఇది మూడోసారి. దీంతో దగ్గర్లోని బ్లూ లాగూన్ స్పా పరిసర ప్రజలను అక్కడి నుంచి ఖాళీచేయించారు. గత శుక్రవారం నుంచి ఇక్కడ వందలాది చిన్నపాటి భూకంపాలు సంభవించాయి. తర్వాత ఇలా ఒక్కసారిగా అగ్నిపర్వత బిలం బద్దలై వందల మీటర్ల ఎత్తుకు దుమ్ము, ధూళిని ఎగజిమ్మింది. దీంతో తీరనగరం గ్రాండావ్ లోని స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
అగ్ని పర్వతం విస్పోటనం.. 11 మంది పర్వతారోహకులు మృతి
జకర్తా: ఇండోనేషియాలో భారీ అగ్నిపర్వతం విస్పోటనం చెందింది. ఈ ఘటనలో దాదాపు 11 మంది పర్వతారోహకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది గల్లంతయ్యారు. సుమత్రా ద్వీపంలో 2,891 మీటర్ల (9,484 అడుగులు) ఎత్తున్న మౌంట్ మెరాపి అగ్ని పర్వతం ఆదివారం విస్పోటనం చెందింది. ఈ ఘటనతో చుట్టుపక్కల కిలోమీటర్ల మేర బూడిద మేఘాలు కమ్మేశాయి. పేలుడుతో దాదాపు 3,000 మీటర్ల ఎత్తుకు బూడిద ఎగజిమ్మిందిని అధికారులు తెలిపారు. "అగ్ని పర్వతం విస్పోటనం జరిగిన సమయంలో దాదాపు 75 మంది పర్వతారోహకులు అక్కడ ఉన్నారు. 49 మంది పర్వతం నుంచి కిందికి దిగివచ్చారు. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించాం. 11 మంది మృతి చెందారు. 12 మంది ఆచూకీ తెలియలేదు." అని సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ అధిపతి అబ్దుల్ మాలిక్ తెలిపారు. ఇండోనేషియాలోని మౌంట్ మెరాపి ప్రాంతంలో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వారాంతంలో పర్వతారోహకులు ట్రెక్కింగ్ చేసే సమయంలో అగ్ని పర్వతం ఒక్కసారిగా విస్ఫోటనం చెందింది. దీంతో ప్రాణ నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: ప్రపంచంలోనే నాసా కంటే ఎక్కువ డేటా ట్రాన్స్ఫర్..! కానీ.. -
ద్వీపం పుట్టడం చూశారా? కెమెరాకు చిక్కిన అరుదైన దృశ్యం!
ద్వీపాలు ఎలా పుడతాయనే దానిపై జాగ్రఫీ పాఠాల్లో కొంత సమాచారం ఉంటుంది. కొన్ని ద్వీపాలు అగ్నిపర్వతాల పేలుళ్ల వల్ల ఏర్పడతాయి. కొత్తగా ఒక ద్వీపం ఏర్పడుతున్న దృశ్యాన్ని ఇంతవరకు ఎవరూ కళ్లారా చూసిన దాఖలాలు లేవు. అయితే, జపాన్లో మాత్రం అగ్నిపర్వతం పేలుడు ఫలితంగా ఒక కొత్త ద్వీపం ఏర్పడుతున్న అరుదైన దృశ్యం కెమెరాలకు చిక్కింది. టోక్యో నగర దక్షిణ తీరానికి ఆవల సముద్రంలో ఉన్న ఇవోటో అగ్నిపర్వతం లావాను ఎగజిమ్మడం ప్రారంభించింది. దీని నుంచి ఇప్పటికీ తరచుగా లావా ఎగసిపడుతూనే ఉంది. ఇప్పటి వరకు దీని నుంచి వెలువడిన లావా సముద్రజలాల్లో గడ్డకడుతూ క్రమంగా ఒక దీవిలా ఏర్పడుతూ వస్తోంది. ఇప్పటి వరకు లావా గడ్డకట్టినంత మేర ఒక చిన్నదీవిలా ఏర్పడింది. జపాన్ సముద్ర జలాల్లో 1986 తర్వాత ఒక కొత్త దీవి ఏర్పడటం ఇదే తొలిసారి. అయితే, ఇదివరకు ఇలాంటి దీవులు పుడుతున్న దృశ్యాలను చూసిన వాళ్లెవరూ లేరు. (చదవండి: సినిమాలు చూస్తే..కేలరీలు బర్న్ అవుతాయట! పరిశోధనల్లో షాకింగ్ విషయాలు) -
కరిగి, విరిగిన ‘బేబీ’ అగ్ని పర్వతం
అదో కొత్త అగ్ని పర్వతం.. రెండు వారాల కిందే పుట్టింది.. ఇంతలోనే అంతెత్తున పెరిగింది.. లోపలి నుంచి ఉబికివచ్చిన లావా వేడికి అంచులు కరిగి, విరిగి పడింది. లావాను బాంబుల్లా ఎగజల్లింది. ఐస్ల్యాండ్లోని రేక్జానెస్ ద్వీపకల్పం ప్రాంతంలోని ‘బేబీ’ అగ్నిపర్వతం విశేషమిది. అగ్నిపర్వతాలకు నిలయమైన రేక్జానెస్ ప్రాంతంలో గత నెల రోజుల్లో ఏకంగా ఏడు వేల భూప్రకంపనలు వచ్చాయి. రెండు వారాల కింద ఓ చోట అకస్మాత్తుగా సుమారు రెండున్నర కిలోమీటర్ల పొడవున భూమిలో పగుళ్లు వచ్చాయి. అందులో ఓ చోట లావా వెలువడటం మొదలై, మెల్లగా అగ్ని పర్వతంలా ఏర్పడింది. ప్రస్తుతం ‘బేబీ వల్కనో’గా పిలుస్తున్న ఈ అగ్నిపర్వతం.. రెండు రోజుల కింద తీవ్రస్థాయిలో లావా వెలువరించడం మొదలుపెట్టింది. అది తీవ్ర స్థాయికి చేరి ఓ పక్క విరిగి.. లావా నదిలా ప్రవహిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను ఐస్ల్యాండ్ యూనివర్సిటీ వల్కనాలజీ అండ్ నేచురల్ హజార్డ్స్ పరిశోధకుల బృందం విడుదల చేసింది. -
బద్ధలైన అగ్నిపర్వతం.. భగభగమండే లావా ఎగిసిపడుతున్న దృశ్యాలు వైరల్
అగ్నిపర్వతం నుంచి నిప్పులుగక్కుతూ ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న లావా దృశ్యాలను ఓ ప్రకృతి ప్రేమికుడు కెమెరాలో బంధించాడు. ఎంతో మనోహరంగా కన్పిస్తున్న ఈ వీడియోనూ 'హౌ థింగ్స్ వర్క్' అనే ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేయగా అది సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. చిన్న ప్రపంచంలోని ఈ వీడియో ఎంత అద్భుతంగా ఉందో చూడండి అని హౌ థింగ్స్ వర్క్ రాసుకొచ్చింది. Amazing footage. Our little world is fascinating 🌋 pic.twitter.com/vnYQf8kH9Y — H0W_THlNGS_W0RK (@HowThingsWork_) March 3, 2023 అగ్నిపర్వతంలో ఘన రూపంలో లావా.. ఉష్ణోగ్రత 700 నుంచి 1200 డిగ్రీల సెల్సియస్కు చేరినప్పుడు ద్రవీభవించి నిప్పులుగక్కుకుంటూ బయటకు వస్తుంది. ఫ్లూయిడ్లా మారి ఉవ్వెత్తున ఎగిసిపడి ప్రవహిస్తుంది. ఇలాంటి దృశ్యాలు అత్యంత అరుదుగా కెమెరా కంటికి చిక్కుతాయి. లావా ఉష్ణోగ్రత 700 నుంచి 1200 డిగ్రీల సెల్సియస్ కాగా.. సూర్యుడి ఉపరితలంపై ఉష్ణోగ్రత 5,600 డిగ్రీల సెల్సియస్గా ఉంటుంది. అంటే లావా వేడి సూర్యుడి ఉపరితలంతో పోల్చితే ఐదింట ఒక వంతు కంటే ఎక్కువగానే ఉంటుందన్నమాట. వాతావరణ మార్పుల కారణంగా భూతాపం విపరీతంగా పెరిగింది.. అగ్నిపర్వతాలు బద్దలు అవుతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. 2021లో స్పెయిన్లో, 2022లో మెక్సికోలో ప్రాచీన అగ్నిపర్వతాలు బద్దలై పలువురు చనిపోయారు. చదవండి: ఏడాదిలోగా రష్యా ఖజానా ఖాళీ.. పుతిన్కు షాకిచ్చిన వ్యాపారవేత్త! -
అగ్నిపర్వతంపై సాహసం.. పట్టుజారితే బూడిద కూడా దొరకదు.. స్లాక్లైన్ వాక్లో గిన్నిస్ రికార్డు
-
చావుతో చెలగాటం.. అయినా ఈ సాహసాన్ని చూసేయండి
వైరల్: రఫెల్ బ్రిడి, అలెగ్జాండర్ షుల్జ్.. ఇప్పుడు తమ పనితో ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నారు. ప్రాణాల్ని పణంగా పెట్టి చేసి వీళ్ల సాహసం ఇప్పుడు వైరల్ అవుతోంది. స్వయంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వాళ్లే ఈ జంట చేసిన సాహసాన్ని సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది మరి. నైరుతి పసిఫిక్ మహాసముద్రంలోని టన్నా ఐల్యాండ్లోని వనాటు వద్ద యసుర్ అగ్నిపర్వం మీద వీళ్లు స్లాక్లైన్ నడక సాహసం చేశారు. అగ్నిపర్వతం అడుగు నుంచి సుమారు 137 అడుగుల ఎత్తులో ఒక తాడుపై ఎలాంటి ఆధారం లేకుండా వీళ్ల నడక కొనసాగింది. కింద నుంచి అగ్నికీలలు ఎగసిపడుతున్నా సుమారు 261 మీటర్ల దూరం నడక సాగించి.. గిన్నిస్ బుక్లో చోటు దక్కించుకున్నారు ఈ ఇద్దరూ. రఫెల్ జుంగో బ్రిడి బ్రెజిల్కు చెందిన సాహసికుడు కాగా, అలెగ్జాండర్ షుల్జ్ జర్మనీకి చెందిన వ్యక్తి. సాహసమే వీళ్లిద్దరి ఊపిరి. గతంలో వీళ్లిద్దరి పేర్ల మీద పలు రికార్డులు కూడా ఉన్నాయి. -
ఆ చల్లని సముద్ర గర్భంలో... అగ్నిపర్వతమే బద్దలైతే?
సముద్ర గర్భంలో ఓ అతి పెద్ద అగ్నిపర్వతం బద్దలైతే? అది పెను వాతావరణ మార్పులకు దారి తీస్తే? ఫలితంగా మానవాళి చాలావరకు తుడిచిపెట్టుకుపోతే? ఏదో హాలీవుడ్ సినిమా సన్నివేశంలా అన్పిస్తోందా? కానీ ఇలాంటి ప్రమాదమొకటి కచ్చితంగా పొంచి ఉందట. అదీ ఈ శతాబ్దాంతంలోపు! ఇలాంటి ఉత్పాతాల వల్లే గతంలో మహా మహా నాగరికతలే తుడిచిపెట్టుకుపోయాయట. ఇప్పుడు అలాంటి ప్రమాదం జరిగితే దాని ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనే ప్రయత్నాలేవీ జరగడం లేదంటూ వోల్కెనాలజిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ శతాబ్దాంతం లోపు సముద్ర గర్భంలో కనీవినీ ఎరగనంత భారీ స్థాయిలో అగ్నిపర్వత పేలుడు సంభవించవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే ప్రపంచ జనాభాలో సగానికి పైగా నశించిపోవచ్చని అంచనా వేస్తున్నారు. గత జనవరి 14న దక్షిణ పసిఫిక్ మహాసముద్ర అంతర్భాగంలో హంగా టోంగా హంగా అగ్నిపర్వతం బద్దలైనప్పుడు జపాన్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా తీర ప్రాంతాలను భారీ సునామీ ముంచెత్తింది. ఇది ఆయా ప్రాంతాల్లో అపార ఆర్థిక నష్టం కలిగించింది. అంతకు 10 నుంచి ఏకంగా 100 రెట్ల తీవ్రతతో అలాంటి ప్రమాదమే మరికొన్నేళ్లలోనే మనపైకి విరుచుకుపడవచ్చని డెన్మార్క్లోని కోపెన్హెగన్లో ఉన్న నీల్స్ బోర్ ఇన్స్టిట్యూట్ బృందం హెచ్చరిస్తోంది. గ్రీన్లాండ్, అంటార్కిటికాల్లోని మంచు నిల్వలపై వారు చేసిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైందట. ‘మాగ్నిట్యూడ్ 7’ తీవ్రతతో విరుచుకుపడే ఆ ఉత్పాతాన్ని తప్పించుకోవడం మన చేతుల్లో లేదని బర్మింగ్హం యూనివర్సిటీలో వోల్కెనాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ జిస్టు మైకేల్ కసిడీ అంటుండటం ఆందోళన కలిగించే విషయం. హంగా టోంగా హంగా అగ్నిపర్వత పేలుడును పలు అంతరిక్ష ఉపగ్రహాలు స్పష్టంగా చిత్రించాయి. ‘‘దాని తాలూకు బూడిద వాతావరణంలో వేలాది అడుగుల ఎత్తుకు ఎగజిమ్మింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి కూడా ఇది స్పష్టంగా కన్పించింది’’ అని నాసా పేర్కొంది. ‘‘ఆస్టిరాయిడ్లు ఢీకొనడం వంటి అంతరిక్ష ప్రమాదాల బారినుంచి భూమిని తప్పించే కార్యక్రమాలపై నాసా వంటి అంతరిక్ష సంస్థలు వందలాది కోట్ల డాలర్లు వెచ్చిస్తున్నాయి. కానీ తోకచుక్కలు, ఆస్టిరాయిడ్లు ఢీకొనే ముప్పుతో పోలిస్తే భారీ అగ్నిపర్వత పేలుడు ప్రమాదానికే వందలాది రెట్లు ఎక్కువగా ఆస్కారముందన్నది చేదు నిజం. అయినా ఇలాంటి వినాశనం తాలూకు ప్రభావం నుంచి ప్రపంచాన్ని కాపాడేందుకు అంతర్జాతీయంగా ఎలాంటి కార్యక్రమమూ లేకపోవడం విచారకరం’’ అంటూ కసిడీ వాపోయారు. అప్పట్లో అపార నష్టం ‘7 మాగ్నిట్యూడ్’తో చివరిసారిగా 1815లో ఇండొనేసియాలోని తంబోరాలో ఓ అగ్నిపర్వతం బద్దలైంది. దాని దెబ్బకు లక్ష మందికి పైగా మరణించారు. పేలుడు ఫలితంగా అప్పట్లో వాతావరణంలోకి ఎగసిన బూడిద పరిమాణం ఎంత భారీగా ఉందంటే 1815ను ఇప్పటికీ వేసవి లేని ఏడాదిగా చెప్పుకుంటారు. దాని దెబ్బకు భూమి సగటు ఉష్ణోగ్రత ఒక డిగ్రీ తగ్గింది. ఆ ఫలితంగా సంభవించిన వాతావరణ మార్పుల దెబ్బకు ఆ ఏడాది చైనా, యూరప్, ఉత్తర అమెరికాల్లో ఒకవైపు భారీగా పంట నష్టం జరిగింది. మరోవైపు భారత్, రష్యా తదితర ఆసియా దేశాలను భారీ వరదలు ముంచెత్తాయి. 1815తో పోలిస్తే నేటి ప్రపంచం జనాభాతో కిటకిటలాడిపోతోందని గుర్తుంచుకోవాలని కసిడీ అంటున్నారు. ‘‘ఇప్పుడు గనక అలాంటి ఉత్పాతం జరిగితే లెక్కలేనంత మంది చనిపోవడమే గాక అంతర్జాతీయ వర్తక మార్గాలన్నీ చాలాకాలం పాటు మూతబడవచ్చు. దాంతో నిత్యావసరాల ధరలకు రెక్కలొస్తాయి. కొన్నిచోట్ల కరువు కాటకాలు, మరికొన్నిచోట్ల వరదల వంటివి తలెత్తుతాయి’’ అని హెచ్చరించారు. ‘‘సముద్ర గర్భంలో ఎన్ని వందలు, వేల అగ్నిపర్వతాలు నిద్రాణంగా ఉన్నదీ మనకు తెలియదు. ధ్రువాల్లో మంచు విపరీతంగా కరుగుతోంది. సముద్ర మట్టాలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. తద్వారా ఉత్పన్నమయ్యే ఒత్తిడికి సముద్ర గర్భంలో ఏదో ఓ నిద్రాణ అగ్నిపర్వతం అతి త్వరలో ఒళ్లు విరుచుకోవచ్చు. కనీవినీ ఎరగని రీతిలో బద్దలు కావచ్చు. అది జనవరి 14 నాటి పేలుడును తలదన్నేలా ఉంటుంది’’ అని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు ఇప్పటినుంచే సన్నద్ధమైతే మంచిదని సూచిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సెల్ఫీ పిచ్చి తెచ్చిన తంటా ... ఏకంగా అగ్ని పర్వతంలోనే జారీ...
