-
No Headline
కనిగిరిరూరల్/వెలిగండ్ల: ఆర్టీసీ డ్రైవర్ నిద్ర మత్తు.. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం రెండు కుటుంబాల్లో బిడ్డలను అనాథలను చేసింది. మరి కొన్ని కుటుంబాల్లో ఆందోళన నింపింది. అందరూ సొంతూర్లలో శుభకార్యాలు, ఇతర పనులు, ఓటు వేసేందుకు వచ్చారు. బతుకుదెరువు కోసం తాను వలస వెళ్లిన చైన్నెకు తిరిగి వెళ్తూ ఒకరు, మనుమరాలు రమ్మందని చూడటానికి వెళ్తూ మరొకరు మృత్యు ఒడికి చేరుకోగా, మరికొందరు క్షతగాత్రులై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం దామరమడుగు సమీపంలో కనిగిరి డిపోకు చెందిన ఆర్టీసీ అల్ట్రా డీలక్స్ బస్సు ఆదివారం తెల్లవారుజామున 1.15 గంటల సమయంలో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో కనిగిరి నియోజకవర్గానికి చెందిన ఇద్దరు మృతి చెందారు. మృతులు ఇద్దరూ దూరపు బంధువులు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో కంకణంపాడుకు చెందిన గంధం అరుణ్కుమార్కు గాయాలయ్యాయి. వెలిగండ్ల మండలం మరపగుంట్లకు చెందిన సలోమి, రమికుమార్, సీఎస్పురం మండలం ఆర్కేపల్లికి చెందిన వీ నాగయ్య, రమాదేవికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా నెల్లూరు నారాయణ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బస్సు ఎడమ వైపు లారీ ఢీకొని దూసుకెళ్లడంతో ఆ వరుస సీట్లలో కూర్చొన్న వారే ప్రమాదానికి గురయ్యారు. గృహప్రవేశానికి వచ్చి వెళ్తూ మృత్యులోకానికి.. వెలిగండ్ల మండలంలోని గన్నవరం గ్రామానికి చెందిన వేమవరపు మరియమ్మ (46)కు ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వారిలో ముగ్గురికి వివాహం కాగా ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడికి వివాహం కాలేదు. భర్త సుదర్శనం ఏడేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి మరియమ్మ చైన్నెలోని ఓ కాలేజీలో పని చేస్తూ ముగ్గురు పిల్లలను పోషిస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెలిగండ్లకు వచ్చి తిరిగి చైన్నెకి వెళ్లింది. మళ్లీ కనిగిరి మండలం మాచవరంలో తన చిన్నాన్న కుమార్తె గృహ ప్రవేశానికి వచ్చి తిరిగి వెళ్తూ ఉండగా ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు కబళించింది. బస్సు ప్రమాదంలో మరియమ్మ అక్కడికక్కడే చనిపోయింది. మరియమ్మ ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు అనాథలుగా మారారు. దీంతో రామగోపాలపురం, గన్నవరంలో ఉన్న వారి బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. మనుమరాలు చైన్నెకు రమ్మందని.. బస్సు ప్రమాదంలో వెలిగండ్ల మండలం కంకణంపాడు గ్రామానికి చెందిన వేమవరపు డేవిడ్ (50) మృత్యువాత పడ్డాడు. అతని భార్య విశ్రాంతమ్మకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె చికిత్స పొందుతోంది. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తెకు వివాహం అయి చైన్నెలో ఉంటోంది. కుమారుడు ఎలీషాకు వివాహం కాలేదు. తల్లిదండ్రుల వద్ద ఉంటున్నా డు. జీవనోపాధి కోసం వేమవరపు డేవిడ్, మరియమ్మ, ఎలీషా హైదరాబాద్లో బేల్దారి పనిచేసుకుంటున్నారు. ఓటు వేసేందుకు వీరు కంకణంపాడు వచ్చారు. చైన్నెలో ఉంటున్న మనుమరాలు తాతను, అమ్మమ్మను చైన్నెకి రమ్మని పిలిచిందని వీరిద్దరూ చైన్నె బయలుదేరారు. ఇంతలో మృత్యువు ఆ కుటుంబాన్ని విధి వెంటాడింది. డేవిడ్ మృతి, మరియమ్మకు తీవ్రగాయాలు కావడంతో కంకణంపాడులో విషాదఛాయలు అలుముకున్నాయి. -
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో క్యూలైన్ ఆక్టోపస్ బిల్డింగ్ వరకు చేరుకుంది. శనివారం అర్ధరాత్రి వరకు 90,721 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 50,599 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.3.28 కోట్ల ఆదాయం వచ్చింది. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు ఉన్న వారికి 2 గంటల్లో దర్శనమవుతోంది. -
గవర్నర్ పర్యటన ఏర్పాట్ల పరిశీలన
వెంకటాచలం: రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ నెల 22న వెంకటాచలం మండలం కాకుటూరు లోని విక్రమసింహపురి యూనివర్సిటీ పర్యటనకు రానున్నారు. ఈ మేరకు వీఎస్యూలో చేస్తున్న ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ ఆదివారం సాయంత్రం పరిశీలించారు. వీఎస్యూ రిజిస్ట్రార్ డాక్టర్ పి.రామచంద్రారెడ్డితో చర్చించి పలు సూచనలు చేశారు. వీవ్ ఆఫ్ కల్చర్ షార్ట్ ఫిల్మ్కు అవార్డుల పంట నెల్లూరు(బృందావనం): చేనేత చీరల పరిశ్రమ వైభవం వెనుక జరిగే కష్టనష్టాలను ప్రతిబింబించే అంశాలకు దృశ్యరూపకం ఇస్తూ మావూరి సంతోష్రామ్ నిర్మించిన ‘వీవ్ ఆఫ్ కల్చర్’ షార్ట్ ఫిల్మ్ పలు అవార్డులను దక్కించుకుంది. చందన, సీఎంఆర్ అధినేత మావూరి శ్రీనివాసరావు కుమారుడు మావూరి సంతోష్రామ్ ఆదివారం వివరాలు వెల్లడించారు. అమెరికా లాస్ఏంజిల్స్లోని న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఫిల్మోగ్రఫీలో డిగ్రీ పూర్తి చేసుకుని తానే నిర్మాతగా, దర్శకుడిగా చేనేత పరిశ్రమలోని కష్ట నష్టాలను ప్రపంచానికి తెలియజేస్తూ ‘వీవ్ ఆఫ్ కల్చ ర్’ పేరుతో షార్ట్ ఫిల్మ్ను నిర్మించానన్నారు. అనేక ఫిల్మ్ ఫెస్టివల్స్లో ఈ షార్ట్ ఫిల్మ్ ప్రదర్శించడంతో పలు అవార్డులు లభించాయన్నారు. హైదరాబాద్లో ఇటీవల నిర్వహించిన 8వ దాదాసాహెబ్ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్లోనూ ఉత్తమ జ్యూరీ అవార్డు దక్కిందన్నారు. అమెరికాలో బోస్టన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో స్పెషల్ జ్యూరీ అవా ర్డు, యూఎస్ ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డు, సెంట్రల్ మిచ్గాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో స్పెషల్ జ్యూరీ అవార్డులు వచ్చాయన్నారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్స్లో ఐదు వేలకు పైగా లఘుచిత్రాలు ప్రదర్శితమయ్యాయన్నారు. అంగరంగ వైభవం.. అలఘనాథుని కల్యాణం ఆత్మకూరు: పట్టణంలోని తూర్పువీధిలో కొలువైన శ్రీదేవి,భూదేవి సమేత అలఘనాథస్వామి కల్యాణం ఆదివారం వైభవంగా నిర్వహించారు. వేకువజామునే అర్చకులు శ్రీనివాసశర్మ ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్ల మూలవిరాట్లకు విశేష ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. సాయంత్రం ప్రత్యేక కల్యాణ వేదికపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను సుందరంగా అలంకరించి వేంచేపు చేశారు. శాస్త్రోక్తంగా కల్యాణ ఘట్టాలను వివరిస్తూ కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. పోలీస్ విధులు కత్తిమీద సాము కోవూరు: పోలీస్ విధులు కత్తిమీద సాముతో కూడిందని శిక్షణ పూర్తి చేసుకున్న డీఎస్పీ ఎం. హేమలత అన్నారు. ఐదు నెలల క్రితం కోవూరు సర్కిల్లో సీఐ విధుల్లో శిక్షణ పొందారు. ఆదివారం ఆమె సీఐ హోదా శిక్షణ పూర్తికావడంతో స్థానిక సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ట్రైయినీ డీఎస్పీని సత్కరించారు. ఆమె మాట్లాడుతూ పోలీస్శాఖకు సంబంధించి అన్ని విషయాలను కూలంకషంగా తెలుసుకున్నట్లు తెలిపారు. ఈ శాఖలో కొన్ని కీలకమైన కేసుల విషయాల్లో సీనియర్లతో పాటు జూనియర్ల సూచనలు ఎంతో ఉపయోగపడుతాయని తెలుసుకున్నట్లు వివరించా రు. సీఐలు సుబ్బారావు హైమారావు, ఎస్ఐలు రంగనాథ్గౌడ్, వీరేంద్ర, సెబ్ సీఐ ప్రసాద్రెడ్డి పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా వేదగిరిలో బ్రహ్మోత్సవాలు
