Bimbisara Movie
-
విశ్వంభర డైరక్టర్ బీభత్సమైన ట్విస్ట్..
-
తిరిగొస్తున్న బింబిసారుడు, కాకపోతే కథలో చిన్న ట్వీస్ట్
-
బ్లాక్బస్టర్ మూవీకి ప్రీక్వెల్.. కల్యాణ్ రామ్ బర్త్ డేకు క్రేజీ అప్డేట్!
నందమూరి కల్యాణ్ రామ్- వశిష్ట డైరెక్షన్లో వచ్చిన సోషియో ఫాంటసీ చిత్రం బింబిసార. గతేడాది థియేటర్లలో సందడి చేసిన ఈ మూవీ బ్లాక్బస్టర్గా నిలిచింది. కల్యాణ్ రామ్ కెరీర్లోనే ఉత్తమ చిత్రంగా రికార్డ్ సృష్టించింది. అయితే ఈ సినిమాకు పార్ట్-2 కూడా ఉంటుందని మేకర్స్ గతంలోనే హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఇవాళ కల్యాణ్ రామ్ బర్త్ డే కావడంతో దీనికి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.బింబిసార చిత్రానికి ప్రీక్వెల్ను తెరకెక్కించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మూవీకి అనిల్ పాదూరి దర్శకత్వం వహించనున్నట్లు తెలిపారు. తాజాగా వర్కింగ్ టైటిల్ ఎన్కేఆర్-22 పేరుతో పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే బింబిసార మూవీకి వశిష్ఠ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. కాగా.. ఇక కల్యాణ్రామ్ హీరోగా తెరకెక్కుతున్న మరోచిత్రం ‘NKR21’ ఫస్ట్లుక్ని కూడా విడుదల చేశారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో రానున్న ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ కొత్త లుక్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. 𝗚𝗲𝘁 𝗿𝗲𝗮𝗱𝘆 𝘁𝗼 𝘄𝗶𝘁𝗻𝗲𝘀𝘀 𝘁𝗵𝗲 𝗩𝗜𝗥𝗧𝗨𝗘 𝗼𝗳 𝗮 𝗟𝗘𝗚𝗘𝗡𝗗 𝘄𝗵𝗼 𝗿𝘂𝗹𝗲𝗱 𝗧𝗿𝗶𝗴𝗮𝗿𝘁𝗵𝗮𝗹𝗮 𝗮𝗴𝗲𝘀 𝗯𝗲𝗳𝗼𝗿𝗲 𝗕𝗜𝗠𝗕𝗜𝗦𝗔𝗥𝗔 👑#NKR22 - A PREQUEL to the blockbuster #Bimbisara ❤️🔥Happy Birthday, @NANDAMURIKALYAN ✨Exciting updates soon!… pic.twitter.com/yXEKzfVqRa— NTR Arts (@NTRArtsOfficial) July 5, 2024 -
'నా జీవితమంతా సాహసాలే'.. ఆ సినిమా కోసం మరో డేరింగ్ చేస్తోన్న హీరోయిన్!
భీమ్లా నాయక్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ సంయుక్తా మీనన్. ఆ తర్వాత బింబిసారతో బ్లాక్బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది. గతేడాది విరూపాక్ష, డెవిల్ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. అంతే కాకుండా ధనుశ్ సరసన సార్ చిత్రంలోనూ మెరిసింది. వరుసగా అవకాశాలతో సూపర్ హిట్స్ కొడుతోంది. తాజాగా ఈ బింబిసార ఫేమ్ యంగ్ హీరో నిఖిల్ చిత్రంలో నటిస్తోంది. నిఖిల్ హీరోగా తెరకెక్కుతోన్న స్వయంభు చిత్రంలో కనిపించనుంది. అయితే తాజాగా సంయుక్త పోస్ట్ చేసిన ఓ ఫోటోలు నెట్టింట వైరల్గా మారింది. ఆ వివరాలేంటో చూద్దాం. తాజాగా ఈ కేరళ భామ గుర్రపు స్వారీ చేస్తున్న ఫోటోను ట్విటర్లో షేర్ చేసింది. అంతే కాకుండా సుదీర్ఘమైన సందేశం కూడా రాసుకొచ్చింది. ఈ ఏడాదిలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నానని తెలిపింది. నా జీవితమంతా ఎల్లప్పుడూ సాహసాలతోనే కొనసాగుతోందని.. తాను ఎప్పటికీ కంఫర్ట్ జోన్లో ఉండేందుకు ఇష్టపడనని వెల్లడించింది. జీవితంలో ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకు సాగుతానని తెలిపింది. నా నెక్ట్స్ మూవీ స్వయంభూ కోసమే ఇప్పుడు హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్నానని రాసుకొచ్చింది ముద్దుగుమ్మ. సంయుక్త ట్వీట్లో రాస్తూ.. 'ఈ ఏడాదిలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటూ జీవితం అంటే ఏంటో తెలుసుకుంటున్నా. నా జీవితమంతా సాహసాలతోనే నడుస్తోంది. కంఫర్ట్ జోన్లో ఉండిపోవడాన్ని ఇష్టపడను. నా కొత్త సినిమా స్వయంభు కోసం హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్నా. ఇది నాకు కొత్త మానసిక అనుభూతిని కలిగిలిస్తోంది. ఇది నాకు లభించిన అదృష్టం కూడా. ఇది ఒక ఆధ్యాత్మిక, సుసంపన్నమైన ప్రయాణం. గుర్రంతో సామరస్యంగా ఉంటూ.. గుర్రం మనసును దగ్గర నుంచి పరిశీలించడం.. మేమంతా ఒక టీమ్గా కలిసి పని చేయడం చాలా అద్భుతంగా ఉంది. అలాగే నా జీవితంలో ఎదురైన ప్రతి ఓటమిని ఒక మెట్టుగా మలచుకుంటున్నా. అలాంటివేమీ నా జీవితంలో అడ్డంకి కాదు.' అంటూ పోస్ట్ చేసింది. 2024 embarked with a lot of learning about myself and about many things that makes life what it truly is. I have always been game for adventures in life. I never had a comfort zone because I always pushed myself to explore newer experiences 💫 As an actor, I am blessed to be… pic.twitter.com/lcW1nhNnY7 — Samyuktha (@iamsamyuktha_) February 10, 2024 -
'బింబిసార 2' నుంచి ఎందుకు తప్పుకున్నానంటే: వశిష్ట
వరుస పరాజయాలతో సతమతమవుతున్న కల్యాణ్ రామ్కు.. కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది 'బింబిసార'. టైమ్ ట్రావెల్ అండ్ ఫాంటసీగా ఈ చిత్రాన్ని వశిష్ట తెరకెక్కించాడు. టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన మూవీ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపింది. ఈ సినిమా ఊహించిన దాని కంటే పెద్ద హిట్ కావడంతో మూవీకి సీక్వెల్ ప్లాన్ కూడా ప్రకటించారు. కానీ అనూహ్యంగా పార్ట్-2 డైరెక్టర్గా వశిష్ట తప్పుకున్నాడు. దీంతో గతంలో పలు రకాలుగా వార్తలు వచ్చాయి. ప్రస్తుతం మెగాస్టార్తో విశ్వంభర చిత్రాన్ని ఆయన డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వశిష్ఠ ఇదే విషయంపై ఎట్టకేలకు ఇలా క్లారిటీ ఇచ్చారు. 'రామ్ చరణ్తో నేను 'బాహుబలి' లాంటి సినిమాను తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అందులో నిజం లేదు. గతంలో కూడా నేను ఎక్కడా మాట్లాడలేదు.. కానీ ప్రచారం మాత్రం జరిగింది. నేను మెగాస్టార్ చిరంజీవితో 'జగదేకవీరుడు అతిలోక సుందరి' లాంటి ఫాంటసీ సినిమా చేయాలనుందని చెబితే.. రామ్ చరణ్తో వశిష్టి సినిమా తీస్తున్నాడని వార్తలు వచ్చాయి. నాకు ఫాంటసీ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. 'బింబిసార' సీక్వెల్ను నేను డైరెక్ట్ చేయడం లేదు. పార్ట్-2 కథ విషయంలో నా ఆలోచన వేరుగా ఉంది. దాని గురించి చర్చిస్తున్న సమయంలో నాకు 'విశ్వంభర' ఆఫర్ వచ్చింది. ఇదే విషయాన్ని కల్యాణ్ రామ్తో చెప్పి ఆపై ఆయన అనుమతి తీసుకున్న తర్వాతే 'బింబిసార 2' నుంచి బయటకు వచ్చాను. ఆపై మెగాస్టార్తో సినిమా ఓకే చేసుకున్నాను.' అని వశిష్ఠ తెలిపారు. చిరంజీవితో 'విశ్వంభర' చిత్రాన్ని భారీ బడ్జెత్ వశిష్ట డైరెక్ట్ చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా కాన్సెప్ట్ వీడియోను ఆయన విడుదల చేశారు. దానికి భారీగా రెస్పాన్స్ వస్తుంది. 2025 సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది. -
బింబిసార 2 మూవీకి డైరెక్టర్ ఎవరు..?
-
కథను మలుపుతిప్పే రోల్స్.. పాపే ప్రాణంగా రానున్న సినిమాలు
కథను కీలక మలుపు తిప్పే ‘కీ’ రోల్స్ దాదాపు ప్రతి సినిమాలోనూ ఉంటాయి. ఈ కీ రోల్స్కి ఏజ్తో సంబంధం ఉండదు. చిన్నారులు కూడా కథలో పెద్ద మార్పుకు కారణం అవుతుంటారు. ‘ఆర్ఆర్ఆర్’, ‘బింబిసార’ వంటి సినిమాల్లో చిన్ని పాపలు కథకు ప్రాణంగా నిలిచారు. ఇలా ‘పాపే ప్రాణం’ అంటూ సాగే కథలతో రానున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. సంరక్షకుడు? ‘పసివాడి ప్రాణం, జగదేకవీరుడు అతిలోక సుందరి, అంజి’... వంటి సినిమాల్లో చిన్నారులతో చిరంజీవి చేసిన అల్లరి సన్నివేశాలు, అదే సమయంలో వారి ప్రాణ రక్షకుడుగా చేసిన సాహసాలు ప్రేక్షకులను అలరించాయి. మళ్లీ వెండితెరపై ఓ పాపకు సంరక్షకుడిగా ఉండే పాత్రలో చిరంజీవి నటించనున్నారనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్ను బట్టి ఇది సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్ అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ చిత్రంలో ఓ పాప కీలక పాత్రలో నటించనుందని, ఈ పాప సంరక్షకుడిగా చిరంజీవి చేసే సాహసాలు అబ్బురపరచేలా ఉంటాయని టాక్. ఈ ఏడాది చివర్లో రెగ్యులర్ షూటింగ్ ఆరంభించి, వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో యూనిట్ ఉందని తెలిసింది. ఈ సంగతి ఇలా ఉంచితే... వశిష్ట దర్శకుడిగా పరిచయం అయిన ‘బింబిసార’ చిత్రంలో ఓ పాప సెంట్రల్ క్యారెక్టర్గా ఉన్న సంగతి తెలిసిందే. హార్ట్ ఆఫ్ సైంధవ్ శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా.. ఇలా ముచ్చటగా ముగ్గురు హీరోయిన్లు ఉన్నా కూడా హీరో ‘సైంధవ్’ మనసులో తొలి స్థానం చిన్నారి సారాదే. సారా అంటే ‘హార్ట్ ఆఫ్ సైంధవ్’ అన్నమాట. వెంకటేశ్ టైటిల్ రోల్లో నటిస్తున్న ఈ సైంధవ్ సినిమాకు ‘హిట్’ ఫ్రాంచైజీ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. సైంధవ్ హార్ట్ సారా అని చిత్ర యూనిట్ అంటోందంటే కథలో చిన్నారి సారా పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందని ఊహించవచ్చు. తమిళ నటుడు ఆర్య, హిందీ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్రలు చేస్తున్న ‘సైంధవ్’ చిత్రం డిసెంబరు 22న విడుదల కానుంది. హాయ్ నాన్న తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో తెలుగులో రూపొందుతున్న మరో చిత్రం ‘హాయ్ నాన్న’. ఈ ఎమోషనల్ మూవీలో నాని హీరోగా నటిస్తున్నారు. ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రుతీహాసన్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర కథ ఓ పాప పాత్ర చుట్టూ తిరుగుతుందని, ఈ క్రమంలో వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయని తెలుస్తోంది. ‘హాయ్ నాన్న’ డిసెంబరు 21న రిలీజ్ కానుంది. గరుడ సాహసాలు ‘గరుడ’ సినిమా పోస్టర్ చూశారుగా.. సత్యదేవ్ వీపుపై కూర్చున్న ఓ చిన్నారి ఎంత భయంగా చూస్తుందో కదా! పైగా అది అడవి ప్రాంతం. ఆ చిన్నారి భయాన్ని పోగొట్టి, తనను సురక్షితంగా గరుడ ఎలా రక్షించాడనేది వెండితెర పైనే చూడాలంటోంది యూనిట్. సత్యదేవ్ హీరోగా క్రాంతి బాల దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘గరుడ’. సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో సాగే అడ్వంచరస్ మూవీగా ఈ చిత్రం ఉంటుందట. ఈ చిత్రం తొలి భాగం ‘గరుడ: చాప్టర్ 1’ త్వరలోనే రిలీజ్ కానుంది. ఇలా చిన్నారులు కీలకంగా నిలిచే చిత్రాలు మరికొన్ని ఉన్నాయి. -
చిరంజీవి కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది.. వివరాలు ఇవే
భారీ అంచనాల మధ్య విడుదలైన భోళా శంకర్ చిరంజీవి కెరియర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచిపోయింది. దీంతో చిరంజీవి కొంత గ్యాప్ తీసుకుని తన తన తదుపరి సినిమాల విషయంలో నిర్ణయం తీసుకుంటాడని సోషల్మీడియాలో ప్రచారం జరిగింది. వరుస పరాజయల తర్వాత కొంత బ్రేక్ తీసుకొన్న తరవాతే.. కొత్త సినిమా ప్రకటన ఉంటుందని వార్తలొచ్చాయి. అయితే, మెగాస్టార్ ప్రణాళికల్లో ఎలాంటి మార్పూ లేదని, ఇలాంటి ఒడిదుడుకులు సహజమేనని ఈ ప్రకటనతో చిరంజీవి తెలిపారని చెప్పవచ్చు. (ఇదీ చదవండి: ఆ సినిమా కోసం అనిరుధ్ మ్యూజిక్తో పాటు ఆరుగురు వరల్డ్ ఫేమస్ ఫైట్ మాస్టర్స్) ముందుగా అనుకొన్నట్టుగానే తన పుట్టిన రోజున నేడు (ఆగష్టు 22) కొత్త సినిమా ప్రకటన వచ్చేస్తోంది. దానిలో భాగంగానే కొన్నిగంటల క్రితం యూవీ క్రియేషన్స్ ట్విటర్ ద్వారా ఒక పోస్టర్ను విడుదల చేసింది. భోళా శంకర్ డిజాస్టర్ తర్వాత చిరంజీవి చెయబోయే సినిమా ఎవరితో ఉంటుందా అని ఫ్యాన్స్ చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న సమయంలో తాజాగా యూవీ క్రియేషన్స్ అధికారికంగా సోషల్మీడియాలో ఒక పోస్టర్తో గుడ్న్యూస్ తెలిపింది. నేడు 10:53 నిమిషాలకు మెగాస్టార్ మూవీకి చెందిన పలు వివరాలను ప్రకటిస్తామని వారు వెల్లడించారు. యూవీ క్రియేషన్స్-చిరంజీవి కాంబినేషన్లో వస్తున్న ఈ బిగ్ ప్రాజెక్ట్తో బింబిసార మూవీ ఫేమ్ డైరెక్టర్ వశిష్ఠ మెగాఫోన్ పట్టనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు. (ఇదీ చదవండి: ఫైనల్గా వశిష్ఠకే దక్కిన మెగా 157 ప్రాజెక్ట్) The universe conspires for beautiful things to happen ✨ One man inspires us to achieve the universe itself 💫 Stay tuned to @UV_Creations ❤️ Today at 10.53 AM 🔮#HBDMegastarChiranjeevi pic.twitter.com/v7W9LCB8Ij — UV Creations (@UV_Creations) August 21, 2023 -
చిరు కొత్త సినిమా ప్రకటన.. సూపర్ హిట్ డైరెక్టర్కు ఛాన్స్
మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ఈ శుక్రవారం (ఆగస్టు 11) రిలీజ్ అయింది. అయితే, ఈ సినిమా ప్రేక్షకులు, విమర్శకుల నుంచి నెగెటివ్ టాక్ను తెచ్చుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఆశించిన వసూళ్లను రాబట్టలేకపోవచ్చు. అంతేకాకుండా చిత్ర నిర్మాతలకు భారీగా నష్టాలు రావడం ఖాయం అని తెలుస్తోంది. ముఖ్యంగా మెహర్ రమేశ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన ఔట్డేటెడ్ విధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతనిపై భారీగా ట్రోల్స్ కూడా వస్తున్నాయి. థియేటర్ల వద్దే ఆయనపై పలు వ్యాఖ్యలతో ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. ఇలాంటి సమయంలో చిరంజీవి తర్వాత సినిమాకు డైరెక్ట్ చేయాలంటే చాలా ఘట్స్ ఉండాల్సిందే. వాల్తేరు వీరయ్య మినహా వరసు ప్లాపులతో ఉన్న చిరుకు ఖచ్చితంగా భారీ హిట్ అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి సమయంలో చిరంజీవి తర్వాత చేయనున్న ఓ సినిమాపై తాజాగా సమాచారం బయటికి వచ్చింది. తన 157వ చిత్రాన్ని సోషియో ఫ్యాంటసీ జోనర్లో మెగాస్టార్ చేయనున్నారు. బింబిసార మూవీ ఫేమ్ డైరెక్టర్ వశిష్ఠ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మించనుంది. తాజాగా, ఈ మూవీ షూటింగ్ ప్రారంభం గురించి సమాచారం బయటికి వచ్చింది. ఎప్పుడు ప్రారంభం చిరంజీవి - డైరెక్టర్ వశిష్ఠ కాంబినేషన్లో ఈ సోషియో ఫ్యాంటసీ మూవీ షూటింగ్ ఈ ఏడాది నవంబర్లో మొదలుకానున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం డేట్లను కూడా మెగాస్టార్ కేటాయించారట. ఈ సినిమాకు 'ముల్లోక వీరుడు' అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. చిరంజీవి కెరీర్లో మైలురాయి చిత్రంగా నిలిచిన 'జగదేకవీరుడు అతిలోక సుందరి' తరహాలోనే ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఈ రీమేక్ సంగతేంటి..? ఈ సోషియో ఫ్యాంటసీ సినిమా కంటే ముందు మలయాళ సినిమా 'బ్రో డాడీ' రీమేక్ మూవీని చిరంజీవి మొదలుపెడతారని తెలుస్తోంది. 'సోగ్గాడే చిన్ననాయన, బంగార్రాజు మూవీస్ ఫేమ్ కల్యాణ్ కృష్ణ ఈ మెగా156 చిత్రానికి దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఇప్పుడు భోళా శంకర్ దెబ్బతో ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లడం కష్టమేనని సమచారం. ఈ మధ్య కాలంలో మెగా బ్రదర్స్ వరసగా రీమేక్స్ సినిమాలే చేస్తుండటంతో సాధారణ ప్రేక్షకులతో పాటు మెగా అభిమానులు కూడా కొంతమేరకు అసహనానికి గురౌతున్నారు. దీంతో బ్రో డాడీని పక్కనబెట్టి... సోషియో ఫ్యాంటసీ సినిమాకే చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. గతంలో రజనీ,కమల్ వంటి వారికి కంటిన్వ్యూగా ప్లాప్లు వచ్చాయి. తర్వాత వారిద్దరికి జైలర్,విక్రమ్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద వారి స్టామినా ఎంటో చూపించాయి. ఇలాగే చిరుకు ఒక్క సినిమా పడితే చాలు టాలీవుడ్లో తన సత్తా ఎంటో చెబుతుందని ఫ్యాన్స్ అంటున్నారు. -
మెగా ఆఫర్ రాగానే నందమూరి హీరోను పక్కన పెట్టిన డైరెక్టర్ వశిష్ట్
-
మెగాస్టార్తో బింబిసార డైరెక్టర్ ఫిల్మ్ ఫిక్స్
-
బిమ్బిసార సీక్వెల్ నుండి తప్పుకున్న వశిష్ఠ
-
ఊహా లోకంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమైన సినిమాలు!
రాజుల కాలంలో అంతఃపురం ఎలా ఉండేది అంటే.. ఇలా ఉంటుందేమో అని సినిమాలు చూపించాయి. మరి.. స్వర్గలోకం ఎలా ఉంటుంది? అంటే.. ఈ లోకాన్ని కూడా ఊహించి, సినిమాల్లో చూపించారు. ఇప్పుడు కొన్ని సినిమాలు కొత్త ప్రపంచాలను చూపించనున్నాయి. ఊహాజనిత కథలతో సాగే ఈ చిత్రాల కోసం భారీ సెట్స్తో కొత్త లోకాలను సృష్టిస్తున్నారు. ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం. స్వర్గం నేపథ్యంలో... ముప్పై ఏళ్ల క్రితం చిరంజీవి, శ్రీదేవి హీరో హీరోయిన్లుగా ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలోని ఈ చిత్రంలో కొన్ని సీన్లు స్వర్గం నేపథ్యంలో ఉంటాయి. తాజాగా చిరంజీవి నటించనున్న ఓ సినిమా మళ్లీ ప్రేక్షకులను స్వర్గలోకంలోకి తీసుకెళ్లనుందని టాక్. గత ఏడాది కల్యాణ్ రామ్తో ఫ్యాంటసీ యాక్షన్ ఫిల్మ్ ‘బింబిసార’ తీసిన వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఓ చిత్రం రూపొందనుందని టాక్. ‘బింబిసార’ తరహాలోనే ఫ్యాంటసీ జానర్లో ఉండే ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ఊహాజనిత స్వర్గం బ్యాక్డ్రాప్లో ఉంటాయనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించనుందట. సాహసాల ధీర ‘ధీర’గా ప్రేక్షకులను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకుని వెళ్లనున్నారట అఖిల్. ప్రభాస్ ‘సాహో’ చిత్రానికి చేసిన అసిస్టెంట్ డైరెక్టర్స్ టీమ్లో ఒకరైన అనిల్కుమార్ ఇటీవల అఖిల్కు ఓ కథ చెప్పారు. ఫ్యాంటసీ బ్యాక్డ్రాప్లో భారీ బడ్జెట్తో ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించనుందనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. అంతేకాదు.. ఈ సినిమాకు ‘ధీర’ టైటిల్ను పరిశీలిస్తున్నారని, హీరోయిన్ పాత్రకు జాన్వీ కపూర్ను చిత్ర యూనిట్ సంప్రదించిందని సమాచారం. నాలుగు పేజీల భైరవకోన ప్రేక్షకులను ‘భైరవకోన’కు తీసుకెళ్తామంటున్నారు సందీప్ కిషన్. ‘టైగర్’ (2015) చిత్రం తర్వాత హీరో సందీప్ కిషన్, దర్శకుడు వీఐ ఆనంద్ కాంబినేషన్లో రూపొందుతున్న హారర్ ఫ్యాంటసీ ఫిల్మ్ ‘ఊరు పేరు భైరవకోన’. ‘శ్రీకృష్ణదేవరాయల కాలంలోని గరుడ పురాణానికి, ప్రస్తుతం అందుబాటులో ఉన్న గరుడ పురాణానికి నాలుగు పేజీలు తగ్గాయి’, ‘గరుడ పురాణంలో మాయమైపోయిన ఈ నాలుగు పేజీలే భైరవకోన’ అనే డైలాగ్స్ టీజర్లో ఉన్నాయి. ఈ ఫ్యాంటసీ అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్లో వర్ష బొల్లమ్మ, కావ్యా థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిల్ సుంకర, రాజేష్ దండా నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల తేదీపై త్వరలోనే ఓ ప్రకటన రానుంది. అంజనాద్రి వీరుడు ‘హను–మాన్’ చిత్రం కోసం ‘అంజనాద్రి’ అనే ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. హనుమంతుని శక్తులు పొందిన ఓ యువకుడు ‘అంజనాద్రి’ రక్షణ కోసం ఎలాంటి పోరాటాలు, సాహసాలు చేశాడు అనే అంశాలతో ‘హను–మాన్’ సినిమా ఉంటుంది. తేజా సజ్జా, అమృతా అయ్యర్ హీరో హీరోయిన్లుగా ఈ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కె. నిరంజన్రెడ్డి నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ను ప్రకటించనున్నారు. అలాగే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోనే ‘అధీర’ చిత్రం రూపుదిద్దుకుంటోంది. నిర్మాత డీవీవీ దానయ్య కుమారుడు దాసరి కల్యాణ్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. సూపర్ హీరో బ్యాక్డ్రాప్లో రూపొందుతున్న ఈ సినిమాలో కూడా కాస్త ఫ్యాంటసీ ఎలిమెంట్స్ కనిపిస్తాయి. కె. నిరంజన్రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇవే కాదు.. మరికొన్ని చిత్రాలు కూడా ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకుని వెళ్లేందుకు సిద్ధం అవుతున్నాయి. -
బింబిసార 2 కి చిరంజీవి బ్రేక్!
-
టాలీవుడ్తోనే నా కెరీర్ మలుపు తిరిగింది: సంయుక్త
‘భీమ్లానాయక్’, ‘బింబిసార’ సినిమాలతో తెలుగు తెరపై మెరిసిన నటి సంయుక్త మీనన్. ఇటీవల ధనుష్కి జోడీగా ‘సార్’లో నటించింది. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 17న చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికర విషయాలను ఆమె పంచుకున్నారు. టాలీవుడ్ అడుగు పెట్టాకే తన దశ తిరిగిందని అన్నారు. అందుకే ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉన్నానని చెప్పుకొచ్చింది అమ్మడు. సంయుక్తా మీనన్ మాట్లాడుతూ – 'బింబిసార, విరూపాక్ష సినిమాలకి సంతకం చేశాకే భీమ్లానాయక్లో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమా కోసం హైదరాబాద్కి వచ్చా. అప్పుడు నాకు తెలుగు అంతగా రాదు. కానీ ఓ రోజు సెట్లో నా గురించి ఏదో మాట్లాడుతున్నప్పుడు అనిపించింది. ఈ విషయంపై నిర్మాత నాగవంశీని అడిగితే... భీమ్లానాయక్ తర్వాత ధనుష్ మూవీ సార్లో కథానాయిక మీరేనని చెప్పారు. అదే రోజు దర్శకుడు వెంకీ అట్లూరిని కలిశా. అలా మొదలైన ప్రయాణం ఇక్కడిదాకా వచ్చింది. కల్యాణ్ రామ్ బింబిసార తర్వాత సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ఒప్పుకున్నా. ఆ భీమ్లా నాయక్, ధనుష్ ‘సర్’ చిత్రాలు ఒకే రోజులోనే అంగీకరించా.' అని చెప్పుకొచ్చారు మలయాళ భామ. సినిమాల్లోకి ఎంట్రీపై సంయుక్త మాట్లాడుతూ.. 'సినిమాల్లోకి రావాలని ఏనాడూ అనుకోలేదు. అనుకోకుండా 2016లో నా జర్నీ స్టార్ట్ చేశా. చదువుకుంటున్న సమయంలోనే అనుకోకుండా వచ్చిన అవకాశంలో తొలి సినిమా చేశా. ఆ తర్వాత ఒక మంచి సినిమా చేసి ఆ తర్వాత మానేద్దామని మళ్లీ వచ్చా. కానీ ఆ తర్వాత నటనపై మక్కువ పెరిగింది. అయితే టాలీవుడ్లోకి వచ్చాకే నా దశ తిరిగింది. మొదట్లో ఇంగ్లిష్ మాట్లాడేదాన్ని. అందరూ ఇంగ్లిష్ అమ్మాయిలానే చూసేవాళ్లు. ఇప్పుడు తెలుగు మాట్లాడుతున్నందుకు తెలుగమ్మాయి అంటున్నారు. తెలుగు నేర్చుకునేందుకు ట్యూటర్ సాయం తీసుకున్నా.అలా తెలుగు వేగంగా నేర్చుకుంటున్నా.' అని అన్నారు. -
సైలెంట్గా ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టిన డైరెక్టర్స్ వీళ్లే
ప్రతి ఏడాది కొత్త దర్శకులు పరిచయం అవుతుంటారు. ఈ ఏడాది కూడా కొత్త డైరెక్టర్లు వచ్చారు. దాదాపు పదిహేనుకు పైగా కొత్త దర్శకులు వస్తే.. అందులో హిట్ బొమ్మ (సినిమా) ఇచ్చిన దర్శకులు ఎక్కువగానే ఉన్నారు. ఇలా హిట్ డైరెక్షన్తో ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ల గురించి తెలుసుకుందాం. డీజే సౌండ్ అదిరింది ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవానికి రెండు రోజుల ముందు వచ్చిన ‘డీజే టిల్లు’ చిత్రం అద్భుతమైన విజయం సాధించింది. టైటిల్ రోల్లో సిద్ధు జొన్నలగడ్డ నటించగా, నెగటివ్ షేడ్స్ ఉన్న హీరోయిన్ పాత్రను నేహా శెట్టి చేశారు. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంతో విమల్ కృష్ణ దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ చిత్రంలోని ‘డీజే టిల్లు’ టైటిల్ సాంగ్, ‘పటాస్ పిల్ల’ పాటలు శ్రోతలను ఊర్రూతలూగించాయి. ఈ డీజే హిట్ సౌండ్ ఇచ్చిన కిక్తో సీక్వెల్గా ‘డీజేటిల్లు స్వై్కర్’ను తీస్తున్నారు. అయితే ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. పసందైన కళ్యాణం ‘రాజావారు రాణిగారు, అద్భుతం’ వంటి సినిమాలకు సినిమాటోగ్రాఫర్గా చేసిన విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. విశ్వక్ సేన్కు ఈ సినిమాతో క్లాస్ ఇమేజ్ తెప్పించారు విద్యాసాగర్. ఇందులో రుక్సార్ థిల్లాన్ హీరోయిన్. ‘రాజావారు రాణిగారు’ చిత్రానికి దర్శకత్వం వహించిన రవికిరణ్ కోల ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్ప్లే ఇచ్చి షో రన్నర్గా వ్యవహరించారు. భోగవల్లి బాపినీడు, సుధీర్ ఈదర నిర్మించిన ఈ ‘అర్జున కళ్యాణం’ మే 6న విడుదలై, ప్రేక్షకులకు పసందైన అనుభూతినిచ్చింది. కలెక్షన్ కింగ్ కల్యాణ్రామ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రం ‘బింబిసార’. ఈ హిట్ ఫిల్మ్తో దర్శకుడిగా పరిచయం అయ్యారు వశిష్ఠ. రాజుల కాలం, ప్రస్తుత కాలం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం మంచి వసూళ్లు రాబట్టి కలెక్షన్ కింగ్ అనిపించుకుంది. ఇక ‘బింబిసార– 2’ కూడా ఉండొచ్చనే హింట్ ఇచ్చారు వశిష్ఠ. నందమూరి కల్యాణ్రామ్ హీరోగా కె. హరికృష్ణ నిర్మించిన ‘బింబిసార’ ఈ ఏడాది ఆగస్టు 5న విడుదలైంది. డబుల్ ధమాకా తెలుగు, తమిళ ప్రేక్షకుల మెప్పును ఒకే సినిమాతో పొందిన డబుల్ ధమాకా శ్రీకార్తీక్ దక్కింది. శర్వానంద్ హీరోగా అక్కినేని అమల, ప్రియదర్శి, ‘వెన్నెల’ కిశోర్ కీలక పాత్రల్లో నటించిన ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘ఒకే ఒక జీవితం’. ఎస్ఆర్ ప్రకాష్బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమాకి శ్రీకార్తీక్ దర్శకుడు. సెప్టెంబరు 9న ఈ సినిమా విడుదలైంది. తల్లీకొడుకుల సెంటిమెంట్కు టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ మిళితం చేసి ప్రేక్షకులను అలరించారు శ్రీకార్తీక్. మంచి ముత్యం సరోగసీ కాన్సెప్ట్తో వినోదాత్మకంగా ‘స్వాతి ముత్యం’ చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకుల మెప్పు పొందారు దర్శకుడు లక్ష్మణ్ కె. కృష్ణ. ‘సదా నీ ప్రేమలో..’ అనే ఇండిపెండెంట్ ఫిల్మ్ తర్వాత లక్ష్మణ్ దర్శకత్వంలో వచ్చిన తొలి ఫీచర్ ఫిల్మ్ ‘స్వాతి ముత్యం’. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమాతో లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకుడిగా పరిచయం అయితే హీరో బెల్లంకొండ గణేష్కు కూడా ఇది తొలి చిత్రమే. వీరిద్దరూ మంచి ముత్యంలాంటి సినిమా ఇచ్చి, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అక్కడ హిట్.. ఇక్కడా హిట్టే... ‘ఓ మై కడవులే’ (2020)తో తమిళ పరిశ్రమకు దర్శకునిగా పరిచయమయ్యారు అశ్వత్ మారిముత్తు. ఇదే సినిమా రీమేక్ ‘ఓరి.. దేవుడా’తోనే తెలుగులోనూ దర్శకునిగా పరిచయం అయ్యారు అశ్వత్. ‘ఓరి.. దేవుడా..’ కూడా ఓ మాదిరి హిట్గా నిలిచింది. ఇందులో విశ్వక్ సేన్ హీరోగా నటించగా, వెంకటేశ్ కీలక పాత్ర చేశారు. అక్టోబరు 21న విడుదలైన ఈ చిత్రానికి ‘దిల్’ రాజు, పరమ్ వి. పొట్లూరి, పెరల్ వి. పొట్లూరి నిర్మాతలు. థ్రిల్లింగ్ హిట్ ‘అంబులి’ సినిమాతో తమిళ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు దర్శక–ద్వయం హరి శంకర్–హరీష్ నారాయణ్. ఈ ఇద్దరూ తెరకెక్కించిన ‘యశోద’ గత నెల రిలీజై, హిట్ టాక్ తెచ్చుకుంది. సమంత టైటిల్ రోల్లో, వరలక్ష్మీ శరత్కుమార్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీతో తెలుగుకు దర్శకులుగా పరిచయం అయ్యారు హరి–హరీష్. సరోగసీ నేపథ్యంలో జరిగే క్రైమ్స్ నేపథ్యంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 11న విడుదలై, థ్రిల్లింగ్ హిట్ ఇచ్చింది. హిట్ హారర్ ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలై పెద్ద హిట్గా నిలిచిన చిత్రాల జాబితాలో ‘మసూద’ ఉంది. సూపర్ నేచురల్ హారర్ బ్యాక్డ్రాప్లో రూపొందిన ఈ సినిమాకి సాయికిరణ్ దర్శకుడు. సంగీత, తీరువీర్, కావ్య కళ్యాణ్రామ్, ‘శుభలేఖ’ సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన ఈ చిత్రం నవంబరు 18న విడుదలైంది. ఇంకొందరు... రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ తో శరత్ మండవ (తెలుగులో శరత్కు తొలి చిత్రం) వరుణ్ తేజ్ బాక్సింగ్ డ్రామా ‘గని’తో కిరణ్ కొర్రపాటి, నితిన్ పొలిటికల్ డ్రామా ‘మాచర్ల నియోజకవర్గం’ తో ఎమ్ఎస్ రాజశేఖర్ రెడ్డి, శ్రీ విష్ణు ‘అల్లూరి’ తో ప్రదీప్వర్మ, ‘టెన్త్క్లాస్ డైరీస్’తో సినిమాటోగ్రాఫర్ అంజి, సుమ కనకాల ‘జయమ్మ పంచాయితీ’ తో విజయ్కుమార్ కలివరపు, హర్ష్ కనుమిల్లి ‘సెహరి’తో జ్ఞానశేఖర్ ద్వారక, రాజ్తరుణ్ ‘స్టాండప్ రాహుల్’తో శాంటో, వైష్ణవ్ తేజ్ ‘రంగరంగ వైభవంగా..’తో గిరీశాయ (తెలుగులో...), ‘ముఖచిత్రం’ సినిమాతో గంగాధర్ వంటి దర్శకులు ప్రేక్షకుల మెప్పు పొందే ప్రయత్నం చేశారు. -
ఆసక్తిగా కల్యాణ్ రామ్ మూవీ టైటిల్.. సోషల్ మీడియాలో వైరల్
బింబిసారతో సూపర్ హిట్ అందుకున్న నందమూరి హీరో కల్యాణ్ రామ్. చాలా రోజుల తర్వాత బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్న కల్యాణ్ రామ్ నెక్ట్స్ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఓ ప్రాజెక్ట్కు ఆయన ఇప్పటికే ఒకే చెప్పారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ రివీల్ చేశారు మేకర్స్. (చదవండి: బింబిసార సక్సెస్.. ఫ్యాన్స్కు డైరెక్టర్ మరో సర్ప్రైజ్..!) రాజేంద్రా రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'అమిగోస్' అనే టైటిల్ పెట్టినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసింది. బింబిసార తర్వాత కల్యాణ్ రామ్ చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని హీరో కల్యాణ్ రామ్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆయన తన ట్విటర్లో రాస్తూ..' ఊహించని వాటిని ఆశించండి' అంటూ పోస్ట్ చేశారు. కాగా ఈ మూవీని వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న విడుదల చేయనున్నారు. బింబిసార హిట్ తర్వాత మరో వైవిధ్యమైన సినిమాతో కళ్యాణ్ రామ్ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. టాలీవుడ్లో భారీ చిత్రాలను నిర్మించే మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను రూపొందిస్తుండటం మరో విశేషం. కళ్యాణ్ రామ్ 19వ చిత్రంగా ఇది నిలవనుంది. ఈ సినిమా ద్వారా రాజేంద్ర రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ను చిత్ర నిర్మాణ సంస్థ విడుదల చేసింది. సోషల్ మీడియా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్కు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. అయితే టైటిల్ అమిగోస్ టాలీవుడ్ ఫ్యాన్స్లో మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. అమిగోస్ అనే పేరు కాస్త వైరైటీగా అనిపించడంతో నెట్టింట్లో తెగ వైరలవుతోంది. అమిగోస్ పదానికి స్పానిష్లో స్నేహితుడు అని అర్థం వస్తుందట. ఇవాళ రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్లో ముగ్గురు కల్యాణ్ రామ్లు కనిపిస్తున్నారు. ముగ్గురు కూడా మూడు డిఫరెంట్ లుక్స్లో ఉన్నారు. ఈ పోస్టర్ ద్వారా కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు హింట్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. అలాగే ట్విటర్లో ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేస్తూ.. ‘మీలాగే కనిపించే వారిని మీరు కలిసినప్పుడు, మీరు చనిపోతారని వారు అంటున్నారు’ అంటూ రాసుకొచ్చారు. సినిమా టైటిల్, కల్యాణ్ రామ్ లుక్స్ చూస్తుంటే మరో వైవిధ్యమైన కథతో నందమూరి హీరో వస్తున్నారని స్పష్టమవుతోంది. ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ సరసన ఆషిక రంగనాథ్ హీరోయిన్గా నటిస్తోంది. సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయినట్లు సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని తెలుస్తోంది. Hola #Amigos ❤️🔥 Expect the unexpected! See you in cinemas from Feb 10, 2023 🔥#RajendraReddy @AshikaRanganath @GhibranOfficial @MythriOfficial pic.twitter.com/1S2gdnUHeg — Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) November 7, 2022 -
బింబిసార సక్సెస్.. ఫ్యాన్స్కు డైరెక్టర్ మరో సర్ప్రైజ్..!
కల్యాణ్ రామ్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ హిట్ 'బింబిసార'. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. టాలీవుడ్ ప్రేక్షకులకు థియేటర్లలో వినోదాన్ని పంచింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. బింబిసారుడు అనే ఓ రాజు జీవిత కథను ఆధారంగా చేసుకుని సోషియో ఫాంటసీ డ్రామాగా డైరెక్టర్ వశిష్ఠ్ ఈ సినిమాను తెరకెక్కించాడు. తాజాగా ఈ మూవీతోనే దర్శకుడిగా పరిచయమైన వశిష్ఠ మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు. అభిమానులు ఊహించినట్లుగానే ఈ చిత్రానికి సీక్వెల్ బింబిసార-2 ఉంటుందని వెల్లడించారు. ఇటీవల ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు. వశిష్ఠ మాట్లాడుతూ.. 'సోషియో ఫాంటసీ సినిమాగా వచ్చిన బింబిసారను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ప్రస్తుతం వారంతా ఈ సినిమా సీక్వెల్ కోసం వెయిట్ చేస్తున్నారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాను తెరకెక్కించనున్నాం. కల్యాణ్ రామ్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత బింబిసార-2 షూటింగ్ ప్రారంభిస్తాం' అని అన్నారు. కాగా.. ప్రస్తుతం కల్యాణ్ రామ్ నవీన్ మేడారం దర్శకత్వంలో తెరకెక్కుతున్న డెవిల్ సినిమాలో నటిస్తున్నారు. చారిత్రక నేపథ్యంలో సాగే ఈ కథను పాన్ ఇండియా స్థాయిలో రూపొందించనున్నారు. -
ఓటీటీకి వచ్చేసిన బింబిసార, అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్
దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత కల్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ బింబిసార. రొటీన్ సినిమాలకు భిన్నంగా సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న కథతో వచ్చి బ్లాక్బస్టర్ హిట్ కొట్టేశాడు కల్యాణ్ రామ్. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం గత ఆగస్ట్ 5న ప్రేక్షకులు ముందుకు వచ్చి బాక్సాఫీసుకు భారీ విజయం అందించింది. కలెక్షన్స్ పరంగా కూడా పైసా వసూళ్ అనిపించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5లో అక్టోబర్21 (శుక్రవారం) అర్ధరాత్రి నుంచే బింబిసార స్ట్రీమింగ్ అవుతోంది. కాగా బింబిసారుడు అనే ఓ రాజు జీవిత కథను ఆధారంగా చేసుకుని సోషియో ఫాంటసీ డ్రామాగా డైరెక్టర్ వశిష్ఠ్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ మూవీతోనే ఆయన దర్శకుడిగా పరిచయమయ్యాడు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై కె. హరికృష్ణ భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో కేథరిన్ ట్రెసా, సంయుక్తా మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషించగా.. శ్రీనివాస్ రెడ్డి, ప్రకాశ్ రాజ్, వెన్నెల కిశోర్ కీలక పాత్రలో కనిపించారు. Get ready to fall back into the time of #Bimbisara and his Trigartala, streaming from MIDNIGHT TODAY! #BimbisaraonZEE5 @DirVassishta@CatherineTresa1 @iamsamyuktha_ @mmkeeravaani @NTRArtsOfficial @zee5telugu @ZEE5Tamil @ZEE5Kannada @zee5keralam pic.twitter.com/q9KrE2yjC2 — Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) October 20, 2022 -
అఫీషియల్: 'బింబిసార' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది
నందమూరి కల్యాణ్ రామ్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా 'బింబిసార'. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత ప్రేక్షకులను పలకరించిన కల్యాణ్ రామ్ ఈ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై వశిష్ఠ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను కె. హరికృష్ణ నిర్మించారు. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 5న రిలీజైన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లో సక్సెస్ఫుల్గా దూసుకుపోయిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో సందడి చేయబోతోంది. బింబిసార ఓటీటీ రిలీజ్ పై అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ను ప్రముఖ డిజిటిల్ ప్లాట్ఫాం జీ5 సంస్థ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీపావళి సందర్భంగా అక్టోబరు 21 నుంచి తెలుగు, కన్నడతో పాటు తమిళం, మలయాళంలో ఒకేసారి ఈ మూవీ జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు. కాగా ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ బింబిసారుడు అనే క్రూరమైన రాజు పాత్రలో తన నటనతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. కీరవాణి సంగీతం సినిమాకు పెద్ద ఎసెట్గా నిలిచింది. ఈ చిత్రంలో కేథరిన్, సంయుక్త మీనన్లు హీరోయిన్లుగా నటించారు. Bimbisaaaraa!! Echoing all over south India - Coming to you in 4 languages Enjoy #Bimbisara in Telugu, Kannada, Tamil & Malayalam Meet #BimbisaraOnOctober21#BimbisaraonZEE5@NANDAMURIKALYAN @DirVassishta@CatherineTresa1 @iamsamyuktha_ @mmkeeravaani @NTRArtsOfficial — ZEE5 Telugu (@ZEE5Telugu) October 15, 2022 -
దీపావళికి ఓటీటీలో ‘బింబిసార’ మూవీ, రిలీజ్ డేట్ ఇదే!
దాదాపు రెండేళ్ల గ్యాప్ అనంతరం నందమూరి హీరో కల్యాణ్ రామ్ నటించిన చిత్రం ‘బింబిసార’. రొటీన్ సినిమాలకు భిన్నంగా సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న కథతో వచ్చి బ్లాక్బస్టర్ హిట్ కొట్టేశాడు కల్యాణ్ రామ్. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 5న ప్రేక్షకులు ముందుకు వచ్చి బాక్సాఫీసుకు భారీ విజయం అందించింది. ఇక బాక్సాఫీస్ వద్ద బింబిసార మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తిచేసి డబుల్ ప్రాఫిట్ని ఖాతాలో వేసుకుంది. థియేటర్లో సక్సెస్ఫుల్గా దూసుకుపోయిన ఈచిత్రం ఇప్పుడు ఈమూవీ ఓటీటీలో సందడి చేయబోతోంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ను ప్రముఖ డిజిటిల్ ప్లాట్ఫాం జీ5 సంస్థ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీపావళి సందర్భంగా ఈ మూవీని జీ5 సంస్థ ఓటీటీకి తీసుకువస్తోంది. అక్టోబర్ 21న ఈ మూవీని ఓటీటీలో కానుంది. ఇందుకు సంబంధించి కీలక ప్రకటన కూడా వచ్చేసింది. కాగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై వశిష్ఠ్ దర్శకత్వంలో కె. హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. కేథరీన్, సంయుక్త మేనన్లు ఈ సినిమాలో హీరోయిన్స్గా నటించారు. ఇందులో కల్యాణ్ తన నటనలో విశ్వరూపం చూపించాడు. డ్యుయెల్ రోల్ చేసిన కల్యాణ్ రామ్ బింబిసారుడు అనే క్రూరమైన రాజు పాత్రలో తన నటనతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. -
ఓటీటీ రిలీజ్కు సిద్దమైన ‘బింబిసార’.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్!