సెల్ఫీల పిచ్చితో ఇటీవల యువత ఎంత భయానక ప్రమాదాలను కొని తెచ్చుకంటున్నారో చూస్తేనే ఉన్నాం. మనం ఉన్నది ప్రమాదకరమైన ప్రదేశం వద్ద అన్న విషయం మర్చిపోయి మరీ సెల్ఫీ మోజుతో ప్రాణాల పైకి తెచ్చుకుంటున్నారు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి సెల్ఫీ పిచ్చితో చావు అంచు వరకు వెళ్లొచ్చాడు. వివరాల్లోకెళ్తే...ఒక అమెరికన్ టూరిస్ట్ తన కుటుంబంతో సహా ఇటలీలోని ప్రఖ్యాత అగ్ని పర్వతం అయిన మౌంట్ వెసువియస్ పర్వతం వద్దకు వెళ్లాడు. అక్కడ అతను తన కుటుంబంతో కలిసి ఆ అగ్నిపర్వత వద్ద సెల్ఫీలు తీసుకుంటున్నాడు. ఇంతలో అతని ఫోన్ ప్రమాదవశాత్తు ఆ అగ్ని పర్వతం బిలంలో పడిపోయింది. తన ఫోన్ కోసం అని ఆ అమెరికన్ టూరిస్ట్ ఆ అగ్నిపర్వతం బిలంలోకి దిగడానికి యత్నిస్తున్నాడు. ఐతే అతను ప్రమాదవశాత్తు పట్టుతప్పి ఆ బిలంలోకి పడిపోయాడు. అతను బిలంలోకి పడిపోవడాన్ని గుర్తించిన స్థానిక గైడ్లు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పట్టారు. ఈ మేరకు పోలీసులు కూడా రంగంలోకి దిగి హెలికాప్టర్ సాయంతో ఆ వ్యక్తిని రక్షించారు. ఐతే పోలీసులు అతనిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. వాస్తవానికి అతను ఈ అగ్నిపర్వతం వద్దకు వెళ్లేందుకు ఎలాంటి అనుమతి తీసుకోలేదు. ఇది చాలా ప్రమాదాకరమైన ప్రదేశం అని పర్యాటక సందర్శనకు నిషేధించారు. ఆ టూరిస్ట్ ఎలాంటి అనుమతి లేకుండానే తన కుటుంబంతో సహా అక్కడకు రావడంతో అతనిపై కేసు నమోదు చేశారు పోలీసులు. (చదవండి: గోటబయ పరార్.. లంకలో ఎమర్జెన్సీ: బయట కనిపిస్తే కాల్చివేతే) -
అగ్ని పర్వతం బద్దలై.. బూడిదగా మారి‘నది’
ఈ ఫొటోలు చూస్తే ఏమనిపిస్తోంది? ఎడమవైపున ఉన్న ఫొటోలో ఏదో నదో, వాగో ఎండిపోయినట్టు.. కుడిపక్కనున్న ఫొటోలో వరద వచ్చో, కొండచరియలు విరిగిపడో ట్రక్కులు కూరుకుపోయినట్టు అనిపిస్తోంది కదా. కానీ ఇవేవీ కాదు. ఇండోనేసియాలోని జావా ద్వీపంలో ఉన్న మౌంట్ సెమెరు అగ్ని పర్వతం బద్దలైన తర్వాత జరిగిన బీభత్సమిది. భారీ పేలుడుకు అగ్నిపర్వతం నుంచి బూడిద కిలోమీటర్ల మేర ఆకాశాన్ని కప్పేసింది. లావా, సీరింగ్ వాయువు దాదాపు 11 కిలోమీటర్ల మేర వ్యాపించాయి. పర్వతానికి దగ్గర్లోని బెసుక్ కొబొకన్ నది మొత్తం బూడిద, బురదతో నిండిపోయి ఇలా కనిపించింది. చుట్టుపక్కల గ్రామాలన్నీ బూడిదమయమయ్యాయి. ఎంతలా అంటే.. ఇలా ట్రక్కులు కూడా కనిపించనంతగా! (చదవండి: సీవో2ను రాకెట్ ఇంధనంగా మారుస్తా..!) ఈ ప్రకృతి విపత్తు ఎంతో మందికి తీరని నష్టాన్ని మిగిల్చింది. ఇప్పటివరకు 48 మంది మృతి చెందినట్టు స్థానిక మీడియా సమాచారం. ప్రభావిత ప్రాంతాల నుంచి దాదాపు 10 వేల మందిని ఖాళీచేయించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. సముద్ర మట్టానికి 3,676 మీటర్ల (12,000 అడుగుల కంటే ఎక్కువ) ఎత్తులో ఉన్న సెమెరు పర్వతం, గతేడాది డిసెంబర్.. ఈ సంవత్సరం జనవరిలో విస్ఫోటనం చెందింది. (చదవండి: ఆకాశంలో హార్ట్ టచింగ్ ప్రయాణం) -
బద్దలైన అతిపెద్ద అగ్నిపర్వతం.. 13 మంది మృతి, వైరలైన దృశ్యాలు
జకార్త: ఇండోనేషియాలోని సెమెరు అగ్నిపర్వతం శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత బద్దలైంది. ఈప్రమాదంలో ఇప్పటివరకు 13 మంది మృత్యువాత పడ్డారు. దాదాపు 90 మంది గాయపడ్డారు. 900 మందికిపైగా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించామని ఇండోనేషియా డిజాస్టర్ మైటిగేషన్ ఏజెన్సీ (బీఎన్పీబీ) అధికారి అబ్దుల్ ముహారి తెలిపారు. 🚨 #Indonesia's Mount Semeru #Volcano in East Java erupts sending ash 40,000ft into the sky as locals flee.#Semeru#volcanoEruption #Volcanoeruption pic.twitter.com/XdQrnA6nri — TusharVijh (@TusharVijh) December 4, 2021 అతి పెద్ద అగ్నిపర్వతం జావా ద్వీపంలోని అతి ఎత్తయిన (3600 మీటర్లు) సెమెరు అగ్నిపర్వతం నుంచి శనివారం నుంచే పెద్ద ఎత్తున బూడిద, తీవ్రమైన వేడి వెలువడటం మొదలైంది. 40 వేల అడుగుల ఎత్తువరకు దట్టంగా పొగ, దుమ్ముధూళి అలుముకుంది. దీంతో భయాందోళనకు గురైన తూర్పు జావా ప్రాంతంలోని చాలా మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. అయితే, విస్పోటనం అనంతరం స్థానికుల రాకపోకలకు కీలకమైన బ్రిడ్జి తీవ్రంగా దెబ్బతింది. #Volcano in Mount semeru erupted sending ash plume to 40000ft in #Java #Indonesia 4 December 2021 pic.twitter.com/K80t9L7vCY — News Disaster (@NewsDisaster1) December 4, 2021 దీంతో ఆ ప్రాంతంలో మరికొంత మంది చిక్కుకున్నారు. బీఎన్పీబీ బృందాలు సహాయక చర్యలు చేపట్టి వారిని సురక్షితంగా కాపాడాయి.సెమెరు విస్పోటనానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా, ఇండోనేషియాలో 130కి పైగా క్రియాశీల అగ్నిపర్వతాలు ఉన్నాయి. అందుకనే ఇండోనేషియాను ‘పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్’గా పిలుస్తారు. జనవరిలో కూడా సెమెరు బద్దలవగా ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. (చదవండి: వైరల్: ఆవులపై పోలీసులకు ఫిర్యాదు.. ఇదేందిరా నాయనా..) Bagana Lumajang is still at the location of the village jointly to look for victims who have not been evacuated due to the eruption of Mount #Semeru #BanserTanggapBencana #prayforsemeru #prayforlumajang #Indonesia #indonesian #Indonesie #volcano #volcanoEruption #volcanoes pic.twitter.com/aK4NvvXdQp — Journalist Siraj Noorani (@sirajnoorani) December 5, 2021 నదివైపునకు పరుగులు పెడుతున్న బురద, మట్టితో కూడిన నీరు. In #Indonesia, the #Semeru eruption also generated a lahar (mud flow) in nearby riverbeds. 🔻These rivers have a density similar to concrete and can have high temperatures.#Indonesie #indonesian #volcanoEruption #volcano #volcanoes pic.twitter.com/nVcIIa6gkP — Journalist Siraj Noorani (@sirajnoorani) December 5, 2021 (చదవండి: Sruthy Sithara: ఫస్ట్ ఇండియన్ మిస్ ట్రాన్స్ గ్లోబల్ యూనివర్స్గా శ్రుతి సితార..) -
చూడముచ్చటగా ఉగ్ర రూపం.. రిస్క్ అయినా పర్వాలేదు
-
సంచలనం.. అగ్నిపర్వతాల నుంచి బిట్కాయిన్ల తయారీ
El Salvador Mines First Bitcoin With Volcanic Energy: క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్ విషయంలో మధ్యఅమెరికా దేశం ఎల్ సాల్వడర్ మరో కీలకమైన అడుగు వేసింది. అగ్నిపర్వతాల నుంచి ఉత్పత్తి అయ్యే పవర్ను వినియోగించుకుని బిట్కాయిన్ తయారు చేయడం ద్వారా సంచలనానికి తెరలేపింది. వోల్కనో ఎనర్జీ ద్వారా ఇప్పటికే 0.00599179 బిట్కాయిన్(269 డాలర్ల)ను ఉత్పత్తి చేసింది కూడా. ఈ మేరకు ఎల్ సాల్వడర్ అధ్యక్షుడు నయిబ్ బుకెలె(40) అధికారికంగా ట్విటర్ ద్వారా ప్రకటించారు. క్రిప్టోకరెన్సీ మార్కెటింగ్లో ప్రస్తుతం పోటీతత్వం నడుస్తోంది. ఈ తరుణంలో కేవలం 3 లక్షల లోపు జనాభా ఉన్న ఎల్ సాల్వడర్.. అగ్ని పర్వతాల ఎనర్జీ జియో థెర్మల్తో బిట్కాయిన్ తయారు చేసిన ఘనత దక్కించుకుంది. తద్వారా పునరుత్పాదక శక్తి(మళ్లీ మళ్లీ ఉపయోగించుకోవచ్చు) ద్వారా అభివృద్ధికి కీలకమైన అడుగు వేసింది. అందుకే ఈ నిర్ణయం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. TODAY - The first #Bitcoin is being volcano mined in El Salvador 🌋 pic.twitter.com/hITJhPOf25 — Bitcoin Magazine (@BitcoinMagazine) October 1, 2021 జియోథర్మల్ ఎలాగంటే.. జియోథర్మల్ ఎనర్జీ అనేది స్వచ్ఛమైంది. అగ్నిపర్వతాల వేడిమి(అంతర్గతంగా) ఉపయోగించుకుని ఈ ఎనర్జీని తయారు చేస్తారు. ఇది ఇంతకు ముందు ఏదైతే వనరులను ఉపయోగించుకుంటుందో.. తిరిగి దానినే వాడుకుంటుంది. తద్వారా విడుదలయ్యే వేడిమి పోను పోనూ తగ్గుతుంది. పైగా థర్మల్ ఎనర్జీని డిజిటల్ ఎనర్జీగా(బిట్కాయిన్) మార్చడం వల్ల ఎక్కడికైనా ఎగుమతి చేయొచ్చు. శక్తి కోల్పోకుండా దానిని స్టోర్ చేయొచ్చు. ఈ మేరకు జియోథర్మల్లో బిట్కాయిన్ల ఉత్పత్తికి సంబంధించిన వీడియోను సైతం నయిబ్ బుకెలె శుక్రవారం ట్విటర్ ద్వారా చూపించారు. First steps... 