Sonia Gandhi
-
రాష్ట్రపతిపై అనుచిత వ్యాఖ్యలు.. సోనియా గాంధీపై కేసు నమోదు
పట్నా: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మరోమారు చిక్కుల్లో పడ్డారు. ఆమె రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ‘పేద మహిళ’(Poor Lady) అని అభివర్ణించినందుకు బీహార్లోని ముజఫర్పూర్లో ఆమెపై పోలీసు కేసు నమోదైంది. సుధీర్ ఓజా అనే న్యాయవాది సీజీఎం కోర్టులో ఈ ఫిర్యాదు దాఖలు చేశారు. దీనిని కోర్టు స్వీకరించగా, ఈ కేసు ఫిబ్రవరి 10న విచారణకు రానుంది.ఈ కేసులో లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi), కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాలను కూడా సహ నిందితులుగా పిటిషనర్ పేర్కొన్నారు. వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోనియా గాంధీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అవమానించడానికి ప్రయత్నించారని పిటిషనర్ సుధీర్ పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగం అనంతరం సోనియా గాంధీ రాష్ట్రపతిపై చేసిన వ్యాఖ్య చాలా అభ్యంతరకరంగా ఉంది. రాష్ట్రపతి ఒక మహిళ అని, గిరిజన సమాజం నుండి వచ్చారని, ఆమెపై ఈ వ్యాఖ్య అభ్యంతరకరమని ఓజా పేర్కొన్నారు.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) ప్రసంగం తర్వాత సోనియా గాంధీ పాత్రికేయులతో మాట్లాడుతూ ‘చివరికి ఆ పేద మహిళ అలసిపోయింది’ అని అన్నారు. అదే సమయంలో రాహుల్ గాంధీ రాష్ట్రపతి ప్రసంగాన్ని బోరింగ్గా అభివర్ణించారు. కాగా సోనియా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. సోనియా వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. ఇది దురదృష్టకర, అవమానకర వ్యాఖ్య అని రాష్ట్రపతి భవన్ పేర్కొంది. సోనియా గాంధీ వ్యాఖ్యపై ప్రధాని మోదీ(Prime Minister Modi) మాట్లాడుతూ నేడు దేశం మరోసారి కాంగ్రెస్ రాజకుటుంబ అహంకారాన్ని చవిచూసిందని అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు. అభివృద్ధి చెందిన భారతదేశం సాధించిన విజయాలు, దార్శనికత గురించి ఆమె దేశ ప్రజలకు తెలియజేశారు. హిందీ ఆమె మాతృభాష కాదు, అయినప్పటికీ ఆమె చాలా చక్కగా మాట్లాడారు. కానీ కాంగ్రెస్ రాజకుటుంబం ఆమెను అవమానించడం ప్రారంభించింది. ఇది దేశంలోని గిరిజన సోదరసోదరీమణులకు అవమానకరం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: కుంభమేళా మోనాలిసా.. మరో వీడియో వైరల్ -
సోనియా వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం
ఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ (Union Budget 2025-26) సమావేశంలో తొలిరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (droupadi murmu) చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ ఎంపీ సోనియా గాంధీ (sonia gandhi) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అన్నీ తప్పుడు హామీలే ఇచార్చు. పైగా రాష్ట్రపతి ముర్ము తన ప్రసంగంలో బాగా అలసి పోయారు. పూర్ థింగ్’ అంటూ కామెంట్స్ చేశారు. అయితే, సోనియా గాంధీ వ్యాఖ్యలపై రాష్ట్రపతి కార్యాలయం ధీటుగా బదులిచ్చింది. సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యంగా లేవని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఓ లేఖను విడుదల చేసింది.ఆ లేఖలో .. సోనియా గాంధీ వ్యాఖ్యలో ఆమోదయోగ్యంగా లేవు. ఉన్నత పదవి గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యానించారు. సోనియా గాంధీ తన మాటల్లో రాష్ట్రపతి అలసి పోయారని,చాలా కష్టంగా మాట్లాడారని అన్నారు. ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని అనుకున్నాం. #WATCH | Delhi | After the President's address to the Parliament, Congress MP Sonia Gandhi says,"...The President was getting very tired by the end...She could hardly speak, poor thing..." pic.twitter.com/o6cwoeYFdE— ANI (@ANI) January 31, 2025రాష్ట్రపతి ఏ సమయంలోనూ అలసిపోలేదు. ఎప్పటికి అలసిపోరు. బడ్జెట్ ప్రసంగంలో నిజానికి, అట్టడుగు వర్గాల కోసం, మహిళలు, రైతుల గురించి చాలా చక్కగా మాట్లాడారు. ఆమె ప్రసంగాన్ని నాయకులు (సోనియాగాంధీని ఉద్దేశిస్తూ) హిందీ వంటి భారతీయ భాషలలోని యాస, ఉపన్యాసాలపై పరిచయం లేని కారణంగా రాష్ట్రపతి ప్రసంగంపై తప్పుడు అభిప్రాయాన్ని ఏర్పడి ఉండొచ్చని రాష్ట్రపతి కార్యాలయం విశ్వసిస్తోంది. సోనియా గాంధీ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. ఖండించదగినవి’ అని పేర్కొంది. 👉చదవండి : రాష్ట్రపతిపై సోనియా వివాదాస్పద వ్యాఖ్యలు -
రాష్ట్రపతిపై సోనియా వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ:రాష్ట్రపతి ద్రౌపదిముర్ముపై సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బడ్జెట్ సమావేశాల తొలిరోజు రాష్ట్రపతి ప్రసంగం అనంతరం సోనియా,రాహుల్ పార్లమెంట్ ఆవరణలోకి వచ్చారు. అయితే ఇక్కడ రాహుల్గాంధీ మాత్రమే మీడియాతో మాట్లాడారు.రాష్ట్రపతి ప్రసంగం బోరింగ్గా ఉందని రాహుల్ అన్నారు. దీనికి సోనియా కల్పించుకుని ‘అన్నీ తప్పుడు హామీలే. రాష్ట్రపతి చివర్లో బాగా అలసిపోయారు. ఆమె అసలు మాట్లాడలేకపోయారు. పూర్ థింగ్’ అని అన్నారు. ఈ మాటలకు తల ఊపిన రాహుల్ రాష్ట్రపతి చెప్పిన విషయాన్నే మళ్లీ మళ్లీ చెప్పారన్నారు. రాష్ట్రపతినుద్దేశించి మీడియాతో సోనియాగాంధీ నేరుగా మాట్లాడకపోయినప్పటికీ బీజేపీ మాత్రం ఆమెపై విమర్శల దాడికి దిగింది. ‘సోనియాగాంధీ వెంటనే రాష్ట్రపతికి క్షమాపణలు చెప్పాలి. ఆమె మాటలు కాంగ్రెస్ పార్టీ గిరిజన,పేదల వ్యతిరేక వైఖరిని తెలియజేస్తోంది’అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా ఎక్స్(ట్విటర్)లో డిమాండ్ చేశారు.సోనియా వ్యాఖ్యలు రాష్ట్రపతి గౌరవాన్ని తగ్గిస్తున్నాయని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు.కాగా, బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా శుక్రవారం(జనవరి31) పార్లమెంట్ ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. ఎన్డీఏ మూడో టర్ములో పనులు గతం కంటే మూడు రెట్ల వేగంతో జరుగుతున్నాయన్నారు. వక్ఫ్ బిల్లు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంశాల్లో పురోగతే ఇందుకు నిదర్శనమన్నారు. -
ఢిల్లీలో ఏఐసీసీ కొత్త కేంద్ర కార్యాలయం ప్రారంభం
-
జెండాకు నమస్కరించని వారు దేశం గురించి మాట్లాడతారా?: రాహుల్ గాంధీ
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నూతన కాంగ్రెస్(congress Office) పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభమైంది. పార్టీ కార్యాలయ భవనాన్ని కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ సోనియాగాంధీ ప్రారంభించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge) పార్టీ జెండా ఎగురవేశారు. ఆరు అంతస్తుల్లో అత్యాధునిక సౌకర్యాలతో కొత్త భవనం నిర్మించారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. ఇక, కొత్త భవనానికి ‘ఇందిరాగాంధీ భవన్’ అని పేరు పెట్టారు.ఈ సందర్బంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(rahul Gandhi) మాట్లాడుతూ.. దేశాన్ని విచ్చిన్నం చేసే వారిని ఆపగలిగేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. జాతీయ జెండాకు నమస్కరించరని వారు దేశం గురించి మాట్లాడుతున్నారు. స్వాతంత్ర్య పోరాటాన్ని కించపరిచే విధంగా మోహన్ భగవత్ వ్యాఖ్యలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతో పోరాడుతూనే ఉంటాం. బ్రిటీష్ వారితో పోరాడిన యోధులను అవమానించేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ భవనం ప్రతీ కార్యకర్తకు చెందుతుంది. దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపై ఉపయోగిస్తున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయి అంటూ కామెంట్స్ చేశారు.