నెల్లూరు సిటీ: మండలంలోని వేదగిరి క్షేత్రంలో కొలువైన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం చప్పర ఉత్సవం, గిరి ప్రదక్షిణ కార్యక్రమాలు జరిగాయి. ప్రధాన అర్చకులు భాస్కరా చార్యులు ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వైదిక కార్యాలు ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారు సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆయా కార్యక్రమాలకు కొత్తపాళెంకు చెందిన బసిరెడ్డి విజయ్కుమార్ రెడ్డి, సురేష్రెడ్డి, ఆమంచర్లకు చెందిన నెట్టెం చిరంజీవి, భాస్కర్, రాజారావు ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమాలను ఈఓ వీ గిరికృష్ణ పర్యవేక్షించారు. దేవస్థానం గోశాలలోని గోవుల సంరక్షణకు సద్గురు యోగా అసోసియేషన్ దాతల సహకారంతో 8 గరుకు స్తంభాలు ఏర్పాటు చేశారు. సూళ్లూరుపేటకు చెందిన కవిత నత్య ప్రదర్శన, వేగూరు లక్ష్మీ శ్రేష్ఠ కూచిపూడి నత్య ప్రదర్శన భక్తులను అలరించాయి. -
నిశిరాత్రి మృత్యుకేక
● మృత్యు శకటంగా మారిన ఆగి ఉన్న లారీ ● నెల్లూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కనిగిరి వాసులు ఇద్దరు మృతి ● మృతులు దూరపు బంధువులు ● మరొకరి పరిస్థితి విషమం ● ఇంకో ఐదుగురికి తీవ్ర గాయాలు ● నిద్రమత్తు, అతివేగమే ప్రమాదానికి కారణం అర్ధరాత్రి దాటిన తర్వాత నిశిరాత్రి నెల్లూరు– ముంబయి జాతీయ రహదారిపై మృత్యు కేకలు, ఆర్తనాదాలు, హాహాకారాలు మిన్నంటాయి. చీకట్లో వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణికులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. బస్సు రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొని ఒక్క కుదుపునకు గురైంది. గాఢనిద్రలో ఉన్న బస్సులోని ప్రయాణికులందరూ ఉలిక్కిపడి లేచేసరికి ఏమి జరిగిందో తెలియని పరిస్థితి. ప్రయాణికులందరూ ఒకరిపై ఒకరు పడిపోయారు. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం అదిరిపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా, మరొక మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఇంకొందరు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
స్ట్రాంగ్రూమ్లకు పటిష్ట భద్రత
నెల్లూరు(దర్గామిట్ట): సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్కు మరో పదిహేను రోజులు ఉంది. ఓ వైపు ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లకు భద్రత కల్పిస్తూ.. మరో వైపు కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాట్లను కలెక్టర్, జిల్లా రిటర్నింగ్ అధికారి హరినారాయణన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్తో కలిసి పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ స్థానాలు, నెల్లూరు పార్లమెంట్కు సంబంధించి ఈవీఎంలను నగరంలోని ప్రియదర్శిని కళాశాలలో స్ట్రాంగ్రూమ్ను ఏర్పాటు చేసి పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల సూచనలతో స్ట్రాంగ్రూమ్ వద్ద భద్రతను పర్యవేక్షిస్తున్నారు. సీసీ కెమెరాలతో పాటు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మరో వైపు కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాట్లు చేస్తున్నారు. కౌంటింగ్ హాల్కు నిరంతర విద్యుత్ సౌకర్యం ఏర్పాట్లు చేపట్టారు. ఎలాంటి అసౌకర్యాలు, ఇబ్బందులు కలగకుండా కౌంటింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించి అన్ని విధాలుగా సన్నద్ధంగా ఉండేలా అధికారులు, కౌంటింగ్కు సంబంధించి సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు చేపడుతున్నారు. స్ట్రాంగ్రూంల వద్ద పార్టీ ప్రతినిధులు కూడా ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు. పార్టీ ప్రతినిధులకు కౌంటింగ్ ఏజెంట్ల ఏర్పాట్లు చేసుకునేలా తగు సూచనలు అందజేశారు. స్ట్రాంగ్రూమ్లను ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు కూడా తరచూ పరిశీలిస్తున్నారు. తుది దశ అయిన కౌంటింగ్ ప్రక్రియను కూడా విజయవంతంగా పూర్తి చేసేలా జిల్లా ఎన్నికల అధికారి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. -
ఊరూరా బెట్టింగ్ మేనియా
పొదలకూరు : ‘మీ పార్టీ గెలుస్తుందా? మా పార్టీ గెలుస్తుందని? మీకెంత మెజార్టీ.. మాకింత మెజార్టీ .. మీ అభ్యర్థి గెలుస్తాడా? మా అభ్యర్థి గెలుస్తాడని..’ ఇలా ఒక్కొక్కదానిపై జోరుగా పందేలు జరుగుతున్నాయి. సర్వేపల్లి నియోజకవర్గంలో మెజారిటీ, గెలుపోటములపై ఇప్పటికే రూ.కోట్లలో బెట్టింగ్లు పెట్టేశారు. ఇప్పటికీ బెట్టింగ్లు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధానంగా మండలాల వారీగా మెజారిటీలు, అభ్యర్థుల గెలుపోటములు, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానిపై పందేలు కాస్తున్నారు. అయితే గ్రామాల్లో కొందరు బూత్లెవల్లో కూడా బెట్టింగ్లకు పాల్పడుతుండడం విశేషం. ఇలాంటి పందేలను పరిశీలిస్తే గ్రామ స్థాయిలో సైతం ఎంత ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు జరిగాయో చెప్పవచ్చు. రెండు రోజుల క్రితం టీడీపీ నాయకులు పొదలకూరు మండలంలో సర్వే నిర్వహించి వైఎస్సార్సీపీకే మెజారిటీ వస్తుందని తేల్చినట్టుగా తెలుస్తోంది. అయితే మిగిలిన మండలాల్లో తమకు మెజారిటీ వస్తుందని ప్రచారం సాగిస్తూ బెట్టింగులకు పాల్పడుతున్నారు. అయి తే పొదలకూరు మండలం నుంచి వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా కవ్వింపు చర్యలకు పాల్పడుతూ బెట్టింగ్లకు పిలుస్తున్న వారితో తలపడి పందేలు కాస్తున్నా రు. ఈ నేపథ్యంలో కాకాణి గెలుపు, మెజారిటీ, పొదలకూరు మండల మెజారిటీలపై పందేలు కాశారు. ఇప్పటికే మండలం నుంచి సుమారు రూ.10 కోట్లు బెట్టింగ్ల రూపంలో పెద్దమనుషుల వద్దకు నగదు చేరినట్టుగా తెలుస్తోంది. పక్కజిల్లాల నుంచి పందేలు పక్క జిల్లాల నుంచి కూడా సర్వేపల్లి మెజారిటీ, గెలుపోటములపై పందేలు వస్తున్నాయి. ఫోన్లలో మాట్లాడుతూ కొందరు పెద్ద మనుషుల ద్వారా బెట్టింగులకు ఆహ్వానిస్తున్నా.. ఇది టీడీపీ మైండ్ గేమ్గా వైఎస్సార్సీపీ నాయకులు అంటున్నారు. వైఎస్సార్సీపీకి చెందిన యువకులు బెట్టింగ్ మైండ్ గేమ్ ఆడుతున్న వారి మధ్యవర్తుల ద్వారా ఆహ్వానిస్తున్నారు. ఎంతైనా పందేం కాస్తామని మళ్లీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడుతుందని, సర్వేపల్లిలో కాకాణి హ్యాట్రిక్ సాధిస్తారని సవాల్ చేస్తున్నారు. ఒక్క పొదలకూరులోనే రూ.10 కోట్లు కూడికలు, తీసివేతల్లో నాయకుల బిజీబిజీ పక్క జిల్లాల నుంచి పందేలు కాస్తున్న వైనం -
