Chhattisgarh Elections 2018
-
ఛత్తీస్గఢ్లో మారిన సమీకరణలు? కాంగ్రెస్కు అనుకూలం?
దేశంలో లోక్సభ ఎన్నికల ఆరు దశల ఓటింగ్ ముగిసింది. ఇప్పుడు ఏడవ, చివరి దశకు జూన్ ఒకటిన ఓటింగ్ జరగనుంది. ఈ నేపధ్యంలో పలు రాజకీయ సమీకరణలు మారాయి. ఛత్తీస్గఢ్ విషయానికొస్తే 2019 లోక్సభ ఎన్నికల్లో ఛత్తీస్గఢ్లోని 11 స్థానాలకు గాను 9 స్థానాను బీజేపీ దక్కించుకుంది. అయితే ఈసారి ఓటర్లు ఏ ప్రాతిపదికన ఓటువేశారనే అంశం బీజేపీకి అంతుచిక్కడం లేదని విశ్లేషకులు అంటున్నారు.ఛత్తీస్గఢ్లో మొదటి మూడు దశల్లో 11 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. దీంతో రాష్ట్రంలోని లోక్సభ సీట్లకు ఓటింగ్ పూర్తయింది. ఈ నేపధ్యంలో రాజకీయ విశ్లేషకులు రాష్ట్రంలోని ఓటర్ల మనోభావాలు ఇలా ఉన్నాయంటూ పలు అంశాలు చెబుతున్నారు. రాష్ట్రంలోని మహిళల ఓట్లు బీజేపీకి పడే అవకాశాలున్నాయని, అదే సమయంలో కాంగ్రెస్ హామీపై కూడా ఓటర్లు ఆలోచిస్తున్నారన్నారు. కొన్ని ప్రాంతాలలో ప్రజలు రిజర్వేషన్ను రద్దు, రాజ్యాంగాన్ని మార్చడం అనే అంశాలకు మద్దతు పలికారట. ఇది కాంగ్రెస్కు ప్రయోజనం చేకూరుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.2019లో ఛత్తీస్గఢ్లో బీజేపీ 9 లోక్సభ స్థానాలు, కాంగ్రెస్ రెండు లోక్సభ స్థానాలను గెలుచుకుంది. అయితే ఈసారి కాంగ్రెస్కు కొంత మేలు జరిగేలా కనిపిస్తోంది. ఛత్తీస్గఢ్లోని 11 లోక్సభ స్థానాలకు సంబంధించి ఈసారి కాంగ్రెస్కు మూడు సీట్లు రావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాజ్నంద్గావ్లో భూపేష్ బఘేల్, బీజేపీ అభ్యర్థి సంతోష్ పాండే మధ్య గట్టి పోటీ నెలకొంది. అదే సమయంలో దుర్గ్, మహాసముంద్ స్థానాల్లో కులాల ప్రాతిపదికన ఓటింగ్ జరిగిందనే అంచనాలున్నాయి. దీంతో పాటు కోర్బా సీటులో సరోజ్ పాండే, జ్యోత్స్నా మహంత్ మధ్య స్వల్ప ఓట్ల తేడాతో గెలుపు ఓటములుండే అవకాశం ఉంది. -
బీజేపీకి పక్కలో బల్లెం!
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ కాంగ్రెస్లో నెలకొన్న రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. కాంగ్రెస్ నేతలందరితో సుదీర్ఘంగా మంతనాలు జరిపిన పార్టీ చీఫ్ రాహుల్గాంధీ.. సీనియర్ నేత భూపేశ్ బఘేల్(57)ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఖరారు చేశారు. అనంతరం ఆదివారం నాడిక్కడ సమావేశమైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బఘేల్ను శాసన సభాపక్ష(సీఎల్పీ) నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర పరిశీలకుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ..‘నిజంగా ఇది కఠినమైన నిర్ణయమే. ఎందుకంటే బఘేల్, చరణ్దాస్ మహంత్, టి.ఎస్. సింగ్దేవ్, తామ్రధ్వజ్ సాహూ కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలకంగా వ్యవహరించారు. పార్టీలో ఈ నలుగురి హోదా సమానమే. వీరందరితో పలు దఫాలుగా చర్చించిన మీదట బఘేల్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా రాహుల్ ఎంపిక చేశారు. ఇదే విషయాన్ని రాష్ట్ర శాసన సభ్యులకు తెలియజేశాం. వారంతా ఏకగ్రీవంగా బఘేల్ను సీఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. రాయ్పూర్లోని సైన్స్ కాలేజ్ మైదానంలో బఘేల్ సోమవారం సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు. బఘేల్తో పాటు ఇంకెవ్వరూ మంత్రులుగా ప్రమాణం చేయడంలేదు’ అని తెలిపారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చినందున తమముందు చాలా సవాళ్లు ఉన్నాయని వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని నిలబెట్టుకుంటామనీ, బఘేల్ తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారని ఖర్గే విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఖరారైన బఘేల్కు కాంగ్రెస్ పార్టీ శుభాకాంక్షలు తెలిపింది. బఘేల్ ఎంపికకు ముందు కాంగ్రెస్ పార్టీలో హైడ్రామా నడిచింది. నలుగురు నేతలు సీఎం పదవి కోసం పోటీపడటంతో పార్టీ చీఫ్ రాహుల్గాంధీ వీరితో పలు దఫాలుగా చర్చలు జరిపారు. చివరికి రాహుల్ ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేస్తారో వారికే మద్దతు ప్రకటిస్తామని ఈ నెల 12న సీఎల్పీ చేత తీర్మానం చేయించారు. మొత్తం 90 స్థానాలున్న ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ 68 సీట్లతో ఘనవిజయం సాధించగా, బీజేపీ 15 స్థానాలకు పరిమితమైంది. రుణమాఫీపైనే తొలి సంతకం: బఘేల్ ఛత్తీస్గఢ్లో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతుల రుణమాఫీపైనే తొలి సంతకం పెడతానని కాబోయే ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ తెలిపారు. అలాగే 2013లో మావోయిస్టుల చేతిలో కాంగ్రెస్ నేతల ఊచకోతపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణకు ఆదేశిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలోని రైతులు, ఆదివాసీలు, యువత, మహిళలు, చిరువ్యాపారుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. దుర్గ్ జిల్లాలోని పతన్ నియోజకవర్గం నుంచి బఘేల్ గెలుపొందారు. 2013, మే 25న ఛత్తీస్గఢ్లోని జీరమ్ లోయ ప్రాంతంలో కాంగ్రెస్ నేతల కాన్వాయ్పై మావోయిస్టులు విరుచుకుపడ్డారు. ఈ దాడిలో సల్వాజుడుం వ్యవస్థాపకుడు, కాంగ్రెస్ నేత మహేంద్ర కర్మ, రాష్ట్ర పీసీసీ చీఫ్ నందకుమార్ పటేల్, ఆయన కుమారుడు దినేశ్ సహా 25 మంది కీలక నేతలు, కార్యకర్తలు చనిపోయారు. బీజేపీకి పక్కలో బల్లెం ఛత్తీస్గఢ్ లో దాదాపు 15 ఏళ్ల బీజేపీ పాలనకు చరమగీతం పాడటంలో కీలకంగా వ్యవహరించిన భూపేశ్ బఘేల్ మధ్యప్రదేశ్లోని(ప్రస్తుతం ఛత్తీస్గఢ్) దుర్గ్ జిల్లాలో ఓ సాధారణ రైతు కుటుంబంలో 1961, ఆగస్టు 23న జన్మించారు. చందూలాల్ చంద్రశేఖర్ ప్రోద్బలంతో 1980 దశకం ప్రారంభంలో రాజకీయాల్లోకి ప్రవేశించారు. అనంతరం ఐదేళ్లకే యూత్ కాంగ్రెస్లో చేరారు. 1994–95లో మధ్యప్రదేశ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. క్రమంగా మధ్యప్రదేశ్ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. కుర్మి సామాజిక వర్గానికి చెందిన భూపేశ్కు రాష్ట్రంలో ఉన్న 52 శాతం మంది ఓబీసీల్లో మంచి పలుకుబడి ఉంది. దుర్గ్ జిల్లా పటాన్ నియోజకవర్గం నుంచి బఘేల్ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1993లో మధ్యప్రదేశ్ అసెంబ్లీకి తొలిసారి ఎన్నికైన బఘేల్.. అజిత్ జోగీతో పాటు దిగ్విజయ్ సింగ్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. భూపేశ్ బఘేల్ సంఘ సంస్కర్తగా పేరుపొందారు. పేదలు ఆర్థికంగా చితికిపోకుండా ఉమ్మడి మధ్యప్రదేశ్(2000, నవంబర్ 1న మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ అనే ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటుచేశారు)లో సామూహిక వివాహాలు జరిపించారు. అంతేకాకుండా బీజేపీ నేతలకు పక్కలో బల్లెంలా తయారయ్యారు. ప్రతీ సందర్భంలోనూ బీజేపీని ఇరుకున పెట్టేలా మాట్లాడటంతో పాటు ఓ బీజేపీ నేతకు సంబంధించిన అశ్లీల దృశ్యాల సీడీని విడుదల చేసి వివాదాల్లో చిక్కుకున్నారు. ఈ వ్యవహారంలో బఘేల్ జైలుకు సైతం వెళ్లాల్సి వచ్చింది. ఆతర్వాత బఘేల్తో పాటు ఆయన భార్య భూకబ్జాలకు పాల్పడ్డారని రమణ్సింగ్ ప్రభుత్వం కేసులు పెట్టి వేధించింది. అంతేకాకుండా సొంత పార్టీలోనూ ఆయనకు ఇబ్బందులు ఎదురయ్యాయి. అన్నింటిని ఓపికగా సహించిన భూపేశ్ బఘేల్, నేడు ఛత్తీస్గఢ్ మూడో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. బఘేల్కు ముందు అజిత్ జోగి(మూడేళ్లు), రమణ్సింగ్(15 సంవత్సరాలు) ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. -
ఛత్తీస్గఢ్ సీఎంగా భూపేశ్ బఘేల్
-
వీడిన ఉత్కంఠ.. చత్తీస్గఢ్ సీఎం ఖరారు
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ సీఎం ఎవరనే దానిపై కొనసాగుతున్న ఉత్కంఠకు కాంగ్రెస్ పార్టీ ఆదివారం తెరదించింది. నేడు రాయ్పూర్లో జరిగిన సీఎల్పీ సమావేశంలో నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ భూపేశ్ బఘేల్ను పక్షనేతగా ఎన్నుకున్నారు. అనంతరం ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా బఘేల్ పేరును కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. తాజా ఎన్నికల్లో ఛత్తీస్గఢ్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్.. సీఎం ఎంపిక విషయంలో మాత్రం నాలుగు రోజుల పాటు తీవ్ర కసరత్తు చేసింది. బఘేల్తోపాటు సీనియర్ నేతలు టీపీ సింగ్ దేవ్, తమరాథ్వాజ్ సాహు, చరణ్దాస్ మహంత్లు సీఎం రేస్లో ఉండటంతో పార్టీ అధిష్టానం ఎటూ తెల్చుకోలేకపోయింది. దశలు వారీగా పార్టీ సీనియర్ నేతలు ఆశావహులతో చర్చలు జరిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా శనివారం ఆశావహులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిపారు. తొలి నుంచి అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని సీఎం ఎంపిక ఉంటుందని తెలిపిన కాంగ్రెస్ అధిష్టానం.. ఛత్తీస్గఢ్లో పార్టీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన బఘేల్ వైపే మెగ్గు చూపింది. కాగా, బఘేల్ సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నట్టుగా సమాచారం. ఛత్తీస్గఢ్ తాజా ఎన్నికల్లో కాంగ్రెస్కి 68, బీజేపీకి 15, జేసీసీకి 5, బీఎస్పీకి 2 సీట్లు వచ్చిన సంగతి తెలిసిందే. 1961లో ఓ రైతు కుటుంబంలో జన్మించిన బఘేల్.. 1986లో యూత్ కాంగ్రెస్లో చేరడం ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 1993లో పటాన్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన బఘేల్ మధ్యప్రదేశ్ అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన అక్కడి నుంచే విజయం సాధించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2003లో జరిగిన ఎన్నికల్లో కూడా ఆయన అదే స్థానం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో పలు కీలక బాధ్యతలు చేపట్టారు. తొలి సారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి బఘేల్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. ఓ మంత్రికి సంబంధించి తప్పుడు ప్రచారం చేస్తున్నాడనే ఆరోపణలపై ఆయనకు సీబీఐ కోర్టు 14 రోజుల జైలు శిక్ష విధించింది. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించిన బఘేల్ తన తరఫున వాదించడానికి ఓ లాయర్ను కూడా నియమించుకోలేదు. -
ముందు బఘేల్, తర్వాత దేవ్?
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఛత్తీస్గఢ్ సీఎం పదవిపై నాలుగు రోజుల ఉత్కంఠకు తెరపడనుంది. నలుగురు కీలక నేతలతో దోబూచులాడిన సీఎం పదవి చివరికి భూపేశ్ బఘేల్ను వరించే అవకాశాలు కన్పిస్తున్నాయి. రెండున్నరేళ్ల తర్వాత టీపీ సింగ్ దేవ్కు సీఎంగా అవకాశమిచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించిందని తెలుస్తోంది. ఛత్తీస్గఢ్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన కాంగ్రెస్..ముఖ్యమంత్రిని ఖరారు చేసేందుకు సుదీర్ఘ చర్చలు సాగించింది. పార్టీ అధ్యక్షుడు రాహుల్తోపాటు రాష్ట్ర పరిశీలకుడు ఖర్గే, ఛత్తీస్గఢ్ వ్యవహారాల ఇన్చార్జి పీఎల్ పునియా ఈ చర్చల్లో పాల్గొన్నారు. తామ్రధ్వజ్ సాహును ఎంపిక చేస్తూ శనివారం మధ్యాహ్నం నిర్ణయం తీసుకున్నారు. తామ్రధ్వజ్ కేబినెట్లో తాము మంత్రులుగా కొనసాగబోమంటూ సీఎం రేసులో ఉన్న భూపేశ్ బఘేల్, టీపీ సింగ్ దేవ్, చరణ్దాస్ మహంత్ తిరుగుబాటు చేశారు. దీంతో సోనియా గాంధీ, ప్రియాంకా వాధ్రా గాంధీ రంగంలోకి దిగి రాజీ ఫార్ములాను తెరపైకి తెచ్చారని సమాచారం. దీని ప్రకారం.. బఘేల్ రెండున్నరేళ్లు, ఆ తర్వాత టీపీ సింగ్ దేవ్కు రెండున్నరేళ్లు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించేందుకు అధిష్టానం అంగీకరించింది. అయితే, నేడు రాయ్పూర్లో జరిగే సీఎల్పీ సమావేశం అనంతరం అంతిమ నిర్ణయం వెలువడుతుందని భావిస్తున్నారు. పలుకుబడి, మైనింగ్ లాబీ.. కుర్మి వర్గానికి చెందిన బఘేల్కు కొంత మేర ప్రజల్లో సానుకూలత ఉంది. గట్టి పలుకుబడి, ధనిక మైనింగ్ లాబీ మద్దతు బఘేల్కు పుష్కలంగా ఉంది. ఆయన్ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టేందుకు రాజధానిలో భారీగా లాబీయింగ్ జరిగిందని సమాచారం. కాంగ్రెస్ రాజీ సూత్రం సాహు వర్గ నేతలకు గట్టి దెబ్బ అని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ వర్గం వారంతా బీజేపీని వదిలి ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ వెంట ఉన్నారు. ఈ ప్రభావం వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఎలా ఉంటుందనే దానిపైనే ప్రస్తుతం అందరి దృష్టీ ఉంది. అయితే, రాజాలు లేదా రాజ్పుత్ వర్గానికి చెందిన సింగ్ దేవ్ లాంటి వారికి బదులు గిరిజన నేతలకు ప్రోత్సాహమిచ్చి వృద్ధిలోకి తేలేకపోయిందనే భావం ప్రజల్లో కాంగ్రెస్పై ఉంది. -
ఛత్తీస్గఢ్ సీఎం ఖరారు రేపే!
సాక్షి, న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్, రాజస్థాన్లో సీఎం అభ్యర్థులను ఖరారుచేసిన కాంగ్రెస్ అధిష్ఠానం.. ఛత్తీస్గఢ్పై దృష్టిపెట్టింది. ముఖ్యమంత్రిని నిర్ణయించేందుకు పార్టీ చీఫ్ రాహుల్గాంధీ చేస్తున్న కసరత్తులు ఇంకా కొలిక్కిరాలేదు. పీసీసీ చీఫ్ భూపేశ్ బఘేల్, విపక్షనేత టి.ఎస్.సింగ్దేవ్, చరణ్దాస్ మహంత్, తామ్రధ్వజ్ సాహు సీఎం పదవికి పోటీపడుతున్నారు. కొత్తగా ఎన్నికైన 68మంది ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని ఇప్పటికే తెలుసుకున్న అధిష్ఠానం తుదినిర్ణయం తీసుకునేందుకు చర్చలు జరపుతోంది. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, యుపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, ఛత్తీస్గఢ్ పరిశీలకుడు ఖర్గే ఈ చర్చల్లో పాల్గొన్నారు. భూపేశ్ బఘేల్, టీఎస్ సింగ్దేవ్ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఇద్దరిలో ఎవరనేది రాహుల్ ఆదివారం ప్రకటించనున్నారు. ఛత్తీస్గఢ్ సీఎం అభ్యర్థిని రేపు ప్రకటిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత PL పూనియా తెలిపారు. ఛత్తీస్గఢ్లో 15ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికార పగ్గాలు దక్కించుకుంది. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్కి 68, బీజేపీకి 15, జేసీసీకి 5, బీఎస్పీకి 2 సీట్లు వచ్చాయి. -
నా వల్లే బీజేపీ చిత్తుచిత్తుగా ఓడింది!
సాక్షి, విశాఖపట్నం: ‘నా వల్లే ఆ మూడు రాష్ట్రాల్లో(రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్) బీజేపీ చిత్తుచిత్తుగా ఓడింది. ఆ మూడు చోట్ల కాంగ్రెస్ విజయం వెనుక తెలుగుదేశం పార్టీ కృషి ఎంతో ఉంది..’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. బీజేపీని ఇంటికి పంపేవరకూ నిద్రపోనని చెప్పారు. గురువారం విశాఖ పర్యటనలో భాగంగా కాపులుప్పాడ వద్ద ఏర్పాటు చేయనున్న ఐ–హబ్తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేశారు. సాయంత్రం తగరపువలస జూట్మిల్ గ్రౌండ్స్లో జరిగిన సభలో సీఎం ప్రసంగించారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారన్నారు. వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టించారని.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. మోదీ నుంచి దేశాన్ని కాపాడాలన్న సంకల్పంతోనే బీజేపీయేతర పార్టీలను ఏకం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. పార్టీని బతికించుకునేందుకు కాంగ్రెస్తో ముందుకెళ్తే తప్పా! తెలంగాణ ఎన్నికల్లో నా వల్లే ఏదో జరిగిపోయిందంటూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. తెలంగాణలోనే తెలుగుదేశం పార్టీ పుట్టిందన్నారు. అక్కడ పార్టీ కోసం 35 ఏళ్ల పాటు పోరాడిన కాంగ్రెస్తో కలిసి ముందుకెళ్లామని.. అందులో తప్పేముందని ప్రశ్నించారు. ‘టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా టీడీపీ నుంచే రాజకీయాల్లోకి వచ్చారు. మీరు కూడా మోదీపై పోరాడుతున్నారు. ఇద్దరూ కలిసి ముందుకెళ్దామంటే ఆయన ఒప్పుకోలేదు. పార్టీని బతికించుకునేందుకు కాంగ్రెస్తో కూడా వెళ్లడానికి వీల్లేదని అడ్డుజెప్పారు. నేను అక్కడ పని చేయడం తప్పయినట్టు.. నాకేదో రిటర్న్ గిఫ్ట్ తిరిగి ఇస్తానంటున్నాడు. ఇది న్యాయమా?..’ అని చంద్రబాబు ప్రశ్నించారు. తానెవరికీ భయపడనన్నారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసి రాష్ట్రానికి కేంద్రం రూ.75 వేల కోట్లివ్వాలన్న పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని విమర్శించారు. మోదీని ఎలా బతిమిలాడానో అందరూ చూశారు.. మోదీ కంటే తనకు ఎంతో అనుభవముందని.. కానీ ఆయన అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడు ‘సార్.. సార్..’ అంటూ ఎలా బతిమలాడానో అందరూ చూశారని చంద్రబాబు గుర్తుచేశారు. అయినా రాజధానికి నిధులు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదని మండిపడ్డారు. ‘మెడ్టెక్’తో విశాఖకు విశ్వఖ్యాతి సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ మెడ్టెక్ జోన్(ఏఎంటీజెడ్) ఏర్పాటుతో విశాఖపట్నానికి ప్రపంచ ఖ్యాతి లభిస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలోని పెదగంట్యాడ వద్ద ఏర్పాటైన ఏపీ మెడ్టెక్ జోన్ను గురువారం ఆయన జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన నాలుగో గ్లోబల్ ఫోరం సదస్సులో ఆయన మాట్లాడారు. వైద్య పరికరాల తయారీలో అగ్రదేశాలతో సమాన స్థాయికి ఆంధ్రప్రదేశ్ చేరిందన్నారు. దేశంలోనే తొలి వైద్య పరికరాల తయారీ కేంద్రం ఇదేనన్నారు. ప్రపంచవ్యాప్తంగా 240 కంపెనీలు ఇక్కడ తమ ఉత్పత్తులను తయారు చేస్తాయన్నారు. -
బీజేపీ ఓటమి వెనక..
15 ఏళ్లుగా అధికారంలో కొనసాగడంతో ప్రభుత్వ వ్యతిరేకత తలెత్తడం సహజమే. కానీ ఛత్తీస్గఢ్లో బీజేపీ ఓటమికి గ్రామీణ జీవన సంక్షోభం, రైతు సమస్యలు, నక్సల్స్ సమస్య సహా పలు అంశాలు కారణమయ్యాయి. 2013లో కేవలం లక్ష ఓట్ల తేడాతో (0.7శాతం) మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈసారి భారీగా నష్టపోయింది. ► వ్యవసాయ సంక్షోభంపై దృష్టిసారించకపోవడం రమణ్సింగ్ సర్కారుపై వ్యతిరేకత పెంచింది. 2013లో రైతులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని కోరుతూ.. 2017లో సీఎం నియోజకవర్గమైన రాజ్నంద్గావ్లో 50,000 మంది రైతులు ప్రదర్శన జరిపారు. ఎన్నికలకు రెండు నెలల ముందు (సెప్టెంబరులో) క్వింటాల్ వరికి రూ. 300 బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ రైతులకు సర్కారుపై నమ్మకం కలగలేదు. మరోవైపు, తాము అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోగా రుణాలు మాఫీ చేస్తామంటూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వాగ్దానం చేయడం, మద్దతు ధరలకు హామీ ఇవ్వడం వంటికి రైతాంగాన్ని ప్రభావితం చేశాయి. ► రూ.36000 కోట్ల పౌర సరఫరాల కుంభకోణంలో రమణ్సింగ్, ఆయన భార్యకు పాత్ర ఉన్నట్లు ఆరోపణలు రావడం, 60 మంది మరణానికి కారణమైన రూ.5000 కోట్ల చిట్ఫండ్ కుంభకోణ నిందితులపై ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం (310 ఎఫ్ఐఆర్లు దాఖలయ్యాయి), పనామా పేపర్లలో సీఎం కుమారుడి పేరు ఉండటం, సహజ వనరుల్ని ధనికులకు కట్టబెట్టడం వంటి అంశాలు పాలక పార్టీని అపఖ్యాతి పాల్జేశాయి. కాంగ్రెస్కు ఇవే పెద్ద ప్రచారాస్త్రాలు అయ్యాయి. ► 2006లో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన అటవీ హక్కుల చట్టం అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు చేసిన వాగ్దానం పని చేసింది. ఈ చట్టాన్ని బీజేపీ నీరుగారుస్తుందనేది కాంగ్రెస్ ఆరోపణ. బీజేపీ హయాంలో అటవీ ఉత్పత్తుల కనీస మద్దతు ధర తగ్గిపోవడాన్ని కూడా కాంగ్రెస్ ప్రముఖంగా ప్రచారం చేసింది. ► రమణ్సింగ్ సర్కారులోని అనేకమంది మంత్రులు, ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. దీన్ని అధిగమించేందుకు కొత్త ముఖాలను బరిలోకి దింపాలన్న ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. టికెట్ల కేటాయింపులో అధిష్టానం మాటే చెల్లుబాటయ్యింది. ► నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరగడం (రాష్ట్రంలో ఇంచుమించు 40 లక్షల మంది నిరుద్యోగులున్నది ఒక అంచనా), ఆదివాసుల భూములను పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టడం, సాగునీటి వనరుల గురించి బీజేపీ సర్కారు పట్టించుకోకపోవడం వంటి అంశాలు కూడా కొంతమేరకు ప్రభావితం చూపాయి. నోట్ల రద్దు పర్యవసానాలు, జీఎస్టీ అమలు కూడా పాలక పార్టీపై కొంత వ్యతిరేకతకు కారణమైనట్టు విశ్లేషకులు చెబుతున్నారు. -
రమణ్సింగ్కు ఆశాభంగం
రాయ్పూర్: 18 ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్ నుంచి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ఛత్తీస్గఢ్కు ఆయనే గత 15 ఏళ్లుగా ముఖ్యమంత్రి. ఏ బీజేపీ సీఎం కూడా ఇంతకాలం అధికారంలో లేరు. ఛత్తీస్గఢ్ సీఎంగా రమణ్సింగ్(66) ప్రస్థానం ఇది. 2003, డిసెంబర్ 7న తొలిసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఆయన ఆ తరువాత 2008, 2013లోనూ అధికారంలోకి వచ్చారు. ప్రధాని కాక ముందు నరేంద్ర మోదీ 4,610 రోజుల పాటు నిరంతరాయంగా గుజరాత్ సీఎంగా కొనసాగగా, రమణ్సింగ్ ఈ ఏడాది ఆగస్టులో సీఎంగా 5వేల రోజులు పూర్తిచేసుకున్నారు. మోదీ తర్వాత హ్యాట్రిక్ విజయాలు సాధించిన తొలి బీజేపీ సీఎంగా గుర్తింపు పొందారు. మహిళలు, విద్యార్థులకు ఉచిత మొబైల్ ఫోన్లు ఇచ్చినందుకు ‘మొబైల్ వాలె బాబా’, ఉచిత బియ్యం పథకానికి ‘చౌర్ వాలె బాబా’, స్వతహాగా ఆయుర్వేద వైద్యుడైనందుకు ‘డాక్టర్ సాహెబ్’ అని రమణ్సింగ్ను ప్రజలు పిలుచుకుంటున్నారు. కాంగ్రెస్ రుణమాఫీ హామీనే మలుపు.. నాలుగోసారి సీఎం పీఠం అధిష్టించాలనుకున్న రమణ్సింగ్కు తాజా ఎన్నికల్లో ఆశాభంగం కలిగింది. ప్రజాకర్షక పథకాలకు పేరొందిన ఆయనకు ఎట్టకేలకు కాంగ్రెస్ చెక్ పెట్టింది. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు బంధుప్రీతి, అవినీతి ఆరోపణలు ఆయన పాలనకు చరమగీతం పాడాయి. అధికారంలోకి వస్తే రైతు రుణాల్ని మాఫీ చేస్తామన్న రాహుల్ ప్రకటనే కాంగ్రెస్కు ఓట్ల వర్షం కురిపించిందని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు, వ్యవసాయ ఉత్పత్తుల ధరల పతనం, ఓబీసీ ఓటర్లు కాంగ్రెస్ వైపు మళ్లడం కూడా బీజేపీకి ప్రతికూలంగా మారాయి. 15 ఏళ్ల బీజేపీ పాలనలో మావోయిస్టుల సమస్య మరింత ముదిరిందని కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేయగా, నక్సలిజం ప్రాణాధార వ్యవస్థపై ఉందని త్వరలోనే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో శాంతి నెలకొంటుందని రమణ్సింగ్ చేసిన ప్రకటనలు ఫలితాలివ్వలేదు. విదూషకుడే గెలుచుకున్నాడు.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రచార సమయంలో రమణ్సింగ్ తరచూ వార్తల్లో నిలిచారు. రాష్ట్రంలో ప్రచారానికి వచ్చిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని విదూషకుడితో పోల్చారు. రుణమాఫీ చేస్తామని రాహుల్ చెబుతున్న మాటల్ని విని ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అజిత్ జోగి, మాయావతిల పొత్తును ఎగతాళి చేశారు. ‘నాగలి మోసే రైతు’ (జోగి పార్టీ గుర్తు)కు ఏనుగు(బీఎస్పీ చిహ్నం) అవసరం ఏంటని ప్రశ్నించారు. చివరకు రైతులు, గిరిజనులు ‘కమలాన్ని’ వద్దనుకుని ‘హస్తా’నికి పట్టంగట్టారు. నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి ముందు రమణ్సింగ్.. తన కన్నా చిన్నవాడైన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాదాలకు నమస్కరించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రమణ్సింగ్ రాజీనామా రాయ్పూర్: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలవడంతో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్కు పంపినట్లు తెలిపారు. పార్టీ ఓటమికి పూర్తి బాధ్యతను తానే తీసుకుంటానని, కేంద్ర నాయకత్వంపై మోపనని చెప్పారు. పార్టీ నాయకులతో కలసి ఫలితాలపై సమీక్ష జరుపుతామని వెల్లడించారు. రాష్ట్ర సమస్యలపైనే ఎన్నికలు జరిగాయని, వీటికి జాతీయ అంశాలతో సంబంధం లేదని పేర్కొన్నారు. 2019 లోక్సభ ఎన్నికలపై ఈ ఎన్నికల ప్రభావం ఉండదని నొక్కిచెప్పారు. ఛత్తీస్గఢ్ కోసం కొత్త పాత్రలో శక్తివంచన లేకుండా పనిచేస్తానని తెలిపారు. -
ఛత్తీస్కోట కాంగ్రెస్ వశం
