bhogapuram airport
-
భోగాపురం.. జగన్ వరం.. బాబు కుట్రలు షురూ !
-
భోగాపురం ఎయిర్పోర్ట్లో రూ. 675 కోట్ల పెట్టుబడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎంఆర్ గ్రూప్ ఆంధ్రప్రదేశ్లోని భోగాపురంలో అభివృద్ధి చేస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టులో నేషనల్ ఇన్వెస్ట్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్ఐఐఎఫ్) రూ. 675 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయనుంది. విమానాశ్రయ నిర్మాణానికి ఏర్పాటైన జీఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (జీవీఐఏఎల్)లో ఈ మొత్తాన్ని పెట్టుబడి పెట్టేందుకు జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ (జీఏఎల్), ఎన్ఐఐఎఫ్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. సీసీడీల రూపంలో.. కంపల్సరీ కన్వర్టబుల్ డిబెంచర్స్ రూపంలో ఎన్ఐఐఎఫ్ ఇన్వెస్ట్ చేయనున్నట్లు జీఎంఆర్ గ్రూప్ తెలిపింది. జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ప్రాజెక్టులకు సంబంధించి ఇది తమ రెండో పెట్టుబడని ఎన్ఐఐఎఫ్ మాస్టర్ ఫండ్ మేనేజింగ్ పార్ట్నర్ వినోద్ గిరి తెలిపారు. హైదరాబాద్ తరహాలో భోగాపురం ఎయిర్పోర్ట్ మరో ప్రపంచ స్థాయి విమానాశ్రయంగా ఉండగలదని జీఎంఆర్ గ్రూప్ బిజినెస్ చైర్మన్ (ఎయిర్పోర్ట్స్) జీబీఎస్ రాజు తెలిపారు. డిజైన్, నిర్మాణం, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ ప్రాతిపదికన 40 ఏళ్ల వ్యవధికి భోగాపురం ఎయిర్పోర్టు ప్రాజెక్టును 2020లో జీవీఐఏఎల్ దక్కించుకుంది. ఏపీలోనే అతి పెద్ద విమానాశ్రయంగా ఆవిర్భవించనున్న ఈ ఎయిర్ పోర్టు వార్షిక ప్రయాణికుల సామర్థ్యం తొలి దశలో 60 లక్షలుగా ఉంటుంది. తర్వాత 4 కోట్లకు చేరనుంది. -
చకచకా కొనసాగుతున్న భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులు
-
హవ్వ! ఇదేం తీరు రామోజీ?
తెలుగుదేశం ఎందుకు చేయలేకపోయింది ‘‘నిజంగా టీడీపీకి భోగాపురం ఎయిర్పోర్టుపై చితశుద్ధి ఉంటే ఎందుకు ఒక అడుగు కూడా ముందుకు పడలేదు? హైకోర్టు, సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వరకు అన్ని కేసులనూ దేవుడి దయతో పరిష్కరించుకుని రైతుల ఆమోదంతో భూసేకరణను పూర్తి చేశాం.అంతేకాకుండా టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి శంకుస్థాపన చేస్తున్నాం. ఈ నాలుగేళ్లలో రూ.80 కోట్లు ఖర్చు చేసి అన్ని వసతులు, సౌకర్యాలతో పునరావాస గ్రామాలను అభివృద్ధి చేసి రైతులు స్వచ్ఛందంగా వెళ్లేలా చేశాం. విశాఖ నుంచి భోగాపురానికి ఎక్స్ప్రెస్ హైవేను రూ.6,300 కోట్లతో నిర్మించడానికి కేంద్రం నుంచి అనుమతులు తీసుకున్నాం. వీటి పనులు త్వరలో మొదలవుతాయి. ఇక భోగాపురం ఎయిర్పోర్టు చుట్టుపక్కల నీటి ఎద్దడిని పరిష్కరించడానికి రూ.195 కోట్లు ఖర్చు చేస్తున్నాం. మరో 30 నెలల్లో ఇక్కడి నుంచి విమానాలు ఎగురుతాయి. ఈ ఎయిర్పోర్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి కిరీటంగా మారుతుంది.’’ – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: అసత్యాలు ప్రమాదకరం. అర్థసత్యాలు మరింత ప్రమాదకరం. అందుకే భోగాపురం ఎయిర్పోర్టుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసిన వేళ.. ‘ఈనాడు’ అర్థసత్యాల రూటును ఎంచుకుంది. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సొంత భాష్యాలు చెబుతూ... వాటిలో కొంత మాత్రమే ఇస్తూ... ‘‘హవ్వ... అది నోరేనా?’’ అంటూ తన అక్కసు మొత్తం వెళ్లగక్కేసింది. అప్పట్లో ప్రతిపక్ష నేతగా చెప్పినవన్నీ ఇపుడు చేశాకే... విమానాశ్రయానికి ముఖ్యమంత్రి హోదాలో జగన్ శంకుస్థాపన చేశారనే అసలు వాస్తవానికి మాత్రం తనదైన ముసుగేసేసింది. టీడీపీ నేత పట్టాభిని పోలీసులు కొట్టకుండానే... ఎప్పుడో రెండేళ్ల కిందటి ఫోటో తీసుకొచ్చి కొట్టారంటూ ప్రచారం చేయటం... వ్యాపారులు మిల్లు ఆవరణలో ఆరబెట్టుకున్న ధాన్యాన్ని రైతులు ఆరబెట్టుకున్నారని అబద్ధాలు చెప్పి గుండెలు బాదేసుకోవటం... ఇపుడేమో భోగాపురంపై జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలకు వక్రభాష్యాలు చెప్పి దుష్ప్రచారానికి దిగటం... ఇవన్నీ తాజా పరిణామాలు కావటంతో ‘‘ఈనాడు మరీ ఇంతలా దిగజారిపోయిందేంటి?’’ అనే వ్యాఖ్యలు, దానికి జోడించిన కథనాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏఏ అంశాలను వ్యతిరేకించారు? ఇపుడు వాటి విషయంలో ఎలా ముందుకు వెళుతున్నారో చూద్దాం... ఎన్నికలకు నిండా నెల రోజులు కూడా లేదు. భూ సేకరణ పూర్తికాలేదు. ఎలాంటి అనుమతులూ లేవు. అయినా సరే... హడావుడిగా ఎన్నికలకు కేవలం కొన్ని రోజుల ముందు 2019 ఫిబ్రవరిలో శంకుస్థాపన చేసేశారు చంద్రబాబు నాయుడు. అనుమతులు లేకుండా ఎలా చేశారు? భూసేకరణ ఎప్పుడు పూర్తి చేస్తారు? అసలు ఎన్నికలకు కేవలం కొన్ని రోజుల ముందు ఎందుకింత హడావుడి? అని ‘ఈనాడు’ ఒక్క ప్రశ్న వేస్తే ఒట్టు!!. పైపెచ్చు కొబ్బరికాయ కొట్టిననాడే విమానాశ్రయం పూర్తయిపోయి విమానాలు ఎగురుతున్న రేంజిలో కవరేజి. ఇప్పుడైతే ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి కేవలం శంకుస్థాపనకే పరిమితం కాలేదు. భూ సేకరణకు సంబంధించి పెండింగ్లో ఉన్న న్యాయపరమైన వివాదాలన్నిటినీ పరిష్కరించారు. కావాల్సిన అనుమతులన్నీ తెప్పించారు. అన్నీ చేసిన తరవాత... 30 నెలల్లో పూర్తి చేయాలని జీఎంఆర్ సంస్థకు లక్ష్యం విధించి మరీ కొబ్బరికాయ కొట్టారు. కానీ రామోజీరావు మాత్రం... సవాలక్ష అర్థసత్యాలతో చెలరేగిపోయారు. నిజానికి 2018 మార్చి దాకా కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం భాగస్వామి. అన్నిటికన్నా ముఖ్యం... విజయనగరం జిల్లాకే చెందిన పి.అశోక్గజపతిరాజు కేంద్ర విమానయాన శాఖ మంత్రి. సొంత జిల్లాలో వస్తున్న విమానాశ్రయానికి అన్ని అనుమతులూ తెప్పించడానికి ఆయన ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. చంద్రబాబు నాయుడు కూడా పట్టించుకోలేదు. కానీ ఎన్నికల ముందు ఉత్తుత్తి శంకుస్థాపనతో హడావుడి మాత్రం చేశారు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసింది కూడా విమానాశ్రయానికి సంబంధించిన భూమిలో కాదు. అది తన సొంత భూమి అని, తన నుంచి విమానాశ్రయం కోసం సేకరించటం కూడా జరగలేదని, కానీ అందులో శంకుస్థాపన చేశారని అప్పట్లో సత్యనారాయణ అనే రైతు వాపోయాడు. చివరకు ఆ రైతు గోడును కూడా పట్టించుకోని రామోజీరావు... ఇపుడు మాత్రం ముఖ్యమంత్రి జగన్పై అభాండాలు వేయటం విచిత్రం. అమరావతి రైతులతో పోలికా? అప్పట్లో అమరావతి రైతులను త్యాగధనులగాను, భోగాపురం రైతులను లిటిగేషన్ పెట్టే రైతులుగాను చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించటం నిజం కాదా? అమరావతి రైతులతో చంద్రబాబునాయుడు మాట్లాడుతూ... తాను ఇచ్చిన పిలుపుతో అమరావతి కోసం. గన్నవరం విమానాశ్రయం కోసం రైతులు భూమిని ఇచ్చి త్యాగం చేశారని, కానీ భోగాపురం రైతులు భూములిచ్చి కోర్టుల్లో కేసులు వేసి లిటిగేషన్లు పెడుతున్నారని, అందుకే తాము ఎయిర్పోర్టును నిర్మించలేకపోతున్నామని చెప్పారు. మరి ‘ఈనాడు’ ఈ వాస్తవాలెందుకు రాయదు? ముఖ్యమంత్రి జగన్ మాట మార్చారంటూ తప్పుడు కథనాలేల? వ్యతిరేకించింది 12,000 ఎకరాల భూసేకరణనే... భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కోసం చంద్రబాబు నాయుడు 2015లో రైతుల నుంచి 12,000 ఎకరాలను సేకరించాలని నిర్ణయం తీసుకోవడంపై స్థానిక రైతుల్లో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమయింది. ఈ ఆందోళనతో నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఏకీభవించారు. అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు అన్ని ఎకరాల భూమి దేనికని ప్రశ్నించారు. 2,300 ఎకరాలు ఉంటే సరిపోతుందన్నారు. ‘‘చెన్నై ఎయిర్పోర్టు ఎన్ని ఎకరాల్లో ఉంది? ఢిల్లీ ఎయిర్పోర్టు ఎన్ని ఎకరాల్లో ఉంది? అని ప్రశ్నిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు మద్దతుగా నిలిచారు. చివరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సేకరించాల్సిన భూమిని తొలుత 6,000 ఎకరాలకు... ఆ తర్వాత 2,700 ఎకరాలకు కుదించుకుంటూ వచ్చింది. చివరకు 2017లో 2,700 ఎకరాల్లో ఎయిర్పోర్టు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించడంతో పాటు... ఇందుకోసం ఏర్పాటు చేసిన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు లిమిటెడ్ కంపెనీ పేరుమీద రూ.1,500 కోట్ల అప్పును హడ్కో నుంచి తీసుకోవడానికి అనుమతిస్తూ జీవో ఇచ్చారు. అయితే బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తూ కొందరు రైతులు కోర్టును ఆశ్రయించారు. ఇవేమీ ప్రస్తావించని ‘ఈనాడు’... నాడు భూసేకరణను వ్యతిరేకించి, నేడు శంకుస్థాపన చేస్తున్నారంటూ రాయటం దారుణం కాక మరేమిటి? ఏ1గా నిలిచింది జీఎంఆర్ సంస్థే... ► ఎయిర్పోర్టు నిర్మాణానికి తొలుత పిలిచిన టెండర్లల్లో ఎయిర్పోర్టు అథారిటీఆఫ్ ఇండియా ఎంపికయింది. కానీ ఆ టెండర్లను రద్దుచేసి తిరిగి పిలిచిన టెండర్లలో జీఎంఆర్ సంస్థే ఏ1గా నిలిచింది. ఈలోగా ఎన్నికలు సమీపించడంతో భూసేకరణ, పర్యావరణ అనుమతులు, జీఎంఆర్తో ఒప్పందం లేకుండానే హడావుడి శంకుస్థాపన చేశారు. అందుకే నాటి శంకుస్థాపనకు సైతం జీఎంఆర్ ప్రతినిధులు దూరంగా ఉన్నారు. ► ఈ ఎయిర్పోర్టు భూసేకరణపై సుప్రీంకోర్టు నవంబర్11, 2022న తీర్పు ఇస్తే జనవరి 2023 నాటికి భూసేకరణ పూర్తయ్యింది. ► ఈ ఏడాది మార్చిలో పునరావాస గ్రామాలకు ప్రజలను తరలించే ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసింది. ► ఇక ఎయిర్పోర్టు నిర్మాణానికి సంబంధించి ఎన్ఓసీ 2022 నవంబర్లో వచ్చింది. ఇలా అడ్డంకులన్నీ తొలగించాకే శంకుస్థాపన చేశారు సీఎం జగన్. అసలు ‘ఈనాడు’ ఏడుపు ఎందుకంటే నాడు చంద్రబాబు చేయలేకపోయింది..నేడు జగన్ చేస్తున్నారనే ఈర‡్ష్య ఒకటి కాగా... జీఎంఆర్ అధినేత గ్రంధి మల్లిఖార్జునరావు మాట్లాడుతూ... శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి జగనే పూర్తయ్యాక విమానాశ్రయాన్ని ప్రారంభించాలని వ్యాఖ్యానించటం ఎల్లో ముఠా జీర్ణించుకోలేకపోతోంది. అందుకే శంకుస్థాపన కార్యక్రమం వార్తను కుదించేసి... అసత్యాలు, అర్థసత్యాలతో కూడిన కథనాన్ని పతాక శీర్షికల్లో వేసేసింది. పునరావాస గ్రామాలూ పూర్తి... కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా అశోక్ గజపతిరాజు ఉన్నా చిత్తశుద్ధి లేకుండా భోగాపురాన్ని ఎన్నికల ప్రచారం కోసం వాడుకున్నది చంద్రబాబు నాయుడు. కానీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక వైఎస్ జగన్ దీనికి అనుమతులు సాధించటంతో పాటు ఈ నాలుగేళ్లలో పునరావాస గ్రామాలను సైతం పూర్తి చేశారు. అప్పట్లో బలవంతపు భూ సేకరణను వ్యతిరేకించిన మాట వాస్తవం. అందుకే స్థానికులు తమకు పరిహారం దక్కి.. స్వచ్ఛందంగా పునరావాస కాలనీలకు వెళ్లిన తరవాతే శంకుస్థాపన చేశారన్న విషయాన్ని దాచిపెడతారెందుకు రామోజీరావు గారూ? -
CM Jagan: ‘జగన్ పట్టుదలకు శెభాష్ అనాల్సిందే!’