దాదాపు రెండేళ్ల గ్యాప్ అనంతరం నందమూరి హీరో కల్యాణ్ రామ్ నటించిన చిత్రం బింబిసార.రొటీన్ సినిమాలకు భిన్నంగా సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న కథతో వచ్చి బ్లాక్బస్టర్ హిట్ కొట్టేశాడు. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 5న ప్రేక్షకులు ముందుకు వచ్చి బాక్సాఫీసుకు భారీ విజయం అందించింది. ఇక బాక్సాఫీస్ వద్ద బింబిసార మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తిచేసి డబుల్ ప్రాఫిట్ ని ఖాతాలో వేసుకుంది. చదవండి: Srihari Wife Shanthi: ‘డబ్బులు ఇవ్వకుండా వారు మోసం చేశారు’ ఇందులో కల్యాణ్ తన నటనలో విశ్వరూపం చూపించాడు. డ్యుయెల్ రోల్ చేసిన కల్యాణ్ రామ్ బింబిసారుడు అనే క్రూరమైన రాజు పాత్రలో తన నటనతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. ఇక థియేటర్లో సక్సెస్ఫుల్గా దూసుకుపోయిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్దమైంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ను ప్రముఖ డిజిటిల్ ప్లాట్ఫాం జీ5 సంస్థ ఫ్యాన్సీ ధర సొంతం చేసుకుంది. దీంతో దసరాకు బింబిసార మూవీని జీ5లో అందుబాటులోకి తెచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. చదవండి: మహిళా యాంకర్ పట్ల అసభ్య ప్రవర్తన, హీరో అరెస్ట్ దసరా కానుకగా ప్రేక్షకులకు మరింత వినోదం అందించేందుకు అక్టోబర్ 7వ తేదీన ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై జీ5 నిర్వహకులు అధికారిక ప్రకటన కూడా ఇవ్వనున్నారని తెలుస్తోంది. కాగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై వశిష్ఠ్ దర్శకత్వంలో కె. హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. కేథరీన్, సంయుక్త మేనన్లు ఈ సినిమాలో హీరోయిన్స్గా నటించారు. -
ఆ రెండు సినిమాలతో క్రేజ్.. కేరళ భామకు వరుస ఆఫర్లు..!
భీమ్లా నాయక్, బింబిసార చిత్రాలతో క్రేజ్ సంపాందించుకున్న బ్యూటీ సంయుక్త మీనన్. ఈ భామ కోసం టాలీవుడ్లో వరుస ఆపర్లు క్యూ కడుతున్నాయి. ఈ కేరళ కుట్టి మలయాళం, తమిళం, కన్నడలోనూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్లో తాజాగా కళ్యాణ్ రామ్ బింబిసార మూవీతో సక్సెస్ అందుకుంది. సోషియో ఫాంటసీ టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన బింబిసార బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. పవన్ కల్యాణ్ సినిమా భీమ్లా నాయక్లో రానాకు జోడిగా నటించింది ఈ అమ్మడు. (చదవండి: ‘భీమ్లా నాయక్’ టీంపై అలిగిన హీరోయిన్లు?, సంయుక్త మీనన్ క్లారిటీ) ‘బింబిసార’ నందమూరి కల్యాణ్రామ్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యత లేకున్నా.. ఈ భామకు హిట్ టాక్ సెంటిమెంట్ కలిసి రావడంతో టాలీవుడ్ దర్శక, నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు. తెలుగులో మొదట కల్యాణ్ రామ్ బింబిసారలో ఛాన్స్ రాగా.. ఆ సినిమా ఆలస్యం కావడంతో ‘భీమ్లా నాయక్’తో ఎంట్రీ ఇచ్చింది. 2016లో మలయాళం మూవీ ‘పాప్ కార్న్' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రంలో అంజనా పాత్రకు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత తమిళంలో ‘కలరి’ మూవీతో అభిమానులను పలకరించింది. ఈ సినిమా తర్వాత మలయాళంలో ‘లిల్లీ’ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. -
ఆ రెండు సినిమాల ఓటీటీ రిలీజ్పై సస్పెన్స్.. స్పందించిన జీ5..!
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తాజాగా నటించిన చిత్రం కార్తికేయ 2. ఆగష్టులో విడుదలైన ఈ చిత్రం ఊహించని విజయం సొంతం చేసుకుంది. బాలీవుడ్లో ఈ మూవీకి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాను ఓటీటీలో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా? అని అప్డేట్ల కోసం వెతుకున్నారు. అయితే ‘కార్తికేయ2’ను సైతం దసరా కానుకగా ఓటీటీలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంటే అక్టోబరు మొదటివారం స్ట్రీమింగ్కు రావచ్చని అంచనా వేస్తున్నారు. దీనిపై కూడా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చిన్న చిత్రంగా విడుదలై పాన్ ఇండియా స్థాయిలో రికార్డులు సృష్టించింది. రూ.100 కోట్ల క్లబ్ను దాటేసింది. (చదవండి: మల్టీప్లెక్స్ల్లో 75 రూపాయలకే సినిమా హ్యపీగా చూసేయండి..) ఇక ఎలాంటి అంచనాలు లేకుండా భారీ విజయం సాధించిన మరో చిత్రం 'బింబిసార'. ఈ చిత్రం కల్యాణ్రామ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఆగస్టులో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా కోసం ఓటీటీలో ఎప్పుడోస్తుందా అని సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రెండు సినిమాల విడుదలపై జీ5 స్పందించింది. ‘మీ ఉత్సాహానికి సంతోషంగా ఉంది. దయచేసి వేచి ఉండండి. మరిన్ని వివరాలకు మా సోషల్మీడియా ఖాతాలను అనుసరించండి’ అని రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో నడుస్తున్న ప్రచారం చూస్తే కల్యాణ్రామ్ ‘బింబిసార’ సెప్టెంబర్ 23న విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. -
అదరగొడుతున్న బేతంచెర్ల చిన్నారి.. బింబిసారలో శార్వరిగా
సాక్షి, బేతంచెర్ల (కర్నూలు): చిన్న వయస్సులోనే బుల్లి తెరతోపాటు వెండి తెరపై రాణిస్తూ ప్రతిభ చాటుకుంటోంది బేతంచెర్లకు చెందిన శ్రీదేవి. సీరియల్స్, సినిమాల్లో చక్కన నటన అభినయంతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు 10 సినిమాలు, 15 టీవీ సీరియల్స్లో నటించి మెప్పించింది. బుడిబుడి నడకలు, తడబడుతున్న మాటల వయస్సులో తన ప్రతిభతో అందరినీ మంత్రముగ్ధులు చేస్తోంది. ఈటీవీలో ప్రారంభమైన యమలీల తరువాత సీరియల్స్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న చిన్నారి బేతంచెర్ల పట్టణానికి చెందిన శ్రీహరి గౌడ్, లక్ష్మి దంపతుల కుమార్తె కావడం గమనార్హం. శ్రీదేవి తండ్రి శ్రీహరి గౌడ్ కొంత కాలం క్రితం జీవనోపాధి కోసం హైదరాబాద్ వెళ్లారు. అక్కడ చిత్ర పరిశ్రమలో స్థిరపడి కంజుల ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్గా పనిచేస్తున్నాడు. పలు సినిమాల్లో ఆర్టిస్టుగా రాణిస్తున్నాడు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు వారిలో పెద్ద కుమార్తె శ్రీదేవి. ఈ చిన్నారి ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతోంది. నటించే అవకాశం ఇలా.. శ్రీహరి గౌడ్ 18 సంవత్సరాలుగా సినీరంగంలో ఆర్టిస్టుగా పని చేస్తున్నాడు. జీ తెలుగు వారు పున్నాగ టీవీ సిరియల్స్ తీస్తున్న నేపథ్యంలో చిన్నారి పాత్ర అవసరం ఉండటంతో తన కూతురు శ్రీదేవిని వారికి పరిచయం చేశాడు. మొదట పున్నాగ సిరియల్స్లో కథానాయకుల కుమార్తెగా, కథనాయికల కుమార్తెగా నటించే అవకాశం దక్కింది. కెమెరా ముందు ఎలాంటి బెరుకు, తడబాటు లేకుండా ఆయా సన్నివేశాల్లో చక్కగా నటించడంతో అవకాశాలు వరుసకట్టాయి. ఆ సీరియల్లో నటిస్తుండగానే ప్రేమ, పౌర్ణమి, చెల్లెలి కాపురం, ముద్దమందారం, కళ్యాణ వైభోగం ఇలా 15 టీవీ సీరియల్స్లో నటించే ఆఫర్స్ వచ్చాయి. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ శ్రీదేవి బాలనటిగా రాణిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రస్తుతం ఈటీవీలో ప్రసారం అవుతున్న సరికొత్త ధారావాహిక యమలీల, ఆ తరువాత బాలనటిగా పలు పాత్రలను పోషిస్తోంది. సీరియల్స్లోనే కాకుండా సీని రంగంలోనూ నటన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తోంది. మొదట ఆర్డీఎక్స్ లవ్ చిత్రంలో బాలనటిగా నటించింది. కథనాయిక పాయల్ రాజ్పుత్ చిన్నప్పటి పాత్రలో శ్రీదేవి నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఆ తరువాత సూపర్మచ్చి సినిమాలో రాజేంద్రప్రసాద్ కుమార్తెగా రాణించింది. అడవి శేషు నటించిన మేజర్, రవితేజ నటించిన రామారావు అన్డ్యూటీ చిత్రాల్లో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమాలో శార్వరిగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. వరుసగా చిత్రాల్లో బాలనటిగా రాణిస్తూ సినీరంగంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటోది. మరికొన్నింట్లో అవకాశం శ్రీదేవి నటన, అభినయానికి అవకాశాలు వరుస కడుతున్నాయి. ఇప్పటివరకు నటించిన సినిమాలు, సీరియల్స్ కాకుండా మరికొన్నింటిలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం మూడు సినిమాల్లో శ్రీదేవి నటించనున్నట్లు తండ్రి శ్రీహరి గౌడ్ తెలిపారు. సినిమా రంగంతో పాటు టీవీ ప్రకటనల్లోనూ నటిస్తూ బేతంచెర్ల కీర్తి ప్రతిష్ఠలు చాటుతోంది. -
Hyderabad AMB థియేటర్లో దళపతి విజయ్.. ఏ సినిమా చూశారంటే?