రాయ్పూర్: 15 ఏళ్ల తర్వాత ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ వశమైంది. మంగళవారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీ 67 సీట్లు గెలుచుకొని సంపూర్ణ మెజారిటీ సాధించింది. బీజేపీ 15 స్థానాలకు పరిమితమైంది. గత అసెంబ్లీలో బీజేపీకి 49 సీట్లు, కాంగ్రెస్కు 39 స్థానాలున్నాయి. ఈ ఎన్నికల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని అంచనాలు రేపిన అజిత్ జోగి–మాయావతిల కూటమి 8 సీట్లకే పరిమితమై నామమాత్రంగా మిగిలిపోయింది. ఇప్పటికే 3సార్లు బీజేపీకి అధికారం అప్పగించిన ఛత్తీస్గఢ్ ప్రజలు ఈసారి మార్పు కోరుకుని హస్తానికి పట్టంగట్టారు. మొత్తం 90 సభ్యులున్న అసెంబ్లీలో అధికారం దక్కాలంటే కావల్సిన సభ్యుల సంఖ్య 46. కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ తప్పదన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల్ని తలకిందులు చేస్తూ కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి హస్తం దూకుడు కొనసాగించింది. దీంతో పోటీ ఏకపక్షంగా మారింది. ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ యూనిట్ చీఫ్ భూపేశ్ బాగెల్, మరో సీనియర్ నాయకుడు టీఎస్ సింగ్దేవ్లు సీఎం రేసులో ముందంజలో ఉన్నారు. సంప్రదాయ ఓటుబ్యాంకు అయిన ఎస్సీ, ఎస్టీల ఓట్లను కాపాడుకున్న కాంగ్రెస్..ఈసారి ఓబీసీలకు కూడా చేరువకావడంతో ఊహించనంత మెజారిటీ సాధించుకోగలిగిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి ఆరోపణలతో మసకబారిన రమణ్సింగ్ ప్రభుత్వంపై విసుగుచెందిన ప్రజలు కాంగ్రెస్కు ఓ అవకాశం ఇచ్చారని భావిస్తున్నారు. 2000లో మధ్యప్రదేశ్ నుంచి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ఛత్తీస్గఢ్కు కాంగ్రెస్కు చెందిన అజిత్ జోగి మూడేళ్ల పాటు సీఎంగా పనిచేశారు. 2003లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన రమణ్సింగ్ 2008, 2013లోనూ అధికారాన్ని నిలబెట్టుకున్నారు. తాజా ఫలితాల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రమణ్సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అవినీతిమయమైన బీజేపీకి ఛత్తీస్గఢ్ ప్రజలు గట్టి జవాబు చెప్పారని ఫలితాలు వెలువడిన తరువాత బాగెల్ అన్నారు. బీజేపీ ఓటమిపై అజిత్ జోగి సంతోషం వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వానికి సహకరిస్తూ అసెంబ్లీలో మూడో శక్తిగా కొనసాగుతామని చెప్పారు. హిందూ మధ్య ప్రాంతంలోని 28 సీట్లలో బీజేపీకి 7, కాంగ్రెస్కు 21 సీట్లు దక్కాయి. 2013 ఎన్నికల్లో బీజేపీకి ఇదే ప్రాంతంలో 18, కాంగ్రెస్కు 9, ఇండిపెండెంట్కు ఒక సీటు లభించాయి. వాయవ్య ఎస్సీల ప్రాంతంలోని 17 సీట్లలో బీజేపీకి 4, కాంగ్రెస్కు 8, జీజీపీకి ఒకటి, బీఎస్పీ–జేసీసీజే కూటమికి 4 సీట్లు దక్కాయి. 2013 ఎన్నికల్లో ఇక్కడ బీజేపీకి 9, కాంగ్రెస్కు 8 సీట్లు లభించాయి. దక్షిణ ఆదివాసీ ప్రాంతంలోని 16 సీట్లలో బీజేపీ 1 , కాంగ్రెస్ 15 సీట్లు గెలుచుకున్నాయి. గత ఎన్నికల్లో ఈ ప్రాంతంలో బీజేపీ 5, కాంగ్రెస్ 9 సీట్లు దక్కించుకున్నాయి. ఛత్తీస్ అసెంబ్లీకి 13 మంది మహిళలు ఛత్తీస్గఢ్ అసెంబ్లీకి 13 మంది మహిళలు ఎన్నికయ్యారు. ఇందులో 9 మంది కాంగ్రెస్, ఒకరు బీజేపీకి చెందిన వారున్నారు. 2008లో మహిళా సభ్యుల సంఖ్య 10 కాగా, 2008లో ఈ సంఖ్య 11కు పెరిగింది. 2013లో కాంగ్రెస్ టికెట్పై గెలుపొందిన అజిత్ జోగి భార్య రేణు జోగి ఈసారి జనతా కాంగ్రెస్ ఛత్తీస్గఢ్ తరఫున పోటీచేసి విజయం సాధించారు. హిందీ బెల్ట్లో కాంగ్రెస్ ఒంటరిగా పోరాడింది. ఈ ప్రాంతంలో కోల్పోయిన తన బలాన్ని తిరిగి పొందే ఉద్దేశంతోనే పకడ్బందీ వ్యూహాలు అనుసరించింది. ఆ విషయంలో విజయం సాధించింది. – స్మితా గుప్తా, రాజకీయ విశ్లేషకురాలు ఎన్డీయే రాజకీయ ఫ్రంట్. అలాగే యూపీఏ కూడా మరో ఫ్రంట్. ఎన్డీయేలో ఉన్న సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎదుర్కోవాలంటే యూపీఏ కూడా భాగస్వామ్య పార్టీలను సమైక్య పరిచి పోటీకి దిగాలి. – వినోద్ శర్మ, హిందూస్తాన్ టైమ్స్ పొలిటికల్ ఎడిటర్ బీజేపీ జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రాల్లోని సామాన్యులపై ప్రభావం చూపించింది. నోట్ల రద్దు వంటి నిర్ణయాలు రాష్ట్రాలపై దుష్ప్రభావం చూపాయి. అవి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలనూ ప్రభావితం చేశాయి. –కపిల్ సిబాల్, కాంగ్రెస్ సీనియర్ నేత బీజేపీ ఈ ఎన్నికల్లో గొప్ప ఫలితాలు సాధించలేదు. ఈ విషయం పార్టీలో చర్చించి తప్పుల్ని సవరించుకోవాలి. మోదీ జనాదరణ విషయంలో ఎలాంటి అనుమానాలు లేవు. అది పెరుగుతూనే ఉంది. మరి మేము అనుకున్న ఫలితాలు రాకపోవడానికి కారణాలు ఏమిటో విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది – కె.జె. అల్ఫాన్స్, కేంద్ర టూరిజం మంత్రి రాహుల్ గాంధీని ఒక జోకర్లా తీసిపారేయడం ఇక మానుకోవాలి. ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ తన శక్తివంచన లేకుండా కృషి చేశారు. చిత్తశుద్ధితో పనిచేశారు. ఒక సరికొత్త రాజకీయ నేతగా అవతరించిన రాహుల్తో బీజేపీ నేతలు తలపడగలగాలి – శేఖర్ గుప్తా, సీనియర్ జర్నలిస్టు దేశమంతా బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఇందుకు మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. మోదీ ప్రభుత్వ విధానాల మీద ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ ప్రభావం వచ్చే లోక్సభ ఎన్నికల మీద కచ్చితంగా ఉంటుంది. – అఖిలేష్ యాదవ్, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు రాజస్తాన్లో సీఎం పీఠంపై కూర్చునే కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రధాన కర్తవ్యం బీజేపీ ఓటు శాతాన్ని ఎంతమేరకు తగ్గించగలుగుతారనేదే. బీజేపీ 38శాతం ఓట్లను నిలబెట్టుకోగలిగింది. కాంగ్రెస్ కొంత మేర ఓటు శాతాన్ని పెంచుకోగలిగినా వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి బీజేపీ ఓట్లను తగిన మొత్తంలో రాబట్టుకోవాలి. అప్పుడే కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇవ్వగలుగుతుంది –రాజీవ్ గుప్తా, రాజకీయ విశ్లేషకులు -
ఓటమి షాక్ : రమణ్సింగ్ రాజీనామా
రాయ్పూర్ : చత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలక బీజేపీకి ఘోరపరాజయం ఎదురైంది. 90 స్ధానాలకు గాను కాంగ్రెస్ పార్టీ ఏకంగా 65 స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తుండగా, బీజేపీ 17 స్ధానాలకే పరిమితమైంది. మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించిన కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుండగా, బీజేపీని ఓటమి భారం వెంటాడుతోంది. ఇక బీజేపీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రమణ్సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రరమణ్ సింగ్ 15 సంవత్సరాలుగా చత్తీస్గఢ్ సీఎంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తన నాయకత్వంలో ఎన్నికలు వెళ్లినందున ఓటమికి తానే బాధ్యత వహిస్తానని, అసెంబ్లీలో బలమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని రమణ్ సింగ్ స్పష్టం చేశారు. ప్రజా తీర్పును తాము గౌరవిస్తామని కాంగ్రెస్కు అభినందనలు తెలిపారు. -
టీఆర్ఎస్ పాలన అబద్ధాలమయం: రమణ్సింగ్
హైదరాబాద్: ఛత్తీస్గఢ్లో మూడు సార్లు విజయం సాధించిన బీజేపీ నాలుగవ సారి కూడా విజయం సాధిస్తుందని ఛత్తీస్గడ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఖైరతాబాద్ లైబ్రరీ చౌరస్తాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రమణ్సింగ్ మాట్లాడుతూ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అబద్ధాలతో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పాలన సాగిందని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధిని పట్టించుకోకపోవడంతో 450 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా చింతల చేస్తున్న సేవా కార్యక్రమాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. ఇలాంటి సేవా ధృక్పథం కలిగిన వ్యక్తి చట్టసభల్లో ఉండాలన్నారు. ఎంపీ దత్తాత్రేయ మాట్లాడుతూ టీఆర్ఎస్కు ఓటేస్తే మజ్లిస్కు వేసినట్లే అని అన్నారు. అనంతరం చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఖైరతాబాద్ అభివృద్ధే లక్ష్యంగా పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డీజీపీ దినేశ్రెడ్డి, రాజేశ్వర్రావు, రామన్గౌడ్, ప్రేమ్రాజ్ పాల్గొన్నారు. -
మోదీ-షా హవా; కొత్త ట్విస్ట్
ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ-షా ద్వయం ముద్ర కనిపించడం లేదు. 2014లో ప్రధాని పీఠాన్ని నరేంద్ర మోదీ అధిష్టించినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో వీరి ముద్ర స్పష్టంగా కనిపించింది. బీజేపీలో అన్ని తామే వ్యవహరించి విజయాలను తమ ఖాతాలో వేసుకున్నారు. ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో సీనియర్ నాయకులు ఎంతమంది ఉన్నప్పటికీ మోదీ-షా జోడీ ముందుండి నడిపించింది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఈ మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగుతున్న రమణ సింగ్, శివరాజ్ సింగ్, వసుంధర రాజే సొంత గొంతుక విన్పిస్తున్నారు. బీజేపీలో అగ్రస్థాయి వ్యూహకర్తల బృందంలో అమిత్ షా, మోదీకి సమానంగా పరిగణించబడుతున్న వీరు మోదీ-షా ద్వయంపై ఆధారపడకుండానే ముందుకు పోతున్నారు. మోదీ ప్రధాని పీఠమెక్కిన నాటి నుంచి ఇప్పటివరకు 22 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగ్గా 19 రాష్ట్రాల్లో కమలం పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. 2014లో జరిగిన జార్కండ్, హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పాలక పగ్గాలు దక్కించుకుంది. హరియణాలో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవడంలో కాషాయ పార్టీ సఫలమైంది. ఇదే ఏడాది చివరి జరిగిన ఎన్నికల్లో జమ్మూకశ్మీర్లోనూ పాగా వేసింది. పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ)తో కలిసి అధికారాన్ని పంచుకుంది. బీజేపీకి 2015 కలిసిరాలేదు. అదే ఏడాది ఢిల్లీ, బిహార్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోరులో కమలం పార్టీకి చుక్కెదురైంది. అసోంలో గెలుపుతో 2016లో ఈశాన్య రాష్ట్రాల్లోకి అడుగుపెట్టిన కమలనాథులు, అదే సంవత్సరం జరిగిన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ ఎన్నికల్లో భంగపడ్డారు. 2017లో ఉత్తరప్రదేశ్లో భారీ విజయంతో పాటు ఉత్తరాఖండ్, హిమచల్ప్రదేశ్నూ తన ఖాతాలో వేసుకుంది. మేఘాలయా, నాగాలాండ్, మణిపూర్, త్రిపురలోనూ విజయఢంకా మోగించి ఈశాన్యంలో తిరుగులేని శక్తిగా మారింది. గట్టి పోటీ ఎదురైనప్పటికీ గుజరాత్లో అధికారాన్ని నిలబెట్టుకుంది. మోదీ-షా సొంత రాష్ట్రం కావడంతో ఈ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బొటాబొటి మెజారిటీతో గట్టెక్కింది. అయితే ఈ ఏడాదిలో కర్ణాటక ఎన్నికల్లో కాషాయ పార్టీకి అనూహ్యంగా షాక్ తగిలింది. కాంగ్రెస్, జేడీ(ఎస్) కలిసి బీజేపీకి ఝలక్ ఇచ్చాయి. తాజాగా జరుగుతున్న ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల్లో మోదీ-షా ముద్ర అంతగా కనిపించడం లేదు. ఈ మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఉన్న రమణ్ సింగ్, శివరాజ్ సింగ్, వసుంధర రాజె బలమైన నాయకులు. తమకు తామే సొంతంగా వ్యూహాలను అమలు చేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. దీంతో మోదీ-షా జోడికి పెద్దగా పని లేకుండా పోయింది. ఛత్తీస్గఢ్లో ఇప్పటికే ఎన్నికలు ముగిశాయి. ఒకవేళ బీజేపీ ఇక్కడ మళ్లీ గెలిస్తే ఆ ఘనత అంతా రమణ్ సింగ్కే దక్కుతుంది. రాజస్థాన్లో కాంగ్రెస్కు అనుకూలంగా ఫలితం వచ్చే అవకాశముందని సర్వేలు చెబుతున్నాయి. అయినప్పటికీ రాజే వెనక్కు తగ్గడం లేదు. మోదీ-షా ముద్ర లేకుండానే తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ఆమెను తప్పించే సాహసం చేయలేకపోతోంది బీజేపీ అధిష్టానం. ఈశాన్య రాష్ట్రం మిజొరంలోనూ మోదీ-షా ముచ్చట లేదు. ఇక్కడ హంగ్ వచ్చే అవకాశముందని సర్వేలు అంచనా వేశాయి. తెలంగాణలో బలమైన నాయకులు లేకపోవడంతో మోదీ-షా మ్యాజిక్ పైనే స్థానిక నేతలు ఆశలు పెట్టుకున్నారు. దీనికనుగుణంగానే మోదీ-షా ప్రచార పర్వాన్ని భారీస్థాయిలో నిర్వహించనున్నారు. ఈ నాలుగున్నరేళ్లలో జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లోనూ మోదీ-షా హవా నడిచింది. అభ్యర్థుల ఖరారు, ప్రచారం, ముఖ్యమంత్రి అభ్యర్థుల ఎంపిక విషయాల్లో వీరే ఆధిపత్యం చెలాయించారు. బలమైన ప్రాంతీయ నేతలు లేకపోవడంతో అన్ని విజయాలన్నీ వీరి ఖాతాలోకి వెళ్లిపోయాయి. ముఖ్యమంత్రి అభ్యర్థుల విషయంలోనూ అనూహ్య నిర్ణయాలు తీసుకుని తమ ప్రత్యేకత చాటుకున్నారు. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉండటం ఈ ఎన్నికల్లోని విశేషం. ఇక్కడ బీజేపీకి సానుకూల ఫలితాలు వస్తే మోదీ-షా ‘ముద్ర’ మాయం కావడం ఖాయమన్నది విశ్లేషకుల అభిప్రాయం. -
పోలింగ్ బూత్లో పూజలు చేసిన ఛత్తీస్గఢ్ మంత్రి
-
ఛత్తీస్ రెండో దశలో 71.93% పోలింగ్
న్యూఢిల్లీ: ఛత్తీస్గఢ్లో మంగళవారం జరిగిన రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 6 గంటల సమయానికి అందిన సమాచారం ప్రకారం 71.93 శాతం ఓటింగ్ నమోదైందని డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ఉమేశ్ సిన్హా తెలిపారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగగా మావోయిస్టుల ప్రభావిత గరియాబంద్ జిల్లా బృందానవ్గఢ్ నియోజకవర్గంలోని రెండు పోలింగ్ బూత్లలో మాత్రం ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 3 గంటలకే ముగిసింది. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్సింగ్, ఆయన భార్య వీణ, కుమారుడు అభిషేక్ కువర్థా నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొన్ని కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్కు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. పలు ఫిర్యాదులు రావడంతో బిలాస్పూర్ జిల్లా మర్వాహి నియోజకవర్గంలోని ప్రిసైడింగ్ అధికారితోపాటు సిబ్బంది ఒకరిని విధుల నుంచి తప్పించినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి తెలిపారు. ఫలితాలు డిసెంబర్ 11న వెలువడనున్నాయి. -
పొలిటి'కలే?'
‘మహిళలకు ఓటు హక్కే కాదు..ఎన్నికల్లో నిలబడే హక్కు ఉన్నప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్యం’ అంటారు చిలీ మాజీ అధ్యక్షురాలు మిచెల్ బచెలెత్. మన దగ్గర స్త్రీలకు ఆ హక్కు ఉంది.. వినియోగించుకుని ప్రధాని, రాష్ట్రపతి, ముఖ్యమంత్రులూ అయినవారున్నారు.. అవుతున్నారు కూడా. అయితే, హక్కు ఉంటే సరిపోదు..ఆ వాతావరణం..స్వేచ్ఛ, స్వాతంత్య్ర ఉండాలి. ఇక్కడ స్వేచ్ఛా స్వాతంత్య్రాలంటే మహిళలు గడపదాట గలిగే వెసులుబాటు ఒక్కటే కాదు. ఇంటి బాధ్యతల నుంచి కూడా వెసులుబాటు. ఫలానా పనులు ఆడవాళ్లు మాత్రమే చేయాలి అన్న నియమనిబంధనల నుంచి వెసులుబాటు. కొన్ని సాంఘిక కట్టుబాట్ల నుంచి కూడా వెసులుబాటు చాలా అవసరం. మహిళలకు పాలనలో సమభాగస్వామ్యం కావాలంటే మిగిలిన బాధ్యతల నుంచి వెసులుబాట్లు తప్పనిసరి. దీన్ని ఇటీవలి ఎకనామిక్ సర్వే కూడా వెల్లడించింది. మరో కోణం రాజకీయాల్లో స్త్రీల భాగస్వామ్యం పెరగకపోవడానికి మరో కోణం కూడా కనిపిస్తుంది. రాజకీయాలంటే ఆసక్తి ఉన్న అబ్బాయిలు నచ్చిన పార్టీలో చేరి కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. అమ్మాయిలకు ఆ అవకాశం ఉండట్లేదు. చదువు తర్వాత ఉద్యోగం.. లేదంటే వెంటనే పెళ్లి తప్పనిసరి. కాదనుకొని వెళ్లినా రక్షణ సమస్యగా మారుతుంది. ఇప్పటికీ మన దేశంలో పాలిటిక్స్ అంటే మహిళలకు రిస్క్ అనే భావనే. మరి ఇప్పుడు ఉన్న మహిళా నేతలు వచ్చినా.. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్లు చాలా తక్కువే. - తండ్రికి వారసురాలిగానో.. భర్తకు ప్రతినిధిగానో.. కుటుంబ రాజకీయ, వ్యాపార లావాదేవీలకు టూల్గానో మహిళలు చట్టసభల్లో అడుగుపెట్టడం మినహా.. ఆసక్తితో, లక్ష్యంతో, ప్రజాసంక్షేమ కాంక్షతో, విధాన నిర్ణయాల్లో భాగస్వామి కావాలనే తపనతో, పూర్తి అవగాహనతో వచ్చిన వాళ్లు చాలా తక్కువ. - మహిళలు రాజకీయాల్లో కీలకంగా ఉండుంటే.. ఈ రోజు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కోసం అడుక్కోవాల్సిన పరిస్థితే ఉండకపోయేది. మారిన ఎన్నికల చిత్రం రాజకీయాల్లోకి రావాలంటే ప్రజా సమస్యల మీద అవగాహన ఉండాలి. ప్రజాజీవితంతో మమైకమైన జీవనశైలిని పాటిస్తుండాలి. ప్రశ్నించే తత్వం కావాలి. ఇప్పుడు వీటన్నిటికన్నా.. డబ్బు ముఖ్యం. మనీతో పవర్.. పవర్తో మనీ.. రొటేట్ అవుతున్నాయి. కుటుంబ వారసత్వంతో వచ్చిన వారికి ఆర్థిక, నైతిక మద్దతుతోపాటు అంగబలమూ ఉంటోంది. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండిపెండెంట్గా రావాలనుకునే వారికే అన్ని ఇబ్బందులు. ప్రధాన పార్టీలూ అంత తర్వగా వీరిని ఆహ్వానించట్లేదు. మహిళల్లో రాజకీయ చైతన్యం పెరిగింది. ఏం చెప్పింది? 2017–18 సంవత్సరానికి నిర్వహించిన ఈ సర్వేలో 49 శాతం మహిళా జనాభా ఉన్న మన దేశంలో వాళ్ల రాజకీయ భాగస్వామ్యం కేవలం 15 శాతమేనని తేలింది. రువాండా లాంటి దేశంలో పార్లమెంట్లో 60 శాతం మహిళా ప్రాతినిధ్యం ఉంటే మనం 15 శాతంతో ఈజిప్ట్, బ్రెజిల్, మలేషియా, శ్రీలంక, థాయ్లాండ్ వంటి దేశాల సరసన ఉన్నాం. - ఇంటర్– పార్లమెంటరీ యూనియన్ (ఐపీయూ), యూఎన్ విమెన్ విభాగం ఇచ్చిన ‘విమెన్ ఇన్ పాలిటిక్స్ –2017’ అనే నివేదికను కూడా ఈ సర్వే ప్రస్తావించింది. - ఆ నివేదిక ప్రకారం 2016, అక్టోబర్ నాటికి దేశంలో ఉన్న 4, 118 మంది ఎమ్మేల్యేలలో మహిళల శాతం కేవలం తొమ్మిది. - 2010 నుంచి 2017 వరకు అంటే ఏడేళ్లలో చట్టసభల్లో (లోక్సభ)పెరిగి మహిళా భాగస్వామ్యం ఒక్క శాతమే. - ఇంటి బాధ్యతలు, సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణ భారం, కుటుంబం నుంచి మద్దతు లేకపోవడం తదితర కారణాల వల్లే మహిళలు రాజకీయాల్లోకి అడుగుపెట్టలేకపోతున్నారని సర్వే తేల్చింది. ఎంత మందికి అధికారం? ఇప్పుడు ఎన్నికైన వాళ్లకెంతమందికి అధికారం ఇచ్చారని మనం పార్టిసిపేషన్ గురించి మాట్లాడుకోవాలి? తెలంగాణ ప్రభుత్వంలో ఎంత మంది మహిళలకు పదువులున్నాయి? మహిళా కమిషన్ కూడా లేదు. వెల్ ఎడ్యూకేటెడ్, అవేర్నెస్, ఉత్సాహం ఉన్న సూరేపల్లి సూజాత లాంటి వాళ్లకు ఏ పార్టీలు టిక్కెట్లు ఇచ్చాయి? అసలు పొలిటికల్ పార్టీస్కే మహిళలకు టికెట్లు ఇవ్వడం ఇష్టం లేదు. ఇలా అయితే విమెన్ పొలిటికల్ పార్టిసిపేషన్ ఎలా పెరుగుతుంది.? – రమా మేల్కొటే, సామాజిక, రాజకీయ, ఆర్థిక విశ్లేషకురాలు కార్యకర్తలే అడ్డు చెప్తరు.. ఎలక్షన్లలో నిలబడ్డానికి ఆడవాళ్లు ఉత్సాహంగానే ఉన్నరు. అయితే టికెట్లిచ్చే దగ్గర పార్టీ పెద్దలు ఎంత పక్షపాతంగా ఉన్నరో, కార్యకర్తలూ అంతే ఉన్నరు. మగవాళ్లకే సీట్లివ్వాలని ఒత్తిడి చేస్తరు. వాళ్లను గెలిపించేందుకే కష్టపడ్తరు. ఎందుకంటే మగవాళ్లు వస్తే వాళ్లు తింటరు, వీళ్లకు తినిపిస్తరు అని. అదే ఆడవాళ్లయితే అంత అవినీతికి పాల్పడరు కదా. అందుకే కార్యకర్తలకు ఫాయిదా ఉండదు. అందుకే మహిళలకు సపోర్ట్ చేయరు. అయినా మహిళలు నిలబడాలే. – సి. బాలేశ్వరి,గృహిణి, హైదరాబాద్ వేరుగా ఓ పార్టీ పెట్టి.. రాజకీయ చైతన్యం మహిళ్లో పెరిగింది. కానీ.. భాగస్వామ్యం తగ్గింది. దీనికి మార్కెట్ సంస్కృతి ఒక కారణం. డబ్బు, పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేకపోవడం వల్ల ధైర్యంగా ముందుకొస్తున్నవాళ్లు మహిళల సంఖ్య తక్కువే. ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలుపొందిన వారు సైతం ఇతరుల మీదనే ఆధారపడుతున్నారు. ఇవన్నీ ఎందుకు? మహిళలమే సపరేట్గా ఓ పార్టీ పెట్టాలనే ఆలోచన కూడా చేయట్లేదు. పార్టిసిపేషన్ పెరగాలంటే ఇవన్నీ అవసరమే. అన్నిరకాలుగా ప్రెషరైజ్ చేయాలి. – డాక్టర్ సమున్నత, అసిస్టెంట్ ప్రొఫెసర్, బిజినెస్ మేనేజ్మెంట్, ఓయూ ప్రయోజనాలెన్నో.... - మహిళలు రాజకీయాల్లోకి రావడం వల్ల సమాజ ప్రవర్తనలోనూ మార్పు వస్తుంది. సున్నితత్వం పెరుగుతుంది. - అవినీతి, దుబారాలకు తావుండదు. నేరాల, ఘోరాల నియంత్రణ జరుగుతుంది. - దేశానికి స్త్రీ కోణం అవసరం. ప్రజల పట్ల బాధ్యత, జవాబుదారీ తనం, ఖర్చులకు ఒక లెక్కా, పత్రం, మౌలిక సదుపాయల వసతి, అందరికీ ఉపాధి.. ఇవన్నీ అవలీలగా నిర్వహించగల సమర్థురాలు స్త్రీయే. - స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటుతున్నా మనం ఇంకా మౌలికసదుపాయాలు, అందరికీ ఉపాధి దగ్గరే ఆగిపోయాం. దీనికి కారణం.. చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం పెరగకపోవడమే. - భవిష్యత్కి ఘనమైన చరిత్ర ప్రేరణ కావాలంటే వర్తమానం ఆరోగ్యంగా ఉండాలి. ఆలోచన ఉన్న స్త్రీలకు అవకాశం కావాలి. ఇప్పుడు చట్టసభల్లో ఉన్న మహిళలు ప్రశ్నించాలి. తమ సంఖ్య పెంచుకునేలా ప్రయత్నించాలి. రాజకీయాల్లోనూ మన ఉనికి చాటడానికి మరో ఉద్యమానికి ఊపిరి పోసైనా సాధించుకోవాలి. ధాయ్.. ది లవ్ డాక్టర్ శంకర్దాదా ఎంబీబీఎస్ గుర్తుందా? రోగులకు వైద్యం కన్నా ప్రేమపూర్వకమైన మాటలు అవసరమంటూ చిరంజీవి చెప్పిన మాటలు ఆకట్టుకున్నాయి. ఇలాంటి ఓ వైద్యుడు మధ్యప్రదేశ్ ఎన్నికల్లో పోటీలో నిలిచి ప్రత్యేకంగా నిలుస్తున్నాడు. ధాయ్ అక్సర్ అనే డాక్టర్.. ప్రజాస్వామ్యాన్ని ప్రేమపూర్వకంగా మార్చాలన్న లక్ష్యంతోనే ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. జబల్పూర్(ఉత్తరం) నియోజకవర్గంలో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ప్రేమతంత్రమంటే అందరినీ ఏకం చేయడమేనని ఆయన నిర్వచిస్తున్నారు. ఇప్పటివరకు ఆయన పదిసార్లు వివిధ ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ.. డాక్టర్ గారి ప్రేమ మంత్రం ప్రజలకు పెద్దగా పట్టలేదు. పోటీ చేసిన ప్రతిసారీ ఆయనకు ధరావతు కూడా దక్కలేదు. ఇవేవీ ధాయ్లో ఉత్సాహాన్ని నీరుగార్చలేదు. ఎన్నికల్లో పోటీ చేయడం, ఓడిపోవడంపై పెద్దగా ఆందోళన లేదని, ప్రజల్లో ప్రేమను పెంచేందుకు పాతికేళ్లుగా కృషి చేస్తున్నానని చెప్పారు. ప్రస్తుతమున్నది నిజమైన ప్రజాస్వామ్యం కాదంటున్నారు ఈ అభినవ శంకర్దాదా. అసలు రాజకీయ పార్టీల అవసరం లేదని, అభ్యర్థులు సైతం నామినేషన్లు వేసి ఇంట్లో కూర్చోవాలని, ఎలాంటి ప్రచారాలను అనుమతించకూడదని, ప్రజలు ఎవరి ప్రభావం లేకుండా ఒకరిని ఎన్నుకోవాలని చెబుతున్నారు. ఎప్పటికైనా తన సిద్ధాంతాలకు ప్రాచుర్యం వస్తుందని ఆయన ప్రగాఢ నమ్మకం. ఈయనకు కొందరు శిష్యులు కూడా ఉన్నారు. వీళ్లకు ఆయన సిద్ధాంత ప్రవచనం చేస్తుంటారు. మరి ఇంటి ఖర్చులు ఎలాగంటారా? పెద్దవాళ్లిచ్చిన ఆస్తులపై అద్దెలతో డాక్టర్ సాబ్ కాలం వెళ్లబుచ్చుతున్నారు. మంగళవారం ఛత్తీస్గఢ్ తుదివిడత ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునేందుకు బారులు తీరిన మహిళా ఓటర్లు పెళ్లిలో ఓటు సందడి! ప్రజాస్వామ్య మనుగడ ప్రజల భాగస్వామ్యంపైనే ఆధారపడి ఉంటుంది. ప్రజాస్వామ్యంటూ ఊదరగొట్టే పలువురు మేధావులు ఎన్నికలు వచ్చే సరికి ఓటేయడానికి బద్ధకిస్తారు. కానీ మధ్యప్రదేశ్కు చెందిన అతహుల్లాఖాన్ అందరిలాగా కాదు. సామాజిక కార్యకర్తగా ప్రజలను చైతన్యం చేయడం తన బాధ్యతగా భావిస్తారు. తాజాగా తన కుమారుడి పెళ్లి వేడుకలో ఓటు ప్రాముఖ్యత గురించి పోస్టర్లు అతికించడం ద్వారా ఖాన్ వార్తల్లో నిలిచాడు. పెళ్లిలో విందులు, బహుమతులతో పాటు అతిథులకు ఓటేయాలంటూ కరపత్రాన్ని ఇచ్చారు. ‘ఓటు వేయడం ప్రతిఒక్కరి నైతిక బాధ్యత. నా నగరంలో ప్రజలకు ఆ బాధ్యత మరొక్కమారు గుర్తు చేశాను’ అని ఆయన వినమ్రంగా చెబుతున్నారు. సెంటిమెంట్ పాయింట్ మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు అభ్యర్థులు నానా పాట్లు పడుతున్నారు. నియోజకవర్గాల్లో ఎవరికివారు ప్రచారం ఉధృతం చేశారు. చాలామంది అభ్యర్థులు కేవలం ప్రచారంతో సరిపెట్టుకోకుండా సెంటిమెంటు, చిట్కాల ద్వారా అదృష్టాన్ని వెతుక్కుంటున్నారు. తమ అదృష్ట దీపాలుగా భావించే భార్యనో, చెల్లినో, కుమారుడినో ప్రచారంలోకి తీసుకుపోవడం, బియ్యాన్ని పంచడం, తులసి పూజలు చేయడం.. ఇలా ఒకటేమిటి గెలిచేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. సెంటిమెంట్ తమను గట్టెక్కించాలని మొక్కుకుంటున్నారు. ప్రధాన నిర్ణయాలు తీసుకునేముందు తల్లి కాళ్లకు నమస్కరించడం ఒక అభ్యర్థి అలవాటైతే, తులసి పూజ చేయకుండా బయటకు అడుగెయ్యకపోవడం మరొక అభ్యర్థి ఆచారం. తల్లి ఆశీర్వాదం తనకు ఎప్పుడూ కలిసివస్తుందని, ప్రతిరోజూ ఆమెకు నమస్కరించే ప్రచారం ఆరంభిస్తానని బీజేపీ అభ్యర్థి ఒకరు చెప్పారు. మరో కాంగ్రెస్ అభ్యర్థికి తన నియోజకవర్గంలోని ప్రతి గుడిని దర్శించిరావడం రివాజుగా మారింది. మహిళా అభ్యర్థుల్లో ఎక్కువమంది తులసి పూజకు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ పూజతో తమకు పాజిటివ్ శక్తి వస్తుందని వారు నమ్ముతారు. మధ్యప్రదేశ్ ప్రజల్లో బియ్యం పంచితే అదృష్టం వరిస్తుందని నమ్మకం ఉంది. అందుకే ఒక అభ్యర్థి మూడురంగుల బియ్యాన్ని నియోజకవర్గ ప్రజలందరికీ పంచుతున్నాడు. ఏమాత్రం తగ్గనంటున్న ఆయన ప్రత్యర్థి ప్రజలందరికీ పసుపు బియ్యాన్ని పంచడం ప్రారంభించారు. బీజేపీ అభ్యర్థులు పార్టీ గుర్తయిన కమలం పువ్వును ఇస్తున్నారు. కొందరు కుటుంబసభ్యులతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజలు మాత్రం ఈ సెంటిమెంట్లకు నవ్వుకుంటున్నారు. ఆ నాలుగు రాష్ట్రాలు 12 శాతం! సీట్లలో మహిళల వాటా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు మహిళలకు ఇచ్చిన సీట్లు చాలా తక్కువే. గతంలో ఇచ్చి్చన సీట్ల కంటే తక్కువనే చెప్పుకోవాలి. ఛత్తీస్గఢ్లో బీజేపీ 15 మంది, కాంగ్రెస్ 13 మంది మహిళలకు సీట్లు ఇస్తే.. రాజస్తాన్లో బీజేపీ 21 మంది, కాంగ్రెస్ 27 మంది అతివలను బరిలో దింపాయి. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ 28, బీజేపీ 24 మంది మహిళలకు పార్టీ టికెట్లు ఇచ్చాయి. అయితే మిజోరంలో మాత్రం బీజేపీ ఆరుగురు మహిళలకు సీట్లివ్వగా.. కాంగ్రెస్ ఒక్కరినే బరిలో దింపింది. దేశవ్యాప్తంగా మహిళల ఓట్ల శాతం పెరుగుతోందని సర్వేల్లో వెల్లడవుతున్నప్పటికీ.. చట్టసభల్లో మహిళా ప్రజాప్రతినిధుల సంఖ్యలో పెరుగుదల అనుకున్నంత వేగంగా లేదు. ప్రస్తుతం పార్లమెంటులో మహిళా ఎంపీల సంఖ్య 68. ఇది మొత్తం ఎంపీల సంఖ్యలో 12% మాత్రమే. చట్టసభల్లో మహిళల సీట్లు పెంచేందుకు ఉద్దేశించిన 33% రిజర్వేషన్ బిల్లు చట్టరూపం దాల్చితే.. మనకు168 మంది మహిళా ఎంపీలు ఉంటారు. అయితే రాజకీయ ఏకాభిప్రాయం కుదరకపోవడంతోనే ఈ అంశం ఆలస్యమవుతోంది. -