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి హృదయపూర్వక అభినందనలు. ఆయనను ఎప్పుడు కలిసినా నేను విశాఖకు అదానీ డేటా సెంటర్ ఎప్పుడు వస్తుందని అడుగుతుండేవాడిని. ఆయన దానికి ఇప్పుడు సమాధానం ఇచ్చారు. ఇంత భారీ ఎత్తున డేటా సెంటర్ రావడం అంటే విశాఖనగరం ముఖ చిత్రాన్ని మార్చడమే. దీనికి తోడు భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి శ్రీకారం చుట్టడం కూడా గొప్ప విషయం. ఈ రెండిటికి ఒక రకంగా అనుబంధం ఉంటుంది. ఎందుకంటే.. అదానీ డేటా సెంటర్ లోనే మరో ఐదేళ్లలో 39 వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని అంచనా వేశారు. స్కిల్ యూనివర్శిటీ, రిక్రియేషన్ పార్క్, ఐటి పార్కు, విమానాశ్రయంలో కార్గో సెంటర్, ఎయిరోసిటీ మొదలైన వాటి ద్వారా మరిన్ని వేల మందికి అవకాశాలు రాబోతున్నాయి. వీరితో పాటే సర్వీస్ రంగం కూడా విపరీతంగా పెరిగిపోతుంది. ఇదే సమయంలో సెప్టెంబర్ నుంచి విశాఖలోనే ఉంటానని కూడా జగన్ ప్రకటించారు. అంటే విశాఖ సిగలో ఈ పరిపాలన రాజధాని మరో ఆభరణం అవుతుంది. ఈ రకంగా తెలంగాణ రాజదాని హైదరాబాద్ కు విశాఖ అతి త్వరలోనే పెద్ద పోటీ కాబోతోంది. ఐటీ రంగంలో విశాఖ ఒక్కసారిగా పుంజుకునే అవకాశం ఉంది. వైజాగ్ ఇప్పటికే మల్టీకల్చరల్ నగరంగా ఉంది. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఎప్పటినుంచో ఇక్కడ నివసిస్తున్నారు. ఏపీకి సంబంధించి కూడా పలు ప్రాంతాల ప్రజలు స్థిరపడ్డారు. ఈ దశలో ఈ అభివృద్ది అంతా జరిగితే విశాఖకే కాదు.. ఉత్తరాంధ్ర ప్రజల పంట పడుతుంది. 👉 ముఖ్యమంత్రి జగన్ అన్నట్లు ఈ ప్రాంతం నుంచి వలసలు కూడా బాగా తగ్గిపోతాయి. విశాఖకు సహజమైన కొన్ని సానుకూలతలు ఉన్నాయి. ఒక వైపు సముద్ర తీరం, మరో వైపు విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి , అల్లూరి సీతారామరాజు జిల్లాల ప్రాంతంలో నగరం విస్తరణకు ఎనలేని అవకాశం ఉండడం బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యమంత్రి జగన్ ఉత్తరాంద్ర ప్రాంతాన్ని, ఈ కొత్త ప్రాజెక్టులకు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. అదానీ డేటా సెంటర్ను తీసుకు రావడానికి ఆయన విశేష కృషి చేశారు. రాజకీయంగా తన పలుకుబడిని సైలెంట్ గా ఉపయోగించారు. వారికి అవసరమైన భూమిని కేటాయించడానికి అన్ని చర్యలు తీసుకున్నారు. 👉 తెలుగుదేశంకు మద్దతు ఇచ్చే మీడియా ఆదాని డేటా సెంటర్ పై ఎంత విష ప్రచారం చేసినా, తాను అనుకున్న లక్ష్యం ప్రకారం ముందుకు వెళ్లారు సీఎం జగన్. దీనిని రాకుండా చేయడానికి జరిపిన ప్రయత్నాలు విఫలం అవడంతో తెలుగుదేశం మీడియా కొత్త రాగం అందుకుంది. దీనికి చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడో శంకుస్థాపన చేసిందని ప్రచారం ఆరంభించారు. అప్పుడు అదానీ గొప్పవాడయ్యాడు. అదే జగన్ టైమ్ లో అదానీ ముందుకు వస్తే ఎంత నీచ ప్రచారం చేశారో గమనిస్తే ఈ మీడియాలపై చీదర వేస్తుంది. 👉 నిజానికి గత ఎన్నికలకు ఒకటి, రెండు నెలల ముందు హడావుడిగా ఎలాంటి ఏర్పాట్లు లేకుండా శంకుస్థాపన చేసి ప్రజలను మభ్య పెట్టాలని చూశారు. చంద్రబాబుకు ఇలా చేయడం కొత్తకాదు. అది వేరే విషయం. భోగాపురం ఎయిర్ పోర్టు, కడప స్టీల్ వంటివాటిని కూడా అలాగే చేశారు. కాని వాటన్నింటిని ఉత్తిత్తి వ్యవహారంగానే మిగిల్చారు. జగన్ ప్రభుత్వం వచ్చాక భోగాపురం ఎయిర్ పోర్టుకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేశారు. నిర్వాసితులకు పునరావాస ఏర్పాట్లు చేశారు. పర్యావరణ తదితర కేంద్ర ప్రభుత్వం నుంచి రావల్సిన అనుమతులను సాధించారు. ఇవన్ని పూర్తి అయిన తర్వాతే జగన్ శంకుస్థాపన చేసి పనులకు శ్రీకారం చుట్టారు. 👉 అంతేకాక ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్న గ్రంధి మల్లిఖార్జున రావు ఈ జిల్లాకే చెందినవారు కావడం అదనంగా కలిసి వచ్చే విషయం. ఆయన కూడా చాలా సంతోషంగా కనిపించారు. ముఖ్యమంత్రి కోరినట్లు ఆరు నెలల నుంచి ఏడాది ముందుగా ఎయిర్ పోర్టు నిర్మాణం పూర్తి చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. ఇక్కడ జరిగిన సభలో జగన్ మాట్లాడిన తీరు ఆయనలోని ఆత్మవిశ్వాసాన్ని స్పష్టంగా మరోసారి తెలియచేస్తుంది. 2026లో తానే వచ్చి మళ్లీ ఎయిర్ పోర్టును ప్రారంబిస్తానని ఆయన ప్రకటించారు. అంటే దాని అర్దం 2024 ఎన్నికలలో తిరిగి వైసిపి గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారన్నమాట. 👉 యధాప్రకారం ఆయన తాను మంచి చేశానని అనుకుంటే ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ఈ రకంగా గతంలో ఏ ముఖ్యమంత్రి చెప్పడానికి సాహసించలేదు. అది ఒక్క జగన్ వల్లే అయింది. ఇక్కడ మరో సంగతి చూడాలి.. ఆదానీ డేటా సెంటర్ కాని, ఇతరత్రా స్కిల్ యూనివర్శిటీ వంటి ఆయా అభివృద్ది కార్యక్రమాలను విశాఖలో చేపట్టడం వల్ల అవి వేగంగా పూర్తి అయ్యే అవకాశం వస్తుంది. అదే అమరావతి గ్రామాలలో ఏర్పాటు చేయవలసి వస్తే ఎన్నో సమస్యలు ఎదురయ్యేవి. విశాఖలో చాలా వరకు ప్రాధమిక సదుపాయాలు ఉన్నాయి. అమరావతి గ్రామాలలో సరైన రోడ్లు కూడా లేవు. కొత్తగా పరిశ్రమలు, ఇతర సంస్థలు రావాలంటే ఔత్సాహికులు వెనుకంజ వేసే అవకాశం ఉంది. 👉 అమరావతిని రియల్ ఎస్టేట్ వెంచర్ గా మార్చి ఎకరా భూమి ని నాలుగు కోట్ల వరకు తీసుకువెళ్లారు. దీనివల్ల కొత్తగా ఎవరైనా సంస్థలు పెట్టాలంటే చాలా వ్యయం చేయవలసి వస్తుంది. వారికి గిట్టుబాటు కాని పరిస్థితి ఎదురు అవుతుంది. గత ప్రభుత్వం ఎంపిక చేసుకున్న ప్రదేశంలో ప్రభుత్వ భూములు లేవు. అటవీ భూములు ఉన్నా వాటిని వాడుకోవడానికి ఎంతో కాలం పడుతుంది. ఎన్నో వ్యయప్రయాసలకు గురి కావల్సి ఉంటుంది. వీటిని గుర్తించకుండా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకపక్షంగా ముందుకు వెళ్లారు. పోనీ ఏవైనా నిర్మాణాలు చేశారా అంటే అంతా తాత్కాలికం అన్నారు. తద్వారా వందల కోట్ల రూపాయల నిదులను దుర్వినయోగం చేయడానికి సిద్దమయ్యారు. 👉 ఈ నేపధ్యంలో జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. విశాఖకు ఉన్న ప్రాముఖ్యతను గుర్తించారు. హైదరాబాద్ మాదిరి వేగంగా అభివృద్ది చెందడానికి, ఏపీకి గ్రోత్ ఇంజన్ గా మారడానికి విశాఖకు ఉన్న అవకాశాలను ఆయన అంచనావేశారు. ఇప్పటికే విశాఖ ఈ విషయంలో కొంతమేర ఉపయోగపడుతోంది. పరిపాలన రాజధాని అవడం, డేటా సెంటర్, కొత్త ఎయిర్ పోర్టు మొదలైనవన్ని వస్తే హైదరాబాద్ కు గట్టి పోటీ ఇచ్చే నగరంగా విశాఖ తయారవుతుంది. కానీ.. 👉 దీనిని అడ్డుకోవడానికి టిడిపి నేతలు, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా సంస్థలు విపరీతమైన కృషి చేశాయి. విష ప్రచారంతో ప్రజలలో వ్యతిరేక భావాలు నాటడానికి యత్నించాయి. అయినా జగన్ వారిని ఖాతరు చేయకుండా ముందుకు వెళ్లారు కాబట్టి ఇప్పుడు అవి వాస్తవరూపం దాల్చి విశాఖ రూపురేఖలను మార్చబోతున్నాయి. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పలు ప్రాజెక్టుల విషయంలోను టీడీపీ వర్గాలు ఇలాగే నిత్యం దుష్ప్రచారం చేసినా, ఆయన ఎక్కడా వెనక్కి తగ్గకుండా వ్యవహరించి ప్రజల నుంచి అభినందనలు అందుకున్నారు. అలాగే జగన్ కూడా ఎంతో పట్టుదలతో విశాఖ అభివృద్దిని కార్యరూపంలోకి తెచ్చి శెబాష్ అనిపించుకుంటున్నారు. ఎంతైనా రాజశేఖరరెడ్డి కుమారుడు కదా. :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ ప్రెస్ అకాడెమీ చైర్మన్ ఇదీ చదవండి: భగవంతుడి నిర్ణయమో తెలియదుగానీ.. -
జైలులో పెడతారని చంద్రబాబు భయపడుతున్నారు: అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: 30 నెలల్లో భోగాపురం ఎయిర్పోర్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. టీడీపీ హయాంలోఉత్తుత్తి శంకుస్థాపన చేశారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ పాలనలో చంద్రబాబు అండ్ కో రాష్ట్రాన్ని దోచుకున్నారని మండిపడ్డారు. రాజధాని భూముల్లో రియల్ ఎస్టేట్ చేయాలనుకున్నారని ఏకిపారేశారు. రాజధాని ప్రకటన కంటే ముందు టీడీపీ నేతలు భూ దోపిడీకి పాల్పడ్డారని ఫైర్ అయ్యారు. టీడీపీ హయాంలో అతిపెద్ద భూ కుంభకోణానికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. అందుకే తనను జైలులో పెడతారని చంద్రబాబు భయపడుతున్నారని గుడివాడ ఎద్దేవా చేశారు. అందుకే విచారణ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈమేరకు అమర్నాథ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. చదవండి: చంద్రబాబుకు బిగ్ షాక్.. ఈ కేసులో మొదటి నుంచీ ఏం జరిగిందంటే? -
సీఎం జగన్ పర్యటనకు అపూర్వ స్పందన.. కిక్కిరిసిన సభా ప్రాంగణం
సాక్షి, విజయనగరం: సీఎం జగన్ విజయనగరం, విశాఖపట్నం పర్యటనకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. సీఎం సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఆయన రాకతో సభా ప్రాంగణం కిక్కిరిసింది. రోడ్లన్నీ కిటకిటలాడాయి. సీఎం జగన్ కోసం వర్షంలో కూడా తడుస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ.. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం శ్రీకారం చుట్టారు. పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడంతో పాటు భోగాపురం మండలం సవరవిల్లి వద్ద నిర్వహించే బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. రూ.4,592 కోట్ల వ్యయంతో నిర్మించనున్న విమానాశ్రయ నిర్మాణ పనులకు శంకుస్ధాపన చేశారు. రూ.194.40 కోట్ల వ్యయంతో చేపట్టనున్న తారకరామతీర్దసాగరం ప్రాజెక్టు పనులతో పాటు చింతపల్లి వద్ద రూ.23.73 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఫిష్ ల్యాండింగ్ సెంటర్ పనులకు సీఎం శంకుస్ధాపన చేశారు. భగవంతుడి నిర్ణయమో తెలీదు కానీ.. సీఎం జగన్పై జీఎంఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చదవండి: ‘మార్గదర్శి’ జూమ్ మీటింగ్లో ఏం జరిగింది?.. బ్లాక్ మనీ వైట్గా ఎలా మారుతోంది? అన్ని ప్రాంతాలు బాగుపడాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యమని వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని సీఎం జగన్ అన్నారు. ఇటీవలే మూలపేటలో పోర్టుకు శంకుస్థాపన చేశాం. ఎయిర్పోర్టు ఉత్తరాంధ్రకు కేంద్ర బిందువుగా మారనుంది. తారకరామ తీర్థ సాగర ప్రాజెక్ట్ పనులకు శంకుస్థాపన చేయనున్నాం. ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర జాబ్ హబ్గా మారనుందని ఆయన అన్నారు. చదవండి: భగవంతుడి నిర్ణయమో తెలీదు కానీ.. సీఎం జగన్పై జీఎంఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు -
కదిలివచ్చిన జనాభిమానం.. భోగాపురంలో జై జగనన్న! (ఫొటోలు)
-
భోగాపురం ఎయిర్ పోర్ట్ శంకుస్థాన కార్యక్రమం... డ్రోన్ వీడియో
-
వలసల ఉత్తరాంధ్ర జాబ్హబ్గా మారబోతోంది: సీఎం జగన్
సాక్షి, విజయనగరం: అన్ని ప్రాంతాలు బాగాపడాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యం, అందుకే వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం భోగాపురం ఎయిర్పోర్ట్కు శంకుస్థాపన చేసిన అనంతరం.. సవరవల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఒకప్పుడు ఉత్తరాంధ్ర అంటే వలసలు గుర్తొచ్చేవి. కానీ, రాబోయే రోజుల్లో జాబ్ హబ్గా మారుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు. మూలపేటలో ఈ మధ్యే పోర్టుకు శంకుస్థాపన చేశాం. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్టు ఉత్తరాంధ్రకు కేంద్ర బిందువుగా మారనుందని సీఎం జగన్ ఆకాంక్షించారు. ఇవాళే అదానీ డేటా సెంటర్కు శంకుస్థాపన చేయబోతున్నాం. డేటా సెంటర్తో ఏపీ ముఖచిత్రమే మారబోతోందని సీఎం జగన్ పేర్కొన్నారు. ఓర్వలేకనే.. ఇవాళ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేయడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నికలకు నాలుగైదు నెలల ముందు హడావిడిగా కొబ్బరి కాయలు కొట్టారు. పైగా మేమే శంకుస్థాపనలు చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు. సుప్రీం కోర్టు, ఎన్జీటీలలో కేసులు వేసి అడ్డుపడ్డారు. అన్ని ఆటంకాలు దాటుకుని ఇవాళ ఎయిర్పోర్ట్కి శంకుస్థాపం చేసుకున్నాం. రైతన్నల వల్లే ఈ ప్రాజెక్టు వచ్చింది. మెడికల్ టూరిజం, ఐటీ, ఇండస్ట్రీస్కు కేంద్ర బిందువుగా భోగాపురం ఎయిర్పోర్ట్ మారబోతోంది అని సీఎం జగన్ పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధే లక్ష్యంగా.. 2026లో మీ బిడ్డనే(సీఎం జగన్ తనను ఉద్దేశించుకుంటూ..) వచ్చి ఎయిర్పోర్ట్ను ప్రారంభిస్తాడని,ప్రజల ఆశీస్సులు ఉన్నంతకాలం ఎవరు ఎన్నికుట్రలు చేసినా ఫలించవని ధీమా వ్యక్తం చేశారాయన. 24 నుంచి 30 నెలల్లోనే ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తామని జీఎంఆర్ హామీ ఇచ్చింది. ఏ380 డబుల్ డెక్కర్ ల్యాండ్అయ్యేలా.. ఏర్పాట్లు చేస్తాం. మొదటి ఫేజ్లో 60 లక్షల జనాభాకు సదుపాయలు సమకూరుస్తాం. చివరి దశకు వచ్చే సరికి నాలుగు కోట్ల ప్రజలకు సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని సీఎం జగన్ తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) అందుకే అల్లూరి జిల్లా.. ఉత్తరాంధ్ర పేరు చెప్పగానే.. మన్నెం వీరుడు అల్లూరి గుర్తుకొస్తారు. ఉత్తరాంధ్ర అంటే ఉత్తరాంధ్ర అంటే మన్యం వీరుడి పౌరుషం. బ్రిటీషర్లను గడగడలాడించిన అల్లూరి జన్మించిన గడ్డ ఇది. అందుకే కొత్త జిల్లాకు అల్లూరి పేరు పెట్టుకున్నాం. అభివృద్ధికి సులువుగా ఉండాలనే ఉన్న మూడు జిల్లాలను.. ఆరు జిల్లాలను చేశాం. ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేశాం. జూన్లోనే కిడ్నీ రీసెర్చ్ సెంటర్లను జాతికి అంకితం చేస్తాం. ఇచ్చాపురం, పలాసలకు రక్షిత తాగు నీరు అందిస్తాం. సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం అని సీఎం జగన్ తెలిపారు. ఈ సెప్టెంబర్ నుంచే విశాఖ నుంచి పాలన నడుస్తుందని మరోసారి భోగాపురం బహిరంగ సభ వేదికగా సీఎం జగన్ స్పష్టం చేశారు. ఇదీ చదవండి: డబుల్ డోస్తో ఉత్తరాంధ్ర ముఖచిత్రం మారిపోవాలా! -