No Headline
రాపూరు: పెంచలకోనలో స్వయంభువుగా వెలసిన పెనుశిల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా గోనుపల్లెలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి ఆదిలక్ష్మి, చెంచులక్ష్మీదేవితో కలిసి స్వామి పెంచలకోనకు బయలుదేరారు. కొత్త అల్లుడు ఉభయనాంచారులతో కలిసి కోనకు చేరుకోవడంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనట్లు ప్రధాన అర్చకులు పెంచలస్వామి, సీతారామయ్యస్వామి తెలిపారు. ఊరేగింపుగా.. హిరణ్యకశిపుని వధానంతరం ఉగ్రరూపుడైన నృసింహ స్వామి వెలుగొండలలో సంచరిస్తుండగా చెంచురాజు (గిరిజన రాజు) కుమార్తె చెంచులక్ష్మి చెలిమితో శాంతించి ఆమెను వివాహమాడినట్లు పురాణాల్లో పేర్కొనబడింది. అప్పటి నుంచి గోనుపల్లె గ్రామంలోని ఉత్సవ విగ్రహాలకే పెంచలకోనలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఏటా గోనుపల్లెలో పెంచల నరసింహస్వామి పెళ్లి కొడుకుగా ముస్తాబై కోనకు తరలివెళ్తారు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం గోనుపల్లె నుంచి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా గిరిజనకాలనీకి తీసుకొచ్చారు. గిరిజనులు సంప్రదాయబద్ధంగా ఇంటి అల్లుడు, కుమార్తెకు (స్వామి, అమ్మవార్లకు) ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుట్టతేనె, ఇంజేటి గడ్డలు, సారపప్పు, పెడ మల్లెలు, బందారు ఆకులతో భాసికం, ఎల్లగడ్డలు, తంగేడుతో తాళిబొట్టు, స్వామివారికి కట్నంగా ఇచ్చే ఆరినార మొలతాడును సాంగ్యంగా చెల్లించారు. అనంతరం స్వామి, అమ్మవార్లు పల్లకిలో ఊరేగుతూ పెంచలకోనకు చేరుకున్నారు. అంకురార్పణతో శ్రీకారం నృసింహుడి బ్రహ్మోత్సవాలకు ఆదివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. స్వామి నందనవనంలోని పుట్టమట్టిని తీసుకొచ్చి అందులో నవధాన్యాలు కలిపి వేదమంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమాల్లో ఆలయ డీసీ సాగర్బాబు, చెంగాళమ్మ ఆలయ ఏసీ వెంకటేశ్వర్లు, సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్సై మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. వేడుకగా స్నపన తిరుమంజనం కోనలోని క్రేన్ మండపంలో మధ్యాహ్నం 12 గంటలకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు పాలు, తేనె, పెరుగు, చందనం, వివిధ పండ్ల రసాలు, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. -
ఆనకట్టలో శిశువు మృతదేహం
ఉదయగిరి: పట్టణంలోని ఆనకట్టలో శిశువు మృతదేహాన్ని ఆదివారం స్థానికులు గుర్తించారు. వారిచ్చిన సమాచారంతో సీఐ వి.గిరిబాబు, ఎస్సై కె.ఇంద్రసేనారెడ్డి తన సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి విచారణ చేపట్టారు. ఆర్లపడియ ఎస్టీ కాలనీకి చెందిన ఓ మహిళ కాన్పు కోసం పట్టణంలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు వెళ్లింది. కాన్పు సమయంలో బిడ్డ చనిపోవడంతో వారు ఇంటికి వెళ్లిపోయారు. వైద్యశాల వారు అక్కడి సిబ్బందికి శిశువు మృతదేహాన్ని పూడ్చి పెట్టాలని చెప్పడంతో ఆనకట్టలో పడేసినట్లు తేలింది.పిడుగు పడి గేదె మృతి సీతారామపురం: పిడుగు పడి గేదె మృతిచెందింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పబ్బులేటిపల్లి గ్రామ మందాకృష్ణానగర్ కాలనీలో భూతపాటి రామయ్యకు గేదె ఉంది. ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో రామయ్య ఇంటి పక్కన వేపచెట్టుకు కట్టేసిన గేదె పిడుగుపాటుకు మృతిచెందింది. దీని విలువ సుమారు రూ.70 వేలు ఉంటుందని బాధితుడు తెలిపాడు. నిప్పు పెట్టడంతో రూ.3.50 లక్షల నష్టం ఉదయగిరి: మండలంలోని బండగానిపల్లెలో గుడిసెకు గుర్తుతెలియని వ్యక్తులు శనివారం అర్ధరాత్రి ప్రాంతంలో నిప్పుపెట్టారు. స్థానికుల కథనం మేరకు.. గ్రామ సమీపంలో గుడిసెలో అన్నపూర్ణాదేవికి పూజలు చేస్తున్నారు. ప్రతి శుక్రవారం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో అందులోని వస్తువులు కాలిపోయాయి. రూ.3.50 లక్షల మేర నష్టం వాటిల్లి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. ఆదివారం ఎస్సై కర్నాటి ఇంద్రాసేనారెడ్డి తన సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. ఇంటికెళ్తుండగా..● బైక్ ఢీకొని వివాహిత మృతినెల్లూరు(క్రైమ్): మోటార్బైక్ ఢీకొని వివాహిత మృతిచెందిన ఘటన ఎస్వీజీఎస్ కళాశాల సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. నార్త్ ట్రాఫిక్ పోలీసుల కథనం మేరకు.. నగరంలోని వెలగచెట్టు సంఘానికి చెందిన సురేష్, లక్ష్మి (21) దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. సురేష్ పెయింట్ పనులు చేసుకొంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. లక్ష్మి ఆదివారం తన తండ్రి సుబ్రహ్మణ్యంతో కలిసి స్కూటీపై కోవూరులో బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడ పని ముగించుకొని జాతీయ రహదారిపై ఇంటికి బయలుదేరారు. ఎస్వీజీఎస్ కళాశాల సమీపానికి వచ్చేసరికి వెనక నుంచి స్కూటీని బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో లక్ష్మి అక్కడికక్కడే మృతిచెందగా ఆమె తండ్రికి తీవ్రగాయాలయ్యాయి. సమచారం అందుకున్న నార్త్ ట్రఫిక్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. లక్ష్మి మృతదేహన్ని శవపరీక్ష నిమ్మితం జీజీహెచ్కి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
No Headline