ఛత్తీస్గఢ్లో 71.93 శాతం పోలింగ్
రాయిపూర్ : ఛత్తీస్గఢ్ రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 19 జిల్లాల్లో విస్తరించిన మొత్తం 72 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం పోలింగ్ జరిగింది. సాయంత్రం 6 గంటల సమయానికి 71.93 శాతం పోలీంగ్ నమోదైంది. తొలి విడత పోలింగ్తో కలుపుకుంటే ఈసారి అసెంబ్లీ ఎన్నికల మొత్తం పోలింగ్ శాతం 74.17గా ఉందని డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఉమేష్ సిన్హా తెలిపారు. పోలింగ్ సమయం ముగిసినప్పటికీ కొన్ని కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి ఉండడంతో వారిని పోలింగ్కు అనుమతిచ్చారు. కొన్ని చోట్ల పోలింగ్ కొనసాగుతోంది. క్యూలో ఉన్న ఓటర్లు ఓటు హక్కు వినియోగించిన అనంతరమే పోలింగ్ కేంద్రాలను మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ దృష్ట్యా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. మొత్తం 90 సీట్లలో 18 స్థానాలకు తొలి దశ పోలింగ్లో ఈ నెల 12న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. 8 నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో తొలి దశలోనే పోలింగ్ పూర్తయింది. మిగిలిన మావో ప్రభావిత జిల్లాలైన గరియాబంద్, ధంతరి, మహాసముంద్, కబీర్దమ్, జష్పూర్, బల్రామ్పూర్ జిల్లాల్లో మంగళవారం పోలింగ్ జరిగింది. -
అజిత్ జోగి కోడలి విజయం ఖాయం
సాక్షి, న్యూఢిల్లీ : చత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి కోడలు రిచా జోగి విజయం సాధించడం నల్లేరు మీద నడకేనని అకల్తారా అసెంబ్లీ నియోజక వర్గం ప్రజలు భావిస్తున్నారు. అజిత్ జోగి కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి జనతా కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. ఆయన ఈసారి ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీతో ఎన్నికల పొత్తు పెట్టుకున్నారు. ఈ కారణంగా ఆయన తన కోడలును బీఎస్పీ తరఫున ఈ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నియోజక వర్గంలో 45 శాతం మంది దళితులు, ఆదివాసీలు ఉండడమే కాకుండా బీఎస్పీకీ మంచి ప్రాబల్యం ఉండడమే అందుకు కారణం కావచ్చు. జాంజ్గిర్–చంపా జిల్లాలోని అకల్తారా నియోజక వర్గంలో 35 దళిత, ఆదివాసీ గ్రామాలు ఉన్నాయి. వారంత ఈసారి అజిత్ జోగికే ఓటు వేయాలని ప్రతిజ్ఞ కూడా చేశారట. ఆ గ్రామాల గ్రామాల ప్రజలు రిచా జోగి ప్రత్యర్థులెవరిని తమ గ్రామాల్లో ప్రచారానికి అనుమతించడం లేదు. ఐదేళ్ల క్రితం ఎన్నికల్లో గెలిచిన ప్రస్తుత కాంగ్రెస్ శాసన సభ్యుడు చున్నీలాల్ సాహు ఐదేళ్ల నుంచి తమ గ్రామాలకే రావడం లేదని, అక్కడక్కడ ఆయన పోస్టర్లు తప్ప ఆయన జాడ కనిపించడం లేదని ప్రజలు అంటున్నారు. అకల్తార పట్టణంలో ప్రజల సౌకర్యార్థం ఓ టాయ్లెట్ నిర్మంచమంటే కూడా ఆయన నిర్మించలేక పోయారని, అలాంటి వ్యక్తికి ఈసారి ఓటు ఎలా వేయగలమని చెబుతున్నారు. నియోజకవర్గంలోని ముర్లిది గ్రామంలో 1800 మంది ఓటర్ల ఉండగా 1600 మంది ఓటర్లు రిచా జోగికే ఓటు వేస్తున్నట్లు చెప్పారు. మిగతా 200 మంది ఓటర్లు బీజేపీ తరఫున పోటీ చేస్తున్న సౌరభ్ సింగ్కు ఓటు వేస్తున్నట్లు చెప్పారు. ఈసారి ఈ నియోజకవర్గంలో బీజేపీ, బీఎస్పీకి మధ్యనే పోటీ ఉంటుందని, అయితే రిచా జోగిదే విజయమని చెబుతున్నారు. అకల్తారాలో మెజారిటీ ఇళ్లపై బీఎస్పీ జెండాలే కనిపిస్తోంది. ఆఖరికి చున్నీలాల్ సాహుకు మద్దతిస్తున్న కాంగ్రెస్ కౌన్సిలర్ పుణేశ్వర్ కుమార్ ఆనంద్ ఇంటిపై కూడా బీఎస్పీ జెండా ఎగరడం అందుకు నిదర్శనం. ఈ విషయమై ఆయన్నే ప్రశ్నించగా తన 10, 12 ఏళ్ల కొడుకులు తెలియక ఆ జెండాను ఎగరేశారని చెప్పుకున్నారు. -
ఛత్తీస్గఢ్లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
-
ఛత్తీస్గఢ్లో కొనసాగుతున్న తుది దశ పోలింగ్
రాయపూర్: ఛత్తీస్గఢ్లో తుది దశ పోలింగ్ కొనసాగుతుంది. 19 జిల్లాలోని 72 నియోజకవర్గాలకు మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 90 స్థానాలు ఉన్నా చత్తీస్గఢ్ అసెంబ్లీకి తొలి దశలో 18 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టుల పిలుపు నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఈసీ మొత్తం 19,296 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. రమణ్సింగ్ ప్రభుత్వంలోని 9 మంది మంత్రులు, స్పీకర్తో పాటు కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ భూపేశ్ బఘేల్, అజిత్ జోగి సహా ఇరు పార్టీల కీలక నేతల భవిష్యత్ నేడు ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. ఛత్తీస్గఢ్లో నాలుగోసారి అధికారం చేపట్టాలని బీజేపీ, 15 ఏళ్లుగా కొనసాగుతున్న విపక్ష హోదాను అధికార పక్షంగా మార్చుకోవాలని కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. బీఎస్పీ, అజిత్ జోగికి చెందిన జనతా కాంగ్రెస్ ఛత్తీస్గఢ్, సీపీఐల కూటమి కూడా విజయంపై ఆశలు పెట్టుకుంది. కాగా, 72 స్థానాల్లో 1,079 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. -
నేడు ఛత్తీస్ రెండో దశ
రాయిపూర్: ఛత్తీస్గఢ్ రెండో దశ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 19 జిల్లాల్లో విస్తరించిన మొత్తం 72 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. పోలింగ్ దృష్ట్యా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. లక్షమందికి పైగా భద్రతాబలగాలను మోహరించారు. మొత్తం 90 సీట్లలో 18 స్థానాలకు తొలి దశ పోలింగ్లో ఈ నెల 12న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. 8 నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో తొలి దశలోనే పోలింగ్ పూర్తయింది. మిగిలిన మావో ప్రభావిత జిల్లాలైన గరియాబంద్, ధంతరి, మహాసముంద్, కబీర్దమ్, జష్పూర్, బల్రామ్పూర్ జిల్లాల్లో నేడు పోలింగ్ జరగనుంది. రమణ్సింగ్ ప్రభుత్వం లోని 9 మంది మంత్రులు, స్పీకర్తో పాటు కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ భూపేశ్ బఘేల్, అజిత్ జోగి సహా ఇరు పార్టీల కీలక నేతల భవిష్యత్ నేడు ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. ఈ 72 సీట్లలో 46 జనరల్, 9 ఎస్సీ, 17 ఎస్టీలకు కేటాయించారు. 2013లో ఈ 72లో 43 స్థానాలను బీజేపీ, 27 సీట్లకు కాంగ్రెస్ చెరో సీటును బీఎస్పీ, స్వతంత్ర అభ్యర్థి గెలుచుకున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. కనీసం 65 స్థానాలు గెలుచుకుని వరుసగా నాలుగోసారి అధికారం చేపట్టాలని బీజేపీ, 15 ఏళ్లుగా కొనసాగుతున్న విపక్ష హోదాను అధికార పక్షంగా మార్చుకోవాలని కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. బీఎస్పీ, అజిత్ జోగికి చెందిన జనతా కాంగ్రెస్ ఛత్తీస్గఢ్, సీపీఐల కూటమి కూడా విజయంపై ఆశలు పెట్టుకుంది. -
జంగ్..మైదాన్ కా!
ఛత్తీస్గఢ్లో నేడు రెండో విడత పోలింగ్ జరగనుంది. మావోయిస్టుల ప్రాబల్యమున్న 18 నియోజకవర్గాల్లో తొలి విడతలో ఎన్నికలు జరగగా.. మిగిలిన 72 స్థానాల్లో మంగళవారం ఓటు పండగకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ఛత్తీస్గఢ్లో అసలు రాజకీయానికి రెండో విడత వేదిక కానుంది. తొలి విడతలో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే హోరాహోరీ నెలకొంది. కానీ రెండో దశలో అజిత్ జోగి కారణంగా రెండు ప్రధాన పార్టీలకు ఇబ్బందులు ఎదురుకానున్నాయి. దీంతో రెండో విడతలో మూడుముక్కలాట ఖాయంగా కనబడుతోంది. ఈ విడత ఎన్నికలు జరిగే స్థానాల్లో జోగి–బీఎస్పీ ప్రభావముండే ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలున్నాయి. దీనికితోడు బీఎస్పీకి సన్నిహితంగా ఉండే సత్నామీలు ఈ నియోజకవర్గాల్లో నిర్ణయాత్మకం ఓటర్లు. రాజకుటుంబాల ప్రభావం ఉండే 14 ఆదీవాసీ నియోజకవర్గాల్లోనే రెండో దశలోనే ఎన్నికలు జరగనున్నాయి. గతంలో ఈ ప్రాంతంలో బీజేపీకి గట్టిపట్టుండగా.. ఈసారి వీటిని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. కాగా, అటు రమణ్సింగ్ అభివృద్ధి ఇమేజ్ కారణంగా మెరుగైన స్థానాలు సాధిస్తామని బీజేపీ భావిస్తుండగా.. కాంగ్రెస్ మాత్రం ప్రభుత్వ వ్యతిరేకతే తమకు సీఎం పీఠాన్ని అప్పగిస్తోందని అనుకుంటోంది. అటు, మొదటి విడతతో పోలిస్తే రెండో దశలో సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కువగా లేనప్పటికీ.. భద్రతను కట్టుదిట్టం చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోనే 76.28% శాతం పోలింగ్ జరగడంతో మైదాన ప్రాంతాల్లో ఓటింగ్ శాతం మరింత ఎక్కువగా ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బరిలో కోటీశ్వరులు, నేర చరితులు ఈ సారి ఎన్నికల బరిలో అదృష్టం పరీక్షించుకుంటున్న అభ్యర్థుల్లో కోటీశ్వరులు, నేరచరితులు ఎక్కువగా ఉన్నారు. ఎన్నికల్లో పోటీ పడుతున్న 1,079 మంది అభ్యర్థుల్లో 130 మందికి నేరచరిత్ర ఉంది. వారిలో 90 మందిపై హత్యాయత్నం వంటి తీవ్రమైన కేసులున్నాయి. అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించిన వివరాల ప్రకారం కాంగ్రెస్ పార్టీయే ఎక్కువ మంది నేరచరితులకు టికెట్లు ఇచ్చింది. ఆ పార్టీ నుంచి పోటీ పడుతున్న వారిలో 18 మందిపై తీవ్రమైన కేసులున్నాయి. 17 మంది అభ్యర్థులతో ఆమ్ ఆద్మీ పార్టీ రెండోస్థానంలో ఉండగా.. అజిత్ జోగి పార్టీ జేసీసీ నుంచి 15 మంది, బీజేపీ తరఫున ఆరుగురు నేరచరిత కలిగిన అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక కోట్లకు పడగలెత్తిన అభ్యర్థుల్లో బీజేపీ ముందు వరసలో ఉంది. బీజేపీ అభ్యర్థుల్లో 61 మంది కోటీశ్వరులుంటే, కాంగ్రెస్ 53 మందికి, జేసీసీ 35 మందికి టికెట్లు ఇచ్చింది. అంబికాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత (కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రచారం) టీఎస్ సింగ్దేవ్ రూ.500 కోట్లకు పైగా ఆస్తులతో అత్యంత ధనిక అభ్యర్థిగా నిలిచారు. హెల్ప్ అంటే రమణ్ రెండు నెలల క్రితం బస్తర్ ప్రాంతంలో కాంగ్రెస్ సీనియర్ నాయకురాలి కుమారుడికి పాము కరిస్తే, ఆమె సాయం కోసం ఫోన్ చేసింది సీఎం రమణ్ సింగ్కే. వెంటనే రమణ్ సింగ్ హెలికాప్టర్లో ఆ అబ్బాయిని తీసుకురావడానికి ఏర్పాట్లు చేశారు. సరైన సమయానికి రాయపూర్ ఆస్పత్రిలో చికిత్స జరగడంతో ఆ అబ్బాయి బతికి బయటపడ్డాడు. ఈ ఒక్క ఘటన చాలు.. విపక్షాల్లోనూ సీఎం రమణ్సింగ్కు ఉన్న ఇమేజ్ గురించి చెప్పడానికి. కేవలం ఇదొక్క సంఘటనే కాదు ప్రజలతోనూ ఆయన మమేకమవుతారనడానికి ఉదాహరణలు కోకొల్లలు. ఆయనకున్న వ్యక్తిగత ఇమేజ్ కారణంగానే మళ్లీ అధికారంలోకి వస్తామని బీజేపీ భావిస్తోంది. ‘చావల్ బాబా’గా పౌరసరఫరా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చి ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచారు. సెల్ ఫోన్ విప్లవాన్ని తీసుకువచ్చి రాష్ట్రాన్ని సాంకేతికంగానూ పరుగులు పెట్టించారు. సుపరిపాలనతో.. అన్ని వర్గాలను కలుపుకొని పోవడంలో కూడా రమణ్సింగ్ది ప్రత్యేకమైన శైలి. మావో సమస్యను ఉక్కుపాదంతో అణిచేసిన జాతీయవాదిగా, అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలతో సామాజికవాదిగా, పారిశ్రామికంగా రాష్టాన్ని పరుగులు పెట్టించిన అభివృద్ధి కారకుడిగా రమణ్ సింగ్కు రాష్ట్ర ప్రజల్లో ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ప్రభుత్వ వ్యతిరేకతే ఆయుధంగా.. సరిగ్గా ఎన్నికల తేదీల ప్రకటనకు ముందు ప్రదేశ్ కాంగ్రెస్కమిటీ అధ్యక్షుడే బీజేపీలో చేరడంతో కాంగ్రెస్లో నాయకత్వలేమి స్పష్టంగా కనిపిస్తోంది. ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు నేతలు తమను తాము సీఎం అభ్యర్థులుగా ప్రకటించుకుంటున్నప్పటికీ.. లోటు మాత్రం స్పష్టంగా కనబడుతోంది. ఈ సమయంలో రాష్ట్రంలో ప్రభుత్వ పగ్గాలు అందుకునేందుకు ప్రభుత్వ వ్యతిరేకతపైనే నమ్మకముంచింది. గత మూడుసార్లు స్వల్ప తేడాతోనే ఓడినందున ఈసారి ఆ తప్పులు చేయకుండా పట్టుబిగించేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. రైతుల్లో ఉన్న అసంతృప్తిని గమనించిన రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పదిరోజుల్లో రుణమాఫీ చేస్తానని తొలిదశ పోలింగ్ ప్రచారం ముగిసే ముందు ప్రకటించారు. 15 ఏళ్ల పాలన కారణంగా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను అందిపుచ్చుకునేందుకు.. రైతులు, మహిళలు, యువతను ఆకట్టుకునే విధంగా కాంగ్రెస్ మేనిఫెస్టోను రూపొందించింది. తొలిదశలో 76% పోలింగ్ జరగడంతో (ఎక్కువ పోలింగ్ జరిగితే అధికార పార్టీకి నష్టమనే భావనలో) దీని ప్రభావం రెండోదశలోనూ ఉంటుందని.. అది తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ బలంగా నమ్ముతోంది. జోగి ఝలక్ ఎవరికి? ద్విముఖ పోరుంటే గెలిచేది నువ్వా–నేనా అనేది తేలిపోతుంది. మూడో పార్టీ/వ్యక్తి రంగంలో వస్తే.. విజయం ఎవరిని వరిస్తుందనేది ఊహించడం కష్టం. అదే పరిస్థితి ఛత్తీస్గఢ్లో స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందనుకున్న సమయంలో ఛత్తీస్గఢ్ జనతా కాంగ్రెస్ (జేసీసీ) పేరుతో జోగి పోటీలోకి రావడం సమీకరణాలు మార్చేసింది. ఇది బీజేపీ, కాంగ్రెస్లకు ఇబ్బందికర పరిణామమే అయినా.. రెండు పార్టీలూ అవతలి పార్టీకే.. జోగితో నష్టమని ప్రచారం చేసుకుంటున్నాయి. 2013 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి బయటకు వచ్చి కేజేపీని స్థాపించిన యడ్యూరప్ప కారణంగా.. బీజేపీకి తీవ్ర నష్టం జరిగింది. ఇప్పుడు అదే సీన్ ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ విషయంలో పునరావృతం అవుతుందనే అంచనాలపై చర్చ జరుగుతోంది. నామమాత్ర తేడాతోనే.. ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో ఓట్లు, సీట్ల పరంగా అత్యంత స్వల్ప తేడాతో బీజేపీ గట్టెక్కింది. ఇందుకు కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న సంస్థాగత ఇబ్బందులే కారణమనేది సుస్పష్టం. అయితే ఈసారి గతంలోలాగా పొరపాట్లు చేయకుండా.. అధికార పీఠం దక్కించుకోవాలని కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తోంది. 15ఏళ్ల రమణ్సింగ్ పాలనతో విసిగిపోయిన జనాలు తమ విజయంలో కీలకమవుతారని భావించింది. ఈ ఆశలకు మాజీ సీఎం, గతంలో కరడుగట్టిన కాంగ్రెస్ వాదిగా ఉన్న అజిత్ జోగి రూపంలో ఎదురుదెబ్బ తగలనుంది. జోగి పార్టీ జేసీసీ కారణంగా కాంగ్రెస్ పార్టీనే ఎక్కువ ఇబ్బందులు పడుతోంది. కాంగ్రెస్కు పట్టున్న దళిత స్థానాల్లో బీఎస్పీతో జోగి దెబ్బకొట్టొచ్చని విశ్లేషణలున్నాయి. హిందీరాష్ట్రాల్లో 2003 నుంచి గణాంకాలు పరిశీలిస్తే కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఐల ఓట్లు కలిపితే.. బీజేపీ కన్నా ఎక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్, జోగి కలిసి పోటీ చేసుంటే.. బీజేపీ ఓటమి ఖాయమనే వాదన వినిపించింది. కానీ ఇందుకు ఇటు కాంగ్రెస్, అటు జోగి ఇద్దరూ అంగీకరించలేదు. ఇప్పుడు ఈ త్రిముఖ పోరులో జోగి కారణంగా అంతిమంగా బీజేపీకే మేలు జరిగే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. బీఎస్పీ ఎంట్రీతో.. బీఎస్పీ యూపీ మినహా మిగిలిన రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కాకపోయినా.. గెలిచే పార్టీల అవకాశాలను మాత్రం దెబ్బతీస్తోంది. ఇది చాలా సందర్భాల్లో నిరూపితమైంది. అలాంటి బీఎస్పీ.. ఈసారి జోగితో జతకట్టడం ఎవరి ఓట్లకు నష్టమనేది చర్చనీయాంశమైంది. ఈ చర్చే జోగిని ఈసారి ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక వ్యక్తిగా మార్చింది. జోగి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినందున.. ఆయన వల్ల కాంగ్రెస్కే నష్టమనే వాదనలు వినబడుతున్నాయి. జోగి–బీఎస్పీ కూటమిలో సీట్ల పంపిణీ కూడా ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. రాష్ట్రంలో ఈ కూటమి తరఫున 55 సీట్లలో జేసీసీ బరిలో ఉంది. వీటిలో మెజార్టీ స్థానాల్లో 2008, 2013లో కాంగ్రెస్ మంచి ప్రదర్శన చూపింది. ఎస్సీ, ఎస్టీలే కీలకం రాష్ట్రంలో గణనీయంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ ఓటర్లు మాయావతి, జోగి జట్టుకట్టడంతో.. మూడో కూటమి వైపు మొగ్గు చూపుతారని అంచనా. 9 ఎస్సీ రిజర్వ్డ్, 17 ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలున్నాయి. ఈ నియోజకవర్గాల్లో మూడో కూటమి ప్రభావం ఉండొచ్చు. కూటమితో పొత్తు ఉండుంటే.. ఈ సీట్లలో కాంగ్రెస్కు మేలు జరిగేది. పొత్తు లేకపోవడంలో ఈ త్రిముఖ పోటీలో బీజేపీ కష్టంమీద గెలిచే అవకాశాలున్నాయని అంచనా. ఈసారి ఎస్సీల్లోని సత్నామీ వర్గం ఓట్లను గెలిచేందుకు కాంగ్రెస్ కొత్త వ్యూహం పన్నింది. సత్నామీల గురువులు ముగ్గురిని చేర్చుకుని అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. నేటి రెండోదశే నిర్ణయాత్మకం! 72 నియోజకవర్గాల్లో మంగళవారం పోలింగ్ జరగనుంది. మైదాన ప్రాంతాల్లో జరిగే ఈ ఓటింగే ఎన్నికల్లో నిర్ణయాత్మకం కానుంది. అజిత్ జోగికి చెందిన జనతా కాంగ్రెస్ ఛత్తీస్గఢ్ (జేసీసీ) ప్రభావం అత్యధికంగా ఉండే ఈ ప్రాంతాల్లో ముక్కోణపు పోటీ ఎవరికి లాభం చేకూరుస్తుందో? ఎవరు నష్టపోతారో? అనేది విశ్లేషకులకూ అంతుచిక్కడం లేదు. గత మూడు ఎన్నికల్లోనూ ముక్కోణపు, బహుముఖ పోటీల కారణంగా బీజేపీకే లాభం చేకూరింది. ఈ సారి బీఎస్పీతో జతకట్టి బరిలో దిగిన అజిత్ జోగి కూడా కాంగ్రెస్ ఓట్లను చీల్చడం ద్వారా బీజేపీకి మేలుచేస్తారనే అంచనాలైతే బలంగా ఉన్నాయి. రాష్ట్ర జనాభాలో 14% ఉన్న సత్నామీలు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. జోగికి సత్నామీల్లో పట్టు ఉంది. ఈ వర్గం బీఎస్పీకి శాశ్వత ఓటు బ్యాంకు కూడా. బీఎస్పీ–జేసీసీ కూటమి బలమైన శక్తిగా అవతరించడానికి కారణం కూడా ఈ వర్గమే. మధ్య ఛత్తీస్గఢ్లో సత్నామీలు ఎక్కువగా ఉన్న 10 ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో జోగి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. బిలాస్పూర్, జంజీగర్ ప్రాంతాల్లో ఈ కూటమి తన ప్రభావాన్ని చూపిస్తుందన్న అంచనాలున్నాయి. జంజీగర్, చంపా వంటి స్థానాల్లో బీజేపీ నుంచి పార్టీ ఫిరాయించి బీఎస్పీలో చేరిన వారున్నారు. అలాంటి స్థానాల్లో గెలుపు ఎవరిదో అంచనా వేయడం సంక్లిష్టంగా మారింది. ఇలా మొత్తం 12 స్థానాల్లో గెలుపోటములు అంచనా వేయడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు సత్నామీల గురువు గురు బాలదాస్.. కాంగ్రెస్తో చేతులు కలపడంతో ఆ సామాజిక వర్గం ఓట్లు ఎటు మళ్లుతాయనేది ఆసక్తికరంగా మారింది. అజిత్ జోగి, మాయావతి కూటమి 6–7% ఓట్లను కొల్లగొట్టగలరని అంచనాలున్నాయి. ఈ ఓట్ల చీలిక ఎవరికి నష్టం చేకూరుస్తుందో.. ఇప్పుడే చెప్పలేని స్థితి. రెండో దశలో ఓబీసీ ఓట్లు కూడా కీలకమే. జనాభాలో 45% ఓబీసీలుంటే వారిలో 22% మంది సాహులు ఉన్నారు. సాహులు సంప్రదాయంగా బీజేపీకే మద్దతు నిలుస్తున్నారు. కాంగ్రెస్తో పోల్చి చూస్తే బీజేపీయే సాహులకు ఎక్కువ టిక్కెట్లు ఇచ్చింది. రాజ కుటుంబీకులపై ఆశలు ఆదివాసీ ప్రాంతమైన సుర్గుజాల్లో మొత్తం 14 నియోజకవర్గాలున్నాయి. ఇక్కడ రాజకుటుంబాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ కుటుంబాలను దగ్గర చేసుకోవడానికి కాంగ్రెస్, బీజేపీలు పోటీ పడుతున్నాయి. ఈ కుటుంబాల వారికే రెండు పార్టీలు కనీసం నాలుగేసి స్థానాల్లో బరిలో దింపాయి. 2000 సంవత్సరంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడినప్పటినుంచీ.. ఈ ప్రాంతంపై బీజేపీదే పట్టు. ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ కూడా తన బలాన్ని పెంచుకుంటోంది. కాంగ్రెస్ సీఎం అభ్యర్థి రేసులో ఉన్న టీఎస్ సింగ్దేవ్ ఈ రాజ కుటుంబాలకు చెందినవారే. ఆయనపై బీజేపీ అదే రాజవంశానికి చెందిన అనురాగ్ సింగ్దేవ్ను బరిలో దింపింది. బీజేపీలో నేత దిలీప్ సింగ్ జుదావో కూడా ఇక్కడి జష్పూర్కి చెంది రాజ కుటుంబీకుడు. ఆయన కుమారుడు యుధవీర్ సింగ్ చంద్రపూర్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. యుధవీర్ భార్య సంయోగిత సింగ్ ఈసారి చంద్రపూర్ నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్నారు. 2003 ఎన్నికల్లో 14 స్థానాలకు గాను బీజేపీ ఏకంగా 10 సీట్లను సాధించింది. 2013 ఎన్నికల్లో ఇరు పార్టీలు చెరిసగం సీట్లను పంచుకున్నాయి. -
మోసం ఆ పార్టీ రక్తంలోనే ఉంది
ఛింద్వారా/మహాసముంద్: మోసం కాంగ్రెస్ పార్టీ రక్తంలోనే ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘాటుగా విమర్శించారు. దళితుడైనందునే సీతారాం కేసరిని ఏఐసీసీ అధ్యక్ష పదవి నుంచి అర్ధంతరంగా తొలగించి సోనియాను అందలం ఎక్కించారని నిప్పులు చెరిగారు. ఆదివారం ఆయన మధ్యప్రదేశ్లోని ఛింద్వారా, ఛత్తీస్గఢ్లోని మహాసముంద్లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. ‘కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. మోసం ఆ పార్టీ రక్తంలోనే ఉంది. కానీ, రాష్ట్ర ప్రజలు ఆ పార్టీని పట్టించుకోరు. గోవును కీర్తిస్తూ మధ్యప్రదేశ్ మేనిఫెస్టోలో పథకాలు కూడా ఆ పార్టీ ప్రకటించింది. కేరళలో మాత్రం ఆ పార్టీ నేతలు ఆవు దూడలను తింటూ పశుమాంసం తినడం తమ హక్కంటారా?’ అని ప్రజలను అడిగారు. ‘ఆధార్ ఆధారిత సాంకేతికతతో ప్రభుత్వ పథకాలను అనర్హుల పాలు కాకుండా చేసి ఏడాదికి 90 వేల కోట్ల రూపాయల దోపిడీని ఆపుతున్నా. అందుకే కాంగ్రెస్ నేతలు నన్ను తీవ్రంగా విమర్శిస్తున్నారని నాకు తెలుసు’ అని మోదీ అన్నారు. కేసరిని అర్ధంతరంగా తొలగించారు ఏఐసీసీ అధ్యక్షుడు(1996–98)గా ఉన్న సీతారాం కేసరి దళితుడైనందునే ఆ పార్టీ ఆయన్ను అర్ధంతరంగా పదవి నుంచి దించేసిందని మోదీ విమర్శించారు. పదవీ కాలం పూర్తి కాకుండానే సీతారాం కేసరిని పార్టీ ఆఫీసు నుంచి బయటకు నెట్టేసిన ఆ పార్టీ నేతలు సోనియా గాంధీని పదవిలో కూర్చోబెట్టారన్న విషయం అప్పట్లో దేశ ప్రజలకు కూడా తెలుసునని పేర్కొన్నారు. ‘ఆ ఒక్క కుటుంబం నాలుగు తరాలుగా అధికారంలో ఉంటూ లాభం పొందగా, వారి పాలనతో దేశానికి ఎటువంటి ప్రయోజనం కలగలేదు’ అని మోదీ అన్నారు. ఆ కుటుంబానికి చెందని సమర్థుడైన వ్యక్తిని అధ్యక్ష పదవికి ఎన్నుకోవాలని కాంగ్రెస్కు ఆయన సవాల్ విసిరారు. ‘రైతు రుణాలను రద్దు చేస్తామంటూ కాంగ్రెస్ తప్పుడు వాగ్దానాలు చేస్తోంది. కర్ణాటకలో ఇచ్చిన అలాంటి హామీని అక్కడి ప్రభుత్వం ఏడాదవుతున్నా అమలు చేయలేదు. పైపెచ్చు రుణగ్రహీతలైన అక్కడి రైతులకు వారంట్లు జారీ చేస్తూ అరెస్టులు చేయిస్తోంది’ అని ప్రధాని మోదీ ఆరోపించారు. ఛత్తీస్గఢ్లో బరిలో 1,101 మంది ఛత్తీస్గఢ్లో చివరి దశలో ఈనెల 20వ తేదీన 72 స్థానాలకు జరగనున్న ఎన్నికలకు ఆదివారంతో ప్రచారం ముగిసింది. పోటీలో 1,101 మంది అభ్యర్థులున్నారు. రాయ్పూర్ సిటీ దక్షిణ స్థానం కోసం అత్యధికంగా 46 మంది పోటీ పడుతున్నారు. మొదటి దశలో మావోయిస్టు ప్రభావిత బస్తర్ ప్రాంతంలోని 18 స్థానాలకు 12న ఎన్నికలు జరిగాయి. ఫలితాలు డిసెంబర్ 11న వెలువడనున్నాయి. కేసరి దళితుడు కాదు: కాంగ్రెస్ న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సీతారాం కేసరి దళితుడు అంటూ ప్రధాని చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. కేసరి దళితుడు కాదు, ఇతర వెనుక బడిన కులాల(ఓబీసీ)కు చెందిన వ్యక్తి అని స్పష్టం చేసింది. ‘సీతారాం కేసరి బిహార్ ఓబీసీల్లోని బనియా కులానికి చెందిన వ్యక్తి. ఆయన దళితుడు కాదు. ఆయనకు పార్టీ తగు గౌరవం ఇచ్చింది. అయినా.. నిజాలు, సత్యాలను ప్రధాని మోదీ ఎన్నడైనా చెప్పారా?’అంటూ కాంగ్రెస్ ప్రతినిధి మనీష్ తివారీ ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘కొత్తకొత్త అబద్ధాలు చెప్పడం మోదీకి అలవాటుగా మారింది. ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, కల్రాజ్ మిశ్రా, కేశూభాయ్ పటేల్లాంటి బీజేపీ ప్రముఖ నేతలను ఎలా గౌరవించారో ఆత్మవిమర్శ చేసుకోండి’ అంటూ మోదీని వ్యంగ్యంగా అన్నారు. -
పల్లే.. పట్టు!
మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల నియోజకవర్గాలే ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానున్నాయి. భారత దేశంలో వ్యవసాయ రంగానికి సమస్యలు మొదట్నుంచీ తీవ్రంగానే ఉన్నప్పటికీ.. ఈ మధ్య కాలంలో రైతు ఆందోళనలు రాజకీయ రంగు పులుముకోవడం ఆయా రాష్ట్రాల్లో అధికార పక్షాలకు సవాల్గా మారింది. ఈ ఎన్నికల్లో రైతు సమస్యలను ççప్రసావిస్తూ వెళ్తేనే ఓట్లను ప్రభావితం చేయవచ్చని విపక్షాలు గుర్తించాయి. అందుకే ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల నియోజవకర్గాలు కీలకం కానున్నాయి. ఈ ప్రాంతాల్లో ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీకే అధికారం అందనుందనేది సుస్పష్టం. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను పూర్తిగా అమలుచేస్తేనే భారత వ్యవసాయ రంగ పునరుజ్జీవనం సాధ్యమవుతుందని ఈ రంగంలోని నిపుణులు కోరుతున్నారు. ఇది గత 15 ఏళ్లుగా దేశమంతా వినిపిస్తున్న డిమాండ్. కానీ.. ప్రభుత్వాలు మాత్రం ఈ కమిటీ సిఫార్సులను పూర్తిగా అమలు చేయలేమని చేతులెత్తేశాయి. తమ తమ రాష్ట్రాల్లో వ్యవసాయ రంగ అభివృద్ధికి వీలున్నన్ని చర్యలు తీసుకుంటున్నాయి. అయితే ఇవేవీ అన్నదాతకు పూర్తి భరోసాను ఇవ్వలేకపోతున్నాయి. వాతావరణంలో వస్తున్న మార్పులు, చీడ పీడ పెరగడం– సరైన నీటి వనరులు లేకపోవడంతో వ్యవసాయ దిగుబడులు తగ్గడం వంటివి రైతును కుంగదీస్తున్నాయి. ఇవి ప్రభుత్వం తీసుకునే ఉపశమన చర్యల కంటే ఎక్కువ నష్టాన్ని కలగజేస్తుండడంతో దేశవ్యాప్తంగా రైతుల్లో అసహనం కట్టలు తెంచుకుంటోంది. పలుచోట్ల ఆత్మహత్యలు జరుగుతుండగా.. మరికొన్ని చోట్ల ఆందోళనలు, నిరసనలు మిన్నంటుతున్నాయి. మధ్యప్రదేశ్లోని మందసౌర్లో గతేడాది జరిగిన రైతు ఆందోళనలు, తదనంతర పరిణామాల్లో ఆరుగురు రైతులు పోలీసు కాల్పుల్లో చనిపోవడం దేశవ్యాప్తంగా సంచనలం సృష్టించాయి. ఇది శివరాజ్ ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచింది. దీనికితోడు.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్లరద్దు, జీఎస్టీ కారణంగా రైతులకు ఇబ్బందులు ఎదురయ్యాయనే విమర్శలున్నాయి. ఈ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఎంతో అభివృద్ధి చేశామని చెబుతున్నప్పటికీ.. రైతు సమస్యలే ప్రభుత్వ ఏర్పాటును శాసించబోతున్నాయనేది నిర్వివాదాంశం. అసంఘటిత రంగానికి దెబ్బ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్లరద్దు కారణంగా అసంఘటిత రంగ కార్మికులకు, చిరు వ్యాపారులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. వీరి సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. మార్కెట్లో చెలామణీకి సరిపోయేంతగా నగదు అందుబాటులో లేకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. కొనేవారి వద్ద, అమ్మేవారి వద్ద డబ్బుల్లేకపోవడంతో మార్కెట్ దెబ్బతింది. గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తి తగ్గడంతో దీంతో నష్టం వచ్చింది. పట్టణ ప్రాంతాల్లోలాగా డిజిటల్ లావాదేవీలు.. గ్రామీణ ప్రాంతాలకు వెంటనే అందుబాటులోకి రాకపోవడం, ఇలాంటి లావాదేవీలపై ప్రజలకు సరైన అవగాహన కల్పించకపోవడంతో సమస్యలు ఎక్కువగా కనిపించాయి. ఈ క్రమంలోనే వివిధ అంశాల కారణంగా దేశ వృద్ధిరేటు స్వల్పంగా తగ్గింది. ఆ తర్వాత ప్రభుత్వం ఉపశమన చర్యలు తీసుకున్నప్పటికీ.. చిరువ్యాపారులు, కార్మికరంగానికి జరిగిన నష్టం పూడ్చలేకపోయారు. అటు రైతుల విషయంలోనూ ప్రభుత్వం మద్దతు ధర (ఎమ్మెస్పీ) పెంచినప్పటికీ.. రైతులు పండించిన మొత్తాన్ని కొనుగోలు చేయకపోవడంతో సమస్య మొదటికే వచ్చింది. 200 జిల్లాల్లో కరువు ఈ ఏడాది గతం కన్నా రుతుపవనాలు సరిగ్గానే ఉన్నప్పటికీ.. దేశలోని 600 జిల్లాలకు గానూ 200 జిల్లాల్లో కరువు పరిస్థితులే ఉన్నాయి. వాటిల్లో మధ్యప్రదేశ్, రాజస్తాన్లో జిల్లాలు కూడా ఉన్నాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీగా అమలు చేయకపోవడంతో కూలీలు కూడా దుర్భర జీవితాన్నే గడుపుతున్నారు. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్ మూడు రాష్ట్రాల్లోనూ కలిపి 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ ప్రాంత జనాభా 12.4 కోట్లు. వీళ్లంతా ఎన్నికల్లో కీలకంగా మారబోతున్నారనే అంచనాలున్నాయి. గత ఎన్నికల్లో ఈ మూడు రాష్ట్రాల్లోనూ గ్రామీణ నియోజకవర్గాల్లో బీజేపీపై పూర్తి పైచేయి సాధించింది. అయితే ఈ సారి వీరి దారెటు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ప్రభుత్వంపై రైతులు, చిరువ్యాపారలు వ్యతిరేకతను పక్కనపెడితే.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన దానికన్నా.. తాము రైతులకు చేసిన మేలే ఎక్కువని బీజేపీ చెబుతోంది. అసంతృప్తి ఎదురైతే? 2004లో వాజపేయి ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లిన సమయంలో కూడా గ్రామీణ భారతంలో పూర్తిగా పరిష్కారం కాని సమస్యలున్నాయి. రైతులు, రోజు కూలీలు, కార్మికుల్లో ప్రభుత్వ వ్యతిరేకత కనిపించింది. అయితే ఎన్డీయే సర్కారు మౌలిక సదుపాయాల రంగం పైనే ఎక్కువ దృష్టి సారించింది. భారత్ వెలిగిపోతోందని విశ్వసించింది. అదే నినాదంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. గ్రామీణ ప్రాంత ఓటరు నిర్ణయం కారణంగా.. బీజేపీ ఓడిపోయింది. 2019లో నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రజా నిర్ణయానికి ఈ అసెంబ్లీ ఎన్నికలు గీటురాయిగా మారబోతున్నాయని రాజకీయ విశ్లేషకులంటున్నారు. బీజేపీ సంప్రదాయ ఓటర్లలో బ్రాండ్ మోదీ, బీజేపీ మధ్య స్పష్టమైన విభజన ఉంది. 2014 తర్వాత అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఏకపక్షంగా గెలుస్తోందంటే.. దానికి మోదీ మ్యాజిక్ కారణం. మరి ఆ మోదీ మ్యాజిక్ ఈ సారి ఎన్నికల్లో గ్రామీణ ఓటర్లను మెప్పిస్తుందో లేదో మరి కొద్దిరోజుల్లోనే తేలిపోనుంది. ‘గుజరాత్’లో మోగిన ఘంటికలు గతేడాది డిసెంబర్లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల సమస్యలే ఎన్నికల ప్రధాన అజెండాగా మారాయి. అప్పుడే బీజేపీకి ప్రమాద ఘంటికలు మోగాయి. మెజారిటీ గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీపై విముఖత వ్యక్తమైంది. ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఆధిక్యం సాధించింది. గుజరాత్ జనాభాలో దాదాపుగా 43% పట్టణ ప్రాంతాల్లో నివసిస్తారు. వారంతా బీజేపీకి అండగా నిలవడంతో ఆ పార్టీ ఎన్నికల్లో గట్టెక్కింది. గుజరాత్తో పోలిస్తే మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో పట్టణ ప్రాంత ఓటర్లు తక్కువ. మధ్యప్రదేశ్లో 28%, రాజస్తాన్లో 25%, ఛత్తీస్గఢ్లో 23% మాత్రమే పట్టణ ఓటర్లు ఉన్నారు. వీరి సాయంతోనే ఈ ఎన్నికల్లో గెలవడం బీజేపీకి అంత సులభం కాదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే మందసౌర్ ఘటనతో మేల్కొన్న శివరాజ్ సింగ్ ప్రభుత్వం మధ్యప్రదేశ్లో రైతుల్లో అసంతృప్తిని చల్లార్చేందుకు పలు ప్రయత్నాలు చేసింది. ‘భవాంతర్’ స్కీమ్ ద్వారా సోయా, మొక్కజొన్న వంటి పంటలపై క్వింటాల్కు మార్కెట్ రేటుకు అదనంగా రూ. 500 ఇవ్వాలని నిర్ణయించారు. ఇది కొంతమేర వ్యతిరేకతను తగ్గిస్తుందని అంచనా వేస్తున్నారు. రాజస్తాన్లో పరిస్థితి ఏమాత్రం ప్రభుత్వం చేతుల్లో లేకుండా పోయింది. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు! రాజస్తాన్లో పాకిస్తాన్తో సరిహద్దు రేఖ వెంట గ్రామాల్లో రైతులకు అసెంబ్లీ ఎన్నికలు కొత్త చిక్కులు తెచ్చాయి. ఎన్నికల నేపథ్యంలో శ్రీగంగానగర్ జిలాల్లో సరిహద్దు గ్రామాల్లో రక్షణ ఏర్పాట్లు ముమ్మరం చేశారు. గ్రామస్తుల కదలికలపై పరిమితులు విధించారు. ఈ షరతులతో రైతులకు పొలం పనులు చేసుకోవడం కష్టంగా మారింది. ఈ జిల్లాలో దాదాపు 50 గ్రామాలు సరిహద్దు రేఖ వెంబడి ఉన్నాయి. వీటిలో ఐదు గ్రామాల్లో బీఎస్ఎఫ్ పోస్టులు కూడా ఉన్నాయి. విత్తడం నుంచి కాపు కోతవరకు ప్రతిపనికి రైతులు బీఎస్ఎఫ్ అనుమతులు తీసుకోవాల్సి వస్తోంది. ఏ పనైనా ఉదయం 9–4 గంటల మధ్యలోనే ముగించాలనడంతో ఇబ్బంది అవుతోందని రైతులంటున్నారు. దీనికితోడు మూడు అడుగులకు పైన పొడవు పెరిగే పంటలు వేయకూడదని ఆంక్షలున్నాయని వాపోయారు. దీంతో చెరకు లాంటి వాణిజ్య పంటలు కాదని కేవలం కూరగాయలను పండిస్తున్నామని చెప్పారు. కొంతమంది రైతులు ఈ ఆంక్షలకు జడిసి పొలంపనికి పోవడమే మానేశారు. సరిహద్దు కంచె నిర్మాణం కోసం 1982లో పలువురు రైతులు తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చారు. వీరిలో చాలామందికి ఇంతవరకు పరిహారం దక్కలేదని అక్కడి ప్రజల ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇక్కడ సారవంతమైన భూముల కారణంగా పొలాలకు రేట్లు ఎక్కువ. అయితే ఈ ఆంక్షల కారణంగా పెద్దగా అమ్మకాలు, కొనుగోళ్లు జరగవు. అయితే.. ఇన్ని ఇబ్బందులున్నా ఇక్కడి ప్రజలకు మాత్రం బీఎస్ఎఫ్ వాళ్లంటే చాలా అభిమానం ఉండడం కొసమెరుపు. ఒట్టేసి చెబుతున్నా..! ఎన్నికల అనంతరం ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో జట్టు కట్టబోనని ఛత్తీస్గఢ్ జనతా కాంగ్రెస్ అధినేత అజిత్ జోగి బల్లగుద్ది చెబుతున్నారు. బీజేపీకి లబ్ది చేకూర్చటానికే జోగి బరిలో ఉన్నారన్న కాంగ్రెస్ విమర్శల నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు. ‘బీజేపీకి మద్దతు ఇవ్వడంమో, బీజేపీ మద్దతు తీసుకోవడమో చేయను’అని భగవద్గీత, ఖురాన్, బైబిల్, గురుగ్రంథ్ సాహెబ్, షాడానీ ప్రకట్ తదితర ఎనిమిది మతాలకు చెందిన పవిత్ర గ్రంథాలపై మీడియా సమావేశం ఏర్పాటుచేసి మరీ ప్రమాణం చేశారు. ఇదంతా తనపై బురదజల్లేందుకు కాంగ్రెస్ చేస్తున్న కుటిల ప్రచారమని దుయ్యబట్టారు. బీజేపీతో జట్టు కట్టడం కన్నా చావడమే మేలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో సీజేసీ, బీఎస్పీ, సీపీఐ కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ కూటమి కారణంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుందని కాంగ్రెస్ భయపడుతోంది. ఇటీవల కాలంలో ఎస్సీ, ఎస్టీ ఓటర్లలో బీజేపీపై కొంత అసంతృప్తి కనిపిస్తోంది. ఈ అసంతృప్తిని జోగి వైపుకు మరలించి తద్వారా కూటమిని బలహీనపరచాలని కాంగ్రెస్ యోచిస్తోంది. -
ఛత్తీస్గఢ్: ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోదీ
-
క్యాష్ 'పార్టీ' కీలకం
మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ విడిపోయి 18 ఏళ్లవుతుంది. ఈ కాలంలో వివిధ రంగాల్లో రాష్ట్రం పురోగతి సాధించింది. కొత్త ప్రపంచస్థాయి రాజధాని మొదలుకుని చాలా కార్యక్రమాలను విజయవంతంగా పూర్తిచేసింది. ఈ ప్రగతి ప్రయాణంలోనే.. ఛత్తీస్గఢ్లో నయా ధనిక వర్గం ఆవిర్భవించింది. ఈ వర్గం స్థానికంగా బలపడుతూ.. రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి చేరేలా ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగానే ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నయాధనిక వర్గం ప్రభావం చూపనుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. అయితే బీజేపీ, లేదంటే కాంగ్రెస్ అన్నట్లుగా ఉన్న పరిస్థితినుంచి ఈ వర్గం సొంతబలంతో ఎదిగేందుకు కృషిచేస్తోంది. క్రమేణా ప్రధానపార్టీల బలం క్షీణిస్తుండటంతో.. మాజీ సీఎం, కొత్తపార్టీ పెట్టిన అజిత్ జోగి నేతృత్వంలోని మూడో ఫ్రంట్తో రాజకీయ ప్రవేశానికి ప్రయత్నాలు చేస్తోంది. అన్ని నియోజకవర్గాల్లో పోటీచేసేందుకు అవకాశం లభించిన జోగి ఆలోచనలకు ఈ వర్గం అండగా నిలుస్తోందనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నుంచి బీజేపీకి మార్పు రాష్ట్రం ఏర్పాటయ్యేనాటికి అసెంబ్లీలో కాంగ్రెస్కు 48మంది ఎమ్మెల్యేలున్నారు. వీరిలో 22 మంది గిరిజన ఆధిపత్యంగల సర్గుజ, బస్తర్ డివిజన్ల నుంచే (మొత్తం 26 సీట్లలో) గెలిచారు. వీటిలో 25 ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు. ఇక బిలాస్పూర్, రాయ్పూర్, దుర్గ్ డివిజన్లలో ఉన్న 64 సీట్లలో బీజేపీకి 32, కాంగ్రెస్కు 29 ఉన్నాయి. రాష్ట్రంలో మొదటి అసెంబ్లీ ఎన్నికల నాటికి (2003) పరిస్థితి మారిపోయింది. బస్తర్, సర్గుజ డివిజన్లలో బీజేపీ పట్టు సాధిస్తే.. బిలాస్పూర్, రాయ్పూర్, దుర్గ్ డివిజన్లలో కాంగ్రెస్ పాగావేసింది. 2008 ఎన్నికల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి. అయితే, 2013 ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్లు రెండూ దెబ్బతిన్నాయి. సర్గుజ, బస్తర్లలో కాంగ్రెస్ 15 సీట్లే గెలుచుకుంది. 37 మంది కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 26 మంది ఓడిపోయారు. బీజేపీ కూడా ప్రభుత్వ వ్యతిరేకతతో నష్టపోయింది. ఆ ఎన్నికల్లో ఐదుగురు మంత్రులు సహా పలువురు సిట్టింగ్లు ఓడిపోయారు. లోక్సభ ఎన్నికల్లోనూ.. 2004, 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీల్లో ఒకరికి మొత్తం 11 సీట్లకు గాను పది సీట్లు దక్కాయి. కానీ.. అసెంబ్లీల్లో కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీల అభ్యర్ధులు గణనీయమైన ఓట్లు సంపాదించారు. ఈ పరిస్థితిపై ప్రధాన పార్టీల్లో 2014 నుంచి కలవరం మొదలైంది. క్షీణిస్తున్న పార్టీల ఓటుబ్యాంకు రాష్ట్ర ఆవిర్భావం నుంచి 2018 వరకు ఛత్తీస్గఢ్ రాజకీయాల్లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. బీజేపీ, కాంగ్రెస్లు రెండింటి ఓటు బ్యాంకులూ క్షీణిస్తూ వస్తున్నాయి. ప్రస్తుతం స్థానిక వర్గం (నయా ధనికవర్గం) బలపడటమే కాక ఎన్నికల ఫలితాలను నిర్ణయించే శక్తిగా ఎదుగుతూ వస్తోంది. ధనబలంతో పాటు కులం బలం ఆధారంగా ఈ వర్గం సొంతంగా ఎన్నికల్లో పోటీ చేసే సత్తా సంతరించుకుంది. ప్రధాన పార్టీలతో వీరు తలపడటంతో చాలా చోట్ల బహుముఖ పోటీలు అనివార్యమయ్యాయి. ఈ అభ్యర్ధులు ప్రధాన పార్టీల ఓట్లను చీల్చడం వల్ల ఓట్లను నిర్ణయించే స్థితికి చేరుకున్నారు. బ్రాహ్మణులకూ బీఎస్పీ టికెట్లు ఉదాహరణకు బెల్టర నియోజకవర్గంలో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే (బ్రాహ్మణుడు)ను కాదని పార్టీ జిల్లా అధ్యక్షుడు రజనీష్ సింగ్ను నిలబెట్టింది. కాంగ్రెస్ ఓబీసీ అభ్యర్థిని బరిలో దించింది. జోగి–బీఎస్పీ కూటమి పంజాబీ బ్రాహ్మణుడిని పోటీకి దించింది. బీజేపీకి సంప్రదాయకంగా వస్తున్న బ్రాహ్మణుల ఓట్లను రాబట్టుకోవడానికి ఈ కూటమి పంజాబీ బ్రాహ్మణుడిని ఎన్నుకుంది. అలాగే, బీఎస్పీ మద్దతు ఉండటం వల్ల కాంగ్రెస్కు పడే దళితుల ఓట్లను కూడా చీల్చే అవకాశం ఉంది. ఏ పార్టీ ఓట్లను ఏ మేరకు చీల్చగలడన్న దానిపై సదరు అభ్యర్థి విజయం ఆధారపడి ఉంటుంది. అలాగే, అకల్తరలో జోగి కోడలు బీఎస్పీ టికెట్పై పోటీ చేస్తున్నారు. ఆమెకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి కూడా బలమైన వాడే. సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ వ్యక్తి. ఆయన కాంగ్రెస్ ఓట్లు జారిపోకుండా చూసుకోగలిగితే ఆ మేరకు బీఎస్పీ నష్టపోతుంది. లేదంటే బీఎస్పీ అభ్యర్ధి అవకాశాలు మెరుగుపడతాయి. -
ఈసారి ‘మహాసముంద్’లో మార్పు!
సాక్షి, న్యూఢిల్లీ : చత్తీస్గఢ్ రెండో విడత పోలింగ్కు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. మహాసముంద్ జిల్లాలో వ్యవసాయ సంక్షోభం తీవ్రంగా ఉండడంతో జిల్లాలోని రైతులు, దినసరి కూలీలు అలమటిస్తున్నారు. మహాసముంద్ పట్టణంలోని రోడ్డెక్కితే పక్కనున్న టీ దుకాణం ముందు కూలీల గుంపు కనిపిస్తోంది. ఎవరైనా తమకు పనికి తీసుకుపోతారన్న ఆశతో వారక్కడ ప్రతిరోజు పడిగాపులు గాస్తారు. దీపావళి పండుగ నాటి నుంచి తమకు ఏపని దొరకడం లేదని వారు వాపోతున్నారు. ఎన్నికలు ముగిసే వరకు పరిస్థితి ఇలాగే ఉండవచ్చని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని 90 అసెంబ్లీ సీట్లకుగాను 18 సీట్లకు నవంబర్ 12వ తేదీన మొదటి విడత పోలింగ్ జరిగింది. మిగతా సీట్లకు నవంబరం 20వ తేదీన పోలింగ్ జరుగుతుంది. రాష్ట్రంలో వ్యవసాయమనేది ఏమాత్రం గిట్టుబాటులేని వ్యవహారం అయిపోయినదని, కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా వెనక్కి రావడం లేదని నయపరా గ్రామానికి చెందిన దౌలత్ రామ్ గురు వాపోయారు. రాష్ట్రంలోని రామన్ సింగ్ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం వల్లనే తమకు ఈ పరిస్థితి దాపురించిందని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. తాము కూడా అలాగే అనుకుంటున్నామని రోజువారి పనికోసం నిరీక్షిస్తున్న కూలీలు చెప్పారు. బీజేపీ పాలనతో రాష్ట్రం స్తంభించిపోయిందని, తాము ఈ సారి మార్పును కోరుకుంటున్నామని సోహ్రి గ్రామానికి చెందిన సియారామ్ యాదవ్ అనే రైతు తెలిపారు. మహాసముంద్లో నవంబర్ 13న జరిగిన రాహుల్ గాంధీ ర్యాలీకి ప్రజలు భారీ ఎత్తున తరలి రావడానికి కారణం కూడా ప్రభుత్వంపైనున్న వ్యతిరేకతే కారణమని ప్రజలు తెలిపారు. రమణ సింగ్, ఆయన కుటుంబం అవినీతి గురించి రాహుల్ గాంధీ మాట్లాడినప్పుడుగానీ, రఫేల్ ఒప్పందంతో ప్రధాని మోదీ తన మిత్రులకు దోచిపెట్టారని పదే పదే మాట్లాడినప్పుడు కూడా ప్రేక్షకులు మౌనంగానే ఉన్నారు. క్రోని క్యాపిటలిస్టులైన అనిల్ అంబానీ, నీరవ్ మోదీ, విజయ్ మాల్యాలకు మోదీ సహకరించారని ఆరోపించినప్పుడు కూడా ప్రజల నుంచి స్పందన లేదు. పేదల నుంచి డబ్బు లాక్కొని ధనికులకు పంచడానికే మోదీ ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దును తీసుకొచ్చిందని ఆరోపించినప్పుడూ కూడా ప్రజల నుంచి అంతగా స్పందన లేదు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడడం మొదలుపెట్టగానే ప్రజలు పెద్ద ఎత్తున స్పందించారు. మోదీ ప్రభుత్వం రైతులకు ఎన్నో హామీలిచ్చి వాటిని అమలు చేయలేక పోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాటన్నింటిని అమలు చేస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే రైతుల రుణాలను మాఫీ చేస్తుందని, వరి కనీస మద్దతు ధరను రెండున్నర వేల రూపాయలకు పెంచుతుందని రాహుల్ ప్రకటించగానే ప్రేక్షకులు ముక్తకంఠంతో ‘రాహుల్ గాంధీకీ జై, కాంగ్రెస్ పార్టీకి జై అంటూ నినదించారు. దేశంలో 15 మంది బడా బాబులు తీసుకున్న 3,50,000 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసిన మోదీ ప్రభుత్వం దేశంలోని, చత్తీస్గఢ్లోని రైతుల రుణాలను మాఫీ చేయలేదని రాహుల్ విమర్శించినప్పుడు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. రాహుల్ గాంధీ నిజంగా రైతుల రుణాలను మాఫీ చేసినట్లయితే జీవితకాలం తమ కుటుంబం కాంగ్రెస్కే ఓటు వేస్తుందని కమర్ముర్హా గ్రామం నుంచి తోటి రైతులతోని వచ్చిన రైతు అల్కేశ్వర్ పూరి చెప్పారు. తాను తిరిగిన పలు ప్రాంతాల్లో కూడా ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. -
'హిందీ' మూడ్ 'ఎటో'?