నెరవేరబోతోన్న ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల
-
ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి: మంత్రి అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అనేక ప్రాజెక్టులతో అభివృద్ధి చేస్తున్నామని ఏపీ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఇప్పటికే మూలపేట పోర్టుకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారని, ఆ పోర్టు ద్వారా పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందన్నారు. మూలపేట పోర్ట్ పనులు త్వరితగతిన జరుగుతున్నాయి. మరో రెండున్నరేళ్లలో మూలపేట పోర్టు పూర్తి కానుంది. రేపు(బుధవారం) భోగాపురం ఎయిర్పోర్ట్, డేటా సెంటర్కు సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారని మంత్రి తెలిపారు. ‘‘రూ.3,500 కోట్లతో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం జరగనుంది. 2025 సెప్టెంబర్ లోపు ఎయిర్పోర్ట్ పూర్తి చేయాలన్నది లక్ష్యం. టెక్ పార్క్ ద్వారా లక్షకుపైగా ఉద్యోగాల కల్పన లక్ష్యం. రూ.6,500 కోట్లతో భోగాపురం విశాఖ మధ్య 6 లేన్ల రోడ్డు నిర్మాణానికి కేంద్రమంత్రి గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. హైదరాబాద్-సైబరాబాద్ ట్విన్ సిటీస్ మాదిరిగా భవిష్యత్లో విశాఖ-విజయనగరం అభివృద్ధి చెందుతాయి’’ అని అమర్నాథ్ అన్నారు. చదవండి: ‘చంద్రబాబుతో పవన్ కల్యాణ్ కలిసినా కాపులు కలవరు’ ‘‘ఎప్పుడైనా చంద్రబాబు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏదైనా ప్రాజెక్ట్ తీసుకువచ్చారా? 2019 ఫిబ్రవరి 15న ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని తెలిసీ భోగాపురం ఎయిర్పోర్టుకు శంకు స్థాపన చేశారు. ఆ సమయంలో కనీసం భూ సేకరణ, రన్ వే కోర్టు క్లియరెన్స్లు తీసుకోలేదు. సిమెంట్ పలక ఉంటే చాలు.. చంద్రబాబు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేసేస్తారు’’ అంటూ మంత్రి అమర్నాథ్ ఎద్దేవా చేశారు. చదవండి: ఏపీ వాసులకు అలర్ట్.. మూడురోజుల పాటు భారీ వర్షాలు -
భోగాపురం ఎయిర్పోర్ట్తో 4600 కోట్ల పెట్టుబడి: కరికాల వలవన్
సాక్షి, విజయవాడ: భోగాపురం ఎయిర్పోర్ట్తో 4600 కోట్ల పెట్టుబడి రాబోతుందని పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్ అన్నారు. మంగళవారం ఆయన ‘సాక్షి’ మాట్లాడుతూ విశాఖలో ఆర్థిక వృద్ధికి భోగాపురం ఎయిర్ పోర్ట్ దోహదపడుతుందన్నారు. నాలుగేళ్లుగా ఎన్నో సవాళ్లను ఎయిర్పోర్ట్ కోసం పరిష్కరించామని, భూ సేకరణ కేసులు, పర్యావరణ కేసులు పరిష్కరించామని ఆయన పేర్కొన్నారు. ‘‘కేంద్రం నుండి ఎయిర్పోర్ట్కి ఎన్వోసీ తెచ్చాం. రేపు భోగాపురం ఎయిర్పోర్ట్, ఆదాని డేటా సెంటర్కు సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారు. ఆదాని డేటా సెంటర్తో రూ.20 వేల కోట్ల పెట్టుబడి రాబోతుంది. ఐటీ పార్క్ కూడా ఆదాని సంస్థ అభివృద్ధి చేస్తుంది. 45 వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు రాబోతున్నాయి. సీఎం రాష్ట్రాన్ని పారిశ్రామికంగా వృద్ధి చెయ్యడానికి పోర్టులు, ఎయిర్ పోర్టులు, మౌలిక వసతులు కల్పిస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం జగన్ మౌలిక వసతులు పై దృష్టి పెట్టారని కరికాల వలవన్ పేర్కొన్నారు. చదవండి: ‘రైతులను అడ్డంపెట్టుకుని రామోజీ గలీజు రాతలు’ -
Bhogapuram Airport: సీఎం జగన్ చేతుల మీదుగా శంకుస్థాపన
సాక్షి, విజయనగరం: వచ్చే నెల(మే) 3వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేయనున్నారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఈ మేరకు శంకుస్థాపన కార్యక్రమ ఏర్పాట్లపై బుధవారం మంత్రి బొత్స.. విజయనగరం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ పనులతో పాటు చింతపల్లి వద్ద ఫ్లోటింగ్ జెట్టి కూడా శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే 2,203 ఎకరాల్లో విమానాశ్రయం నిర్మాణానికి భూ సేకరణ జరిగింది. ఈ సమీక్షలో మంత్రి బొత్సతో పాటు ఎంపీ బెల్లాన చంద్ర శేఖర్, జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, కలెక్టర్ నాగలక్ష్మి పాల్గొన్నారు. -
భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణానికి వచ్చే నెల 3న శంకుస్థాపన
-
భోగాపురం విమానాశ్రయానికి త్వరలో శంకుస్థాపన
సాక్షి, విశాఖపట్నం: భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, అదాని డేటా సెంటర్కు త్వరలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేస్తారని టీటీడీ చైర్మన్, వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. మంత్రులు గుడివాడ అమర్నాథ్, విడదల రజిని, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్బాబుతో కలిసి ఆయన బుధవారం ఎండాడ లా కాలేజీ రోడ్డు పనోరమ హిల్స్ వద్ద వైఎస్సార్సీపీ నూతన కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ పార్టీ కార్యాలయాల్లో త్వరలో కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి కార్యకర్తలకు అవసరమైన సేవలు అందిస్తామన్నారు. న్యాయ పరమైన చిక్కులు తొలిగాక విశాఖ పరిపాలన రాజధాని కానుందని చెప్పారు. ఎమ్మెల్సీలు వంశీకృష్ణ శ్రీనివాస్, వరుదు కల్యాణి, ఎమ్మెల్యేలు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, తిప్పల నాగిరెడ్డి, వాసుపల్లి గణేష్కుమార్, అన్నంరెడ్డి అదీప్రాజ్, మాజీ మంత్రులు పి.బాలరాజు, దాడి వీరభద్రరావు, నెడ్ క్యాప్ చైర్మన్ కేకే రాజు పాల్గొన్నారు. -
భోగాపురం ఎయిర్పోర్టుపై దాఖలైన అన్ని పిటిషన్లు కొట్టివేత
-
భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణానికి లైన్ క్లియర్
సాక్షి, అమరావతి: భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణానికి లైన్ క్లియర్ అయ్యింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఏపీ హైకోర్టు ఎత్తేసింది. భోగాపురం ఎయిర్పోర్టుపై దాఖలైన అన్ని పిటిషన్లు కోర్టు కొట్టివేసింది. ఎయిర్పోర్టు నోటిఫికేషన్ చెల్లదంటూ గతంలో రైతులు పిటిషన్ దాఖలు చేశారు. అనంతరం పలువురు రైతులు కేసు ఉపసంహరించుకున్నారు. ఇప్పటికే రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించింది. మిగిలిన రైతుల పిటిషన్ను హైకోర్టు కొట్టి వేసింది. భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం కోసం ఇప్పటికే జీఎంఆర్తో ఒప్పందం కుదిరింది. హైకోర్టు తీర్పుతో పనుల ప్రారంభానికి అడ్డంకులు తొలగాయి. నిర్మాణంపై గతంలో వేసిన స్టేను కూడా హైకోర్టు ఎత్తేసేంది. చదవండి: అసాగో బయోఇథనాల్ ప్లాంట్కు సీఎం జగన్ భూమి పూజ -
‘భోగాపురం’ అనుమతులు సరైనవే
సాక్షి, అమరావతి: ప్రజా ప్రయోజనాల నిమిత్తం ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు పర్యావరణంపై ప్రతికూల ప్రభావం చూపనంత వరకు ఆ నిర్ణయంలో న్యాయస్థానాలు, ట్రిబ్యునళ్లు జోక్యం చేసుకోలేవని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) స్పష్టం చేసింది. భోగాపురం గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇచ్చిన పర్యావరణ అనుమతులను రద్దు చేసేందుకు నిరాకరించింది. అనుమతులు రద్దుకు సహేతుక కారణాలు లేవని స్పష్టంచేసింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని, నిపుణుల కమిటీ సిఫారసుల ఆధారంగానే కేంద్ర మంత్రిత్వ శాఖ అనుమతులిచ్చిందని తెలిపింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నీటి వనరుల విషయంలో మాత్రమే తాము జోక్యం చేసుకుంటున్నామంది. తాము నిర్దేశించిన పరిమితికి మించి నీరు అవసరమైతే పర్యావరణ మంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేసుకుని నిబంధనల్లో మార్పు కోరవచ్చని తెలిపింది. ఈ మేరకు ఎన్జీటీ చెన్నై బెంచ్ జుడిషియల్ సభ్యులు జస్టిస్ కె.రామకృష్ణన్, ఎక్స్పర్ట్ సభ్యుడు డాక్టర్ సత్యగోపాల్ కొర్లపాటితో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. భోగాపురం విమానాశ్రయానికి పర్యావరణ అనుమతులు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ విశాఖపట్నం రాంనగర్కు చెందిన దాట్ల శ్రీదేవీ దాఖలు చేసిన అప్పీల్పై జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి తీర్పునిచ్చింది. ప్రభుత్వం తరఫున సయ్యద్ నూరుల్లా షరీఫ్, దొంతిరెడ్డి మాధురీరెడ్డి తదితరులు వాదనలు వినిపించారు. భోగాపురం విమానాశ్రయానికి ఎంత భూమి అవసరమన్న వివరాలను దాచిపెట్టారన్న పిటిషనర్ వాదనను ఎన్జీటీ తోసిపుచ్చింది. ‘పౌర విమానాశ్రయానికి 150 కిలోమీటర్ల పరిధిలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఉండకూడదన్న నిషేధం ఏదీ లేదు. ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్న ఎయిర్పోర్టు భోగాపురం విమానాశ్రయానికి 56 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రస్తుత విమానాశ్రయం నావికాదళానికి సంబంధించింది. పౌర విమానాశ్రయంగా దానిని నిర్వహించే విషయంలో కొన్ని పరిమితులున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్రంగా ఓ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలన్న విధానపరమైన నిర్ణయం తీసుకుంది.’ అని ట్రిబ్యునల్ తన తీర్పులో పేర్కొంది. -
భోగాపురం విమానాశ్రయానికి అత్యంత ప్రాధాన్యత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భోగాపురం విమానాశ్రయానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తెలిపారు. ఇందులో ప్రపంచస్థాయి సౌకర్యాలతోపాటు సరుకు రవాణా కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. రాష్ట్రంలో ఎయిర్ కార్గో అవకాశాలపై గురువారం ఫిక్కీ ఏర్పాటు చేసిన సమావేశంలో విజయసాయిరెడ్డి వర్చువల్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విమానాల ద్వారా సరుకు రవాణాకు అనేక అవకాశాలున్నాయన్నారు. ఇప్పటికే నాలుగు విమానాశ్రయాల్లో అందుబాటులో ఉన్న ఎయిర్ కార్గో సేవలను వినియోగించుకోవాల్సిందిగా ఎగుమతిదారులను కోరారు. ఎయిర్ కార్గో సేవల కోసం హైదరాబాద్, బెంగళూరు వెళ్లనవసరం లేకుండా రాష్ట్రంలోనే పూర్తి స్థాయిలో సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. వర్చువల్గా జరిగిన ఈ సమావేశంలో కస్టమ్స్ విజయవాడ ప్రిన్సిపల్ కమిషనర్ ఫాహీమ్ అహ్మద్తోపాటు వివిధ ఎయిర్లైన్స్, ఎయిర్పోర్టు అధికారులు, ఎగుమతిదారులు పాల్గొన్నారు. -
పర్యావరణ కోణంలోనే చూడాలి
సాక్షి, న్యూఢిల్లీ: పర్యావరణానికి సంబంధించిన కేసులను పర్యావరణ కోణంలోనే చూడాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆలస్యంగా పిటిషన్ దాఖలు చేశారని విచారించబోమని పేర్కొనడం సరికాదని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్లో భోగాపురం విమానాశ్రయానికి 2017 ఆగస్టులో అనుమతులు వచ్చాయి. వీటి విషయంలో నిబంధనలు పాటించలేదంటూ స్థానికురాలు దాట్ల శ్రీదేవి చెన్నైలోని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ)ను ఆశ్రయించారు. 90 రోజుల్లోగా పిటిషన్ దాఖలు చేయలేదని.. ఈ ఆలస్యం కారణంగా విచారించబోమని ఎన్జీటీ ఆదేశాలు వెలువరించింది. వీటిని సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ రవీంద్రభట్లతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరిస్తూ ఎన్జీటీ ఆదేశాలను పక్కనపెడుతున్నట్లు పేర్కొంది. పర్యావరణ అనుమతుల పత్రాలు అధిక సంఖ్యలో ఉన్నాయని.. వాటిని అధ్యయనం చేయడం, సాంకేతిక, ఇతర అంశాలపై నిపుణులతో సంప్రదింపులకు సమయం పట్టినందున పిటిషన్ దాఖలు చేయడంలో ఆలస్యమైందన్న పిటిషనర్ వాదనలతో ఏకీభవిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. పిటిషనర్తోపాటు ఇతరులు కూడా ఎన్జీటీ ముందు వాదనలు వినిపించొచ్చని పేర్కొంది. -
భోగాపురం దాకా విశాఖ లైట్ మెట్రో