#WATCH | Delhi: Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says "The Constitution was essentially attacked yesterday by Mohan Bhagwat when he said that the Constitution was not the symbol of our freedom, but also after that, thousands of our workers died in Punjab, Kashmir,… pic.twitter.com/ghK13PDOk2— ANI (@ANI) January 15, 2025ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అక్బర్ రోడ్డు 24వ నంబర్ భవనంలో ఏఐసీసీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ బంగ్లాల్లో పార్టీ కార్యాలయాలు ఉండకూడదని గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగానే పార్టీలు సొంత భవనాలు నిర్మించుకున్నాయి. ఐదు దశాబ్దాలుగా అక్బర్ రోడ్డులోనే కాంగ్రెస్ కార్యకలాపాలు నిర్వహించింది. 1978 నుంచి ఇది ఏఐసీసీ కేంద్ర కార్యాలయంగా ఉంది.9A కోట్లా రోడ్డులో 6 అంతస్తుల్లో అత్యాధునిక సౌకర్యాలతో కాంగ్రెస్ నూతన కార్యాలయాన్ని నిర్మించారు. కోట్లా మార్గ్కు ఏఐసీసీ కార్యాలయాన్ని తరలించినా.. అక్బర్ రోడ్డు నుంచి కూడా కార్యకలాపాలు ఉంటాయని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. 2008లో దీన్దయాళ్ ఉపాధ్యాయ మార్గ్లో కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ప్రభుత్వం స్థలం కేటాయించింది. అనంతరం దీన్దయాళ్ ఉపాధ్యాయ మార్గ్ నుంచి కోట్లా మార్గ్ వైపు ప్రవేశాన్ని మార్చుకున్నారు. 2009లో కేంద్ర కార్యాలయం నిర్మాణం మొదలు పెట్టారు. 15 ఏళ్ల పాటు ఇందిరాగాంధీ భవన్ నిర్మాణం సాగింది.#WATCH | Congress MP Sonia Gandhi inaugurates 'Indira Bhawan', the new headquarters of the party in Delhi Congress president Mallikarjun Kharge, MP Rahul Gandhi and other prominent leaders of the party also present pic.twitter.com/9X7XXNYEOn— ANI (@ANI) January 15, 2025 -
New Delhi: కాంగ్రెస్కు కొత్త కార్యాలయం.. నేడు ప్రారంభించనున్న సోనియా
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం చిరునామా మారింది. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నేడు (జనవరి 15) పార్టీ కొత్త ప్రధాన కార్యాలయం 'ఇందిరా భవన్'ను ప్రారంభించనున్నారు. గత ఐదు దశాబ్దాలుగా పార్టీ ప్రధాన కార్యాలయం ఢిల్లీలోని 24, అక్బర్ రోడ్లో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ కొత్త ప్రధాన కార్యాలయం పేరు ‘ఇందిరా భవన్’.. ఇది 9-ఎ కోట్ల రోడ్డులో ఏర్పాటయ్యింది. నేటి ఉదయం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు నేతలు పాల్గొననున్నారు. VIDEO | Delhi: Congress MP Priyanka Gandhi (@priyankagandhi) leaves after inspecting Congress' new headquarters - Indira Gandhi Bhawan - in Delhi, ahead of its inauguration on Wednesday. (Full video available on PTI Videos- https://t.co/dv5TRAShcC)#Delhi pic.twitter.com/TLp1zjg7Nf— Press Trust of India (@PTI_News) January 14, 2025మీడియాకు అందిన వివరాల ప్రకారం ఈ నూతన కార్యాలయ నిర్మాణం ప్రియాంక గాంధీ సారధ్యంలో కొనసాగింది. కార్యాలయ మ్యాప్ను ఖరారు చేయడం మొదలుకొని పెయింటింగ్, చిత్రాలు, కర్టెన్లు, ఫర్నిచర్ వరకు ప్రియాంక స్వయంగా అన్నింటినీ పర్యవేక్షించారు. ఈ కొత్త కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలు పాత ఛాయాచిత్రాలను ఏర్పాటు చేశారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసీ వేణుగోపాల్ మంగళవారం ట్విట్టర్లో ఇలా పోస్ట్ చేశారు.. ‘2025, జనవరి 15న ఉదయం 10 గంటలకు, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సమక్షంలో కొత్త ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ‘ఇందిరా గాంధీ గాంధీ భవన్’ను ప్రారంభించనున్నారు’ అని తెలిపారు.It is time for us to move ahead with the times and embrace the new!On 15 January, 2025 at 10am, in the esteemed presence of INC President Sh. Mallikarjun @kharge ji and LOP Sh. @RahulGandhi ji, Hon’ble CPP Chairperson Smt. Sonia Gandhi ji will inaugurate the new AICC…— K C Venugopal (@kcvenugopalmp) January 7, 2025కాంగ్రెస్ నూతన కేంద్ర కార్యాలయం ‘ఇందిరా గాంధీ భవన్’ పార్టీలో పెరుగుతున్న అవసరాలను తీర్చడానికి, పరిపాలనా, సంస్థాగత, వ్యూహాత్మక విధుల నిర్వహణకు అనువుగా ఆధునిక సౌకర్యాలతో రూపొందింది. 1978లో కాంగ్రెస్(ఐ) ఏర్పడినప్పటి నుండి పార్టీ ప్రధాన కార్యాలయం '24, అక్బర్ రోడ్'లో ఉంది. -
కాంగ్రెస్కు కౌంటర్.. సోనియాపై జేపీ నడ్డా విమర్శలు
ఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు స్మారకం నిర్మాణం విషయంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయం ఆసక్తికరంగా మారింది. రెండు పార్టీ నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సోనియా గాంధీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.మాజీ ప్రధాని మన్మోహన్కు స్మారకం నిర్మించడంపై కాంగ్రెస్, బీజేపీ నేతలు పరస్పర విమర్శలు చేసుకున్నారు. మన్మోహన్ను కేంద్ర ప్రభుత్వం అవమానించిందని, స్మారకం నిర్మించే ప్రాంతంలో కాకుండా నిగంబోధ్లో అంత్యక్రియలు నిర్వహించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఆరోపణలపై బీజేపీ చీఫ్ జేపీ నడ్డా స్పందిస్తూ.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై సంచలన ఆరోపణలు చేశారు.తాజాగా జేపీ నడ్డా మాట్లాడుతూ..‘మన్మోహన్ మృతితో విషాదం నెలకొన్న సమయంలోనూ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ చౌకబారు రాజకీయాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మన్మోహన్ స్మారకం కోసం స్థలాన్ని కేటాయించింది. ఆ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు కూడా తెలియజేశాం. మన్మోహన్ ప్రధానిగా ఉండగా.. సోనియా గాంధీ సూపర్ ప్రధానిగా వ్యవహరించి ప్రధాని పదవిని అవమానించారు. ఒక ఆర్డినెన్స్ను చించేయడం ద్వారా మన్మోహన్ను రాహుల్ గాంధీ కూడా అవమానించారు. అదే కాంగ్రెస్ ఇప్పుడు ఆయన మరణంపై రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.This is the way Gandhi family treated Ex PM #ManmohanSingh .. Shameful act by Sonia Gandhi .. watch pic.twitter.com/Bi8UrbNOU5— #Bagri (@Bagriml) December 27, 2024ఇదే సమయంలో పీవీ అంశంపై కూడా నడ్డా స్పందించారు. ఈ సందర్బంగా నడ్డా మాట్లాడుతూ..‘పీవీ నరసింహారావు స్మారకం నిర్మించడానికి సోనియా గాంధీ అంగీకరించలేదు. కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన పార్థివదేహాన్ని ఉంచడానికి కూడా ఆమె అనుమతించలేదు. చివరకు ఆయన అంత్యక్రియలను ఢిల్లీలోని నిర్వహించనీయలేదని ధ్వజమెత్తారు. అలాగే, 2015లో పీవీ కోసం ప్రధాని మోదీ స్మారకం ఏర్పాటు చేశారని, భారత రత్న కూడా ఇచ్చారని గుర్తు చేశారు. ప్రణబ్ ముఖర్జీ మరణించినప్పుడు కాంగ్రెస్ పార్టీ కనీసం సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేయలేదని విమర్శించారు. దీంతో, ఆయన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.Sonia Gandhi, who insulted PM Dr #ManmohanSingh ji in this manner, ever apologized till date??? Was this not an insult to the Prime Minister of India, Manmohan Singh ? pic.twitter.com/6Yj4OavpTT— Ayesha (@KashmiriAyesha1) December 27, 2024 -
ప్రముఖులతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (ఫొటోలు)
-
ఆ లేఖల్లో ఏముంది?
దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ లేఖలు మరోసారి వార్తల్లోకెక్కాయి. స్వాతంత్య్ర పోరాట సమయంలో పుంఖానుపుంఖాలుగా ఆయన రాసిన లేఖలు అనంతర కాలంలో ఎంతగానో ప్రసిద్ధికెక్కాయి. బ్రిటిషర్ల చెరలో జైలు జీవితం అనుభవిస్తూ కూతురు ఇందిరకు రాసిన లేఖలైతే సంకలనాలుగా వెలువడి ఎంతో ఆదరణ కూడా పొందాయి. జయప్రకాశ్ నారాయణ్ వంటి రాజకీయ ఉద్ధండులు మొదలుకుని భౌతికశాస్త్ర దిగ్గజం ఆల్బర్ట్ ఐన్స్టీన్ దాకా ప్రముఖులెందరితోనో నెహ్రూ జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు లోకప్రసిద్ధం. చక్కని రచనా శైలికే గాక అద్భుతమైన అభివ్యక్తికి వాటిని నిలువెత్తు నిదర్శనంగా చెబుతుంటారు. నెహ్రూ తదనంతరం ఆయన లేఖలన్నింటినీ ప్రధానమంత్రి మ్యూజియం, లైబ్రరీ (పీఎంఎంఎల్)లో భద్రపరిచారు. అయితే యూపీఏ హయాంలో 2008లో కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాంధీ వాటన్నింటినీ తన నివాసానికి తరలించిన వైనం ఇప్పుడు రాజకీయ రగడకు దారితీస్తోంది. నెహ్రూ లేఖలతో కూడిన ఏకంగా 51 పెట్టెలను తన సోనియా తరలించుకుని వెళ్లారని బీజేపీ ఆరోపిస్తోంది. వాటన్నింటినీ తిరిగివ్వాల్సిందిగా పీఎంఎంఎల్ తాజాగా సోనియాను కోరింది. కనీసం జిరాక్సులో, పీడీఎఫ్లో అయినా అందజేస్తే భద్రపరుస్తామంటూ విజ్ఞప్తి చేసింది. దాంతో, ‘‘అసలు నెహ్రూ లేఖలను సోనియా పనిగట్టుకుని తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచి్చంది? అందుకెవరు అనుమతించారు? 16 ఏళ్లుగా తన వద్దే ఎందుకు ఉంచుకున్నారు? ఎందుకు తిరిగివ్వడం లేదు? అంతగా దాచాల్సిన అంశాలు ఆ లేఖల్లో ఏమున్నాయి?’’ వంటి అనేకానేక ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. వీటికి సమాధానంగా అన్ని వేళ్లూ నెహ్రూ–ఎడ్వినా లేఖలవైపే చూపిస్తుండటం విశేషం. ఎడ్వినా నాటి వైస్రాయ్ లార్డ్ మౌంట్బాటెన్ భార్య. ఆమెకు, నెహ్రూకు మధ్య చాలా సాన్నిహిత్యం ఉందంటారు. ‘‘నిజానికిది బహిరంగ రహస్యమే. అప్పట్లో రాజకీయ వర్గాల్లో నిత్యం అందరి నోళ్లలోనూ నానిన అంశం కూడా’’ అని చరిత్రకారులు కూడా చెబుతారు. ‘‘నెహ్రూ, ఎడ్వినా సాన్నిహిత్యానికి వారి నడుమ సాగిన లేఖలు అద్దం పట్టాయి. దాంతో అవి వెలుగు చూడకూడదని సోనియా భావించారు. అందుకే వాటితో పాటు అన్ని లేఖలనూ పీఎంఎంఎల్ నుంచి తరలించుకుపోయారు’’ అని బీజేపీ ఆరోపిస్తోంది. ‘గాం«దీ–నెహ్రూ కుటుంబం’ అంటూ ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ అవకాశం దొరికినప్పుడల్లా పదునైన విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ లేఖల రగడ ఎంత దూరం వెళ్తుందన్నది ఆసక్తికరంగా మారింది. సోనియా తరలించుకుపోయిన నెహ్రూ లేఖలన్నింటినీ తిరిగి ఇప్పించాలంటూ ఆమె కుమారుడు, విపక్ష నేత రాహుల్గాం«దీకి పీఎంఎంల్ సభ్యుడు, చరిత్రకారుడు రిజ్వాన్ కాద్రీ డిసెంబర్ 10న లేఖ రాశారు. ‘‘అవన్నీ ఎడ్వినా, ఐన్స్టీన్, జేపీ, పద్మజా నాయుడు, విజయలక్ష్మీ పండిట్, అరుణా అసఫ్ అలీ, బాబూ జగ్జీవన్రాం, జేబీ పంత్ తదితరులకు నెహ్రూ జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు. 1971లో ఇందిర వాటిని పీఎంఎంల్ (అప్పట్లో నెహ్రూ మ్యూజియం)కు అప్పగించారు. అవి పీఎంఎంల్లో ఉంటే స్కాలర్లకు, పరిశోధకులకు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుంది’’ అని పేర్కొన్నారు. దాంతో నెహ్రూతో ఎడ్వినా సాన్నిహిత్యం ఆయన మరణించిన 80 ఏళ్ల తర్వాత మరోసారి తెరపైకి వచ్చింది. మిగతా లేఖల సంగతి ఎలా ఉన్నా గత చరిత్ర, బీజేపీ ఆరోపణల పుణ్యమా అని నెహ్రూ–ఎడ్వినా లేఖలపైనే అందరికీ ఆసక్తి నెలకొంది. ‘‘వాటిలో అంత గోప్యంగా ఉంచాల్సిన అంశాలేమున్నాయి? ఎందుకు వాటిని సోనియా తన ఇంట్లో దాచిపెట్టుకున్నారు? ఆమె బదులిచ్చి తీరాలి’’ అంటూ బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ డిమాండ్ చేయడం విశేషం. పార్టీ మరో అధికార ప్రతినిధి సంబిత పాత్ర కూడా సోమవారం ఏకంగా లోక్సభలోనే ఈ అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై సరైన చర్యలు తీసుకుంటామంటూ కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ బదులివ్వడం విశేషం. అనంతరం పాత్ర మీడియాతో కూడా దీనిపై మాట్లాడారు. ‘‘నెహ్రూ లేఖలు గాంధీ కుటుంబపు వ్యక్తిగత ఆస్తి కాదు. దేశ సంపద. వాటిని బయట పెట్టడానికి గాంధీ కుటుంబం వెనకాడుతుండటం ఎన్నో సందేహాలకు తావిస్తోంది. సరిగ్గా పీఎంఎంల్లోని లేఖల డిజిటైజేషన్ ప్రక్రియ మొదలు పెట్టే ముందే నెహ్రూ లేఖలను సోనియా తీసుకెళ్లారు. వాళ్లేం దాస్తున్నారో తెలుసుకోవాలని దేశం భావిస్తోంది’’ అన్నారు. ‘గాఢమైన’ బంధం నెహ్రూ, ఎడ్వినా మధ్య నడిచిన లేఖలు ఇప్పుడు ఎవరికీ అందుబాటులో లేవు. అయితే ఎడ్వినా కూతురు పమేలా హిక్స్ తదితరులు వాటికి సంబంధించిన పలు విశేషాలను గతంలో పంచుకున్నారు. నెహ్రూ, ఎడ్వినా మధ్య ‘అత్యంత గాఢమైన’ బంధం కొనసాగిందని పమేలా తన పుస్తకంలో స్పష్టంగా పేర్కొనడం విశేషం! ‘‘నా తల్లి, నెహ్రూ పరస్పరం ఎంతగానో ప్రేమించుకున్నారు. ఒకరంటే ఒకరికి చెప్పలేనంత గౌరవాభిమానాలుండేవి. దీన్ని నేను ఎన్నోసార్లు గమనించాను. మా అమ్మ తానెంతగానో తపించిన ఆదర్శ సాహచర్యాన్ని పండిట్జీ (నెహ్రూ) రూపంలో పొందింది. అయితే వారిద్దరి మధ్య శారీరక బంధానికి అంతగా అవకాశం లేకపోయింది. నిత్యం తమను చుట్టుముట్టి ఉండే సిబ్బంది తదితరుల వల్ల ఏకాంతం దొరకడం గగనంగా ఉండేది. ఎడ్విన్ భారత్ వీడేముందు నెహ్రూకు ఓ ఉంగరమివ్వాలని భావించారు. తీసుకుంటారో లేదోనని చివరికి ఆయన కుమార్తె ఇందిరకు ఇచ్చి వెళ్లారు’’ అని పమేలా చెప్పుకొచ్చారు. నెహ్రూ తన వీడ్కోలు ప్రసంగంలోనూ ఎడ్వినాను ఆకాశానికెత్తిన వైనాన్నీ ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రాహుల్ గాంధీకి ప్రధాని మ్యూజియం లేఖ
న్యూఢిల్లీ: దేశ తొలి ప్రధాని జవహార్లాల్ నెహ్రూ రాసిన లేఖలను, మరికొన్ని పత్రాలను వెనక్కి ఇచ్చేయాలంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని, ప్రధానమంత్రి సంగ్రహాలయం కోరింది. సోనియా గాంధీ వాటిని తీసుకెళ్లారని.. వాటిని తిరిగి ఇచ్చేయాలంటూ మ్యూజియం సభ్యుడొకరు ఆయనకు లేఖ రాశారు.2008 యూపీఏ పాలనలో.. అప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ అప్పటి పీఎంఎంఎల్(Prime Ministers' Museum and Library) డైరెక్టర్ అనుమతితో ఆ పత్రాలన్నింటిని తీసకెళ్లారు. అయితే వాటిని ఇప్పుడు వెనక్కి ఇవ్వాలంటూ పీఎంఎంఎల్ సభ్యుడు రిజ్వాన్ ఖాద్రి, రాహుల్కు లేఖ రాశారు. ఒకవేళ ఒరిజినల్ లేఖలు ఇవ్వడం ఇష్టంలేని తరుణంలో ఫొటోకాపీలు లేదంటే డిజిటల్ కాపీలైనా ఇవ్వాలని కోరారు.అయితే ఈ పత్రాల గురించి నెహ్రూ కుటుంబాన్ని కోరడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని మ్యూజియం వార్షిక సమావేశం జరిగింది. అందులో.. నెహ్రూ సంబంధిత లేఖలు, ఇతరత్రా పేపర్లు కనిపించకుండా పోవడంపై చర్చ జరిగింది. చారిత్రకంగా అవి ఎంతో ప్రాధాన్యం పత్రాలుగా అభిప్రాయపడుతూ.. వాటిని ఎలాగైనా వెనక్కి రప్పించాలని పీఎంఎంఎల్ మండలి నిర్ణయించింది. ఈ విషయంలో అవసరమైతే న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని భావించింది. ఈ మేరకు.. సెప్టెంబర్లో సోనియా గాంధీని కోరుతూ ప్రధాని మ్యూజియం ఓ లేఖ రాసింది. అయితే ఆమె నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. ఇప్పుడు రాహుల్ గాంధీకి మరో లేఖ రాసింది. నెహ్రూ ప్రధానిగా ఉన్న టైంలో పలు కీలక పత్రాలు సైతం.. ఆ సేకరణలో ఉన్నట్లు పీఎంఎంల్ భావిస్తోంది. అలాగే.. ఎడ్విన్ మౌంట్బాటెన్, అల్బర్ట్ ఐన్స్టీన్, జయప్రకాశ్ నారాయణ్, పద్మజా నాయుడు, విజయలక్ష్మి పండిట్, అరుణా అసఫ్ అలీ, బాబు జగ్జీవన్ రామ్, గోవింద్ వల్లభ్ పంత్ లాంటి ప్రముఖలతో నెహ్రూకు మధ్య జరిగిన ఉత్తర-ప్రత్యుత్తరాలు ఆ కలెక్షన్స్లో ఉన్నాయి.నెహ్రూ దస్తూరితో ఉన్న ఈ లేఖలను 1971లో నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీలో(ఇప్పుడదే ప్రధానుల మ్యూజియంగా మారింది) భద్రపరిచారు. అయితే యూపీఏ హయాంలో వాటిని సుమారు 51 బాక్సుల్లో సోనియా గాంధీ నివాసానికి తరలించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. పీఎంఎంల్ మండలి కాలపరిమితి ఈ నవంబర్లోనే ముగియాల్సి ఉంది. అయితే ఆఖరి నిమిషంలో.. ఆ కాలపరిమితిని మరో రెండు నెలలు పొడిగించడం గమనార్హం.ఇదీ చదవండి: ‘తప్పులు కప్పిపుచ్చుకోవడానికే నెహ్రూ పేరు వాడుకుంటున్నారు’ -
Sanjay Gandhi Birthday: ఇందిరకు నచ్చని మేనక?.. అయినా సంజయ్తో పెళ్లెలా జరిగింది?