రేపటి దేశ భవిష్యత్తును హిందీ మాట్లాడే రాష్ట్రాలే నిర్ణయించబోతున్నాయి. రాజస్తాన్ నుంచి బిహార్ వరకు విస్తరించి ఉన్న హిందీబెల్ట్ రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు సాధించిన వారికే ఢిల్లీ పీఠానికి మార్గం సుగమం అవుతుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో హిందీ మాట్లాడుతున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్తాన్లు కీలకంగా మారబోతున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో మొత్తం 65 ఎంపీ స్థానాలుండగా.. 2014లో బీజేపీయే 63 స్థానాలు కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో మళ్లీ మోదీని సీఎం చేయాలంటే ఈ మూడు చోట్ల ప్రభుత్వాలను ఏర్పాటుచేయడం బీజేపీకి అత్యంత ఆవశ్యకం. అటు కాంగ్రెస్కు కూడా ఈ ఎన్నికలు చాలా కీలకం. రాహుల్ను ప్రధానిని చేయాలనుకుంటున్న ఏఐసీసీ పెద్దల కల నెరవేరాలంటే ఈ మూడు చోట్ల కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందే. అందుకే ఏదేమైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ, కాంగ్రెస్లు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. తమ అస్త్ర, శస్త్రాలకు పదునుపెడుతున్నాయి. మిజోరంలో ఒక్క లోక్సభ స్థానమే ఉండటం.. తెలంగాణలో బీజేపీకి పెద్దగా పట్టులేకపోవడంతో మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్లపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీజేపీ తరఫున ఈ మూడు రాష్ట్రాల్లో గెలుపు బాధ్యతను ఆరెస్సెస్ భుజాన వేసుకుంది. పట్టణ నియోజకవర్గాలతోపాటు, ఎస్సీలు, ఆదివాసీలకు రిజర్వ్డ్ అయిన చోట్ల కూడా సంఘ్ పని కారణంగా బీజేపీపై వ్యతిరేకత ఉండకపోవచ్చని తెలుస్తోంది. జోగితో నష్టమెవరికి? ఛత్తీస్గఢ్లో చివరి రెండు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ల మధ్య 10 సీట్ల తేడా మాత్రమే ఉంది. 2013లో ఓట్ల తేడా కూడా 0.75% మాత్రమే. చిన్న పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడం వల్లే బీజేపీ నెగ్గిందనే విశ్లేషణలున్నాయి. వరుసగా మూడుసార్లు అధికారంలో ఉన్న బీజేపీపై వ్యతిరేకత ఉంది. అయితే ఈ వ్యతిరేకతను అందిపుచ్చుకునే క్రమంలో కాంగ్రెస్కు అజిత్జోగి రూపంలో నష్టం జరుగుతుందని చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ మాజీ సీఎంగా ఉన్న జోగి కొత్త పార్టీ ఏర్పాటుచేయడం, బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడంతో ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికరంగా ఉండబోతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నాయకత్వ లేమిని ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ ప్రచార బాధ్యతల్ని రాహుల్ గాంధీ స్వయంగా మోస్తున్నప్పటికీ.. జోగి రూపంలో ముప్పు కాంగ్రెస్కు ఎంత నష్టం చేస్తుందో చెప్పలేని స్థితి. రాజేయోగం ఉందా? బీజేపీకి ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితులున్నది రాజస్థాన్లోనే. సీఎం వసుంధరా రాజేపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ.. ఎమ్మెల్యేల్లో ఆమెకున్న పట్టు, ఆరెస్సెస్ అండదండల కారణంగా బీజేపీ అధిష్టానం.. సీఎం అభ్యర్థిని మార్చే సాహసం చేయడంలేదు. అభ్యర్థుల జాబితాలోనూ రాజే మార్క్ స్పష్టంగా కనిపించింది. అయితే.. రాజస్తాన్లో బలమైన సామాజికవర్గంగా ఉన్న రాజ్పుత్లు బీజేపీకి దూరం కావడం ఆ పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది. రాజ్పుత్ వర్గానికి చెందిన ఆనంద్పాల్ సింగ్ ఎన్కౌంటర్.. ఆ తర్వాత జస్వంత్ సింగ్ కుమారుడు మానవేంద్ర సింగ్ బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరడం వంటి ఘటనలతో రాజ్పుత్లు బీజేపీకి ఓటేయరంటూ విశ్లేషణలు వినబడుతున్నాయి. ఇది బీజేపీని ఆత్మరక్షణలోకి నెట్టింది. ఈ రాష్ట్రంలో గెలుపు ఖాయం అని నమ్ముతున్న కాంగ్రెస్.. ఇతర రాష్ట్రాల్లోలాగా ఆధిపత్య పోరు లేకుండా స్థానిక నేతల మధ్య సమన్వయంతో ముందుకెళ్తోంది. పీసీసీ చీఫ్ సచిన్ పైలెట్, మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కలిసిపని చేస్తుండటం కాంగ్రెస్కు కలిసి వస్తుందని భావిస్తున్నారు. శివరాజసం నిలిచేనా! మధ్యప్రదేశ్ అసెంబ్లీ పోరులో హోరాహోరీ పోరు నెలకొంది. సీఎం శివరాజ్సింగ్ చౌహాన్పై చెప్పుకోదగ్గ స్థాయిలోనే ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. అయితే దీన్ని పూర్తిగా తనకు అనకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ పడరాని పాట్లు పడుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య ఓట్ల తేడా 8.5%. అయితే ఈసారి ఎవరు గెలవాలన్నా 9–10% తేడా లక్ష్యంగానే ప్రచారం చేయడం, వ్యూహాలను పన్నడం ఆధారపడి ఉంటుంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కమల్నాథ్, ఎన్నికల ప్రచార వ్యూహకర్త జ్యోతిరాదిత్య సింధియా, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ మధ్య విభేదాలతో.. కార్యకర్తల్లో ఇంకా పూర్తిగా ఎన్నికల జోష్ రాలేదు. అయితే.. ఎస్సీ, ఎస్టీ చట్టానికి చేసిన సవరణలతో బీజేపీకి దళితులు, అగ్రవర్ణాలు దూరమవుతారని తాజా సర్వేలంటున్నాయి. అటు, కాంగ్రెస్ కూడా ఈ అంశాలపై స్పష్టమైన వైఖరి తీసుకోకుండా గోడమీద పిల్లిలా వ్యవహరిస్తోంది. బుందేల్ ఖండ్, మహాకౌశల్, బాఘేల్ ఖండ్ ప్రాంతాల్లో అగ్రవర్ణాల ఓట్లు బీజేపీని దెబ్బతీస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ప్రాంతంలో హిందుత్వ ఓట్లను సంపాదించుకునేందుకు రాహుల్ శివభక్తుడిగా మారారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోనూ హిందుత్వ ఛాయలు కనబడుతున్నాయి. రైతే ఎన్ని‘కల’ రాజు! మధ్యప్రదేశ్లో రైతుల సంఖ్య ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు బీజేపీని భయపెడుతున్నాయి. గతేడాది మందసౌర్లో అల్లర్లు, ఆరుగురు రైతుల మృతి, పలు వ్యవసాయరంగ సమస్యలు బీజేపీకి ఇబ్బందికరంగా మారాయి. గ్రామీణ నియోజకవర్గాల్లో రైతులతోపాటు ఇతర వర్గాల్లోనూ ప్రభుత్వంపై కాస్తంత విముఖత వ్యక్తమవుతోంది. అయితే రైతులను ప్రసన్నం చేసుకునేందుకు ఎన్నికలకు ముందే చౌహాన్ నష్టనివారణ చర్యలు చేపట్టారు. పంటలకు అధికర ధర వచ్చేలా భుగ్తానా యోజనను తీసుకొచ్చారు. ఈ పథకమే తన పార్టీకి అధికారాన్ని కట్టబెడుతుందని ఆయన విశ్వసిస్తున్నారు. ఎంపీల కష్టమే ఎక్కువ! పార్లమెంట్ సభ్యులతో పోలిస్తే దేశంలోని వివిధ అసెంబ్లీల్లోని ఎమ్మెల్యేలు ఏడాదిలో తక్కువ రోజులు పనిచేస్తున్నారని పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా చిన్న రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు మరింత తక్కువ రోజులు కష్టపడుతున్నట్లు నివేదిక వెల్లడించింది. సగటున దేశంలో ఎమ్మెల్యేలు ఏడాదికి దాదాపు 28– 46 పనిదినాలు నమోదు చేయగా, పార్లమెంటు సభ్యులు ఏటా 70 పనిదినాలు నమోదు చేస్తున్నట్లు తెలిపింది. 2011––2016 కాలంలో దేశంలోని 26 రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల చట్టసభల పనిగంటలను సంస్థ విశ్లేషించింది. ప్రజల తరఫున ఎన్నికైన సభ్యులు ప్రజా సమస్యలను చర్చించేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదని నివేదిక గణాంకాలు ఎత్తిచూపుతున్నాయి. 26 అసెంబ్లీల్లో 50 శాతం అంటే దాదాపు 13 అసెంబ్లీలు సరాసరిన ఏడాదికి కేవలం 28 రోజులే సమావేశమవుతున్నాయి. ఎమ్మెల్యేలు ఎక్కువగా బడ్జెట్ సెషన్లోనే అసెంబ్లీలకు హాజరవుతున్నారు. మిగిలిన సెషన్లను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఏడాదికి కేరళ, కర్నాటక అసెంబ్లీలు సుమారు 46 రోజుల పాటు సమావేశమవుతున్నాయి. తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర(45 రోజులు), ఒడిషా(42 రోజులు), జమ్ము అండ్ కాశ్మీర్(39 రోజులు) ఉన్నాయి. తక్కువ పనిదినాలు నమోదు చేస్తున్న అసెంబ్లీల జాబితాలో నాగాలాండ్, ఢిల్లీ, సిక్కిం తొలిస్థానాలు ఆక్రమించాయి. ఇదే సమయంలో పార్లమెంటులో లోక్సభ సభ్యులు ఏడాదికి సుమారు 70 పనిదినాలు, రాజ్యసభ సభ్యులు 69 పనిదినాలు నమోదు చేశారు. పార్లమెంటులో కూడా బడ్జెట్ సెషన్లోనే హాజరు శాతం ఎక్కువ. అసలు కంటే కొసరే ..! మధ్యప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ అక్కడి ఎమ్మెల్యేల వేతనానికి సంబంధించిన వివరాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ప్రభుత్వం జీతాలు, అలవెన్సుల రూపంలో ఈ దఫా ఎమ్మెల్యేలకు చెల్లించిన మొత్తం అక్షరాల రూ.149 కోట్లు. ఎన్నికల ప్రచారం ఊపందకున్న నేపథ్యంలో.. సమాచార హక్కు (ఆర్టీఐ) కార్యకర్త చంద్రశేఖర్ గౌడ్ ఆర్టీఐ కింద సమర్పించిన దరఖాస్తుకు అసెంబ్లీ కార్యదర్శి ఇచ్చిన సమచారం ఇది. దీని ప్రకారం మొత్తం 231 మంది శాసనసభ్యులు ఉన్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ఏప్రిల్ 2013 నుంచి సెప్టెంబర్ 2018 వరకు జీతాల కింద రూ.32 కోట్లు చెల్లించారు. అదే సమయంలో అలవెన్సుల కింద రూ.117 కోట్లను చెల్లించినట్లు పేర్కొన్నారు. ఇందులో ఎమ్మెల్యేల టీఏల కింద రూ. 34.03 కోట్లు వెచ్చించారు. ఇక్కడి ప్రజల కోసం ఎమ్మెల్యేలు ఎంత కష్టపడి పని చేశారో తెలియదు కానీ.. వారి జీతం కంటే అలవెన్సులే మూడు రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. 2017–18 ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్ర తలసరి అదాయం రూ.79,907 కాగా.. శాసన సభ్యుల ఏడాది సగటు ఆదాయం రూ.14.48 లక్షలుగా ఉంది. -
ఎన్నికల వేళ ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల అలజడి
-
ముగిసిన పోలింగ్; ఇద్దరు మావోయిస్టుల మృతి
రాయ్పూర్ : కట్టుదిట్టమైన భద్రత నడుమ ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిదశ పోలింగ్ ముగిసింది. ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చిన మావోయిస్టులు కొన్ని రోజులుగా హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నా ఈసారి 70 శాతం పోలింగ్ నమోదవడం విశేషం. సురక్షిత ఓటింగ్ కోసం భద్రతా దళాలను భారీగా రంగంలోకి దించటంతో పోలింగ్ శాతం పెరిగిందని ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఇక తొంభై నియోజక వర్గాలున్న ఛత్తీస్గడ్ రాష్ట్రంలో రాజ్నంద్గాం, కొండగాం, కాంకేర్, బస్తర్, నారాయణ్పూర్, సుక్మా, బీజాపూర్, దంతేవాడ జిల్లాల పరిధిలోని 18 నియోజకవర్గాల్లో ఈరోజు తొలిదశ పోలింగ్ జరిగింది. వీటిలో మావోయిస్టుల ప్రభావం ఉన్న 10 నియోజకవర్గాల్లో పోలింగ్ మధ్యాహ్నం 3 గంటలకే ముగియగా, మిగతా ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. మిగిలిన 72 నియోజక వర్గాల్లో ఈనెల 20(నవంబరు)న పోలింగ్ జరగనుండగా.. ఫలితాలు డిసెంబరు 11న వెలువడనున్నాయి. కాగా పోలింగ్ సమయంలో మావోయిస్టులు హింసాత్మక ఘటనలకు పాల్పడే అవకాశం ఉన్నందున ఎన్నికల సంఘం భద్రతను కట్టుదిట్టం చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో భద్రతను రెట్టింపు చేశారు. పోలింగ్ ప్రశాంతంగా సాగేందుకు 500 కంపెనీల బలగాలతో గస్తీ ఏర్పాటు చేసిన అధికారులు.. 50 డ్రోన్లు, 17 హెలికాఫర్టు, వెయ్యి శాటిలైట్ ట్రాకర్స్తో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టుల మృతి తోంక్ పాల్ చింతల్నార్ నుండి ఎలక్షన్ డ్యూటీ ముగించుకుని వస్తున్న భద్రతాదళాల మీద మావోయిస్టుల కాల్పులకు దిగారు. దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. వీరి మృతదేహాలను భద్రత దళాలు స్వాధీన పరుచుకున్నాయి. కాగా ఈ సమయంలో భద్రతా దళాలతో పాటు, డ్యూటీ ముగించుకుని వస్తున్న ఎలక్షన్ సిబ్బంది కూడా ఉన్నట్లు తెలుస్తోంది. -
ఛత్తీస్గఢ్లో తొలిదశ పోలింగ్
-
ఛత్తీస్గఢ్లో ప్రారంభమైన తొలిదశ ఎన్నికల పోలింగ్
-
ఎన్నికల వేళ కాంగ్రెస్కు భారీ షాక్
రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లో ప్రతిపక్ష కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గనారామ్ సాహూ కాంగ్రెస్కు రాజీనామా చేసి బీజేపీ గూటికి చేరారు. తొలి దశ ఎన్నికల ముందు సాహూ పార్టీని వీడడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ ఎంతో కీలకంగా భావిస్తున్న ఈ ఎన్నికల ముందు పార్టీ ముఖ్య నేత రాజీనామా చేయడంతో నేతలు ఆందోళన చెందుతున్నారు. రాజీనామాకు సరైన కారణమేమీ తెలపకపోయినా.. ఆయన కోరుకున్న దుర్గ్ సిటీ సీటు విషయంలో పార్టీ ఆయనకు మద్దతుగా నిలవలేదన్న నిరాశతో రాజీనామా చేశారని పార్టీ నేతలు భావిస్తున్నారు. కాగా తుది దశ పోలింగ్లో భాగంగా సోమవారం 18 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. వాటిలో కాంగ్రెస్ ప్రాతినిథ్యం వహిస్తున్న స్థానాలు 12. గత పదిహేళ్లుగా ప్రతిపక్షానికే పరిమితమైన కాంగ్రెస్ ఈసారి ఎలానైనా అధికారం చేజికిచ్చుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తుండగా.. నాలుగోసారి కూడా తమదే విజయమని సీఎం రమణ్సింగ్ ధీమాతో ఉన్నారు. -
ఛత్తీస్గఢ్లో ప్రారంభమైన తొలిదశ ఎన్నికల పోలింగ్
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో తొలిదశ ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. దక్షిణ ఛత్తీస్గఢ్లోని రాజ్నంద్గాం, కొండగాం, కాంకేర్, బస్తర్, నారాయణ్పూర్, సుక్మా, బీజాపూర్, దంతేవాడ జిల్లాల పరిధిలోని 18 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగుతుంది. వాటిలో మావోయిస్టుల ప్రభావం ఉన్న 10 నియోజకవర్గాల్లో పోలింగ్ వేళల్లో మార్పులు చేశారు. అక్కడ మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే పోలింగ్ జరగనుంది. మిగత ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చిన మావోయిస్టులు కొన్ని రోజులుగా హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నా నేపథ్యంలో ఎన్నికల సంఘం భద్రతను కట్టుదిట్టం చేసింది. అధికారులు లక్ష మంది భద్రత సిబ్బందితో పోలింగ్ స్టేషన్ల వద్ద భద్రత ఏర్పాటు చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో భద్రతను రెట్టింపు చేశారు. పోలింగ్ ప్రశాతంగా సాగేందుకు 500 కంపెనీల బలగాలతో గస్తీ ఏర్పాటు చేసిన అధికారులు.. 50 డ్రోన్లు, 17 హెలికాఫర్టు, వెయ్యి శాటిలైట్ ట్రాకర్స్తో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. -
‘రిగ్గింగ్ కోసమే భారీ బలగాలు’
సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్గఢ్లో సోమవారం 18 నియోజకవర్గాల్లో జరగనున్న మొదటి దఫా ఎన్నికల్లో పోలీస్ సిబ్బంది ద్వారా రిగ్గింగ్కు పాల్పడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, తెలంగాణ రాష్ట్ర కమిటీ సంయుక్తంగా ఆరోపించాయి. భారీ ఎత్తున పోలీస్ బలగాలను, హెలికాప్టర్లను ఏర్పాటుచేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని ఈ రెండు కమిటీల కార్యదర్శులు వికల్ప్, జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. పోలీసులతో జర్నలిస్టులు, ఎన్నికల సిబ్బంది కలిసి రావద్దని విజ్ఞప్తి చేశారు. ఎన్నికలను బహిష్కరించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, బలవంతంగా ఓట్లు వేయించడం, రిగ్గింగ్కు పాల్పడే విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దీనికి ప్రభుత్వాలు, పోలీసులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని హెచ్చరించారు. -
క్యాస్టే... బూస్ట్
భారత రాజకీయాలు, ఎన్నికల్లో కులాల పాత్రను వేరుగా చూడలేం. ఈ ఒక్క రాష్ట్రానికి అది మినహాయింపు అని చెప్పలేం. చిన్న కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి పెద్దరా ష్ట్రాలైన మధ్యప్రదేశ్, యూపీ వంటి రాష్ట్రాలవరకు ప్రతిచోటా కుల సమీకరణాలు అత్యంత కీలకంగా మారాయి. అందుకే పార్టీలన్నీ సోషల్ ఇంజనీరింగ్పైనే దృష్టి పెడుతున్నాయి. సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్డీఎస్) జరిపిన అధ్యయనంలో మధ్యప్రదేశ్లో పోలయ్యే ఓట్లలో 65% కులం ఆధారంగా పడేవేనని వెల్లడైంది. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇంత ఎక్కువ శాతంలో కులం ఓట్లు పడవు. ఇక్కడ చాలా కులాలు ఉన్నప్పటికీ అగ్రవర్ణాలు, ఓబీసీలదే ఆధిపత్యం. రాష్ట్ర జనాభాలో 55% ఉన్న ఈ వర్గం (రాజ్పుత్, యాదవ, బ్రాహ్మణ వర్గాలు) బీజేపీకి సాంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఇందులో అగ్రవర్ణాలు 22%. ఎస్సీ, ఎస్టీల జనాభా 37%. వీరిలో ఎస్సీలు కాంగ్రెస్కు అండగా ఉండగా.. ఎస్టీల్లో మెజారిటీ బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఎస్సీ, ఎస్టీల జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ.. మిగిలిన కులాలతో పోలిస్తే సరైన చైతన్యం లేకపోవడంతో రాజకీయంగా వీరు ప్రభావం చూపలేకపోతున్నారు. దీంతో మధ్యప్రదేశ్లో అగ్రవర్ణాలు, ఓబిసీలదే పైచేయిగా ఉంది. ప్రధాన పార్టీలు కూడా ఈ రెండు వర్గాలపైనే ప్రధానంగా దృష్టి సారించాయి. ప్రస్తుత సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, మాజీ సీఎం ఉమాభారతి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాకేశ్ సింగ్లు ఓబీసీలే కావడం రాష్ట్రంలో వారి పరపతి ఏ స్థాయిలో ఉందో చెబుతోంది. కుల సమీకరణాలు మారుతున్నాయ్ 2018లో ఈ కుల సమీకరణాల్లో మార్పు వచ్చింది. ఓబీసీలకు రాజకీయంగా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండటంతో అగ్రవర్ణాలు బీజేపీ పట్ల అసంతృప్తిగా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ చట్టానికి సవరణలు చేయడంపైనా.. బీజేపీ వైఖరి అగ్రవర్ణాలకు రుచించలేదు. ఈ విషయంలో కాంగ్రెస్ తమకు మద్దతుగా ముందుకు రాకపోవడంతో వారు ఆ పార్టీని కూడా తప్పుపడుతున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మధ్యప్రదేశ్ జనాభా 7 కోట్లు కాగా.. ఇందులో 52% అగ్రవర్ణాలు, ఓబీసీలున్నారు. ఎస్సీలు 16%, ఎస్టీలు 21% ఉన్నారు. మొత్తంగా రాష్ట్ర జనాభాలో 91% హిందువులుండగా.. ముస్లింలు 7%, ఇతర మైనారిటీలు 2%గా ఉన్నారు. ఓబీసీలదే మెజారిటీ సంఖ్యాపరంగా చూస్తే ఈ ఛత్తీస్గఢ్లో 42% ఉన్న ఓబీసీలదే (కుర్మీలు, సాహులు) మెజారిటీ. బ్రాహ్మణులు, యాదవులు ఉన్నప్పటికీ రాజకీయాలను ప్రభావితం చేసే సంఖ్యలో లేరు. అందుకే కాంగ్రెస్, బీజేపీలు ఓబీసీలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 2.56 కోట్లు కాగా.. వీరిలో ఎస్సీలు 12.82%, ఎస్టీలు 30.62%. మొత్తం జనాభాలో 93.25% హిందువులు. ఓబీసీల్లో ఎక్కువ మంది కాంగ్రెస్కు మద్దతుగా నిలిచారు. అయితే, అజిత్జోగి హయాంలో కాంగ్రెస్ తమను చిన్నచూపు చూసిందన్న కోపంతో బీజేపీ వైపు మళ్లారు. అజిత్జోగి, రమణ్ సింగ్, భూపేష్ భగేల్, తామ్రధ్వాజ్ సాహులు రాష్ట్రంలో పేరొందిన ఓబీసీ నేతలు. తల్లీకొడుకుల సవాల్! ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టినీ ఆకర్శిస్తున్న స్థానం దంతేవాడ నియోజకవర్గం. ఇందుకు కారణం.. తల్లీకొడుకులు వేర్వేరు పార్టీలనుంచి బరిలో ఉండటమే. నక్సలైట్ల చేతిలో చనిపోయిన సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మ భార్య దేవతికి (సిట్టింగ్)కి ఈసారి కూడా ఆమెకే కాంగ్రెస్ టికెట్ కేటాయించింది. ఈ స్థానం నుంచి ఈసారి మహేంద్ర కర్మ కుమారుడు ఛవీంద్ర కర్మ ఎస్పీ టికెట్పై బరిలో దిగారు. ఇన్నాళ్లూ తల్లికి రాజకీయాల్లో చేదోడువాదోడుగా ఉన్న చవీంద్ర బరిలో ఉండటంతో పోటీ రసవత్తరంగా మారింది. పోటీ చేయొద్దంటూ సీనియర్ కాంగ్రెస్ నేతలు.. ఛవీంద్రను కలిసి బతిమాలినప్పటికీ ఫలితం కనిపించలేదు. ‘అమ్మకు నేను వ్యతిరేకం కాదు. కానీ కాంగ్రెస్ నేతలు ఇచ్చిన బూటకపు హామీలపైనే నా పోరాటం’ అని ఛవీంద్ర పేర్కొన్నారు. -
'ఎర్ర'కోటలో హోరాహోరీ!