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో చేపట్టనున్న మెట్రో రైలు ప్రాజెక్టును తొలి దశలోనే భోగాపురం ఎయిర్పోర్టు వరకూ నిర్మించేందుకు అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ (ఏఎంఆర్సీ) సన్నాహాలు చేస్తోంది. కేవలం నగరంలోనే మెట్రో రైలు నడపడం వల్ల భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాలను తీర్చలేమన్న ఉద్దేశంతో ఈ నిర్ణయానికి వచ్చింది. అంతర్జాతీయ విమానాశ్రయంగా ఏర్పడే భోగాపురం ఎయిర్పోర్టు వరకూ లైట్ మెట్రో రైలు ప్రాజెక్టును తొలి దశలో నిర్మిస్తేనే ప్రయోజనం ఉంటుందని అంచనాకు వచ్చినట్లు ఏఎంఆర్సీ ఎండీ రామకృష్ణారెడ్డి తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైలు కారిడార్లు శంషాబాద్ ఎయిర్పోర్టుకు అనుసంధానం కాకపోవడం ఒక లోపంగా మారింది. అలాంటి పరిస్థితి విశాఖలో ఉత్పన్నం కాకుండా చూడాలని అధికార వర్గాలు భావిస్తున్నాయి. విశాఖపట్నంలో 46.40 కిలోమీటర్ల మేర మూడు లైట్ మెట్రో కారిడార్లు నిర్మించాలని గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నం మొత్తాన్ని కలుపుతూ 140 కిలోమీటర్ల మేర లైట్ మెట్రో కారిడార్లను ప్రతిపాదించింది. అందులో కొమ్మాది–ఆనందపురం జంక్షన్, ఆనందపురం జంక్షన్–భోగాపురం ఎయిర్పోర్టు వరకూ ప్రతిపాదించిన కారిడార్లను రెండో దశలో నిర్మించాలని తొలుత భావించారు. కానీ, భోగాపురం ఎయిర్పోర్టుతో తొలి దశలోనే నగరాన్ని అనుసంధానిస్తే బాగుంటుందన్న అంచనాతో రోడ్ మ్యాప్ రూపొందించారు. డీపీఆర్, టెండర్ల ప్రక్రియ ఒకేసారి తొలి దశలో స్టీల్ప్లాంట్–కొమ్మాది జంక్షన్, గురుద్వారా–పాత పోస్టాఫీస్, తాటిచెట్లపాలెం–ఆర్కే బీచ్, కొమ్మాది–ఆనందపురం జంక్షన్, లా కాలేజి–మరికివలస, ఆనందపురం జంక్షన్–భోగాపురం ఎయిర్పోర్టు వరకూ 79.91 కిలోమీటర్ల మేర ఆరు కారిడార్ల నిర్మాణం చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇందుకోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీకి ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్, యూఎంటీసీ, రైట్స్ సంస్థలను సంప్రదించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్లు చెప్పారు. డీపీఆర్కి సమాంతరంగా ఈ ఆరు కారిడార్ల నిర్మాణానికి ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో టెండర్లు పిలిచే ప్రక్రియను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. తద్వారా మూడు నెలల్లో డీపీఆర్ సిద్ధమయ్యేటప్పటికి నిర్మాణ సంస్థను కూడా ఎంపిక చేసి, వెంటనే పనులు ప్రారంభించాలని అధికారులు యోచిస్తున్నారు. రెండో దశలో ట్రామ్ వ్యవస్థ! రెండో దశలో 60.2 కిలోమీటర్ల మేర నిర్మించే ఎన్ఏడీ జంక్షన్–పెందుర్తి, స్టీల్ప్లాంట్–అనకాపల్లి, పాత పోస్టాఫీస్–రుషికొండ బీచ్, రుషికొండ బీచ్–భీమిలి బీచ్ కారిడార్లను ఆధునిక ట్రామ్ వ్యవస్థలుగా నిర్మించాలని భావిస్తున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం తొలి దశలో చేపట్టే ఆరు కారిడార్లలో జన సమ్మర్థం ఎక్కువగా ఉంటుందన్న అంచనాతో వాటిని లైట్ మెట్రోగా, రెండో దశలో చేపట్టే కారిడార్లలో జన సమ్మర్థం తక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతో ట్రామ్ వ్యవస్థను ప్రతిపాదిస్తున్నారు. పూర్తిస్థాయిలో అధ్యయనం తర్వాతే దీనిపై తుదినిర్ణయం తీసుకోనున్నారు. కానీ, ముందస్తు అంచనాతో ట్రామ్ వ్యవస్థపైనా డీపీఆర్ తయారు చేయించాలని నిర్ణయించారు. మొదటి దశ కారిడార్లను ఈ సంవత్సరమే ప్రారంభించి 2024 నాటికి, రెండో దశను 2023లో ప్రారంభించి 2028–29 నాటికి పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించినట్లు ఏఎంఆర్సీ అధికారులు స్పష్టం చేశారు. -
వైజాగ్ ఎయిర్పోర్ట్ మూసివేయం: ఏఏఐ
హైదరాబాద్: విశాఖపట్నం విమానాశ్రయాన్ని మూసివేసే ఉద్ధేశం లేదని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) స్పష్టం చేసింది. కొత్తగా నిర్మించనున్న భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే విశాఖ ఎయిర్పోర్టును మూసివేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ‘వైజాగ్ ఎయిర్పోర్టు కొనసాగుతుంది. ఈ విషయాన్ని మా మంత్రి పార్లమెంటులో స్పష్టం చేశారు కూడా. మూసివేత విషయమై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన వచ్చింది. దీనికి మేం స్పందించలేదు. దీనికి కారణం ఈ ప్రతిపాదనను మేం పరిగణలోకి తీసుకోవడం లేదు’ అని ఏఏఐ ఫైనాన్స్ సభ్యులు ఎస్.సురేశ్ వ్యాఖ్యానించారు. ఏఏఐతో తాము చర్చిస్తున్నట్టు ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ తెలిపారు. వైజాగ్ ఎయిర్పోర్టులో చేసిన పెట్టుబడిని భర్తీ చేయాలని ఏఏఐ కోరిందని చెప్పారు. ఈ విషయాన్ని తేల్చాల్సిందిగా ఏఏఐ చెబుతోందన్నారు. ఎంత పెట్టుబడి పెట్టారో తెలపాలని, ఆ మొత్తాన్ని తాము చెల్లిస్తామంటూ లేఖ రాశామని ఆయన వివరించారు. ప్రస్తుతమున్న విమానాశ్రయం వైజాగ్ సిటీకి సమీపంలో ఉంది. వైజాగ్ సిటీ నుంచి 45 కిలోమీటర్ల దూరంలో భోగాపురం ఉంది. -
‘అంత గోప్యత ఎందుకో’
విజయనగరం జిల్లా: ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ఆగమేఘాల మీద భోగాపురం ఎయిర్పోర్టు శంకుస్థాపన చేయడానికి టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తహతహలాడటం ఓట్ల కోసమేనని వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాస రావు వ్యాఖ్యానించారు. విజయనగరంలో మజ్జి శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడారు. భోగాపురంలో రైతులు జిల్లా అభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం చాలా త్యాగాలు చేశారని అన్నారు. టీడీపీ ఎంపీ, కేంద్ర పౌర విమానయాన శాఖా మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు గతంలో భోగాపురం ఎయిర్పోర్టునకు నిర్మాణ సామర్థ్యం లేదని గతంలో చెప్పడం ప్రజలకు గుర్తుందని వ్యాక్యానించారు. ప్రాజెక్టులకు అంచనాలు(ఎస్టిమేషన్లు) వేయడం చంద్రబాబుకు కొత్తేమీ కాదని, గతంలో కూడా తోటపల్లికి ఆఖరిలో రాయి వేసి వెళ్లిపోతే తర్వాత వచ్చిన వైఎస్సార్, బొత్స సత్యనారాయణలు దానిని 90 శాతం పూర్తి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. భోగాపురం విషయంలో అంత గోప్యత ఎందుకు పాటిస్తున్నారో అర్ధం కావడం లేదని వ్యాఖ్యానించారు. ఎనిమిది కంపెనీలు బిడ్స్ దాఖలు చేసినా, టెక్నికల్ క్వాలిఫికేషన్ లేని వారికి బిడ్స్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఇప్పుడు ఏ కంపెనీకి క్వాలిఫికేషన్ ఉందని శంకుస్థాపన కార్యక్రమం చేస్తున్నారని అడిగారు. ఎన్నికల హామీలు 5 ఏళ్లలో నెరవేర్చి ఎన్నికల్లో ఓట్లేయాలని అడగాల్సిన మీరు, పూర్తిగా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఆఖరిలో డ్రామాలతో ఓట్లు అడగాలనుకోవడం దుష్ట సాంప్రదాయమన్నారు. అవాస్తవ ప్రక్రియ ద్వారా మీరు(చంద్రబాబు) ముందుకు వెళ్తున్నారని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు. వైఎస్సార్సీపీ, వైఎస్ జగన్ భోగాపురం రైతుల్లో భరోసా కల్పించారని అన్నారు. విమానాశ్రయానికి భూములు ఇచ్చేందుకు సహకరిస్తే భోగాపురం రైతులపై కేసులు ఎత్తివేస్తామన్నారు..కానీ ఇంత వరకు ఎందుకు కేసులు ఎత్తివేయలేదని టీడీపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. కొవ్వాడ తరహాలో రైతులకు జరిపిన చెల్లింపులను భోగాపురం రైతులకు కూడా చెల్లించాలని అడిగినా ఇంకా ఎందుకు చెల్లించలేదని సూటిగా ప్రశ్నించారు. రైతుల పట్ల కక్షాపూరితమైన చర్యలకు టీడీపీ ప్రభుత్వం పాల్పడుతోందని మండిపడ్డారు. -
13న ‘భోగాపురం’ సినిమా
సాక్షి, అమరావతి: ఎన్నికల ముంగిట మరో శంకుస్థాపన సినిమాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సన్నద్ధమయ్యారు. భూ సేకరణ పూర్తి కాకుండా, ప్రాజెక్టు ఎవరు నిర్మిస్తారో తెలియకుండానే భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మాణానికి ఈ నెల 13వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు. టెండర్ల ప్రక్రియ ఫిబ్రవరి 22తో ముగిసిన తర్వాత మార్చి మొదటి వారంలో శంకుస్థాపన తలపెడితే, ఎన్నికల కోడ్ వచ్చేస్తుందన్న భయంతో ఫిబ్రవరి 13న ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలంటూ ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) నుంచి ఆదేశాలు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. భూ సేకరణ, టెండర్లు వంటి కీలక పనులు కూడా కాకుండా కేవలం ఎన్నికల ప్ర,చారం కోసమే శంకుస్థాపన చేస్తుండడం గమనార్హం. టెండర్ల ప్రక్రియపై నీలినీడలు భోగాపురంలో సుమారు రూ.4,208 కోట్ల పెట్టుబడితో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మించాలని 2015లో ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మొత్తం 2,700 ఎకరాల భూమి అవసరమని అంచనా వేయగా, అందులో ఇంకా 300 ఎకరాలను సేకరించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. 2016లో టెండర్లు పిలవగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా దక్కించుకుంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఈ టెండర్లను రద్దు చేసి మెయింటినెన్స్, ఓవర్ ఆయిలింగ్(ఎంఆర్వో)తో కలిపి టెండర్లను పిలిచింది. తాజా టెండర్లలో ఎయిర్పోర్టు నిర్మించడానికి ఏడు సంస్థలు ఆసక్తి చూపించగా, ఈ సంస్థలు ఎంత ఆదాయం ఇస్తాయో తెలపాలంటూ ఫిబ్రవరి 22 వరకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. కానీ, ఇదే సమయంలో భోగాపురం ఎయిర్పోర్టు మొదలైన తర్వాత కూడా వైజాగ్ ఎయిర్పోర్టును కొనసాగిస్తామని ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా చెప్పడంతో ఈ టెండర్ల ప్రక్రియపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఫిబ్రవరి 22న ఎంతమంది టెండర్లలో పాల్గొంటారనేది ప్రశ్నార్థకరంగా మారింది. వాస్తవ పరిస్థితులు ఇలా ఉండగా, ముందుగానే గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ పేరుతో కొబ్బరికాయ కొట్టి మరో శిలాఫలకం వేయడానికి ముఖ్యమంత్రి సిద్ధమయ్యారు. ఇప్పటికే కడప ఉక్కు, రామాయపట్నం పోర్టులకు ఇదే విధంగా శంకుస్థాపనలు చేసిన సంగతి తెలిసిందే. -
‘భోగాపురం’పై ఏడు సంస్థల ఆసక్తి
సాక్షి, అమరావతి: భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం చేపట్టడానికి ఏడు సంస్థలు తమ ఆసక్తిని తెలుపుతూ బిడ్లను దాఖలు చేశాయని ఇంధన, మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ మంగళవారం ‘సాక్షి’కి వెల్లడించారు. జీవీకే, జీఎంఆర్లతో పాటు దక్షిణ కొరియాకు చెందిన ఇంచియాన్ ఎయిర్పోర్టుతో కలసి రిలయన్స్ గ్రూపు, జర్మనీకి చెందిన మూనిచ్ ఎయిర్పోర్టుతో కలసి ఎస్సెల్ గ్రూపు (జీగ్రూపు సుభాష్ చందర్జీ), స్విడ్జర్లాండ్కు చెందిన జ్యూరిచ్ ఎయిర్పోర్టుతో కలసి డూఇట్, బెంగళూరు ఎయిర్పోర్ట్తో కలసి ఐ ఇన్వెస్ట్మెంట్, జెర్మనీ ఎయిర్ పోర్టు–ఏవీఐ అలయెన్స్ కలసి ఎన్ఐఐఎఫ్ పేరుతో బిడ్లు దాఖలు చేసినట్లు తెలిపారు. బిడ్ల పరిశీలనకు పదిరోజులు ఈ బిడ్లను పరిశీలించి ఆయా సంస్థలకు అన్ని అర్హతలు ఉన్నాయా లేదా అని పరిశీలించేందుకు పది రోజుల సమయం పడుతుందని ఏపీ ఎయిర్పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఈవో వీరేంద్ర సింగ్ తెలిపారు. ఆ తర్వాత అర్హుల వివరాలను వెల్లడిస్తామన్నారు. అర్హత సాధించిన సంస్థలు ఆదాయంలో ఎంత వాటాను ఇస్తాయో తెలపమంటూ రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ (ఆర్ఎఫ్క్యూ) పిలవనున్నట్లు తెలిపారు. ఆర్ఎఫ్క్యూ దాఖలు చేయడానికి 45 రోజుల సమయం ఇవ్వనున్నారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయి తుది కాంట్రాక్టరను ఎంపిక చేయడానికి కనీసం రెండు నెలలకు పైగా పడుతుందన్నారు. ఏఏఐ కన్నా ఎక్కువ కోట్ చేస్తాయా? విశాఖ సమీపాన భోగాపురంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మించేందుకు 2016లోనే ప్రభుత్వం టెండర్లను పిలిచింది. మొత్తం మూడు దశల్లో 1.8 కోట్ల మంది ప్రయాణికుల సామర్థ్యంతో రూ.4,208 కోట్ల పెట్టుబడి అంచనాతో దీన్ని నిర్మించనున్నారు. వీటిల్లో ప్రభుత్వరంగ సంస్థ ఎయిర్పోర్ట్ అథార్టీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అత్యధికంగా ఆదాయంలో 30.2 శాతం వాటాను ఆఫర్ చేయడం ద్వారా టెండరును కైవసం చేసుకుంది. -
భోగాపురం నుంచి బాత్రూం వరకు..
సాక్షి, న్యూఢిల్లీ : భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం నుంచి బాత్రూం వరకు టీడీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు మండిపడ్డారు. భోగాపురం మిమానాశ్రయం నిర్మాణ టెండర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆయన కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హాకు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. భోగాపురం ఎయిర్పోర్ట్ టెండర్ల వ్యవహారంలో టీడీపీ ప్రభుత్వం పెద్దు ఎత్తున అవినీతికి పాల్పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు పనులు అప్పగించకుండా టెండర్ను రద్దు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు నచ్చిన ప్రైవేట్ సంస్థల కోసం ఇతరులు టెండర్లో పాల్గొనకుండా ప్రభుత్వం నిబంధనలు మార్చడంపై కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. భోగాపురం విమానాశ్రయ టెండర్లలో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాను పాల్గొనకుండా సీఎం చంద్రబాబు అప్పటి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజుపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. ఎయిర్పోర్ట్ చుట్టు పక్కల ఉన్న భూములు కొట్టేయడానికే ఆ సంస్థ టెండర్లను చంద్రబాబు రద్దు చేశారన్నారు . రియల్ ఎస్టేట్ వ్యాపారంతో ముడుపులు తీసుకోవచ్చని ఈ టెండర్లను ప్రయివేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై న్యాయపోరాటం చేస్తామన్నారు. ఎయిర్పోర్ట్ వ్యయాన్ని రూ.2వేల కోట్ల నుంచి 4వేల కోట్లకు చంద్రబాబు పెంచారని దుయ్యబట్టారు. ఈ టెండర్ల వ్యవహారంలో చోటుచేసుకున్న అవినీతిపై సీబీఐ విచారణ చేపట్టేలా కోర్టులో పిటీషన్లు వేస్తామన్నారు. -
ఏఏఐ టెండర్లు రద్దు చేసిన చంద్రబాబు
-
భోగాపురం ఎయిర్ పోర్ట్ టెండర్ వెనుక భారీ కుట్ర!