సంజయ్ గాంధీ.. భారత తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు. సంజయ్ గాంధీ 1946 డిసెంబరు 14న జన్మించారు. రాజీవ్ గాంధీ ఈయన సోదరుడు. సంజయ్ గాంధీ అత్యంత విచిత్ర పరిస్థితుల్లో మేనకా గాంధీని కలుసుకున్నారు. ఆ తరువాత వివాహం చేసుకున్నారు. అది 1973వ సంవత్సరం.. అప్పటికి సంజయ్ గాంధీ వయసు 27 ఏళ్లు. లండన్లో చదువు పూర్తి చేసుకుని సంజయ్ గాంధీ ఇండియాకు తిరిగివచ్చారు. అప్పటికే ఆయన ఇద్దరు యువతులతో ప్రేమ వ్యహారాలు నడిపారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. తొలుత సంజయ్ గాంధీ ఒక ముస్లిం యువతిని ప్రేమించారు. అయితే అది ఎక్కువకాలం కొనసాగలేదు. తరువాత ఆయన జర్మన్ యువతి సబీన్ వాన్ స్టీగ్లిట్జ్ ప్రేమలో పడ్డారు. ఆమె సోనియాగాంధీకి స్నేహితురాలుసోనియా స్నేహితురాలు సబీన్తో..ఆ సమయంలో సబీన్ ఢిల్లీలో టీచర్గా పనిచేసేవారు. ఆమె తరచూ రాజీవ్,సోనియాల ఇంటికి వచ్చేవారు. ఆ సమయంలో సంజయ్గాంధీ..సబిన్తో మాట్లాడేవారు. కొంతకాలం తరువాత వారిలో చిగురించిన ప్రేమను గమనించిన సోనియా వారిద్దరూ వివాహం చేసుకుంటే బాగుంటుందని భావించారట. అయితే అప్పట్లో సంజయ్ గాంధీ.. మారుతి కారు భారత్కు తీసుకురావాలనే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు. సబీనాతో పెళ్లికి అంత ప్రాథాన్యత ఇవ్వలేదు. దీంతో సబీన్ యూరప్కు వెళ్లిపోవాలని నిర్ణయించుకుని విమనాశ్రయానికి వెళ్లారు. విషయం తెలుసుకున్న సంజయ్ ఆ విమానంలోని పైలెట్తో రేడియోలో మాట్లాడి, సబీన్ను తిరిగి రమ్మని అభ్యర్థించారు. అలా ఆమె వెనక్కు వచ్చింది. అయితే తరువాతి కాలంలో సంజయ్- సబిన్ మధ్య విబేధాలు వచ్చి వారు విడిపోయారు.మోడలింగ్ రంగంలో మేనకకు అవార్డులు1973, సెప్టెంబర్ 14న సంజయ్ తన స్నేహితుని పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అతని స్నేహితుడు సంజయ్కు మేనకా ఆనంద్ అనే యువతిని పరిచయం చేశారు. ఆమె రిటైర్డ్ సిక్కు కల్నల్ కుమార్తె. మోడలింగ్ చేస్తూ, ఈ రంగంలో ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు. జర్నలిస్టు కావాలనేది ఆమె కల. అలా పరిచయమైన మేనకతో సంజయ్ ప్రేమలో పడ్డారు. ఇది సంజయ్ అన్నయ్య రాజీవ్ గాంధీ, వదిన సోనియాలకు అంతగా నచ్చలేదు. మేనక ప్రవర్తన వారికి నచ్చలేదు. కొన్నాళ్ల తరువాత సంజయ్ తన తల్లి ఇందిరకు మేనకను పరిచయం చేశాడు. ఇందిరాగాంధీని కలిసే సమయంలో మేనకా చాలా భయపడ్డారు. తొలిసారి ఇందిరను కలుసుకున్న మేనక తాను మోడల్ననే విషయాన్ని ఆమెకు చెప్పలేదు.మేనక గురించి తెలుసుకున్న ఇందిరదీనికి ముందు కూడా సంజయ్ పలువురు యువతులను ఇందిరకు పరిచయం చేశారు. మేనక కూడా ఇలాంటి స్నేహితురాలే అయివుంటుందని ఇందిరా గాంధీ తొలుత భావించారు. అయితే తరువాత సంజయ్ తన తల్లి ఇందిరను ఒప్పించి, మేనకతో తన వివాహానికి 1974, జూలై 29న నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ హడావుడిలో ఇందర.. మేనక కుటుంబం గురించి తెలుసుకోలేకపోయారు. నిశ్చితార్థ వేడుక పూర్తయ్యాక, ఇరు కుటుంబాలకు ఇందిర ఇంట్లో విందు జరిగింది. అప్పడు ఇందిర స్వయంగా మేనక కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకున్నారు.భర్తను ప్రధానిగా చూడాలనుకున్న మేనకఅప్పటికే నిశ్చితార్థం జరిగిపోవడంతో ఇందిర మరేమీ చేయలేక మౌనం వహించారు. 1974, సెప్టెంబర్ 23న సంజయ్ గాంధీ, మేనకా గాంధీల వివాహం జరిగింది. అయితే మేనక ప్రవర్తన సోనియాకు నచ్చేది కాదని వినికిడి. ఏదో ఒకరోజు తన భర్త సంజయ్ ప్రధాని అవుతారని మేనక అందరికీ చెబుతుండేవారట. సంజయ్, మేనకలకు 1980లో వరుణ్గాంధీ జన్మించాడు. ఇది జరిగిన మూడు నెలలకు 1980 జూన్లో సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మరణించారు. రెండేళ్ల తరువాత ఇందిరాగాంధీ ఇంటి నుంచి మేనకా గాంధీ తన కుమారుడు వరుణ్ గాంధీని తీసుకుని మరో ఇంటికి వెళ్లిపోయారు. ఆ సమయంలో సోనియా, మేనకల మధ్య సత్సంబంధాలు లేవని చెబుతుంటారు.ఇది కూడా చదవండి: Year Ender 2024: ‘జెన్ జెడ్’.. ఎందుకంత భిన్నం? ఏ తరం వారు ఏం చేస్తున్నారు? -
Sharad Pawar Birthday: సోనియా.. శరద్ పవార్ వైరం వెనుక..
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత శరద్ పవార్ నేటితో (2024 డిసెంబర్ 12) 84 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. శరద్ పవార్ 1940, డిసెంబర్ 12న జన్మించారు. ఆయన తన రాజీకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. అయితే కాంగ్రెస్ను వీడి సొంతంగా పార్టీ వ్యవస్థాపించడం ఆయన జీవితంలో మైలురాయిగా నిలుస్తుంది. ‘శరద్ పవార్: అపనీ షర్తోం పర్’ అనే పుస్తకంలో ఆయన జీవితానికి సంబంధించిన పలు అంశాలు కనిపిస్తాయి. నాడు 12వ లోక్సభ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ ఫ్రంట్లో గందరగోళం ఏర్పడిందని ప్రముఖ రచయిత రాజ్కమల్ ప్రకాశన్ ‘శరద్ పవార్: అపనీ షర్తోం పర్’ అనే తన పుస్తకంలో ప్రస్తావించారు. ఆ పుస్తకంలోని వివరాల ప్రకారం.. అప్పటికేప్పటికే పవార్, సోనియా గాంధీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో ఆమె కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, పవార్ లోక్సభలో పార్టీ నేతగా ఉన్నారు. పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు కోసం పవార్ స్వయంగా సోనియా గాంధీతో చర్చించి, ఆమె ఆమోదం తీసుకున్నారు. జాబితాను లోక్సభ స్పీకర్కు పంపారు. మర్నాడు నాటి స్పీకర్ జిఎంసీ బాలయోగి.. పవార్కు ఫోన్ చేసి.. ‘నాకు ఇప్పుడొక సమస్య ఏర్పడింది. మీ పార్టీ నుంచి నాకు రెండు జాబితాలు అందాయి. కాంగ్రెస్ చీఫ్ డైరెక్టర్ పీజే కురియన్ నాకు మరో జాబితా పంపారు. ఈ రెండు జాబితాల్లోనూ పేర్లు వేర్వేరుగా ఉన్నాయి’ అని అన్నారు.లోక్సభలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకునిగా ఉన్నందున, కమిటీ సభ్యుల జాబితాను స్పీకర్కు సమర్పించడంపై శరద్ పవార్కు హక్కు ఉంది. అయితే దీనిని అతిక్రమిస్తూ మరో జాబితా విడుదలైంది. రెండో జాబితా ఫోటోకాపీ అందిన తర్వాత పవార్ వివరాలు తెలుసుకునేందుకు కురియన్ను సంప్రదించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలి సూచనల మేరకే రెండో జాబితాను సిద్ధం చేసినట్లు వారి మాటల్లో వెల్లడైంది. వెంటనే పవార్ స్వయంగా సోనియాను కలిశారు. సోనియాతో మీరు రూపొందించిన జాబితాను ఉపసంహరించుకోవాలని పవార్ను కోరారు.1999 మే 15న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపునిచ్చినట్లు ఆ పుస్తకంలో పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆమె విదేశీయురాలనే అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ సమావేశంలో అర్జున్ సింగ్, ఏకే ఆంటోనీ, గులామ్నబీ ఆజాద్, అంబికా సోనీ తదితరులు సోనియాపట్ల తమ విధేయతను ప్రకటించారు. అయితే పీఏ సంగ్మా ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. సంగ్మాకు శరద్ పవార్, తారిఖ్ అన్వర్ మద్దతు పలికారు. కొద్దిరోజుల తరువాత పార్టీ ఈ ముగ్గురినీ పార్టీ నుంచి ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసింది. అనంతరం ఈ ముగ్గురూ మరికొందరు నేతల సహాయంతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ని స్థాపించారు.ఇది కూడా చదవండి: బోరుబావి ప్రమాదాలకు అంతం లేదా? నాలుగేళ్లలో 281 మంది చిన్నారులు మృతి -
పార్లమెంటులో ‘సోరోస్’