🌋#Bitcoin🇸🇻 pic.twitter.com/duhHvmEnym — Nayib Bukele 🇸🇻 (@nayibbukele) September 28, 2021 బోలెడంత ఆదా.. సాధారణంగా క్రిప్టోకరెన్సీ అయిన బిట్కాయిన్ల ఉత్పత్తి వాతావరణంలోకి అధిక వేడిమికి ఉత్పత్తి చేస్తుంది. ఈ వేడిమి ఎంతో ప్రమాదకారకం. పైగా కంటికి కనిపించని ఈ కరెన్సీని డిజిటల్గా తయారు చేయడం కోసం బోలెడంత సాధారణ కరెంట్నూ(కంప్యూటర్ల కోసం) ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే ఎల్ సాల్వడర్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కరెంట్ సేవ్ కావడమే కాదు.. జియోథర్మల్ వల్ల వేడిమి స్థాయి కూడా వాతావరణంలోకి తక్కువగా విడుదల అవుతుంది. అందుకే ప్రపంచ దేశాల నుంచి హర్షాతికేరాలు వ్యక్తం అవుతున్నాయి. ఎల్ సాల్వడర్ చేసిన ఈ ప్రయత్నం మరికొన్ని దేశాలకు ప్రోత్సాహం ఇస్తుందని ట్విటర్ సీఈవో జాక్ డోర్సే పొగడ్తలు గుప్పించారు. ఎల్ సాల్వడర్ అధ్యక్షుడు నయిబ్ బుకెలె కేంబ్రిడ్జి బిట్కాయిన్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఇండెక్స్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా బిట్కాయిన్ల ఉత్పత్తి కోసం 105 టెరావాట్ గంటల పవర్ను ఒక ఏడాదికి ఉపయోగిస్తున్నారు. ఫిలిప్పైన్స్ దేశం ఒక ఏడాదిలో మొత్తం ఉపయోగించే కరెంట్ కంటే ఇది ఎక్కువని ఒక అంచనా. బిట్కాయిన్స్ ఉత్పత్తి చేస్తున్న జియోథర్మల్ ప్లాంట్ ఇదే వ్యతిరేకత నడుమే.. బిట్కాయిన్ క్రిప్టోకరెన్సీకు ఎల్ సాల్వడర్ దేశం చాలాకాలం క్రితమే చట్టబద్ధత కల్పించింది. అంతేకాదు బిట్కాయిన్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఎల్సాల్వాడర్ సర్కార్ తమ పౌరులకు ఇదివరకే 30 డాలర్ల విలువ గల బిట్కాయిన్లను అందించింది. అయితే ఇది ఆ దేశ పౌరులకు నచ్చడం లేదు. బిట్కాయిన్కు మద్దతు ఇచ్చే వ్యవస్ధలు లోపభూయిష్టంగా ఉన్నాయని పౌరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనల ప్రభావంతో సెప్టెంబర్ మొదటి వారంలో బిట్కాయిన్ విలువ భారీగా పతనం అయ్యింది కూడా. అయినప్పటికీ ఎల్ సాల్వడర్ ప్రభుత్వం తగ్గడం లేదు. ఇప్పటికే చివో(కూల్) పేరుతో వర్చువల్ వ్యాలెట్ను సైతం మెయింటెన్ చేస్తోంది ఎల్ సాల్వడర్. చదవండి: అదృష్టమంటే ఇదే! తొమ్మిదేళ్లలో రూ. 6 లక్షల నుంచి రూ. 216 కోట్లు...! -
నిరాశ్రయులైన వేలాది మంది ప్రజలు
కిన్షాసా: కాంగో దేశంలో అగ్నిపర్వతం పేలిన ఘటనలో ఇరవైవేల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఆ దేశంలోని గోమాలో అగ్నిపర్వతం పేలడంతో లావా ప్రవహించింది. దీంతో డజన్లకొద్దీ ప్రజలు మరణించినట్లు, 40 మంది వరకు తప్పిపోయినట్లు బుధవారం ఐక్యరాజ్యసమితి తెలిపింది. అంతేకాకుండా అగ్నిపర్వత విస్ఫోటనాకి వందలాది గృహాలు ధ్వంసమయ్యాయి. వేలాది మంది అక్కడి నుంచి దూరంగా పారిపోయారని తెలిపారు. కాగా నైరాగోంగో నుంచి 15 కి.మీ (9 మైళ్ళు) దూరంలో 200 సార్లు భూమి కంపించింది. అయితే ఇప్పటివరకు భూకంపానికి ఎటువంటి మరణాలు సంభవించలేదని అధికారులు తెలిపారు. కానీ భూమి కంపించడంతో పగుళ్లు ఏర్పడ్డాయని, ఈ పగుళ్లు అక్కడి నివాసితులను భయాందోళనలకు గురిచేస్తున్నాయని తెలిపారు. కాంగో దేశ అధికారులు పునరావాస సహాయక పనులు చేపట్టారు. అయితే దశాబ్దాలుగా రగులుతున్న ఇరగోంగో అగ్నిపర్వతం బద్దలయ్యే సమయాన్ని అక్కడి యంత్రాంగం అంచానా వేయలేకపోయింది. దీంతో ప్రాణ, ఆస్తి నష్టం భారీగా సంభవించింది. (చదవండి: ఆకుపచ్చగా మారుతున్న గంగానది.. కారణం ఏంటి?) -
Photo Feature: ఎక్కడికక్కడ కట్టడి.. ఉక్కిరిబిక్కిరి
తెలంగాణ పోలీసులు లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తున్నారు. డీజీపీ మహేందర్రెడ్డి లాక్డౌన్ అమలు తీరును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కరోనా కాలంలో సామాన్యులకు కష్టాలు తప్పడం లేదు. అన్ని ప్రాంతాల్లో ఆంక్షలు అమల్లో ఉండటంతో జనం సతమతమవుతున్నారు. మరోవైపు కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు ఢిల్లీలో ఆందోళన కొనసాగిస్తున్నాయి. -
20 ఏళ్ల తర్వాత అగ్నిపర్వతం బద్ధలు..భయం గుప్పిట్లో ప్రజలు
కిన్షాసా: కాంగోలోని ఇరగోంగో అగ్నిపర్వం దాదాపు రెండు దశాబ్దాల తర్వాత బద్దలైంది. అగ్ని పర్వతం విస్ఫోటనంతో లావా పైకి ఉప్పొంగుతోంది. దీంతో ఆకాశమంతా ఎరుపురంగులోకి మారింది. లావా ధారలుగా ప్రవహిస్తూ గోమా నగరంలోని ప్రధాన రహదారులపైకి చేరడంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దాదాపు రెండు మిలియన్ల మంది గోమా నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. అయితే, ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని అధికార వర్గాలు తెలిపాయి.1977 లో నైరాగోంగో పర్వతం విస్ఫోటనం వల్ల సుమారు 2 వేల మంది మరణించారు. అలాగే 2002లో విస్పోటనం చెందగా.. తప్పించుకునే దారిలేక వందలాది మంది మృతి చెందారు. లక్ష మందికిపైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. శనివారం రాత్రి మరోసారి అగ్నిపర్వతం బద్దలవడంతో ప్రజలంతా ఆందోళనకు గురవుతున్నారు. అయితే అగ్నిపర్వతం పేలుడుతో వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం సహాయక చర్యలు ప్రారంభించింది. కాగా యూరప్ పర్యటనలో ఉన్న కాంగో అధ్యక్షుడు ఫెలిక్స్ టిసెకెడి ఆదివారం స్వదేశానికి రానున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు సుమారు మూడువేల మంది ప్రజలు కాంగోను విడిచి వెళ్లినట్లు రువాండా ఇమ్మిగ్రేషన్ అధికారులు పేర్కొన్నారు. కొందరు కివు సరస్సు పడవల్లో ఆశ్రయం పొందగా.. మరికొందరు మెట్రోపాలిటన్ ప్రాంతంలోని ఎత్తయిన పర్వత ప్రాంతానికి చేరుకున్నారు. ఇక ఈ ఘటనపై ఐక్యరాజ్య సమితి శాంతి భద్రత బృందం స్పందించింది. లావా గోమా నగరం వైపు వెళ్లడం లేదని, ప్రస్తుతం తాము అప్రమత్తంగానే ఉన్నట్లు పేర్కొంది. కాగా అగ్నిపర్వత విస్ఫోటనం గురించి సకాలంలో తెలియజేయకపోవడంతో ప్రజల్లో అయోమయం నెలకొంది. అధికారులు సకాలంలో స్పందిచకపోవడం, సోషల్ మీడియాలో రకరకాల వార్తలు ప్రచారం కావడంతో ప్రజల్లో గందరగోళం పెంచింది. 🚨🚨Activité volcanique aux alentours de Goma: la MONUSCO fait des vols de reconnaissance. La lave ne semble pas se diriger vers la ville de Goma. Nous restons en alerte. pic.twitter.com/JQmz7v16Ne — MONUSCO (@MONUSCO) May 22, 2021 (చదవండి: హఠాత్తుగా మారిన వాతావరణం: చైనాలో పెనువిషాదం) -
వైరల్: అగ్ని పర్వతం పక్కనే వాలీబాల్ ఆట
రేక్సావిక్: ఐస్ల్యాండ్ రాజధాని రేక్సావిక్కు 40 కిలో మీటర్ల దూరంలో ఉన్న కేక్సానెస్ అగ్నిపర్వతం ఈ నెల 28న బద్ధలైంది. దీంతో పర్వతంలో నుంచి పెద్ద ఎత్తున లావా బయటకు వస్తోంది. అయితే ఆ లావా వేడి తీవ్రత తక్కువగానే ఉండటంతో పర్యాటకులు కాస్త దాని దగ్గరగా వెళ్లి పరిశీలించే అవకాశం కలుగుతోంది. ఆదివారం చాలా మంది హైకర్లు, సందర్శకులు అక్కడికెళ్లి దాన్ని పరిశీలించారు. పర్యాటకలు అగ్ని పర్వతం వద్ద సెల్పీలు దిగుతున్నారు. తాజాగా అగ్ని పర్వతం వద్ద కొంత మంది యువకులు సరదగా వాలీబాల్ ఆడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రూట్ ఐనార్స్డోట్టిర్ అనే మహిళ తన ట్విటర్ ఖాతాలో వాలీబాల్ ఆడుతున్న వీడియోను పోస్ట్ చేశారు. ‘అగ్నిపర్వతం వద్ద యువకులు సరదగా వాలీబాల్ ఆడుతున్నారు’ అని ఆమె కామెంట్ జతచేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోను పదిలక్షల మంది వీక్షించారు. ఆమె మరో వీడియోను షేర్ చేసి.. ‘ ఉదయం ఆగ్ని పర్వతం వద్ద కాఫీ తాగడం చాలా సంతోషంగా ఉంది’ అని కామెంట్ చేశారు. ఈ వీక్షించిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘చాలా అద్భుతం’, ‘అక్కడ ఆటలు ఆడటాన్ని నిషేధిస్తారు.. జాగ్రత్త’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. People casually playing volleyball at the #volcano in #Fagradalsfjall, #Iceland yesterday 🌋 Mögulega það íslenskasta sem ég hef séð. pic.twitter.com/nU3VeDqziR — Rut Einarsdóttir (@ruteinars) March 28, 2021 -
అగ్ని పర్వతం బద్దలైనప్పుడు...
