-
రాయన్ నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల
ధనుష్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ‘రాయన్’ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. సన్ పిక్చర్స్పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో దుషారా విజయన్, అపర్ణా బాలమురళి, విష్ణు విశాల్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరాం, ఎస్జే సూర్య, సెల్వ రాఘవన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న రాయన్ నుంచి తాజాగా మొదటి సాంగ్ విడుదలైంది.ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఎంతో క్రేజీగా సాగిని ఈ సాంగ్కు ధనుష్తో పాటు ఏఆర్ రెహమాన్ గాత్రం కలిపారు. ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో జూన్ 13న రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతుంది. -
OTT: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే!
సమ్మర్ అంటే విద్యార్థులకు సెలవుల కాలం.. అప్పటిదాకా పుస్తకాలతో కుస్తీపట్టినవారంతా ఎంచక్కా ఇంట్లో రిలాక్స్ అవుతూ ఉంటారు. వచ్చే నెలలో మళ్లీ బడి, కాలేజీ బాట పట్టాల్సిందే కాబట్టి ఈ ఒక్క నెలను ఫుల్గా ఎంజాయ్ చేయాలని భావిస్తుంటారు. మండుతున్న ఎండల కారణంగా ప్రతిసారి ఫ్యామిలీతో కలిసి థియేటర్కు వెళ్లే పరిస్థితి లేదు. పైగా కొత్త, పాత తేడా లేకుండా అన్ని రకాల సినిమాలు ఓటీటీలో విడుదలవుతూ కావాల్సినంత వినోదాన్ని పంచుతున్నాయిి. మరి ఈ ఫ్రైడే(మే 9) ఓటీటీలో సందడి చేసే సినిమాలేవో చూసేద్దాం..అమెజాన్ ప్రైమ్👉 ఆవేశం👉 మ్యాక్స్టన్ హాల్ (సిరీస్)👉 ద గోట్ (సిరీస్)(పై మూడూ నేటి నుంచే స్ట్రీమింగ్ అవుతున్నాయి)నెట్ఫ్లిక్స్👉 మదర్ ఆఫ్ ద బ్రైడ్ - స్ట్రీమింగ్ అవుతోంది👉 థాంక్యూ నెక్స్ట్ (సిరీస్) - స్ట్రీమింగ్ అవుతోంది👉 లివింగ్ విత్ లియోపార్డ్స్ - మే 10👉 బ్లడ్ ఆఫ్ జీయస్ (సీజన్ 2) - మే 10👉 కుకింగ్ అప్ మర్డర్: అన్కవరింగ్ ద స్టోరీ ఆఫ్ సీజర్ రోమన్ (డాక్యు సిరీస్) - మే 10👉 ద అల్టిమేటమ్: సౌతాఫ్రికా (రియాలిటీ షో) - మే 10జీ5👉 8ఏఎమ్ మెట్రో - మే 10👉 పాష్ బాలిష్ (సిరీస్) - మే 10 సోనీ లివ్👉 అన్దేకి సీజన్ 3 (సిరీస్) - మే 10లయన్స్ గేట్ ప్లే👉 ద మార్ష్ కింగ్స్ డాటర్ (సినిమా) - మే 10జియో సినిమా👉 మర్డర్ ఇన్ మహిమ్ (సిరీస్) - మే 10👉 ప్రెట్టీ లిటిల్ లయర్స్: సమ్మర్ స్కూల్ - మే 10సన్ నెక్స్ట్👉 ఫ్యూచర్ పొండాటి - మే 10హుళు👉 బయోస్పియర్ - మే 10హోయ్చోయ్👉 చాల్చిత్ర ఏఖాన్ - మే 10చదవండి: తల దించుకున్నా, అందుకే పెళ్లి విషయం దాచా!: యాంకర్ రవి -
పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న చిరంజీవి
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అత్యున్నతమైన పద్మ విభూషణ్ పురస్కారాన్ని మెగాస్టార్ చిరంజీవి అందుకున్నారు. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా మనదేశంలో రెండో అత్యన్నత పౌరపురస్కారం పద్మవిభూషణ్ మెగాస్టార్కు దక్కడంతో తెలుగువారందరూ సంతోషిస్తున్నారు. నేడు (ఏప్రిల్ 9న) రాష్ట్రపతి భవన్లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చిరంజీవి పద్మవిభూషణ్ అవార్డును అందుకున్నారు. దీంతో పద్మవిభూషణ్ చిరంజీవి అయ్యారు. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్, ఉపాసనతో పాటు కుటుంబ సభ్యులు హజరయ్యారు. దీంతో ఆయన అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులు పాల్గొన్నారు. -
ఏడేళ్ల తర్వాత సీక్వెల్.. 'మాయావన్' టీజర్ విడుదల
సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి, జాకీష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'మాయావన్'. కోలీవుడ్లో 2017లో సి.వి. కుమార్ తెరకెక్కించారు. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రానుంది. తాజాగా పార్ట్-2 నుంచి టీజర్ను మేకర్స్ విడుదల చేశారు. తెలుగులో 'ప్రాజెక్ట్ z' పేరుతో మొదటి భాగం ఏప్రిల్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.సైన్స్ ఫిక్షన్ జానర్లో రాబోతున్న 'మాయావన్' సీక్వెల్ నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సి.వి. కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మొదటి భాగం భారీ హిట్ కావడంతో ఏడేళ్ల తర్వాత మాయావన్ పేరుతోనే సీక్వెల్ రానుంది. -