సార్వత్రిక పోలింగ్ ముగిశాక.. పోలింగ్ సరళిపై సమీక్షించుకుంటున్న టీడీపీ అభ్యర్థులు టెన్షన్తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. క్షేత్రస్థాయిలో గెలుపు ధీమా లేకపోవడంతో ఒక్కొక్క నియోజకవర్గంలో రూ.వందల కోట్లు ఖర్చు చేశారు. ప్రధానంగా జిల్లాలో టీడీపీ నెల్లూరు సిటీ అభ్యర్థి మొదటి స్థానంలో ఉండగా, కోవూరు అభ్యర్థి రెండో స్థానంలో నిలుస్తున్నారు. మిగతా నియోజకవర్గాల్లో సైతం రూ.70 కోట్ల నుంచి రూ.90 కోట్లు వరకు ఖర్చు చేసినట్లు పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే పోలింగ్ సరళిపై విశ్లేషిస్తున్న రాజకీయ పండితులు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నట్లు చెబుతుండడంతో డబ్బు ప్రభావం ఎంత మేరకు పనిచేసింది.. ఎన్ని ఓట్లు పడి ఉంటాయి.. అని బూత్ల వారీగా టీడీపీ నేతలు లెక్కలు వేస్తున్నట్లు సమాచారం. సాక్షిప్రతినిధి, నెల్లూరు: సార్వత్రిక పోలింగ్ సరళి ప్రధాన పార్టీలతో పాటు రాజకీయ విశ్లేషకులకు సైతం అంతుచిక్కడం లేదు. అయితే వైఎస్సార్సీపీ మాత్రం పోలింగ్ తమకు అనుకూలంగా ఉందనే ధీమాతో ఉంటే.. క్షేత్రస్థాయిలో గెలుపు ధీమా లేక ఓట్ల కొనుగోలును నమ్మకుని రూ.వందల కోట్లు కుమ్మరించిన టీడీపీ నేతల్లో గుబులు రేపుతోంది. క్షేత్రస్థాయిలో టీడీపీ అభ్యర్థులు పంపిణీ చేసిన నోట్లకు ఎంత మేరకు ఓట్లు పడ్డాయనే లెక్కలు తేల్చే పనిలో బూత్ల వారీగా సమీక్షిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియను, ప్రజాస్వామ్యాన్ని టీడీపీ అపహాస్యం చేసింది. మొదటి నుంచి ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు ప్రజలపై నమ్మకం లేదు. కేవలం ఎన్నికల రోజు డబ్బులు ఇస్తే ఓట్లు పడతాయనే ఆలోచనతో రాజకీయాలను వ్యాపారంగా మార్చేశా రు. క్షేత్రస్థాయిలో ప్రజాబలం ఉన్నప్పటికి తమను అభిమానించే ఓటర్లు ఎక్కడ టీడీపీ ప్రలోభాలకు గురవుతారని ప్రత్యర్థి పార్టీలు సైతం టీడీపీ అభ్యర్థులతో పోటీపడి డబ్బులు పంపిణీ చేయలేక చతికిలపడ్డాయి. టీడీపీ అభ్యర్థులందరూ ఆగర్భ శ్రీమంతులే జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులందరూ ఆగర్భ శ్రీమంతులే. టీడీపీకి ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్య కావడంతో దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న వారిని కాదని కోటీశ్వరులను ఎంపిక చేసి టికెట్లు ఇచ్చింది. జిల్లాలో నెల్లూరు సిటీ, సర్వేపల్లి మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో పార్లమెంట్ సహా కొత్త వారిని బరిలోకి దింపింది. ఎన్నికల్లో గెలవడానికి టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి తన పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి రూ.25 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు ఖర్చు చేశారు. ముఖ్యంగా కోవూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోసం దాదాపు రూ.120 కోట్లపై మాటగా ఖర్చు చేశారని సమాచారం. నెల్లూరు సిటీ అభ్యర్థి పొంగూరు నారాయణ రూ.150 కోట్లకుపైగా ఖర్చు చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రూ.90 కోట్ల నుంచి రూ.70 కోట్లు ఖర్చు చేసిన మూడు, నాలుగు స్థానాల్లో మిగతా నియోజకవర్గాలు ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. పోలింగ్ సరళిపై చర్చ ఈ దఫా ఎన్నికల సరళిని పరిశీలిస్తే విభిన్నంగా ఉంది. గతంలో ఉదయం 9 గంటల తర్వాత కానీ పోలింగ్ ప్రక్రియ ఊపందుకునేది కాదు. కానీ ఈ దఫా ఉదయం పోలింగ్ సమయానికి అర్ధగంట ముందు నుంచే ఓటర్లు బారులు తీరడం విశేషం. ప్రత్యేకించి మహిళలు బారులు తీరి ఓట్లు వేయడం, గత ఎన్నికల్లో కంటే పోలింగ్ శాతం పెరగడం కూడా టీడీపీ అభ్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రధానంగా అధికార వైఎస్సార్సీపీ ప్రభుత్వం గడిచిన ఐదేళ్లలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ద్వారా రూ.లక్షల్లో లబ్ధి చేకూర్చింది. అదే టీడీపీ గతంలో హామీల పేరుతో మహిళలను, రైతులను, నిరుద్యోగులను.. ఇలా అన్ని వర్గాలను మోసం చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదు.. ప్రతిపక్ష టీడీపీపై ప్రజల్లో సానుకూలత కూడా లేదు. ఈ దఫా ఎన్నికల్లో పెరిగిన ఓటింగ్, ఊహించని విధంగా సాగిన పోలింగ్ సరళి అభ్యర్థులకే కాకుండా.. రాజకీయ విశ్లేషకుల ఊహలకు కూడా అందడం లేదు. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం కచ్చితంగా వైఎస్సార్సీపీకే ఓట్లు పడ్డాయనే విశ్లేషణలు చేస్తుండడంతో టీడీపీ అభ్యర్థుల్లో గుబులు రేపుతోంది. రూ.వందల కోట్లు ఖర్చు చేసినా.. ఓట్లు పడలేదనే అంచనాలతో ఇప్పుడు బూత్ల వారీగా లెక్కలు వేస్తున్నారు. ఆయాల బూత్ల్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి.. ఎంత డబ్బు పంపిణీ చేశాము.. మనకు ఎన్ని ఓట్లు పడి ఉంటాయనే లెక్కలు తేల్చే పనిలో తలమునకలై ఉన్నారు. పోలింగ్ సరళిపై రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చల్లో అసలు ఓటర్లకు ఎంత మేర డబ్బు చేరిందని అభ్యర్థులు ఆరా తీస్తున్నారని సమాచారం. అభ్యర్థులు ఇచ్చిన డబ్బులను ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలు పంచుకోగా మిగిలిన మొత్తాలను ఓటర్లు పంచినట్లు జరుగుతున్న ప్రచారంపై కూడా అభ్యర్థులు లెక్కలు అడుగుతున్నారంట. స్థానిక నేతలు ఎవరెవరు ఓట్లు వేశారు.. ఎవరు వేయలేదు.. ఆరా తీస్తూ తిరిగి డబ్బులిస్తే.. అభ్యర్థులకు లెక్కలు చెప్పాలంటూ ఓటర్లను బెదిరిస్తున్నారు. ఇటీవల కావలి, నెల్లూరు సిటీ ప్రాంతాల్లో ఓటర్లకు పంచిన డబ్బులు తిరిగి ఇవ్వమని స్థానిక లీడర్లు ఒత్తిడి చేస్తున్నట్లు లైవ్ వీడియో, ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. పోలింగ్ సరళిపై టెన్షన్లో టీడీపీ అభ్యర్థులు ఒక్కొక్క నియోజకవర్గానికి రూ.వందల కోట్లు ఖర్చు గెలుపు ధీమా లేక.. ఓట్ల కొనుగోలు డబ్బు ప్రభావం ఎంత మేరకు.. బూత్ల వారీగా సమీక్షించుకుంటున్న నేతలు -
నృసింహుని సంబరం ఆరంభం
● ఊరేగింపుగా కోనకు చేరిన దేవదేవేరులు ● వైభవంగా ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ● శాస్త్రోక్తంగా అంకురార్పణపెంచలకోనలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదపండితులు శాస్త్రోక్తంగా అంకురార్పణతో సంబరాలకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో ముందుగా ఉగ్రరూపుడైన నృసింహుడిని నవ వరుడిగా ముస్తాబు చేసి గోనుపల్లె నుంచి ఊరేగింపుగా కోనకు తీసుకొచ్చారు. ఆదిలక్ష్మి.. చెంచులక్ష్మి సమేతంగా పల్లకిపై కొలువుదీరిన శ్రీవారు మంగళవాయిద్యాల నడుమ పెనుశిల క్షేత్రం చేరుకున్నారు. వేడుకగా నిర్వహించిన స్నపన తిరుమంజనసేవలో సేదతీరారు. విశేష సంఖ్యలో భక్తులు దేవదేవేరులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. -
నేరాల నియంత్రణే లక్ష్యంగా..