Vijay Watches Bimbisara Movie In Hyderabad AMB Video Goes Viral: తెలుగు, తమిళ భాషల్లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఏకకాలంలో నటిస్తున్న చిత్రం 'వారీసు'(తెలుగులో వారసుడు). ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. శరత్కుమార్, ప్రభు, ప్రకాష్రాజ్, జయసుధ, శ్రీకాంత్, శ్యామ్, యోగిబాబు, సంగీత, సంయుక్త ముఖ్యపాత్రలు పోషిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. వరుస షెడ్యూల్తో బిజీగా ఉన్న విజయ్ తాజాగా చిన్న విరామం తీసుకున్నాడు. ఈ విరామంలో భాగంగా నందమూరి కల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం 'బింబిసార'ను (BIMBISARA MOVIE) విజయ్ వీక్షించినట్లు సమాచారం. సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతున్న ఈ సినిమాను ఆగస్టు 15న సూపర్ స్టార్ మహేశ్ బాబు థియేటర్ ఏఎమ్బీలో చూసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో తాజాగా లీక్ అయి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో విజయ్ బ్లూ షర్ట్, బ్లాక్ ప్యాంట్ ధరించి, ముఖానికి మాస్క్ పెట్టుకున్నాడు. విజయ్ను గుర్తించిన పాపరాజీ (ఫొటోగ్రాఫర్స్) ఫటాఫట్మని క్లిక్మనిపించారు. అలాగే విజయ్ కారులో వెళ్తుండగా, హీరో డ్రైవర్ అడ్డుగా చేతులు పెట్టడం చూడొచ్చు. సో మొత్తంగా, నందమూరి హీరో సినిమాను సూపర్ స్టార్ మహేశ్ బాబు థియేటర్లో మరో స్టార్ హీరో విజయ్ వీక్షించడం విశేషం. చదవండి: రానున్న 'ది డర్టీ పిక్చర్' సీక్వెల్ ! సిల్క్ స్మితగా విద్యా బాలన్ డౌటే ? View this post on Instagram A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_) కాగా విజయ్ 'వారీసు' చిత్రం 2022 దీపావళికి, లేదా 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరదశలో ఉందని సమాచారం. ఇది పూర్తి కాగానే 'విక్రమ్' లాంటి సాలిడ్ హిట్ ఇచ్చిన లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఇదివరకు లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో విజయ్ 'మాస్టర్' సినిమా చేసిన విషయం తెలిసిందే. చదవండి: నేను పెళ్లి చేసుకునే సమయానికే ఆమెకు ఒక బాబు: బ్రహ్మాజీ బిగ్బాస్ బ్యూటీకి లైంగిక వేధింపులు.. ఆవేదనతో పోస్ట్ View this post on Instagram A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_) -
‘బింబిసార’ కోసం కల్యాణ్రామ్ ఇంత కష్టపడ్డారా... మేకింగ్ వీడియో
చాలా రోజుల తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ని కళకళలాడించిన చిత్రం ‘బింబిసార’. నందమూరి కల్యాణ్రామ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు రెండు నెలలుగా హిట్ లేక విలవిలలాడుతున్న తెలుగు చిత్ర పరిశ్రమకు ఊపిరి అందించింది. ఈ చిత్రం విడుదలై పది రోజలు దాటినా ఇప్పటికీ మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ‘ది క్రానికల్స్’పేరిట మేకింగ్ వీడియోని విడుదల చేసింది. (చదవండి: గొప్ప మనసు చాటుకున్న ప్రశాంత్ నీల్.. గర్వంగా ఉందంటూ మాజీ మంత్రి ట్వీట్) ఈ చిత్రంలోని ఫైటింగ్ సీన్స్ ఎలా షూట్ చేశారు?సెట్ నిర్మాణానికి మేకర్స్ పడిన కష్టమేంటి? తదితర విశేషాల్ని ఈ వీడియోలో చూడొచ్చు. కల్యాణ్ రామ్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి నటించినట్లు తెలుస్తోంది. యంగ్ డైరెక్టర్ వశిష్టకు ఇది తొలి సినిమా అయినప్పటికీ.. అద్భుతంగా తెరకెక్కించాడు. కీరవాణి నేపథ్య సంగీతం, చోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ ఈ సినిమా స్థాయిని పెంచాయి. . ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రంలో కేథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. -
కల్యాణ్రామ్ 'బింబిసార' సినిమాపై బాలయ్య పొగడ్తలు
నందమూరి కల్యాణ్రామ్ తాజాగా నటించిన చిత్రం 'బింబిసార'. చాలాకాలం తర్వాత కల్యాణ్ రామ్ ఈ చిత్రంతో కంబ్యాక్ ఇచ్చాడు. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా మొదటి నుంచి పాజిటివ్ టాక్ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్లను రాబట్టింది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమాను చూసి బింబిసార బృందాన్ని అభినందించారు. తాజాగా నందమూరి బాలకృష్ణ యూనిట్ సభ్యులతో కలిసి ఈ సినిమాను వీక్షించారు. అనంతరం అనంతరం మూవీ టీంని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కల్యాణ్రామ్ నటనపై ఆయన ప్రశంసలు కురిపించారు. బాలకృష్ణతో పాటు కళ్యాణ్రామ్ సోదరి సుహాసిని, భార్య స్వాతి కూడా బింబిసార చిత్రాన్ని చూశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. Some special pictures from the special screening of #Bimbisara for Natasimham #NandamuriBalakrishna garu❤️ The team is all smiles & pumped up with roaring energy 💥🔥@NANDAMURIKALYAN @DirVassishta pic.twitter.com/AbUWQJnpRM — NTR Arts (@NTRArtsOfficial) August 13, 2022 -
3,4 రోజుల వసూళ్లకే సంబరాలు చేసుకోవద్దు: తమ్మారెడ్డి భరద్వాజ
ఇటీవల విడుదలైన బింబిసార, సీతారామం చిత్రాలు మంచి విజయం సాధించాయి. బాక్సాఫీసు వద్ద ఈ సినిమాలు పోటాపోటీగా కలెక్షన్స్ రాబడుతున్నాయి. ప్రస్తుతం పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో ఈ చిత్రాలు హిట్ కావడంతో తెలుగు పరిశ్రమ సంబరాలు చేసుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాల హిట్పై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజా ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. బింబిసార, సీతా రామం హిట్ అయ్యాయని ఆనందపడిపోకూడదని, మూడు నాలుగు రోజుల కలెక్షన్స్ చూసి సంబరాలు చేసుకోకూడదని వ్యాఖ్యానించారు. తాజాగా ఈ రెండు సినిమాలు చూసిన ఆయన తన రివ్యూ ఇచ్చారు. చదవండి: ‘లాల్సింగ్ చడ్డా’ మూవీ రివ్యూ సీతారామం మూవీ అద్భుతమైన ప్రేమ కావ్యమన్నారు. ఫస్ట్హాఫ్లో కశ్మీర్ పండితుల సమస్యను నిజాయితిగా చూపించారు. అలాగే హిందూ ముస్లిం వంటి అంశాలను తీసుకుని అద్భుతమైన ప్రేమ చిత్రంగా మలిచాడు డైరెక్టర్. ఓ అనాథను జావాన్గా తీసుకోవడం మంచి కాన్సెప్ట్ అన్నారు. ఇలాంటి సున్నితమైన ఎన్నో సమస్యలను తీసుకుని మంచి సినిమాగా తీర్చిదిద్దిన డైరెక్టర్ను తప్పనిసరిగా అభినందించాల్సిన విషయమన్నారు. అనంతరం బింబిసార మూవీ గురించి మాట్లాడుతూ.. ఈ మూవీ రెగ్యులర్ కమర్షియల్ కథేనన్నారు. కథలో కొత్తదనం లేకపోయిన డైరెక్టర్ వశిష్ఠ సినిమాను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారని ప్రశంసలు కురిపించారు. అయితే టైం ట్రావెల్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రాన్ని ఆదిత్య 369తో పోల్చి చూడటం సరికాదన్నారు. చదవండి: చిక్కుల్లో స్టార్ హీరో దర్శన్, ఆడియో క్లిప్తో సహా పోలీసులను ఆశ్రయించిన నిర్మాత ఆ సినిమాకు, ఈ సినిమాకు అసలు పోలీకే లేదన్నారు. బింబిసారుడు అనే ఓ క్రూరమైన రాజు కథను తీసుకుని టైం ట్రావెలర్లో ఆ రాజు సున్నితంగా ఎలా మారాడో చూపించి ఈ చిత్రాన్ని ఆసక్తిగా తీశారు. మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు తప్పకుండా సినిమాను ఆదరిస్తారని చెప్పారు. అయితే ఈ మూడు, నాలుగు రోజుల కలెక్షన్స్ చూసి సంబరాలు చేసుకోకుండ, సినిమా రన్టైం పెంచాలన్నారు. థియేటర్లో రెగ్యులర్ ఆడియన్స్ పెరిగేలా సినిమాలను తీసుకురావాలని ఆయన సూచించారు. అలాగే ‘50 రోజుల పాటు సినిమాలు ఎందుకు ఆడటం లేదని? అసలు ప్రేక్షకులు థియేటర్లకు ఎందురు రావడం లేదు అనేది ఆలోచించాలి. అప్పుడే మరిన్ని మంచి సినిమాలు వచ్చి థియేటర్లను బతికిస్తాయి. సినిమాకు పూర్వ వైభవం వస్తోంది’ అని తమ్మారెడ్డి పేర్కొన్నారు. -
బింబిసార ర్యాప్ సాంగ్ విన్నారా?
సరైన హిట్ కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నాడు నందమూరి కల్యాణ్ రామ్. ఇటీవలే వచ్చిన బింబిసారతో అనుకున్నదానికంటే ఎక్కువ సక్సెస్ను రుచి చూశాడు. కొత్త దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన ఈ టైం ట్రావెల్ మూవీ ఆగస్టు 5న రిలీజైంది. కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకున్న ఈ సినిమా నుంచి ర్యాప్ సాంగ్ రిలీజైంది. ఇందులో పాటతో పాటు పలు ముఖ్య సన్నివేశాలను సైతం చూపించారు. అంతేకాదు, కల్యాణ్ రామ్ చెప్పిన డైలాగులను సైతం ర్యాప్ సాంగ్లో పొందుపరచడం విశేషం. ఆదిత్య అయ్యంగార్, లిప్సిక, పృథ్వీచంద్ర పాడిన ర్యాప్ సాంగ్కు కీరవాణి సంగీతం అందించాడు. చదవండి: పదునైన ఆయుధంతో సూసైడ్కు యత్నించిన నటుడు డెంగ్యూను లెక్కచేయని కంగనా, నువ్వు నిజంగా ఇన్స్పిరేషన్.. -
నందమూరి హీరోలను కాపాడుతున్న ‘చిట్టితల్లి’
అప్పుడప్పుడు సినిమా పరిశ్రమలో కొన్ని సెంటిమెంట్లు అనేవి భలేగా వర్కౌట్ అవుతాయి. కావాలని ఫాలో అయినవి కాకపోయినా వాటి వల్ల వచ్చే ఫలితాలు మాత్రం చాలా ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి. ఇటీవలి కాలంలో నందమూరి హీరోలకు ‘పాప’ ఫ్యాక్టర్ అనేది ఆయా చిత్రాలు బ్లాక్ బస్టర్ కావడానికి ఉపయోగపడిందనేది వాస్తవం. గత ఏడాది డిసెంబర్ నెలలో రిలీజైన బ్లాక్ బస్టర్ అఖండ సినిమాలో బాలకృష్ణ కూతురిగా నటించిన పాప చుట్టే దర్శకుడు బోయపాటి శ్రీను సెకండ్ హాఫ్ మొత్తం కూడా నడిపించాడు.అలాగే సీక్వెల్ కి లింక్ కూడా అక్కడే ఇచ్చాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా జూనియర్ ఎన్టీఆర్ చేసిన కొమురం భీమ్ క్యారెక్టర్ పోరాడేది చిన్నపాపైన మల్లి కోసమే.ఈ తాలూకు ఎమోషన్ రామ్ చరణ్ కన్నా ఎక్కువగా కనెక్ట్ అయ్యింది తారక్ క్యారెక్టర్ తోనే.తాజాగా రిలీజైన బింబిసార సినిమాలో చెడ్డవాడైన చక్రవర్తి తన చేతిలో మరణించిన పాప కోసం ప్రాయశ్చిత్తంగా వర్తమానంలో తన ప్రాణాలు కాపాడే బాధ్యతను తీసుకుంటాడు. ఇది దర్శకుడు వశిష్ట ప్రెజెంట్ చేసిన థీమ్ లో బలమైన పాయింట్ ఇదే. (చదవండి: సీతారామం సక్సెస్.. ఆరోజు ఏడ్చేశా..: దుల్కర్ సల్మాన్) అఖండ, ఆర్ఆర్ఆర్, బింబిసార చిత్రాలలో చైల్డ్ సెంటిమెంట్ ఇంత బ్రహ్మాండంగా వర్కౌట్ అవ్వడం స్పెషల్ అనే చెప్పాలి.ఇంకా అది కూడా కేవలం ఎనిమిది నెలల వ్యవధిలో ఈ మూడు హిట్ కావడం గమనార్హం. నందమూరి ఫ్యాన్స్ ఆనందం అయితే మాములుగా లేదు. ముఖ్యంగా ఎప్పటి నుంచో సక్సెస్ లేక వెయిట్ చేస్తున్న కళ్యాణ్ రామ్ కు ఈ రేంజ్ సక్సెస్ దక్కడం పట్ల చాలా హ్యాపీగా ఉన్నారు. బింబిసార 2 సినిమా కూడా అనౌన్స్ చేశారు కాబట్టి ఆ చిట్టితల్లిని కంటిన్యూ చేస్తారు. -
ఇన్నాళ్లు ఓటీటీని విలన్ చేశారు.. ఇప్పుడేమంటారు?
‘మంచి సినిమాలు తీస్తున్నాం. కాని ఆడియెన్స్ మాత్రం థియేటర్ కు రావడం లేదు. ఓటీటీలకు అతుక్కుపోతున్నారు’అంటూ ఇన్ని రోజులు టాలీవుడ్ పెద్దలు చెప్పినవన్ని ఉత్తి మాటలే అని ‘బింబిసార’, ‘సీతారామం’ చిత్రాలు నిరూపించాయి. వరుసగా డిజాస్టర్లతో సతమతమవుతున్న టాలీవుడ్ బాక్సాఫీస్కు ఊపిరి అందించాయి. ‘మేజర్’, ‘విక్రమ్’ తర్వాత టా వచ్చిన చిత్రాలేవి కాసుల వర్షాన్ని కురిపించలేకపోయాయి. మొన్నటి వరకు ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు విడుదల కావడం.. అవి డిజాస్టర్లుగా మిగిలిపోవడం టాలీవుడ్లో ఒక ట్రెండ్గా మారిపోయింది. అయితే ఈ డిజాస్టర్స్ ట్రెండ్ కు టాలీవుడ్ ఇంతకాలం ఆడియెన్స్ థియేటర్ కు రాకపోవడమే రీజన్ గా చెప్పుకొచ్చింది. ఓటీటీ ను మెయిన్ విలన్ గా చేసింది. (చదవండి: సీతారామం సక్సెస్.. ఆరోజు ఏడ్చేశా..: దుల్కర్ సల్మాన్) అయితే రెండు నెలల్లో రిలీజైన సినిమాల కంటెంట్ గురించి మాత్రం ఎప్పుడూ చర్చించలేదు. ఫెయిల్యూర్స్ ను విశ్లేసించలేదు. అంటే సుందరానికి, విరాటపర్వం, గాడ్సే, సమ్మతమే, పక్కా కమర్షియల్ , హ్యాపీ బర్త్ డే, ది వారియర్, థ్యాంక్యూ, రామారావు ఆన్ డ్యూటీ అన్నీ కూడా ఇలా వచ్చి అలా వెళ్లాయి. ఎందుకో తెలియదు కాని ఈ సినిమాల్లో కంటెంట్ ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించలేకపోయాయి. దాంతో డిజాస్టర్స్ లిస్ట్ లో చేరాయి. (చదవండి: థ్యాంక్యూ’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడు.. ఎక్కడ?) 8 వారాలుగా ఇండస్ట్రీలో డిజాస్టర్ల మోత మోగడంతో దర్శకనిర్మాతల్లోనూ, హీరోల్లోనూ ఒక లాంటి భయం మొదలైంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇండస్ట్రీ మనగడే కష్టం అని గ్రహించారు. దాంతో వెంటనే గిల్డ్ షూటింగ్ బంద్ కు పిలుపునిచ్చింది. ఆగస్ట్ 1 నుంచి షూటింగ్స్ బంద్ కొనసాగుతోంది. ఇంతోలో బింబిసార, సీతారామం డిజాస్టర్ల పరంపరకు బ్రేక్ ఇచ్చాయి. రెండు నెలలుగా ఇంటికే పరిమితం అయిన ఆడియెన్స్ ను థియేటర్ కు రప్పించాయి. బింబిసార మాస్ ఆడియెన్స్ ను ఉర్రూతలూగిస్తుండగా సీతారామం క్లాస్ ప్రేక్షకులను, యూత్ ఆఢియెన్స్ ను ఇంప్రెస్ చేస్తోంది. -
‘బింబిసార’ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
సీక్వెల్స్ ట్రెండ్.. పేరు అదే కానీ, కథ వేరు