సాక్షి, హైదరాబాద్: భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణ టెండర్ వెనుక భారీ దోపిడీకి కుట్ర జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన ఈ మేరకు ఓ ప్రకటనను ట్వీట్ చేశారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణ టెండర్లో పాల్గొనకుండా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నిషేదించారని పేర్కొన్నారు. కేవలం ప్రైవేట్ సంస్థలను మాత్రమే టెండర్కు అర్హులను చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక భారీ దోపిడీకి పథక రచన జరిగిందని ఆరోపించారు. గతంలో ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఈ టెండర్ను దక్కించుకోవడంతో కుంటి సాకులు చూపుతూ సీఎం చంద్రబాబు దానిని రద్దు చేశారన్నారు. తాజాగా జారీ చేసిన టెండర్లో అసలు ఎయిర్ పోర్ట్స్ అథారిటీ పాల్గొనకుండా నిషేదించడం సరైన చర్యనేనా అని ప్రశ్నించారు. ప్రైవేట్ కంపెనీలైతే వారితో కుమ్మక్కై ఇష్టారాజ్యంగా దోచుకోవచ్చని, ఎయిర్ పోర్ట్స్ అథారిటీ అయితే దోపిడీ సాధ్యకాదనే ఇలా చేశారని మండిపడ్డారు. ఇది కాదని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. చదవండి: టార్గెట్ భోగాపురం -
భారీ లూటీకి బాబు సర్కారు స్కెచ్
-
టార్గెట్ భోగాపురం
సాక్షి, అమరావతి: భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణంలో భారీ లూటీకి రంగం సిద్ధమైంది. కోట్లాది రూపాయలు కమీషన్లు కొట్టేయడానికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు వ్యూహాలు సిద్ధం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో భారీ దోపిడీకి అనుకూలంగా అస్మదీయులకు పనులు కట్టబెట్టడానికి నిబంధనలు రూపొందిస్తున్న విధానంలోనే ఈ ఎయిర్పోర్ట్ పనులను కూడా అప్పగించేందుకు రెడీ అయ్యారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఎప్పటి నుంచో ఆసక్తి చూపిస్తోంది. ఎక్కువ రెవెన్యూ వాటా ఇస్తామని కూడా గతంలో దాఖలు చేసిన బిడ్లలో పేర్కొంది. అయితే ఆ సంస్థ నుంచి కమీషన్లు రావని మొత్తానికి టెండర్లనే రద్దు చేశారు. తాజాగా ఆహ్వానించిన కొత్త బిడ్లలోనూ ఏఏఐ పాల్గొనేందుకు వీలు లేకుండా వ్యూహం పన్నారు. ఏ నిబంధన విధిస్తే ఏఏఐను టెండర్లలో పాల్గొనకుండా దూరంగా ఉంచవచ్చో అదే నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. బిడ్లలో పాల్గొనే సంస్థ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుండాలనే నిబంధన పెట్టడం వెనుక ఏఏఐని నిలువరించే ఉద్దేశం స్పష్టమవుతోంది. మూడు దశల్లో రూ. 4,209 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించనున్న ఈ ఎయిర్పోర్ట్లో కోట్లాది రూపాయలు కొల్లగొట్టేయడానికి ప్రభుత్వ పెద్దలు చూస్తున్నారని అధికారవర్గాలు పేర్కొన్నాయి. కమీషన్లు రావనే పాత టెండర్లు రద్దు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఫైనాన్షియల్ బిడ్లను 2017 ఆగస్టు 21వ తేదీన తెరిచారు. రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ వాటాగా 30.2 శాతం ఇవ్వడంతోపాటు ఎకరానికి ఏటా రూ. 20 వేల చొప్పున భూమికి లీజు, 26 శాతం ఈక్విటీని ఇస్తామని ఏఏఐ తెలిపింది. ఈ బిడ్లలో పాల్గొన్న జీఎంఆర్ 21.6 శాతం మాత్రమే రెవెన్యూ వాటా ఇస్తామని పేర్కొంది. దీంతో ఎక్కువ రెవెన్యూ వాటా ఇస్తామన్న ఏఏఐకి ఎయిర్పోర్టు పనులను అప్పగించాలని ఆర్థికశాఖతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సంబంధిత అధికారులు సిఫార్సు చేశారు. అయితే ఏఏఐ నుంచి ముడుపులు, కమీషన్లు రావని ఉద్దేశంతో ముఖ్యనేత.. అదనపు పనులు, ఇంకా భూ సేకరణ అవసరం అంటూ భోగాపురం టెండర్లను రద్దు చేయించారు. అదనపు పనులు చేపట్టేందుకు కూడా తాము సిద్ధమంటూ ఏఏఐ లేఖ రాయడం, టెండర్ల రద్దుపై పౌర విమానయాన శాఖ వివరణ కోరటం, ఏఏఐకే పనులు అప్పగించడం సముచితమని ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సూచించడంతో ప్రభుత్వ పెద్దలు ఇరకాటంలో పడ్డారు. ఇప్పుడు తాజాగా బిడ్లను ఆహ్వానించినా ఏఏఐ మళ్లీ పాల్గొంటే తమ లక్ష్యం నెరవేరదని చాకచక్యంగా అర్హత నిబంధనలను రూపొందించారు. ఈ షరతుల ద్వారా బిడ్లలో ఏఏఐ పాల్గొనేందుకు వీలు లేకుండా చేశారని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ‘రియల్’ వ్యాపారం చేసి ఉంటేనే... సాధారణంగా ప్రైవేట్ సంస్థలైతే వాణిజ్య, రియల్ ఎస్టేట్ నిర్మాణాలను చేపట్టి ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థ కావటంతో ఏఏఐ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను చేపట్టదు. దీన్ని ఆసరాగా తీసుకుని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం బిడ్లలో పాల్గొనే వారు గత పదేళ్లలో 1.50 లక్షల చదరపు మీటర్ల నిర్మిత ప్రాంతంలో వాణిజ్య, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఉండాలనే నిబంధన విధించారు. అలాగే కనీసం 3 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో రెసిడెన్షియల్ కమ్ వాణిజ్య వ్యాపారం చేసి ఉండాలని, కనీసం 100 ఎకరాల్లో మూడు లక్షల చదరపు మీటర్ల ప్రాంతంలో రెసిడెన్షియల్ అండ్ టౌన్షిప్ నిర్మించి ఉండాలనే షరతులను పొందుపరిచారు. ఈ నిబంధనల ద్వారా ఏఏఐని బిడ్లలో పాల్గొనకుండా నిలువరించారని, కావాలనే ఇలాంటి మెలిక పెట్టారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు తమకు నచ్చిన సంస్థను ఎంపికచేసి పనులు కట్టబెట్టేందుకే ఇలాంటి నిబంధనలను తెరపైకి తెచ్చారని వారు చెబుతున్నారు. మూడు దశల్లో పనులు.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తొలుత 5,311 ఎకరాల్లో రెండు దశల్లో నిర్మించాలని భావించారు. తర్వాత ఒక దశలోనే 2,708 ఎకరాల్లో రూ. 2,461 కోట్ల వ్యయంతో నిర్మించాలని నిర్ణయించి 2016 జూలైలో బిడ్లను ఆహ్వానించారు. అయితే ఇప్పుడు 3 దశల్లో పనులను పూర్తి చేయాలని నిర్ణయించారు. మూడు దశలకు నిర్మాణ వ్యయం రూ. 4,209 కోట్లు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. తొలిదశకు రూ. 2,302.51 కోట్లు, రెండో దశకు రూ. 989.58 కోట్లు, మూడో దశ పనులకు రూ. 917.01 కోట్లు వ్యయం అవుతుందని ఆసక్తి వ్యక్తీకరణ నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ పనులను అనుకూల కంపెనీకి అప్పగించి తద్వారా రూ. కోట్లు కొల్లగొట్టడానికి ముఖ్యనేత వ్యూహం పన్నారని, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ విషయం స్పష్టమవుతోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. -
‘అక్కడ ఎయిర్పోర్టు నిర్మాణానికి ఓకే’
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నం సమీపంలోని భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణాన్ని చేపట్టేందుకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఆసక్తి చూపుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జయంత్ సిన్హా రాజ్యసభలో బుధవారం వెల్లడించారు. రాజ్యసభలో వైఎస్సార్ సీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి వివరణ ఇచ్చారు. పీపీపీ విధానంలో విమానాశ్రయం నిర్మాణం చేపట్టేందుకు ఉద్దేశించిన టెండర్లో పలు మార్పులు చేసేందుకు ఏపీ ప్రభుత్వం పూనుకుంది. అందుకనే మొదట జారీ చేసిన టెండర్ను రద్దు చేసింది. కాగా, తాజాగా జారీ చేసిన టెండర్ బిడ్లను తెరిచిన పిమ్మట ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతలను చేపట్టడానికి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆసక్తి కనబరిచినట్లు మంత్రి వివరించారు. తాజా టెండర్ ప్రకారం ఎయిర్పోర్ట్ నిర్మాణ బాధ్యతలను చేపట్టిన సంస్థ విధిగా ఏవియేషన్ అకాడమీ, ఎంఆర్వోను అభివృద్ధి చేయాల్సిసిన అవసరం లేదని మంత్రి వెల్లడించారు. చేపల వేటకు నష్టం లేదు సముద్ర గర్భంలో ఓఎన్జీసీ నిర్మించిన పైప్లైన్ వల్ల చేపలకు, చేపల వేటకు నష్టం జరుగుతోందని రాజ్యసభలో విజయసాయి రెడ్డి బుధవారం సంబంధిత మంత్రిని వివరణ కోరారు. స్పందించిన పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. ఓఎన్జీసీ సముద్ర గర్భంలో నిర్మించిన పైప్లైన్ వల్ల చేపలకు, చేపల వేటకు ఎలాంటి నష్టం వాటిల్లడం లేదని స్పష్టం చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో ఓఎన్జీసీ, గెయిల్, ఆయిల్ ఇండియా కంపెనీలు సముద్ర గర్భంలో నిర్మించిన పైప్లైన్ల వల్ల సముద్రంలోని చేపలు సుదూర ప్రాంతాలకు తరలిపోతున్న ఉదంతాలేవీ తమ దృష్టికి రాలేదన్నారు. ఓఎన్జీసీ తన రాజమండ్రి అసెట్ ద్వారా విడుదలయ్యే వ్యర్థ జలాలను సముద్రంలో కలిపేందుకు 2017 ఫిబ్రవరిలో 1.5 కిలో మీటర్ల మేర సముద్ర గర్భంలో సురక్షితంగా పైప్ లైన్ను నిర్మించిందని తెలిపారు. అధీకృత సంస్థల అనుమతులతోనే సముద్రగర్భంలో పైప్లైన్ల నిర్మాణం జరిగిందనీ, మత్స్య సంపదకు లేదా మర బోట్లకు ఎలాంటి నష్టం వాటిల్లదన్నారు. సముద్ర గర్భంలో పైప్లైన్ నిర్మాణాలు లేదా డ్రెడ్జింగ్ పనులతో మరపడవలు లేదా మత్స్య సంపదకు నష్టం జరుగుతోందని నిరూపించే ఆధారాలేవీ లేవని ఓఎన్జీసీ తెలియచేసినట్లు మంత్రి చెప్పారు. అయితే, జిల్లాలోని కరవాక గ్రామానికి చెందిన మత్స్యకారులు పైప్లైన్ నిర్మాణంతో చేపల వేటకు, వలలకు, పడవలకు నష్టం వాటిల్లుతోందనీ, తమకు నష్టపరిహారం చెల్లించాలంటూ ఓఎన్జీసీకి ఒక వినతి పత్రం అందచేశారని మంత్రి గుర్తుచేశారు. -
భోగాపురం ఎయిర్పోర్టుపై ఫలించని బాబు యత్నాలు
-
కమీషన్ల కథ అడ్డం తిరిగింది!
సాక్షి, అమరావతి: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం ద్వారా ఆర్థికంగా భారీ లబ్ధిపొందాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ప్రయత్నాలు ఫలించలేదు. ఇంటిగ్రేటెడ్ విమానాశ్రయం, అదనపు భూసేకరణ సాకులతో భోగాపురం టెండర్లను సీఎం చంద్రబాబు రద్దు చేయించడం తెలిసిందే. అయితే ఈ టెండర్ల రద్దుకు సీఎం ఏ కారణాలనైతే చెప్పారో ఆ పనులన్నీ కూడా తాము చేపడతామని స్పష్టం చేస్తూ ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం గమనార్హం. ఏఏఐకి అప్పగిస్తే సొంతలాభం ఉండదనే! పోలవరం తరహాలోనే భోగాపురం ఎయిర్పోర్టు పనులను ప్రైవేట్ సంస్థకు అప్పగించి ఎస్కలేషన్స్ పేరుతో ఇష్టానుసారం అంచనాలను పెంచేసి కమీషన్లు కాజేసే యత్నాలను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంది. అత్యధికంగా రెవెన్యూ వాటా ఇస్తామని ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ముందుకొచ్చినా భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులను అప్పగించకుండా టెండర్లను రద్దు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించడం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏఏఐకి పనులు అప్పగిస్తే ముడుపులు రావనే ఉద్దేశంతోనే భోగాపురం టెండర్లను రద్దు చేశారని అధికార వర్గాలే వ్యాఖ్యానించాయి. ఇదే అంశాన్ని ‘సాక్షి’ ఇప్పటికే పాఠకులకు తెలియజేసింది. అదనపు పనులకు ఏఏఐ సంసిద్ధత భోగాపురంలో ఇంటిగ్రేటెడ్ ఎయిర్ పోర్టును తామే నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో (ఏఏఐ) తెలిపింది. మెయింటెనెన్స్ రిపేర్స్ ఆపరేట్ (ఎంఆర్వో), ఏవియేషన్ అకాడమీని కూడా నిర్మిస్తామని, అదనపు పనులు చేపట్టాలంటే రాయితీ ఒప్పందంలో ఆ విషయాలను పొందుపరచవచ్చంటూ ఈ నేపథ్యంలో టెండర్ గడువును పొడిగించాల్సిందిగా ఏఏఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని లేఖలో కోరింది. మరోవైపు టెండర్లలో పాల్గొని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని దక్కించుకున్న ఏఏఐకి ఆ పనులను అప్పగించాలంటూ పౌర విమానయానశాఖ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రాయడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇరకాటంలో పడ్డారు. ఏఏఐకి అప్పగించడమే సముచితం ఏఏఐ రాసిన లేఖను ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (గతంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ కార్పొరేషన్ లిమిటెడ్ ) సీఈవో లోతుగా అధ్యయనం చేశారు. టెండర్లలో పాల్గొని అత్యధికంగా రెవెన్యూ వాటా ఇవ్వడంతోపాటు అదనపు పనులు చేపట్టేందుకు కూడా అంగీకరిస్తూ లేఖ రాసినందున భోగాపురం విమానాశ్రయం పనులను ఏఏఐకి అప్పగించడమే మేలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేశారు. టెండర్ రద్దుకు సంబంధించి వచ్చిన ఆరోపణలపై కేంద్ర పౌర విమానయానశాఖ వివరణ కోరిన నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని పునరాలోచించి ఏఏఐకి పనులు అప్పగించాలని సూచించారు. దీంతో ఏం చేయాలో పాలుపోక ముఖ్యమంత్రి చంద్రబాబు తర్జనభర్జన పడుతున్నారు. రెండు బిడ్లూ సక్రమమే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి 2016 జూన్లో పీపీపీ విధానంలో టెండర్లను ఆహ్వానించారు. టెండర్ దాఖలు గడువును ముఖ్యమంత్రి సూచన మేరకు 2017 జూలై 31 వరకు అధికారులు పొడిగించడంతో జీఎంఆర్ ఎయిర్పోర్టు ప్రైవేట్ లిమిటెడ్, ఎయిర్ పోర్టు అధారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) బిడ్లు దాఖలు చేశాయి. ఈ రెండు బిడ్లూ సక్రమంగా ఉన్నాయని ప్రభుత్వం ఏర్పాటు చేసిన టెక్నికల్ కమిటీ స్పష్టం చేసింది. అత్యధిక రెవెన్యూ వాటా ఇస్తామన్నా.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కార్పొరేషన్ చైర్మన్ సమక్షంలో 2017 ఆగస్టు 21వ తేదీన ఫైనాన్సియల్ బిడ్లు తెరిచారు. రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ వాటాగా 30.2 శాతం ఇవ్వడంతోపాటు ఎకరానికి ఏటా రూ. 20 వేల చొప్పున భూమికి లీజు, 26 శాతం ఈక్విటీని ఇస్తామని ఎయిర్ పోర్టు అధారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తెలిపింది. జీఎంఆర్ 21.6 శాతం మాత్రమే రెవెన్యూ వాటా ఇస్తామని పేర్కొంది. దీంతో ఎక్కువ రెవెన్యూ వాటా ఇస్తామన్న ఏఏఐకి భోగాపురం ఎయిర్పోర్టు పనులను అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ఆర్థికశాఖతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సంబంధిత శాఖలన్నీ కూడా ఇదే సిఫార్సు చేశారు. అయితే ఏఏఐకి ఇవ్వడం ఇష్టం లేని సీఎం చంద్రబాబు అదనపు పనులు, ఇంకా భూ సేకరణ అవసరం అంటూ భోగాపురం టెండర్లను రద్దు చేయించారు. అదనపు పనులు చేపట్టేందుకు తాము సిద్ధమంటూ ఏఏఐ లేఖ రాయడం, టెండర్ల రద్దుపై పౌర విమానయాన శాఖ వివరణ కోరటం, ఏఏఐకే పనులు అప్పగించడం సముచితమని ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సూచించడంతో తో ముఖ్యమంత్రి ఇరకాటంలో పడ్డారు. భోగాపురం ఎయిర్పోర్టు ఇలా... భోగాపురం వద్ద 2,708 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి రూ. 2,461 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ప్రభుత్వ, ప్రైవేట్, అసైన్డ్ భూములను సేకరించేందుకు హడ్కో నుంచి రూ.840 కోట్ల రుణం మంజూరైంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కార్పొరేషన్ లిమిడెట్ను స్పెషల్ పర్పస్ వెహికల్గా ఏర్పాటు చేశారు. తొలుత 5,311 ఎకరాలు అవసరమని, రెండు దశల్లో నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. అనంతరం రెండు దశల్లో కాకుండా ఒకేదశలో 2,708 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ఎయిర్ పోర్టుకు 1,733.66 ఎకరాలు, వాణిజ్య అవసరాలకు 592.69 ఎకరాలు, ఎయిర్ పోర్టు అప్రోచ్ రోడ్డుతో పాటు వాణిజ్య ప్రాంతానికి 175.70 ఎకరాలు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కార్పొరేషన్కు 201.21 ఎకరాలను కేటాయించారు. -