నెల్లూరు(క్రైమ్): నేరాలను కట్టడి చేసి ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలు అందించేందుకు పోలీస్ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఎస్పీ కె.ఆరిఫ్ హఫీజ్ ఆదేశాలతో శివారు ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేయడంతోపాటుగా నేరస్తుల కదలికలపై నిఘా పెంచారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఆదివారం నెల్లూరు నవాబుపేట పోలీసుస్టేషన్, కావలి ఒకటి, రెండు, కావలి రూరల్, బిట్రగుంట, ఉదయగిరి, వింజమూరు పోలీసుస్టేషన్ల పరిధిలో అధికారులు తెల్లవారుజాము నుంచే కార్డన్ సెర్చ్లు నిర్వహించారు. సరైన పత్రాల్లేని 64 మోటార్బైక్లు, రెండు ఆటోలు, 89 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు పాతనేరస్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎందుకంటే.. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారితోపాటు విదేశాలకు చెందిన అనేకమంది విద్య, ఉపాధి నిమిత్తం జిల్లాకు వస్తున్నారు. నగర, పట్టణ శివార్లు అత్యంత వేగంగా విస్తరిస్తున్నాయి. నూతనంగా కాలనీలు వెలుస్తున్నాయి. నేరస్తులు ఒక్కోసారి వారి కదలికలు ఎవరూ గుర్తుపట్టడం లేదని సైలెంట్గా ఉంటారు. కొందరు వేరే ప్రాంతాల్లో నేరాలు చేసి గుట్టుచప్పుడు కాకుండా ఇక్కడకొచ్చి ఉంటారు. కొన్ని చోరీ కేసుల్లో సొత్తులు రికార్డుల్లేకుండా ఉంటాయి. అలాగే నేరాలు చేసేందుకు సన్నద్ధం వేళ నేరస్తుల కదలికలు అనుమానాస్పదంగా ఉంటాయి. వీటిని నిరోధించాలంటే ముందుగా నేరాలను తగ్గించేందుకు కార్డన్ సెర్చ్లు దోహదపడుతాయి. నిందితులు దొరికితే పెండింగ్లో ఉన్న కేసులు పరిష్కారమవుతాయి. సెర్చ్ ఇలా.. సెర్చ్ చేసేందుకు నేరాలు అధికంగా జరిగే, అసాంఘిక శక్తులు తలదాచుకునే ప్రాంతాలు, శివారు ప్రాంతాలను ఎంచుకుంటారు. తెల్లవారుజామున ఒకేసారి పోలీసు బలగాలు నిర్దేశిత ఏరియాలను చుట్టుముడుతాయి. ఎవరూ బయటకు వెళ్లకుండా, బయటి ప్రాంతాల నుంచి లోనికి రాకుండా చర్యలు తీసుకుని ఆ ప్రాంతాల్లో ప్రతి అణువు జల్లెడ పడుతారు. అక్కడున్న వాహనాలు, అనుమానిత వస్తువులు, ఇతర విషయాలపై ఆరా తీస్తారు. రికార్డులు సక్రమంగా లేని వాహనాలు స్వాధీనం చేసుకుంటారు. ఇంట్లో ఉన్న వ్యక్తుల వివరాలను సేకరిస్తారు. అనుమానాస్పదంగా ఎవరైనా ఉంటే అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్కు తరలిస్తారు. అనంతరం వారిని పూర్తిస్థాయిలో విచారించి నేరాలకు సంబంధం లేదని తేలితే వదిలేస్తారు. నిందితులని తేలితే వారిని విచారిస్తారు. తనిఖీలు ముగిసిన అనంతరం తనిఖీ చేసినట్లు ప్రతి ఇంటికి ఓ స్లిప్ ఇస్తారు. రికార్డుల్లేని వాహనాలుంటే వాటిని కోర్టుకు అప్పగిస్తారు. ప్రజలు సహకరించాలి సెర్చ్ సమయంలో ప్రజలు పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరించాలి. వారి వద్ద ఉన్న గుర్తింపుకార్డులు, ఇంట్లో ఉన్న వారి వివరాలు, బంధువులు వస్తే వివరాలను తెలియజేయాలి. పోలీసులు వచ్చిన సమయంలో ఆందోళన చెందకుండా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానమివ్వాలి. పాతనేరస్తులు, అనుమానాస్పద వ్యక్తులు, అసాంఘిక శక్తుల సమాచారం తెలిస్తే వెంటనే తెలియజేయాలని పోలీసు అధికారులు కోరుతున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ పోలీసుల అదుపులో ఇద్దరు పాతనేరస్తులు 64 మోటార్బైక్లు, 89 మద్యం బాటిళ్ల స్వాధీనం -
ఉద్యోగావకాశం.. ఒక్క క్లిక్ దూరంలో..
నెల్లూరు(మినీబైపాస్): యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంది. సాంకేతిక వ్యవస్థ ను వినియోగించి ఉపాధి కార్యాలయాల స్వరూపాన్ని పూర్తిగా మార్చేసింది. ఒకప్పుడు అభ్యర్థులు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి విద్యార్హతల వివరాలను నమోదు చేసుకునే వారు. అయితే ఉద్యోగాల సమాచారం తక్కువగా తెలిసేది. నేడు ఒక్క క్లిక్తో సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకునేలా వెసులుబాటు వచ్చింది. ప్రత్యేక పోర్టల్ను రూపొందించారు. http:// www. employment. ap. gov. in వెబ్సైట్లో వివరాలు నమోదు చేస్తే చాలు. దీనిని నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్తో అనుసంధానం చేశారు. నమోదు చేసుకున్న తర్వాత.. రాష్ట్రంలోని ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాల ఖాళీల వివరాలు, వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన నోటిఫికేషన్ల సమగ్ర వివరాలను పోర్టల్లో నమోదు చేసుకున్న యువతకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారు. విద్యార్హతల ప్రకారం ఉద్యోగాల ఖాళీల గురించి ఫోన్ నంబర్కు, ఈ–మెయిల్కు పంపుతున్నారు. వీటితోపాటు ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే జాబ్మేళాల సమాచారం అందిస్తూ అటు యువతకు, ఇటు సంస్థలకు వారధిలా నిలుస్తున్నారు. ఇప్పటి వరకు ఆన్లైన్లో 33,652 మంది నమోదు చేసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉద్యోగావకాశాల వివరాలను యువతకు అందిస్తూ, ఎప్పటికప్పుడు వివరాలను అప్డేట్ చేసుకునే వెసులుబాటు వెబ్సైట్ ద్వారానే కల్పిస్తున్నారు. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఉపాధి కార్యాలయ నంబర్ తప్పనిసరి అని నిబంధన ఉండేది. నెల్లూరు ఉపాధి కార్యాలయాన్ని యువత అవసరాలకు తగినట్లుగా రూ.46 లక్షలతో మోడల్ కెరీర్ సెంటర్గా తీర్చిదిద్దారు. కెరీర్ గైడెన్స్, ఎగ్జిబిషన్లు, ఔట్ రీచ్ ప్రోగ్రామ్స్, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలకు నిలయంగా ఇది మారింది. ప్రత్యేకంగా పోర్టల్ను ప్రారంభించిన ప్రభుత్వం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునేలా నూతన విధానం నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్తో అనుసంధానం వివరాలు నమోదు చేసుకోవాలి యువత కోసం జాబ్మేళాలను నిర్వహిస్తున్నాం. పదో తరగతి నుంచి ఉన్నత విద్య వరకు ఉత్తీర్ణలైన వారు ఎంప్లాయ్మెంట్ పోర్టల్లో విరాలు నమోదు చేసుకోవాలి. ఎప్పటికప్పుడు వారికి ఉద్యోగ సమాచారం అందుతుంది. ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ను సమర్పిస్తే జిల్లా ఉపాధి కార్యాలయ అధికారులు ధ్రువీకరించి ఎంప్లాయ్మెంట్ నంబర్ కార్డు మంజూరు చేస్తారు. ఇవి మొబైల్ ఫోన్లో చేసుకోవచ్చు. – కేవీ రామాంజనేయులు, జిల్లా ఉపాధి అధికారి -
ప్రేమోన్మాది నాగరాజుకు ఉరిశిక్ష విధించాలి