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ '12th ఫెయిల్'తో హీరో విక్రాంత్ మాస్సే పేరు మార్మోగిపోయింది. అతడి సహజ నటనకు జనం ఫిదా అయిపోయారు. ప్రస్తుతం అతడి చేతిలో ఐదు సినిమాలున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా అతడు క్యాబ్ డ్రైవర్తో గొడవపడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులో క్యాబ్ డ్రైవర్ మాట్లాడుతూ.. నా పేరు ఆశిష్. నేనొక క్యాబ్ డ్రైవర్ను. ఓ ప్రయాణికుడిని ఎక్కించుకుని అతడు చెప్పిన లొకేషన్లో దిగబెట్టాను. ఈ నాటకాలు నా దగ్గర కాదుకానీ అతడు నాకు డబ్బులివ్వనంటున్నాడు. పైగా తిడుతున్నాడంటూ ఫోన్ కెమెరాను విక్రాంత్ వైపు తిప్పాడు. దీంతో నటుడు కెమెరాను తన చేతులతో కవర్ చేసేందుకు ప్రయత్నించాడు. కెమెరా ఎందుకు ఆన్ చేశావు? బెదిరిస్తున్నావా? అయినా ఫోన్ యాప్లో సడన్గా డబ్బు ఎందుకు ఎక్కువ చూపిస్తుంది. ఇలాంటి నాటకాలు నా దగ్గర నడవవు అని వాదులాటకు దిగాడు. అది నా తప్పా?ఆ క్యాబ్ డ్రైవర్.. యాప్లో డబ్బు ఎక్కువ చూపిస్తే అది నా తప్పా? మాకన్నా మీరే ఎక్కువ సంపాదిస్తుంటారు. ఎందుకిలా గొడవ చేస్తున్నారు అని ప్రశ్నించాడు. అతడి సమాధానంతో చిర్రెత్తిపోయిన విక్రాంత్.. ఎంత డబ్బు సంపాదిస్తే ఏంటి? అయినా అది కష్టార్జితంతో కూడబెట్టింది అని బదులిచ్చాడు. ఇది చూసిన జనాలు.. నటుడిని వెనకేసుకొస్తున్నారు. ఈ మధ్య ఓలా, ఉబర్ వంటి సంస్థలు ఇలాగే మోసం చేస్తున్నాయి.తప్పే లేదుగమ్య స్థానానికి చేరిన తర్వాత అంతకుముందు సూచించిన అమౌంట్ కంటే ఎక్కువ డబ్బు అడుగుతున్నాయి. విక్రాంత్ గొడవపడటంలో తప్పే లేదు అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం.. ఇదంతా కొత్త సినిమా కోసం ప్రమోషనల్ స్టంట్.. స్క్రిప్ట్ బాగా రాశారు అని సెటైర్లు వేస్తున్నారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood)చదవండి: తల దించుకున్నా, అందుకే పెళ్లి విషయం దాచా! -
ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన ధనుష్ కుమారుడు.. మార్కులెన్నో తెలుసా..?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్లు కొద్దిరోజుల క్రితమే విడాకుల విషయంలో వార్తల్లో నిలిచారు. 2004లో ప్రేమ వివాహం చేసుకున్న వీరిద్దరూ సుమారు 18 ఏళ్ల పాటు కలిసి జీవించారు. వారికి యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, గత రెండేళ్లుగా ధనుశ్, ఐశ్వర్య వేర్వేరుగానే ఉంటున్నారు.ధనుష్ పెద్ద కుమారుడు యాత్ర 12వ తరగతి బోర్డు పరీక్షలలో బాగా రాణించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇంటర్ ఫలితాల్లో అతని అత్యుత్తమ ప్రదర్శనకు అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. ఇటీవల ముగిసిన 12వ తరగతి బోర్డు పరీక్షలో యాత్ర 600 మార్కులకు గాను మొత్తం 569 మార్కులు సాధించినట్లు సమాచారం. తమిళ్ 100కి 98, ఇంగ్లిష్లో 92, గణితంలో 99, ఫిజిక్స్లో 91, బయాలజీలో 97, కెమిస్ట్రీలో 92 మార్కులు సాధించినట్లు ఇంటర్నెట్లో ఒక వార్త వైరల్ అవుతుంది. ఇందులో అధికారికంగా ప్రకటన వెలువడలేదు.ధనుష్, ఐశ్వర్య విడిపోయినప్పటికీ, వారు తమ ఇద్దరు పిల్లలను బాధ్యతగానే చూసుకుంటున్నారు. లాల్ సలామ్ మ్యూజిక్ లాంచ్ పార్టీలో ఐశ్వర్యతో పాటుగా యాత్ర,లింగ కనిపించారు. కెప్టెన్ మిల్లర్ ఫిల్మ్ ఫెస్టివల్ సమయంలో పిల్లలు ఇద్దరూ కూడా ధనుష్తో కలిసి సందడి చేశారు. యాత్రకు 18 ఏళ్లు కాగా, చిన్న కుమారుడు లింగాకు 14 ఏళ్లు. వీరిద్దరూ చెన్నైలోని ఓ ప్రముఖ పాఠశాలలో చదువుకున్నట్లు సమాచారం. -
యదార్థ సంఘటనలతో ‘ప్రేమించొద్దు’
అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రేమించొద్దు’. శిరిన్ శ్రీరామ్ దర్శక నిర్మాణంలో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నట్లు మేకర్స్ తెలిపారు. పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు వెర్షన్ని జూన్ 7న విడుదల కానుంది.ఈ సందర్భంగా చిత్ర దర్శకనిర్మాత శిరిన్ శ్రీరామ్ మాట్లాడుతూ ‘‘యువతలో చాలా మంది నిజమైన ప్రేమకు, ఆకర్షణకు తేడా తెలియకుండా తప్పటడుగులు వేస్తున్నారు. ఇది వారి జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందనే కోణం లో ‘ప్రేమించొద్దు’ అనే శీర్షిక తో ఈ సినిమాను తెరకెక్కించాం. ఇది పాన్ ఇండియాలో రిలీజ్ అవుతోన్న వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన చిత్రం. అందరికీ కనెక్ట్ అయ్యే కథాంశంతో వస్తోన్న సినిమా కావటంతో సినిమాను జూన్ 7న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం. అలాగే తెలుగు లో విడుదల చేసిన తర్వాత, త్వరలో తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయటానికి కూడా ప్లాన్ చేస్తున్నాం’అన్నారు. -
కన్నప్పలో అడుగుపెట్టిన ప్రభాస్.. ఫోటో వైరల్
మంచువిష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో మోహన్బాబు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్ టైన్మెంట్స్పై మోహన్బాబు నిర్మిస్తున్నారు. తాజాగా కన్నప్ప ప్రాజెక్ట్లోకి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అడుగుపెట్టేశారు. ఈమేరకు మంచు విష్ణు అధికారికంగా ప్రకటించేశారు.ఈ చిత్రంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అతిథి పాత్రలో నటించబోతున్నట్లు చాలా రోజుల నుంచి వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ, తాజాగా విష్ణు అధికారికంగా ప్రకటించడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. ఈ మూవీలో అతడు నందీశ్వరుడి పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం ప్రభాస్ కేవలం మూడు రోజుల సమయం మాత్రమే కేటాయించినట్లు సమాచారం ఉంది. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కనిపిస్తున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తి అయిపోయింది. దాదాపు షూటింగ్ కార్యక్రమం పూర్తి దశలో ఉన్న కన్నప్ప ఇదే ఏడాది విడుదల కానుంది.మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ కన్నప్పను మోహన్ బాబు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శివుని భక్తుడైన భక్త కన్నప్ప అచంచలమైన భక్తిని, విశ్వాసాన్ని చూపించబోతున్నారు. "కన్నప్ప"లో ప్రఖ్యాత హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ, యాక్షన్ డైరెక్టర్ కెచా ఖంపక్డీతో సహా ఆకట్టుకునే అద్భుతమైన టీం పని చేస్తోంది. ఆకర్షణీయమైన విజువల్స్, అద్భుతమైన కథ, కథనాలతో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram A post shared by Vishnu Manchu (@vishnumanchu) -
జీవితాలు ఖరాబ్.. కూతుర్ని మర్చిపోయా: యాంకర్ రవి
యాంకర్ రవి.. ఒకప్పుడు ఏదో ఒక వివాదంతో వార్తల్లో నానుతూ ఉండేవాడు. గతంలో అతడు యాంకర్ లాస్యతో జోడీగా షోలు చేయడంతో జనాలు వీరిద్దరినీ జంటగా ఊహించుకునేవారు. ఎంతో క్రేజ్ ఉన్న ఈ జంట మధ్య సడన్గా ఏదో గొడవలు వచ్చి మాట్లాడుకోవడం మానేశారు, కలిసి షోలు చేయడం కూడా ఆపేశారు. నిత్యతో పెళ్లితర్వాత ఎన్నో ఏండ్లకు కలిసిపోయారు. కానీ అప్పటికే ఇద్దరూ చెరో దారి చూసుకున్నారు. లాస్య.. మంజునాథ్ను పెళ్లి చేసుకోగా యాంకర్ రవి.. నిత్య మెడలో తాళి కట్టాడు. తమకు పెళ్లైన విషయాలను ఇద్దరూ ఆలస్యంగానే బయటపెట్టారు. తాజాగా ఓ షోకి హాజరైన రవి తన వ్యక్తిగత విషయాల గురించి ఓపెన్ అయ్యాడు. డబ్బు కోసమే పని'నేను పక్కా కమర్షియల్.. నేను డబ్బు కోసమే పని చేస్తున్నాను. నేనసలు కొరియోగ్రాఫర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చాను. కొంతమంది హీరోల దగ్గరికి వెళ్లి నా ఆసక్తిని బయటపెట్టాను. నాగార్జున గారు ముందు పని నేర్చుకుని తర్వాత ప్రయత్నించమన్నారు. ఓ ఛానల్లో కూడా పెట్టించాడు. అక్కడ సమ్థింగ్ స్పెషల్ అనే షో చేశాను. అలా నా జర్నీ మొదలైంది.కో యాంకర్తో కనెక్షన్నాకు పెళ్లయిందన్న విషయాన్ని ఎందుకు బయటపెట్టలేదంటే.. ఏదైనా ఫంక్షన్కు వెళ్లినప్పుడు అక్కడున్నవారు నిత్యతో.. నన్ను చూపిస్తూ ఫలానా తెలుగు యాంకర్ హజ్బెండ్ కదా అనేవారు. నన్ను నా కో యాంకర్తో ముడిపెట్టేవారు. కాదని చెప్తే.. ఆమె భర్తను పట్టుకుని నీ భర్త అంటావేంటి? అని నిత్యనే నిలదీశారు. పాపం.. తను ఎలా ఫీలవుతుందోనని నేను తల దించుకునేవాడిని. అందుకే తనను లేటుగా పరిచయం చేశాను.నా కూతుర్ని మర్చిపోయాబిగ్బాస్ షో విషయానికి వస్తే.. ఈ రియాలిటీ షో వల్ల చాలామంది జీవితాలు ఖరాబయ్యాయి. అక్కడ జరిగేవాటిని జడ్జ్ చేయొద్దు. నేను బిగ్బాస్కు వెళ్లిన 15 రోజులకు నా కూతురి ముఖం ఎలా ఉంటుందో మర్చిపోయాను. తనెలా ఉంటుందో గుర్తురాలేదు.. బిగ్బాస్ హౌస్లో జరిగేదంతా మీకు చూపించరు' అని రవి చెప్పుకొచ్చాడు.చదవండి: 'చివరి స్టేజీలో ఉన్నా.. నా భర్త ముఖం మాడిపోయింది' -
అలా ‘సత్య’కు నిర్మాతను అయ్యాను : శివ మల్లాల
‘ఓ సారి చెన్నై వెళ్లినప్పుడు నా స్నేహితుడి ద్వారా నిర్మాత సతీష్ పరిచయం అయ్యాడు. ఆయన తన కుమారుడు హమరేష్ని హీరోగా పెట్టి నిర్మించిన రంగోలి సినిమాను నాకు స్పెషల్ స్క్రీనింగ్ వేసి చూపించారు. సినిమా మొత్తం చూశాక క్లైమాక్స్ బాలేదని చెప్పేశాను. నేను చూసింది రఫ్ వెర్షన్ మాత్రమే. రెండు నెలల తర్వాత మళ్లీ తమిళ్ సినీ పెద్దలతో పాటు నాకు సినిమా చూపించాడు. ఆ తర్వాత స్టేజ్పై మాట్లాడుతూ.. తెలుగులో శివ ఈ సినిమాను విడుదల చేస్తున్నాడని ఆయనే చెప్పాడు. అప్పటి వరకు నేను ఈ సినిమాను రిలీజ్ చేయాలని అనుకోలేదు. కానీ సతీష్ నమ్మకంగా చెప్పడంతో.. నేను కూడా ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నానని ప్రకటించాను. అలా నేను అనుకోకుండా సత్య సినిమాకు నిర్మాతను అయ్యాను’ అన్నారు జర్నలిస్ట్, శివమ్ మీడియా అధినేత శివ మల్లాల. హమరేష్, ప్రార్ధన జంటగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం ‘రంగోలి’. ఈ చిత్రాన్ని సత్య పేరుతో శివ మల్లాల మే 10న తెలుగులో విడుదల చేస్తున్నాడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రంగోలి టైటిల్ ఇక్కడ వేరే వాళ్లు బుక్ చేసుకోవడంతో ఈ చిత్రాన్ని తెలుగులో ‘సత్య’పేరుతో రిలీజ్ చేస్తున్నాను. ఆర్జీవీ తెరకెక్కించిన సత్య సినిమా అంటే నాకు చాలా ఇష్టం. అలాగే సినిమా ప్రమోషన్స్కి కూడా కలిసొస్తుందనే ఉద్దేశంతో ఈ చిత్రానికి సత్య అనే టైటిల్ని పెట్టాం. డబ్బింగ్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అచ్చమైన తెలుగు సినిమాలాగే ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాం. క్లైమాక్స్లో మార్పులు చేశాం. తెలుగు ఆడియన్స్కి నచ్చేలా క్లైమాక్స్ ఉంటుంది. సినిమాలో ఫాదర్స్ అండ్ సన్ రిలేషన్షిప్తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు. నిర్మాతగా కొనసాగాలనుకుంటున్నాను. ఇప్పటికే నాలుగు కథను విన్నాను. అన్ని కుదిరితే త్వరలోనే మరో సినిమాను నిర్మిస్తాను’ అని శివ మల్లాల అన్నారు. -