టీడీపీ సర్కార్ భూదోపిడీపై ప్రధానికి లేఖ
సాక్షి, విజయవాడ : తెలుగుదేశం ప్రభుత్వ భూ దోపిడీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాస్తున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజులు వారి స్వప్రయోజనాల కోసమే విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్పోర్టు టెండర్ను రద్దు చేశారని ఆయన మండిపడ్డారు. భోగాపురం ఎయిర్పోర్టు టెండర్ రద్దు వెనుక ఉన్న కుట్రలు, కుతంత్రాలపై ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాస్తున్నట్లు ఆయన చెప్పారు. విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బొత్స సత్యనారాయణ మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...రాష్ట్ర విభజన సమయంలో విజయనగరం జిల్లా భోగాపురంలో రాష్ట్రానికి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మిస్తామని కేంద్రం చెప్పిందని గుర్తు చేశారు. కానీ చంద్రబాబు కేబినెట్ సమావేశం పెట్టి భోగాపురం ఎయిర్పోర్టు టెండర్ను రద్దు చేశారని దీన్ని వైఎస్ఆర్ సీపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. టెండర్ల రద్దుకు ఇంటిగ్రేటెడ్ ఎయిర్పోర్టు అని, భూసేకరణ జరగలేదని చంద్రబాబు కుంటిసాకులు చెబుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబులాంటి దుర్భుద్ధి కలిగిన వ్యక్తిని ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఎక్కడా చూడలేదని బొత్స విమర్శించారు. స్థానిక ఎంపీగా ఉన్న అశోక్ గజపతిరాజు కేంద్రంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నా.. టీడీపీ తరపున పనిచేస్తున్నాడని ధ్వజమెత్తారు. కేంద్రమంత్రి హయాంలో ఎంత దోపిడీ జరుగుతుందో భోగాపురం ఎయిర్పోర్టు ఒక ఉదాహరణ అని బొత్స అన్నారు. 2013 సంవత్సరంలో భోగాపురంను గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుగా చేయాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించిందని గుర్తు చేశారు. 2015లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు భోగాపురంకు గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అన్ని అనుమతులు మంజూరు చేసిందన్నారు. ఎయిర్పోర్టు నిర్మాణానికి జరిగిన టెండర్లో అశోక్గజపతిరాజు శాఖకు సంబంధించిన ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ప్రభుత్వ రంగ సంస్థ, ఒక ప్రైవేట్ సంస్థ పాల్గొన్నాయని బొత్స గుర్తు చేశారు. కాగా టెండర్లో ప్రభుత్వరంగ సంస్థ 30.2 శాతం ప్రభుత్వానికి ఆదాయం ఇస్తామని కోడ్ చేసిందని, మరో ప్రైవేట్ సంస్థ 21.6 శాతానికి కోడ్ చేసిందన్నారు. ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు టెండర్ ఇస్తే ఈ నాయకుల దోపిడీకి అవకాశం ఉండదు కాబట్టే టెండర్ను రద్దు చేశారన్నారు. దీనికి ఇంటిగ్రేటెడ్ ఎయిర్పోర్టు, భూసేకరణ జరగలేదని కుంటిసాకులు చెబుతున్నారని ధ్వజమెత్తారు. భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణానికి 10 వేల ఎకరాలు సేకరిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధర్నా చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే దిగొచ్చిందన్నారు. 10 వేల ఎకరాలను 5300 ఎకరాలకు తీసుకొచ్చి దాన్ని మళ్లీ 2560 ఎకరాలకు ఫైనల్ చేసిందన్నారు. దాంట్లో 2500ల ఎకరాల భూసేకరణ పూర్తయిందని, మళ్లీ భూసేకరణ జరగలేదని చెప్పడంలో ఆంతర్యం దోపిడీ అని స్పష్టంగా అర్థం అవుతుందన్నారు. ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి మామూళ్లకు లాలూచీ పడ్డారని అర్థం అవుతుందని అన్నారు. -
భారీ ఎయిర్పోర్ట్ అక్కర్లేదు
ప్రధానికి విమాన ప్రయాణికుల సంఘం లేఖ గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): భోగాపురం విమానాశ్రయం ఏర్పాటుకు కోట్లాది రూపాయలు వెచ్చించాల్సిన అవసరం లేదని భారత విమాన ప్రయాణికుల సంఘం పునరుద్ఘాటించింది. రైతుల్ని రోడ్డున పడేసి అవసరానికి మించి విమానాశ్రయం నిర్మించాలనుకోవడం సరికాదని పేర్కొంది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్షుడు డి.వరదారెడ్డి ప్రధాని మోదీకి లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ అత్యుత్సాహం వల్ల విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తొలగించే కుట్రలు జరుగుతున్నాయని, అదే సమయంలో భోగాపురంలో రైతుల నుంచి వేల ఎకరాల భూములు లాక్కుంటున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికే విశాఖ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దారని, ఇరువైపులా మరో 150 మీటర్ల మేర విస్తరించాలని ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఆదేశాలొచ్చాయన్నారు. అందువల్ల విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ప్రయాణికుల అవసరాలకు సరిపోయేలా భోగాపురం విమానాశ్రయాన్ని నిర్మిస్తే చాలన్నారు. శంషాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కంటే పెద్దిగా భోగాపురం గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని నిర్మిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఎయిర్పోర్టుకు శరవేగంగా భూసేకరణ
► వచ్చే నెలాఖరునాటికి పూర్తిస్థాయిలో సర్వే ► ఇంకా సేకరించాల్సినది 345ఎకరాలు మాత్రమే ► పక్కా ప్లాన్తో ముందుకు సాగుతున్న రెవెన్యూ అధికారులు భోగాపురం : గ్రీన్ఫీల్డు ఎయిర్పోర్టుకు దాదా పు భూములు సిద్ధమయ్యాయి. సర్వే పనుల్లో రెవెన్యూ అధికారులు నిమగ్నమయ్యారు. ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చినెలలో పూర్తి స్థాయిలో భూసేకరణ చేసేందుకు అవసరమైన పనులు ముమ్మరం చేస్తున్నారు. ఎయిర్పోర్టుకు తుది నోటిఫికేషన్ ప్రకారం 2545 ఎకరాలు సేకరించాల్సి ఉండగా ఒప్పటికి 2200 ఎకరాల సేకరణ పూర్తయింది. ఇంకా సేకరించాల్సింది కేవలం 345ఎకరాలే. దానికి సంబంధించిన రైతులు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం కావాలని కోరుతూ హైకోర్టులో స్టే తెచ్చుకోవడంవల్ల ఈ జాప్యం ఏర్పడింది, అయితే వారిని కూడా అంగీకరింపజేసే పనిలో రెవెన్యూ అధికారులు ఉన్నారు. చేతులు మారిన డి–పట్టా భూముల స్వాధీనం: ఎయిర్పోర్టు ప్లానులో గతంలో ఇచ్చిన డి–పట్టాభూములు ఎక్కువగా చేతులు మారిన విషయాన్ని రెవెన్యూ సిబ్బంది గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకునే పనిలో ఉన్నారు. ప్లానులో ఇలా 215 ఎకరాలు ఉన్నట్లు ఇప్పటికే గుర్తించారు. దానిలో 175ఎకరాలకు సంబంధించిన రైతులకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న వారు 3నెలల్లో ఎలాంటి అభ్యంతరాలున్నా ఆర్డీఓ ఎదుట అప్పీలు చేసుకోవాల్సి ఉంది. ఇంతవరకూ 50ఎకరాలకు సంబంధించిన రైతులు అప్పీలు చేసుకున్నారు. ఇంకా 40 ఎకరాలకు సంబంధించి నోటీసులు ఇవ్వాల్సి ఉందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. కవులవాడ రెవెన్యూలో 120 ఎకరాలు, కంచేరు రెవెన్యూలో 8, గూడెపువలస రెవెన్యూలో 50, రావాడ రెవెన్యూలో 30 ఎకరాలు డి పట్టా భూములు చేతులు మారాయని తహసీల్దారు అధికారికంగా తెలిపా రు. ఈ నెలాఖరుకు ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు పనులు వేగవంతం చేస్తున్నారు. పునరావాస స్థల అభివృద్ధి బాధ్యత వుడాకు: ఎయిర్పోర్టు ప్లానులో మరడపాలెం, బొల్లింకలపాలెం, రెల్లిపేట, ముడసర్లపేట గ్రామాలను తరలించాల్సి ఉంది. ఆయా గ్రామాల్లో 376 కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. వీరందరికీ చెరుకుపల్లి వద్ద నివాస యోగ్యమైన స్థలాన్ని అధికారులు గుర్తించి దానిని అభివృద్ధి చేసే బాధ్యత వుడాకు అప్పగించారు. త్వరలో పునరావాస పనులను చేపట్టనున్నట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఆక్రమిత భూముల సర్వే: ఎయిర్పోర్టు ప్రతిపాదిత భూముల్లో డి పట్టాలు లేకుండా సాగుచేస్తున్న భూమి 40 ఎకరాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఆ భూముల్ని ఎవరు సాగుచేస్తున్నారో తెలుసుకునేందుకు అధికారులు సర్వే చేపడుతున్నారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తావివ్వకుండా పక్కాగా సర్వే చేపట్టే పనిలో ఉన్నారు. దీనిపై ఇప్పటికే తహసీల్దారు డి.లక్ష్మారెడ్డి సిబ్బందికి తగు సూచనలు ఇవ్వడంతో పాటు సిబ్బంది ఎటువంటి ప్రలోభాలకు తలొంచినా వారిపై వేటు తప్పదని గట్టిగా హెచ్చరించారు. -
భోగాపురం విమానాశ్రయానికి వ్యతిరేకంగా ఆందోళన
భోగాపురం: విజయనగరం జిల్లా భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటును వ్యతిరేకిస్తూ స్థానికులు సోమవారం ఆందోళనకు దిగారు. విమానాశ్రయ బాధిత గ్రామాల ప్రజలు, సీపీఎం నాయకులు సంయుక్తంగా పాదయాత్ర చేపట్టారు. వీరి పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఎ.రావివలస కూడలి వద్ద కురుపాం మాజీ ఎమ్మెల్యే లక్ష్మణమూర్తితోపాటు సీపీఎం నాయకులను, బాధితులను అరెస్ట్చేసి భోగాపురం స్టేషన్కు తరలించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
భూసేకరణకు వ్యతిరేకంగా సీపీఐ రాస్తారోకో
భూపరిరక్షణ పోరాట కమిటీ నాయకుల అరెస్ట్కు నిరసనగా సాలూరు పట్టణంలో ఆదివారం సీపీఐ రాస్తారోకో చేసింది. విజయనగరం జిల్లా భోగాపురంలో విమానాశ్రయ నిర్మాణానికి ప్రభుత్వం భూమి సేకరించడాన్ని వ్యతిరేకిస్తూ భూపరిరక్షణ పోరాట కమిటీ జిల్లా వ్యాప్తంగా ఈ నెల 20 నుంచి మూడు రోజుల పాటు పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో ప్రభుత్వం మందస్తుగా స్థానిక నాయకులను అదుపులోకి తీసుకుంది. దీనికి నిరసనగా సీపీఐ నాయకుడు రాంచందర్రావు ఆధ్వర్యంలో జాతీయరహదారిపై రాస్తారోకోకు దిగారు. -
బోగాపురం ఎయిర్పోర్టు ప్రాంతాల్లో మరోసారి ఉద్రిక్తత
-
భోగాపురం ఎయిర్ పోర్టు వద్దు: మావోయిస్టుల లేఖ
-
భోగాపురం ఎయిర్పోర్టు భూసేకరణపై హైకోర్టులో పిటిషన్
-
భోగాపురం ఎయిర్పోర్టు భూసేకరణపై హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్ : విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్పోర్టు భూ సేకరణపై మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. భూ సేకరణను వ్యతిరేకిస్తూ ఉప్పాడ సూర్యనారాయణ, కాకర్లపూడి సత్యనారాయణ రాజు ...న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ నెల 30వ తేదీలోపు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అప్పటి వరకూ రైతుల పంటలకు ఎలాంటి ఆటంకం కలిగించవద్దని ఆదేశించింది. కాగా భోగాపురం వద్ద గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ గతంలో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైన విషయం తెలిసిందే. ఈ జీవోల అమలును నిలిపేసి, భోగాపురం ప్రజలను వారి భూముల నుంచి ఖాళీ చేయించకుండా అధికారులను ఆదేశించాలని కోరుతూ భోగాపురం మండలం, రావివలస గ్రామ సర్పంచ్ ఉప్పాడ శివారెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి, పౌర విమానాయశాఖ కార్యదర్శి, డెరైక్టర్ జనరల్, నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గ్రామ సభలు తీర్మానాలు చేసినా, వాటిని ఖాతరు చేయకుండా ప్రభుత్వం ముందుకెళుతోందని పిటిషనర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సారవంతమైన భూములను రైతుల నుంచి వారి ఇష్టానికి విరుద్ధంగా తీసుకుంటూ, భూ మాఫియా, రియల్టర్లకు సాయం చేస్తోందని ఆరోపించారు. మరోవైపు కాగా భోగాపురం వద్ద నిర్మించనున్న ఎయిర్పోర్టు కోసం నెల రోజుల్లో భూసేకరణ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే తమ భూములను ఇచ్చేది లేదని రైతులు తెగేసి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు ఏపీ సర్కార్ కు ఎదురుదెబ్బే అని చెప్పుకోవచ్చు. -
మదగజాలు మనకెందుకు?