న్యూఢిల్లీ: దేశ వ్యతిరేక కార్యలాపాల ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్జ్ సోరోస్ ఫౌండేషన్తో కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాంధీ సంబంధాల వ్యవహారం సోమవారం పార్లమెంటును కుదిపేసింది. దీనిపై ప్రభుత్వ, ప్రతిపక్షాల ఆందోళనలు, పరస్పర ఆరోపణ, విమర్శలతో ఉభయ సభలూ అట్టుడికాయి. సోరోస్ ఫౌండేషన్ నిధులతో నడుస్తున్న ఫోరం ఆఫ్ డెమొక్రాటిక్ లీడర్స్ ఆసియా పసిఫిక్ (ఎఫ్డీఎల్–ఏపీ) అనే సంస్థకు సోనియా కో ప్రెసిడెంట్గా ఎందుకున్నారో చెప్పాలని బీజేపీ సభ్యులు పట్టుబట్టారు. వారి ఆరోపణలన్నింటినీ కాంగ్రెస్ సభ్యులు తోసిపుచ్చారు. అదానీ అంశంపై బదులివ్వలేకే ఉద్దేశపూర్వకంగా దీన్ని తెరపైకి తెచ్చారని మండిపడ్డాయి. ఇరు పక్షాల ఆందోళనల నేపథ్యంలో ఉభయ సభలూ కార్యకలాపాలేవీ చేపట్టకుండానే మంగళవారానికి వాయిదా పడ్డాయి. రాజ్యసభ కార్యకలాపాలు మొదలవగానే సోరోస్ అంశంపై చర్చ జరగాలంటూ సభ నాయకుడు జేపీ నడ్డా పట్టుబట్టారు. ఇది దేశ భద్రతకు సంబంధించిన అతి ముఖ్యమైన అంశమని ఆయనన్నారు. నడ్డాకు మద్దతుగా అధికార పక్ష సభ్యులంతా లేచి నిలబడి కాంగ్రెస్కు వ్యతిరేకంగా బిగ్గరగా నినాదాలు చేశారు. దాంతో సభ కాసేపు వాయిదా పడింది. తర్వాత కూడా ఈ అంశంపైనే దుమారం సాగింది. జమ్మూ కశీ్మర్ను భారత్కు సంబంధం లేని ప్రత్యేక ప్రాంతంగా పరిగణించే ఎఫ్డీఎల్–ఏపీ సంస్థతో జార్జ్ సోరోస్ లింకులు ఆందోళన కలిగించే అంశమని నడ్డా అన్నారు. ఇలాంటి వాటి చేతుల్లో కాంగ్రెస్ పావుగా మారిందని ఆరోపించారు. ఎన్డీఏ సభ్యులంతా ఆయనతో గొంతు కలిపారు. తమ డిమాండ్లను పట్టించుకోని చైర్మన్, అధికార పక్షం లేవనెత్తగానే ఈ అంశాన్ని మాత్రం చర్చకు ఎలా అనుమతిస్తారని జైరాం రమేశ్, ప్రమోద్ తివారీ (కాంగ్రెస్) అభ్యంతరం వెలిబుచ్చారు. సభలో లేని సభ్యురాలి ప్రతిష్టకు ఇలా భంగం కలిగించడం సరికాదని విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆక్షేపించారు. ‘‘దేశ ప్రతిష్టకు భంగం కలిగించజూసే శక్తులతో పొంచి ఉన్న ప్రమాదాన్ని నిర్లక్ష్యం చేయజాలం. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు దన్నుగా నిలుస్తోందని అభియోగాలున్న సంస్థకు ఈ సభలోని సభ్యురాలే కో ప్రెసిడెంట్ అన్నది మర్చిపోరాదు’’ అని చైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్ బదులిచ్చారు. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. చైర్మన్ అధికార పక్షం పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. లోక్సభలోనూ ఇవే దృశ్యాలు కని్పంచాయి. అనంతరం పార్లమెంటు బయట కూడా సోరోస్ అంశంపై కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజుతో పాటు బీజేపీ నేతలు సోనియాపై విమర్శలు గుప్పించారు. వాటిని కాంగ్రెస్ నేతలు ఖండించారు.ధన్ఖడ్పై విపక్షాల ‘అవిశ్వాసం’!రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్తో విపక్షాల అభిప్రాయ బేధాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఆయన్ను ఉపరాష్ట్రపతి పదవి నుంచి తొలగించే దిశగా అవి పావులు కదుపుతున్నాయి. ఈ మేరకు రాజ్యసభలో అతి త్వరలో తీర్మానం ప్రవేశపెట్టనున్నట్టు ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ‘‘గత ఆగస్టులోనే విపక్ష ఇండియా కూటమి పక్షాలం ఈ దిశగా ప్రయత్నాలు చేశాం. కానీ ధన్ఖడ్కు మరో అవకాశమివ్వాలనే ఉద్దేశంతో ఊరుకున్నాం. కానీ సోమవారం సభలో ఆయన ప్రవర్తించిన తీరు చూశాక అవిశ్వాస తీర్మానం తప్ప మరో దారి లేదని తేలిపోయింది’’ అని విపక్ష నేతలు కొందరు వెల్లడించారు. ‘‘ధన్ఖడ్ ప్రవర్తన ఎంతమాత్మూ ఆమోదయోగ్యం కాదు. బీజేపీకి ఆ పార్టీ అధికార ప్రతినిధి కంటే కూడా విశ్వాసపాత్రునిగా ఆయన వ్యవహరిస్తున్నారు’’ అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్తో పాటు సమాజ్వాదీ, తృణమూల్ తదితర పారీ్టలు ఈ విషయంలో కలిసొస్తున్నట్టు సమాచారం. ఆరి్టకల్ 67(బి) ప్రకారం తీర్మానాన్ని రాజ్యసభ సాధారణ మెజారిటీతో ఆమోదించాక లోక్సభ ఆమోదం కూడా పొందితే ఉపరాష్ట్రపతిని తొలగించవచ్చు. -
నా జీవితంలో మర్చిపోలేను... సోనియాపై సీనియర్ నాయకురాలు సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్పర్సన్ నజ్మా హెప్తుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక విషయాన్ని సోనియా గాంధీకి తెలియజేసేందుకు తాను గంట పాటు ఫోన్ కాల్లో వేచి ఉండాల్సి వచ్చిందని తనను జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకున్నారు. ఆనాటి ఘటన ఇప్పటికీ తన మనసులో అలాగే ఉండిపోయిందని ఆమె చెప్పుకొచ్చారు.మాజీ రాజ్యసభ డిప్యూటీ చైర్పర్సన్, బీజేపీ నాయకురాలు నజ్మా హెప్తుల్లా తన ఆత్మకథ..‘ఇన్ పర్స్యూట్ ఆఫ్ డెమోక్రసీ: బియాండ్ పార్టీ లైన్స్’ను తాజాగా విడుదల చేశారు. ఈ సందర్భంగా తన రాజకీయ జీవితంలో ఎదుర్కొన్న కొన్ని కీలక ఘటనలను ఇందులో వెల్లడించారు. ఈ క్రమంలో 1999లో తాను కాంగ్రెస్ పార్టీలో సభ్యురాలిగా ఉన్న సమయంలో ఎదుర్కొన్న ఓ అవమానాన్ని గుర్తు చేసుకున్నారు.ఆత్మకథలో ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. నజ్మా హెప్తుల్లా 1999లో ఇంటర్-పార్లమెంటరీ యూనియన్ (IPU) అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి చెప్పడానికి ప్రయత్నించారు. నజ్మా హెప్తులా బెర్లిన్ నుంచి ఇండియాలో ఉన్న సోనియా గాంధీకి కాల్ చేశారు. ఆ సమయంలో సోనియా సిబ్బంది ఫోన్ లిఫ్ట్ చేసి మేడమ్ బిజీగా ఉన్నారని ఆమెకు చెప్పారు. దీంతో, గంట పాటు ఆమె.. ఫోన్ కాల్లోనే వేచి ఉన్నట్టు చెప్పారు. చివరికి సోనియాతో మాట్లాడకుండానే కాల్ కట్ చేసినట్టు తెలిపారు. ఆ ఘటన తన మనసులో తిరస్కరణ భావాన్ని కలిగింపజేసినట్టు ఆమె చెప్పుకొచ్చారు. అది ఇప్పటికీ తన మనసులో అలాగే ఉన్నట్టు రాసుకొచ్చారు. సోనియా చుట్టూ ఉన్న ఓ కోఠరీనే దీనికి కారణమని ఆరోపించారు. ఈ ఘటనే తనను కాంగ్రెస్ పార్టీకి దూరం చేసిందని అన్నారు.అయితే, సోనియా గాంధీకి కాల్ చేసే ముందు.. తాను ఆనాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి సమాచారం అందించినట్టు చెప్పారు. ఈ సందర్భంగా వాజ్పేయి ఆమెతో మాట్లాడి అభినందనలు చెప్పారని గుర్తు చేసుకున్నారు. ఇదే సమయంలో సోనియాపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ నాయకత్వ శైలిని ఇందిరా గాంధీతో విభేదించారు. పార్టీ నేతలంటే ఆమెకు చులకన భావమనే విధంగా ఆరోపణలు చేశారు. ఇదిలా ఉండగా.. 2004 ఎన్నికల సందర్భంగా సోనియాతో విభేదాలు రావడంతో నజ్మా హెప్తుల్లా కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరారు. ఆమె కాంగ్రెస్ సభ్యురాలిగా ఉన్నప్పుడు పదహారేళ్లపాటు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్గా ఉన్నారు. ఇక, బీజేపీ ప్రభుత్వంలో 2014-2016 మధ్య కేంద్రమంత్రిగా పనిచేశారు. మైనారిటీ వ్యవహారాల మంత్రిగా కొనసాగారు. అలాగే, 2016 నుండి 2024 మధ్య కాలంలో మూడు సార్లు ఆమె మణిపూర్ గవర్నర్గా పనిచేశారు. 2017 నుండి 2023 వరకు జామియా మిలియా ఇస్లామియా ఛాన్స్లర్గా ఉన్నారు. హమీద్ అన్సారీ మీద భారతీయ జనతా పార్టీ తరఫున ఉప రాష్ట్రపతి పదవికి పోటీ చేసి ఓడారు. ఇక, నజ్మా హెప్తుల్లా.. ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ మనుమరాలు. -
నేటి పార్లమెంట్లో.. ముచ్చటగా ముగ్గురు ‘గాంధీ’ ఎంపీలు
న్యూఢిల్లీ: కేరళలోని వయనాడ్ లోక్సభ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ మహిళా నేత ప్రియాంకా గాంధీ తన సోదరుడు రాహుల్, తల్లి సోనియా గాంధీలతో పాటు నేడు (గురువారం) పార్లమెంటుకు చేరుకోనున్నారు. ఈరోజు ఆమె లోక్సభ ఎంపీగా ప్రమాణం చేయనున్నారు. రాహుల్ గత లోక్సభ ఎన్నికల్లో వయనాడ్, రాయ్బరేలీ రెండు స్థానాలలో విజయం సాధించారు. తరువాత ఆయన వయనాడ్ను వదులుకున్నారు. తాజాగా ఈ స్థానం నుంచి ప్రియాకా గాంధీ పోటీ చేసి నాలుగు లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.2024 లోక్సభ ఎన్నికల్లో రాయ్బరేలీ నుంచి పోటీ చేయకూడదని సోనియా గాంధీ నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఆమె రాజ్యసభకు ఎన్నికయ్యారు. సోనియా సంతానం రాహుల్, ప్రియాంక ఇప్పుడు లోక్సభకు చేరుకున్నారు. అంటే పార్లమెంటు ఎగువ సభలో తల్లి, దిగువ సభలో కుమారుడు, కుమార్తె కూర్చోనున్నారు.ఇదేవిధంగా సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆయన భార్య డింపుల్ యాదవ్ కూడా లోక్ సభ సభ్యులు. అఖిలేష్ యాదవ్ లోక్సభ ఎన్నికల్లో కన్నౌజ్ నుంచి గెలుపొందగా, ఆయన భార్య ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురి స్థానం నుంచి ఎన్నికయ్యారు. అఖిలేష్ యాదవ్ బంధువు అక్షయ్ యాదవ్ ఫిరోజాబాద్ స్థానం నుంచి గెలుపొందగా, మరో బంధువు ధర్మేంద్ర యాదవ్ బదౌన్ నుంచి గెలుపొందారు. అఖిలేష్ కుటుంబానికి చెందిన నలుగులు ఎంపీలుగా ఉన్నారు.బీహర్ నేత పప్పు యాదవ్ పూర్నియా లోక్సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. ఆయన భార్య రంజిత్ రంజన్ ప్రస్తుతం ఛత్తీస్గఢ్ నుండి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. శరద్ పవార్ ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు. 2014 నుంచి ఆయన సభకు ఎన్నికవుతూవస్తున్నారు. ఆయన కుమార్తె సుప్రియా సూలే మహారాష్ట్రలోని బారామతి లోక్సభ స్థానం నుంచి ప్రస్తుత ఎంపీగా ఉన్నారు.ఇది కూడా చదవండి: Pakistan: షియా-సున్నీల ఘర్షణ.. 10 మంది మృతి -