వేలిపై సిరాచుక్క కనబడితే ఖబడ్దార్ అని మావోయిస్టులన హెచ్చరికలు ఓవైపు.. ఓటే వజ్రాయుధం, హక్కు అంటూ ఎన్నికల సంఘం, ఎన్జీవోల చైతన్య కార్యక్రమాలు మరోవైపు. పోలీసుల బూట్ల చప్పుడు నడుమ బస్తర్లో నేడు తొలిదశ పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రాబల్యమున్న, అత్యంత సున్నితమైన ప్రాంతాలు కావడంతో ఈ 18 నియోజకవర్గాల్లో పోలింగ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందులో 11 ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు, ఒకటి ఎస్సీ నియోజవకర్గం. కాగా, ‘ఎర్ర’కోటలో పట్టు బిగించేందుకు కాంగ్రెస్, బీజేపీలు ప్రత్యేక వ్యూహాలతో ప్రచారం చేశాయి. గత ఎన్నికల్లో 12 చోట్ల కాంగ్రెస్ గెలవగా.. ఆరింటిని బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. ఈసారి సంఖ్యను పెంచుకోవాలని కాంగ్రెస్.. పూర్వవైభవాన్ని పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. సీఎం రమణ్సింగ్, వాజ్పేయి అన్నకూతురు కరుణ శుక్లా సహా 190 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. నాడు బీజేపీ కంచుకోట 2013 ఎన్నికలకు ముందు ఈ ప్రాంతంలో బీజేపీ ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. 2008 ఎన్నికల్లో బీజేపీ 15 స్థానాల్లో గెలుపొందింది. 2003 ఎన్నికల నాటికి ఈ ప్రాంతంలో 15 స్థానాలు ఉండేవి. అప్పుడు కూడా బీజేపీ 10 స్థానాల్లో నెగ్గి బస్తర్పై తన పట్టుచూపించింది. అయితే గత ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్పై ప్రజలు సానుభూతి చూపించారు. ఇందుకు కారణం.. మావోయిస్టులకు వ్యతిరేకంగా సల్వాజుడుం బృందాన్ని సిద్ధం చేసిన మహేంద్ర కర్మతోపాటు కాంగ్రెస్ నేతలను మావోయిస్టులు హతమార్చడమే. అయితే ఈసారికూడా అదే సానుభూతితో మరిన్ని స్థానాల్లో పాగా వేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. హెచ్చరికలు బేఖాతరు ఎన్నికల్లో పాల్గొనవద్దంటూ మావోయిస్టులు పోస్టర్లు వేయడం.. అయినా ప్రజలు యథావిధిగా ఎన్నికల్లో పాల్గొనడం జరుగుతూనే ఉంది. ఈ ప్రాంతంలో ఏటేటా పోలింగ్ శాతం కూడా పెరుగుతూ వస్తోంది. 2003లో 65.68% ఓటింగ్ నమోదైతే, 2008లో 67.14% నమోదైంది. 2013లో రికార్డు స్థాయిలో 75.93% ఓటింగ్ నమోదైంది. త్రిముఖపోటీ ఉంటుందా? నిన్నటివరకు బస్తర్ ప్రాంతంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోరు ప్రధానంగా ఉంది. సీపీఐ, బీఎస్పీ వంటి ఇతర జాతీయ పార్టీలు, చిన్నా చితకా స్థానిక పార్టీలు ఇక్కడ ప్రభావాన్ని చూపించలేకపోయాయి. అయితే.. ఈసారి అజిత్ జోగి పార్టీ జనతా కాంగ్రెస్ ఛత్తీస్గఢ్ (జేసీసీ), బీఎస్పీ, సీపీఐల కూటమి ప్రభావం ఉంటుదనిపిస్తోంది. అయితే.. ఆదివాసీల ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లో అజిత్ జోగికి మంచి పట్టు ఉన్నప్పటికీ.. ఎనిమిది స్థానాలను బీఎస్పీకి ఇవ్వడం తప్పిదమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. డోంగర్గఢ్, డోంగర్గావ్, అనంత్గఢ్, కంకేర్, కేశ్కల్, కోండాగావ్, దంతేవాడ, కోంటా నియోజకవర్గాల్లో బీఎస్పీ పోటీకి దిగుతోంది. ఈ స్థానాల్లో గత ఎన్నికల్లో బీఎస్పీకి కేవలం 2% ఓట్లు మాత్రమే వచ్చాయి. అంతేకాకుండా ముఖ్యమంత్రి రమణ్సింగ్పై పోటీకి దిగుతానంటూ మొదట్లో ప్రకటించిన అజిత్ జోగి ఆ తర్వాత వెనుకడుగు వేయడంతో బీజేపీ, కాంగ్రెస్లను జేసీసీ ఢీకొట్టలేదనే అభిప్రాయం ప్రజల్లో పడింది. అర్బన్ మావోయిస్ట్ గీ జీఎస్టీ కాంగ్రెస్ పార్టీ అర్బన్ మావోయిస్టులకు మద్దతుగా నిలుస్తూ నిరుపేద ఆదివాసీల అభివృద్ధికి అడ్డంకిగా మారుతోందంటూ ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు చేశారు. అయితే జీఎస్టీ, పెద్దనోట్ల ద్వారా వ్యాపారులు, సామాన్యులకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయంటూ రాహుల్ ప్రతివిమర్శలు చేశారు. సీఎం రమణ్సింగ్, మంత్రులు మహేష్ గాగ్డా, కేరార్ కశ్యప్లు బరిలో ఉండడంతో ఆసక్తి నెలకొంది. వీరంతా గత మూడుసార్లుగా ఎన్నికల్లో నెగ్గుతూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం పాత, కొత్త నేతల కలయికతో ముందుకెళ్తోంది. మూడుచోట్ల సిట్టింగులకు కాకుండా కొత్తవారికి చాన్స్ ఇచ్చింది. ముఖ్యమంత్రి రమణ్ సింగ్ బరిలో ఉన్న రాజ్నంద్గావ్లో.. కాంగ్రెస్ తరఫున మాజీ ప్రధాని వాజపేయి అన్న కూతురు కరుణ శుక్లాను బరిలోకి దిగటంతో పోటీ రసవత్తరంగా మారింది. నక్సల్స్ సమస్యని అధిగమిస్తూనే రమణ్సింగ్ రాష్టాన్ని అభివృద్ధిచేస్తున్నారన్న మంచిపేరైతే సంపాదించారు. దంతేవాడ ఈ పేరు వింటేనే ఎన్కౌంటర్లు, తుపాకుల చప్పుళ్లే గుర్తొస్తాయి. బిక్కుబిక్కుమంటూ కాలం గడపటం ఇక్కడి ప్రజల నిత్యకృత్యమయిపోయింది. గత ఎన్నికల్లో ఈ దంతేవాడ నియోజకవర్గంలోనే 10 వేలమంది నోటాకు ఓటేశారు. ఇదే.. రాజకీయాలపై అక్కడి ప్రజలకున్న విరక్తికి నిదర్శనం. ఇక్కడినుంచి.. కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే, దివంగత కాంగ్రెస్ నేత మహేంద్ర కర్మ భార్య దేవతి కర్మనే మళ్లీ బరిలోకి దింపింది. గత ఎన్నికల్లో ఈమె బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు. కంకేర్ సహజ వనరులు అపారంగా ఉన్న ఈ ప్రాంతంలోనూ నక్సల్స్ సమస్య తీవ్రంగా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ ధ్రువ్ను కాదని.. ఆదివాసీల కోసం పనిచేస్తున్న మాజీ ఐఏఎస్ అధికారి శిశుపాల్ సోరిని బరిలోకి దింపింది. బస్తర్ ఓటు వేస్తే వేళ్లు నరికేస్తామంటూ మావోయిస్టుల హెచ్చరికల మధ్య బస్తర్ నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణ కత్తి మీద సామే. ఆదివాసీలు అత్యధికంగా ఉన్న బస్తర్లో వారి ఆరోగ్యమే ఎన్నికల్లో ప్రధాన ప్రచార అస్త్రంగా మారింది. సర్వేలు ఏం చెబుతున్నాయ్ ! ఛత్తీస్గఢ్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరి పోటీ ఉన్నప్పటికీ, అజిత్జోగి పార్టీ ప్రతిపక్ష ఓట్లను చీల్చడంతో కమలనాథులకు లబ్ధి చేకూరుతుందని ఇండియాటుడే సర్వే అంచనా వేసింది. అయితే బస్తర్ ప్రాంతంలో మాత్రం కాంగ్రెస్ పై చేయి సాధిస్తుందని ఆ సర్వేలో వెల్లడైంది. ఏబీపీ న్యూస్, సీఎస్డీఎస్ సర్వేలో నాలుగోసారి బీజేపీదే అధికారమని తేలింది. కాంగ్రెస్ నామమాత్రపు పోటీ కూడా ఇవ్వదని, మొత్తం 90 స్థానాల్లో బీజేపీ 56 నియోజకవర్గాలను గెలుచుకుంటుందని ఆ సర్వే వెల్లడించింది. ఇండియా టీవీ, సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్స్లోనూ.. 50 సీట్లతో బీజేపీయే నెగ్గుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది. లక్ష మంది పహారా! లక్షమంది భద్రతా బలగాల బందోబస్తు నడుమ నేడు ఛత్తీస్గఢ్ తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి. మావోయిస్టుల హెచ్చరికలు, 15 రోజుల్లోనే మూడు వేర్వేరు ఘటనల్లో 13 మందిని పొట్టనపెట్టుకున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 18 నియోజకవర్గాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటుచేశారు. కాగా, గత పదిరోజుల్లో బస్తర్ ప్రాంతంతోపాటు రాజ్నంద్గావ్ జిల్లాలో 300కు పైగా ఐఈడీ బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల ప్రతి చర్యలకు సరైన సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని మావోయిస్టు ఆపరేషన్స్ స్పెషల్ డీజీ డీఎం అవస్థి వెల్లడించారు. పారామిలటరీ, సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ బలగాలతోపాటు 65వేల మంది వివిధ రాష్ట్రాల పోలీసులు కూడా ఈ బందోబస్తులో ఉన్నారు. బలగాలతోపాటు వైమానిక దళం, బీఎస్ఎఫ్ హెలికాప్టర్లతో నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నామని అవస్థీ తెలిపారు. ‘ఎన్నికల సిబ్బందిని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు తీసుకెళ్లి.. ఎన్నిక పూర్తయిన తర్వాత క్షేమంగా గమ్యస్థానం చేర్చడమే అసలైన సవాల్. ఈ దిశగా ఓ వ్యూహంతో పనిచేస్తున్నాం. భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు మందుపాతరలు, ఐఈడీలు పెట్టారు. దీంతో చాలా జాగ్రత్తగా ముందుకెళ్తున్నాం’ అని ఆయన వెల్లడించారు. కాగా, అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో ఉదయం ఏడుగంటలనుంచి సాయంత్రం 3 వరకు మాత్రమే పోలింగ్ జరపనున్నారు. 2013 ఎన్నికల్లో బీజేపీ గెలిచిన 6 స్థానాలు బీజార్, జగదల్పూర్, నారాయణ్పూర్, అనంత్గఢ్, డోగార్గావ్, రాజ్నంద్గావ్ -
ఛత్తీస్గఢ్లో అమిత్షా పర్యటన
-
ఛత్తీస్గఢ్: తొలిదశ ఎన్నికల పోలింగ్కు రంగం సిద్ధం
-
స్టాంపు పేపర్పై మేనిఫెస్టో
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జనతా కాంగ్రెస్ ఛత్తీస్గఢ్ (జేసీసీ) పార్టీ అధినేత అజిత్ జోగీ ఎన్నికల మేనిఫెస్టోను వినూత్నరీతిలో తెచ్చారు. రూ.100 స్టాంపు పేపర్పై పార్టీ హామీలను ముద్రించారు. ఇది తన ప్రమాణ పత్రమనీ, గెలిస్తే ఈ హామీలన్నీ నెరవేరుస్తాననీ, ఓడితే జైలుకైనా వెళ్తానని జోగీ చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ల మేనిఫెస్టోలకు చట్టబద్ధత లేదనీ, ఆ పార్టీల మేనిఫెస్టోలు చిత్తు కాగితాలన్నారు. బాండు పేపర్పై మొత్తం 14 హామీలను జోగీ ముద్రించారు. రాష్ట్రంలో జన్మించే ప్రతీ ఆడబిడ్డ పేరిట లక్ష రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయడం, ఇళ్లు, స్థలాల అసలైన హక్కుదారులకు పట్టాలు ఇవ్వడం, జీఎస్టీతోపాటు ఇంధనంపై పన్నులనూ సగానికి తగ్గించడం, ఒక్కొక్కరికి రూ.7 లక్షల రూపాయల విలువైన ఆరోగ్య బీమా, రిజర్వేషన్లను ప్రభుత్వ రంగంలో వంద శాతానికి, ప్రయివేటు రంగంలో 90 శాతానికి పెంపు తదితర హామీలు వాటిలో ఉన్నాయి. -
రైతు చుట్టూ.. మేనిఫెస్టో
హోరాహోరీగా సాగుతున్న ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మేనిఫెస్టోలు కూడా హాట్హాట్గానే ఉన్నాయి. ‘జన్ ఘోషణ్ పత్ర’ పేరుతో కాంగ్రెస్ (శుక్రవారం రాహుల్ విడుదల చేశారు), ‘సంకల్ప్ పత్ర్’ పేరుతో శనివారం బీజేపీ చీఫ్ అమిత్ షా తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇరు పార్టీలు రైతులు, మహిళలు, విద్యారంగం, యువత తదితర ముఖ్యమైన అంశాల్లో రాష్ట్రం రూపురేఖలు మార్చేస్తామంటూ హామీలు గుప్పించాయి. అయితే వీటికి అదనంగా బీజేపీ మావోయిస్టుల బెడదను తప్పిస్తామని భరోసా ఇచ్చింది. మావోలతో చర్చలు జరుపుతామని, మావోయిస్టు బాధిత కుటుంబాలను ఆదుకుంటామని కాంగ్రెస్ పేర్కొంది. పేద కుటుంబాలకు కిలో రూపాయి చొప్పున ప్రతినెలా 35 కిలోల బియ్యం ఇస్తామని ప్రకటించింది. వర్గాల వారిగా రెండు పార్టీల మేనిఫెస్టోలోని అంశాలను పరిశీలిస్తే.. రైతులు: కాంగ్రెస్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయిన పది రోజుల్లోగా రైతుల అన్ని రకాల రుణాలు మాఫీ. స్వామినాథన్ సిఫారసులకు అనుగుణంగా కనీస మద్దతు ధర నిర్ణయం. 60 ఏళ్లు దాటిన రైతులకు పింఛను. బీజేపీ: వచ్చే ఐదేళ్లలో రైతులకు కొత్తగా 2 లక్షల పంపుసెట్ కనెక్షన్లు. 60 ఏళ్లు దాటిన భూమిలేని రైతులకు నెలకు వెయ్యి రూపాయలు పింఛను. పప్పులు, నూనెగింజలకు కనీస మద్దతు ధర. అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను 1.5 శాతం పెంచడం. సేంద్రియ సాగుకు ప్రోత్సాహం. రాష్ట్రంలో 50% భూమిని సాగులోకి తెచ్చేలా ఆనకట్టల నిర్మాణం. మహిళలు: కాంగ్రెస్: మహిళల భద్రతకు సంబంధించిన చట్టాల్ని కఠినంగా అమలు పరచడం. ప్రత్యేకంగా మహిళా పోలీసు స్టేషన్లు నెలకొల్పడం. ప్రతి పోలీసు స్టేషన్లో మహిళా సహాయ కేంద్రాలు ఏర్పాటు. రాత్రివేళల్లో ఉద్యోగాలు చేసే మహిళలకు ప్రత్యేక భత్యం. బీజేపీ: మహిళలు సొంత వ్యాపారాలు చేపట్టడం కోసం 2 లక్షల వరకు వడ్డీలేని రుణాలు. యువత: కాంగ్రెస్: యువతకు అప్రెంటీస్షిప్ కార్యక్రమాలు, ఉపాధి అవకాశాలు .రాజీవ్ మిత్ర యోజన కింద రాష్ట్రంలో పది లక్షల మంది నిరుద్యోగులకు నెలవారీ భృతి . బీజేపీ: కౌశల్ ఉన్నాయన్ యోజన కింద నిరుద్యోగులకు భృతి. విద్యార్థులు: కాంగ్రెస్: పాఠశాల విద్యార్థుల్లో పోషకాహార లోపం, రక్తహీనతల నివారణపై ప్రత్యేక శ్రద్ధ. విద్యా ప్రమాణాల మెరుగుదలకు చర్యలు. బీజేపీ: 12వ తరగతి వరకు పిల్లలకు యూనిఫాం, పుస్తకాలు ఉచితంగా పంపిణీ.ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు స్కాలర్షిప్లు.8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉచితంగా స్కూటీలు. ఇతర అంశాల విషయానికి వస్తే మావోయిస్టు దాడుల్లో చనిపోయిన పోలీసుల కుటుంబాలకు ఇచ్చే పింఛన్లు పెంచుతామని కాంగ్రెస్ పేర్కొంది. ఛత్తీస్గఢ్లో ఫిల్మ్సిటీ నిర్మాణం, జర్నలిస్టులకు సంక్షేమం కోసం బోర్డు ఏర్పాటు, ప్రజలకు 24 గంటలు ఉచిత విద్యుత్, తాగునీరు, పింఛనర్లకు వైద్యం కోసం వెయ్యి రూపాయల భత్యం వంటివి బీజేపీ మేనిఫెస్టోలో అదనపు హామీలు. విద్యుత్ చార్జీల తగ్గింపు, పేదలకు ఇళ్లు,మైనారిటీకు సంక్షేమ పథకాలు వంటివి రెండు పార్టీల మ్యానిఫెస్టోల్లోనూ ఉన్నాయి. -
‘రాహుల్ ఒక ఎంటర్టైనర్ మాత్రమే’
ఛత్తీస్గఢ్ : ఛత్తీస్గఢ్ ప్రజలు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని సీరియస్గా తీసుకోవడం లేదని, అతన్ని ఒక ఎంటర్టైనర్గా మాత్రమే చూస్తున్నారని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్సింగ్ అన్నారు. రాహుల్కు ఛత్తీస్గఢ్ గురించి ఏమి తెలియదని, అతని ర్యాలీల వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టమే కాని ఉపయోగం లేదన్నారు. రాహుల్ ర్యాలీలతో ఒక్క ఓటు కూడా పడదని విమర్శించారు. మొదటి విడత ఎన్నికలు దగ్గర పడడంతో ఛత్తీస్గఢ్లో ఎన్నికల ప్రచారాలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్ పాలించేటప్పుడే కార్పోరేట్లకు అనుకూలంగా ఉండేదని రమణ్ సింగ్ అన్నారు. కాంగ్రెస్ హయాంలో రాష్టాం అభివృద్ధిలో తిరోగమనంలో ఉంటే, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్దిలో దూసుకుపోతోందన్నారు. బీఎస్పీ(బహుజన సమాజ్ పార్టీ), జనతా కాంగ్రెస్ పార్టీలు స్వార్ధ ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకున్నాయని, ఇలాంటి పార్టీలు ఎన్ని కలిసినా బీజేపీని ఏమీ చేయలేవని పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలతో ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ప్రభావాన్ని చాలా వరకు తగ్గించామని రమణ్సింగ్ అన్నారు. త్వరలోనే మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తామని తెలిపారు. 2019 లోక్సభ ఎన్నికలకు సెమీఫైనల్గా భావిస్నున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలను రాహుల్ గాంధీ సీరియస్గా తీసుకొని ప్రచారంలో వేగాన్ని పెంచారు. కేంద్రంలో, బీజేపీ పాలిత రాష్ట్రలలో కార్పోరేటు అనుకూల ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని శుక్రవారం రాహుల్ గాంధీ మండిపడ్డారు. గిరిజన రాష్ట్రమైన ఛత్తీస్గఢ్లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్12 న నక్సల్ ప్రభావం ఉన్న 18 స్థానాలకు ఓటింగ్ జరగనుండగా, మిగిలిన 72 స్థానాలకు నవంబర్ 20 న ఓటింగ్ జరగనుంది. సోమవారం జరిగే ఎన్నికల్లో ముఖ్యమంత్రి నియోజకవర్గమైన రాజ్నాడ్గాన్లో కూడా ఓటింగ్ జరగనుంది. -
జై వాజ్పేయి!
రాజకీయంగా ఇద్దరూ హేమాహేమీలే. ఒకరిది సుదీర్ఘ రాజకీయానుభవమైతే.. మరొకరిది మాజీ ప్రధాని కుటుంబం. వీరిద్దరూ ఒకప్పుడు ఒకే పార్టీలో ఉన్నా.. ఇప్పుడు మాత్రం ఒకరిపై ఒకరు పోటీపడుతున్నారు. ఒకరు వాజ్పేయి శిష్యుడు ఛత్తీస్గఢ్ సీఎం రమణ్ సింగ్ కాగా.. మరొకరు వాజ్పేయి అన్న కూతురు కరుణ శుక్లా. వీరిద్దరూ ఛత్తీస్గఢ్లోని రాజ్నందన్గావ్ నుంచి బరిలో ఉన్నారు. అయితే ఇద్దరికీ వాజ్పేయితో ఉన్న ఆత్మీయత కారణంగా.. ఆయన వారసత్వం తమదంటే తమదని ప్రచారం చేసుకుంటున్నారు. రాజ్నందన్గావ్ ప్రచారంలో వాజ్పేయి పేరే బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రచారాస్త్రంగా మారింది. తన గురువు, తమ పార్టీ నేత వాజ్పేయి అని సీఎం రమణ్సింగ్ ప్రచారం చేసుకుంటుంటే.. కాంగ్రెస్ అభ్యర్థి, వాజ్పేయి అన్నకూతురు కరుణ శుక్లా కూడా వాజ్పేయినే తమ ప్రచారాస్త్రంగా మార్చుకున్నారు. తనే వాజ్పేయికి అసలైన వారసురాలినంటున్నారు. మాజీ ప్రధాని పేరును వినియోగించుకునే హక్కు బీజేపీకి లేదని ఆమె విమర్శిస్తున్నారు. వాజ్పేయి ఆదర్శాలను తూచ తప్పకుండా పాటిస్తానని.. మహనీయుడి ఆదర్శాలను బీజేపీ గాలికొదిలేసిందని మండిపడుతున్నారు. ‘బీజేపీ భావజాలం, మార్గం అన్నీ మారిపోయాయి. ఇది ఎంతమాత్రం వాజ్పేయి, అడ్వాణీలు నడిపిన పార్టీ కాదు’ అని శుక్లా తన ప్రసంగాల్లో విమర్శిస్తున్నారు. వాజ్పేయి బోధనలు తన రక్తంలో ఉన్నాయంటున్నారు. తనతోపాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా గెలిస్తే నీతివంతమైన పాలన అందిస్తానని హామీ ఇస్తున్నారు. దాదాపు మూడు దశాబ్దాలు బీజేపీలో ఉన్న కరుణ 2013లో పార్టీని వీడారు. 2014లో ఆమె కాంగ్రెస్లో చేరారు. దీంతో రమణ్పై కరుణను కాంగ్రెస్ బరిలో దించింది. రాజ్నందన్గావ్లో రమణ్ సింగ్, కరుణ శుక్లాలు ఎదురెదురు ఇళ్లలో ఉండటం విశేషం. హమారా రమణ్! అయితే నియోజకవర్గంలో మెజారిటీ ప్రజలు రమణ్ సింగ్పై సానుకూలంగానే ఉన్నారు. రాష్ట్రాన్ని ఈయన అభివృద్ది చేశారని మధ్యతరగతి విశ్వసిస్తోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే అది రమణ్ సింగ్ వల్లేనని స్థానికులంటున్నారు. అయితే జీఎస్టీ, నోట్ల రద్దుతో స్థానిక వ్యాపారుల్లో బీజేపీపై వ్యతిరేకత కనిపిస్తోంది. -
అచ్ఛే దిన్ రానే రావంటూ ఆకట్టుకుంటున్న ‘మోదీ’
బచేలీ (దంతేవాడ): ఈయన పేరు అభినందన్ పాఠక్. అచ్చం ప్రధానమంత్రి నరేంద్ర మోదీలాగానే కనిపిస్తూ.. ఆయనను అనుకరిస్తూ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఛత్తీస్గడ్లోని నక్సల్ ప్రభావిత బస్తర్ సహా జగదల్పూర్, దంతేవాడ, కొండగాన్ ప్రాంతాల్లో కాంగ్రెస్ ప్రచారకర్తగా దూసుకుపోతున్నారు. హావభావాల్లోనూ, ఆహార్యంలోనూ.. మోదీని తలపిస్తూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తున్నారు. ఆయన ఎన్నికల ప్రసంగం కూడా అచ్చం మోదీ తరహాలోనే ‘మిత్రోం’ అని సంబోధిస్తూ మొదలవుతుంది. ప్రధాని వాయిస్ను మిమిక్రీ చేస్తూ ఆకట్టుకుంటున్న అభినవ మోదీ అభినందన్తో సెల్ఫీలు దిగేందుకు స్థానికులు పోటీపడుతుండటం విశేషం. మరో విశేషం ఏమిటంటే పాఠక్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పార్టీ రిపబ్లికన్ పార్టీ (అధవాల్) ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. ఇక అచ్ఛే దిన్ రానే రావంటూ నటుడు, కాంగ్రెస్ నేత రాజ్ బబ్బర్ సమక్షంలో గత నెలలోనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. మొన్నటిదాకా బీజేపీలో ఉండి, ప్రధానికి జైకొట్టిన అభినందన్ పాఠక్ ఇప్పుడు హస్తం గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నారు. 2014 లోక్సభ్ఎన్నికలకు ముందు మోదీ చేసిన వాగ్దానం 'అచ్ఛే దిన్' (మంచి రోజులు) ఎప్పటికీ రావని, ఇది తప్పుడు వాగ్దానమని తేలిపోయిందని మండిపడుతున్నారు. అందుకే తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు వెల్లడించారు. అంతేకాదు విదేశాలలో నల్లధనం వెనక్కి తీసుకున్న తరువాత ప్రతి భారతీయుడికి 15 లక్షల రూపాయలను బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేస్తానని ప్రధాని మాట తప్పారని విమర్శిస్తున్నారు. అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా బస్తర్ ప్రాంతంలోని 12 శాసనసభ స్థానాలకు నవంబర్ 12న ఓటింగ్ జరుగనున్న సంగతి తెలిసిందే. -
అడవి బిడ్డల ఆదరణతోనే
మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ల్లో గిరిజనుల ప్రభావం గణనీయంగా ఉంటుంది. చాలా స్థానాల్లో వీరి పాత్ర కీలకం. రాజస్తాన్లోని పలు నియోజకవర్గాల్లోనూ వీరు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. అందుకే గిరిజనుల మద్దతుంటే.. గెలుపు మరింత సులువవుతుందని బీజేపీ, కాంగ్రెస్లు భావిస్తున్నాయి. గత రెండు ఎన్నికల్లో మధ్యప్రదేశ్లో ఈ వర్గమంతా బీజేపీకే అనుకూలంగా ఉంది. అయితే తమకు ఒనగూరిందేమీ లేదని కమలంపై కస్సుబుస్సవుతున్న ఈ వర్గం.. ఈసారి కాంగ్రెస్కు జై కొడుతుందా అనేది ఆసక్తికరం. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ గిరిజనులు కాంగ్రెస్తోనే ఉన్నారు. కానీ 2010 తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఆదివాసీల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఆరెస్సెస్ అనుబంధ సంస్థ ‘వనవాసీ కళ్యాణ్ పరిషత్’ విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించింది. వీరి విద్య, ఆరోగ్య అవసరాలు తీర్చడంతోపాటు చైతన్యం తీసుకొచ్చింది. దీని ఫలితంగానే.. 2013 మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఆదివాసీలు ఏకపక్షంగా బీజేపీకి జైకొట్టారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లోనూ గంపగుత్తగా బీజేపీకి ఓటేశారు. అయితే ఏడాది కాలంగా బీజేపీ పట్ల గిరిజనుల్లో విముఖత వ్యక్తమవుతోందని.. లోక్నీతి–సీఎస్డీఎస్ సర్వేలో వెల్లడైంది. ఎస్టీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టానికి చేసిన సవరణలు, అటవీ హక్కుల చట్టం అమలులో నెలకొన్న నిర్లక్ష్యం, అటవీ ఉత్పత్తులకు తగిన ధర కల్పించడంలో వైఫల్యం, ఆదివాసీ యువతకు ఉద్యోగ కల్పన లేకపోవడం తదితర అంశాలతో ఆదీవాసీలు బీజేపీకి దూరమవుతున్నారని ఆ సర్వే చెబుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సహకారంతో జై ఆదివాసీ యువ సంఘటన్ (జేఏవైఎస్) నాయకుడు డాక్టర్ హీరాలాల్ తన వర్గాన్ని ఎస్టీ రిజర్వ్డ్ ప్రాంతాల్లో రంగంలోకి దించే ప్రయత్నాల్లో ఉన్నారు. హీరారాల్ రంగంలోకి దిగితే బీజేపీకి గట్టిదెబ్బ తప్పదని రాజకీయ విశ్లేషకులంటున్నారు. ఛత్తీస్గఢ్, రాజస్తాన్ల్లో చక్రం తిప్పేదెవరు? ఛత్తీస్గఢ్లో 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఆదివాసీ ఓట్లు బీజేపీ కంటే కాంగ్రెస్కే 9% ఎక్కువగా వచ్చాయి. లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్దే పైచేయి. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ఆదివాసీ ప్రాంతాల్లో అభివృద్ధికి ఎన్నో చర్యలు చేపట్టినా.. నక్సల్స్ సమస్య అభివృద్ధికి అడ్డంకిగా మారింది. కొన్ని గ్రామాల్లో ఆదివాసీలు ఓటు హక్కు వినియోగించుకోవడానికి కూడా భయపడే పరిస్థితులు ఉన్నాయి. పదిహేనేళ్లుగా ఛత్తీస్గఢ్లో బీజేపీ అధికారంలో ఉండి కూడా తమకు ఏమీ చేయలేదన్న అసంతృప్తి వారిలో నెలకొంది. అయితే.. ఈసారి గిరిజనులకు పట్టున్న ప్రాంతాల్లో అజిత్ జోగి కీలకం కానున్నారని సర్వేలంటున్నాయి. ఇదే జరిగితే కాంగ్రెస్కు మళ్లీ ఇబ్బందులు తప్పవు. రాజస్తాన్లో మాత్రం గత ఎన్నికల్లో ఎస్టీలు బీజేపీకే జై కొట్టారు. అయితే ఎస్సీ, ఎస్టీ చట్టానికి చేసిన సవరణలు ఆదివాసీల్లో వ్యతిరేకతను పెంచాయి. ఇదే అంశాన్ని కాంగ్రెస్ ప్రచారంలో ప్రధానంగా పేర్కొంటోంది. ఒక ఊరు.. నలుగురు ఓటర్లు! నవంబర్ 12న ఎన్నికలు జరగనున్న ఛత్తీస్గఢ్లోని ఓ పోలింగ్ బూత్ ఇప్పుడు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా మారింది. భరత్పూర్ నియోజకవర్గంలోని షెరందంద్ ఊర్లోని ఓ పోలింగ్ బూత్లో కేవలం నలుగురంటే నలుగురే ఓటర్లుండటం ఈ ఎట్రాక్షన్కు కారణం. ఏ ఒక్క ఓటరూ.. తన హక్కును కోల్పోకూడదని సకల ఏర్పాట్లు చేస్తున్న ఎన్నికల సంఘం.. ఈ నలుగురి కోసం కూడా పోలింగ్ బూత్ను సిద్ధం చేయనుంది. అయితే బూత్ కోసం సరైన వసతుల్లేకపోవడంతో ఓ టెంట్ కిందే పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించింది. జాతీయ రహదారికి 15 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఊరుంటుంది. కానీ ఇక్కడి చేరుకోవడం ఓ సాహసమే. రోడ్డు మార్గం లేదు. కనీసం కాలిబాట కూడా ఉండదు. రోడ్డుకు కొద్ది దూరంలో ఉండే పెద్ద నదిని దాటి.. ఆ తర్వాత రాళ్లు, రప్పల మధ్య రెండు కొండలు ఎక్కిదిగితే గానీ ఆ ఊరికి చేరుకోలేం. -
రాజస్తాన్ కాంగ్రెస్దే!
న్యూఢిల్లీ: రాజస్తాన్లో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్నట్లు ఇండియాటుడే సర్వేలో తేలింది. మళ్లీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశం కేవలం 35% ఉన్నట్లు ఈ సర్వే పేర్కొంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారాలని 43%, ఇదే ప్రభుత్వం మళ్లీ రావాలని 39% కోరుకున్నారు. 18% తమకు తెలియదని బదులిచ్చారు. ముఖ్యమంత్రిత్వం కోసం అశోక్ గెహ్లాట్(కాంగ్రెస్)కు 35%, వసుంధర రాజె(బీజేపీ)కు 31%, సచిన్ పైలట్(కాంగ్రెస్)కు 11% మద్దతిచ్చారు. రాష్ట్రంలోని 25 లోక్సభ సీట్ల పరిధిలో 10,136 మందిని సర్వేలో భాగంగా సంప్రదించారు. అత్యధికులు ముఖ్యమంత్రి వసుంధర రాజే పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేయగా, ప్రధానిగా మోదీపై మాత్రం సానుకూలత వ్యక్తమైంది. ‘కాంగ్రెస్ సునాయాసంగా విజయం సాధిస్తుంది. దళితులు, ముస్లింలలో బీజేపీపై, ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. కంచుకోటల్లాంటి పట్టణ ప్రాంతాల్లోనూ బీజేపీ పట్టు కోల్పోతోంది’ అని విశ్లేషకులు అంటున్నారు. మధ్యప్రదేశ్: మధ్యప్రదేశ్లో బీజేపీ, కాంగ్రెస్ల మధ్య హోరాహోరి పోరు ఉంది. బీజేపీ ప్రభుత్వం నిలుపుకునే అవకాశం 52% ఉందని సర్వే పేర్కొంది. ప్రతిపక్షాలకు మద్దతుగా నిలిచే ఓటర్లలో చీలిక కారణంగా బీజేపీకి కొంత ప్రయోజనం కలిగే అవకాశముందని తేలింది. మళ్లీ బీజేపీ ప్రభుత్వం రావాలని 42%, ప్రభుత్వం మారాలని 40% కోరుకుంటున్నట్టుగా వెల్లడైంది. 18% తెలియదంటూ సమాధానమిచ్చారు. రాష్ట్రంలోని 29 ఎంపీ స్థానాల్లోని 11,712 మంది నుంచి టెలిఫోన్ ద్వారా అభిప్రాయాలు సేకరించారు. నిరుద్యోగం, వ్యవసాయరంగ సమస్యలు, ధరల పెరుగుదల, తాగునీటి సమస్య వంటివి ఈ ఎన్నికల్లో ప్రధానమైన అంశాలుగా మారినట్టు తేలింది. జ్యోతిరాదిత్య సింధియాను సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఉంటే కాంగ్రెస్ మరింత పుంజుకుని ఉండేదని అభిప్రాయపడ్డారు. యువ ఓటర్లలో జ్యోతిరాదిత్యకు మంచి ప్రజాదరణ ఉన్నట్టు వెల్లడైంది. ఛత్తీస్గఢ్: మళ్లీ బీజేపీ ప్రభుత్వమే రావాలని 43%, ప్రభుత్వం మారాలని 41%, తెలియదని 16% స్పందించారు. ఈ ఫలితాల ఆధారంగా ఇక్కడ బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం 55% ఉందని నిపుణుల సహకారంతో ఇండియా టుడే విశ్లేషించింది. అజిత్జోగి ‘జనతా కాంగ్రెస్ ఛత్తీస్గఢ్’పార్టీని ఏర్పాటు చేసి ప్రస్తుత ఎన్నికల్లో బీఎస్పీ, సీపీఐలతో పొత్తు కుదుర్చుకోవడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి బీజేపీకి లాభిస్తుందని పేర్కొంది. ఈ కూటమి వల్ల కాంగ్రెస్కే ఎక్కువ నష్టమని విశ్లేషించింది. నక్సల్ ప్రభావిత బస్తర్ ప్రాంతంలో మాత్రం బీజేపీకి ఎదురుగాలి వీస్తున్నట్టు వెల్లడైంది. వరసగా మూడుసార్లు సీఎంగా కొనసాగుతున్నా, జనాదరణలో మాత్రం రమణ్సింగ్ ముందు వరసలోనే ఉన్నారు. సీఎంగా 44% రమణ్సింగ్కు, 23% కాంగ్రెస్ నేత భూపేష్ భాఘేల్,కు, 13% అజిత్ జోగికి మద్దతిచ్చారు. జోగి నేతృత్వంలోని కూటమికి 7% సానుకూలత చూపారు. ఛత్తీస్గఢ్లోని 11 లోక్సభ నియోజకవర్గాల్లోని 4,486 మంది నుంచి అభిప్రాయాలు సేకరించారు. -
ఆమె ఆస్తి 1200.. సీఎంపై పోటీ!
ఎన్నికల బరిలో లెక్కలేనంత ఖర్చుపెట్టినా.. డిపాజిట్లు దక్కని పరిస్థితులున్న వేళ కేవలం రూ.1,200 ఆస్తి మాత్రమే ఉన్న ఓ ధీరవనిత ఛత్తీస్గఢ్ ఎలక్షన్ల బరిలో దిగింది. అది కూడా ఏకంగా సీఎం రమణ్ సింగ్పైనే. రమణ్ సింగ్ (బీజేపీ), వాజ్పేయి కోడలు కరుణా శుక్లా (కాంగ్రెస్) మధ్య హోరాహోరా పోటీ నెలకొన్న రాజ్నందన్గావ్ నియోజకవర్గంలో.. ఇప్పుడు ప్రతిమా వాస్నిక్ అనే 37 ఏళ్ల స్వతంత్ర అభ్యర్థి అందరి దృష్టినీ ఆకర్శిస్తోంది. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ వెల్లడించిన డేటాప్రకారం.. ఆమె ఆస్తి కేవలం 12వందలు కాగా.. తన వద్ద రూ.20వేల ఎన్నికల ఫండ్కు మించి ఒక్క రూపాయి కూడా లేదు. ఆమె భర్త స్థానికంగా ఓ హోటల్లో వంటవాడిగా పనిచేస్తున్నారు. వీరికి ఓ కుమారుడున్నాడు. నామినేషన్లో వెల్లడించిన వివరాల ప్రకారం.. రమణ్ సింగ్ ఆస్తి రూ. 10.72 కోట్లు కాగా, కరుణా శుక్లా ఆస్తి రూ.3 కోట్లు. ఎస్సీ ఉద్యమాల అడ్డాలో.. ఛత్తీస్గఢ్లోని పలు ప్రాంతాల్లో అంబేడ్కర్ ఆలోచనల ఉద్యమాలకు బలమైన పునాదులున్నాయి. ఎస్సీల్లోని సత్నామీ వర్గానికి ఇక్కడ గణనీయమైన సంఖ్యలో ఓట్లున్నాయి. ఇక్కడి ఓటర్లలో రాజకీయ చైతన్యం కూడా ఎక్కువగా ఉంటుంది. బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం ఛత్తీస్గఢ్ నుంచే రాజకీయ జీవితం ప్రారంభించిన సంగతి తెలిసిందే. స్పష్టమైన లక్ష్యంతో.. ‘సమాజంలో మార్పు’ లక్ష్యంతో రాజకీయాల్లోకి ప్రవేశించిన ప్రతిమ.. నిధుల కొరత కారణంగా ఆర్భాటాలకు పోకుండా ∙ నెలరోజుల క్రితమే ఇంటింటి ప్రచారం చేసుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు గుర్తింపు దక్కడం, ఉద్యోగావకాశాలు మెరుగుపడటం, ఈ వర్గాలకు ప్రైవేటురంగంలో రిజర్వేషన్లు కల్పించడం, రోడ్లు, నీటి సరఫరా, విద్యుత్ సౌకర్యాలను మెరుగుపరిచే హామీలతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ‘ఎస్సీ, ఎస్టీలకు ఏం ఒరుగుతుందో మనకందరికీ తెలుసు. సామాజిక చైతన్యం తీసుకొచ్చేందుకు మన తొలి అడుగును వేసేందుకు ఇదే మంచి తరుణం. ఎక్కడా అంబేడ్కర్ ఆలోచనలు కనిపించడం లేదు’ -
మళ్లీ నేనే!