ఆకాశంలో చుక్కల ముగ్గేసినట్లు నక్షత్రాలు.. మధ్యలో ఒక్కసారిగా పేలిన కొలిమా అగ్ని పర్వతం.. ఫొటో సూపర్గా ఉంది కదూ.. ఈ చిత్రాన్ని హెర్నాండో రివేరా అనే ఫొటోగ్రాఫర్ తీశారు. గతంలో మెక్సికోలోని కొలిమా అగ్ని పర్వతం బద్దలైనప్పుడు ఓ రాత్రంతా అక్కడే ఉండి ఫొటోలను తీసినట్లు రివేరా తెలిపారు. ఒక్కోసారి ప్రకృతి విధ్వంసం కూడా కెమెరా కంటికి చాలా అందంగా కనిపిస్తుందని చెబుతున్న రివేరా ఈ చిత్రాలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకున్నారు. భారీ డ్రోన్తో ఉపగ్రహ ప్రయోగాలు ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపాలంటే బోలెడంత ఖర్చు. ఇస్రో లాంటి సంస్థలైతే చౌకగానే ఆ పనిచేస్తున్నాయి గానీ.. మిగిలిన చోట్ల మాత్రం ఒక్కో ప్రయోగానికి రూ.400 కోట్ల నుంచి రూ.వేల కోట్ల వరకు ఖర్చు అవుతుంటుంది. ఇలా కాకుండా.. భారీ డ్రోన్ సాయంతో తక్కువ ఖర్చులో ఉపగ్రహాలను కక్ష్యలోకి చేరుస్తానని అమెరికాకు చెందిన ఏవియమ్ అనే కంపెనీ చెబుతోంది. ‘రావన్ ఎక్స్’పేరుతో ఇటీవలే ఈ కంపెనీ ఓ డ్రోన్ను సిద్ధం చేసింది కూడా. పూర్తిగా స్వతంత్రంగా వ్యవహరించే ఈ డ్రోన్ గాలిలో నుంచే చిన్న చిన్న ఉపగ్రహాలను ప్రయోగించగలదు. 80 అడుగుల పొడవు.. రెక్కల వెడల్పు 60 అడుగులు, ఎత్తు 18 అడుగుల వరకు ఉంటుంది. సాధారణ విమాన ఇంధనాన్ని వాడుకుని 1.6 కిలోమీటర్ల రన్వే నుంచే నింగిలోకి ఎగరగలదు. 8 వేల చదరపు అడుగుల స్థలమున్న హ్యాంగర్లో ఉంచేయవచ్చు. ఎలాంటి వాతావరణంలోనైనా దీన్ని వాడుకోవచ్చని, డ్రోన్లో 70% మళ్లీ మళ్లీ వాడుకునేలా తయారు చేశామని కంపెనీ సీఈవో జే స్కైలస్ తెలిపారు. భవిష్యత్తులో డ్రోన్ మొత్తాన్ని పలుమార్లు వినియోగించుకునేలా చేస్తామని చెప్పారు. రావన్ ఎక్స్తో ఒక్కో ఉపగ్రహ ప్రయోగం 3 గంటల్లో పూర్తవుతుందన్నారు. కంపెనీ ఇప్పటికే సుమారు రూ.7 వేల కోట్ల విలువైన కాంట్రాక్టులు దక్కించుకుందని, అమెరికా స్పేస్ ఫోర్స్తోపాటు, ఇతర సంస్థలు వినియోగదారులుగా ఉన్నారని వివరించారు. యూఎస్ స్పేస్ ఫోర్స్ ఆస్లోన్–56 పేరుతో భూమికి దగ్గరలో ఉన్న కక్ష్యలోకి చిన్న ఉపగ్రహాలు ప్రయోగించాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఫిలిప్పీన్స్లో తాల్ అగ్ని ప్రర్వతం విస్పోటనం
-
మరో సునామీ రావచ్చు
కార్టియా: ఇండోనేసియాపై మరోసారి సునామీ విరుచుకుపడే అవకాశం ఉందని ఆ దేశ అధికారులు గురువారం హెచ్చరికలు జారీ చేశారు. గతవారం విస్పోటనం చెందిన ఆనక్ క్రకటోవా అగ్ని పర్వతం వద్ద ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు మరో భారీ సునామీకి సంకేతంగా వారు భావిస్తున్నారు. దీని కారణంగానే రెండో తీవ్రస్థాయి హెచ్చరికలు జారీ చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇంకా అనేక విస్పోటనాలు చోటుచేసుకునే అవకాశం ఉందని ఆ దేశ జాతీయ విపత్తు సంస్థ అధికార ప్రతినిధి సుటోపో పుర్వో నుగ్రోహో తెలిపారు. ఇప్పటివరకు ఆనక్ క్రకటోవా అగ్ని పర్వత ప్రదేశం నుంచి రెండు కిలోమీటర్ల వరకు నిషేధిత ప్రాంతం(నో గో జోన్)గా ఉండగా.. తాజాగా దీనిని ఐదు కిలోమీటర్లకు పెంచారు. గత శనివారం విస్పోటనం ధాటికి భారీగా ఎగిసిన బూడిద, వేడి వాయువులు, ఇతర అగ్ని పర్వత మిశ్రమాలు అక్కడి ప్రజల్ని భయకంపితుల్ని చేస్తున్నాయి. బూడిద, ఇసుక ఎగిసిపడుతున్న నేపథ్యంలో సిలేగాన్, సెరాంగ్ పట్టణ ప్రజలు మాస్కులు, కళ్లద్దాలు ధరించాలని అధికారులు తెలిపారు. -
మృత్యు సునామీ.. 222 మంది మృతి
ఇండోనేసియాను మరో జల విలయం ముంచెత్తింది. ప్రకృతి ప్రకోపాలకు తరచూ గురయ్యే ఈ ద్వీప సముదాయ దేశంలో తాజాగా ఓ సునామీ మృత్యు పాశమై పెను విధ్వంసం సృష్టించింది. శినివారం రాత్రి సముద్ర గర్భంలోని ఒక అగ్ని పర్వతం బద్ధలై.. సుమత్ర, జావా ద్వీపాల తీరాలపై సునామీగా విరుచుకుపడింది. సముద్రం నుంచి దూసుకొచ్చిన మృత్యు అలలు క్షణాల్లో 222 మందిని బలి తీసుకున్నాయి. మరెంతో మందిని గాయాలపాలు చేశాయి. బలమైన అలల తీవ్రతకు వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. కెరీటా ఇండోనేసియాలో మరో భారీ ప్రకృతి విలయం సంభవించింది. సముద్రంలో, తీరానికి దగ్గరగా ఉన్న ఒక అగ్నిపర్వతం పేలిన కారణంగా సునామీ రావడంతో 222 మంది దుర్మరణం పాలయ్యారు. వందలాది మంది క్షతగాత్రులుగా మారారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు తెలిపారు. సుమత్రా, జావా ద్వీపాల మధ్యనున్న సుండా జలసంధిలోని చిన్న దీవిలో ఉన్న ఆనక్ క్రకటోవా అనే అగ్ని పర్వతం పేలిన కారణంగా స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి 9.30 గంటలకు (భారత కాలమానంలో శనివారం రాత్రి 8 గంటలు) సునామీ సంభవించింది. సుమత్రా దీవి దక్షిణ తీరం, జావా దీవి పశ్చిమ తీరాలపై ఈ సునామీ విరుచుకుపడి తీవ్ర విధ్వంసం సృష్టించింది.సాధారణంగా అగ్నిపర్వతాల కారణంగా వచ్చే సునామీలు చాలా అకస్మాత్తుగా, ఉన్నట్టుండి తీరాలను ముంచెత్తుతాయి. దీంతో ప్రజలను సురక్షిత తరలించేంత తరలించేంత సమయం ఉండదు. అగ్ని పర్వతాలు పేలిన కారణంగా సునామీలు చాలా అరుదుగా వస్తుంటాయని అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం తెలిపింది. కాగా, ఈ ప్రమాదంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సహాయక కార్యక్రమాల్లో ఇండోనేసియాకు సాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ‘ఇండోనేసియాలో సునామీ కారణంగా జరిగిన విధ్వంసం గురించి తెలుసుకుని చింతిస్తున్నాను. చనిపోయిన వారి కుటుంబాలకు నా సానుభూతి’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. ఐరోపా దేశాల నేతలు ఇండోనేసియాకు సానుభూతి తెలిపారు. సెవెంటీన్ పాప్ గ్రూప్పై.. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలింపు చేపడుతున్నామనీ, మొత్తంగా 28 మంది గల్లంతయ్యారని ఇండోనేసియా జాతీయ ప్రకృతి విపత్తుల స్పందన సంస్థ అధికార ప్రతినిధి సుటొపో పుర్వో నుగ్రొహో చెప్పారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం సునామీ కారణంగా 222 మంది మరణించగా, మరో 843 మంది గాయపడ్డారని ఆయన తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చన్నారు. సుండా జలసంధి సమీపంలోని తీరాల్లో, జావా ద్వీపంలోని పాండెగ్లాంగ్ జిల్లాలో 163 మంది చనిపోయారనీ, అత్యధిక మరణాలు రెండు హోటళ్లలో సంభవించాయని నుగ్రోహో చెప్పారు. సెరంగ్లో 11 మంది, సుమత్రా దీవిలోని దక్షిన లంపుంగ్లో 48 మంది చనిపోయారన్నారు. ఈ సునామీకి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వెలువడిన ఓ వీడియో భీతి గొల్పేలా ఉంది. ‘సెవెంటీన్’ అనే పాప్ గ్రూప్ ప్రదర్శన ఇస్తుండగా, భారీ ఎత్తున్న నీటి అల వెనుకవైపు నుంచి వేదిక మీదకు వచ్చి పడింది. వేదికపైనున్న కళాకారులు చెల్లాచెదురయ్యారు. అనంతరం అల ప్రేక్షకులను ముంచెత్తింది. సునామీ కారణంగా వందలాది చెట్లు, విద్యుత్ స్తంభా లు నేలకూలాయి. శిథిలాలు, చెత్త, చెదారమంతా బీచ్ల్లోకి చేరింది. జావా ద్వీపంలోని కెరీటా బీచ్లోకి ఓ ఇంటి పైకప్పుకు అమర్చిన రేకులు, మొద్దులు, ఇతర శిథిలాలు కొట్టుకొచ్చాయి. సునామీ సమయంలో అగ్ని పర్వతం ఫొటోలు తీస్తున్న ఓయ్స్టీన్ అండర్సన్ తన అనుభవాన్ని వివరిస్తూ ‘అకస్మాత్తుగా ఓ పెద్ద అల వచ్చింది. అది తీరం దాటి దాదాపు 20 మీటర్లు ముందుకొచ్చింది. నేను పరుగెత్తడం మొదలుపెట్టాను. ఆ తర్వాత వచ్చిన అల తీరంలోని హోటల్ ప్రాంతాన్ని ముంచేసింది. కార్లు, కంటెయినర్లు 10 మీటర్లకు పైగా దూరం కొట్టుకుపోయాయి’ అని చెప్పారు. మొత్తం మృతుల సంఖ్య అప్పుడే చెప్పలేం సునామీ మృతుల సంఖ్య స్పష్టంగా తెలిసేందుకు కొన్ని రోజులు లేదా వారాలు పట్టొచ్చని రెడ్ క్రాస్, రెడ్ క్రీసెంట్ సొసైటీస్ అంతర్జాతీయ సమాఖ్యకు చెందిన కేథీ ముల్లర్ తెలిపారు. శిథిలాలను పూర్తిగా తొలగించేంత వరకు మృతుల సంఖ్య ఎంతో కచ్చితంగా చెప్పలేమనీ, రాబోయే కొన్ని రోజులు, వారాల పాటు ఈ సంఖ్య మారుతూ ఉంటుందని ఆమె అన్నారు. సహాయక బృందాలు గాయపడిన వారిని వైద్యశాలలకు తరలిస్తున్నాయి. తమ సంస్థల తరఫున సహాయక శిబిరాలు నెలకొల్పి ప్రజలకు తాత్కాలిక వసతిని, ఆహారాన్ని అందజేస్తున్నట్లు కేథీ చెప్పారు. సునామీ కారణంగా వచ్చే వ్యాధులను ఎదుర్కొనేందుకు, జబ్బులు రాకుండా నివారించేందుకు తమ బృందాలు సిద్ధమవుతున్నాయన్నారు. కాగా, ఇండోనేసియాలో ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగానే సంభవిస్తుంటాయి. ఈ ఏడాదే సెప్టెంబర్ నెలలోనూ సులవేసి ద్వీపంలోని పలూ పట్టణంలో సునామీ వచ్చి వేలాది మంది చనిపోయారు. 2004 డిసెంబర్ 26న రిక్టర్ స్కేల్పై 9.3 తీవ్రతతో సముద్రంలో వచ్చిన భూకంపం కారణంగా సునామీ సంభవించి వివిధ దేశాల్లో మొత్తంగా 2.2 లక్షల మంది చనిపోగా, వారిలో ఇండోనేసియా ప్రజలే 1.68 లక్షలు ఉన్నారు. పేలిన అగ్నిపర్వతం సుమత్రా, జావా ద్వీపాల మధ్యలో పేలిన ఆనక్ క్రకటోవా అగ్నిపర్వతం వీధి విధ్వంసం సునామీలో పూర్తిగా ధ్వంసమైన వీధి, వాహనాలు శవాల దిబ్బ కవర్లలో చుట్టిన మృతదేహాల్లో తమ వారి కోసం వెతుకుతున్న ప్రజలు -
భారీ విస్ఫోటనం.. 450 విమానాలు రద్దు
-
భారీ విస్ఫోటనం.. 450 విమానాలు రద్దు
డెన్పసర్ (ఇండోనేసియా) : ప్రపంచంలోనే అత్యధిక అగ్నిపర్వత విస్ఫోటనాలు సంభవించే ఇండోనేసియా, బాలి తీరంలో మరోసారి కల్లోలం మొదలైంది. మౌంట్ అగంగ్ మరోసారి తన ప్రతాపం చూపించడంతో స్థానిక ప్రజలతో పాటు విదేశీ పర్యాటకులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం రోజు కూడా అగ్నిపర్వతం నుంచి లావా ఎగజిమ్ముతుండటంతో దట్టమైన పొగలు ఆకాశాన్ని కమ్మేస్తున్నాయి. దాదాపు 2000 మీటర్ల (6500 అడుగుల) ఎత్తు వరకు దట్టమైన పొగలు వ్యాప్తి చెందడంతో అప్రమత్తమైన అధికారులు 450 విమాన సర్వీసులను రద్దు చేశారు. దాంతో పాటుగా ఎన్గురా రాయ్ విమనాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఒకానొక దశలో 23,000 అడుగుల ఎత్తులోనూ పొగల ప్రభావం ఉన్నట్లు గుర్తించారు. దట్టమైన పొగల కారణంగా విమాన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని భావించి సర్వీసులను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం వరకు బాలి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేస్తామని, ఆపై పరిస్థితులు అదుపులోకొస్తే సర్వీసులను పునరుద్ధరించనున్నారు. 450 సర్వీసులు రద్దు చేయడంతో 75,000 మంది విమాన ప్రయాణికులపై ఇది ప్రభావం చూపుతుందని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికీ అగ్నిపర్వతం పేలిపోయే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో మౌంట్ అగంగ్కు దాదాపు 4 కిలోమీటర్ల పరిధిలో ఎవరినీ భద్రతా సిబ్బంది అనుమతించడం లేదు. గురువారం సాయంత్రం నుంచి సహాయక చర్యలు, భద్రతా చర్యలు చేపట్టామని బాలి గవర్నర్ మంగ్కు పస్టికా చెప్పారు. విదేశీ పర్యాటకులను మరో ప్రత్యామ్నాయం కోసం తమ సిబ్బంది కృషి చేస్తున్నారని తెలిపారు. ఆస్ట్రేలియా పర్యాటకుడు రాడ్ బర్డ్ మీడియాతో మాట్లాడుతూ.. పెర్త్కు వెళ్లే విమానం రెండోసారి రద్దయిందని శుక్రవారం ఉదయం అధికారులు చెప్పారంటూ వాపోయాడు. బాలి విస్ఫోటనాల్లో అతిపెద్దది 1963లో సంభవించింది. ఆ దుర్ఘటనలో 1100 మంది మృత్యువాత పడ్డారు. 70 కిలోమీటర్ల పరిధిలో విస్ఫోటనం ప్రభావం చూపించింది. -
హవాయిలో పచ్చల వాన!