బుల్లితెర నటి పర్సనల్ వీడియో లీక్
తెలుగు బుల్లితెర నటి జ్యోతిరాయ్ గుప్పెడంత మనసు సీరియల్తో టాలీవుడ్ ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకుంది. కన్నడ ఇండస్ట్రీలో ఫేమస్ అయిన నటి దాదాపు 20కి పైగా సీరియల్స్లో నటించింది. అంతేకాకుండా చాలా సినిమాల్లోనూ కనిపించింది. శాండల్వుడ్లో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న నటీమణుల్లో జ్యోతిరాయ్ ఒకరు. సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేసే ఈ బ్యూటీ ఇప్పుడు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.కర్ణాటకకు చెందిన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై అసభ్యకర వీడియో కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుండగా.. ప్రముఖ కన్నడ టెలివిజన్ నటి జ్యోతిరాయ్ పర్సనల్ వీడియో, ఫోటోలు లీక్ అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. అందుకు సంబంధించిన వీడియో ఫేస్బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్ సహా అన్నీ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో షేర్ అవుతుంది. జ్యోతిరాయ్ ఏం చెప్పారు..?ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న అశ్లీల వీడియో, ఫొటోలపై నటి జ్యోతిరాయ్ మీడియా ముందు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ ఫోటోలు, వీడియోలు చూసి తీవ్ర భావోద్వేగానికి లోనైన జ్యోతిరాయ్ ఈ విషయమై కొద్ది రోజుల క్రితం సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. 'వీటికి సంబంధించిన కొన్ని మెసేజ్లు రావడంతో నేను మానసికంగా షాక్ అయ్యాను. ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడే వారిని పట్టించుకోకపోతే అది నా వ్యక్తిగత జీవితంపైనే కాకుండా వృత్తి జీవితంపైనా ప్రభావం చూపుతుంది.వీటి వల్ల నాతో పాటు నా కుటుంబ ప్రతిష్ట ప్రమాదంలో ఉన్నందున చట్టపరంగా వారిపై వెంటనే చర్యలు తీసుకుంటారని నేను అభ్యర్థిస్తున్నాను. తప్పుడు వీడియోలు వ్యాప్తి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోకుంటే నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. వీలైనంత త్వరగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.' అని జ్యోతిరాయ్ కోరినట్లు తెలిసింది.వార్నింగ్ ఎంటి..?జ్యోతిరాయ్కు సంబంధించిన పర్సనల్ వీడియో, ఫోటోలు అంటూ.. మొదటగా ఒక సోషల్ మీడియా ఖాతా నుంచి వైరల్ అయ్యాయి. అందులో అశ్లీలంగా ఉన్న దృశ్యాలను చూసిన వారందరూ షాక్ అయ్యారు. తన పేజీకి వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ కాగానే.. జ్యోతిరాయ్ ఫోటోలు, వీడియోలు మరిన్ని పోస్ట్ చేస్తానని ఒక మేసేజ్ కూడా చేర్చడంతో కర్ణాటకలో పెద్ద దుమారమే రేగుతుంది. అందులో ఉండేది జ్యోతిరాయ్నేనా అనే సందేహాలు కూడా వ్యక్తమౌతున్నాయి. ఆ వీడియోలో ఉండేది జ్యోతిరాయ్ కాదంటూ ఆమెకు మద్ధతుగా అభిమానులు నిలిచారు. ఇప్పటికే పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు కూడా చేశారు. ఇప్పటి వరకైతే ఈ వీడియో, ఫోటోల గురించి జ్యోతిరాయ్ అధికారికంగా రియాక్ట్ కాలేదు. త్వరలో ఆమె స్పందిస్తారని తెలుస్తోంది. View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaj) -
ఆ విషయంలో నిరూపించుకోవాల్సిన పనిలేదు: సమంత
ఏ విషయంలోనూ తగ్గేదేలేదు అనే హీరోయిన్లలో సమంత ముందుటారని చెప్పవచ్చు. కొద్దిరోజుల క్రితం ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడిన శ్యామ్.. మళ్లీ కెమెరాల ముందుకు వచ్చింది. మయోసైటీస్ అనే అరుదైన వ్యాధితో బాధ పడుతున్న సమంత ఆ వ్యాధికి చికిత్స తీసుకున్నారు. అంతకు ముందే భర్తకు దూరం అయ్యారు. గత రెండేళ్లుగా ఏ చిత్రంలోనూ నటించేందుకు అంగీకరించలేదు. ఒప్పుకున్న చిత్రాలు, వెబ్ సిరీస్ల నుంచి కూడా ఆమె తప్పుకున్నారు. అయినప్పటికీ వాటి గురించి కొంచెం కూడా ఆలోచించకుండా చలాకీగా ఉంటూ సంతోషంగా కాలాన్ని గడిపేస్తుంటారు. సమంతకు ఆర్థిక సమస్యలు లేవనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు తనే నిర్మాతగా మారి తెలుగులో మా ఇంటి బంగారం అనే హీరోయిన్ ఓరియన్టెడ్ కథా చిత్రాన్ని చేయడానికి సిద్ధం అయ్యారు. ఇక పోతే తరచూ తన గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తూ వార్తల్లో ఉంటున్నారు. కాగా అలానే ఇటీవల ఆమె అర్ధనగ్నంగా స్నానం చేస్తున్న ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీంతో ఒక్కసారిగా నెటిజన్లు సమంతపై విమర్శల దాడి చేశారు. సమంత ఇలా మారిపోయారేమిటి? ఆమెను ఇలా ఊహించుకోలేమంటూ అభిమానులు కామెంట్ చేశారు. తీరా అది సమంత ఫొటో కాదని, ఫేక్ అని తేలింది. అప్పుటి వరకూ ఈ వ్యవహారంపై నోరు మెదపని సమంత ఇప్పుడు తాను ఎవరికీ, ఏ విషయంలోనూ కొత్తగా నిరూపించుకోవలసిన అవసరం లేదని తన ఇన్స్ట్రాగామ్లో పేర్కొన్నారు. దీంతో దటీజ్ సమంత అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
కమల్హాసన్ 'థగ్ లైఫ్'.. ఆ హీరోను రిప్లేస్ చేశారు!