భోగాపురం విమానాశ్రయానికి 4,000 ఎకరాలు ఎందుకు? అక్కడ ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఎలా బతికి బట్టకట్టగలుగుతుంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లెక్కలూ, అంచనాలూ ఏమిటి? కానీ భోగాపురం విమానాశ్రయం హైదరాబాద్, ఢిల్లీ విమానాశ్రయాలను అధిగమిస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నమ్ముతోంది. అదే జరగాలంటే ఉత్తరాంధ్ర నాలుగు జిల్లాల ప్రజలు మొత్తం నెలకి ఒక్కసారైనా గగనయానం చేయవలసి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ దిశ దశ తీరు ఆందోళనకు, విచారానికి గురిచేస్తోంది. భారత దేశంలో ప్రభుత్వాలు తాము ఏం చేయదలుచుకున్నాయో, అదే చేస్తుంటాయి. కాబట్టి ప్రజలు వాటిని అదుపులో పెట్టలేరు. ఆ ప్రభుత్వాలు కూలిపోయిన తరువాత కూడా వాటి ద్వారా ఒనగూడిన నష్టాలను ప్రజలు అనుభవిస్తూ ఉండవలసిందే. ప్రస్తుతం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. కానీ ఆ ప్రభుత్వం వల్ల సంభవించిన చేటును ప్రజలంతా చవిచూస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ మరో దశాబ్దానికి గాని కోలుకోలేదు. 2004-2014 మధ్య మూడు లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కానీ విజ్ఞులైన రాజకీయవేత్తలు తప్పులు జరిగాయని భావించగానే పద్ధతి మార్చు కుంటారు. జాన్ ఎఫ్ కెన్నడీ తాను చేసిన తప్పులను గ్రహించాడు. వాటిని సరిదిద్దుకున్నాడు కూడా. అందుకే ఇప్పటికీ ఆయనను స్మరించుకుంటున్నాం. రైతులు, దళితులు, ఇతరులకు సంబంధించి 2013 భూసేకరణ చట్టం అమలు తీరు మారాలని నేను ముందునుంచీ ఆందోళన చేస్తున్నాను. పోలవరం డ్యామ్ పేరుతో, తాడిపూడి పంపింగ్ పథకం పేరుతో, కాకినాడ సెజ్ కోసం, ఇప్పుడు భోగాపురం విమానాశ్రయం కోసం, రాజమండ్రి విమానాశ్రయం విస్తరణ కోసం ఈ పేదవర్గాల భూములను బలవంతంగా తీసుకుంటున్నారు. అవసరాలకు అనుగుణంగానే... రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు వంటి మౌలిక వసతులు అవసరమే. కానీ వాటి నిర్మాణం అవసరాలకు అనుగుణంగా జరగాలి. ఓ విమానాశ్రయమో, నౌకాశ్రయమో నిర్మించి పెడితే విమానాలూ, నౌకలూ వాటంతట అవే వస్తాయనుకోవడం తప్పుడు అభిప్రాయం. ఇది రుజువైంది కూడా. చైనా, జపాన్ వంటి దేశాలు మౌలిక వసతుల సామర్థ్యాన్ని అతిగా పెంచుకోవడం వల్ల ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఆ దేశాలు అవసరం లేని రోడ్లు నిర్మించాయి. వృథాగా రైల్వేమార్గాలను నిర్మించి పెట్టుకున్నాయి. విమానాశ్రయాలను నిర్మించి ఖాళీగా పెట్టుకున్నాయి. దీనితో ఎదురైన ఆర్థికభారం ఆ దేశాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. జపాన్ సంపన్న దేశం కాబట్టి తన పౌరులను కష్టాలలో పడకుండా రక్షించుకుంది. చైనాలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాదు కాబట్టి, ప్రజల ఆగ్రహాన్ని అణచిపెట్టి ఉంచింది. చైనా 150 కొత్త విమానాశ్రయాలను, వందలాది కొత్త నౌకాశ్రయాలను నిర్మించింది. రైల్వే మార్గాన్ని రెట్టింపు చేసింది. వేల మైళ్ల జాతీయ రహదారులను తయారుచేసింది. కానీ వాటిలో చాలావరకు విమానాశ్రయాలలో విమానాల జాడ కానరాదు. నౌకాశ్రయాలలో నౌకల రాకపోకలు ఉండవు. రైల్వే మార్గాలు, జాతీయ రహదారులు ఖాళీ. అతి సామర్థ్యమే చైనా సంక్షోభానికి కారణమని ప్రతి ప్రముఖ ఆర్థికవేత్త చెబుతాడు. అక్కడ ఇప్పుడు చాలా సిమెంట్ కర్మాగారాలను మూసేశారు. కానీ ఒకటి. అవినీతి రాజకీయవేత్తలతో ఆ దేశం వ్యవహరించే తీరు ప్రత్యేకం. అవినీతి వ్యవహారాలలో పట్టుబడితే, అలాంటివాళ్లను కాల్చి చంపే బృందం లేదా ఉరి తీయడానికి తాళ్లు సిద్ధంగా ఉంటాయి. ఒక రైల్వే మంత్రి కాల్పుల బృందం చేతిలో మరణించాడు. ఈ గణాంకాలు తెలియవా? నౌకాశ్రయాలూ, విమానాశ్రయాల స్థాయి మౌలిక వసతుల గురించి ఆంధ్రప్రదేశ్ మాత్రమే మాట్లాడుతోంది. మికెన్సీ వంటి విదేశీ నిపుణులు, సింగపూర్ ప్రభుత్వం దీనికి సలహాదారులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భోగాపురంలో 4,000 ఎకరాలలో విమానాశ్రయం నిర్మించాలని ఆరాటపడుతోంది. అలాగే రాజమండ్రి విమానాశ్రయాన్ని విస్తరించాలని అనుకుంటోంది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం 3,500 ఎకరాలలో విస్తరించి ఉంది. హైదరాబాద్ విమానాశ్రయం కూడా దాదాపు అంతే. ముంబై విమానాశ్రయాన్ని 2,200 ఎకరాలలో నిర్మించారు. హైదరాబాద్లోనే బేగంపేట విమానాశ్రయం 700 ఎకరాలలో ఏర్పాటైంది. రోజుకు ఢిల్లీ-1,400, ముంబై-1,200, చెన్నై-400, హైదరాబాద్- 300, అహ్మదాబాద్ - 120, గోవా-100, త్రివేండ్రం-50, విశాఖపట్నం-40, భువనేశ్వర్-35, రాజమండ్రి-16 వంతున విమానాలు రాకపోకలు సాగిస్తాయి. భోగాపురం షాంఘై నగరం కాదు భోగాపురాన్ని ఎవరైనా ఒక పెద్ద నగరంగా భావించగలరా? అదేమైనా చైనాలో షాంఘై నగరమా? విశాఖ విమానాశ్రయానికి 40 విమానాలు రాకపోకలు సాగిస్తుంటే, భోగాపురానికి 4 మించి రాకపోకలు సాగించవు. అసలు ఒక్కటి కూడా రాకపోయినా ఆశ్చర్యం లేదు. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు విమానాశ్రయాల ప్రైవేటు యాజమాన్యాలు చెబుతున్నదేమిటి? ఒక్కొక్క ప్రయాణికుడి రూ. 500 వంతున అభివృద్ధి రుసుము కింద చెల్లిస్తే తప్ప వాటిని నిర్వహించడం సాధ్యం కాదని ప్రభుత్వానికి చెప్పాయి. ఆ రకంగా చూస్తే ప్రయాణికుడు నుంచి రూ. 2,000 వసూలు చేస్తే తప్ప భోగాపురం విమానాశ్రయాన్ని నిర్వహించడం సాధ్యం కాదు. ఒకవేళ ఇది ప్రభుత్వ నిర్వహణలో విమానాశ్రయమైతే, నాసిక్ విమానాశ్రయం మాదిరిగా మూసుకోవాలి. భోగాపురం విమానాశ్రయానికి 4,000 ఎకరాలు ఎందుకు? అక్కడ ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఎలా బతికి బట్టకట్టగలుగుతుంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లెక్కలూ, అంచనాలూ ఏమిటి? కానీ భోగాపురం విమానాశ్రయం హైదరాబాద్, ఢిల్లీ విమానాశ్రయాలను అధిగమిస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నమ్ముతోంది. అదే జరగాలంటే ఉత్తరాంధ్ర నాలుగు జిల్లాల ప్రజలు మొత్తం నెలకి ఒక్కసారైనా గగనయానం చేయవలసి ఉంటుంది. విజయవాడ, విశాఖ విమానాశ్రయాలు ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయాలు. మరి, కేవలం 200 మైళ్ల పరిధిలో మూడు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఎందుకు? నిజానికి రాజమండ్రి, విశాఖ, విజయవాడ విమానాశ్రయాలు ఇప్పటికి కూడా ఉదయం, సాయంత్రం తప్ప మిగిలిన సమయం మొత్తం ఖాళీగా ఉంటాయి. ఈ నౌకాశ్రయాలు అవసరమా? ఆంధ్రప్రదేశ్లో విశాఖ, కాకినాడ, కృష్ణపట్నం, గంగవరం, రవ్వ, భావనపాడు నౌకాశ్రయాలు పనిచేస్తున్నాయి. ఇంకా మచిలీపట్నం, నరసాపురం, నిజాంపట్నం, ఓడరేవు, ముత్యాలంపాలెం, భీమునిపట్నం నౌకాశ్రయాల నిర్మాణానికి ప్రతిపాదనలు ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జపాన్ పర్యటన సందర్భంగా కేవలం కొన్ని మైళ్ల దూరంలో దగ్గరదగ్గరగానే నౌకాశ్రయాలు చూసి, ఇక్కడ కూడా అలాగే నిర్మిస్తే అభివృద్ధి త్వరితగతిన జరుగుతుందని అభిప్రాయపడుతున్నారని మీడియాలో వచ్చిన వార్తలను బట్టి తెలుస్తోంది. కానీ జపాన్లో కనిపించే ఆ నౌకాశ్రయాలన్నీ వందల సంవత్సరాల క్రితమే నిర్మించుకున్నవి. 1900 సంవత్సరం నుంచి మొదట రష్యాతో తరువాత అమెరికాతో జరిగిన యుద్ధాల సమయంలో వాటిని నిర్మించుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్కు అలాంటి చరిత్ర లేదు. భావనపాడు, కళింగపట్నాలలో చేపలవేటకు ఉద్దేశించిన నౌకాశ్రయాల నిర్మాణం పూర్తయింది. తీరా చేపలవేట పడవలను ఎక్కువగా విశాఖలోనే ఉపయోగిస్తున్నారు. కానీ చేపలవేట సాగించే పడవలు లేని చోట్ల వేల ఎకరాలు సేకరించి నౌకాశ్రయాలు నిర్మించారు. చైనాను చూసి మోసపోవద్దు మన నాయకులు చైనాలో పర్యటించి వచ్చి, అక్కడి అభివృద్ధి గురించి ఊదరగొడుతూ ఉంటారు. కానీ చైనా అభివృద్ధిని చూసి ఇవాళ ప్రపంచం నవ్వుకుంటోంది. గడచిన సంవత్సరం 130 చైనా విమానాశ్రయాలు బిలియన్ డాలర్ల నష్టాన్ని చవి చూశాయని ప్రపంచ ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక వ్యాఖ్యానించింది. ఎనిమిదేళ్ల క్రితం ప్రఫుల్ పటేల్ పౌర విమానయాన మంత్రిగా ఉండగా నాసిక్ నగరానికి ఒక విమానాశ్రయాన్ని మంజూరు చేశారు. అక్కడ నుంచి ఒక్క విమానం కూడా ఎగరదు, దిగదు. దానిని వైమానిక దళాన్ని తీసుకోమన్నారు. ఇప్పుడు పటేల్ మంత్రి కాదు. కాబట్టి బంట్రోతు కూడా ఆయన మాట వినడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు ఆ శాఖను నిర్వహిస్తున్నప్పటికి ఇలాంటి పనికి మాలిన బహుమానాలు మాత్రం మనకి వద్దు. ఇంకో పౌర విమానయాన మంత్రి వస్తే తరువాత పరిస్థితి ఏమిటి? నాలుగు వేల ఎకరాల భూమిని ఎందుకు వృథా చేయాలి? ఈ దండగమారి వ్యవహారాలు ఎందుకు! భోగాపురం విమానాశ్రయం శుద్ధ దండగమారి వ్యవహారం. దేశంలోని మిగిలిన విమానాశ్రయాల కోసం సేకరించిన భూమి, భోగాపురం విమానాశ్రయం కోసం సేకరించిన భూమి కంటే తక్కువేనని గణాంకాలు చెబుతున్నాయి. నాసిక్ విమానాశ్రయం వలె దీనిని మూసివేయడం జరగదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూములు తీసుకున్న రైతులకు భరోసా ఇవ్వాలి. ఐదేళ్ల తరువాత కూడా విమానాశ్రయం పుంజుకోకపోతే రైతుల భూములు వారికి తిరిగి ఇవ్వాలి. నిజానికి రాకపోకలు సరిగా లేని, 4,000 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన విమానాశ్రయాన్ని నిర్వహించే సామర్థ్యం ప్రభుత్వానికి లేదు. అంతా సజావుగా సాగాలంటే ఇక్కడికి రోజుకు కనీసం 500 విమానాలు రాకపోకలు సాగించాలి. మచిలీపట్నం సహా, ఇతర నౌకాశ్రయాలు కూడా వ్యర్థమే. ఇవి సహజ నౌకాశ్రయాలు కాకపోవడం వల్ల, నిత్యం పూడిక తీయవలసిన పని ఉంటుంది. ఇంత భూమి సేకరించడం వెనుక ఆలోచన చూస్తుంటే, ఎవరో రియల్ఎస్టేట్ వ్యాపారులకు భూమి అప్పగించి, మనకి ఇంకో నౌకాశ్రయం వచ్చిందని చెప్పడానికే అని అనిపిస్తుంది. కాకినాడ సెజ్ 10,000 ఎకరాల భూమికి సంబంధించినది. కానీ అక్కడ జరుగుతున్నదేమీ లేదు. సెజ్ పేరుతో తీసుకున్న తమ భూములను వెనక్కు ఇవ్వాలని అక్కడ రైతులు కోరుతున్నారు. ఒకటి వాస్తవం. మహారాజులు కూడా తెల్ల ఏనుగులను భరించలేరు. నిజానికి అనాలోచితంగా నిర్మించిన విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు తెల్ల ఏనుగులు కూడా కాదు. అవి మదగజాలు. మనుషులను చంపడానికే ఉపయోగపడతాయి. అవి మనకొద్దు. (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్: 98682 33111 - పెంటపాటి పుల్లారావు -
జగన్కు ఘనస్వాగతం
పర్యటనలో పోటెత్తిన జనం అందరినీ అప్యాయంగా పలుకరించిన విపక్షనేత ఆయన వాహనశ్రేణిని అనుసరించిన పార్టీ కార్యకర్తలు విశాఖపట్నం/తగరపువలస: భోగాపురం ఎ యిర్పోర్టు నిర్వాసిత రైతాంగపక్షాన నిలిచేం దుకు సోమవారం విశాఖ చేరుకున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డికి ఎయిర్పోర్టులో ఘనస్వాగతం లభించింది. పార్టీ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తుల వచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఆయన భోగాపురానికి బయలుదేరారు. మార్గ మధ్యలో భీమిలి మండలం మజ్జివలసలో పోర్ట్ట్రస్ట్ సభ్యుడు దాట్ల వెంకట అప్పలప్రసాదరాజు ఇంటివద్ద కాస్సేపు ఆగారు. ఈసందర్భంగా ఆ గ్రామానికి జనం భారీగా తరలివచ్చి జగన్కు స్వాగతం పలికారు. భీమిలి నియోజకవర్గంతో పాటు నగరం నుంచి కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు. అక్కడకు వచ్చిన వారందరినీ ఆయన ఆప్యాయంగా పలకరించారు. మహిళలు, చిన్నపిల్లలతో జగన్మోహన్రెడ్డి పలుకరిస్తూ యోగక్షేమాలు తెలుసుకున్నారు. జగన్ రాకతో గ్రామం కోలాహలంగా మారింది. ఆయనకు స్వాగతం పలికేందుకు ఉత్తరాంధ్రకు చెందిన పార్టీ ముఖ్యనాయకులతో పాటు, జిల్లాకు చెందిన సమన్వయకర్తలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పోటెత్తారు. అనంతరం ఆయన అక్కడ నుంచి మహరాజుపేటకూడలి మీదుగా రాజాపులోవ వైపు ఆయన వెళ్లారు. ఆయన వాహన శ్రేణిని కార్యకర్తలు, నాయకులు ద్విచక్రవాహనాలతో ర్యాలీగా అనుసరించారు. ఈ పర్యటనలో వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యేలు సుజ య్ కృష్ణ రంగారావు, గిడ్డి ఈశ్వరి, బూడి ముత్యాల నాయుడు, మాజీ ఎమ్మెల్సీ సూర్య నారాయణ రాజు, మాజీ ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, చెంగల వెంకటరా వు, కర్రి సీతారాం, కరణం ధర్మ శ్రీ, మళ్ళ విజయప్రసాద్, తైనాల, నియోజకవర్గ సమన్వయకర్తలు కోలా గురువులు, వంశీకృష్ణ, అదీప్ రాజ్, తిప్పల నాగిరెడ్డి, పెట్ల ఉమాశంకర గణేష్, ప్రగడ నాగేశ్వరరావు, సీఈసీ సభ్యులు దామ సుబ్బారావు, శ్రీకాంత్ రాజు, పార్టీ రాష్ర్ట అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, రాష్ర్ట కార్యదర్శులు జాన్ వెస్లీ, కంపా హనోక్, రాష్ర్ట ప్రచార కమిటీ కార్యదర్శి రవిరెడ్డి, మైనార్టీ సెల్ ఉత్తరాంధ్ర సమన్వయ కర్త ఫారూకీ, అనుబంధ సంఘాల అధ్యక్షులు ఉషాకిరణ్, షరీఫ్, బోణి వేణు, ఆడారి రవికుమార్లతో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
భూములు పోతే ఎలా బతకాలి?