‘క్రిష్’, ‘ధూమ్’, ‘దబాంగ్’, ‘టైగర్’, ‘హౌస్ఫుల్’, ‘గోల్మాల్’, ‘భాగీ’, ‘హేట్ స్టోరీ’, ‘మర్డర్’... ఇలా చెప్పుకుంటూ పోతే బాలీవుడ్లో ఎన్నో ఫ్రాంచైజీ సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ట్రెండ్ తెలుగులోనూ కనబడుతోంది. కథ ఎక్కడ ముగిసిందో అక్కడ్నుంచి కొనసాగడాన్ని సీక్వెల్ అంటుంటారు. కానీ కథ వేరు ఉంటుంది.. టైటిల్ అదే ఉంటుంది. కాకపోతే ఆ సినిమా పేరుకి 1, 2, 3 అని జోడించి ఏ భాగానికి ఆ భాగంలో కొత్త కథ చూపిస్తుంటారు. దీన్ని ఫ్రాంచైజీ అంటుంటారు. ఇక తెలుగులో రానున్న ఫ్రాంచైజీల గురించి తెలుసుకుందాం. చదవండి: ఆ యువ నటి శంకర్ కూతురిని టార్గెట్ చేసిందా? ఆ ట్వీట్ అర్థమేంటి! ఈ మధ్యకాలంలో ప్రేక్షకులను బాగా నవ్వించిన చిత్రాల్లో ‘ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ ఒకటి. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా, తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. 2019లో సంక్రాంతికి విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్లాక్బాస్టర్ హిట్ అందించారు. ‘ఎఫ్ 2’ ఇచ్చిన హిట్ జోష్తో ‘ఎఫ్ 3’ (2022)ని రెడీ చేసి ఆడియన్స్కు అందించారు అనిల్ రావిపూడి. ఇందులోనూ వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా, తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటించారు. తొలి భాగంలో నటించిన రాజేంద్రప్రసాద్ మలి భాగంలోనూ ఉన్నారు. సోనాల్ చౌహాన్, సునీల్ ఈ ఫ్రాంచైజీలో యాడ్ అయ్యారు. ఈ ఏడాది మేలో విడుదలైన ‘ఎఫ్ 3’కి కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ‘ఎఫ్ 3’ ఎండింగ్లో ‘ఎఫ్ 4’ హింట్ ఇచ్చారు అనిల్ రావిపూడి. ఇక హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబి నేషన్లో వచ్చిన ‘ఆర్య’ (2004), ‘ఆర్య 2’ (2009) చిత్రాలను ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోలేరు. ప్రేమ ప్రధానాంశంగా రూపొందిన ఈ సినిమాలకు మంచి ఆదరణ లభించింది. కాగా ఇటీవల సోషల్ మీడియాలో చాట్ సెషన్లో పాల్గొన్న సుకుమార్ను ఓ నెటిజన్ ‘ఆర్య 3’ తీయాలని కోరగా, సుకుమార్ పాజిటివ్గా రెస్పాండ్ అవుతూ ‘ఆర్య 3’ ఉంటుం దన్నట్లుగా చెప్పారు. ఇది ‘ఆర్య’ ఫ్యాన్స్ను హ్యాపీ ఫీలయ్యేలా చేసింది. మరోవైపు కల్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘బింబిసార’. ఈ సినిమాతో వశిష్ఠ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ నెల 5న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. చదవండి: హీరోగా చేస్తానని చెప్పగానే నాన్న చివాట్లు పెట్టారు: దుల్కర్ సల్మాన్ సోషియో ఫ్యాంటసీ అండ్ టైమ్ ట్రావెల్ బ్యాక్డ్రాప్లో రూపొందిన ‘బింబిసార’ను ‘బింబిసార 2’ ‘బింబిసార 3’... ఇలా ఓ ఫ్రాంచైజీగా కొనసాగించే ఆలోచనలు ఉన్నట్లుగా వశిష్ఠ్ చెప్పుకొచ్చారు. ఆల్రెడీ ‘బింబిసార 2’ చేయడానికి కల్యాణ్ రామ్ కూడా ఫుల్ పాజిటివ్గా ఉన్నారు. ఇక చిన్న సినిమాగా వచ్చి బ్లాక్బాస్టర్ హిట్ అందుకున్న సినిమాల జాబితాలోకి ‘గూఢచారి’, ‘కార్తికేయ’, ‘హిట్’ చేరాయి. 2018లో అడివి శేష్ హీరోగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో వచ్చిన ‘గూఢచారి’ మంచి విజయాన్ని సాధించింది. దీంతో ‘గూఢచారి 2’కు కూడా గ్రీన్సిగ్నల్ ఇచ్చారు అడివి శేష్. ‘గూఢచారి 2’కు రాహుల్ పాకాల దర్శకుడు. ‘గూఢచారి’ని ఓ ఫ్రాంచైజీలా కొనసాగించే ఆలోచన ఉందని, ‘గూఢచారి 2’కు తాను దర్శకత్వం వహించలేకపోయినప్పటికీ ‘గూడఛారి’ ఫ్రాంచైజీలో వచ్చే ఏదో ఒక భాగానికి తప్పక దర్శకత్వం వహిస్తానన్నట్లుగా దర్శకుడు శశి కిరణ్ తిక్క ఇటీవల కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పారు. మరోవైపు విశ్వక్ సేన్ హీరోగా 2020లో వచ్చిన ‘హిట్: ది ఫస్ట్ కేస్’ మంచి హిట్గా నిలిచింది. దీంతో ఇప్పుడు ‘హిట్: ది సెకండ్ కేస్’ సెట్స్పై ఉంది. అయితే ఇందులో అడివి శేష్ హీరోగా నటిస్తున్నారు. కానీ టైటిల్స్ని బట్టి ‘హిట్’ సినిమా ఓ ఫ్రాంచైజీలా కొనసాగే అవకాశం ఉందని ఊహించవచ్చు. ఇంకోవైపు హీరో నిఖిల్ కెరీర్కు ‘కార్తికేయ’ (2014) మంచి ప్లస్గా నిలిచింది. దీంతో నిఖిల్, దర్శకుడు చందు మొండేటి మళ్లీ ‘కార్తికేయ 2’ తీశారు. ఈ నెల 13న ఈ చిత్రం రిలీజ్ కానుంది. అయితే ‘కార్తికేయ 3, 4’లకు స్క్రిప్ట్ రెడీగా లేకపోయినప్పటికీ కోర్ ఐడియా ఉందని చందు మొండేటి చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. సో.. ‘కార్తికేయ 3’ కూడా ఉండొచ్చు. అలాగే ‘చిత్రం’ (2000) సినిమా ‘చిత్రం 1.1’, ‘ఢీ: కొట్టి చూడు’ (2007) తర్వాత ‘ఢీ 2: డబుల్ డోస్’, ‘డీజే టిల్లు’ తర్వాత ‘డీజే టిల్లు 2’ వంటి సినిమాలు రానున్నాయి. భవిష్యత్తులో మరిన్ని ఫ్రాంచైజీలు వచ్చే అవకాశం ఉంది. -
మళ్లీ పుట్టినట్లు అనిపించింది.. ఆ మాటలు వింటే భయమేసేది
‘‘బింబిసార’ రిలీజ్ తర్వాత చాలామంది సినీ ప్రముఖులు ఫోన్ చేసి మాట్లాడుతుంటే నాకు మళ్లీ పుట్టినట్లు అనిపించింది. ఇంత మంచి కథను నాకు ఇచ్చిన వశిష్ఠ్కు ధన్యవాదాలు’’ అని కల్యాణ్ రామ్ అన్నారు. వశిష్ఠ్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ హీరోగా నటించిన చిత్రం ‘బింబిసార’. హరికృష్ణ .కె నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం రిలీజైంది. ఈ చిత్రం సక్సెస్ మీట్లో కల్యాణ్ రామ్ మాట్లాడుతూ– ‘‘ఎంతో నమ్మకంతో సినిమాను పూర్తి చేశాం. కానీ థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదనే కొంతమంది మాటలు వింటే భయమేసేది. అయితే మంచి కంటెంట్ ఉన్న సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని నమ్మాను.. ‘బింబిసార’ విషయంలో అదే నిజమైంది. మా చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు నమస్కరిస్తున్నాను’’ అన్నారు. నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ–‘‘మేజర్, విక్రమ్’ సినిమాలు మంచి విజయాన్ని చూశాయి. ఆ తర్వాత రెండు నెలల పాటు సినిమాలేవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ‘బింబిసార, సీతారామం’ ఇండస్ట్రీకి ఊపిరి పోశాయి. తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఇదే ఉత్సాహంతో నేను కూడా ముందుకెళతాను’’ అన్నారు. ‘‘మా సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు వశిష్ఠ్. డిస్ట్రిబ్యూటర్లు శివరాం, ఎల్.వి.ఆర్, హరి, ఎ.ఎం.ఆర్ పాల్గొన్నారు. -
'బింబిసార'లో అమాయకత్వంతో ఆకట్టుకున్న ఈ పాప ఎవరంటే?
త్రిగర్తల సామ్రాజ్యాధినేతగా కల్యాణ్ రామ్ అదరగొడుతున్న చిత్రం 'బింబిసార'. శుక్రవారం(ఆగస్ట్ 5న) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. తొలి రోజు నుంచే మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది ఈ సినిమా. టైమ్ ట్రావేల్ అనే సరికొత్తగా ప్రయోగం చేసిన కల్యాణ్ రామ్కు చాలా గ్యాప్ తర్వాత మంచి విజయం లభించింది. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ నటనకు, విజువల్స్ మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే ఈ సినిమాలో నటించిన మిగతా నటీనటులకు కూడా మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా 'బింబిసార'లో చిన్నారి పాత్రలో నటించి అందరి మన్ననలు పొందింది బేబి శ్రీదేవి. త్రిగర్తల సామ్రాజ్యంలో ఆయుర్వేద పండితుడి (తనికెళ్ల భరణి) మనవరాలు శాంభవిగా, భూలోకంలో బింబిసారుడి వంశంలో పుట్టిన మొదటి ఆడపిల్లగా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. బేబి శ్రీదేవి అమాయకత్వం, కల్యాణ్ రామ్తో వచ్చే సీన్లు మనసుకు హత్తుకుంటాయి. అయితే ప్రస్తుతం ఈ పాప ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఈ పాప ఎవరు అని సెర్చ్ చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన బేబి శ్రీదేవి తల్లిదండ్రులు శ్రీహరి గౌడ్, శ్రీలక్ష్మి. వీరు హైదరాబాద్లో నివాసముండగా, శ్రీహరి గౌడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్న బేబి శ్రీదేవి పున్నాగ, పౌర్ణమి, చెల్లెలి కాపురం, కల్యాణ వైభోగం వంటి 15 సీరియల్లలో నటించి ఆకట్టుకుంది. అలాగే మేజర్, రామా రావు ఆన్ డ్యూటీ వంటి చిత్రాల్లో సైతం నటించింది. View this post on Instagram A post shared by Sridevi Bangaram (@sridevi_bangaram39) View this post on Instagram A post shared by Sridevi Bangaram (@sridevi_bangaram39) View this post on Instagram A post shared by Sridevi Bangaram (@sridevi_bangaram39) View this post on Instagram A post shared by Sridevi Bangaram (@sridevi_bangaram39) -
'బింబిసార' ఓటీటీ రిలీజ్పై క్లారిటీ ఇచ్చిన దిల్రాజు
నందమూరి కల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం 'బింబిసార'. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత రొటీన్ సినిమాలకు భిన్నంగా సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న కథ ద్వారా కల్యాణ్ రామ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాంచి వసూళ్లతో దూసుకుపోతుంది. ప్రస్తుతం థియేటర్లో సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్న ఈ చిత్రం ఓటీటీ రిలీజ్పై నెట్టింట తెగ చర్చ జరుగుతుంది. చదవండి: Bimbisara: హీరో కల్యాణ్ రామ్ భార్య గురించి ఈ విషయాలు తెలుసా? అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్పై ప్రముఖ నిర్మాత దిల్రాజు క్లారిటీ ఇచ్చారు. 50 రోజుల తర్వాతే బింబిసార ఓటీటీలో విడుదల అవుతుందని స్పష్టం చేశారు. దీంతో సెప్టెంబర్ 23న ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. .నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై వశిష్ఠ్ దర్శకత్వంలో కె. హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. కేథరీన్, సంయుక్త మేనన్లు ఈ సినిమాలో హీరోయిన్స్గా నటించారు. -
Bimbisara: హీరో కల్యాణ్ రామ్ భార్య గురించి ఈ విషయాలు తెలుసా?
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన 'బింబిసార' సినిమా బాక్సాఫీస్ వద్ద కళకళలాడుతుంది.విడుదలైన రోజు నుంచే హిట్ టాక్తో దూసుకుపోతున్న ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. నందమూరి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి వచ్చినా విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు కల్యాణ్ రామ్. అయితే ఆయన పర్సనల్ లైఫ్ గురించి చాలా మందికి తెలియదు. ఈ క్రమంలో పలువురు ఆయన వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకునేందుకు నెట్టింట సెర్చింగ్ మొదలుపెట్టారు. ఇక ఆయన భార్య స్వాతి ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్న వివరాలపై సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. కల్యాణ్రామ్కు 2006 ఆగస్టు 10న స్వాతి అనే అమ్మాయితో వివాహం జరిగింది. వీరిది పెద్దలు కుదిర్చిన సంబంధం. పెళ్లి చూపుల్లోనే స్వాతిని చూసి ఇష్టపడిన కల్యాణ్ రామ్ ఆమెనే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టారట. ఇక ఆమె వృత్తిరీత్యా డాక్టర్. కల్యాణ్ రామ్ భార్య ఫ్యామిలీ విషయానికి వస్తే వారిదీ సంపన్న కుటుంబమే. ఆమె తండ్రికి ఫార్మా రంగంతో పాటు పలు పరిశ్రమలు ఉన్నాయట. ఇక స్వాతి కూడా బిజినెస్ రంగంలోనే ఉన్నారు. ఆమెకు సొంతంగా వీఎఫ్ఎక్స్ సంస్థ ఉంది. బింబిసార సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎక్కువ శాతం ఈ సంస్థలోనే జరిగినట్లు తెలుస్తోంది. ఇక కల్యాణ్రామ్-స్వాతి దంపతులకు అదైత, శౌర్యరామ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. చదవండి: 'బింబిసార' సినిమాపై అల్లు అర్జున్ రివ్యూ.. ట్వీట్ వైరల్ -
'బింబిసార' సినిమాపై అల్లు అర్జున్ రివ్యూ.. ట్వీట్ వైరల్
కల్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'బింబిసార' సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతుంది. కొత్త దర్శకుడు వశిష్ట తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఈ మూవీ విజయంపై పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా ఈ చిత్రంపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. బింబిసార టీమ్కు అభినందనలు. ఇది ఒక ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్ ఫాంటసీ చిత్రం. 'కళ్యాణ్రామ్ నటన అద్భుతంగా ఉంది. ఎప్పుడూ ఇండస్ట్రీకి కొత్త టాలెంట్ను పరిచయం చేస్తున్నందుకు, కొత్త తరహా సినిమాలను చేస్తున్నందుకు ఆయనంటే నాకు ఎప్పటికీ గౌరవమే.డెబ్యూ డైరెక్టర్ వశిష్ఠ ఈ చిత్రాన్ని చక్కగా హ్యాండిల్ చేశారు. ఈ సినిమాకు పనిచేసిన కీరవాణి గారు, కేథరీన్, సంయుక్త మీనన్లకు అభినందనలు' అంటూ బన్నీ ట్వీట్ చేశారు. చదవండి: అల్లు అర్జున్ భార్య ఫోటోషూట్పై నిహారిక కామెంట్ Big congratulations to #Bimbisara team . Very interesting & an engaging fantasy film . Impactful presence by @NANDAMURIKALYAN garu . My respect for him for always bringing in new talent into the industry & attempting new kind of films. — Allu Arjun (@alluarjun) August 7, 2022 -
Bimbisara: రెండో రోజు అదే జోరు.. ఊహించని కలెక్షన్స్!
చాలా రోజుల తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఈ శుక్రవారం (ఆగస్ట్ 05) విడుదలైన బింబిసార, సీతారామం చిత్రాలు రెండూ హిట్ టాక్తో దూసుకెళ్తున్నాయి. వీటిలో కలెక్షన్స్ పరంగా బింబిసార ఒకడుగు ముందు ఉంది. కల్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ వశిష్ట్ దర్శకత్వం వహించాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై హరికృష్ణ నిర్మించారు. కేథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. (చదవండి: హీరోగా, నిర్మాతగా అభినందనీయం.. కానీ ఆ ట్యాగ్?) నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతూ రికార్డులు సృష్టిస్తోంది. తొలి రోజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.7.27 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టగా.. రెండో రోజు కూడా అదే జోరును కొనసాగింది. రెండో రోజు ఈ చిత్రం రూ.4.52 కోట్లను రాబట్టింది. ఈ చిత్రానికి రూ.15.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.16 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు ఈ చిత్రం రెండు రోజులకి రూ.12.37 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కు రూ.3.63 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఆదివారం కూడా ఇదే జోరు కొనసాగితే ఈజీగా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బింబిసార’ రెండు రోజుల కలెక్షన్స్.. ► నైజాం - రూ. 3.92 కోట్లు ► సీడెడ్ - రూ. 2.24 కోట్లు ► ఈస్ట్ - రూ. 70 లక్షలు ► వెస్ట్ - రూ.55 లక్షలు ► ఉత్తరాంధ్ర - రూ.1.55 కోట్లు ► గుంటూరు- రూ.89 లక్షలు ► కృష్ణా - రూ.59 లక్షలు ► నెల్లూరు - రూ.38 లక్షలు ► కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా- రూ. 0.50 లక్షలు ► ఓవర్సీస్ రూ.1.05 కోట్లు ► ప్రపంచ వ్యాప్తంగా మెత్తం రూ. 12.37 కోట్లు(రూ.20 కోట్ల గ్రాస్) -
హీరోగా, నిర్మాతగా అభినందనీయం.. కానీ ఆ ట్యాగ్?