నెల్లూరు(అర్బన్): ప్రేమ పేరుతో వెంటపడి వేధించి పెళ్లికి ఒప్పుకోలేదనే కారణంతో తల్లీకూతుళ్లపై హత్యాయత్నం చేసిన క్రూరుడు నాగరాజును సమాజంలో తిరగనీయకూడదని, అలాంటి వ్యక్తికి ఉరిశిక్ష విధించాలని మహిళా కమిషన్ రాష్ట్ర చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి అన్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వింజమూరులో పూజిత, ఆమె తల్లి కాంతమ్మలపై నిందితుడు నాగరాజు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి నెల్లూరులోని ఎనెల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పూజిత, కాంతమ్మను మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి శనివారం పరామర్శించారు. బాధితులకు ధైర్యం చెప్పి ప్రభుత్వం తరపున అండగా ఉంటామని తెలిపారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ మహిళలపై దాడులకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదన్నారు. బాధితులకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి యాజమాన్యానికి ఆదేశాలిచ్చామన్నారు. అనంతరం ఆమె దర్గామిట్టలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఆవరణలో ఉన్న వన్స్టాప్ సఖి సెంటర్ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి వల్లెం విమల, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు విజయనిర్మల, రాజ్యలక్ష్మి, అధికార ప్రతినిధి సుప్రియ పాల్గొన్నారు. -
ఎక్కడ చూసినా ఎన్నికల చర్చే
ఖరీఫ్కు విత్తనాలు సిద్ధం నెల్లూరు(బారకాసు): జిల్లాలో రానున్న ఖరీఫ్ సీజన్కు సంబంధించి వివిధ రకాల విత్తనాలను స్థానికంగా రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు అందుబాటులో ఉంచినట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారిణి సత్యవాణి పేర్కొన్నారు. నెల్లూరులోని వ్యవసా యశాఖ కార్యాల యంలో సబ్డివిజన్ ఏడీఏల తో శనివారం ఖరీఫ్ స న్నద్ధంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాకు జీలుగ 4,501 క్వింటాళ్లు, జనుము 2,135 క్వింటాళ్లు, పిల్లిపెసర 2,092 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. గరిష్టంగా ఐదు ఎకరాల వరకు విత్తనాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రధానంగా బోర్ల కింద సాగు చేసుకునే రైతులకు మేలు రకం వరి విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. కిలోకి రూ.5 చొప్పున సబ్సిడీ ఇస్తామన్నారు. మినుము, పెసర, కందులకు 50 శాతం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందన్నారు. రైతులు గమనించి రైతు భరోసా కేంద్రాల వద్ద తీసుకోవచ్చని సూచించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా పంపిణీ వ్యవసాయశాఖ అధికారిణి సత్యవాణి -
వేడుకగా బండాసుర వధఅలంకార ఉత్సవం
నెల్లూరు(బృందావనం): వైశాఖమాసం పురస్కరించుకుని సంప్రదాయంగా నగరంలోని మూలాపేటలో శ్రీభువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామివారి దేవస్థానంలో వసంతోత్సవాలు ఘనంగా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. వసంతోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి బండాసుర వధ అలంకారోత్సవం వేడుకగా నిర్వహించారు. విశేషాలంకారంలో కొలువైన భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామివారిని భక్తు లు దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా కె.కృష్ణమ్మ, కుమారుడు కె.మాలకొండయ్య వ్యవహరించారు. కార్యక్రమాలను దేవస్థానం ఈఓ వేణుగోపాల్ పర్యవేక్షించారు. -
వైభవంగా కన్యకాపరమేశ్వరి నగరోత్సవం
నెల్లూరు(బృందావనం): నగరంలో శనివారం రాత్రి శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి నగరోత్సవం వైభవంగా జరిగింది. అమ్మవారి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని స్టోన్హౌస్పేటలోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక అలంకరణ, విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారి నగరోత్సవం స్టోన్హౌస్పేటలోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయం నుంచి బయలుదేరింది. అమ్మవారు ప్రత్యేక వాహనంలో ఏర్పాటు చేసిన వ్యాఘ్ర వాహనంపై కొలువుదీరి నవాబుపేట, శెట్టిగుంట రోడ్డు తదితర మార్గాల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. కార్యక్రమంలో నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్, ఆలయ పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. -
అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం
కొడవలూరు: కొడవలూరు మండలం టపాతోపు వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో జాతీయ రహదారిపై లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెంకు చెందిన 8 మంది మారుతి ఎర్టిగా కారులో బ్రహ్మంగారిమఠం, ఒంటిమిట్ట రామాలయాలను దర్శించుకుని తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. టపాతోపు క్రాస్రోడ్డు వద్ద ముందు వెళుతున్న లారీ హఠాత్తుగా స్లో చేయడంతో వెనుక వస్తున్న కారు వేగం అదుపు కాక లారీ వెనుక భాగాన ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న అట్ల ఏడుకొండలరెడ్డి, గుడివాడ దుర్గారావు, అన్నం కోదండరామిరెడ్డి, అసోది మల్లారెడ్డిలకు తీవ్ర గాయాలయ్యాయి. మల్లారెడ్డి పరిస్ధితి కాస్త మెరుగ్గా ఉండగా, మిగిలిన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేటర్పై అత్యవసర చికిత్స అందిస్తున్నారు. కారులో ఉన్న మరో నలుగురు సురక్షితంగా బయట పడ్డారు. వీరంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతోపాటు బాగా పరిచయస్తులు కావడంతో ప్రత్యేక కారులో దైవ దర్శనానికి బయలు దేరినట్లు బాధితులు తెలిపారు. మానవత్వం చాటుకొన్న వైద్య విద్యార్థినులు ప్రమాదం జరిగిన సమయంలో జాతీయ రహదారిపై కారులో వెళుతున్న వైద్య విద్యార్థినులు కొందరు తమ వాహనాన్ని ఆపి బాధితులకు ప్రాథమిక చికిత్స చేసి మానవత్వం చాటుకొన్నారు. సంఘటనా స్ధలికి చేరుకొని కారులో ఉన్న ప్రమాద బాధితులను స్ధానికుల సాయంతో వెలికి తీయడంతోపాటు వారందరికీ ప్రాథమిక చికిత్స అందించారు. 108 వాహనానికి సమాచారం ఇచ్చి వారందర్నీ అందులోకి తరలించడంలో ఎంతో చొరవ చూపారు. వైద్య విద్యార్థినుల చొరవను అందరూ ప్రశంసించారు. ఎస్సై కె.వీరప్రతాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీని వెనుక నుంచి ఢీకొన్న కారు నలుగురికి తీవ్ర గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం క్షతగాత్రులంతా బాపట్ల జిల్లా వాసులు -
ఎక్కడ చూసిన ఎన్నికల చర్చే