హవాయి ప్రాంతంలో ఓ అగ్నిపర్వతం పేలిపోయిందని.. దాంట్లోంచి లావా చుట్టుపక్కల ప్రాంతాలను ఆక్రమిస్తోందని మనకు తెలుసు కదా.. అక్కడే ఇంకో ఆశ్చర్యకరమైన సంఘటన కూడా చోటు చేసుకుంటోంది. అగ్నిపర్వతపు పొగ, లావాల నుంచి పచ్చటి రంగు రాళ్లు వర్షంలా కురుస్తున్నాయి. ఇంకేముంది.. హవాయి వెళ్లి కొన్ని పచ్చలు తెచ్చుకుందామని అనుకుంటున్నారా? కొంచెం ఒపిక పట్టండి. అక్కడ పచ్చల వాన కురుస్తున్న మాట వాస్తవమే అయినప్పటికీ అవి నవరత్నాల్లోని పచ్చలంత అరుదైనవి ఏమీ కాదు. ఒలివీన్ అనే సాధారణ ఖనిజంతో తయారయ్యాయి ఇవి. అగ్ని పర్వతాల ధూళిలో ఇలాంటివి కనపడటం కొంచెం అరుదు. ఇటీవల లావా పెద్ద ఎత్తున ఆకాశంలోకి ఎగజిమ్మడంతో అక్కడి ఉష్ణోగ్రతలకు అనుగుణంగా లావాలోని రసాయనాలు ఘనీభవించి ఇలా పచ్చల్లా మారి ఉంటాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వీటి విలువ మాటెలా ఉన్నప్పటికీ హవాయి ప్రజలు మాత్రం వీటిని సేకరించి జాగ్రత్త చేసుకుంటున్నారు. -
అగ్నిపర్వతం బద్దలు
గ్వాటెమాలా సిటీ: మధ్య అమెరికా దేశమైన గ్వాటెమాలాలో మరోమారు అగ్నిపర్వతం బద్దలైంది. రాజధాని గ్వాటెమాలా సిటీకి 40 కి.మీ దూరంలోని ఫ్యూగో అగ్నిపర్వతం ఆదివారం ఒక్కసారిగా లావాను ఎగజిమ్మింది. దీంతో సమీప గ్రామాలకు చెందిన 25 మంది మృతి చెందగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో జాతీయ విపత్తు అధికారితో పాటు పలువురు చిన్నారులు, మహిళలు ఉన్నారు. అగ్నిపర్వతం నుంచి భారీగా బూడిద వెలువడు తుండటంతో గ్వాటెమాలాలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. మరోవైపు ముందస్తు చర్యల్లో భాగంగా సమీప గ్రామాలకు చెందిన 3వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని జాతీయ విపత్తు సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు. -
వందేళ్లలో ఇదే భారీ విస్పోటనం
పహోవా, హవాయి : ఈ నెల మూడున హవాయి ద్వీపంలోని కిలౌయిలో అగ్ని పర్వతం బద్దలయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి నేటి వరకూ అంటే దాదాపు నాలుగు వారాలుగా లావా వెలువడుతూనే ఉన్నది. కిలౌయి అగ్ని పర్వతం నుంచి బయటకు వస్తున్న లావాతో హవాయి వీధులన్నీ పూర్తిగా కప్పబడ్డాయి. చాలా నివాస గృహాలు నాశనం అయ్యాయి. స్థానికులు ఆ ప్రదేశాన్ని విడిచి సురక్షిత ప్రాంతాలకు చేరాలని అధికారులు కోరుతున్నారు. బిగ్ ఐలాండ్లో ఉన్న లీలాని ఎస్టేట్స్ హౌసింగ్ డెవలప్మెంట్కు సమీపాన ఉన్న ఈ కిలౌయి అగ్నిపర్వతం విస్పోటనం చెందడంతో విధ్వంసకర రీతిలో లావా వెలువడుతుండటంతో ఈ ప్రాంతంలోని ఇళ్లు పూర్తిగా నాశనమయ్యాయి. ఈ నెల 3న విస్పోటమయిన ఈ అగ్నిపర్వతం వల్ల నాశనమయిన ఇళ్ల సంఖ్య తొలుత 50 కాగా ప్రమాద తీవ్రత పెరగడం వల్ల ఇది 80కు చేరుకుందని ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ తెలిపింది. అంతేకాక దాదాపు 890 హెక్టార్ల(2,200) విస్తీర్ణం మేర లావా వ్యాపించిందని తెలిపింది. గత వంద సంవత్సరాలలో ఇదే అతి పెద్ద భారీ విస్పోటనమని, నష్టం కూడా పెద్ద మొత్తంలో వాటిల్లిందని ప్రకటించింది. దాదాపు 37 ఇళ్ల చుట్టూ లావా పేరుకుపోయింది. ఆ ఇళ్లలో ఇంకా ఎవరైనా ఉంటే వారు బయటకు రావడానికి వీలులేకుండా దాదాపు 30 మీటర్ల ఎత్తు వరకు లావా వ్యాపించిందని తెలిపింది. మొత్తం అగ్ని పర్వతంలో ఉన్న లావాలో, ప్రస్తుతం బయటకు వస్తున్నది చాలా కొద్దిశాతమేనని, ఈ కొద్ది మొత్తానికే పరిస్థితి ఇలా ఉంటే, ఇక మొత్తం లావా బయటకు ప్రవహిస్తే పరిస్థితిని ఊహించలేమని అమెరికా జియలాజికల్ డిపార్టుమెంటు ఆందోళన వ్యక్తం చేసింది. ఇకైక అనే వ్యక్తి ఈ అగ్ని పర్వత విస్పోటనాన్ని వీడియో తీసి ఫేస్బుక్లో పోస్టు చేశాడు. దానిలో అతను ‘అగ్నిపర్వతం నుంచి వెలువడిని లావా ఈ దారిలో ఉన్న 8 ఇళ్లను కేవలం 12 గంటల్లో నామరూపాలు లేకుండా చేసింది . ఇక్కడే మా సోదరుని ఇళ్లు కూడా ఉంది. కానీ ఇప్పుడు దాన్ని కనీసం గుర్తుపట్టడానికి కూడా వీలు లేనంతగా మారిపోయింద’న్నాడు. -
అగ్నిపర్వతం దెబ్బ.. కారు క్షణాల్లో కరిగిపోయింది
హవాయి : అగ్నిపర్వతం పేలితే ఎలా ఉంటుందో ఇప్పటి వరకూ చాలా మంది పుస్తకాల్లో చదివి ఉంటారు. మరికొందరు సినిమాల్లోనో చూసి ఉంటారు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. టెక్నాలజీ పెరిగింది. ఎక్కడ ఏం జరుగుతుందో క్షణాల్లో తెలుసుకుంటున్నారు. అలాగే హవాయి దేశంలోని కిలౌయి లోని అగ్నిపర్వతం పేలడం.. అది సృష్టించిన విధ్వంసం వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సంఘటనలో సుమారు 2వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వందల సంఖ్యలో ఇళ్లు, భవనాలు, క్షణాల్లో బూడిదై పోయాయి. అగ్ని పర్వతం నుంచి వచ్చిన లావా గాల్లో సుమారు 70 మీటర్ల ఎత్తుకు ఎగసి పడుతోంది. అంతేకాకుండా దీని కారణంగా చుట్టు పక్కల ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. లావా ఎలా పరుగులెడుతుందో చూడండి. దారి పక్కన నిలిపిఉన్న కారును క్షణాల్లో కాల్చి బూడిద చేసేసింది. పరిసర ప్రాంతాలను దగ్ధం చేస్తున్న లావా.. కాలిపోతున్న గృహాలు రోడ్డుపై ప్రవహిస్తున్స లావా -
అగ్నిపర్వతం దెబ్బ.. కారు క్షణాల్లో బూడిదైపోయింది
-
మౌంట్ సినబంగ్.. భారీ పేలుడు చూడండి
జకార్త : అగ్ని పర్వతాల రాజ్యం ఇండోనేషియాలో మరోసారి ప్రజలు వణికిపోతున్నారు. మౌంట్ సినబంగ్ అగ్నిపర్వతం బద్ధలు కావటమే ఇందుకు కారణం. సోమవారం ఇది సంభవించంగా.. ఆ ప్రభావంతో వాతావరణంలో విషవాయువుల స్థాయి తారాస్థాయికి చేరుకుంది. ఫిబ్రవరి 19న ఈ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పర్వత రూపు రేఖల్లో సమూల మార్పులు సంభవించగా.. లావా సుమారు 5 కిలోమీటర్లపాటు ప్రయాణించింది. పర్వతం వెదజల్లిన బూడిద సుమారు 162 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతంలో పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం వాటిల్లలేదని ఇండోనేషియా విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది. ఇండోనేషియాలో ఉన్న 120 అగ్ని పర్వతాలలో సినబంగ్ ఒకటి. 2010లో ఇది రగులుకోవటం ప్రారంభించింది. ఇక నాసా ఈ విధ్వంసంపై ఓ ప్రకటన విడుదల చేసింది. అగ్ని పర్వతం నుంచి వెలువడే వాయువుల్లో సల్ఫర్ డై యాక్సైడ్ పరిమాణం ఎక్కువగా ఉందని పేర్కొంది. దీంతో అధికారులు ఇళ్ల నుంచి బయటకు రాకపోవటమే మంచిదని ప్రజలకు సూచిస్తున్నారు. ఇక పేలుడు సమయంలో ఓ స్కూల్ వద్ద పిల్లలు ఆసక్తిగా గమనించటం.. మరికొందరు హహాకారాలు చేస్తున్న వీడియో ఒకటి నెట్లో వైరల్ అవుతోంది. -
మౌంట్ సినబంగ్.. భారీ పేలుడు చూడండి
-
ముంచుకొస్తున్న ప్రళయాగ్ని!
పది కిలోమీటర్ల వెడల్పు.. అర కిలోమీటర్కుపైగా ఎత్తున్న సొరంగం.. టిక్..టిక్..టిక్మంటూ కాలం గడుస్తోంది.. ఉన్నట్టుండి అకస్మాత్తుగా.. కళ్లుమూసి తెరిచేలోగా... సొరంగంలోని లావా కాస్తా ఒక్కపెట్టున పైకి ఎగజిమ్మింది... ఏమిటిది? ఇదేదో సస్పెన్స్ సినిమా కథ అనుకునేరు! అక్షరాలా వాస్తవం. సముద్రపు అడుగున వేల ఏళ్లపాటు నిద్రాణంగా ఉన్న ఓ అగ్నిపర్వతం క్రియాశీలకమైందని.. ముందస్తు హెచ్చరికల్లేకుండా ఎప్పుడైనా పేలిపోవచ్చునని చెబుతున్నారు జపాన్ శాస్త్రవేత్తలు. ఈ విపత్తుతో కనీసం 10 కోట్ల మంది ప్రాణాలకు ముప్పు ఉందని హెచ్చరిస్తున్నారు. ఎక్కడిది? జపాన్ దక్షిణ ప్రాంతంలో కికాయి కాల్డెరా అనే పేరుతో ఓ అగ్నిపర్వతముంది. భూమ్మీద కనిపించేది కొంచెమే అయినా అడుగున భారీ సైజులో ఉంటుంది. 7,300 ఏళ్ల కింద బద్దలై లావా ఎగజిమ్మిందని.. ఫలితంగా అక్కడి జొమోన్ నాగరికత పూర్తిగా తుడిచి పెట్టుకుపోయిందని చరిత్రకారుల అంచనా. ఎలా తెలిసింది..? జపాన్లోని కోబె విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఇటీవల ఈ అగ్నిపర్వత ప్రాంతాన్ని నిశితంగా పరిశీలించారు. ఫుకేమరూ అనే పరిశోధక నౌకతో అగ్నిపర్వత ప్రాంతానికి వెళ్లిన శాస్త్రవేత్తలు సముద్రపు అడుగుభాగంలో ఓ భారీ లావా గోపురాన్ని గుర్తించారు. ఈ గోపురం వేల ఏళ్లుగా పేరుకుపోయిన లావా పరిమాణం కొంచెం అటూ ఇటుగా 32 ఘనపు కిలోమీటర్లు! అంటే 32 పక్కన 12 సున్నాలు పెడితే వచ్చే సంఖ్యలో ఉన్నన్ని లీటర్ల లావా అన్నమాట! ఏం జరుగుతుంది..? ఇది ఆషామాషీ సైజున్న అగ్నిపర్వతం కాదు. పైగా వేల ఏళ్లుగా నిద్రాణంగా ఉన్నది. గతంలో ఎగసిన లావా కాస్తా అగ్నిపర్వతంపై పేరుకుపోవడంతో లోపల లావా తీవ్రమైన ఒత్తిడితో పేరుకుపోతూ వస్తోంది. జపాన్ శాస్త్రవేత్తలు సేకరించిన నమూనాల్లో రయోలైట్స్ అనే ప్రత్యేకమైన రాళ్లు ఉన్నాయి. ఈ రాళ్లు అందులో లావా ఇంకా ఉందనేందుకు నిదర్శనంగా పేర్కొంటున్నారు. లావా ఎగజిమ్మితే సల్ఫర్ డయాక్సైడ్తో కూడిన బూడిద కొన్ని కిలోమీటర్ల ఎత్తుకు చేరుతుంది. ఫలితంగా ధూళి మేఘాలు ఏర్పడి కొంతకాలం సూర్యుడి వెలుగు భూమిని చేరకుండా పోతుంది. దీంతో కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోతాయి. సముద్రపు అడుగున జరిగే ప్రక్రియ కాబట్టి సునామీ వచ్చి అమెరికా తీరాన్ని తాకుతుందని అంచనా. కికాయి అగ్నిపర్వతాన్ని మరింత అధ్యయనం చేయడం ద్వారా విస్ఫోటనం జరిగే సమయాన్ని అంచనా వేసేందుకు జపాన్ శాస్త్రవేత్తలు యత్నిస్తున్నారు. నిదర్శనాలేంటి? కికాయి అగ్నిపర్వతంలోని లావా మళ్లీ క్రియాశీలమైందని శాస్త్రవేత్తలు వేసిన అంచనాలు నిజమే అనేందుకు ఇప్పటికే కొన్ని సూచనలు కనిపిస్తున్నాయి. రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో చిన్న చిన్న అగ్నిపర్వతాలు పేలిపోతుండటమే కాకుండా.. ఊహించని రీతిలో వరుస భూకంపాలు వస్తున్నాయి. ఇండోనేసియా నుంచి మొదలుకుని ఫిలిప్పీన్స్, జపాన్, ఉత్తర, దక్షిణ అమెరికా పశ్చిమ తీరప్రాంతం మొత్తాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. ప్రపంచంలోనే అత్యధిక అగ్నిపర్వతాలు ఉన్న ప్రాంతం ఇదే. టెక్టానిక్ ప్లేట్ల క్రియాశీలత కారణంగా ఇక్కడ భూకంపాలు ఎక్కువగా సంభవిస్తాయి. అమెరికా తీరంలోని సెయింట్ ఆండ్రియాస్ ఫాల్ట్ వద్ద కూడా ఓ భారీ భూకంపం ఎప్పుడైనా రావచ్చని అంచనాలు చాలాకాలంగా ఉన్నాయి. -