దేశవ్యాప్తంగా బీజేపీ కంచుకోటల్లో ఛత్తీస్గఢ్ ఒకటి. ఏకబిగిన మూడుసార్లు ఇక్కడ సీఎం రమణ్ సింగ్ నేతృత్వంలో బీజేపీయే అధికారంలో ఉంది. ఒకప్పటి కాంగ్రెస్ అడ్డా అయిన ఛత్తీస్గఢ్పై బీజేపీ పట్టు వెనక రమణ్ పాత్ర కీలకం. ఆ ధీమాతోనే ఆయన కూడా నాలుగోసారీ అధికారాన్ని కైవసం చేసుకుంటామంటున్నారు. జోగి రాక బీజేపీకన్నా కాంగ్రెస్కే ఎక్కువ నష్టమంటున్నారు. నక్సల్స్, కుల సమీకరణాలు కీలక పాత్ర పోషిస్తున్న ఈ ఎన్నికల్లో బీజేపీ విజయావకాశాలపై రమణ్ సింగ్ లెక్కలేంటి? మావోయిస్టులను అణచేస్తాం ‘మావోయిస్టులు ఎన్నికల బహిష్కరణకు పిలుపునివ్వడం అప్రజాస్వామికం. ఎన్నికలు ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కు. దీన్ని వినియోగించుకునేలా ప్రభుత్వం.. చర్యలు చేపడుతుంటే మావోయిస్టులు హెచ్చరించడమేంటి. రాష్ట్రంలో నక్సలైట్ల ప్రభావాన్ని గణనీయంగా తగ్గించగలిగాం. ఇప్పుడు బస్తర్ ప్రాంతానికే వారు పరిమితమయ్యారు. రాష్ట్రంలో పూర్తిగా శాంతి నెలకొల్పడమే మా ప్రభుత్వ లక్ష్యం. అధికారంలోకి రాగానే ఈ దిశగా మా కార్యాచరణ ప్రారంభిస్తాం. వాస్తవానికి గత ఎన్నికల్లోనే (2013)మాకు తీవ్రమైన పోటీ ఉంది. అప్పుడే కాంగ్రెస్ నేతలను నక్సలైట్లు కాల్చి చంపారు. అంతటి సానుభూతిలోనూ మేం విజయం సాధించాం. ఇప్పుడు అంతటి తీవ్రమైన పోటీ పెద్దగా ఎదురవడం లేదు’ జోగి రావడం మంచిదే! ‘అజిత్ జోగి పోటీలో రావడం మంచిదే. జోగి తన సొంతపార్టీతో పోటీ చేయడం ఈ ఎన్నికలను మరింత రసతవత్తరంగా మారుస్తుంది. ఆయన బీఎస్పీతో కలిసి ఎన్నికల బరిలో దిగుతుండటం.. బీజేపీ, కాంగ్రెస్లపై దీని ప్రభావం ఉంటుంది. ఏమాత్రం సందేహం లేదు. కానీ ఇది.. కాంగ్రెస్కే ఎక్కువ నష్టం చేస్తుంది. ఆయన్ను ఇప్పటికీ కాంగ్రెస్ నేతగానే ప్రజలు భావిస్తున్నారు’ గిరిజనులెప్పుడూ మావెంటే.. ‘ఛత్తీస్గఢ్లోని మొత్తం 90 స్థానాల్లో 29 గిరిజనులకు, 10 ఎస్సీలకు రిజర్వ్ అయ్యాయి. మిగిలినవి జనరల్ స్థానాలు. గతంలో ఎస్సీ స్థానాల్లో ఎక్కువ మేమే గెలిచాం. గిరిజనులెప్పుడూ బీజేపీతోనే ఉంటారు. ఛత్తీస్గఢ్లో కులసమీకరణాల ప్రభావం పెద్దగా ఉండదు. నేను తటస్థ వాదిని. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కులాలూ నన్ను ఆదరిస్తాయి. అయినా.. అభివృద్ధి అంశంపైనే మేం ఈ సారి ఎన్నికల బరిలో నిలుచున్నాం. ఛత్తీస్గఢ్లో మేమేం చేశామో ప్రజలకు తెలుసు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత అనే పదానికి తావే లేదు’ -
గన్ను మీద సాము
నక్సల్స్ ప్రాబల్యమున్న ఛత్తీస్గఢ్లో మొదటిదశ పోలింగ్కు రంగం సిద్ధమైంది. ఎన్నికలు బహిష్కరించాలనే నక్సల్స్ హెచ్చరిక, బహిష్కరణ బెదిరింపు పనిచేయకూడదన్న ప్రభుత్వ పట్టుదల మధ్య ఈ నెల12న తొలివిడత ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలని ప్రభుత్వం పెద్ద ఎత్తున సాయుధ బలగాలను దించడంతో రాష్ట్రంలో ఉద్రిక్తత పరిస్ధితులు ఏర్పడ్డాయి. ఎన్నికలనగానే ఛత్తీస్గఢ్లో ఇలాంటి ఉద్రిక్తతలు సాధరణమయ్యాయి. ఈ సారి కూడా ఎన్నికల వేళ హింస పెచ్చరిల్లవచ్చుననే భయాందోళనలు మిన్నంటాయి. ఇందుకు తగ్గట్లే ఇటీవల బీజాపూర్, సుక్మా జిల్లాల్లో తొమ్మిదిమంది భద్రతా సిబ్బంది, డీడీ న్యూస్ కెమెరామన్ను నక్సల్స్ హతమార్చారు. దీంతో ప్రభుత్వం ఎన్నికలు ముగిసే వరకు పలు ప్రాంతాల్లో హై సెక్యూరిటీ అలర్ట్ ప్రకటించింది. త్రిముఖ పోటీ.. ఛత్తీస్గఢ్ తొలిదశ ఎన్నికల్లో ఎనిమిది మావోయిస్ట్ ప్రభావిత జిల్లాల్లోని 18 నియోజకవర్గాలు (ఎస్టీ–12,ఎస్సీ–1, జనరల్–5) పోలింగ్కు సిద్ధమవుతున్నాయి. గత ఎన్నికల్లో ఈ 18 సీట్లలో 12 చోట్ల బీజేపీ ఓటమి పాలైంది. ఈసారి ప్రధానపార్టీలతో పాటు అజిత్ జోగికి చెందిన జేసీసీ–జే కూడా పోటీలో ఉండడంతో పలు ప్రాంతాల్లో త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్కు రాజీనామా చేసి జనతా కాంగ్రెస్ ఛత్తీస్గఢ్ (జేసీసీ–జె) పార్టీని ఏర్పాటు చేసిన మాజీ సీఎం అజిత్జోగి బీఎస్పీ, సీపీఐతో పొత్తు పెట్టుకున్నారు. బిలాస్పూర్ జిల్లాలోని మార్వావి స్థానం నుంచి జోగి పోటీచేస్తున్నారు. జోగి భార్య రేణుజోగికి కాంగ్రెస్ టికెట్ నిరాకరించడంతో ఇప్పుడు జేసీసీ టికెట్పై ఇదే జిల్లాలోని కోట (రెండో విడత పోలింగ్) నుంచి పోటీచేస్తున్నారు. వరుసగా మూడుసార్లు సీఎంగా కొనసాగుతున్న రమణ్సింగ్తో పాటు మొత్తం 190 మంది మొదటి విడత ఎన్నికల బరిలో ఉన్నారు. రాజ్నంద్గావ్ నుంచి సీఎం రమణ్సింగ్పై మాజీ ప్రధాని ఏబీ వాజ్పేయి సమీప బంధువు కరుణాశుక్లా (కాంగ్రెస్) పోటీచేస్తున్నారు. ఈ స్థానంలో మొత్తం 30 మంది, బస్తర్, కొండగావ్ స్థానాల నుంచి ఐదేసి మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దంతేవాడ (ఎస్టీ) సీటు నుంచి నక్సల్స్ చేతుల్లో హతమైన కాంగ్రెస్నేత మహేంద్రకర్మ భార్య దేవతీ కర్మ (కాంగ్రెస్) పోటీలో ఉన్నారు. 50 డ్రోన్లు.. వెయ్యి ట్రాకర్లు.. నక్సల్స్ హెచ్చరికల నేపథ్యంలో 86 ప్రాంతాల్లోని 187 పోలింగ్బూత్లను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని భావిస్తున్నారు. ఈ కారణంగా ఓటర్లు కనీసం పది కి.మీ దూరం నడిచివెళ్లి ఓటేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. దేశంలోని మరే రాష్ట్రంలో జరగని విధంగా భద్రతా కారణాల దృష్ట్యా రోడ్డుకు పక్కనే తాత్కాలిక పోలింగ్బూత్లు ఏర్పాటు చేస్తున్నారు. నక్సల్స్ ప్రభావం అత్యధికంగా ఉన్న బస్తర్ ప్రాంతంలో మొత్తం 50 డ్రోన్ కెమెరాలు, వెయ్యికి పైగా శాటిలైట్ ట్రాకర్లు ఏర్పాటు చేస్తున్నారు. 50 డ్రోన్ కెమెరాల్లో దంతేవాడలో 25, మిగతా వాటిని సుక్మా, బీజాపూర్ జిల్లాల్లో ఉపయోగిస్తున్నారు. భద్రతా శిబిరాలకు సమీపంగా నక్సల్స్ కదలికలపై నిఘాకు వీటిని వినియోగిస్తున్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను పోలింగ్ బూత్లకు తీసుకెళ్లే పోలింగ్ సిబ్బందికి వెయ్యికిపైగా శాటిలైట్ ట్రాకర్లు అందుబాటులోకి తెచ్చారు. ఏదైనా జరగరానిది జరిగితే హెచ్చరించే విధంగా ట్రాకర్ల ద్వారా జిల్లా కేంద్రానికి సమాచారం అందేలా మీటలు ఏర్పాటుచేశారు. దీంతో పాటు ఇప్పటికే పోలీసు బలగాల మోహరింపు కూడా మొదలైంది. 50కి పైగా కేంద్రాల్లో జీరో పోలింగ్... ఎన్నికలను బహిష్కరించాలని ఓటర్లను హెచ్చరిస్తూ మారుమూల ప్రాంతాల్లో నక్సల్స్ కరపత్రాలు పంచుతున్నారు. భేజీ, నీలావయ వంటి సుదూర ప్రాంతాల్లో ఎన్నికల బహిష్కరణ, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు కనిపిస్తున్నాయి. 2013 శాసనసభ ఎన్నికల్లో బీజాపుర్, దంతేవాడ, సుక్మా జిల్లాల్లోని 53 పోలింగ్బూత్లలో ఒక్కటంటే ఒక్క ఓటు కూడా పోల్కాలేదు. ఇలా ఒక్క ఓట్ కూడా పడని జీరో బూత్లు బీజాపుర్లో 32, సుక్మాలో 15, దంతేవాడలో ఆరు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికల్లో జీరో పోలింగ్ బూత్ ఒక్కటి కూడా ఉండకూడదన్న పట్టుదలతో అధికారులున్నారు. ప్రభుత్వ ప్రయత్నాలు పెద్దగా ఫలించకపోవచ్చని, నక్సల్స్ ప్రాబల్య ప్రాంతాల్లో కేవలం 0–10 శాతం మధ్య పోలింగ్ నమోదు కావొచ్చునని నిపుణులు అంచనావేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఓటింగ్ పెంచేందుకు పలు చర్యలు చేపట్టింది. తమ తల్లితండ్రులు ఓటేసినట్లు ఆధారాలను సమర్పించాలని సుక్మా ప్రాంతంలోని స్కూల్ పిల్లలను టీచర్లు ఆదేశించారు. ఈ ఎన్నికల్లో తప్పక ఓటు వేయాలంటూ దంతేవాడలో మహిళ స్వయంసహాయక బృందాల సభ్యులు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఓటింగ్ను బట్టి ఈ బృందాలకు ప్రోత్సాహకాలుంటాయని స్థానిక అధికారులు ప్రకటించారు. పేలవ ఓటింగ్ - సుక్మా జిల్లా కుంట స్థానంలోని భేజీ–2 పోలింగ్బూత్లో మొత్తం 413 ఓట్లకు గాను 2013 అసెంబ్లీ ఎన్నికల్లో జీరో పోలింగ్ నమోదు కాగా, 2014 లోక్సభ ఎన్నికల్లో ముగ్గురు మాత్రమే ఓటేసారు. - నీలావయ పోలింగ్బూత్లో 2013 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 702 ఓట్లకుగాను ఆరు ఓట్లు, 2014 లోక్సభ ఎన్నికల్లో మొత్తం 753 ఓట్లకు గాను మూడు ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఎన్నికలు జరిగే స్థానాలు... మావోల ప్రభావం ఎక్కువగా ఉన్న బస్తర్, కంకేర్, సుక్మా, బీజాపూర్, దంతేవాడ, కొండగావ్ తదితర జిల్లాల్లోని అనంతగర్, భానుప్రతాప్పూర్, కంకేర్, కొండగావ్, నారాయణ్పూర్, బస్తర్, జగ్దల్పుర్, కేష్కల్, చిత్రకూట్, దంతేవాడ, బీజాపూర్, కుంట, ఖైరాగఢ్, డోంగర్గఢ్, రాజ్నంద్గావ్, డొంగర్గావ్, ఖుజ్జి, మొహ్లమన్పుర్ (మొత్తం 18) . ప్రధాన అభ్యర్థులు... బీజేపీ: సీఏం రమణ్సింగ్, మంత్రులు మహేష్గజ్డ (బీజాపూర్), కేదార్ కశ్యప్ (నారాయణ్పూర్) కాంగ్రెస్: అసెంబ్లీలో విపక్ష ఉపనేత, కాంగ్రెస్ ఎమ్మెల్యే కవాసి లక్మా(కుంట)తో పాటు లఖేశ్వర్ భాఘేల్ (బస్తర్),దీపక్ కుమార్ బైజీ(చిత్రకూట్), దేవతి కర్మ (దంతేవాడ), సంత్రం నేతం (కేష్కాల్) ఇతరులు: కుంట సీటు నుంచి సీపీఐ మాజీ ఎమ్మెల్యే మనీష్ కుంజం. -
‘న్యూటన్’ కంటే ముందే.. ఓ హీరో!
ఛత్తీస్గఢ్లో మావోయిస్టు ప్రాబల్యం ఎక్కువగా ఉన్న బస్తర్ ప్రాంతంలో ఎన్నికల ప్రక్రియ ఎలా జరిగిందనే అంశంపై తీసిన ‘న్యూటన్’ సినిమా గుర్తుంది కదా.. ఎన్ని కష్టాలొచ్చినా, చివరకు మావోయిస్టులు ఎదురైనా.. హీరో రాజ్ కుమార్ రావ్ ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఎన్నికలు నిర్వహించిన తీరుతో ఈ చిత్రం 2018 సంత్సరానికి భారత్ నుంచి ఆస్కార్కు నామినేట్ అయింది. ఇప్పుడెందుకు ఈ సంగతి అనేగా మీ అనుమానం.. సరిగ్గా ఇలాంటి ప్రయత్నమే 2013 ఎన్నికల సమయంలో దంతేవాడ జిల్లాలో జరిగింది. ఆ గ్రామానికి చెందిన 24ఏళ్ల యువకుడు మంగల్ కుంజం కూడా ఇలాంటి ప్రయత్నమే చేశాడు. కానీ మవోయిస్టులు తీవ్రంగా హెచ్చరించి వదిలేయడంతో.. చావుతప్పి కన్నులొట్టబోయి సైలెంటయ్యాడు. 2013లోనూ ఇప్పటిలాగే మావోయిస్టులు ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. అయితే కుంజం మాత్రం ఈ హెచ్చరికలను బేఖాతను చేస్తూ.. ఘమియాపల్ పంచాయతీ (20 తండాలు)లో ఊరూరా తిరిగి ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రచారం చేశాడు. పోలీసులు రక్షణ కల్పిస్తామన్నా ఎవరూ ఓటేయడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ ప్రాతంలోని 68% నియోజకవర్గాల్లో ఒక్క ఓటు కూడా నమోదవలేదు. మిగిలిన చోట్ల 20 ఓట్ల కన్నా ఎక్కువ రాలేదు. అయితే ఎన్నికలు పూర్తయిన తర్వాత కుంజంను స్థానిక దళ కమాండర్ పిలిపించి బెదిరించాడు. మరోసారి ఈ తప్పుచేయనని కుంజం బతిమాలుకోవడంతో.. తీవ్రంగా హెచ్చరించి వదిలిపెట్టాడు. నాటి ఘటనను కుంజం గుర్తుచేసుకుంటూ.. ‘పోలీసులు ఎన్నికల వరకే ఉంటారు. ఆ తర్వాత మా పరిస్థితేం కావాలి. అందుకే మావోయిస్టులు చెప్పినట్లుగా ఈసారి మేమెవరమూ ఓటేయబోం’ అని ఆవేదనగా చెప్పాడు. అక్కడ మాత్రమే బీజేపీతో దోస్తీ ! కేంద్రంలోని ఎన్డీయేలో లోక్ జన్శక్తి పార్టీ (ఎల్జేపీ) భాగస్వామిగా ఉంది. ఈ పార్టీ చీఫ్ రాంవిలాస్ పాశ్వాన్ కీలకమైన వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ వ్యవస్థ వ్యవహారాలు చూస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల కోసం బిహార్లో కుదిరిన పొత్తుల్లోనూ ఈ పార్టీకి తగిన∙గౌరవం ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించింది. అయితే అదంతా అక్కడి లెక్కేనని.. రాజస్తాన్లో మాత్రం తమ దారివేరని ఎల్జేపీ తేల్చేసింది. బీజేపీతో పొత్తుల విషయం తేలకపోవడంతో మొత్తం 200 సీట్లలో పోటీ చేస్తామని స్పష్టంచేసింది. బిహార్లో దళితులు, వెనుకబడిన వర్గాలు ఎక్కువగా ఉన్న మూడు జిల్లాల్లో ఎల్జేపీకి మంచి పట్టుంది. అయితే ఈ దళితుల ఓట్లపైనే ఆధారపడి రాజస్తాన్లో పోటీచేయాలనేది ఈ పార్టీ ఆలోచన. అయితే.. దళితుల ఓట్లను చీల్చి బీజేపీకి మేలుచేయడమే పాశ్వాన్ వ్యూహమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
నోటా మీట దడదడ!
పుట్టిన తొలి ఏడే నోటా హీటెక్కించింది. రాజస్తాన్, చత్తీస్గఢ్లో అధికార, విపక్షాలకు చుక్కలు చూపించింది. 2013 ఎన్నికల్లో తొలిసారిగా అందుబాటులోకి వచ్చిన నోటా ఓట్ల పరంగా బీజేపీ, కాంగ్రెస్, ఓ ప్రాంతీయ పార్టీ తర్వాతి స్థానాన్ని ఆక్రమించింది. అందుకే ఈ నోటాపై ఇప్పుడు రాజకీయపార్టీల్లో ఆందోళన మొదలైంది. 2013 రాజస్తాన్ ఎన్నికల్లో బీజేపీకి 45.2%, కాంగ్రెస్కు 33.1% ఓట్లు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా పోలైన ఓట్ల జాబితాలో మూడోస్థానంలో స్వతంత్రులు (8.2%), ఇటీవలే ఎన్పీపీ (4.3%), బీఎస్పీ (3.4%)లు నాలుగైదు స్థానాల్లో నిలవగా.. నోటా 1.9% ఓట్లతో (5,90,000 ఓట్లు) ఐదో స్థానంలో నిలిచింది. నోటాకన్నా జాతీయ పార్టీలైన సమాజ్వాదీ పార్టీ, సీపీఎంలకు తక్కువ ఓట్లు వచ్చాయి. 58 పార్టీలు పోటీచేసిన ఈ ఎన్నికల్లో.. 54 పార్టీల కన్నా నోటాకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఛత్తీస్గఢ్లో.. ఛత్తీస్గఢ్ గత ఎన్నికల్లో మూడోవంతు సీట్లలో నోటా మూడోస్థానంలో నిలవడమే ఇందుకు కారణం. 17 చోట్ల తొలి రెండు స్థానాల్లో నిలిచిన అభ్యర్థుల మధ్య ఓట్ల తేడా కన్నా నోటా ఓట్లే ఎక్కువగా ఉన్నాయి. నోటా ఓట్లే గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయికి చేరాయి. అందుకే ప్రధాన పార్టీలు తటస్థ ఓటర్లపై ప్రత్యేకంగా దృష్టిపెడుతున్నాయి. 17 నియోజకవర్గాల్లో నోటాకు 5వేలకన్నా ఎక్కువ ఓట్లొచ్చాయి. మొత్తంమీద 1.3 కోట్ల ఓట్లు పోలవ్వగా.. బీజేపీకి 41%, కాంగ్రెస్కు 40% ఓట్లు వచ్చాయి. ఇక్కడ కూడా నోటా 3.1% (4లక్షలు)ఓట్లతో ఐదో స్థానంలో నిలిచింది. కాగా, బీజేపీకి వ్యతిరేకంగా ఓ ఆర్టీఐ కార్యకర్త ఉద్యమాన్ని నడుపుతున్నారు. ఆయన నోటా ఓట్లను సరిగ్గా వాడుకోవాలంటూ ప్రచారం చేస్తున్నారు. -
ఛత్తీస్గఢ్లో హై అలర్ట్..
మావోయిస్టుల వరుసదాడులతో అతలాకుతలమవుతున్న ఛత్తీస్గఢ్లోని 90 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 12న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఓవైపు భద్రతా బలగాలు అడవులన్నీ గాలిస్తుంటే.. మరోవైపు మావోయిస్టులు ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం ఉన్న ఆరు జిల్లాల్లో పరిస్థితి గంభీరంగా ఉంది. అయితే, మారుమూల ప్రాంతాల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ ఎన్నికలు జరిపి తీరాల్సిందేనన్న పట్టుదలతో.. ఎన్నికల సంఘం 65వేల మంది కేంద్రీయ, రాష్ట్ర పోలీసు బలగాల సాయంతో ఏర్పాట్లు చేస్తోంది. డ్రోన్లు, హెలికాప్టర్లతో భద్రతను పర్యవేక్షిస్తోంది. ‘ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంతవరకు బలగాలన్నీ అప్రమత్తంగా ఉండాలి’ అని పైనుంచి ఆదేశాలొచ్చాయని సీఆర్పీఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. రాజస్తాన్ దళితుల 24 గీ7 కంట్రోల్రూమ్ ఎన్నికలు రాగానే.. ప్రధాన, ప్రాంతీయ పార్టీల నుంచి చిన్నా, చితకా పార్టీల వరకు తమ అభ్యర్థుల ప్రచార సరళిని గమనించేందుకో, కార్యకర్తలతో అనుసంధానంలో ఉండేందుకో 24 గంటలపాటు అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూమ్స్ను ఏర్పాటుచేసుకోవడం సహజం. కానీ తొలిసారిగా రాజస్తాన్లో దళితుల కోసం 24 గంటల కంట్రోల్రూమ్ ఏర్పాటైంది. దళిత సంఘాలన్నీ ఏకమై దీన్ని ఏర్పాటుచేసుకున్నాయి. ఎన్నికల ప్రచారంలో ఏయే పార్టీలు దళితుల గురించి ఎలాంటి హామీలిస్తున్నాయని గమనించడం, ఆయా హామీలపై అవసరమైనప్పుడు స్పందించడం, ఎన్నికల నేపథ్యంలో దళితులు, బడుగు బలహీనవర్గాలు ఇచ్చే ఫిర్యాదులపై అధికారులను అప్రమత్తంత చేయడం వంటి పనులను ఈ కంట్రోల్ రూమ్ ద్వారా నిర్వర్తిస్తారు. మొత్తంగా ఎన్నికల సందర్భంగా దళితుల హక్కులకు ఎక్కడా భంగం వాటిల్లకుండా చూడటమే దీని ఏర్పాటువెనక ముఖ్యోద్దేశమని దళిత సంఘాల నాయకులు పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ ఆ రెస్టారెంట్ ఇప్పుడో హాట్ టాపిక్! మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. మూడు రోజుల క్రితం రాహుల్ గాంధీ ఇండోర్లోని ‘యంగ్ తరంగ్’అనే చిన్న రెస్టారెంట్లో స్నాక్స్ తిన్నారు. రుచికరమైన మసాలా చాట్ను రాహుల్ సంతోషంగా లాగించేశారు. నిజానికి ఆ రెస్టారెంట్ యజమాని బీజేపీ అభిమాని. శివరాజ్ సింగ్ చౌహాన్పై అభిమానం కొద్దీ సీఎం ఫొటోను రెస్టారెంట్లో ఎదురుగా పెట్టుకున్నారు. ఈ కారణంతోనే రెస్టారెంట్ పేరు హాట్ టాపిక్గా మారింది. హోటల్కు వచ్చే వారందరికీ.. రాహుల్ మా హోటల్లోనే భోజనం చేశారని ఆయన గర్వంగా చెప్పుకుంటున్నారు. ‘ శివరాజ్ చౌహాన్ ఫొటో పక్కనే రాహుల్ ఫొటో పెడతా’అంటున్నాడు. ప్రస్తుతం ఆ రెస్టారెంట్ గురించి ఇండోర్ నగరమంతా చర్చ జరుగుతోంది. -
దళితులే నిర్ణయాత్మకం!
ఛత్తీస్గఢ్ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ ఆ రాష్ట్ర రాజకీయం వేడెక్కుతోంది. అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ మధ్యే హోరాహోరీ పోరు ఉంటుందని భావించినప్పటికీ.. ఛత్తీస్గఢ్ జనతా కాంగ్రెస్ అధినేత అజిత్ జోగి బీఎస్పీతో జతకట్టడంతో రాజకీయ ముఖచిత్రం మారింది. ఛత్తీస్గఢ్లో దళితుల ఓట్లు రానున్న ప్రభుత్వాన్ని నిర్దేశించనున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 90 నియోజకవర్గాల్లో 10 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలుండగా.. మరో 40 చోట్ల దళితులు నిర్ణాయాత్మక ఓటుగా ఉన్నారు. జోగి, మాయావతిల కూటమిలో సీపీఎం కూడా చేరింది. ఇన్నాళ్లూ రాష్ట్రంలో ఉన్న 12% దళితుల ఓట్లను బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీలు పంచుకుంటూ ఉండేవి. ఇందులో బీఎస్పీ వాటా ఎక్కువగా ఉండేది. అయితే బీఎస్పీతో జతకట్టడంతో ఈ ఓటుబ్యాంకును పూర్తిగా తమ కూటమికి అనుకూలంగా మార్చుకోవాలని జోగి వ్యూహం. కనీసం 13 స్థానాల్లో.. జోగీ, మాయావతి కూటమి ఈ ఎన్నికల్లో కనీసం 13 స్థానాల్లో విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. దళితుల ప్రభావం ఎక్కువగా ఉండే.. జాంగీర్ చంపా, బిలాస్పూర్ ఎంపీ నియోజవర్గాల పరిధిలో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలనేది వీరి వ్యూహం. బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం రాజకీయ జీవితం (1984లో జంగీర్ చంపా నుంచే గెలిచారు) ప్రారంభించింది కూడా ఈ ప్రాంతంలోనే కావడంతో.. మాయావతి భారీ అంచనాలు పెట్టుకున్నారు. 2013లో బీఎస్పీ 8 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసి ఒక్కచోట కూడా గెలుపొందలేదు. రెండు స్థానాల్లో సెకండ్ ప్లేస్తో సరిపెట్టుకుంది. మరోవైపు, ఈసారి అకల్తారా ప్రాంతం నుంచి అజిత్ జోగి కోడలు రీచా జోగి బీఎస్పీ టికెట్పై పోటీచేస్తున్నారు. ‘మా హృదయాలు ఒక్కటవ్వాలంటే నేను బీఎస్పీ టికెట్పై పోటీచేయడమే సరైన నిర్ణయం. అలాగైతేనే దళిత ఓట్లు సంపూర్ణంగా బదిలీ అవుతాయి’ అని రీచా భర్త అమిత్ జోగి పేర్కొన్నారు. బీఎస్పీ బలమేంటి? యూపీలో జాటవ్స్ లాగే ఛత్తీస్గఢ్లో సత్నామీలు బీఎస్పీకి అత్యంత నమ్మకంగా ఉంటారు. అయితే రాష్ట్రంలో బీఎస్పీ అభ్యర్థులు బలంగా లేనందున.. ఈ వర్గం మొదట్నుంచీ కాంగ్రెస్కు ఓటుబ్యాంకుగా మారింది. గత ఎన్నికల్లో బీజేపీ వ్యూహాత్మకంగా.. సత్నామీల గురువు బాల్ దాస్తో ‘సత్నామీ సేన’ పార్టీని పెట్టించి ఈ వర్గం ఓట్లును భారీగా చీల్చి 10 రిజర్వ్డ్ స్థానాల్లో తొమ్మిదింటిని కైవసం చేసుకుంది. ఇప్పుడు నేరుగా మాయావతే రంగంలోకి దిగడంతో ఈ స్థానాల్లో బీఎస్పీ పట్టు సంపాదించవచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీనికితోడు ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో బీజేపీపై వ్యతిరేకత పెరిగింది. అయితే ఈ వ్యతిరేక ఓట్లు కూటమిలోని మిగిలిన పార్టీలకు బదిలీ అవుతాయా? లేదా? అన్నదే ఆసక్తికరం. బీజేపీపై వ్యతిరేకత తమకే లాభిస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. దళిత ఓట్లు చీలితే మళ్లీ బీజేపీయే గెలుస్తుంది కాబట్టి.. వారంతా తమవెంటే ఉంటారని ప్రచారం చేసుకుంటోంది. బీజేపీ, కాంగ్రెస్ ఓట్ల శాతంలో ఉండే స్వల్ప మార్పును జోగి, మాయావతి కూటమి తీవ్రంగా ప్రభావితం చేయనుందనేది సుస్పష్టం. -
ఒక్క బ్రిడ్జ్.. నాలుగు ఎన్నికలు
ఎన్నికల్లో అదిచేస్తాం.. ఇదిచేస్తాం అంటూ హామీలివ్వడం. గెలిచిన తర్వాత చేతులెత్తేయడం సర్వసాధారణమే. అలాంటిదే ఓ అంశం ఛత్తీస్గఢ్లోని మహాసముంద్ నియోజకవర్గంలో (జిల్లా కేంద్రం) ప్రత్యేక ఆకర్శణగా నిలుస్తోంది. ఈ పట్టణంలో చాలా రద్దీగా ఉండే ఓ కూడలిలో ఓవర్ బ్రిడ్జ్ అత్యంత ఆవశ్యకం. ఇది ఈనాటి సమస్యేం కాదు. 20 ఏళ్లుగా స్థానిక ప్రజల డిమాండ్ అది. అయితే.. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈసారి గెలిస్తే ఓవర్ బ్రిడ్జ్ కట్టి తీరతామంటూ ప్రతిసారీ ఒకే వాగ్దానం చేస్తున్నారు. గెలిచాక ఆ బ్రిడ్జ్ మాటే ఎత్తడం లేదని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరుసగా రెండుసార్లు ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే గెలిచారు. మిగిలిన పనులు జరుగుతున్నా.. ఓవర్ బ్రిడ్జ్ విషయంపై మాత్రం బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటుందో అర్థం కావడం లేదని వారంటున్నారు. దీన్ని తీవ్రంగా పరిగణిస్తామని వారంటున్న నేపథ్యంలో.. ఈసారి ఓవర్బ్రిడ్జ్ అంశంపై ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. -
ఛత్తీస్లో మళ్లీ కాషాయ రెపరెపలే!