కోవూరు: ఎన్నికల సమరం ముగిసింది. ఫలితాలు ఈవీఎంలలో నిక్షిప్తమయ్యాయి. గెలుపుపై ఎవరి అంచనాలు వారికి, ఎవరి ధీమాలు వారికి ఉన్నాయి. అయితే గ్రామాల్లో ఎన్నికల వేడిమాత్రం ఇంకా తగ్గలేదు. నలుగురు గుమిగూడిన చోట ఫలితాలు, మెజార్టీలపైనే జోరుగా చర్చ సాగుతోంది. ఏ ఓటర్లు ఏ పార్టీకి మొగ్గుచూపుతున్నారన్న రచ్చబండ చర్చలు కొనసాగుతున్నాయి. అంతే కాకుండా సామాజిక వర్గాల ప్రకారం ఎవరు, ఏ పార్టీ వైపు మొగ్గు చూపారన్న చర్చ కూడా నడుస్తోంది. పోల్ మేనేజ్మెంట్ ప్రభావం ఎంత, తమకు అనుకూలంగా ఉన్న అంశాలేంటి, గెలుపు ఏ విధంగా ఉండబోతోంది, ప్రత్యర్థికి బలహీనంగా మారిన పరిస్థితులు, తద్వారా గ్రామాల వారీగా మెజార్టీ వచ్చేందుకు ఏ పార్టీకి అవకాశం ఉందన్న లెక్కలు జోరుగానే వేస్తున్నారు. ఫంక్షన్లు, ఉత్సవాలు ఇలా సందర్భం ఏదైనా చర్చ మాత్రం ఎన్నికల ఫలితాల పైనే ఉంటోంది.వివిధ అంశాలపై ఆరాగ్రామాల వారీగా తమవైపు నిలబడే ఓటర్ల లెక్కలను గ్రామస్థాయి నాయకుల ద్వారా పోటీదారులు, వారి వర్గం వారు ఆరా తీస్తున్నారు. రాజకీయంగా చురుగ్గా ఉండే నాయకులకు స్థానికంగా లెక్కల మాట అటుంచితే, ఇతర ప్రాంతాల్లోని బంధువులు, స్నేహితుల నుంచి ఫోన్లు కూడా అధికంగా వస్తున్నాయి. తమ నియోజక వర్గాల్లో చర్చలకు తోడు కీలకంగా నిలిచే స్థానాల్లో ఫలితం ఏంటన్న అంశం కూడా ఈ చర్చల్లో ప్రధాన భూమిక పోషిస్తోంది. ఏది ఏమైనా ఫలితాలు వెలువడే వరకు ఈ చర్చలు కొనసాగుతూనే ఉంటాయన్నది ఒప్పుకోవాల్సిందే.సోషల్ మీడియా గప్చుప్సాధారణంగా ఎన్నికల సమయంలో ఓట ర్లను ఆకర్షించడం కోసం వీధుల్లోని గోడలపై పోస్టర్లు అతికించే ఆనవాయితీ నుంచి డిజిటల్ వేదికల్లో వినూత్న పంథాలో ప్రచారం చేసేంత వరకు రూపాంతరం చెందింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కొన్ని నెలలుగా జిల్లా అంతటా జోరుగా ప్రచారం సాగింది. 13వ తేదీతో ఎన్నికల ముగియడంతో ఒక్కసారిగా సోషల్ మీడియా మూగబో యింది. వాట్సాప్ మెసేజ్లు, అభ్యర్థుల బ్రాడ్ కాస్టింగ్ కాల్స్, రీల్స్తో దద్దరిల్లిన సోషల్ మీడియా ప్రచారం ఎన్నికలు ముగి యగానే గప్చుప్ అయిపోయింది. -
22న వీఎస్యూకు గవర్నర్ అబ్దుల్ నజీర్ రాక
నెల్లూరు(దర్గామిట్ట): రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ నెల 22న జిల్లా పర్యటనకు విచ్చేయనున్నట్లు కలెక్టర్ ఎం హరినారాయణన్ శనివారం తెలిపారు. వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ స్నాతకోత్సవ వేడుకలో ఆయన పాల్గొంటారు. 22వ తేదీ ఉదయం 9.45 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టు నుంచి హెలికాఫ్టర్లో బయలుదేరి ఉదయం 10.40 గంటలకు నెల్లూరు పోలీస్ పరేడ్ మైదానానికి చేరుకుంటారు. 11.30 గంటల నుంచి విక్రమ సింహపురి యూనివర్సిటీలో నిర్వహించే స్నాతకోత్సవంలో పాల్గొంటారు. సాయంత్రం 5.35 గంటలకు పోలీస్ పరేడ్ మైదానం నుంచి హెలికాఫ్టర్లో బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. గ్రంథాలయంలో వేసవి శిబిరం నెల్లూరు(మినీబైపాస్): వేసవి విజ్ఞాన శిబిరం సందర్భంగా స్థానిక రంగనాయకుల పేటలోని శాఖా గ్రంథాలయంలో శనివారం విద్యార్థినీ విద్యార్థులకు పుస్తక పఠనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మురిపూడి ట్రస్ట్ అధ్యక్షులు సతీష్ కుమార్ విచ్చేసి విద్యార్థులకు పేపర్ క్రాఫ్ట్లో భాగంగా టోపీలను చేయించారు. తదుపరి పిల్లలకు చాక్లెట్స్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని జూన్ 7వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు గ్రంథాలయ అధికారి వి.అరుణ పేర్కొన్నారు. నీట మునిగిన యువకుడిని కాపాడిన మైరెన్ పోలీసులు తోటపల్లిగూడూరు: కోడూరు బీచ్లో ప్రమాదంలో చిక్కుకున్న ఓ యువకుడిని మైరెన్ పోలీసులు కాపాడి ప్రాణాలు నిలబెట్టారు. వివరాల్లోకెళితే.. నెల్లూరు డైకాస్ రోడ్డుకు చెందిన జాని తన స్నేహితులతో కలిసి శనివారం ఉదయం కోడూరు బీచ్ సందర్శనకు వచ్చారు. మిత్రులందరూ బీచ్లో జలకాలాడుతుండగా జాని ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. విషయం తెలుసుకొన్న మైరెన్ పోలీసులు శేషగిరి, సంజయ్లు వెంటనే వచ్చి నీటిలో మునిగిపోతున్న అతనిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. నీళ్లు తాగి ప్రాణాపాయ స్థితికి చేరిన జానిని నీళ్లు కక్కించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు తరలించారు. -
రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలై..
● చికిత్స పొందుతూ యువకుడు మృతి నెల్లూరు(క్రైమ్): రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మృతిచెందాడు. నార్త్ ట్రాఫిక్ పోలీసుల వివరాల మేరకు.. ముత్తుకూరుకు చెందిన పి.రాజేష్, చెముడుగుంటకు చెందిన సురేష్ నగరంలోని రావూస్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నారు. ఈ నెల 17వ తేదీన ఇద్దరూ పరీక్ష రాశారు. అనంతరం రాజేష్ స్నేహితుడిని ఇంటి వద్ద వదిలేందుకు బైక్పై జాతీయ రహదారి మీదుగా చెముడుగుంటకు బయలుదేరారు. రాజేష్ బైక్ నడుపుతుండగా సురేష్ వెనుక కూర్చున్నాడు. సర్వేపల్లి కాలువ వద్దకు వచ్చేసరికి రాజేష్ ముందు వెళుతున్న బైక్ను వేగంగా ఢీకొనడంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సహకారంతో సురేష్ స్నేహితుడిని మెడికవర్ హాస్పిటల్కు తరలించి అతని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేరుకుని మెరుగైన వైద్యం కోసం నారాయణ ఆస్పత్రికి అక్కడి నుంచి జీజీహెచ్కు తరలించారు. జీజీహెచ్లో చికిత్స పొందుతూ రాజేష్ శనివారం మృతిచెందాడు. మృతుని తండ్రి మల్లికార్జున ఫిర్యాదు మేరకు నార్త్ ట్రాఫిక్ ఎస్సై గీతారమ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
స్ట్రాంగ్రూంలో పోస్టల్ బ్యాలెట్లు
నెల్లూరు(దర్గామిట్ట): నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పోస్ట్లో వచ్చిన పోస్టల్ బ్యాలెట్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూంలో ఉంచి సీల్ వేశారు. శనివారం పోస్టులో వచ్చిన పోస్టల్ బ్యాలెట్ కవర్లను పోస్టల్ సిబ్బంది కలెక్టరేట్లో కలెక్టర్ ఎం.హరినారాయణన్కు అందజేశారు. ఈ పోస్టల్ బ్యాలెట్లను ట్రంకుపెట్టెల్లో భద్రపరిచి సీలు వేశారు. అనంతరం స్ట్రాంగ్రూంలో బాక్సులను ఉంచి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్రూంకు తాళాలు వేసి సీలు వేశారు. కార్యక్రమంలో ఇన్చార్జి డీఆర్ఓ బాపిరెడ్డి, వైఎస్సార్సీపీ ప్రతినిధి సుబ్బరాయుడు, టీడీపీ ప్రతినిధి కృష్ణ చైతన్య పాల్గొన్నారు. -
దాడిపై కేసు నమోదు