ఫిలిపీన్స్లో బద్దలైన అగ్నిపర్వతం
-
బద్ధలైన అగ్నిపర్వతం.. టెన్షన్.. టెన్షన్
లెగజ్పీ : పిలిప్పీన్స్లో బద్ధలైన అగ్నిపర్వతం అక్కడి ప్రజలను అతలాకుతలం చేస్తోంది. అక్కడి ప్రభుత్వాన్ని పరుగులు పెట్టిస్తోంది. దాని తీవ్రత కారణంగా మూడు నెలలపాటు దాని చుట్టుపక్కల అత్యవసర పరిస్థితి విధించారు. అందుకు తగిన ఏర్పాట్లు చేసేందుకు అక్కడి ప్రభుత్వం ప్రయాసపడుతుంది. ఇప్పటికే దాదాపు 81,000 మంది వేర్వేరు ప్రాంతాలకు తరలించి షెల్టర్లలో ఆశ్రయం కల్పించారు. పిలిప్పీన్స్లోని సెంట్రల్ ఆల్బే ప్రావిన్స్లోగల మేయాన్ అగ్ని పర్వతం బద్ధలైంది. నాలుగో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. దీని ప్రకారం అతి ప్రమాదానికి కొద్ది దూరంలోనే ఉన్నట్లు అర్థం. అందులో నుంచి భారీ ఎత్తున లావా ఎగిసిపడుతోంది. దాని తీవ్రత ఎక్కువగా ఉండటంతో ముందస్తు భద్రతా చర్యల్లో ప్రభుత్వం లీనమైంది. అగ్నిపర్వతం చుట్టుపక్కల నుంచి ఖాళీ చేయించిన వారిని దాదాపు మూడు నెలలపాటు సంరక్షించాల్సిన బాధ్యత తమపైనే ఉందని, అందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ దేశ విపత్తు నిర్వహణా అధికారులు చెప్పారు. ఆహారం అందించే విషయంలో తమకు ఎలాంటి బెంగలేదని, వాతావరణ పరిస్థితులు, శిబిరాల్లో ఉన్నవారి ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు తీసుకొస్తుందోనని కొంత ఆందోళనగా ఉందని తెలిపారు. 69 పునరావాస శిబిరాల్లో దాదాపు 80వేలమందికి పైగా ఉంచామని చెప్పారు. -
అగ్నిపర్వతంపై ఏలియన్లు
-
అగ్నిపర్వతంపై ఏలియన్లు
గ్రహాంతర వాసులు భూమ్మీద మనతో పాటు తిరుగుతున్నారా? మన చుట్టూనే ఉంటున్నారా? మనిషి అడుగు పెట్టేందుకు సైతం భయపడే ప్రాంతాల్లో సంచరిస్తున్నారా? బద్దలవుతున్న అగ్నిపర్వతం.. వేగంగా ప్రవహిస్తున్న లావా మధ్యలో ఏలియన్లు ఎలా తిరగగలుగుతున్నారు? సగటు వ్యక్తి నుంచి సైంటిస్టుల వరకూ భయపెట్టే ఈ ఘటన ఎక్కడ జరిగింది? వంటి వివరాలు తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే. వాషింగ్టన్ : అమెరికాలోని ఎల్లోస్టోన్ అగ్నిపర్వతం రెండునెలల కిందట బద్దలైంది. అప్పటినుంచి ఈ పర్వతం నిప్పురవ్వలను వెదజల్లుతూ.. లావా కిందకు ప్రవహిస్తోంది. అగ్నిపర్వతం వేడికి సమీప ప్రాంతాల్లోకి వెళ్లేందుకు జనాలు భయపడుతున్నారు. అకాశంలో కూడా 40 వేల అడుగుల ఎత్తులోనే ప్రయాణించడానికి సాధ్యమవుతోంది. ఈ అగ్ని పర్వతం బద్దలైన సమయంలో ఆ ప్రాంతంలో 2.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఒక ఫ్లయింగ్ సాసర్.. అగ్నిపర్వతం, లావాకు దగ్గరగా తిరిగింది. అంతేకాక అగ్నిపర్వతం లోపలిదాకా వెళ్లడం, లావా మీద ఏవో ఆకారాలు నడుస్తున్నట్లు కనిపించింది. ఇది కచ్చితంగా మానవ జాతికి అత్యంత ప్రమాదకర సంకేతాలను పంపేదే అని సైంటిస్టులు అంటున్నారు. ఒక కాంతిపుంజం ఆకారంలోని ఆబ్జెక్ట్ను స్పష్టంగా వీడియోల్లో చూడవచ్చు. ప్రస్తుతం ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్న ఈ వీడియో జూన్ 9న రికార్డయినట్లు తెలుస్తోంది. ఈ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ను అగ్నిపర్వతాన్ని పరిశీలిస్తున్న శాటిలైట్ రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. జూన్ - ఆగస్టు మధ్య కాలంలో పలు ఫ్లయింగ్ ఆబ్జెక్ట్లను పలు శాటిలైట్లు గుర్తించాయి. ఇదిలా ఉండగా ఎల్లోస్టోన్ అగ్నిపర్వతం వయసును అంచనా వేయలేమని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే ఈ అగ్నిపర్వతం ప్రతి 6 లక్షల సంవత్సరాలకోసారి బద్దలవుతుందని సైంటిస్టులు తెలిపారు. ఎల్లోస్టోన్ అగ్నిపర్వతానికి చాలా సార్లు గ్రహాంతరవాసులు టూరిస్టుల్లా వచ్చి వెళ్లారని.. ప్రముఖ సైంటిస్ట్ స్కాట్ తెలిపారు. ఎల్లోస్టోన్కు గ్రహాంతరవాసులకు ఉన్న సంబంధంపై పరిశోధనలు చేయాల్సిన అవసరముందని ఆయన అన్నారు. -
భూతల నరకం
భూతల నరకం అనే మాటను విని ఉండకపోవచ్చు గానీ... చూడవచ్చు! . ఇథియోపియాలోని ‘ఎర్టా ఆలే’ను భూతల నరకం (గేట్ వే ఆఫ్ హెల్) అని పిలుస్తారు. భూమి అంతర్గత పొరల్లో ఉండే తీవ్రమైన ఉష్ణోగ్రత వల్ల రాళ్లు సైతం కరగి ద్రవరూపంలోకి మారుతాయి. ఇలా కుతకుతలాడిపోయే రాతి ద్రవాన్ని లావా అంటారన్న విషయం తెలిసిందే. ఎర్టా ఆలే అన్నది నిజానికి ఒక అగ్నిపర్వతం. అయితే దీని వాలు మరీ ఎక్కువగా ఉండదు. దీని ఎత్తు కేవలం 613 మీటర్లు మాత్రమే. అయితే వాలు తక్కువగా ఉన్న దీని ముఖద్వారం (క్రేటర్) నుంచి లావా ఉడికిపోతూ పైకి ఉబుకుతూ ఉంటుంది. ఈ లావా అంతా ఒక ద్రవరూప అగ్నిసరస్సులా ఉంటుంది. ప్రపంచంలోని ప్రాచీన అగ్నిసరస్సులలో ఇది కూడా ఒకటి. 1906 నుంచి రగులుతూనే ఉంది.శాస్త్రీయ వాస్తవాలతో సంబంధం లేకుండా ఈ అగ్నిసరస్సు చుట్టూ ఎన్నో కాల్పనిక కథలు ఉన్నాయి. -
బద్దలైన అగ్నిపర్వతం
జకర్తా: ఇడోనేషియాలో మౌట్ ఎగాన్ అగ్ని పర్వతం విస్ఫోటనమైంది. తూర్పు న్యూసా టెంగ్గారా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ అగ్నిపర్వతం వేడి బూడిదతో పాటు విషపూరిత వాయువులను వెదజిమ్ముతున్నట్లు విపత్తు నిర్వహణ సంస్థ బుధవారం ప్రకటించింది. దీనికి సమీప ప్రాంతంలో నివసిస్తున్న సుమారు వెయ్యి మంది ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. మౌట్ ఎగాన్ గత డిసెంబర్ నుండి అడపాదడపా చిన్న చిన్న విస్ఫోటనాలు జరుపుతున్నా బుధవారం విస్పోటనం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సమీప గ్రామంలోని 500 మంది ప్రజలు మాత్రం తమ నివాసాలు ఖాళీ చేయడానికి అంగీకరించలేదని చైనా వార్తా సంస్థ సిన్హువా తెలిపింది. 2008లో మౌంట్ ఎగాన్ భారీ విస్ఫొటనం సమయంలో 6000 మంది సమీప ప్రాంత ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఇండోనేషియాలో ఉన్న 129 క్రియాశీలక అగ్నిపర్వతాలలో మౌంట్ ఎగాన్ ఒకటి. -
జపాన్లో బద్దలైన అగ్నిపర్వతం
క్యూషూ: జపాన్లోని మౌంట్ అసో అగ్నిపర్వతం సోమవారం బద్దలైంది. ఈ పేలుడు దాటికి ఆకాశంలోకి 2 కి.మీ ఎత్తున బూడిద ఎగిసిపడుతోంది. దీంతో దాదాపు 18 విమానసర్వీసులు నిలిచిపోయాయి. ప్రపంచంలోని క్రీయాశీలక అగ్ని పర్వతాల్లో మౌంట్ అసో ఒకటి. జపాన్ నైరుతి వైపున్న ఉన్న పర్యాటక ప్రాంతమైన క్యూషూ ద్వీపంలో అగ్ని పర్వతం పేలుడు చోటుచేసుకుంది. ఈ పేలుడులో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. 1592 అడుగులు ఎత్తుండే మౌంట్ అసో పర్వతాల్లో తరచుగా పేలుళ్లు సంభవిస్తుంటాయి. -
పొంగిపొర్లుతున్న వాల్కనో ద్వీపం
-
అగ్నిపర్వతం పేలి.. ఎయిర్ పోర్ట్ మూత
జకర్తా: ఇండోనేషియాలో మరో అగ్ని పర్వతం బద్దలైంది. జకర్తాలోని గామాలామా అగ్ని పర్వతం విస్ఫోటనం చెందడంతో అక్కడ ఉన్న దేశీయ విమానాశ్రయం సుల్తాన్ బాబుల్లా తాత్కాలికంగా మూసివేసి పలు సర్వీసులు నిలిపివేశారు. దీంతో స్థానిక ప్రయాణీకులు కొంత అవస్థలు ఎదుర్కున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించిన తర్వాతే విమానాశ్రయం తిరిగి తెరిచే విషయాన్ని ఆలోచిస్తామని స్థానిక రవాణాశాఖ అధికార ప్రతినిధి జేఏ బారతా తెలిపారు. గామాలామా విస్ఫోటనం మూలంగా దాదాపు 1,500 మీటర్ల మేరకు వాతావరణంలో దుమ్ముధూళి పేరుకుపోయిందని చెప్పారు. అగ్నిపర్వతం పేలిన సమయంలో ప్రకంపనలు కూడా వచ్చినట్లు అధికారులు తెలిపారు. -
బద్దలైన అగ్నిపర్వతం
-
నీ పని నీది.. నా పని నాది
ఈ చిత్రాన్ని చూడండి.. ఓ పక్క ఉత్పాతం ఉబికి వస్తుంటే తాపీగా తనపనేదో తాను చేసుకుంటున్నాడీ రైతు. ఈ దృశ్యం ఇండోనేసియాలోని ఉత్తర సుమత్రా దీవిలో శనివారం చోటుచేసుకుంది. ఇండోనేసియాలో ఉన్న 130 క్రియాశీలక అగ్ని పర్వతాల్లో ఒకటైన షినబంగ్.. 2010 నుంచి లావా వెదజల్లుతూనే ఉంది. దీనికి అలవాటు పడిన ప్రజలు 'నీపని నీది.. నాపని నాది' అనుకుంటూ తమ పనుల్లో నిమగ్నమైపోయారు. అయితే 400 ఏళ్ల తరువాత ఒక్కసారిగా శనివారం భారీ స్థాయిలో విస్ఫోటనం సంభవించింది. ఈ పేలుడు ధాటికి లావా, బూడిద దాదాపు 8530 అడుగుల ఎత్తుకు ఎగిసిపడ్డాయి. -
1,650 డిగ్రీలంటే మాడిపోవడమే...