మణిరత్నం- కమల్ హాసన్ కాంబోలో వస్తోన్న భారీ చిత్రం 'థగ్ లైఫ్'. నాయగన్(1987) సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తోన్న గ్యాంగ్స్టర్ డ్రామాగా తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష, శింబు, ఐశ్వర్యా లక్ష్మి, జోజూ జార్జ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీమ్లో కోలీవుడ్ హీరో శింబు జాయిన్ అయ్యారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేశారు మేకర్స్.కారును వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి, గన్తో ఎవరిపైనో గురి పెట్టి శింబు కాల్చుతున్నట్లుగా ఈ వీడియోలో కనిపించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఢిల్లీలో జరుగుతోంది. కమల్హాసన్, శింబులతో పాటు ప్రముఖ నటీనటులపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ ఢిల్లీ షూటింగ్ షెడ్యూల్ పూర్తవగానే ‘థగ్ లైఫ్’ టీమ్ లండన్ వెళుతుందని కోలీవుడ్ సమాచారం. రెడ్ జెయింట్ మూవీస్, మద్రాస్ టాకీస్ పతాకాలపై నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుందని సమాచారం. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘థగ్ లైఫ్’ సినిమా నుంచి దుల్కర్ సల్మాన్ తప్పుకున్నారని.. ఈ ప్లేస్లోనే శింబును ఎంపిక చేశారని టాక్. అలాగే జయం రవి కూడా ఈ చిత్రం నుంచి తప్పుకోగా.. ఆ పాత్రను అశోక్ సెల్వన్ చేస్తారనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. -
తొలిసారి ఆ జానర్ టచ్ చేయనున్న విజయ్!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ తొలిసారి డిఫరెంట్ జానర్ను టచ్ చేయనున్నాడు. టాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్తో మరోసారి కలిసి పని చేయనున్నాడు. ఈ మేరకు విజయ్ దేవరకొండ, డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్, మైత్రీ మూవీ మేకర్స్ కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్ వీడీ 14 అనౌన్స్ అయ్యింది. VD14నేడు (మే 9న) విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ ప్రకటించారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో బీటలు వారిన పంట పొలాల్లో రాతిపై చెక్కిన వీరుడి విగ్రహం ఉంది. దానిపై ది లెజెండ్ ఆఫ్ ది కర్స్డ్ ల్యాండ్ అని రాసి ఉంది. ఆయన జీవిత కాలం 1854 నుంచి 1878గా పేర్కొన్నారు. చారిత్రక సంఘటనల ఆధారంగా..19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1978 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లు తెలుస్తోంది. 'డియర్ కామ్రేడ్', 'ఖుషి' వంటి సక్సెస్ ఫుల్ సినిమాల తర్వాత మైత్రీ మూవీ మేకర్స్, విజయ్ కలిసి చేస్తున్న మూడో చిత్రమిది. చూస్తుంటే ఈ సారి విజయ్ పెద్ద హిట్టే ఇవ్వాలని ప్లాన్ చేసినట్లున్నాడు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు. 'The Legend of the Cursed Land'Rahul Sankrityan X Vijay Deverakonda @MythriOfficial pic.twitter.com/estyTYSUrj— Vijay Deverakonda (@TheDeverakonda) May 9, 2024చదవండి: ఓటీటీలో పుష్ప విలన్ సూపర్ హిట్ మూవీ.. ఆ విషయంలో రికార్డ్! -
Rashmika Mandanna: గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక
‘పుష్ప’ చిత్రంలో పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయింది రష్మిక. ఆ తర్వాత తన ఫోకస్ అంతా బాలీవుడ్ పైనే పెట్టింది. మిషన్ మజ్ను, గుడ్బై లాంటి బాలీవుడ్ సినిమాల్లో నటించినా.. అంతగా గుర్తింపు రాలేదు. కానీ యానిమల్ మూవీ రష్మికకు పెద్ద బ్రేక్ ఇచ్చింది. అందులో ప్రేమతో హింసించే భర్తకు భార్యగా రష్మిక అద్భుతంగా నటించి, విమర్శకుల ప్రశంసలు పొందింది. యానిమల్ తర్వాత రష్మికకు బాలీవుడ్లో వరుస అవకాశాలు వస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమాలో అవకాశం సొంతం చేసుకుంది ఈ నేషనల్ క్రష్. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేసింది.‘మీరు ఎన్నో రోజులుగా నా సినిమా అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మీకోసమే ఈ సర్ప్రైజ్. ‘సికందర్’తో మీ ముందుకు వస్తున్నాను. ఇంత గొప్ప ప్రాజెక్ట్లో నటించే అవకాశం రావడం ఎంతో ఆనందంగా, గౌరవంగా ఉంది’ అని రష్మిక తన ఎక్స్(ట్విటర్) ఖాతాలో రాసుకొచ్చింది. ఈ చిత్రానికి తమిళ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. సాజిద్ నడియాడ్ వాలా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రష్మిక ‘కుబేర’, ‘రెయిన్ బో’, ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాల్లో నటిస్తోంది. ఆమె నటించిన పుష్ప 2 చిత్రం ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. You guys for a long time have been asking me for the next update and here it is.. ❤️Surprise!! ✨ I am truly grateful and honoured to be a part of #Sikandar #SajidNadiadwala @BeingSalmanKhan @ARMurugadoss @NGEmovies @WardaNadiadwala Releasing in cinemas on EID 2025! 🌙❤️✨… https://t.co/xegNMOkt5u— Rashmika Mandanna (@iamRashmika) May 9, 2024 -
Song: సెట్టయ్యిందే.. నీ వల్లే లైఫ్ సెట్టయ్యిందే..