నెల్లూరు(క్రైమ్): ఓ వ్యక్తిపై దాడి కేసులో చిన్నబజారు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. మూలాపేట కొండదిబ్బకు చెందిన గోవర్ధన్కు మూలాపేటకు చెందిన సునీల్కు ఆర్థిక విషయాల్లో విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ రాత్రి మూలాపేటలోని వాగ్ధా స్కూల్ వద్ద ఉండగా సునీల్, మరికొందరు తనపై దాడి చేశారని గోవర్ధన్ చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని.. ● లారీడ్రైవర్ మృతి మనుబోలు: మండల పరిధిలోని జాతీయ రహదారిపై వీరంపల్లి క్రాస్రోడ్డు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతిచెందాడు. గుంటూరు జిల్లాలోని దామరపల్లి గ్రామానికి చెందిన కొల్లిపర సాంబశివరావు(40) లారీ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గుంటూరు నుంచి తిరుపతికి రైలు చక్రాల లోడుతో వెళుతున్నాడు. ఈ క్రమంలో వీరంపల్లి క్రాస్రోడ్డు వద్ద లారీని ఆపి ఇంజిన్ ఆయిల్ నింపుతున్నాడు. అదే సమయంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో సాంబశివరావు అక్కడికక్కడే మృతిచెందాడు. మనుబోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు దాటుతుండగా.. ● గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి వెంకటాచలం: రోడ్డు దాటుతున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొనగా అక్కడికక్కడే మృతిచెందిన ఘటన వెంకటాచలం మండలంలోని కాకుటూరు వద్ద జాతీయ రహదారిపై శనివారం జరిగింది. కోవూరుకు చెందిన ఆంథోని(55) గత ఆరేళ్లుగా కాకుటూరుకు వచ్చి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం ఉదయం చెరువు వద్దకు వెళ్లి స్నానం చేసిన అనంతరం రోడ్డు దాటుతుండగా.. గూడూరు వైపు నుంచి నెల్లూరు వైపు వెళ్లే గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. కాలువలో జారిపడి వ్యక్తి మృతి సంగం: కాలువ వద్ద కాళ్లు కడుక్కుంటుండగా ప్రమాదవశాత్తు కాలువలో జారిపడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. మండల కేంద్రం సంగంకు చెందిన పెంచలయ్య స్థానిక కనిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువ వద్ద కాళ్లు కడుక్కుంటుండగా ప్రమాదవశాత్తు కాలువలో జారిపడి మృతిచెందాడు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై నాగార్జునరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో మృతదేహాన్ని బయటకు తీయించారు. వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పెంచలయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
చంపుతామని బెదిరించి నగదు దోపిడీ
● నిందితుల అరెస్ట్ నెల్లూరు(క్రైమ్): ఓ వ్యక్తిని కత్తితో చంపుతామని బెదిరించి అతని వద్దనున్న నగదు, సెల్ఫోన్ దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు 24 గంటల్లో నిందితులను అరెస్ట్ చేసి దోపిడీ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల సమాచారం మేరకు.. పొదలకూరు రోడ్డు జీవీఆర్ కాలనీకి చెందిన ఎ.కార్తీక్ ఏసీ కూరగాయల మార్కెట్ వద్ద తోపుడు బండ్లపై పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 16వ తేదీ రాత్రి ఆయన ఎస్2 థియేటర్లో సినిమాకు వెళ్లాడు. అర్ధరాత్రి సినిమా వదలడంతో బైక్పై ఇంటికి బయలుదేరాడు. బాబా సమోసా దుకాణం సమీపంలోకి వచ్చేసరికి ఆటో, స్కూటీపై నలుగురు వ్యక్తులు అతనిని అటకాయించారు. కత్తితో చంపుతామని బెదిరించి కార్తీక్ వద్దనున్న రూ.5 వేల నగదు, సెల్ఫోన్ దోచుకెళ్లారు. ఆటోనంబర్, స్కూటీ నంబర్ను గుర్తుపెట్టుకున్న బాధితుడు దోపిడీ ఘటనపై 17వ తేదీ చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్స్పెక్టర్ బి.అశోక్కుమార్ ఆదేశాల మేరకు ఎస్సై సయ్యద్ లతీఫున్నీసా కేసు నమోదు చేశారు. ఆటో, బైక్ నంబర్లు, సీసీఫుటేజ్ల ఆధారంగా నిందితులు కొండాయపాళెం నక్కలగుంటకు చెందిన అరుల్ రాజ్, గోవర్ధన్, ఫణీంద్ర, రొక్సన్గా గుర్తించి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో శనివారం నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి దోపిడీ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మత్తు, మాదక ద్రవ్యాల వినియోగానికి బానిసై దోపిడీలకు పాల్పడుతున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. -
షార్ట్సర్క్యూట్తో పూరిల్లు దగ్ధం
● పేలిన గ్యాస్ సిలిండర్ అల్లూరు: మండల పరిధిలోని పురిణి పంచాయతీ నలచెరువుకట్ట కాలనీలో విద్యుత్ షార్ట్సర్క్యూట్తో పూరిల్లు దగ్ధమైన ఘటన శనివారం వేకువజామున జరిగింది. బాధితుల వివరాల మేరకు నలచెరువుకట్టకు చెందిన గిరిజనులు నంబూరు సరోజనమ్మ – శేషయ్య దంపతులు పూరింటిలో నివాసం ఉంటున్నారు. విద్యుత్ షార్ట్సర్క్యూట్ కారణంగా శనివారం వేకువజామున పూరింటిలో మంటలు వ్యాపించాయి. ఈ విషయాన్ని గమనించిన సరోజనమ్మ వెంటనే అప్రమత్తమై ఇంట్లోని కుటుంబసభ్యులతో బయటకు వచ్చేసింది. ఇరుగుపొరుగు వారిని పిలవగా.. వారు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పూరింట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పెద్ద శబ్దంతో పేలడంతో వారు పరుగులు తీశారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. మంటలను ఆర్పడం కోసం అగ్నిమాపక వాహనానికి ఫోన్ చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఇంట్లోని వస్తువులు, దుస్తులు మొత్తం కాలిపోయి బాధిత కుటుంబం కట్టుబట్టలతో మిగిలింది. వీఆర్వో శ్రీనివాసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ నాయకుడు దాసరి పోలయ్య ఆ కుటుంబాన్ని పరామర్శించి తనవంతుగా రూ.2 వేల ఆర్థికసాయం అందజేశారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
సౌదీ అరేబియా రాజుకి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్! ఎందువల్ల వస్తుందంటే..?
అయ్యో దేవుడా! అంత్యక్రియలకు రూ. 30 లక్షలా?
తెలంగాణలో వీసీల పంచాయితీ
పాతకాలం వుడెన్ వస్తువులే.. అయినా ఇంత అందంగా!
'డబ్బు కోసమే 46 ఏళ్ల కమెడియన్తో పెళ్లి'.. నటి ఏమందంటే?
‘చార్ధామ్’ మార్గంలో విషాదం.. ఇప్పటివరకూ 14 మంది మృతి
స్వాతి మలివాల్ కేసు: సీఎం నివాసంలో సీసీటీవీ ఫుటేజీ స్వాధీనం
హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో విశాఖవాసి అరెస్ట్
ఇలా.. అన్నింటిలోనూ డబుల్ గేమ్ నిపుణులే..!
ఎన్టీఆర్ 'దేవర' ఫియర్ సాంగ్ ఫోటోలు వైరల్
తప్పక చదవండి
- బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. పేరేంటో తెలుసా?
- సోషల్ మీడియా ట్రోలింగ్ : బిడ్డ బతికినా, పాపం తల్లి తట్టుకోలేకపోయింది!
- రష్మికకు ఆఫర్ల వరద.. చేతిలో ఇన్ని సినిమాలున్నాయా?
- డయాగ్నస్టిక్ వ్యవస్థను కుప్పకూల్చడం బాధాకరం: హరీశ్ రావు
- జనసేన నాయకుడి దౌర్జన్యం
- బైక్పైనే ముద్దుముచ్చట
- హెలికాఫ్టర్ క్రాష్.. ఇరాన్ అధ్యక్షుడి దుర్మరణం
- ఈ విమానం ఇంకోసారి ఎక్కితే.. ఎయిరిండిపై ప్రయాణికుడు ఆగ్రహం
- ఇక్కడ నాపై బ్యాన్ విధిస్తామని బెదిరిస్తున్నారు: పాయల్ రాజ్పుత్
- ముందస్తు బెయిల్ లేకుండా విదేశాలకు చంద్రబాబు
Advertisement