ఇదేదో సినిమాల్లోని గ్రాఫిక్ సీన్ కాదు... అచ్చంగా నిజమైనదే.. 1,650 డిగ్రీల ఉష్ణోగ్రతతో సూరీడులా భగభఘ మండుతున్న లావాకు ఇంత దగ్గరగా వెళ్లడమంటే మాటలు కాదు మరీ. అయితే...అమెరికాలోని జార్జియాకు చెందిన ఫిల్మ్ మేకర్, సాహసికుడు శామ్ క్రాస్మన్ బృందం ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది. అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో సూక్ష్మ జీవులు ఎలా మనుగడ సాగిస్తాయనే అంశంపై పరిశోధనలో భాగంగా మారూమ్ అగ్నిపర్వత జలంలో ఉన్న లావా సరస్సుకు సమీపంలోకి వెళ్లాలని ఈ బృందం నిర్ణయించింది. ప్రపంచంలో లావా సరస్సులు ఏడే ఉన్నాయి. అందులో వాన్వాట్ దేశంలో ఉన్న ఈ లావా సరస్సు కూడా ఒకటి. అయితే..సరస్సు వద్దకు వెళ్లడమంటే ప్రాణాలకు తెగించడమే. 45 డిగ్రీలంటేనే మనం అల్లాడుతాం. అలాంటిది 1,650 డిగ్రీలంటే మాడిపోవడమే. ఆమ్ల వర్షాలతో పాటు, విష వాయువులు వెలువడటం ఇక్కడ మామూలే. దీనికితోడు తమ ప్రాజెక్టు కోసం ఫోటోలు తీయడమంటే అసాధ్యమే. అయితే..ఫోటోలు, వీడియో చిత్రీకరణ కోసం వారు డ్రోన్లను వాడారు. అత్యంత వేడిని తట్టుకునేలా రూపొందించిన ప్రత్యేక సూట్లను ధరించారు. -
ప్రాన్స్ లో బద్ధలైన అగ్నిపర్వతం
-
అగ్నిపర్వతం బిలంలోనే ఆ గ్రామం
టోక్యో: అంతర్గతంగా కుతకుత ఉడుకుతున్న ఓ ఉష్టమండల అగ్ని పర్వతం బద్దలైతే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో తెల్సిందే. అలాంటి ఓ అగ్నిపర్వతం బిలంలోనే ఓ కుగ్రామం ఉందంటే, అందులో 205 మంది ధైర్యంగా నివసిస్తున్నారంటే ఆశ్చర్యమే. ఆ అగ్ని పర్వతం, ఆ కుగ్రామం....జపాన్ రాజధాని టోక్యో నగరానికి 358 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఐజూ దీవుల సముదాయంలో భాగంగావున్న ఆ గ్రామం పేరు అగాషిమ. టోక్యో నగరం పాలనా యంత్రాంగం కిందనే అగాషిమ కొనసాగుతోంది. ఈ గ్రామంవున్న అగ్ని పర్వతాన్ని మూడో కేటగిరి కింద విభజించారు. ఇది ఎప్పుడైనా బద్దలయ్యే అవకాశం ఉంటుంది. 1780లో మొదటి సారి ఈ అగ్ని పర్వతం బద్దలైనప్పుడు గ్రామ ప్రజల్లో సగం మంది చనిపోయారు. మిగిలిన వారు సమీపంలోని దీవులకు వలసపోయారు. ఆ తర్వాత యాభై ఏళ్లకు వారిలో కొంత మంది తిరిగొచ్చి స్థిర నివాసం ఏర్పరుచుకున్నారని చరిత్ర చెబుతోంది. గ్రామస్థులు వేడినీళ్ల స్నానం చేయడానికి, వంట చేసుకోవడానికి వంట చెరకును వాడాల్సిన అవసరం లేదు. వేడి నీటి చెలిమల్లోనే వారు స్నానం చేస్తారు. మరీ తుక తుక ఉడుకుతున్నట్టు బుసబుస పొంగే చిన్న చిన్న నీటి గుంటలపై ఎలాంటి ఖర్చు లేకుండా వంట చేసుకుంటారు. ఉడకబెట్టిన గుడ్లు, బంగాళ దుంపలు, ఇతర కూరగాయలు వారి ప్రధాన ఆహారం. ప్రపంచానికి సంబంధం లేనట్టు ఉండే ఈ గ్రామానికి 1993 వరకు ఎలాంటి రవాణా సౌకర్యాలు లేవు. నౌకలను లంగరు వేసే అవకాశాలు కూడా లేకపోవడంతో టోక్యో నగరం 1993లో రోజుకు ఒక హెలికాప్టర్ సర్వీసును ఏర్పాటు చేసింది. ఆ హెలికాప్టర్లో కేవలం తొమ్మిది మంది ప్రయాణిలను తీసుకెళతారు. పేరుకు రోజువారి సర్వీసేగానీ ఆ హెలికాప్టర్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు వెళుతుందో ఎవరూ చెప్పలేరు. వాతావరణ పరిస్థితులు సక్రమంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ సర్వీసు నడుస్తుంది. అగ్నిపర్వతం నుంచి వెలువడే దట్టమైన పొగ, గ్యాస్ కారణంగా అక్కడ హెలికాప్టర్ దిగే పరిస్థితులు అన్ని వేళలా ఉండవు. టోక్యో పాలనా యంత్రాంగం హెలికాప్టర్ సర్వీసును ప్రారంభించిన తర్వాత వారికి భూగర్భం నుంచి వెలువడే జియోథర్మల్ స్ట్రీమ్ను ఉపయోగించి విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసింది. అక్కడి వారి పిల్లల కోసం ఒక ప్రాథమిక పాఠశాలను కూడా నడుపుతోంది. అందులో ప్రస్తుతం 25 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. హై స్కూల్కు వెళ్లాలంటే వారు టోక్యో నగరానికి వెళ్లాల్సిందే. అలా చదువుకోవడానికి వెళ్లిన విద్యార్థుల్లో 99 శాతం మంది టోక్యో నగరంలోనే స్థిరపడుతున్నారట. వెనక్కి రావడం లేదట. అందుకని భారత్లో పెళ్లి కూతురును అత్తారింటికి పంపుతున్నట్టు విద్యార్థులను వారు ఘనంగా చదువు కోసం సాగనంపుతున్నారు. -
అగ్నిపర్వతం పేలితే.. భూమి చల్లబడుతుంది!
తెల్లని పొగ, నల్లని బూడిదను ఆకాశంలోకి ఎగజిమ్ముతున్న రష్యాలోని సరిచెవ్ పీక్ అగ్నిపర్వతమిది. అంతరిక్ష కేంద్రం నుంచి వ్యోమగాములు గతంలో తీసిన ఫొటోల్లో ఇది ఒకటి. అయితే.. ఇలాంటి స్వల్ప అగ్నిపర్వత పేలుళ్ల వల్ల భూగోళం చల్లారుతుందని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో శాస్త్రవేత్తలు చెప్తున్నారు అగ్ని పర్వతాలు విడుదల చేసే బూడిద, ధూళికణాలు వాతావరణంలోకి చేరి.. సూర్యరశ్మిని వెనక్కి పంపేసి భూమిని చల్లబరుస్తాయని వీరి అధ్యయనంలో వెల్లడైంది. -
అగ్నిపర్వతం ప్రళయం
-
42 ఏళ్ల తర్వాత బద్ధలైన అగ్ని పర్వతం
శాంటిగో: చిలీలో మరో అగ్ని పర్వతం బద్ధలైంది. దాదాపు 42 సంవత్సరాల తర్వాత కాల్బుకో అనే అగ్ని పర్వతం గతంలో లేనంత స్థాయిలో విస్ఫోటనం చెందింది. దీంతో, దాదాపు 1,500 మందిని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే, ఇందులో నుంచి దట్టమైన పొగలు మాత్రమే రావడం తప్ప పెద్దగా లావాలుగానీ, అగ్ని జ్వాలలుకానీ రాకపోవడంతో అక్కడి అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ముందస్తు జాగ్రత్తతో అప్రమత్తత ప్రకటించారు. అసలు తాము కాల్బుకో అగ్ని పర్వతం తమ దృష్టిలో లేదని, అది పేలుతుందన్న ఆలోచన కూడా తమకు రాలేదని అక్కడి భూగర్భ శాస్త్రవేత్తలు చెప్పారు. 1972లో ఒకసారి కాల్పుకో బద్ధలైంది. చిలీలో మొత్తం 90 అగ్ని పర్వతాలు ఉండగా అందులోని అత్యంత ప్రమాదమైన మూడు అగ్ని పర్వతాల్లో ఇదొకటి. -
నిప్పులు చిమ్ముతూ...
మెక్సికో: అగ్నిపర్వతం నిప్పులు చిమ్మడం.. అందులోంచి మెరుపులు రావడం.. ఫొటో సూపర్గా ఉంది కదూ. మెక్సికోలోని కొలిమా అగ్నిపర్వతం తాజాగా లావా చిమ్మడం మొదలుపెట్టినప్పుడు అధికారులు సమీప ప్రాంతాల వారందరినీ అక్కడి నుంచి తరలించారట. అయితే, కెర్నాంటెస్ అనే ఫొటోగ్రాఫర్ మాత్రం అక్కడ్నుంచి కదల్లేదు. దాదాపు 8 గంటలపాటు నిరీక్షించి మరీ.. ఈ అద్భుత చిత్రాన్ని క్లిక్మనిపించాడు. -
నిప్పులు కక్కుతూ కిందికినే ఉరుకుతుంటే!
అగ్నికీలల్ని ఆకాశంలోకి రువ్వుతున్న ఈ అగ్ని పర్వతం పేరు విల్లారికా. చిలీలోని శాంటియాగో పట్టణ సమీపంలో ఉన్న ఈ అగ్ని పర్వతం భారీగా మంగళవారం నిప్పులు కక్కింది. పెద్ద ఎత్తున లావా, బూడిద వెదజల్లడంతో సమీప ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. దగ్గర ప్రాంతాల్లోని స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
వారి తలరాతలు బాగున్నాయి...
ఫొటో చాలా కలర్ఫుల్గా, అద్భుతంగా ఉంది కదూ? ఫొటోయే కాదు.. ఆ విమానంలో ఉన్నవారి తలరాత కూడా చాలా బావుంది. అందుకే పెద్ద ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. ఐస్లాండ్లోని హోలుహ్రౌన్ ప్రాంతంలో ఉన్న అగ్నిపర్వతంపై సరదాగా చక్కర్లు కొట్టాలని కొందరు సందర్శకులు ఈ విమానంలో బయలుదేరారు. సరిగ్గా అగ్నిపర్వతం దగ్గరకు వెళ్లేసరికి అది బద్దలై ఒక్కసారిగా లావా ఇంతెత్తున లేచింది. దాదాపు 850 డిగ్రీల సెల్సియస్ వేడితో ఉన్న లావా.. ఏకంగా 200 మీటర్ల ఎత్తుకు పెల్లుబికింది. అయితే అదృష్టం కలిసిరావడంతో ఈ విమానానికి ఎలాంటి ముప్పూ వాటిల్లలేదు. అదే సమయంలో ఈ అగ్నిపర్వతం చుట్టూ చక్కర్లు కొడుతున్న మరో విమానంలో నుంచి బల్దూర్ అనే వ్యక్తి ఈ చిత్రాన్ని చకచకా కెమెరాలో బంధించారు. -
లావా.. వహ్వా..
సీన్ అదిరింది కదూ.. అగ్నిపర్వతం బద్దలై.. నీలి రంగులో లావా వెలువడతున్న ఈ అద్భుత దృశ్యాన్ని మీరెక్కడైనా చూశారా? ఇండోనేసియాలోని తూర్పు జావా ప్రాంతంలో ఉన్న కావాహిజెన్ అగ్ని పర్వతం వద్దకు వెళ్తే.. అక్కడ మీరీ సన్నివేశాన్ని వీక్షించవచ్చు. దీనికి కారణమేమిటంటే.. ఈ ప్రాంతంలో గంధకం ఎక్కువగా ఉండటం వల్ల నీలి రంగులో మంటలు వెలువడతాయి. ఇందులోని కొన్ని వాయువులు ద్రవరూపంలోకి మారి.. ఇలా లావాలా వెలువడతాయి. అంతే తప్ప.. ఇది నిజమైన లావా కాదని నిపుణులు చెబుతున్నారు. -
లావా ప్రవాహంతో ఇల్లు బుగ్గి...
అమెరికాలోని హావాయి దీవిలో జూన్ 26న బద్దలైన కెలియా అగ్నిపర్వతం నుంచి నెమ్మదిగా దిగువకు ప్రవహిస్తున్న లావా సోమవారం మధ్యాహ్నం ఓ ఇంటిని ఇలా దహించివేసింది. పహోవా గ్రామంలోని ఈ ఇల్లు నిమిషాల వ్యవధిలోనే బూడిదైపోయింది. అగ్నిపర్వతం నుంచి నెమ్మదిగా ప్రవహిస్తున్న లావా అక్టోబర్ 26న ఓ రోడ్డును దాటుకుని ఈ గ్రామ సమీపంలోకి చేరి సోమవారం ఇలా తొలి ఇంటిని బూడిద చేసింది. స్థానికులను సురక్షిత ప్రాంతానికి తరలించడంతో పాటు ఇతర ఇళ్లకు లావా చేరకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. -
కొంచెం నీరు.. కొంచెం నిప్పు..
అగ్నిపర్వతం పేలి లావా సముద్రుడిలో ఒదిగిపోతున్న అద్భుత సన్నివేశం.. నీరు, నిప్పు కలుస్తున్న సమయంలో బుస్సుమంటూ లేస్తున్న పొగలు.. ఈ ఫొటోను అమెరికాకు చెందిన ఆండ్రూలీ తీశారు. నేచురల్ హిస్టరీ మ్యూజియం, బీబీసీ వారు కలిసి నిర్వహించిన వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్-2014లో ‘ప్రకృతి సృష్టించిన డిజైన్’ కేటగిరీలో ఇది ఫైనలిస్టుగా నిలిచింది. హవాయిలోని హిలో పట్టణ సమీపంలో అగ్నిపర్వతం పేలి లావా సముద్రంలో కలవడం గత కొన్నేళ్లలో ఇదే తొలిసారని.. ఆ విషయం తెలియగానే తానక్కడికి చేరుకున్నానని.. భారీ వర్షం, గాలుల మధ్య ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి.. ఈ చిత్రాన్ని తీశానని ఆండ్రూలీ చెప్పారు. -
నిజాలు దేవుడికెరుక: ఎలా ఉన్నవారు అలా శిలలైపోయారు!