కార్తికేయ హీరోగా నటించిన ‘భజే వాయు వేగం’ చిత్రం విడుదల తేదీ ఖరారు అయింది. ప్రశాంత్ రెడ్డి చంద్రపు దర్శకత్వంలో ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. అలాగే ఈ సినిమాలోని ‘సెట్ అయ్యిందే...’ పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు.ఐశ్వర్యా మీనన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ నిర్మించింది. రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సంగీతం: రధన్, సహ–నిర్మాత: అజయ్ కుమార్ రాజు .పి. -
బతకడానికి కేవలం 30 శాతమే ఛాన్స్: స్టార్ హీరోయిన్
మురారి, ఇంద్ర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ముద్దుగుమ్మ సోనాలి బింద్రే. టాలీవుడ్లో హిట్ చిత్రాలు చేసిన బాలీవుడ్ భామ.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. అయితే 2018లో క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఇటీవల ది బ్రోకెన్ న్యూస్ సీజన్-2 వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సోనాలి క్యాన్సర్ నిర్ధారణ తర్వాత తన కుటుంబం తీవ్రమైన ఒత్తిడికి గురైందని తెలిపింది.సోనాలి మాట్లాడుతూ.. 'ముఖ్యంగా 2018లో క్యాన్సర్ నిర్ధారణ అయింది. ఆ వార్త నా కుటుంబాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. మాకు షాకింగ్గా అనిపించింది. ఇది జరిగినప్పుడు నేను రియాల్టీ షో చేస్తున్నా. ఆ సమయంలో నాకు ఆరోగ్యం సరిగ్గా లేదని తెలుసు. డాక్టర్ వద్దకు వెళ్లినప్పుడు ఏదైనా చిన్న ప్రాబ్లమ్ మాత్రమే ఉంటుందని అనుకున్నా. కానీ పరీక్షలు చేశాక అసలు విషయం తెలిసింది. ఆ సమయంలో డాక్టర్, నా భర్త గోల్డీ బెహ్ల్ మొహాలు ఒక్కసారిగా మారిపోయాయి. అప్పటికే స్టేజ్ -4 క్యాన్సర్తో ఉన్నట్లు తెలిసింది. కేవలం 30 శాతం బతికే అవకాశం ఉందని డాక్టర్ చెప్పారు. దీంతో డాక్టర్పై నా భర్త కోపం ప్రదర్శించాడు. కానీ ఆ తర్వాత కీమోథెరపీ చేయించుకున్నా. అది చాలా కఠినమైన చికిత్స. నా జుట్టు రాలడం లాంటి తీవ్రమైన సమస్య ఎదుర్కొన్నా' అని తెలిపింది. -
హీరోయిన్తో బ్రేకప్! మరో బ్యూటీతో హీరో పార్టీ!
సినిమా ఇండస్ట్రీలో ప్రేమాయణాలు, బ్రేకప్పులు సర్వసాధారణమైపోయాయి. కొన్ని జంటలైతే పెళ్లి పీటలెక్కడం ఖాయమనుకునే సమయానికి అనూహ్యంగా విడిపోవడానికే మొగ్గుచూపుతున్నాయి. ఇటీవలి కాలంలో బాలీవుడ్ లవ్ బర్డ్స్ అనన్య పాండే- ఆదిత్య రాయ్ కపూర్ బ్రేకప్ చెప్పుకున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. హీరోయిన్తో పార్టీ !దీనిపై అటు అనన్య, ఇటు ఆదిత్య ఎవరూ స్పందించనేలేదు. ఇంతలో ఆదిత్య రాయ్ కపూర్ మరో హీరోయిన్తో పార్టీ చేసుకున్నాడంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సారా అలీ ఖాన్తో అతడు పార్టీలో పాల్గొన్నాడు. వీరిద్దరూ మెట్రో ఇన్ ఢిల్లీ అనే సినిమా సెట్స్లో డైరెక్టర్ అనురాగ్ బసు బర్త్డే సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు. అది సహజమే..ఒక సినిమాలో హీరోహీరోయిన్లుగా నటిస్తున్నప్పుడు ఆ మాత్రం స్నేహం, సాన్నిహిత్యం ఉండటం సహజమే అని అభిమానులు వెనకేసుకొస్తున్నారు. కొందరు మాత్రం బ్రేకప్ అయిన బాధ లేకుండా ఆదిత్య మరో హీరోయిన్తో ఇంత చనువుగా ఉండటం ఏమీ బాలేదని కామెంట్లు చేస్తున్నారు. #SaraAliKhan and #AdityaRoyKapur celebrating #AnuragBasu sir's bday on the sets of #MetroInDino 🥹💕 pic.twitter.com/pab1vBwa68— sakt` (@SarTikFied) May 8, 2024 -
కుమారుడికి తాతగా నటించనున్న బ్రహ్మానందం
నిజ జీవితంలో తండ్రీ కొడుకులైన బ్రహ్మానందం, రాజా గౌతమ్ ‘బ్రహ్మా ఆనందం’ అనే చిత్రంలో తాత, మనవడిగా నటించనున్నారు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించనున్నారు. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్లుగా నటించనున్న ఈ చిత్రంలో ‘వెన్నెల’ కిశోర్ కీలక పాత్రలో కనిపించనున్నారు.సావిత్రి, శ్రీ ఉమేష్ యాదవ్ సమర్పణలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మించనున్న ఈ సినిమాని ప్రీ–లుక్ పోస్టర్, వీడియోతో ప్రకటించారు. ‘‘బ్రహ్మా ఆనందం’ సినిమా పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఉంటుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. ఈ ఏడాది డిసెంబర్ 6న చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: మితేష్ పర్వతనేని, సంగీతం: శాండిల్య పిస΄ాటి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పి. దయాకర్ రావు. -
ఆ హీరోల్లాంటి సినిమాలు చేయాలని ఉంది: సత్యదేవ్
‘‘నటుడిగా వైవిధ్యమైన పాత్రలు చేయాలి. ‘నాయగన్’ సినిమాలో కమల్హాసన్లా కొత్త గెటప్ ట్రై చేయాలని ఉంది. చిరంజీవి నటించిన ‘ఆపద్బాంధవుడు’ చిత్రం అంటే ఇష్టం. అలాగే ‘బాహుబలి’ కూడా. అలాంటి సినిమాలు చేయాలన్నదే నా కల. కొత్త తరహా కథతో రూపొందించిన కృష్ణమ్మ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది అని హీరో సత్యదేవ్ అన్నారు. వీవీ గోపాలకృష్ణ దర్శకత్వంలో సత్యదేవ్, అతీరా రాజ్ జంటగా నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’. కొరటాల శివ సమర్పణలో కృష్ణ కొమ్మాలపాటి నిర్మించారు. మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సందర్భంగా హీరో సత్యదేవ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.‘కృష్ణమ్మ సినిమాకి నటీనటులు, సాంకేతిక నిపుణులందరూ ఓకే అయ్యాక నేను చివర్లో ఈ ప్రాజెక్టులోకి వచ్చా. గోపాలకృష్ణ చెప్పిన కథ నిర్మాత కృష్ణకు నచ్చింది. ఆ తర్వాత ఈ కథను కొరటాల శివ విన్నారు. ఆయనకు బాగా నచ్చడంతో సమర్పకుడిగా మారారు. కొరటాలగారు కథలో ఒక్క మార్పు కూడా చెప్పలేదు. అంత పెద్ద డైరెక్టర్ అయిన కొరటాల స్క్రిప్ట్లో మార్పు చెప్పకుండా సినిమాకు సపోర్ట్ చేయడం సంతోషం. ∙విజయవాడ పేరు చెప్పగానే రాజకీయం, రౌడీయిజం గురించి చెబుతుంటారు. కానీ, విజయవాడ అంటే అవి మాత్రమే కాదని చెప్పే కథే కృష్ణమ్మ. ముగ్గురు స్నేహితుల కథే ఈ మూవీ. మంచి ఫ్యామిలీ ఉండాలి, జీవితంలో బాగా సెటిల్ కావాలనుకునే ముగ్గురు ఫ్రెండ్స్ కల చెదిరిపోతుంది.అసలు అప్పుడు వాళ్లేం చేశారు? అనే కథాంశంతో ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రంలో వించిపేట భద్ర అనే పాత్ర చేశాను. విజయవాడ యాస, పొగరు, పగ.. ఇలాంటివన్నీ ఆ పాత్రలో చూపించడం సవాల్గా అనిపించింది. నిర్మాత కృష్ణకి సినిమా అంటే ఫ్యాషన్. ఆయన ఖర్చుకి వెనకాడకుండా షూటింగ్ అంతా విజయవాడలోనే చేయడానికి సపోర్ట్ చేశారు. కాలభైరవ చాలా ఇంటెన్స్ ఉన్న సంగీతం ఇచ్చాడు. ‘కృష్ణమ్మ’ మూవీతో సత్యదేవ్ స్టార్ అవుతాడనే నమ్మకం ఉందని రాజమౌళి అనడం హ్యాపీగా అనిపించింది. ఈ మూవీ హిట్ అయి స్టార్డమ్ వచ్చినా నేను ఇప్పటిలాగే ఉంటాను. చిరంజీవిగారి ‘గాడ్ ఫాదర్’, అక్షయ్ కుమార్గారి ‘రామసేతు’ చిత్రాలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉత్తరాదిలోనూ నాకు మంచి గుర్తింపు వచ్చింది. మళ్లీ ఆ రేంజ్ పాత్రలు రాకపోవడంతో చేయడంలేదు. తమిళంలో ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. -
సాయి పల్లవి బర్త్ డే.. ఆమె కోసం స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చిన టీమ్!