చాలా గ్యాప్ తర్వాత, కొత్త ప్రయోగమైన 'బింబిసార' హిట్తో సక్సెస్ వైపు దూసుకుపోతున్నాడు నందమూరి కల్యాణ్ రామ్. కథనే నమ్ముకుని విభిన్నమైన చిత్రాలను నటుడిగా ఎంకరేజ్ చేయడమే కాకుండా నిర్మాతగా రూపొందిస్తున్న కల్యాణ్ రామ్కు, ఓటీటీ వేళ థియేటర్లకు 'బింబిసార' విజయం ఒక ఆశా కిరణం. ఈ సక్సెస్పై కల్యాణ్ రామ్ ఆనంద వ్యక్తం చేస్తూ అభిమానులకు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపాడు. అయితే 'బింబిసార' విజయంతో కొందరు మాత్రం రచ్చ చేస్తున్నారు. 'మెగాస్టార్' ట్యాగ్ జోడించి #MegastarKalyanRam అంటూ సోషల్ మీడియాలో ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవిపై ట్రోలింగ్కు సైతం దిగుతున్నారు. ఈ నేపథ్యంలో కల్యాణ్ రామ్కు 'మెగాస్టార్' ట్యాగ్ తగిలించడం అంతా అవసరమా? అనే విషయంపై ఓ చిన్న లుక్ వేద్దామా. 'బాల గోపాలుడు' సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్గా పరిచయమైన నందమూరి కల్యాణ్ రామ్ 2003లో వచ్చిన 'తొలి చూపులోనే' సినిమాతో హీరోగా డెబ్యూ చేశాడు. ఈ సినిమాతో పాటు అదే సంవత్సరంలో విడుదలైన 'అభిమన్యు' అంతగా ఆకట్టుకోలేదు. తర్వాత ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో నిర్మాతగా మారి రూపొందించిన చిత్రం అతనొక్కడే. ఈ సినిమాతో సురేందర్ రెడ్డి అనే కొత్త డైరెక్టర్ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన కల్యాణ్ రామ్ హీరోగా, నిర్మాతగా 2005లో బ్లాక్బస్టర్ హిట్ కొట్టాడు. అప్పటి నుంచి హీరోగా విభిన్నమైన కథలను ఎంచుకోవడమే కాకుండా నిర్మాతగా రూపొందిస్తున్నాడు. ఇలా హీరోగా, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పేరిట నిర్మాతగా ఇప్పటివరకు ఎనిమిది చిత్రాలను నిర్మించాడు. కానీ ఏ ఒక్క చిత్రానికి స్టార్ డైరెక్టర్తో సినిమాను రూపొందించలేదు. అయితే 2016లో ఇజం సినిమాను పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసినా, అప్పుడు పూరి వరుస పరాజయాల్లో ఉన్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లోని తొలి చిత్రం అతనొక్కడేతో సురేందర్ రెడ్డిని పరిచయం చేస్తే, 2009లో జయీభవతో నరేన్ కొండెపాటిని, 2013లో ఓం త్రీడీ చిత్రంతో సునీల్ రెడ్డిని, 2015లో పటాస్ సినిమాతో అనిల్ రావిపూడిని డైరెక్టర్గా తెలుగు చిత్రసీమకు ఇంట్రడ్యూస్ చేశాడు కల్యాణ్ రామ్. అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో రెండో సినిమాగా 2008లో విడుదలైన హరే రామ్ను హర్షవర్ధన్తో నిర్మించాడు. అప్పటికే ఈ డైరెక్టర్ బాలకృష్ణతో విజయేంద్ర వర్మ తెరకెక్కించి ప్లాప్ మూటగట్టుకున్నాడు. డైరెక్టర్ స్వర్ణ సుబ్బరావు తన పేరును హర్షవర్ధన్గా మార్చుకుని ఈ చిత్రం చేయడం విశేషం. తర్వాత తనతో అభిమన్యు తెరకెక్కించిన డైరెక్టర్ మల్లికార్జున్కు అవకాశం ఇస్తూ కత్తి సినిమాను నిర్మించాడు. ఇక తాజాగా నిర్మించిన 'బింబిసార' సినిమా డైరెక్టర్ వశిష్ఠ ప్రముఖ నిర్మాత మల్లిడి సత్యనారాయణ కుమారుడు. వశిష్ఠ అసలు పేరు వెంకట్ కాగా పలువురు ముద్దుగా వేణు అని కూడా పిలిచేవారు. 2007లో 'ప్రేమలేఖ రాశా' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. గీత రచయిత కులశేఖర్ డైరెక్టర్గా మారిన ఈ చిత్రంలో అంజలి హీరోయిన్గా చేసింది. అయితే పలు కారణాల వల్ల విడుదల కానీ ఈ మూవీ ప్రస్తుతం యూట్యూబ్లో అందుబాటులో ఉంది. హీరోగా తొలి అపజయాన్ని మూటగట్టుకున్న వెంకట్ నటనకు స్వస్తి పలికి దర్శకత్వం మీద దృష్టి పెట్టాడు. ఫైనల్గా సోషియో ఫాంటసీ కథతో 'బింబిసార' సినిమాను తెరకెక్కించి విజయం సాధించాడు. ఇలా ముందు నుంచి చూసుకుంటే కల్యాణ్ రామ్ ఏ రోజు కూడా సక్సెస్ఫుల్ డైరెక్టర్ల వెంట పడలేదు. కథను, కొత్త దర్శకులు, ప్లాప్ డైరెక్టర్లు అనే భేదం లేకుండా ప్రతిభను నమ్మి.. నిర్మాతగా అవకాశాలిస్తూ నిజమైన హీరో అనిపించుకున్నాడు కల్యాణ్ రామ్. ఒక కొత్త దర్శకున్ని నమ్మి, నిర్మాతగా రూ. 45 కోట్ల బడ్జెట్ పెట్టడంతోపాటు హీరోగా 'బింబిసార' కోసం కష్టపడిన కల్యాణ్ రామ్ ఫ్యాషన్కు హ్యాట్సాఫ్ చెప్పడంలో, ఈవిల్ టు గుడ్ అని ఓ టైమ్ ట్రావెల్ మూవీని నిర్మించడానికి చేసిన కృషిని ప్రశంసించడంలో ఎలాంటి తప్పులేదు. కానీ ఇదే అదనుగా కొంతమంది కల్యాణ్ రామ్ నిజమైన మెగాస్టార్ అని, చిరును కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టడం సరైంది కాదు. ఎందుకంటే చిరంజీవి నటన, అభినయం, డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పునాది రాళ్లు, ప్రాణం ఖరీదు సినిమాలతో తెలుగు తెరకు పరిచయమైన చిరంజీవి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సొంతగా ఎదిగారు. డ్యాన్స్, ఫైటింగ్స్తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రయోగాత్మక చిత్రాలు, డ్యాన్స్ మూమెంట్స్ చేస్తూ అంచెలంచలుగా ఎదిగి సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత అంతటి స్టార్డమ్ సాధించారు. నేటితరం యువ హీరోలకు, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ అయిన మాస్ మహారాజా రవితేజ, నేచురల్ స్టార్ నాని వంటి స్టార్స్కు చిరునే ఆదర్శం. ఇప్పటికీ ఆయన నటనలో, డ్యాన్స్లో ఎలాంటి మార్పు కనపడదు. ఆయన సినిమాలు పెద్దగా ఆడకపోవచ్చేమో కానీ, నటనలో మాత్రం చిరు ఎప్పుడు ఫ్లాప్ కాలేదు. పైగా ఏ సినిమా హిట్ అయినా, తన చిత్రం విజయం సాధించినట్లుగా మనస్ఫూర్తిగా అభినందిస్తుంటారు. కొత్త టాలెంట్ను, సరికొత్త కథా చిత్రాలను ఎంకరేజ్ చేస్తారు. ఇందుకు, ఇటీవల విడుదలైన విక్రమ్, మేజర్ చిత్రాలను ప్రశంసించడం, నాగ చైతన్య కీ రోల్ ప్లే చేసిన హిందీ చిత్రం 'లాల్ సింగ్ చద్దా'ను తెలుగులో సమర్పించడం, అలాగే బెస్ట్ యాక్టర్గా అవార్డు దక్కించుకున్న సూర్యను మెచ్చుకోవడం, మంచి నటుడిగా మారిన తన అభిమాని సత్యదేవ్ను పొగిడటమే కాకుండా అవకాశాలు అందించడం, అంతేందుకు ఆగస్టు 5న విడుదలైన బింబిసార, సీతారామం సినిమాల తర్వాతి రోజే అంటే ఆగస్టు 6న ఆ చిత్రాలను ప్రశంసలతో ముంచెత్తడం వంటివి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. బింబిసార, సీతారామం చిత్రాలను 'ప్రేక్షకులు థియేటర్లకు రావట్లేదని బాధపడుతున్న ఇండస్ట్రీకి ఎంతో ఊరటను, మరింత ఉత్సాహాన్నిచ్చాయి' అని కొనియాడుతూ తెలుగు సినిమా కోసం, అభివృద్ధి కోసం, ఇండస్ట్రీకి పెద్ద కొడుకుగా అహర్నిశలు కృషి చేస్తున్న చిరును.. తెలుగు సినీ ఇండస్ట్రీకి నిజమైన మెగాస్టార్ అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. Hearty Congratulations Team #SitaRamam & Team #Bimbisara 💐👏👏👏@VyjayanthiFilms @NTRArtsOfficial pic.twitter.com/cNcnuUgAYr — Chiranjeevi Konidela (@KChiruTweets) August 6, 2022 ఇక మెగాస్టార్ ట్యాగ్ను కల్యాణ్ రామ్కు జోడించి సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేయడం, చిరుపై కామెంట్స్ చేయడం వంటివి పలువురి అత్యుత్సాహమని తెలుస్తోంది. ఎందుకంటే, సినిమా హిట్టయిన, ఫట్టయిన విభిన్న కథలతో ముందుకొస్తూ హీరోగా, నిర్మాతగా కల్యాణ్ రామ్ కష్టపడుతున్నారనేది వాస్తవమే. అలాంటప్పుడు.. ఒక ఉదాహరణగా తీసుకుంటే, కర్మ, క్షణం, గూఢచారి, మేజర్ వంటి ప్రయోగాత్మక చిత్రాలకు కథ అందిస్తూ, ఒక డిఫరెంట్ జోనర్ సినిమాల హీరోగా పేరు తెచ్చుకున్న అడివి శేష్కు కూడా మెగాస్టార్ ట్యాగ్ ఇవ్వొచ్చా? అనే ప్రశ్న ఎదురవుతుంది. సో.. ఎవరి స్టార్డమ్ వారిదే. ఎవరి కృషికైన గుర్తింపు ఉంటుంది. మెగాస్టార్, సూపర్ స్టార్ వంటి తదితర ట్యాగ్లు హీరోలపై అభిమానాన్ని వ్యక్తపరిచే విధంగా ఉండాలే తప్ప ఇంకొకరిని కించపరిచేలా ఉండకూడదు. Big congratulations to #Bimbisara team . Very interesting & an engaging fantasy film . Impactful presence by @NANDAMURIKALYAN garu . My respect for him for always bringing in new talent into the industry & attempting new kind of films. — Allu Arjun (@alluarjun) August 7, 2022 నందమూరి కుటుంబం నుంచి జూనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ కలిసి నటించి, తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన 'ఆర్ఆర్ఆర్' సినిమా తర్వాత కూడా ఇలాంటి పోస్టులు పెట్టడం దురదృష్టకరం. ఈ 'ఆర్ఆర్ఆర్' చిత్రమే కాకుండా 1999లో రిలీజైన 'సుల్తాన్' మూవీలో బాలకృష్ణ, కృష్ణ, కృష్ణంరాజు కలిసి నటించి తామంతా ఒక్కటే అని నిరూపించారు. హీరోల్లో సక్యత బాగానే ఉన్నా.. కొంతమంది మాత్రం ట్రోలింగ్లతో సమయాన్ని వృథా చేసుకోవడం బాధాకరమైన విషయమేగా మాస్టారు!. కాగా ఓటీటీలని, థియేటర్లకు ఎవరు రావట్లేదనే తదితర అంశాలతో సతమతమవుతున్న టాలీవుడ్ ఇండస్ట్రీకి బింబిసార, సీతారామం వంటి చిత్రాలు కొత్త ఉత్సాహాన్ని అందించాయి. ఇలాంటి తరుణంలో ట్యాగ్లను పక్కనపెట్టి సినీ పరిశ్రమ అంతా ఒకే కుటుంబమని భావిస్తే తెలుగు సినిమా ఖ్యాతి ఖండంతరాలు దాటే అవకాశముంది. -సంజు (సాక్షి వెబ్డెస్క్) -
బింబిసార బ్లాక్బస్టర్.. ధన్యవాదాలు చెప్పిన కల్యాణ్ రామ్
కల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం ‘బింబిసార’. శుక్రవారం(ఆగస్ట్ 5న) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. తొలి రోజే ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.6.30 కోట్లు వసూలు చేయగా.. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం రూ.7.27 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టింది. ఇక మూవీ మంచి విజయం సాధించిడంతో మూవీ టీం ఆనందం వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంగా కల్యాణ్ ట్విట్ చేస్తూ బింబిసార బ్లాక్బస్టర్గా నిలిపినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు. చదవండి: అప్పుడే ఓటీటీకి బింబిసార, స్ట్రీమింగ్ అక్కడేనా? ఈ మేరకు ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేశాడు. ‘2019లో బింబిసార షూటింగ్ ప్రారంభించినప్పుడు ఎప్పుడెప్పుడు పూర్తి చూసి ప్రపంచానికి ఈ చిత్రాన్ని పరిచయం చేయాలా ఆసక్తిగా ఎదురు చూశాం. కానీ కరోనా, లాక్డౌన్ వల్ల మా ఉత్సాహన్ని కాస్తా ఆందోళనగా మార్చింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మూవీ లవర్స్ కోసం మా చిత్రాన్ని థియేటర్లోనే విడుదల చేయాలని అనుకున్నాం. ఇందుకోసం మా బింబిసార టీం ఎంతో హార్డ్ వర్క్ చేసింది. చదవండి: మళ్లీ ప్రేమించేందుకు సిద్ధమా?.. చై సమాధానం ఇదే! థియేటర్ రిలీజ్ కోసం ఎంతో ఆత్రుతుగా ఎదురు చూశాం. చివరికి రిలీజ్ అనంతరం మా సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూసి మా నీరిక్షణకు ఫలితం దక్కింది అనిపించింది’ అంటూ కల్యాణ్ రామ్ రాసుకొచ్చాడు. ఇక ఈ మూవీని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై కల్యాణ్ రామ్ నిర్మించిన ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వం వహించాడు. సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్తో భిన్నమైన కథగా వచ్చిన ఈ చిత్రంలో సంయుక్త మీనన్, కేథరిన్లు హీరోయిన్లుగా నటించారు. Thank You ❤️#Bimbisara pic.twitter.com/PFH1ei9hhs — Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) August 6, 2022 -
Bimbisara Box Office Collection: బాక్సాఫీస్పై ‘బింబిసారుడి’ దాడి.. తొలి రోజు ఎంతంటే..