సమాజానికి ‘ఎక్స్రే’!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో అన్ని వర్గాలకు సామాజిక న్యాయం జరగాలంటే కులగణన తప్పనిసరని... ఇది సమాజానికి ‘ఎక్స్రే’వంటిదని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. సమాజానికి ‘మెగా హెల్త్ చెకప్’జరగాలంటే కులగణన చేసి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో సామాజిక న్యాయ సాధనకోసం చేపట్టే మూడో ఉద్యమంలో కులగణన భాగమని చెప్పారు. ఇప్పటికే తెలంగాణలో కులగణన చేపట్టి, దేశానికే ఆదర్శంగా నిలిచామని పేర్కొన్నారు. మంగళవారం 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏఐసీసీ ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని తోల్కటోరా స్టేడియంలో నిర్వహించిన ‘సంవిధాన్ రక్షక్ అభియాన్’కార్యక్రమంలో సీఎం రేవంత్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు.ఈ సందర్భంగా రేవంత్రెడ్డి కులగణన అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. వివరాలు ఆయన మాటల్లోనే... ‘‘దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ, బీఆర్ అంబేడ్కర్, ఇందిరాగాంధీ తమ హయాంలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు, బ్యాంకుల జాతీయీకరణ వంటివి తెచ్చారు. 140 కోట్ల మంది పేదలకు రాజ్యాంగపరమైన హక్కులు కల్పించారు. రిజర్వేషన్ల ద్వారా విద్య, ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు. అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ద్వారా పేదలకు భూమి హక్కులు కలి్పంచి వారి గౌరవాన్ని రెట్టింపు చేశారు. అది చరిత్రలో 1.0గా నిలిచింది. ఇక 2.0లో భాగంగా రాజీవ్గాంధీ మొదలు పీవీ నర్సింహారావు వరకు మండల్ కమిషన్ ద్వారా ఓబీసీలకు, స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేశారు. 18 ఏళ్లకే ఓటు హక్కు తెచ్చారు. ఐఐటీ, ఐఐఎంలలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలకు సామాజిక న్యాయం చేశారు. ఎంత జనాభా ఉంటే అంత హక్కు ఇక 3.0లో భాగంగా సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గేల నిర్దేశంలో రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశీ్మర్ వరకు పాదయాత్ర చేసి... నిరుద్యోగులు, పేదలు, రైతులను కలసి కులగణన చేస్తామని హామీ ఇచ్చారు. ‘జిత్నీ భాగీ దారీ.. ఉత్నీ హిస్సే దారీ (ఎంత జనాభా ఉంటే అంత హక్కు)’అని నినదించారు. ఈ కులగణన అనేది ఎక్స్రే వంటిది. సమాజానికి ఇది ‘మెగా హెల్త్ చెకప్’వంటిదే. దేశంలో జనాభా ఆధారంగా రిజర్వేషన్లు దక్కాలన్నా, సామాజిక న్యాయం జరగాలన్నా కులగణన తప్పనిసరి. దేశంలోనే తొలిసారి తెలంగాణలో కులగణన మొదలుపెట్టాం. 92శాతం పూర్తయింది. భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకున్నాం. సామాజిక న్యాయం చేయడంలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలబడింది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం జనగణనలో భాగంగా కులగణన కూడా చేపట్టాల్సిందే. కులగణన చేసేంతవరకు మోదీ ప్రభుత్వంపై రాహుల్ ఒత్తిడి తెస్తూనే ఉంటారు.గాంధీ పరివార్.. మోదీ పరివార్ మధ్య యుద్ధందేశంలో ప్రస్తుతం మోదీ పరివార్, గాంధీ పరివార్‡ అని రెండు వర్గాలే ఉన్నాయి. ఇందులో గాంధీ పరివార్ రాజ్యాంగాన్ని రక్షించాలని భావిస్తుంటే... మోదీ పరివార్ రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తోంది. ఈ సమయంలో ప్రజలంతా రాజ్యాంగ రక్షకులైన గాంధీ కుటుంబానికి వెన్నుదన్నుగా నిలవాలి. గతంలో రైతులకు వ్యతిరేకంగా కేంద్రం తెచి్చన నల్లచట్టాలపై రాహుల్ దృఢంగా నిలబడి కొట్లాడారు. రాహుల్ పోరాటంతో కేంద్రం వెనకడుగు వేసింది. అదే రీతిలో కులగణనపై కొట్లాడాలి. ఈ అంశంలో రాహుల్ చేసే ప్రతి పోరాటానికి మద్దతుగా మేముంటాం..’’అని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు.ఖర్గేతో భేటీ.. ప్రియాంకకు శుభాకాంక్షలు సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీలో మంగళవారం ఉదయం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో విడిగా కొంతసేపు భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోపాటు జనగణన ప్రక్రియ సాగుతున్న తీరును వివరించినట్టు సమాచారం. కులగణన ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్పై వారి మధ్య చర్చ జరిగినట్టు తెలిసింది. డిసెంబర్ ఒకటి నుంచి జరగనున్న ప్రజా పాలన దినోత్సవాల ఏర్పాట్లపైనా మాట్లాడుకున్నట్టు సమాచారం. ఇక ఇటీవల వయనాడ్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన ఎంపీ ప్రియాంకా గాం«దీని రేవంత్, భట్టి విక్రమార్క కలసి శుభాకాంక్షలు తెలిపారు. -
వయనాడ్లో ప్రియాంకం
సాక్షి, న్యూఢిల్లీ: కేరళలోని వయనాడ్ లోక్సభ నియోజకవర్గ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ భారీ విజయంతో బోణీ కొట్టారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక తన సోదరుడు రాహుల్ గాంధీ రాజీనామాతో అనివార్యమైన వయనాడ్ లోక్సభ స్థానం ఉప ఎన్నికల్లో 6,22,338 ఓట్లు సాధించారు. కాగా తన సమీప ప్రత్యర్థి సీపీఐ అభ్యర్థి సత్యన్ మొకెరి కన్నా 4,10,931 ఓట్లు ఎక్కువ సాధించారు.ప్రియాంకతో పోలిస్తే 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ అత్యధికంగా 6,47,445 ఓట్లు సాధించడం విశేషం. ఆనాడు రాహుల్ 3,64,422 ఓట్ల తేడాతో గెలిస్తే శనివారం ప్రియాంక అంతకుమించిన మెజారిటీతో జయకేతనం ఎగరేయడం గమనార్హం. వయనాడ్లో గెలిచిన తర్వాత ప్రియాంక కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో ఢిల్లీలో శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వయనాడ్ నుంచి పోటీ చేసేందుకు తనకు అవకాశం ఇచ్చినందుకు పార్టీకి, ఖర్గేకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ‘ఎక్స్’వేదికగా వయనాడ్ ఓటర్లకు ప్రియాంక కృతజ్ఞతలు తెలిపారు. ‘నా ప్రియతమ సోదరసోదరీమణులారా.. వయనాడ్లో మీరు నాపై ఉంచిన నమ్మకానికి నేను కృతజ్ఞతతో పొంగిపోయా. రాబోయే రోజుల్లో ఈ గెలుపు మీ విజయమని మీరు భావించేలా పనిచేస్తా. మీ కోసం నేను పోరాడతా. పార్లమెంట్లో మీ గొంతు వినిపించేందుకు నేను ఎదురుచూస్తున్నా. నాకు ఈ గౌరవం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా తల్లి సోనియా, భర్త రాబర్ట్, రత్నాల్లాంటి పిల్లలు రైహాన్, మిరాయా... మీరు నాకు ఇచ్చిన ప్రేమ, ధైర్యానికి ఏ కృతజ్ఞతా సరిపోదు. నా సోదరుడు రాహుల్.. నువ్వు అందరికంటే ధైర్యవంతుడివి. నాకు దారి చూపినందుకు, ఎల్లప్పుడూ నాకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు’’అని ప్రియాంక వ్యాఖ్యానించారు. తన విజయం కోసం కృషిచేసిన యూడీఎఫ్ కూటమి నేతలు, కాంగ్రెస్ నేతలు, వలంటీర్లకు రుణపడి ఉన్నానని ప్రియాంక అన్నారు. ఏప్రిల్లో సార్వత్రిక ఎన్నికల వేళ వయనాడ్లో 74 శాతంగా నమోదైన పోలింగ్ ఈసారి నవంబర్ ఉప ఎన్నికల్లో 65 శాతానికి తగ్గింది. ప్రియాంకతో పోటీపడిన సత్యన్ మోకెరికి 2,11,407 ఓట్లు, బీజేపీ నాయకురాలు నవ్యా హరిదాస్కు కేవలం 1,09,939 ఓట్లు పడ్డాయి. నిఖార్సయిన నేత సోదరుడితో కలిసి ప్రచారవేదికల్లో సరదాగా సంభాషించినా, తండ్రి మరణం, తల్లి నిర్వేదంపై మనసుకు హత్తుకునేలా మాట్లాడి, ప్రజాసమస్యలపై గళమెత్తి తనలోని నిఖార్సయిన రాజకీయనేత పార్శా్యలను అద్భుతంగా ఆవిష్కరించి ఓటర్ల మనసును చూరగొన్నారు. తాజా లోక్సభ ఎన్నికల్లో పార్టీ 99 సీట్లు సాధించడంలో ప్రియాంక కృషి కూడా ఉంది. ‘‘ప్రత్యక్ష రాజకీయాలకు కొత్తేమోగానీ రాజకీయాలకు కొత్తకాదు’’అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తెగ ప్రాచుర్యం పొందాయి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ 2019 జనవరిలో ఉత్తరప్రదేశ్ తూర్పు రీజియన్ ఎన్నికల ప్రచారబాధ్యతలను మోశారు. మొత్తం రాష్ట్రానికి జనరల్ సెక్రటరీ(ఇన్చార్జ్)గానూ పనిచేశారు. 