ఫిదా మూవీతో తెలుగువారి గుండెలు కొల్లగొట్టిన నేచురల్ బ్యూటీ సాయిపల్లవి. తెలుగులో స్టార్ హీరోయిన్గా అభిమానుల్లో చోటు సంపాదించుకుంది. ప్రస్తుతం నాగచైతన్య సరసన తండేల్ మూవీ నటిస్తోంది. చందూ మొండేటి డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మత్య్సకారుల బ్యాక్డ్రాప్ స్టోరీతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో చైతూ మత్య్సకారుని పాత్రలో కనిపించనున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు అత్యంత భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.అయితే ఇవాళ సాయిపల్లవి బర్త్ డే కావడంతో తండేల్ చిత్ర యూనిట్ స్పెషల్ వీడియోను షేర్ చేసింది. సాయి పల్లవి తెలుగు సినిమాలతో మెప్పించిన పాత్రలను వీడియోలో చూపించారు. ముఖ్యంగా తండేల్ మూవీ సెట్లో సాయిపల్లవి హావభావాలతో కూడిన స్పెషల్ వీడియో అద్భుతంగా రూపొందించారు. చివర్లో నాగచైతన్య, సాయి పల్లవి మధ్య వచ్చే సీన్తో ఆడియన్స్కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. కాగా.. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. -
రౌడీ హీరో బర్త్ డే అప్డేట్.. కొత్త మూవీకి డైరెక్టర్ ఎవరంటే?
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. రవికిరణ్ కోలా దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన పోస్టర్ను ట్విటర్లో షేర్ చేశారు. ప్రముఖ నిర్మాణసంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు, శిరీష్ నిర్మించనున్నారు. ఈ బ్యానర్లో వస్తోన్న 59న చిత్రం ఇది నిలవనుంది.ఈ సినిమాను భారీస్థాయిలో పాన్ ఇండియా ప్రాజెక్ట్గా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. 'రాజా వారు.. రాణి గారు' సినిమాతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా రిలీజైన పోస్టర్ చూస్తే ఫుల్ మాస్ యాక్షన్ చిత్రంగా కనిపిస్తోంది. 'కత్తి నేనే.. నెత్తురు నాదే.. యుద్ధం నాతోనే..' అనే క్యాప్షన్ చూస్తేనే సినిమా కథంటే అర్థమవుతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల వివరాలు ప్రకటించనున్నారు. “The blood on my hands is not of their death.. but of my own rebirth..“Ravi Kiran Kola X Vijay Deverakonda@SVC_official pic.twitter.com/xGXXiNbVQu— Vijay Deverakonda (@TheDeverakonda) May 9, 2024 -
ఓటీటీకి వచ్చేసిన పుష్ప విలన్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మలయాళ స్టార్ నటుడు, పుష్ప విలన్ ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఆవేశం. గతనెల 11న మలయాళంలో రిలీజైన చిత్రం బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ఫుల్ యాక్షన్ అండ్ కామెడీ సినిమాగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. మలయాళంలో హిట్ అయిన తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో అందుబాటులోకి వచ్చేసింది. ఇవాళ అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం మలయాళంలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోన్న ఈ చిత్రం.. త్వరలోనే తెలుగు డబ్బింగ్ అందుబాటులోకి వచ్చే అవకాశముంది.భారీ ధరకు ఓటీటీ డీల్సూపర్ హిట్ మూవీ కావడంతో ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. రూ.35 కోట్లను చెల్లించి అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. దీంతో ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ద్వారా అత్యధిక మొత్తం పొందిన మలయాళ చిత్రంగా ఆవేశం రికార్డు దక్కించుకుంది. కాగా.. ఈ సినిమాను రూ.30 కోట్లతో తెరకెక్కించారు. college, gangsters, mayhem, and a whole lot of unexpected! 🤪#AaveshamOnPrime, watch nowhttps://t.co/6L4qK9PLeR pic.twitter.com/rAIbvGXE9S— prime video IN (@PrimeVideoIN) May 8, 2024 -
మా గురించి మాట్లాడేందుకు మీరెవరు?: వరలక్ష్మి శరత్కుమార్
దక్షిణాది నటీమణుల్లో వరలక్ష్మీ శరత్కుమార్ రూటే వేరని చెప్పవచ్చు. ఆమె ఎంత సౌమ్యంగా మాట్లాడతారో, తేడా వస్తే అంత రఫ్గానూ దులిపేస్తారు. నిర్మొహమాటంగా మాట్లాడే వరలక్ష్మీశరత్కుమార్ ఏ భాషలోనైనా.. ఎలాంటి పాత్రనైనా నటించే సత్తా కలిగిన నటి. ఈమె తాజాగా ఉమెన్ సెంట్రిక్ పాత్రలో నటించిన బహుభాషా చిత్రం శబరి ఇటీవలే తెరపైకి వచ్చింది. మరికొన్ని చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. కాగా ఇటీవల నటి వరలక్ష్మీ శరత్కుమార్ ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు మాట్లాడారు. ముఖ్యంగా తన గురించి మాట్లాడిన నెగిటివ్ కామెంట్స్పై ఫైర్ అయ్యారు.