న్యూఢిల్లీ: ఛత్తీస్గఢ్లో మళ్లీ కాషాయ జెండానే రెపరెపలాడనుందని ఒక ఒపీనియన్ పోల్ తేల్చింది. వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రమణ్సింగ్ నేతృత్వంలో బీజేపీ విజయం సాధించనుందని సీఎన్ఎక్స్ పోల్ సర్వే పేర్కొంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఆ ఎన్నికల్లో బీజేపీ 50, కాంగ్రెస్ 30, అజిత్జోగీ నేతృత్వంలోని జనతా కాంగ్రెస్ ఛత్తీస్గఢ్( జోగి), బీఎస్పీ కూటమి 9 సీట్లలో విజయం సాధించే అవకాశాలున్నట్లు అంచనా వేసింది. ఇతరులు ఒక స్థానంలో గెలవొచ్చని పేర్కొంది. ఈ ఎన్నికల్లో బీజేపీకి 42.22%, కాంగ్రెస్కు 37.21%, జోగి, మాయావతి కూటమికి 6.38%, ఇతరులకు 14.21% ఓట్లు రావచ్చని సీఎన్ఎక్స్ సర్వేలో వెల్లడైంది. నవంబర్ 12, 20 తేదీల్లో రెండు దశల్లో చత్తీస్ గఢ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2013 ఎన్నికల్లో బీజేపీకి 49, కాంగ్రెస్కు 39 సీట్లు వచ్చాయి. రాష్ట్రంలో రమణ్సింగ్ ప్రజాదరణకు తిరుగులేదని ఈ సర్వేలో తేలింది. సర్వేలో పాల్గొన్న వారిలో 40.71% రమణ్ సింగ్నే మళ్లీ సీఎంగా కోరుకున్నారు. కాంగ్రెస్ నేత భూపేశ్ భాగెల్కు 19.2% మద్దతిచ్చారు. అభివృద్ధి, నిరుద్యోగం, పెట్రో ధరలు ఈ ఎన్నికల్లో కీలక ప్రభావం చూపనున్నాయి. -
సీఎం కాళ్లు మొక్కిన ముఖ్యమంత్రి
రాయ్పూర్ : మాములుగానేతై నేతలు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కాళ్లు మొక్కుతుంటారు. కానీ ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి మరో రాష్ట్ర ముఖ్యమంత్రి కాళ్లు మొక్కడం ఎక్కడ చూసి ఉండరు. కానీ ఈ అరుదైన సంఘటన మన భారతదేశంలోనే ఛత్తీస్గఢ్లో చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రమణ్ సింగ్(66) వయసులో తన కంటే దాదాపు 20 ఏళ్లు చిన్న వాడైన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్(46) కాళ్లు మొక్కారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. వచ్చే నెల ఛత్తీస్గఢ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలోల రమణ్ సింగ్ రాజ్నందన్గావ్ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో నామినేషన్ వేయడానికి వెళ్లే ముందు ఇలా యూపీ సీఎం యోగి కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. నామినేషన్ అనంతరం ఇరు రాష్ట్రాల సీఎంలు రాజ్నందన్గావ్ నియోజకవర్గంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే సీనియర్లు ఇలా యోగికి పాదాభివందనం చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం ఇదే ప్రథమం కాదు. గతంలో కూడా ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఏకంగా భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ యోగి ఆదిత్యనాథ్ ముందు శిరస్సు వంచి నిల్చుని ఉన్న ఫోటోలు ఇంటర్నెట్లో చక్కర్లు కొట్టాయి. -
ఛత్తీస్ సీఎంపై వాజ్పేయి మేనకోడలు పోటీ
రాయ్పూర్/న్యూఢిల్లీ: ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి మేనకోడలు కరుణా శుక్లాను కాంగ్రెస్ బరిలోకి దించనుంది. రాష్ట్రంలో నవంబర్ 12న మొదటి విడత జరిగే ఎన్నికలకు గాను ఆరుగురు అభ్యర్థుల పేర్లతో కూడిన రెండో జాబితాను కాంగ్రెస్ సోమవారం విడుదల చేసింది. బీజేపీకి చెందిన ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ప్రత్యర్థిగా రాజ్నందన్గావ్ నుంచి ఆమె రంగంలోకి దిగనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. మాజీ ఎంపీ అయిన కరుణా శుక్లా బీజేపీ నాయకత్వం తనను పట్టించుకోవడం లేదంటూ 2013 ఎన్నికలకు ముందు పార్టీకి రాజీనామా చేసి, 2014లో కాంగ్రెస్లో చేరారు. అప్పటి నుంచి ఆమె బీజేపీ పాలనపై, సీఎం రమణ్సింగ్పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. రాష్ట్రంలో మొదటి విడతలో ఎన్నికలు జరిగే 18 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించగా.. రెండు విడతలకు కలిపి బీజేపీ 78 సీట్లలో అభ్యర్థులను ఖరారు చేసింది. -
ఎలక్షన్.. టెన్షన్!
సాక్షి, కొత్తగూడెం: ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో మాత్రం ఉద్రిక్తత నెలకొంది. ఈ రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలు మావోయిస్టు ప్రభావితమైనవి కావడంతో ఆందోళన నెలకొంది. తాజాగా మావోయిస్టులు సోమవారం దంతెవాడ జిల్లాలో ఎన్నికలను బహిష్కరించాలంటూ పోస్టర్లు, కరపత్రాలు విడుదల చేశారు. దీంతో రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఎప్పుడేం జరుగుతుందో అనే టెన్షన్ నెలకొంది. ఛత్తీస్గఢ్లోని బస్తర్, నారాయణపూర్, కాంకేర్ జిల్లాల పరిధిలోని కొన్ని వందల కిలోమీటర్ల పరిధిలో మావోయిస్టులు జనతన సర్కార్ పేరిట సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. దీంతో ఈ సరిహద్దు జిల్లాల్లో నిరంతరం యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. పైగా ఎనిమిది నెలలుగా మావోయిస్టులు, భద్రతా బలగాల మద్య నిత్యం పోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల సరిహద్దుల్లోని ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న దంతెవాడ, సుక్మా, బీజాపూర్, కాంకేర్, నారాయణపూర్, బస్తర్ జిల్లాల్లో వచ్చే నెల 12న పోలింగ్ జరగనుంది. దేశంలోనే వామపక్ష తీవ్రవాదం అత్యధికంగా ఉన్న ప్రాంతం కావడంతో ఈ జిల్లాల్లోని 18 నియోజకవర్గాలకు మొదటి విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి మంగళవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. అరకు ఘటన నేపథ్యంలో నేతల్లో దడ.. గత సెప్టెంబర్ 23న విశాఖపట్నం జిల్లాలో (ఆంధ్రా–ఒడిశా సరిహద్దు) డుంబ్రిగూడ పోలీసుస్టేషన్ పరిధిలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు హతమార్చిన విషయం విదితమే. కాగా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో రోజుల తేడాతో ఎన్నికలు జరుగుతుండడంతో మరింత టెన్షన్ నెలకొంది. స్వేచ్ఛగా ప్రచారానికి వెళ్లేందుకు రెండు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులకు అవకాశం లేకుండా పోయింది. సాధారణ రోజుల్లోనే ఈ ప్రాంతాల్లో పరిస్థితి గంభీరంగా ఉంటుంది. ఛత్తీస్గఢ్లో మొత్తం 90 నియోజకవర్గాలు ఉండగా, తెలంగాణకు సరిహద్దుల్లో ఉన్న జిల్లాల్లోని 18 నియోజకవర్గాల్లో మాత్రమే మొదటి దశలో ఎన్నికల సంఘం ప్రత్యేకంగా పోలింగ్ నిర్వహిస్తోంది. ఈ నియోజకవర్గాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో ప్రతిక్షణం ప్రమాదకర పరిస్థితే అనేలా ఉంది. ఛత్తీస్గఢ్లో పరిస్థితి అలా ఉంటే సరిహద్దుకు ఇటువైపు ఉన్న తెలంగాణలోనూ యుద్ధ వాతావరణమే ఉంది. భద్రాచలం నియోజకవర్గంలో మొత్తం 160 పోలింగ్ బూత్లు ఉండగా, అందులో 51 మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోనే ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని అశ్వారావుపేట, భద్రాచలం, పినపాక, కొత్తగూడెం, ఇల్లెందు నియోజకవర్గాల్లో మొత్తం 995 పోలింగ్ బూత్లు ఉండగా, వీటిలో 104 మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయి. మరో 179 పోలింగ్ బూత్లు అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో, 344 పోలింగ్ బూత్లు సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నాయి. దీంతో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. భద్రాచలం, పినపాక, ఇల్లెందు నియోజకవర్గాల్లో, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ములుగు, పెద్దపల్లి జిల్లాలోని మంథని నియోజకవర్గాల్లోని బూత్లు అత్యధికం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉండటంతో ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం చేయాల్సిన రాజకీయ పార్టీల నేతల్లో దడ నెలకొంది. మోహరించిన మరిన్ని బలగాలు మావోయిస్టుల అంశాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం వెనక్కు తగ్గకుండా మరిన్ని బలగాలను మోహరించింది. దీంతో గత కొన్ని నెలలుగా మావోయిస్టులకు, బలగాలకు మధ్య ఎడతెరిపి లేని పోరు నడుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల సరిహద్దుల్లోని ఛత్తీస్గఢ్లో ఉన్న మర్రిగూడెం, గొల్లపల్లి, కిష్టారం, పామేడు పోలీసుస్టేషన్ల పరిధిలో సీఆర్పీఎఫ్ క్యాంపులను ఏర్పాటు చేసింది. తెలంగాణలోని చెలిమెల, కలివేరు, గౌరారం, ఛత్తీస్గఢ్లోని తోగ్గూడెం(బీజాపూర్), పైడిగూడెం, వెలకనగూడెం, పాలోడి, పొట్కపల్లి (సుక్మా)ల్లో క్యాంపులను ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం వెనుకడుగు వేయకుండా మావోయిస్టులపై పోరుకు బలగాలను కదిలిస్తోంది. -
ఛత్తీస్ చక్రవర్తి ఎవరు?
పేరులో ఉన్నట్లే ఛత్తీస్గఢ్లో రాజకీయాలు 36 రకాలు! సమస్యలూ అన్ని రకాలే..పదిహేనేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్నప్పటికీ మరోసారి గద్దెనెక్కడానికి సర్వశక్తులూ ఒడ్డుతుండగా ముఖ్యమంత్రి రమణ్సింగ్ దూకుడుకు ఈసారైనా కళ్లెం వేసి అధికారం అందుకోవాలని కాంగ్రెస్ కలలు కంటోంది. కాంగ్రెస్కు జెల్లకొట్టి, మాయావతితో జట్టుకట్టి, సీపీఐనూ తన గూటికి లాగేసిన అజిత్ జోగి కనీసం కింగ్మేకర్నైనా కాలేనా అనే ఆశల్లో విహరిస్తున్నారు. అయితే ప్రజలేమో కరువు, పేదరికం, నిరుద్యోగం, నక్సలిజం వంటి సమస్యలతో నలిగిపోతూ తమను ఆదుకునే దిక్కెవరా అని ఎదురుచూస్తున్నారు. ఇంకో నెల రోజుల్లో ఎన్నికలు జరిగే ఛత్తీస్గఢ్లో గెలుపెవరిది? ఏ పార్టీ సత్తా ఎంత? ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడిన దగ్గర్నుంచి ఇప్పటివరకు ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీ, కాంగ్రెస్ మధ్య ముఖాముఖి పోరు నడిచింది. మూడుసార్లు బీజేపీ అధికారాన్ని దక్కించుకున్నప్పటికీ ఇరు పార్టీలకీ మధ్య ఓట్ల తేడా కేవలం ఒకే ఒక్క శాతం. ఆ ఒక్క శాతం ఓట్లే ఎన్నో సీట్లను ప్రభావితం చేస్తూ వచ్చాయి. రాష్ట్రంలో రమణ్సింగ్ సర్కార్ తీవ్ర స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. కిందిస్థాయిలో అవినీతి, అన్నదాతల ఆక్రోశం, నిరుద్యోగం, ప్రభుత్వంపై గిరిజనుల్లో అసహనం ఇవన్నీ కాంగ్రెస్కు కలసి వస్తాయనే అంచనాలు నెలకొన్నాయి. నాయకత్వ లేమి, నిధుల కొరత కాంగ్రెస్ను వెంటాడుతున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాలు, బస్తర్ వంటి నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీకున్న అధికార వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవడానికి కాంగ్రెస్ వ్యూహాలకు పదును పెడుతోంది. కాంగ్రెస్కు అజిత్ జోగి గుడ్బై చెప్పాక ఆ పార్టీకి జనాకర్షక నాయకులే కరువయ్యారు. ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ చీఫ్ భూపేష్ భాగల్, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత టీఎస్ సింగ్ దేవోలకు ప్రజల్లో అంతగా చరిష్మా లేదు. పైగా భూపేష్ భాగల్ సెక్స్ సీడీ వివాదంలో ఇరుక్కొని గత నెల్లోనే జైలుకెళ్లి బెయిల్పై బయటకు వచ్చారు. కాంగ్రెస్లోని మరో ముఖ్య నేత, ఆ పార్టీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ రామ్దయాళ్ ఉయికే బీజేపీ గూటికి చేరుకున్నారు. ఎన్నికల వేళ ఈ పరిణామాలతో కాంగ్రెస్కు ఎదురు దెబ్బ తగిలినట్లయింది. మరోవైపు అజిత్ జోగి పార్టీని వీడటం కూడా తమకు అనుకూలిస్తుందనే భావనలో కాంగ్రెస్ ఉంది. ఎందుకంటే 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడానికి అజిత్ జోగి తెరవెనుక కుట్రలు జరిపారన్న ఆరోపణలూ బలంగా వినిపించాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనకెవరైనా పోటీ అని భావిస్తే వారికి టికెట్లు దక్కకుండా చేయడం, టికెట్ దక్కించుకున్న వారి ఓటమికి కుట్రలు పన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఈసారి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ప్రకటించకుండా రాహుల్ గాంధీయే ముందుండి ప్రచారాన్ని నడిపిస్తున్నారు. ‘‘రాష్ట్రం ఏర్పడిన ఇన్నేళ్లలో కాంగ్రెస్ తనకు అనుకూల ఎజెండాను ఏర్పాటు చేసుకోగలిగింది. బీజేపీని ఆత్మరక్షణలో పడేసే వ్యూహాలతో కాంగ్రెస్ ముందుకు వెళ్లడం మొదటిసారి చూస్తున్నాం’’అని రాయ పూర్కు చెందిన రాజకీయ విశ్లేషకుడు పరివేష్ మిశ్రా అభిప్రాయపడ్డారు. బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా ఉండేందుకు గోండ్వానా గణ తంత్ర పార్టీ (జీజీపీ)తో పొత్తు పెట్టుకోవడానికి కూడా కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. రమణ్సింగ్కూ అవినీతి మకిలి... ఇన్నాళ్లూ క్లీన్ ఇమేజి సొంతం చేసుకున్న రమణ్ సింగ్కు గత మూడేళ్ల లోనే కొద్ది కొద్దిగా అవినీతి మకిలి అంటుకుంటోంది. అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో రమణ్ సింగ్ తన కుమారుడు అభిషేక్ కంపెనీకి లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబం ధించి రూ. లక్షా 50 వేల కోట్ల కుంభ కోణంలోనూ రమణ్సింగ్ పేరు విని పించింది. కల్తీ బియ్యం పంపిణీలో ఉదాశీనంగా వ్యవహరించడం కోసం మిల్లర్లు భారీగా సర్కార్కు ముడుపులు ఇచ్చారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పుడు ఈ ఆరోపణలనే ప్రధాన అస్త్రాలుగా చేసుకొని కాంగ్రెస్ ప్రచారం నిర్వహిస్తోంది. మోదీ ఇమేజ్పైనే ఆశలు.. బీజేపీ ప్రధానంగా మోదీ ఇమేజ్ మీదే గంపెడు ఆశలు పెట్టుకుంది. రాష్ట్ర జనాభాలో సగం వరకు ఉన్న గిరిజనులు, దళితులు (స్థానికంగా సత్నామీలని పిలుస్తారు) ఎన్నికల్లో అత్యంత కీలకం. ఇన్నాళ్లూ గిరిజ నులు కాంగ్రెస్ పార్టీకే మద్దతు పలుకుతూ వచ్చారు. కానీ ఈమధ్య గిరిజనుల్ని దగ్గర చేసుకోవడానికి ఆరెస్సెస్ విస్తృత కార్యక్రమాలు నిర్వహించింది. ముఖ్యంగా బస్తర్ ఇతర గిరిజన ప్రాబల్య జిల్లాల్లోని సంక్షేమ సంస్థలతో కలసి పనిచేస్తోంది. దీని వల్ల గిరిజనుల ఓటు బ్యాంకు తమవైపు మళ్లుతుందనే భావనలో బీజేపీ ఉంది. రాష్ట్రంలోని ఇతర వెనుకబడిన కులాలైన కుర్మిలు, తెలిస్, యాద వులు బీజేపీ వెంటే ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లోని వ్యాపారులు బీజేపీ వైపే ఇంకా మొగ్గు చూపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత కీలకంగా ఉండే రైతులు మాత్రం బీజేపీపట్ల అసంతృప్తితో రగిలిపోతున్నారు. అజిత్ జోగి ప్రభావం ఎంత? కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా మూడేళ్లపాటు పనిచేసిన అజిత్ జోగి ప్రజల్లో చరిష్మా ఉన్న నాయకుడు. రమణ్సింగ్ సర్కార్ను ఎదుర్కో వడంలో కాంగ్రెస్ విఫలమవుతోందని ఆరోపిస్తూ ఆయన రెండేళ్ల క్రితమే పార్టీ నుంచి బయటకొచ్చి జనతా కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీ స్థాపించారు. సత్నామి ఎస్సీ జనాభాలో జోగికి మంచి పట్టు ఉంది. రాష్ట్రంలో 90 నియోజక వర్గాల్లోని రాజకీయ పరిస్థి తులు ఆయనకు కొట్టిన పిండి. ఎస్సీ, ఎస్టీలు, ఉప కులాలు, వెనుకబడిన కులాలు ఎక్కువగా ఉన్న ఈ నియోజక వర్గాల్లో స్థితిగతుల్ని అర్థం చేసుకొని రాజకీయ వ్యూహాలను రచించడంలో ఆయన్ను మించిన వారు లేరన్న పేరుంది. అజిత్ జోగి వెంటే ఆయన కుమారుడు అమిత్ తిరుగుతూ యువ ఓటర్లను ఆకర్షించే పనిలో ఉన్నారు. ఇప్పటికే నిరుద్యోగ సమస్యతో రగిలిపోతున్న యువతరానికి జోగి ఒక ఆశాదీపంలా కనిపిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అజిత్ జోగి ఎన్నికల సభలకూ జనం బాగా వస్తుండటంతో ఆయన కింగ్ మేకర్గా అవతరిస్తారేమోనన్న అంచనాలు నెలకొన్నాయి. దళిత ఓటర్లలో పట్టున్న బీఎస్పీ చీఫ్ మాయావతి... అజిత్ జోగి పార్టీ జనతా కాంగ్రెస్తో జతకట్టడం, సీపీఐ కూడా ఆయన చెంతకే చేరడంతో ఆ కూటమి బలం పెంచుకుందనే విశ్లేషణలు వినిపిస్తు న్నాయి. జోగి ప్రధానంగా కాంగ్రెస్ ఓటు బ్యాంకునే చీల్చే అవకాశాలున్నాయి. ఎస్సీ ఓటర్లు జోగివైపు తిరిగితే బీజేపీకి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. అయితే అజిత్ జోగి పార్టీ రాష్ట్రంలోని తూర్పు ప్రాంతంలోనే ప్రభావం చూపగలదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఎన్నికల్లో ప్రభావం చూపించే అంశాలు... దేశంలో పేదరికం ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్ ఒకటి. ప్రపంచ బ్యాంకు మానవాభివృద్ధి సూచిలో అట్టడుగు స్థానం ఈ రాష్ట్రానిదే. రంగరాజన్ కమిటీ నివేదిక ప్రకారం దేశంలో దాదాపు సగం మంది అంటే 47.9% మంది ప్రజలు పేదరికంలోనే మగ్గిపోతున్నారు. 69% మంది కూలీలుగానే బతుకులీడుస్తున్నారు. మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ విడిపోవడానికి పేదరికమే కారణమైంది. ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ అదే ప్రధాన అంశంగా మారింది. రాష్ట్రంలోని మరో ప్రధాన సమస్య నక్సలిజం. తుపాకుల మోతలు, రక్తపుటేరులు, ఎన్కౌంటర్లతో ఛత్తీస్గఢ్ తరచూ నలిగిపోతూ ఉంటుంది. భద్రతా సిబ్బందిపై నక్సల్స్ దాడులు సర్వసాధారణం. దండకారణ్యంలో నక్సల్స్ ఎప్పటికప్పుడు ఏకే–47 తుపాకులు, రాకెట్ లాంచర్లతో దాడులు జరుపుతూ తమ ప్రాబల్యాన్ని చాటుకుంటూ ఉంటారు. అంతేకాదు అభివృద్ధి కార్యకలాపాలకు నక్సల్స్ తరచూ అడ్డుతగులుతారనే విమర్శలూ ఉన్నాయి. కొత్తగా రోడ్లు నిర్మిస్తుంటే నక్సల్స్ వాటిని ధ్వంసం చేయడం పరిపాటిగా మారింది. సగటున 20 ప్రాంతాల్లో నక్సల్స్ పేలుళ్లు జరిపితే వాటిలో 10 ప్రాంతాలు కొత్తగా రోడ్లు వేసే చోట జరుగుతున్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో యువత నిరుద్యోగ సమస్యతో సతమతమవుతోంది. ఎంప్లాయిమెంట్ ఎక్సే్చంజ్లలో 25 లక్షల మంది తమ పేర్లు నమోదు చేసుకున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధిశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కొత్తగా లక్ష 18 వేల మంది యువ ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈసారి ఎన్నికల్లో వారే కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. రాష్ట్రం కరువు కోరల్లో చిక్కుకొని విలవిల్లాడు తోంది. 21 జిల్లాలు, 93 తహశీళ్లు గతేడాది కరువుబారిన పడ్డాయి. 11 లక్షల మంది రైతులపై దీని ప్రభావం పడింది. గిట్టుబాటు ధర లేక చాలా మంది పొట్టచేత పట్టుకొని పట్టణాలకు వలస వెళ్లిపోతున్నారు. గత మూడేళ్లలో 1,500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇవన్నీ ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశాలున్నాయి. -
మేము ఓడిపోయే అవకాశాలే ఎక్కువ!
సాక్షి, న్యూఢిల్లీ : ‘రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తాం, మధ్యప్రదేశ్లో అటూ ఇటుగా ఉంది. ఇప్పుడే చెప్పలేం, ఛత్తీస్గఢ్లో ఓడిపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి’ పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని కేంద్రంలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు చెబుతున్న మాటలివి. ఛత్తీస్గఢ్లో క్షేత్ర స్థాయి పరిస్థితులను పరిశీలిస్తే కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఛత్తీస్గఢ్లో ముఖ్యమంత్రి రమణ్ సింగ్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 ఏళ్లు అవుతున్నందున ఆయన ప్రభుత్వం పట్ల ప్రజలకు ఉండాల్సినంత వ్యతిరేకత ఉంది. ముఖ్యమంత్రిగా రమణ్ సింగ్ పట్ల మాత్రం ప్రజల్లో వ్యతిరేకత లేకపోవడం విశేషం. ఆయన మంత్రుల పట్ల, ఎక్కువ మంది శాసనసభ్యుల పట్ల ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ విషయాన్ని గ్రహించడం వల్లనే పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో 50 శాతం కొత్తవారికి సీట్లు ఇస్తామని ప్రకటించారు. అంటే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న, ప్రజలు వ్యతిరేకిస్తున్న సిట్టింగ్ సభ్యులకు టిక్కెట్లు రావన్న మాటే. ఆదివాసీల బలమైన నాయకుడు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రామ్ దయాళ్కు గాలం వేసి అక్టోబర్ 13వ తేదీనే బీజేపీ లాక్కుంది. ఎన్నికల నాటికి ఆయన అనుచర నాయకులు మరికొంత మంది వచ్చి బీజేపీలో చేరే అవకాశం ఉంది. అటు కేంద్రంలో, ఇటు పార్టీలోను అధికారంలో ఉన్న బీజేపీకి అపార పార్టీ నిధులు ఉన్నాయి. ఆ నిధులతోని గతంలోలాగా ఈసారి కూడా కాంగ్రెస్ అభ్యర్థులను కొనేందుకు వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. గత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అంతాగఢ్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన దాఖలు చేసిన మంతురామ్ తర్వాత బీజేపీలో చేరిపోవడం తెల్సిందే. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మధ్యప్రదేశ్ భిండ్ లోక్సభ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా భగీరథ్ ప్రసాద్ను ప్రకటించాక ఆయన్ని బీజేపీ లాక్కుంది. ఆదివాసీల్లో, దళితుల్లో ఎంతో ఆదరణ కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఆదివాసీల నాయకుడు రమణ్ సింగ్ బీజేపీలో చేరడం పెద్ద దెబ్బకాగా, కాంగ్రెస్ వినాశనమే తన లక్ష్యమని చెప్పుకుంటున్న అజిత్ జోగి పార్టీ ఈసారి మాయావతి నాయకత్వంలోని బీఎస్పీతో చేతులు కలిపి చత్తీస్గఢ్లో పోటీ చేయడం కాంగ్రెస్ పార్టీకి మరో దెబ్బ. కాంగ్రెస్ పార్టీకి, పాలకపక్ష బీజేపీకి కేవలం 0.7 శాతం ఓట్లు మాత్రమే తేడా ఉన్న నేపథ్యంతో మూడో పార్టీ పోటీకి రావడం అన్నది బీజేపీకే ఇక్కడ కలసి వచ్చే అవకాశం. బలహీనమైన నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి ఛత్తీస్గఢ్లో బలమైన నాయకత్వం లేకుండా పోయింది. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు భూపేశ్ భగేల్కు వ్యతిరేకంగా ఇటీవలనే ఆడియో స్టింగ్ ఆపరేషణ్ ఒకటి వెలుగులోకి వచ్చింది. అందులో ఆయన టక్కెట్ల కోసం డబ్బులు డిమాండ్ చేసినట్లు ఉంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్రం నుంచి పోటీచేసే అభ్యర్థుల జాబితాను పరిశీలించేందుకు ఐదుగురు సీనియర్లతో ఓ కమిటీని వేశారు. రాష్ట్ర మంత్రి రాజేష్ మునత్కు వ్యతిరేకంగా బ్యూఫిల్మ్ సీడీని విడుదల చేసిందీ భూపేశ్ అని తేలడం, అందులో ఉన్నది తాను కాదని, మార్ఫింగ్ చేశారని ఆరోపిస్తూ సదరు మంత్రి కేసు పెట్టడంతో భూపేశ్ గత సెప్టెంబర్ నెలలోనే అరెస్టయ్యారు. కేసు విచారణ కొనసాగుతోంది. ప్రచారంలోనూ వెరీ పూర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలోనూ మరీ పూర్గా ఉంది. రమణ్ సింగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దుమ్మెత్తి పోయాల్సిన కాంగ్రెస్ పార్టీ, కొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా మాత్రమే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. పైగా రమణ్ సింగ్ను ఎవరు కూడా పల్లెత్తుమాట అనడం లేదు. అందుకు కారణం రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆయన ద్వారా ఏదో విధంగా లబ్ధి పొందడటమే. రమణ్ సింగ్ ప్రభుత్వాన్ని విమర్శించాలంటే చాలా అంశాలే ఉన్నాయని, ముఖ్యంగా రాష్ట్రంలోని అతివిలువైన జాతీయ వనరులను ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేయడం, కొత్త రాజధాని నిర్మాణం పేరిట నిధులను విచ్చలవిడిగా ఖర్చు పెట్టడమని సామాజిక కార్యకర్త విక్రమ్ సింఘాల్ తెలిపారు. పైగా కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ఎలాంటి పంచ్ లేకుండా చప్పగా సాగుతుంటే, బీజేపీ ప్రచారం దూకుడుగా సాగుతోందని ఆయన తెలిపారు. ఏ రకంగా చూసినప్పటికీ ఈసారి కూడా కాంగ్రెస్కు అక్కడ ఓటమి తప్పేట్లు లేదు. -
‘మా నాన్న ఎన్నికల్లో పోటీ చేయరు’
రాయ్పూర్: మాజీ ముఖ్యమంత్రి, ఛత్తీస్గఢ్ జనతా కాంగ్రెస్ (జేసీసీ) నాయకుడు అజిత్ జోగి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఈ విషయాన్ని ఆయన తనయుడు అమిత్ జోగి వెల్లడించారు. మహాకూటమి అభ్యర్థుల ప్రచారంపైనే ఆయన దృష్టి కేంద్రీకరిస్తారని తెలిపారు. బహుజన సమాజ్వాదీ పార్టీ, సీపీఐతో కలిసి జేసీసీ మహాకూటమి ఏర్పాటు చేసిందన్నారు. ‘ఆయన (అజిత్ జోగి) రాష్ట్రమంతా ప్రచారం చేయడంపైనే దృష్టి పెడతారు. మహాకూటమి అభ్యర్థులందరి తరపున ప్రచారం సాగిస్తారు. ఎన్నికల్లో ఆయన పోటీ చేయరు. పార్టీ ప్రచారాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే మా లక్ష్యమ’ని అమిత్ జోగి చెప్పారు. (చదవండి: మాయావతి నిర్ణయం రాహుల్కు దెబ్బే!) జేసీసీతో కలిసి పోటీ చేయనున్నట్టు సెప్టెంబర్ 20న బహుజన సమాజ్వాదీ పార్టీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. మొత్తం 90 స్థానాల్లో జేసీసీ 55, బీఎస్పీ 35 చోట్ల పోటీ చేస్తాయని మాయావతి తెలిపారు. జేసీసీ 45 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయాల్సివుంది. గత ఆదివారం సీపీఐ కూడా చేరడంతో కొంతా, దంతెవాడ స్థానాలను ఆ పార్టీకి ఇవ్వనున్నట్టు అజిత్ జోగి ప్రకటించారు. బస్తర్ ప్రాంతంలో ఈ నెల 20 నుంచి 24 వరకు ఆయన ఎన్నికల ప్రచారం సాగించనున్నారు. -
కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు సిద్ధూ, అజహర్
రాయ్పూర్: రాజకీయ నేతలుగా మారిన మాజీ క్రికెటర్లు నవజ్యోత్ సింగ్ సిద్ధూ, మహ్మద్ అజహరుద్దీన్లు ఛత్తీస్గఢ్ తొలిదశ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచార బరిలోకి దిగనున్నారు. తొలిదశ ఎన్నికల కోసం 40 మంది స్టార్ క్యాంపెయినర్లను కాంగ్రెస్ బుధవారం ప్రకటించింది. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, యూపీఏ చైర్పర్సన్ సోనియా, మాజీ ప్రధాని మన్మోహన్, ఇతర సీనియర్ కాంగ్రెస్ నేతలు అశోక్ గెహ్లాట్, సుశీల్ కుమార్ షిండే, పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, గులాం నబీ ఆజాద్, రాజ్ బబ్బర్, జ్యోతిరాదిత్య సింధియా తదితరులున్నారని ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ నేత ఒకరు చెప్పారు. ఛత్తీస్గఢ్లో మొత్తం 90 సీట్లుండగా, గత 15 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రతిపక్షానికే పరిమితమైంది.