అది 1599వ సంవత్సరం. ఇటలీలోని క్యాంపీనియాకి దగ్గర్లో ఉన్న ఒక అతి పెద్ద రాతి ప్రదేశంలో ఓ ముప్ఫైమంది కూలీలు తవ్వకాలు జరుపుతున్నారు. సర్నో నది నీటిని మళ్లించేందుకు గాను భూగర్భంలో ఓ కాలువను తవ్వుతున్నారు. ‘‘కానివ్వండి కానివ్వండి. మూడు రోజుల్లో పని ముగించాలి. ఇంత నెమ్మదిగా చేస్తే ఎలా?’’... పనివాళ్లని తొందర పెడుతున్నాడు కాంట్రాక్టర్ ఆల్బెట్రో. ‘‘చేస్తూనే ఉన్నాం కదరా, కంగారు పెడతాడెందుకు?’’... విసుక్కున్నాడు ఎన్జో. ‘‘ఎప్పుడూ అంతే కదరా... పట్టించుకోకు’’ అన్నాడు నెవియో. ‘‘ఆ... ఆ... నువ్వు కూడా ఎప్పుడూ ఇంతే. ఎవరేమన్నా పట్టించుకోవద్దం టావ్’’... అంటూనే గునపాన్ని ఎత్తి భూమిలో దిగేశాడు ఎన్జో. ఒక్కసారిగా ఠంగ్మన్న శబ్దం వినిపించింది. ‘‘ ఇక్కడ ఏదో ఉందిరా. గునపం దిగట్లేదు. ఒకవేళ ఏదైనా నిధిగానీ ఉందేమో’’ ఆశగా అన్నాడు.‘‘మన ముఖాలకి నిధులు కూడా దొరుకుతాయా... ఏ రాయో అడ్డుపడి ఉంటుంది, గట్టిగా దించు గునపం.’’ పాంపేయ్ పట్టణాన్ని పునర్నిర్మించే ప్రయత్నాలు జరిగాయి. కానీ తొలగించలేనంతగా దుమ్ము పేరుకునిపోవటం చేత ఆ ప్రయత్నాలు ప్రయత్నాలుగానే మిగిలిపోయాయి. దాంతో ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి సందర్శనీయ స్థలంగా మార్చారు. అవశేషాలన్నింటినీ మ్యూజియంలో పెట్టారు. ద లాస్ట్ డేస్ ఆఫ్ పాంపేయ్, షాడోస్ ఇన్ బ్రాంజ్ వంటి పుస్తకాలు, పలు సినిమాలు, డాక్యుమెంటరీలు పాంపేయ్ విషాదాన్ని ప్రపంచం ముందుకు తీసుకొచ్చాయి. అయితే అవన్నీ వారి వారి ఊహలకు అనుగుణంగా ఉంటాయి! నెవియో మాటలకి ఓసారి నిట్టూర్చి మళ్లీ ప్రయత్నించాడు ఎన్జో. ఊహూ... గునపం లోనికి పోవడం లేదు. కాంట్రాక్టర్ని పిలిచి విషయం చెప్పాడు.‘‘ఇదో పెద్ద విషయమా? ఇదంతా రాతినేల కదా... ఏ బండరాయో ఉండి ఉంటుంది. తవ్వి తీసి పారేసేదానికి ఇంత హడావుడి చేయాలా’’... విసుక్కుంటూ మరో ఇద్దరిని పిలిచాడు కాంట్రాక్టర్. అందరూ కలిసి అడ్డును తొలగించాలని ప్రయత్నించారు. అది తొలగలేదు కానీ దాని చుట్టు పక్కల పది అడుగుల మేర నేల బీటలు తీసి కుంగిపోవడం మొదలైంది. అందరి గుండెలూ ఝల్లుమన్నాయి. గునపాలు వదిలేసి దూరంగా పరుగెత్తారు.వాళ్లు చూస్తూండగానే నేల కుంగిపోయి అక్కడో పెద్ద గుంత ఏర్పడింది. కాంట్రాక్టర్ ధైర్యం చేసి గోతి దగ్గరకు వెళ్లాడు. లోపల ఏముందోనని తొంగి చూశాడు. మరుక్షణం అతడి గుండె దడదడలాడింది. ‘‘అందరూ త్వరగా రండి’’... అరిచినట్టే అన్నాడు. పనివాళ్లంతా బిలబిలమంటూ వచ్చి గోతి చుట్టూ చేరారు. లోపలకు చూసిన వారి ఒళ్లు జలదరించింది. ఒకటి కాదు, రెండు కాదు... కనీసం పదిహేను అస్థిపంజరాలైనా ఉండి ఉంటాయక్కడ. కొన్నయితే మట్టిలో కూరుకుపోయి అక్కడక్కడా తెలతెల్లగా కనిపిస్తున్నాయి. అన్ని అస్థిపంజరాలు అక్కడికెలా వచ్చాయో అంతు పట్టలేదు. వెంటనే అధికారులకు విషయం తెలియజేశారు. వాళ్లు వచ్చి అస్థిపంజరాలను బయటకు తీస్తుండగా ఆ చుట్టూ ఉన్న మట్టిదిమ్మలన్నీ ఫెళఫెళా విరిగిపోవడం మొదలైంది. అడుగేస్తే నేల కుంగిపోతోంది. దాంతో ఆ నేలలో ఏదో మర్మం దాగివుందనిపించింది. వెంటనే అక్కడి నేల మొత్తాన్నీ తవ్వడం మొదలుపెట్టారు. కొన్ని గంటల తర్వాత అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి వారి వెన్నుపూసలోంచి వణుకు పుట్టుకొచ్చింది. దాదాపు పాతిక అడుగుల లోతుకు తవ్విన తర్వాత... అక్కడో పెద్ద ప్రపంచమే కనిపించింది. అదేదో పట్టణంలా ఉంది. పైకప్పు లేని మొండి గోడలు, సగం కూలిన ఇళ్లు ఉన్నాయి. అయితే అందరినీ షాక్కి గురి చేసిన విషయం ఒకటుంది. ఎక్కడ పడితే అక్కడ గుట్టలు గుట్టలుగా శవాలు ఉన్నాయి. రాళ్లలా బిగుసుకుపోయి, బూడిద రంగులో కనిపిస్తున్నాయి. పడుకుని, కూర్చుని, పరిగెడుతున్నట్టు... రకరకాల భంగిమల్లో ఉన్నాయవి. మొదట అవి సిమెంటు బొమ్మలో, రాతి బొమ్మలో అయివుంటాయనుకున్నారు. కానీ పరిశీలించగా తెలిసింది మానవ దేహాలని! అందరి బుర్రలూ తిరిగిపోయాయి. ఇక్కడో పట్టణం ఉండేదా? ఇలా ఎలా కప్పడిపోయింది? మనుషులంతా ఇలా గుంపులుగా ఎందుకు చనిపోయారు? యుద్ధం లాంటిదేమైనా జరిగిందా? అదే జరిగితే ఇలా రకరకాల భంగిమల్లో ఎలా ఉంటారు? ఉన్నవారు ఉన్నట్టుగా చనిపోయారంటే అసలేం జరిగివుంటుంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కనుక్కోవాలని నిర్ణయించుకున్నారు అధికారులు. కనుక్కున్నారు కూడా. వారు చెప్పిన విషయాలు విన్న తర్వాత యావత్ ప్రపంచం కదలిపోయింది. గుండెల్ని పిండేసే ఆ నిజ సంఘటనను చాన్నాళ్లు తలచుకుని తలచుకుని కుమిలిపోయింది. క్రీ.శ. 79. ఆగస్టు 24 సాయంత్రం.... పనులకు వెళ్లినవాళ్లంతా ఇళ్లకు తిరిగొస్తున్నారు. ఇల్లాళ్లంతా భోజనాలు సిద్ధం చేయడంలో మునిగిపోయారు. పిల్లలు వీధుల్లో ఆటలాడుతున్నారు. అందరూ ప్రశాంతంగా ఉన్నారు. ఆ ముందు రోజు చేసుకున్న అగ్నిదేవుడి పండుగ గురించి ఆనందంగా చర్చించుకుంటున్నారు. చీకట్లు కమ్ముకుంటున్నాయి. మామూలుగా అయితే ఆ సమయానికి వాతావరణం చల్లబడుతుంది. కానీ ఈ రోజు ఏదో తేడా. ఉక్కబోస్తోంది. వేడి మెల్లమెల్లగా పెరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. ఎందుకిలా ఉందా అని ఆలోచిస్తుండగానే పెద్ద శబ్దం! వంద అణు బాంబులు ఒక్కసారి పేలినట్టు... వెయ్యి ఉరుములు ఒక్కసారి ఉరిమినట్టు! ఆ శబ్దం.... జరగనున్న ఘోర విధ్వంసానికి ప్రారంభం. పాంపేయ్ అంతానికి ముహూర్తం. అందరూ ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందా అని భయంగా ముఖాలు చూసుకున్నారు. ఏం జరిగిందో అంచనా వేసే ప్రయత్నం చేశారు. అంతలోనే దట్టమైన పొగ పట్టణంలోకి చొరబడింది. అందరినీ చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేసింది. దుమ్ము వేగంగా ఎగిరొచ్చి పడుతోంది. అప్పుడర్థమయ్యింది వారికి ఏం జరిగిందో. ‘‘అగ్నిపర్వతం బద్దలైనట్టుంది’’ అన్నాడో వ్యక్తి భయంగా. అవును. అదే జరిగింది. పాంపేయ్ పట్టణానికి కాస్త దూరంలో ఉన్న వెసువియస్ అగ్నిపర్వతం బద్దలయ్యింది. దాని నుంచి దట్టమైన పొగ వెలువడుతోంది. లావా శరవేగంగా పర్వతం మీది నుంచి జారిపడుతోంది. పట్టణాన్ని తాకాలని పరుగులు తీస్తోంది. దుమ్ము, ధూళి ఎగసి పట్టణమంతా పరుచు కుంటున్నాయి. ఇదంతా ఎంత వేగంగా జరిగిందంటే... ఇప్పుడేం చేద్దాం అని పట్టణవాసులు ఇంకా మాట్లాడుకుంటూ ఉండగానే జరగరాని విధ్వంసం జరిగిపోయింది. లావా సునామీలా పాంపేయ్ని చుట్టేసింది. కొందరు భయంతో మూలల్లో దాగారు. కొందరు వాటి కిందా వీటి కిందా దూరి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. కానీ ఎవ్వరి ప్రయత్నాలూ ఫలించలేదు. లావా వారిని ముంచేసింది. క్షణాల్లో శిలల్లా మార్చేసింది. కొద్ది నిమిషాల్లోనే పాంపేయ్ నగరం నిప్పుల కుంపటిలా మారింది. అయితే లావా సృష్టించిన విధ్వంసంతో కథ ముగిసిపోలేదు. లావాను మించిన దుమ్ము, ధూళి పట్టణాన్ని ముంచెత్తింది. రెండు రోజుల పాటు అలా వచ్చి పడుతూనే ఉంది. దాదాపు ఇరవై అయిదు అడుగుల మేర పేరుకుపోయింది. దాని కింద పాంపేయ్ పట్టణం సమాధి అయ్యింది. ఈ ప్రపంచం నుంచి, ప్రపంచ పటం నుంచి మాయమైపోయింది. ఇదంతా పరిశోధకుల ఊహ! అగ్నిపర్వతం బద్దలవడం వల్లే పాంపేయ్ సర్వనాశనమయ్యింది, దాని నుంచి వెలువడిన దుమ్ము కిందే పట్టణం సమాధి అయ్యింది అనేది వాస్తవం. అయితే ఇంత దారుణంగా ఎలా జరిగింది అనేది మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే సాక్ష్యం చెప్పేందుకు ఏ ఒక్కరూ మిగల్లేదు. దాంతో పరిశోధనల్లో అవగతమైన విషయాలను బట్టి ఇలా జరిగివుంటుంది అని నిపుణులు అంచనా వేశారంతే. నిజానికి వెసువియస్ అగ్నిపర్వతం బద్దలైన విషయం పాంపేయ్కు కాస్త దూరంలో ఉన్న కొన్ని పట్టణాల వారికి తెలిసింది కానీ... పర్వతానికి అతి దగ్గరగా ఉన్న పాంపేయ్ పట్టణం ధ్వంసమై పోయిందన్న విషయం చాలాకాలం వరకూ ఎవరికీ తెలియలేదు. ఎందుకంటే... పర్వతం చల్లబడేవరకూ ఆ చుట్టుపక్కలకు ఎవ్వరూ పోలేదు. కొన్నాళ్ల తర్వాత వెళ్లిచూసిన వారికి పాంపేయ్ కనిపించలేదు. ఉన్నట్టుండి ఒక పట్టణం మాయం ఎలా అయ్యిందో అర్థమూ కాలేదు. కొన్నాళ్లు దాని గురించి చర్చించుకున్నారు. మెల్లగా మర్చిపోయారు. దాంతో పాంపేయ్ గురించి తర్వాతి తరాల వారికి తెలియకుండా పోయింది. 1599లో తవ్వకాల్లో బయటపడిన తర్వాతే పాంపేయ్ అనే ఒక పట్టణం ఉండేదన్న విషయం ప్రపంచానికి తెలిసింది. అయితే అందరినీ కలచివేసిన విషయం ఏమిటంటే... శవాలు పడివున్న తీరు. ఎలా ఉన్నవాళ్లు అలా శిలలైపోయారు. పడుకున్నవాళ్లు పడుకున్నట్టే ఉన్నారు. నడుస్తున్నవాళ్లు నడుస్తున్నట్టే ఉన్నారు. భయంతో ముడుచుకుని కూచుని, మోకాళ్ల మీద తల పెట్టుకుని ఉన్న ఓ మహిళ శిలాజాన్ని చూసినప్పుడు పరిశోధకులకు సైతం కళ్లు చెమర్చాయి. తల్లి పక్కలో ఒత్తిగిలి పడుకుని ఉన్న చిన్నారి, వేడిమిని తాళలేక మెలికలు తిరిగిపోతూ మరణించిన కుక్క, నిద్ర పోవడానికి ఒరుగుతూ ఒరుగుతూ ప్రాణాలు విడిచిన వ్యక్తి, పరుగు పెడుతూ శిల అయిపోయిన పిల్లాడు... చూసినవాళ్ల గుండెలు కరిగి నీరయ్యాయి. చరిత్రలో ఎన్నడూ కనీ వినీ ఎరుగని ఆ ఘోరకలి ఇది. సిరి సంపదలతో, సంతోష సౌభాగ్యాలతో విలసిల్లిన పాంపేయ్ కథ... ఓ కన్నీటి గాథగా, విషాదభరిత జ్ఞాపకంగా చరిత్రలో మిగిలిపోయింది! - సమీర నేలపూడి -
ఇండొనేసియాలో అగ్నిపర్వతం బద్దలు
జకార్తా : ఇండొనేసియాలో అగ్నిపర్వతం బద్దలై లావా పెల్లుబికింది. ఉత్తర సుమత్రా దీవిలోని కారో జిల్లాలో ఉన్న సీనాబంగ్ అగ్ని పర్వతం నుండి ఆదివారం లావా విరజిమ్మింది. ఏడువేల మీటర్ల ఎత్తున బూడిద మేఘాలు కుమ్ముకున్నాయి. దీంతో ఆ పరిసర ప్రాంతాలను ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు.శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మొదట్లో 2.475 మీటర్ల ఎత్తున ఎగిసిన బూడిద మేఘాలు ఆ తర్వాత మరింత ఎత్తుకు ఎగిసాయని అధికారులు చెప్పారు. మూడు కిలోమీటర్ల పరిధిలో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు వివరించారు.గత నెల 24న ఈ అగ్నిపర్వతం బద్దలైంది. అప్పుడు మూడువేల మీటర్ల ఎత్తున లావా విరజిమ్మింది.మళ్లీ ఆదివారం లావా పెల్లుబికింది.కాగా ఇండొనేసియాలో లావా విరజిమ్మే 129 అగ్నిపర్వతాల్లో సీనాబంగ్ పర్వతం కూడా ఒకటని అధికారులు చెప్పారు. -
మెక్సికో అగ్నిపర్వత దృశ్యాలు