1972 జనవరి 12న జని్మంచిన ప్రియాంక ఢిల్లీలోని మోడర్న్ స్కూల్, కాన్వెంట్ ఆఫ్ జీసెస్ అండ్ మేరీ పాఠశాలల్లో చదువుకున్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో సైకాలజీలో డిగ్ర పట్టా పొందారు. బుద్దుని బోధనలపై పీజీ చేశారు. My dearest sisters and brothers of Wayanad, I am overwhelmed with gratitude for the trust you have placed in me. I will make sure that over time, you truly feel this victory has been your victory and the person you chose to represent you understands your hopes and dreams and…— Priyanka Gandhi Vadra (@priyankagandhi) November 23, 2024ఎట్టకేలకు లోక్సభకు పార్టీ ప్రచారకర్త నుంచి పార్లమెంట్దాకా 52 ఏళ్ల ప్రియాంక స్ఫూర్తిదాయక ప్రస్థానం కొనసాగించారు. టీనేజర్గా ఉన్నపుడు తండ్రి ప్రధాని హోదాలో పార్లమెంట్లో ప్రసంగిస్తున్నపుడు పార్లమెంట్లో తొలిసారిగా అడుగుపెట్టిన ప్రియాంక ఇప్పుడు తల్లి సోనియా, సోదరుడు రాహుల్తో కలిసి పార్లమెంట్ మెట్లు ఎక్కబోతున్నారు. యూపీఏ ప్రభుత్వాల హయాంలో కాంగ్రెస్ హవా కొనసాగినా ప్రియాంక ఏనాడూ తేరగా పదవులు తీసుకోలేదు. ప్రజాస్వామ్యయుతంగా ఓటర్ల మెప్పుపొందాకే రాజ్యాంగబద్ధ హోదాకు అర్హురాలినని ఆనాడే చెప్పారు. అందుకే దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాసరే ఏనాడూ పదవులు తీసుకోలేదు. నెహ్రూ–గాంధీ కుటుంబం నుంచి పార్లమెంట్లోకి అడుగుపెట్టిన 10వ సభ్యురాలుగా ప్రియాంక నిలిచారు. ఆమె కంటే ముందు వారి కుటుంబం నుంచి జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాం«దీ, ఫిరోజ్ గాం«దీ, రాజీవ్ గాంధీ, సంజయ్ గాం«దీ, సోనియా గాం«దీ, మేనకా గాం«దీ, రాహుల్ గాం«దీ, వరుణ్ గాంధీ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. పెద్ద రాష్ట్రాల్లో అధికారంలోలేని ప్రస్తుత తరుణంలో సోదరుడు రాహుల్తో కలసి పార్లమెంట్ వేదికగా ప్రజా గొంతుకను బలంగా వినిపించాల్సిన తరుణం వచ్చింది. -
తొలిసారి పోటీ చేస్తున్నా, భారీ మెజారిటీతో గెలిపించండి: ప్రియాంక
తిరువనంతపురం: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా నేడు(బుధవారం) వయనాడ్ లోక్సభ ఉప ఎన్నికకు కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్కు ముందు కల్పేట కొత్త బస్టాండ్ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ భారీ రోడ్షో నిర్వహించారు. ప్రియాంక ర్యాలీకి యూడీఎఫ్ నేతలు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు.అనంతరం బహిరంగ సభలో ప్రియాంక మాట్లాడారు. గత 35 ఏళ్లుగా వివిధ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించానని, మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, తన కోసం తాను ప్రచారం చేసుకుంటున్నానని తెలిపారు. ప్రజలందరి మద్దతు తనకు ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచమంతా తన సోదరుడికి వ్యతిరేకంగా ఉన్న సమయంలో వాయనాడ్ ప్రజలు అండగా నిలిచారని అన్నారు. మీరు ఇచ్చిన మద్దతుతోనే ఆయన దేశంలో 8 వేల కిలోమీటర్ల యాత్ర చేయగలిగారని ఆమె పొగిడారు.‘నా సోదరుడికి మద్దతుగా నిలిచిన మీ అందరికీ మా కుటుంబం రుణపడి ఉంటుందని చెప్పారు. ఆయన ఇప్పుడు మిమ్మల్ని విడిచి వెళ్లాల్సి వచ్చిందని, కానీ నేను ఆయనకు, మీకు మధ్య బంధాన్ని బలోపేతం చేస్తాను. వయనాడ్ నియోజకవర్గం సమస్యల గురించి నా సోదరుడు చెప్పాడు. ఇప్పుడు నేను ప్రత్యక్షంగా మీ సమస్యలు తెలుసుకుంటాను. ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాను. వాయనాడ్లో భారీ మెజారిటీతో గెలిపించండి ’ ఆమె హామీ ఇచ్చారు.కాంగ్రెస్ ఎంపీ రాహుల్ మాట్లాడుతూ.. దేశంలో ఇద్దరు ఎంపీలు ఉన్న ఏకైక లోక్సభ నియోజకవర్గం వాయనాడ్ అని అన్నారు. దేశంలో ఏ లోక్సభ స్థానానికైనా ఒకరే ఎంపీ ఉంటారని, కానీ వాయనాడ్కు మాత్రం ఇద్దరు ఎంపీలు ఉంటారని చెప్పారు. ప్రియాంకాగాంధీ అధికారిక ఎంపీగా ఉంటే, తాను అనధికారిక ఎంపీగా కొనసాగుతానని అన్నారు. ఇద్దరం కలిసి వాయనాడ్ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.ప్రియాంక నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ మాజీ చీఫ్లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ హాజరు కానున్నారు. వయనాడ్ జిల్లా కలెక్టర్ ఎదుట ప్రియాంక నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇదిలా ఉండగా తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ. వయనాడ్లో ఆమె ముక్కోణపు పోటీ ఎదుర్కొంటున్నారు. దశాబ్దకాలంగా ప్రజాప్రతినిధిగా ఉన్న బీజేప అభ్యర్థి నవ్యా హరిదాస్ ప్రియాంకకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఎల్డీఎఫ్ తరఫున సీపీఐ నేత, మాజీ ఎమ్మెల్యే సత్యన్ మొకెరీ పోటీ చేస్తున్నారు. కాగా ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో రాయ్బరేలీ, వయనాడ్ల నుంచి పోటీ చేసి గెలిచిన రాహుల్ గాంధీ.. వయనాడ్ స్థానాన్ని వదులుకున్నారు. దీంతో ఉపఎన్నిక అనివార్యమైంది. నవంబర్ 13న ఇక్కడ ఉప ఎన్నిక జరగనుంది.#WATCH | Kerala: Congress leader and Lok Sabha LoP Rahul Gandhi arrives in Wayanad for the nomination filing of party's national general secretary and his sister, Priyanka Gandhi Vadra for Wayanad Lok Sabha by-elections. Visuals from Sultan Bathery. pic.twitter.com/EgCeMpGolL— ANI (@ANI) October 23, 2024 -
సోనియాపై ఆరోపణలు.. కంగనాకు కాంగ్రెస్ వార్నింగ్
హిమాచల్ ప్రభుత్వం, సోనియా గాంధీపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. విపత్తు సాయం కోసం ఉద్ధేశించిన నిధులను హిమాచల్ ప్రభుత్వం.. వాటిని సోనియా గాంధీకి అక్రమంగా బదిలీ చేసినట్లు కంగన చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరింది. లేని పక్షంలో ఆమెపై పరువునష్టం కేసు నమోదు చేస్తామని హెచ్చరించింది.ఈ మేరకు హిమాచల్ ప్రదేశ్ మంత్రి విక్రమాదిత్య సింగ్ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. కంగనా రనౌత్ తన ఆరోపణలను ఉపసంహరించుకోవాలని లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ‘కంగన తన ప్రకటనను ఉపసంహరించుకోకపోతే.. మేం పరువు నష్టం దావా వేస్తాం. ఆమె ఆధారాలతో అలాంటి ప్రకటన చేసింది? సోనియా గాంధీ లాంటి నాయకురాలిపై ఆమె అలాంటి ప్రకటన చేయడం చాలా దురదృష్టకరం.కేంద్రం నుంచి వచ్చే నిధులు లేదా రాష్ట్ర అభివృద్ధికి కేటాయించిన నిధులు సోనియా గాంధీకి ఇస్తున్నారని చెప్పడం కంటే పెద్ద మూర్ఖపు ప్రకటన మరొకటి ఉండదు. ఒక్క రూపాయి అయినా దారి మళ్లినట్లు రుజువు చేయాలి. లేదంటే నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి క్షమాపణ చెప్పాలి. లేకుంటే ఆమెపై కాంగ్రెస్ పరువునష్టం కేసు పెడుతుంది’ అని తెలిపారు.కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఖజానాను ఖాళీ చేశాయన్న విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు కంగనా రనౌత్. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అప్పులు చేసి మరి సోనియా గాంధీకి నిధులు బదిలీ చేసినట్లు ఆరోపించారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు గండి పడిందని అన్నారు. ‘కేంద్రం విపత్తు నిధులు ఇస్తే, అది సీఎం రిలీఫ్ ఫండ్కు వెళుతుంది. అయితే హిమాచల్లో సోనియా రిలీఫ్ ఫండ్కు వెళుతుంది’ అని మనాలిలో ఆదివారం జరిగిన బీజేపీ కార్యక్రమంలో పేర్కొన్నారు. -