-
చంద్రబాబు ప్రజల ఉసురు పోసుకుంటున్నారు
-
భోగాపురం నిర్వాసిత గ్రామాల్లో ఉద్రిక్తత
-
భోగాపురం నిర్వాసిత గ్రామాల్లో ఉద్రిక్తత
విజయనగరం : భోగాపురం ఎయిర్పోర్టు నిర్వాసిత గ్రామాల్లో శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. తూడెం ఎయిర్పోర్ట్ నోటిఫై భూముల్లోరైట్స్ సంస్థ సర్వేరాళ్లు పాతింది. తూడెం, గిద్దలపాలెంలో భారీ బందోబస్తు చేపట్టడమే కాకుండా తనిఖీలు కూడా నిర్వహిస్తున్నారు. మరోవైపు టీడీపీ ఎంపీటీసీ పైల రాము భూ సేకరణను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. తమ భూముల్లో అనుమతి లేకుండా సర్వేరాళ్లు వేయటంపై నిరసన తెలిపారు. కాగా గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం విషయంలో ప్రభుత్వం దిగొచ్చేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే సుజయ్ కృష్ణరంగారావు స్పష్టం చేశారు. ఎయిర్పోర్టు కింద భూములను కోల్పోతున్న బాధితులకు అండగా నిలిచేందుకు వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ఈనెల 5న భోగాపురం వస్తున్నారని తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటిస్తారని సుజయ్ కృష్ణరంగారావు తెలిపారు. ఆయా గ్రామాల్లో సుజయ్ రంగారావు, జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి, కేంద్ర పాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు తదితరులు నిన్న పర్యటించారు. -
ఎయిర్పోర్టు నిర్వాసిత గ్రామాల్లో ఉద్రిక్తత
-
ఎయిర్పోర్టు నిర్వాసిత గ్రామాల్లో ఉద్రిక్తత
విజయనగరం: విజయనగరం జిల్లా భోగాపురం పరిసర ప్రాంతాల్లో ఉద్రక్తత చోటు చేసుకుంది. భోగాపురంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న అంతర్జాతీయ విమానశ్రయానికి గురువారం అధికారులు స్థల పరిశీలన చేయనున్నారు. ఈ అంశంపై రైట్ అనే సంస్థ సర్వే చేయనుంది. దీంతో పరిసర గ్రామాల్లోని ప్రజలు ఆందోళన చేపడుతున్నారు. తమ భూములు అన్యాయంగా తీసుకుంటున్నారని గ్రామస్తులు పలు ధర్నాలు కూడా చేపట్టారు. తాజాగా సర్వే నేపథ్యంలో గ్రామస్థుల నుంచి వ్యతిరేకత ఏర్పడుతుందనే ముందస్తు చర్యగా నిర్వాసిత గ్రామాల్లో భారీగా పోలీసులు మోహరించారు. -
'రాష్ట్ర మంత్రులు వచ్చినా చీపుర్లతో తరిమికొట్టండి'
విజయనగరం : ఎయిర్ పోర్టు భూసేకరణ కోసం రాష్ట్ర మంత్రులు, అధికారులు ఎవరొచ్చినా చీపుర్లతో తరిమి కొట్టాలని ఆంధ్రప్రదేశ్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. విజయనగరం జిల్లాలోని భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం కోసం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయాలని వామపక్షాల ఆధ్వర్యంలో 10 ప్రజా సంఘాలతో బహిరంగసభ మంగళవారం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన రామకృష్ణ మాట్లాడుతూ.. ఎయిర్ పోర్టు భూసేకరణ కోసం ఎవరు వచ్చినా చీపుర్లతో తరిమి కొట్టాలని ప్రజలకు, రైతులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, వైఎస్ఆర్ సీపీ మాజీ ఎమ్మెల్యే అప్పలనాయుడు బహిరంగ సభకు హాజరయ్యారు. రైతులు ఎన్ని ఆందోళనలు చేపట్టినా, అధికార ప్రభుత్వ ధోరణి మాత్రం మారలేదు. నోటిఫికేషన్ విడుదల చేస్తే తన భూమి కోల్పోవాల్సి వస్తుందని భయపడి సూరి అనే ఓ రైతు ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. -
భోగాపురం విమానాశ్రయం నిర్మాణంపై పిల్
హైదరాబాద్: విజయనగరం జిల్లా, భోగాపురం వద్ద గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ జీవోల అమలును నిలిపేసి, భోగాపురం ప్రజలను వారి భూముల నుంచి ఖాళీ చేయించకుండా అధికారులను ఆదేశించాలని కోరుతూ భోగాపురం మండలం, రావివలస గ్రామ సర్పంచ్ ఉప్పాడ శివారెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి, పౌర విమానాయశాఖ కార్యదర్శి, డెరైక్టర్ జనరల్, నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యాన్ని సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది. భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గ్రామ సభలు తీర్మానాలు చేసినా, వాటిని ఖాతరు చేయకుండా ప్రభుత్వం ముందుకెళుతోందని పిటిషనర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సారవంతమైన భూములను రైతుల నుంచి వారి ఇష్టానికి విరుద్ధంగా తీసుకుంటూ, భూ మాఫియా, రియల్టర్లకు సాయం చేస్తోందని ఆరోపించారు. భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన పరిస్థితులు లేవని ఓ నిపుణుల కమిటీ తేల్చిందని, ఇందుకు సంబంధించి పత్రికల్లో కూడా కథనాలు వచ్చాయన్నారు. భోగాపురం బదులు కాకినాడ సమీపంలోని ఎస్.రాయవరం విమానాశ్రయ నిర్మాణానికి అనుకూలంగా ఉంటుందని ఆ నిపుణుల కమిటీ తెలిపిందన్నారు. -
పోలీసుల చిచ్చు.. బాధితులకు ఉచ్చు
ఉద్రిక్త వాతావరణం ఏర్పడినప్పుడు సంయమనంతో వ్యవహరించాలి. కక్షలు రగిలేచోట శాంతిసుమాలు విరిసేందుకు కృషి చేయాలి. అలాంటి పోలీసులే దుందుడుకుగా వ్యవహరిస్తున్నారు. అధికారులు, ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు.. అంటున్నారు విమానాశ్రయం బాధితులు. గతనెల 27న కొంగవానిపాలెం రెవెన్యూ పరిధిలో సర్వే చేస్తున్న అధికారుల్ని గ్రామస్తులు నిలదీశారు. అనంతరం పోరాట కమిటీ నేతలు నచ్చజెప్పడంతో ఎవరికి వారు వెనుదిరిగారు. కానీ భోగాపురం పోలీసులు రెవెన్యూ అధికారులు వారిస్తున్నా గ్రామస్తులపై అకారణంగా కేసులు నమోదు చేశారు. అధికార పార్టీ నేతల ఒత్తిడి వల్లే అతిగా వ్యవహరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. భోగాపురం: గతనెల 27న కొంగవానిపాలెం రెవెన్యూ పరిధిలో తూర్పుబడిలో సర్వే చేస్తున్న అధికారులను రైతులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీకి చెందిన విమానాశ్రయ వ్యతిరేక కమిటీ నాయకుడు ఉప్పాడ సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో కొందరు నాయకులు అక్కడికి చేరుకుని అధికారులపై తిరగబడుతున్న రైతులు, గ్రామస్తులను నిలువరించారు. రైతులకు సమాచారం ఇవ్వకుండా వారి భూముల్లో సర్వే ఏవిధంగా చేస్తారని, తక్షణమే వెళ్లిపోవాలని అధికారుల్ని కోరడంతో అంతా వెనక్కి వచ్చేశారు. అదే సమయంలో వచ్చిన సీఐ వైకుంఠరావు, ఎస్ఐ దీనబంధు మార్గమధ్యంలో వైఎస్సార్ సీపీ నేతలు, రైతులను ఆపి మాట్లాడారు. ఆ సమయంలో అక్కడున్న వారిని పోలీసు సిబ్బంది సెల్ఫోన్లో వీడియో తీసి పెట్టుకున్నారు. విషయం తెలుసుకున్న ఏఎస్పీ ఎవీ రమణ అదేరోజు సాయంత్రం భోగాపురం వచ్చారు. రెవెన్యూ అధికారులను కేసు పెట్టమని కోరగా.. ప్రజలతో తమకు సత్సంబంధాలుండాలని, వారి భూమిలోకి వెళ్లామని మాత్రమే తమను అడ్డుకున్నారు తప్ప ఏం జరగలేదని, ఎలాంటి కేసులొద్దని విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ అధికారుల వినతిని వినిపించుకోకుండా స్టేట్మెంట్ మాత్రమే నమోదు చేస్తున్నాం రండని పిలిచి ముందుగా పదిమందిపై కేసులు నమోదుచేశారు. అప్పటికీ సెలవులో ఉన్న తహశీల్దారు డి.లక్ష్మారెడ్డి కేసులు వద్దని సీఐకి ఫోనులో చెప్పినా ఏం లేదంటూనే కేసులు నమోదు చేసేశారు. అది చాలదంటూ వారి వద్దనున్న వీడియో ఆధారంగా మరో 12మందిపై విడతల వారిగా కేసులు నమోదు చేశారు. అదీచాలక గ్రామాల్లోకి వెళ్ళి కేసులు నమోదు చేసిన ఇళ్లకు నోటీసులు కూడా అంటించారు. దీంతో పోలీసుల తీరుపై రెవెన్యూ అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరుతో గ్రామస్తులు, రెవెన్యూ అధికారుల మధ్య సఖ్యత చెడిందని ఒక రెవెన్యూ అధికారి వాపోయారు. మా భూముల్లోకి వచ్చి మాపైనే కేసులా? మా భూముల్లోకి వచ్చి మాపైనే కేసులు పెట్టారు. విమానాశ్రయానికి భూములిచ్చేందుకు వ్యతిరేకిస్తున్నా మా సమ్మతి లేకుండా భూముల్లోకి చొరబడటం దౌర్జన్యం కాదా. అడ్డుకుంటే కేసులు పెడతారా? పోలీసులు గ్రామాల్లో తిరుగుతూ, ఇళ్లకు నోటీసులు అంటిస్తూ భయబ్రాంతుల్ని చేస్తున్నారు. - కోరాడ పాపయ్యమ్మ, బాధితురాలు పోలీసులే అన్యాయం చేస్తే ఎవరికి చెప్పాలి మా భూములు సర్వే చేస్తున్న రెవెన్యూ అధికారులను అడ్డుకున్నందుకే పోలీసులు అన్యాయంగా కేసులు పెట్టారు. మేం బాధను చెప్పుకోడానికి వీలులేకుండా సెక్షన్లు అంటూ భయాందోళనలకు గురిచేస్తున్నారు. పోలీసులే అన్యాయానికి పాల్పడితే ఎవరికి చెప్పుకుంటాం? -కోరాడ సన్యాసమ్మ, బాధితురాలు -
లెఫ్ట్..లెఫ్ట్
భోగాపురం: విమానాశ్రయ నిర్మాణానికి ఏకాదశి మంచిదని, అధికారులు ఇటీవల ఇచ్చిన ప్లాను ప్రకారం నిర్ణయించిన స్థలంలో ప్రాథమిక మార్కింగ్ చేసేందుకు వచ్చిన రైట్స్ బృందాన్ని ఎయిర్పోర్టు బాధిత గ్రామాల ప్రజలు తరిమికొట్టారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు స్థానిక రెవెన్యూ అధికారుల సహా కొంగవానిపాలెం రెవెన్యూ పరిధిలోని తూర్పుబడికి సోమవారం మధ్యాహ్నం రైట్స్ బృందం చేరుకుంది. అధికారులు ఇచ్చిన ప్లాను ప్రకారం ఆర్ఐ సత్యనారాయణ, సర్వేయరు సింహాచలం నాయుడులు వీఆర్ఓలు లక్ష్మణరావు, శ్రీనుల సహకారంతో ఈశాన్య దిశలో సర్వే నిర్వహించి ప్రాథమిక మార్కింగ్ (స్టార్టింగ్ పాయింట్)ను గుర్తించారు. అనంతరం ఈ విషయాన్ని సెలవులో తిరుపతి వెళ్లిన తహశీల్దారు డి.లక్ష్మారెడ్డికి ఫోన్ ద్వారా సర్వేయరు తెలియజేశారు. సర్వే జరుగుతున్న విషయం తెలుసుకున్న స్థానిక గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని, మా భూముల్లో ప్లాన్లు వేసుకుని సర్వే చేసేందుకు మీరెవరు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్స్ బృంద సభ్యుడి వద్దనుంచి బ్యాగులు లాక్కుని అందులో ఉన్న ప్లాను పేపర్లను బాధిత గ్రామస్తులు చించి పారేశారు. ఎవరైనా భూముల్లోకి వస్తే ఊరుకునేది లేదని, మమ్మల్ని పిలకుండా, మాతో సంప్రదించకుండా సర్వేలు చేయడానికి మీరెవ్వరు, ఎన్నిసార్లు అడ్డగిస్తున్నా దొంగతనంగా వస్తూ మా సహనాన్ని పరీక్షిస్తున్నారు. మాపై కేసులు పెట్టి మమ్మల్ని జైళ్లలో పెట్టి మా భూములు తీసుకుందామనుకుంటున్నారేమో మిమ్మల్ని చంపి మేమూ అలాగే చేస్తాం అంటూ హెచ్చరించారు. అలాగే కో-ఆర్డినేటర్ ప్రసాద్ను సంఘటనా స్థలం వద్దనుంచి తరిమి కొట్టారు. విషయం తెలుసుకున్న ఎయిర్పోర్టు నిర్మాణ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి, బెరైడ్డి ప్రభాకరరెడ్డి, శివారెడ్డి, ఎర్ర అప్పలనారాయణ, పట్న తాతయ్యలు, కొల్లి రామమూర్తి, మట్ట వెంకటరమణారెడ్డి తదితరులు అక్కడకు చేరుకుని ఆందోళన కారులను సముదాయించారు. దొంగచాటుగా సర్వేలు నిర్వహిస్తే ఊరుకునేది లేదని వీఆర్ఓలు, రైట్ బృంద సభ్యులను ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి హెచ్చరించారు. ఎయిర్పోర్టుకి వ్యతిరేకంగా ఆరునెలలుగా నిరసన వ్యక్తం చేస్తున్నా పట్టించుకోకుండా సర్వేలు నిర్వహించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న సీఐ వైకుంఠరావు, ఎస్ఐ దీనబంధులు సంఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. అయితే అప్పటికే రెవెన్యూ సిబ్బంది అక్కడినుంచి వెళ్లిపోవడంతో పోరాట కమిటీ నాయకులు ఉప్పాడ తదితరులతో సీఐ చర్చించారు. విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను అడ్డగించడం సరికాదని, ఏదైనా ఉంటే సామరస్యంగా మాట్లాడాలని, ఒకసారి స్టేషనుకు రావాలని సీఐ కోరడంతో ఆందోళన సద్దుమణిగింది. నాయకులతో సీఐ చర్చలు పోలీస్ స్టేషన్లో చర్చిద్దామని సీఐ ఆహ్వానించడంతో వైఎస్ఆర్సీపీకి చెందిన పార్టీ నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టరు సురేష్బాబు, మాజీ ఎంఎల్ఏ బడ్డుకొండ అప్పలనాయుడు, ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి, వరుపుల సుధాకర్, సుందర గోవిందరావులు సీపీఎం మండల కార్యదర్శి బి.సూర్యనారాయణ తదితరులు సోమవారం సాయంత్రం ఏడుగంటల ప్రాంతంలో సర్కిల్ కార్యాలయంలో సీఐతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. గ్రామస్తులు, రైతులకు ఏదైనా సమస్య ఉంటే సామ రస్యంగా మాట్లాడుకోవాలి తప్ప విధుల్లో ఉన్న ఉద్యోగులకు అడ్డుతగలరాదని కోరారు. దీనిపై సురేష్ బాబు మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులతో మాత్రమే విశాఖ, విజయనగరంలో సమావేశాలు పెట్టుకుని ఎయిర్పోర్టు నిర్మాణానికి అధికారులు ప్రయత్నాలు చేయడాన్ని ఖండించారు. దీనిపై సీఐ ఆర్డీఓతో ఫోనులో సంప్రదించగా పోరాట కమిటీ నాయకులు తన కార్యాలయానికి రావాలని ఆయన కోరారు. జిల్లా కేంద్రంలో కాకుండా మండల కేంద్రంలో రైతులు, నాయకులతో ఆర్డీఓ సమావేశం ఏర్పాటుచేయాలని వారంతా కోరారు. నాయకులపై కేసు నమోదు సర్వే చేస్తున్న రెవెన్యూ అధికారులను అడ్డుకున్న ఎయిర్పోర్ట్ నిర్మాణ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు, గ్రామస్తులపై కేసు నమోదు చేసినట్లు స్ఐ దీనబంధు తెలిపారు. -
ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన రైతులు
నెల్లిమర్ల (విజయనగరం జిల్లా): భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరుతూ బాధిత రైతులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు సోమవారం విజయనగరం జిల్లా నెల్లిమర్ల అధికార పార్టీ ఎమ్మెల్యే పత్తివాడనారాయణ స్వామి నాయుడు ఇంటిని బాధిత రైతులు ముట్టడించారు. ఎయిర్ పోర్టుకు వ్యతిరేకంగా తమతో కలిసి రావాలని బాధితులు ఎమ్మెల్యే పత్తివాడను కోరారు. ఎమ్మెల్యే మాత్రం ఎయిర్ పోర్టు అంశం కేంద్రం పరిధిలోకి వస్తుందని చేతులెత్తేశారు. దీంతో ఆగ్రహించిన రైతులు ఎమ్మెల్యేని గృహంలోనే నిర్భందించారు. -
సర్వేబృందాన్ని అడ్డుకున్న గ్రామస్తులు
భోగాపురం (విజయనగరం): భోగాపురంలో విమానాశ్రయం ఏర్పాటుకు స్థల పరిశీలనకు వచ్చిన సర్వే బృందాన్ని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అడ్డుకున్నారు. తమ భూములు ఇవ్వబోమంటూ కొయ్యపేట గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయబోయారు. పక్కనే ఉన్న మహిళలు అప్రమత్తమవటంతో ప్రమాదం తప్పింది. చీపుర్లు, చాటలు చేతపట్టుకుని సర్వేయర్లను ఊరి బయటకు తరిమారు. కారిగొల్లపేట గ్రామస్తులు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. భోగాపురం ఎయిర్పోర్టు సర్వేను వెంటనే ఆపేయాలని డిమాండ్ చేస్తూ అధికారులకు శాపనార్ధాలు పెట్టారు. -
భోగాపురం ఎయిర్పోర్టుకు గ్రీన్ సిగ్నల్
పనుల పర్యవేక్షణకు బీఐఏసీఎల్ ఏర్పాటు హైదరాబాద్: విజయనగరం జిల్లాలోని భోగాపురంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు పనులను వేగంగా పూర్తి చేసేందుకు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కంపెనీ లిమిటెడ్ (బీఐఏసీఎల్) పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ)ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. బీఐఏసీఎల్ సంస్థలో పది ముఖ విలువ కలిగిన యాభై లక్షల వాటాల రూపంలో రూ.ఐదు కోట్లను ప్రభుత్వం పెట్టుబడిగా పెట్టింది. ఇంధన, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల శాఖ కార్యదర్శి, రహదారులు భవన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆర్థిక శాఖ కార్యదర్శి, ఇన్క్యాప్ ఎండీ, విజయనగరం జిల్లా కలెక్టర్లను బీఐఏసీఎల్ డెరైక్టర్లుగా నియమించింది. -
ప్రాణాలైనా ఇస్తాంకాని..భూములివ్వం