అసలు తన గురించి నెగిటివ్గా మాట్లాడటానికి మీరెవరు? అని వరలక్ష్మి ప్రశ్నించారు. శరత్కుమార్ మొదట్లో ఛాయ అనే మహిళను పెళ్లి చేసుకోవడంతో ఆమెకు వరలక్ష్మీ శరత్కుమార్ జన్మించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత మనస్పర్థల కారణంగా వరలక్ష్మీ తల్లిదండ్రులు విడిపోయారు. ఆ తరువాత శరత్కుమార్ నటి రాధికను రెండో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ రాహుల్ అనే కుమారుడు ఉన్నాడు.అయితే ప్రస్తుతం శరత్కుమార్ మొదటి భార్య ఛాయ, రెండో భార్య రాధిక కుటుంబాలు కలిసి మెలిసే ఉంటున్నాయి. ఇటీవల నటి వరలక్ష్మీ శరత్కుమార్ ఎంగేజ్మెంట్ వేడుకలోనూ అందరూ కలిసి పాల్గొన్నారు. ఈ సంఘటన గురించి రక రకాల కామెంట్స్ దొర్లాయి. వీటిపై స్పందించిన నటి వరలక్ష్మీ శరత్కుమార్ మీరు కామెంట్స్ చేసే వ్యక్తి జీవితం ఏమిటన్నది మీకు తెలుసా? తను ఉన్నత స్థాయికి చేరారంటే అందుకు పడిన కష్టం మీకు తెలుసా? ఈజీగా కామెంట్స్ మాత్రం చేస్తారు అని ఫైరయ్యారు.ఒకరి గురించి నెగిటివ్ కామెంట్స్ చేసే ముందు వారి గురించి మీకేం తెలుసో ఆలోచించుకోవాలని వరలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే నటీనటుల గురించి మీరెందుకు ఇతరులకు సాయం చేయలేదని కామెంట్ చేసేకంటే.. మీరెందుకు సాయం చేయకూడదు అని ప్రశ్నించారు. నిజం చెప్పాలంటే ప్రపంచంలోనే నటీమణులకే పారితోషికం చాలా తక్కువని అన్నారు. ఎందుకంటే తమకు ఎప్పుడు డబ్బు వస్తుందో తెలియదని.. షూటింగ్ లేకపోతే పారితోషికమే రాదని చెప్పారు. అయితే నెగిటివ్ కామెంట్స్ చేసేవారు తాము సౌకర్యవంతమైన జీవితాన్ని అనుభవిస్తుంటామని భావిస్తుంటారన్నారు.కానీ నిజానికి అలాంటి పరిస్థితిలేదని ఆమె తెలిపారు. తాము నెలకు తమ వద్ద పని చేసేవారికి జీతాలు చెల్లించాలని.. అయితే తమకు మాత్రం నెలసరి జీతాలు ఉండవన్నారు. షూటింగ్ ఉంటేనే పారితోషిక ఉంటుందని.. ఒక్కోసారి నిర్మాత ఇంట్లో ఏదైనా సమస్య తలెత్తి.. షూటింగ్ నిలిచిపోతే పారితోషికం ఆగిపోతుందన్నారు. తాము వెళ్లి అడిగే పరిస్థితి ఉండదన్నారు. అలా తమకు పారితోషికం ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి అన్నారు. కాబట్టి తమ పని అంత సులభం కాదని నటి వరలక్ష్మీ శరత్కుమార్ పేర్కొన్నారు. -
పెళ్లి ఫోటోలు డిలీట్.. ఎయిర్పోర్ట్లో మెరిసిన స్టార్ కపుల్!
బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్లో దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్ జంట ఒకరు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. దీపికా ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ఈ దంపతులు ప్రకటించారు. త్వరలోనే ఈ జంట తమ మొదటి బిడ్డను జీవితంలోకి ఆహ్వానించనున్నారు.అయితే తాజాగా రణ్వీర్ సింగ్ తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా నుంచి తొలగించారు. దీంతో వీరిద్దరిపై మరోసారి రూమర్స్ మొదలయ్యాయి. అయితే తాజాగా ఈ జంట ముంబయి ఎయిర్పోర్ట్లో మెరిసింది. రణవీర్తో కలిసి తిరిగివచ్చిన దీపికా జంటగా కనిపించారు. అయితే పెళ్లి ఫోటోలు డిలీట్ చేయడంపై ఇప్పటివరకు రణ్వీర్ సింగ్ స్పందించలేదు. దీపికా ఈ ఏడాది సెప్టెంబరులో తమ బిడ్డకు జన్మనివ్వనున్నట్లు తెలుస్తోంది.దీపికా సినిమాల విషయానికొస్తే రణవీర్ సింగ్, అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్, కరీనా కపూర్, టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్లతో కలిసి సింఘమ్ ఎగైన్లో కనిపించనుంది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీలతో కల్కి 2898 ఏడీ చిత్రంలో నటించింది. మరోవైపు రణవీర్ సింగ్, కియారా అద్వానీ జంటగా డాన్- 3 చిత్రంలో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani)
Pagination
OTT: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే!
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
సీఎం జగన్ పంచులతో దద్దరిల్లిన రాజంపేట..
చరిత్రలో నిలిచిపోయేలా.. అన్నమయ్య జిల్లా ప్రజలకు శుభవార్త
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
చంద్రబాబు కూటమి ఉమ్మడి సభలు పై సీఎం జగన్ అదిరిపోయే సెటైర్లు
ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన ధనుష్ కుమారుడు.. మార్కులెన్నో తెలుసా..?
చంద్రబాబు కు అధికారం వస్తే "జిల్లా హెడ్ క్వార్టర్స్"
యదార్థ సంఘటనలతో ‘ప్రేమించొద్దు’
తమిళనాడు బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు: 8 మంది మృతి
రాయ్ లక్ష్మీ బర్త్డే సెలబ్రేషన్స్.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)
రాజంపేట లో అశేష ప్రజా స్పందన
తప్పక చదవండి
- నేను అతడికి బిగ్ ఫ్యాన్.. అది నా అదృష్టంగా భావిస్తున్నా: అభిషేక్
- ఏడేళ్ల తర్వాత సీక్వెల్.. 'మాయావన్' టీజర్ విడుదల
- కేజ్రీవాల్ పిటిషన్ను వ్యతిరేకించిన ఈడీ.. సుప్రీంలో అఫిడవిట్ దాఖలు
- కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల్లోకి!.. రాబర్ట్ వాద్రా
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఐదు రోజులు గట్టి వానలే!
Advertisement