సోనియాగాంధీపై కంగన సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీపై బీజేపీ ఎంపీ కంగనరనౌత్ సంచలన ఆరోపణలు చేశారు. హిమాచల్ ప్రదేశ్ దివాలా తీయడానికి సోనియాగాంధీయే కారణమన్నారు. హిమాచల్ప్రదేశ్లోని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులన్నీ సోనియాగాంధీకే వెళ్లాయని,దీనివల్లే రాష్ట్రం దివాలా తీసిందన్నారు.చివరకు వరద సాయానికిగాను విరాళాలుగా వచ్చిన సొమ్ము కూడా సోనియాకే వెళ్లిందని తీవ్ర ఆరోపణలు చేశారు.‘హిమాచల్లో కాంగ్రెస్ అవినీతి ఎంతుందనేది ప్రతి ఒక్కరికి తెలుసు.ఈ అవినీతి వల్లే రాష్ట్రం దశాబ్దాల వెనుకబాటుకు గురైంది. ఇందుకే కాంగ్రెస్ను కూకటివేళ్లతో పెకిలించాలని హిమాచల్ ప్రజలను కోరుతున్నా’అని కంగన పిలుపిచ్చారు.కాగా,ప్రస్తుతం హిమాచల్ప్రదేశ్ నిధులలేమితో దివాలా అంచున ఉంది. దీంతో సీఎం, మంత్రులు,కార్పొరేషన్ల చైర్మన్లు రెండు నెలల పాటు జీతాలు తీసుకోరని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో కంగన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
సీతారాం ఏచూరి పార్ధివదేహానికి సోనియా గాంధీ పుష్పాంజలి
-
2026 మార్చిలో ‘దేవాదుల’ ప్రారంభం
సాక్షి ప్రతినిధి, వరంగల్: దేవాదుల ప్రాజెక్టు పెండింగ్ పనులు 2026 మార్చి లోపు వందశాతం పూర్తి చేసి, అదే నెలలో సోనియాగాంధీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి ప్రకటించారు. ఏడాదిలో 300 రోజుల పాటు 60 టీఎంసీల నీటిని వినియోగించుకుని ఏడు జిల్లాలను సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును శుక్రవారం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క, నీటిపారుదల శాఖ నిపుణులతో కలిసి ఆయన సందర్శించారు.దేవాదుల పంప్హౌస్ వద్ద ప్రాజెక్ట్ పురోగతిపై ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిర్దేశిత గడువులోపు దేవాదుల పూర్తి చేసి 5.57 లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తామని చెప్పారు. సమ్మక్క సారక్క బరాజ్ ఎన్వోసీ కోసం ఛత్తీస్గఢ్ను ఒప్పిస్తామన్నారు. ధరలు పెరగడంతో ఇరిగేషన్ ప్రాజెక్టులకు భూసేకరణ ఇబ్బందిగా మారిందని, ఇందుకోసం ప్రత్యేక ఐఏఎస్ అధికారిని నియమిస్తున్నామని తెలిపారు. కాలపరిమితిని పెట్టి వీలైనంత త్వరగా సీతారామసాగర్, పాలమూరు–రంగారెడ్డిలను పూర్తి చేసి వినియోగంలోకి తెస్తామని చెప్పారు. ప్రతి ప్రాజెక్టులో వేల కోట్ల స్కాం ఇరిగేషన్ శాఖను అడ్డుపెట్టుకొని మాజీ సీఎం కేసీఆర్ డెకాయిట్లా వ్యవహరించారని, ప్రతి ప్రాజెక్టులో వేల కోట్ల స్కాం జరిగిందని ఉత్తమ్కుమార్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును నాశనం చేశారని, ఇరిగేషన్ ప్రాజెక్టులపై అవగాహన లేకుండా తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో ప్రాజెక్ట్ల పేరుతో రూ.1.81 లక్షల కోట్ల నిధులు ఖర్చుపెట్టారని, రూ.14 వేల కోట్ల బిల్లులు పెండింగ్లో ఉంచారని వెల్లడించారు. రూ.1.81 లక్షల కోట్ల నిధులను ఖర్చు చేసినా లక్ష ఎకరాలకు కూడా అదనంగా సాగునీరు ఇవ్వలేకపోయారని విమర్శించారు. దేవాదుల ప్రాజెక్టు పెండింగ్ బిల్లులను తప్పనిసరిగా చెల్లిస్తామని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. 15 ఏళ్లుగా నత్తనడకన దేవాదుల: పొంగులేటి దేవాదుల ప్రాజెక్ట్ పనులు 15 ఏళ్లుగా నత్తనడకలో సాగాయని మంత్రి పొంగులేటి విమర్శించారు. దీనికోసం మరో 3 వేల ఎకరాల భూసేకరణ నవంబర్ 15 లోపు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఇచి్చన హామీ మేరకు, భూములకు నష్టపరిహారం చెల్లిస్తామని తెలిపారు. మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, గండ్ర సత్యనారాయణరావు, మురళీ నాయక్, యశస్వినిరెడ్డి, కేఆర్ నాగరాజు, ప్రభుత్వ కార్యదర్శి ప్రశాంత్ జీవన్పాటిల్, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ పాల్గొన్నారు. చెరువులు ఆక్రమిస్తే ఊపేక్షించం సాక్షి, యాదాద్రి: రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు, కుంటలు ఎవరు ఆక్రమించినా ఉపేక్షించేది లేదని ఉత్తమ్కుమార్రెడ్డి హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో ఉన్న నీటిపారుదల వనరులపై ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. గత పదేళ్లలో అన్ని శాఖల కంటే ఎక్కువగా నష్టపోయింది నీటిపారుదల శాఖే అని అన్నారు. సీఎం ఆలోచనల మేరకు మూసీ నదిలో నీటి లభ్యతను పెంచుతామన్నారు. అంతకు ముందు హన్మాపురం వద్ద బునాదిగాని కాలువను మంత్రులు పరిశీలించారు. రుణమాఫీకి మరో రూ.500 కోట్లు: పొంగులేటి రైతు రుణమాఫీ కోసం అవసరమైమే అదనంగా మరో రూ.500 కోట్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు. ఇంకా ఇవ్వాల్సిన రూ.13 వేల కోట్లతో పాటు అవసరమైతే మరిన్ని నిధులు ఇస్తామన్నారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి అ«ధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, వేముల వీరేశం, మందుల సామేల్, మల్రెడ్డి రంగారెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డి, కలెక్టర్ హనుమంతు కే.జెండగే, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. -
మీ సోనియా ఇటలీ నుంచి వచ్చారు కదా !
శివాజీనగర: తాను రాజస్థాన్ నుండి వచ్చినవాడైతే మీ పార్టీ అధినాయకురాలు సోనియాగాంధీ ఇటలీ నుండి వచ్చారు, ఆమె కూడా తమ రాష్ట్ర నుండి రాజ్యసభకు ఎంపికయ్యారనేది మరువరాదని మంత్రి ప్రియాంక్ ఖర్గేకు రాజ్యసభ సభ్యుడు లెహర్ సింగ్ ఎదురుదాడికి దిగారు. కేఐఏడీబీ భూముల వ్యవహారాన్ని ప్రశ్నించినందుకు ఖర్గే జూనియర్ వారి స్నేహితులు రాజస్థాన్ వారని తనపై ఆరోపణ చేశారు. తాను అడిగేందుకు ఇష్టపడుతున్నాను. సోనియాగాంధీ రాజస్థాన్ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఇటలీలో జని్మంచారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సీ.వేణుగోపాల్ సికార్లో, రణదీప్ సింగ్ సుర్జేవాలా చురులో జని్మంచారు. వారు ఏ రాష్ట్రం నుండి రాజ్యసభకు ఎంపికయ్యారని ఆయన ప్రశ్నించారు. రాజస్థానీ కావటం నేరమా? రాజస్థాన్ పాకిస్థాన్లో లేదని అన్నారు. నెహ్రూ కుటుంబం ఉత్తరప్రదేశ్ నుండి వచ్చిందా లేదా కాశీ్మర్ నుండి వచ్చిందా అని ప్రశ్నించారు. తాను 59 సంవత్సరాల నుండి కర్ణాటకలో నివసిస్తున్నాను. తాను కన్నడ మాట్లాడుతున్నాను. చదువుతాను, రాస్తాను. తాను కర్ణాటక బీజేపీలో కోశాధికారి అని, తాను తన పార్టీలో ఎమ్మెల్సీ, ఎంపీగా సేవలందించాను. తాను రాజకీయం వంశం నుండి వచ్చినవాడు కాదు. రాహుల్ గాని, ఖర్గే జూనియర్.. రాళ్లు వేసే ముందు గాజు గదిలో ఉన్నారనేది తెలుసుకోవాలి అని లెహర్ సింగ్ ధ్వజమెత్తారు. -
సోనియా గాంధీకి ‘నూరీ’ ఇష్టం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాందీకి ఎవరంటే ఎక్కువ ఇష్టం? కుమారుడు రాహుల్ గాం«దీనా? లేక కుమార్తె ప్రియాంక గాందీనా? వీరిద్దరూ కాదు. బుజ్జి కుక్కపిల్ల ‘నూరీ’ అంటే సోనియాకు చాలా అభిమానం. ఈ విషయం రాహుల్ గాంధీ స్వయంగా వెల్లడించారు కాబట్టి మనం నమ్మక తప్పదు. జాక్ రస్సెల్ బ్రిటీష్ జాతికి చెందిన నూరీని బ్యాక్ప్యాకప్లో వీపుపై సోనియా కట్టుకున్న సరదా ఫోటోను రాహుల్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు. మామ్స్ ఫేవరేట్ అనే వ్యాఖ్య జోడించారు. తన తల్లికి కన్నబిడ్డల కంటే నూరీనే ఎక్కువ ఇష్టమని పేర్కొన్నారు. ఇంట్లో నూరీని చాలా ముద్దు చేస్తుంటారని తెలిపారు. రాహుల్ పోస్టుకు నెటిజన్ల నుంచి విశేషమైన స్పందన లభించింది. 24 గంటల వ్యవధిలో 7.81 లక్షల లైక్లు, 5,400 కామెంట్లు వచ్చాయి. నిజానికి కుక్కపిల్ల నూరీని రాహుల్ గతేడాది స్వయంగా సోనియాకు బహూకరించారు. View this post on Instagram A post shared by Rahul Gandhi (@rahulgandhi) అప్పటి నుంచి అది ఆమెకు ప్రీతిపాత్రమైపోయింది. సోనియా కుటుంబంలో ఇప్పుడు అందరికీ అదొక ముఖ్యమైన, ప్రియమైన సభ్యురాలు. ఉత్తర గోవాలోని మపూసా పట్టణంలో 2023 ఆగస్టులో నూరీని రాహుల్ గాంధీ తొలిసారిగా చూశారు. దానిపై ముచ్చటపడ్డారు. కొనుగోలు చేసి, తల్లికి బహూకరించి ఆశ్చర్యపరిచారు. సోనియా కుటుంబ సభ్యులకు జంతవులంటే చాలా ఆపేక్ష. వారి ఇంట్లో చాలాఏళ్లుగా పలు శునకాలు ఉన్నాయి. ‘పిడి’ అనే శునకం రాహుల్ గాంధీ సోషల్ మీడియా పోస్టులో తరచుగా కనిపిస్తూ ఉంటుంది. దానికి చాలామంది అభిమానులున్నారు. -
సోనియా గాంధీ ఇంటికి వెళ్లిన ఎంపీ రఘునందన్ రావు