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బింబిసార’. ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్ క్యాప్షన్.ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ వశిష్ట్ దర్శకత్వం వహించాడు. కేథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(ఆగస్ట్ 05) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. తొలి రోజే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. (చదవండి: 'బింబిసార' మూవీ రివ్యూ) దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం దూసుకెళ్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం తొలి రోజు ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.6.30 కోట్లు వసూలు చేయగా.. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం రూ.7.27 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టింది (చదవండి: బాక్సాఫీస్ కళ కళ.. సంతోషంలో స్టార్ హీరోలు..ట్వీట్స్ వైరల్) కల్యాణ్ రామ్ కెరీర్లో ఫస్ట్డే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా ‘బింబిసార’ నిలిచింది. కల్యాణ్ రామ్ గత ఐదు చిత్రాల ఫస్ట్ డే ఓపెనింగ్స్ గమనిస్తే.. ఎంత మంచివాడవురా రూ.2.20 కోట్లు, 118 రూ.1.60 కోట్లు, నా నువ్వే రూ.0.75 కోట్లు, ఎంఎల్ఏ రూ. 2.72 కోట్లు, ఇజం 3.09 కోట్ల షేర్స్ అందుకున్నాయి. రూ.40 కోట్ల బడ్జెట్తో బింబిసార చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి రూ.15.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.16 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. తొలిరోజే హిట్ టాక్ రావడంతో బ్రేక్ ఈవెన్ ఈజీగా దాటుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘బింబిసార’ తొలి రోజు కలెక్షన్స్.. ► నైజాం - రూ.2.15 కోట్లు ► సీడెడ్ - రూ.1.29 కోట్లు ► ఈస్ట్ - రూ.43 లక్షలు ► వెస్ట్ - రూ.36 లక్షలు ► ఉత్తరాంధ్ర - రూ.90 లక్షలు ► గుంటూరు- రూ.54 లక్షలు ► కృష్ణా - రూ. 34 లక్షలు ► నెల్లూరు - రూ.26 క్షలు ► కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా- రూ.0.32 లక్షలు ► ఓవర్సీస్ రూ.65లక్షలు ► ప్రపంచ వ్యాప్తంగా మెత్తం రూ. 7.27 కోట్ల షేర్ (రూ.11.50 కోట్ల గ్రాస్) -
బింబిసార, సీతారామం చిత్రాలు విజయం సాధించడంపై మెగాస్టార్ ట్వీట్
-
బాక్సాఫీస్ కళ కళ.. సంతోషంలో స్టార్ హీరోలు..ట్వీట్స్ వైరల్
చాలా రోజుల తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ కలకళలాడుతోంది. ఈ శుక్రవారం(ఆగస్ట్ 5) విడుదలైన సీతారామం, బింబిసార చిత్రాలు తొలి రోజే హిట్ టాక్ సంపాదించుకున్నాయి. దీంతో ఈ విజయాన్ని టాలీవుడ్ మొత్తం సెలబ్రేట్ చేసుకుంటుంది. ప్రేక్షకులను మళ్లీ థియేటర్స్ వచ్చేలా చేసిన సీతారామం, బింబిసార చిత్ర బృందానికి తెలుగు హీరోలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. Hearty Congratulations Team #SitaRamam & Team #Bimbisara 💐👏👏👏@VyjayanthiFilms @NTRArtsOfficial pic.twitter.com/cNcnuUgAYr — Chiranjeevi Konidela (@KChiruTweets) August 6, 2022 ఈ రెండు చిత్రాల మేకర్స్కి మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రేక్షకులు సినిమా థియేటర్లకి రావడం లేదని బాధపడుతున్న ఇండస్ట్రీకి ఎంతో ఊరటని, మరింత ఉత్సాహాన్నిస్తూ.. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులెప్పుడూ ఆదరిస్తారని మరోసారి నిరూపిస్తూ నిన్న విడుదలైన చిత్రాలు రెండూ విజయం సాధించడం ఎంతో సంతోషకరం. ఈ సందర్భంగా ‘సీతారామం’ మరియు ‘బింబిసార’ చిత్రాల నటీనటులకు, నిర్మాతలకు, సాంకేతిక నిపుణులందరికీ నా మనఃపూర్వక శుభాకాంక్షలు’అని చిరంజీవి ట్వీట్ చేశాడు. ఒకే రోజు విడుదలైన రెండు చిత్రాలు హిట్ టాక్ని సంపాదించుకోవడం సంతోషంగా ఉందని విజయదేవరకొండ ట్వీట్ చేశాడు. Extremely happy to hear that 2 films on the same day have turned into hits :)) What a good day! Congratulations to @VyjayanthiFilms @dulQuer @mrunal0801 @iamRashmika, @iSumanth anna, @hanurpudi and team on #SitaRamam. Hearing the most amazing beautiful things about the film ❤️ — Vijay Deverakonda (@TheDeverakonda) August 6, 2022 సీతారామం, బింబిసార చిత్రాల విజయంపై యంగ్ హీరో అడివి శేష్ కూడా స్పందించాడు. తనకు కొవిడ్ రావడంతో ఐసొలేషన్లో ఉన్నానని... తన కోసం ఉదయం ఒక సినిమా, తర్వాత మరో సినిమా చూడమని అడివి శేష్ ట్వీట్ చేశాడు. Wake up this morning to absolute blockbuster talk for dear @NANDAMURIKALYAN s #Bimbisara AND my dear friends @iSumanth @dulQuer @mrunal0801 s #SitaRamam Idhi kadha kavalsindhi!#Covid occhi isolation lo unna. Naa kosam morning show oka cinema matinee oka cinema kummeyandi ❤️🇮🇳 — Adivi Sesh (@AdiviSesh) August 5, 2022 -
Bimbisara Movie OTT Release Details: అప్పుడే ఓటీటీకి బింబిసార, స్ట్రీమింగ్ అక్కడేనా?
దాదాపు రెండేళ్ల గ్యాప్ అనంతరం నందమూరి హీరో కల్యాణ్ రామ్ నటించిన చిత్రం బింబిసార. ఈసారి రొటీన్ సినిమాలకు భిన్నంగా సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న కథ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య నిన్న(ఆగస్ట్ 5న) గ్రాండ్గా రిలీజైంది. విడుదలైన తొలి షో నుంచే ఈ మూవీ హిట్టాక్ తెచ్చుకుంది. ట్రైం ట్రావెలర్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో కల్యాణ్ రామ్ బింబిసార అనే రాజుగా కనిపించాడు. చదవండి: సమంతపై ఇప్పటికి గౌరవం ఉంది.. కానీ!: నాగ చైతన్య ఇందులో కల్యాణ్ తన నటనలో విశ్వరూపం చూపించాడంటున్నారు నందమూరి ఫ్యాన్స్. ప్రస్తుతం థియేటర్లో సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్న ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ నెట్టింట చర్చ నడుస్తోంది. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సోషియో ఫాంటసి మూవీ కోసం పలు ఓటీటీ సంస్థలు గట్టిగానే పొట్టి పడ్డాయట. చివరకు ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫాం జీ5 ‘బింబిసార’ను భారీ ఒప్పందానికి సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ అనంతరం 8 వారాల తర్వాతే ఓటీటీకి వస్తుందని అంటున్నారు. అంటే ఈ మూవీ అక్టోబర్లోనే ఓటీటీలో అందుబాటులోకి రానుందట. చదవండి: ‘లేడీ సూపర్స్టార్’ ప్రశంసించిందంటూ మురిసిపోతున్న జాన్వీ మరోవైపు ఆగస్ట్ చివరిలో వారంలోనే రావచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా డిజిటల్ స్ట్రీన్పై బింబిసార చూడాలంటే నెలన్నరకు పైగా వేచి చూడక తప్పందంటున్నాయి సినీవర్గాలు. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. కాగా కొత్త డైరెక్టర్ వశిష్ఠ రూపొందించిన ఈ చిత్రంలో సంయుక్తా మీనన్, కేథరిన్ హీరోయిన్లుగా నటించారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై కల్యాణ్ రామ్ నిర్మించిన ఈచిత్రానికి ఎమ్ఎమ కీరవాణి సంగీతం అందించారు. -
అడివి శేష్కు కరోనా.. తనకోసం ఆ పని చేయాలంటూ పోస్ట్
కల్యాణ్ రామ్ బింబిసార, దుల్కర్ సల్మాన్ నటించిన సీతారామం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. నేడు(శుక్రవారం)విడుదలైన ఈ రెండు సినిమాలు హిట్ టాక్ను సొంతం చేసుకోవడం పట్ల హీరో అడివి శేష్ ట్విట్టర్ ద్వారా స్పందించాడు. 'ఈ రెండు సినిమాలకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తుండటం సంతోషంగా ఉంది. ఇది కదా కావల్సింది. ప్రస్తుతం తనకు కరోనా రావడంతో ఐసోలేషన్లో ఉన్నా. అందుకే థియేటర్స్కి వెళ్లలేకపోతున్నా. నా కోసం ఓ మార్నింగ్ షో, మ్యాట్నీలో మరో సినిమా కుమ్మేయండి' అంటూ అడివి శేష్ ట్వీట్ చేశారు. అయితే ఆయనకు కరోనా అని తెలియడంతో పలువురు అభిమానులు గెట్ వెల్ సూన్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. Wake up this morning to absolute blockbuster talk for dear @NANDAMURIKALYAN s #Bimbisara AND my dear friends @iSumanth @dulQuer @mrunal0801 s #SitaRamam Idhi kadha kavalsindhi!#Covid occhi isolation lo unna. Naa kosam morning show oka cinema matinee oka cinema kummeyandi ❤️🇮🇳 — Adivi Sesh (@AdiviSesh) August 5, 2022 -
బింబిసార మూవీపై జూ. ఎన్టీఆర్ రివ్యూ.. ఏమన్నాడంటే
నందమూరి హీరో కల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం బింబిసార నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. రెండేళ్ల గ్యాప్ అనంతరం కళ్యాణ్ రామ్ నటించిన ఈ చిత్రంపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. విడుదలైన ఫస్ట్ షో నుంచే ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంటోంది. కల్యాణ్ రామ్ నటనకు ప్రేక్షకులంతా ఫిదా అవుతున్నారు. థియేటర్లు నందమూరి ఫ్యాన్స్ ఈళలతో దద్దరిల్లిపోతోంది. మరోవైపు బింబిసార మూవీపై సినీ సెలబ్రెటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: తండ్రి మరణాన్ని గుర్తు చేసుకుని ఎమోషనలైన కల్యాణ్ రామ్ తాజాగా ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకోవడంపై జూనియర్ ఎన్టీఆర్ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ మేరకు ఎన్టీఆర్ ట్వీట్ చేస్తూ.. ‘బింబిసార' గురించి గొప్ప విషయాలు వింటున్నా. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు అత్యుత్సహం చూపిస్తుంటే చాలా మంచి అనుభూతి కలుగుతుంది. ఎలా తొలిసారి సినిమా చూసినప్పుడు వచ్చే ఫీలింగ్లా ఉంది’ అంటూ ట్వీట్ చేశాడు. అలాగే మరో ట్వీట్లో ‘కల్యాణ్ అన్నయ్యా... బింబిసార రాజు పాత్రలో నిన్ను మరెవరూ రీప్లేస్ చేయలేరు. చదవండి: త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న హన్సిక? డైరెక్టర్ వశిష్ట సినిమాను అద్భుతంగా హ్యాండిల్ చేశారు. ఈ సినిమాకు లెజెండరీ ఎంఎం కీరవాణి బ్యాక్ బోన్’ అంటూ తారక్ బింబిసార టీంకు శుభాకాంక్షలు తెలిపాడు. కాగా రోటీన్ సినిమాలకు భిన్నంగా సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న కథ ద్వారా ప్రేక్షకుల ముందుకు 'బింబిసార'గా వచ్చాడు కల్యాణ్ రామ్. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై వశిష్ఠ్ దర్శకత్వంలో కె. హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇందులో కెథరీన్ థ్రేసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించగా.. ప్రకాశ్ రాజ్, వివాన్ భటేనా, అయ్యప్ప పి శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. .@NANDAMURIKALYAN anna you are irreplaceable as King Bimbisara. @DirVassishta handled the film like a pro. The legendary @mmkeeravaani garu is the backbone of #Bimbisara. Shoutout to all the actors and technicians who made this a success. — Jr NTR (@tarak9999) August 5, 2022 -
'బింబిసార' మూవీ రివ్యూ
టైటిల్: బింబిసార నటీనటులు: కల్యాణ్ రామ్, కేథరీన్ థ్రేసా, సంయుక్త మీనన్, ప్రకాశ్ రాజ్, వివాన్ భటేనా, అయ్యప్ప పి శర్మ తదితరులు నిర్మాత : హరికృష్ణ. కె కథ, దర్శకత్వం, స్క్రీన్ప్లే: వశిష్ఠ సినిమాటోగ్రఫీ: చోటా కె నాయుడు విజువల్ ఎఫెక్ట్స్: అనిల్ పాడురి విడుదల తేది: ఆగస్టు 5, 2022 'అతనొక్కడే' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కల్యాణ్ రామ్ 'పటాస్', '118' వంటి చిత్రాలతో సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు. అయితే గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలోనే రొటీన్ సినిమాలకు భిన్నంగా సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న కథ ద్వారా ప్రేక్షకుల ముందుకు 'బింబిసార'గా వచ్చాడు కల్యాణ్ రామ్. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై వశిష్ఠ్ దర్శకత్వంలో కె. హరికృష్ణ నిర్మించిన చిత్రం 'బింబిసార'. టైమ్ ట్రావెల్ మూవీగా వచ్చిన ఈ మూవీ శుక్రవారం (ఆగస్టు 5) విడుదలైంది. మరి ఈ సినిమాతో కల్యాణ్ రామ్ ఆకట్టుకున్నాడా? లేదా? తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చదవాల్సిందే. కథ: త్రిగర్తల సామ్రాజ్యాన్ని ఏకచక్రాధిపతిగా పాలిస్తుంటాడు బింబిసారుడు (కల్యాణ్ రామ్). అహం, తనను ఎవరు ఎదిరించలేరనే పొగరుతో, పాలించే ప్రజలను, చిన్న పిల్లలను సైతం చూడకుండా అతి కిరాతకంగా చంపే కర్కోటకుడిగా రాజ్యాన్ని ఏలుతుంటాడు. ఈ క్రమంలోనే ఒక మాయ దర్పణం ద్వారా భూలోకానికి వస్తాడు. భూలోకంలో అతనికి వారసులు ఉన్నారని, అతని గురించి గొప్పగా చెప్పుకుంటున్నారని తెలిసిన బింబిసారుడు ఏం చేశాడు? అతి క్రూరుడైన రాజు రాజు బింబిసారుడు.. తన ప్రజల కోసం ప్రాణాలిచ్చే నిజమైన చక్రవర్తిగా, ఒక మానవత్వం గల మనిషిగా ఎలా మారాడు? టైమ్ ట్రావెల్ చేసేందుకు వీలుగా ఉన్న మాయ దర్పణం ఎలా వచ్చింది? బింబిసారుడు దాచిని నిధి తలపులు తెరవడానికి ప్రయత్నిస్తున్న సుబ్రహ్మణ్య శాస్త్రి (వివాన్ భటేనా) ఎవరు? అనే తదితర ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే 'బింబిసార' సినిమాను కచ్చితంగా చూడాల్సిందే. విశ్లేషణ: క్రీస్తుపూర్వం 5వ శతాబ్దంలో మగధ సామ్రాజ్యాన్ని పాలించిన రాజు బింబిసారుడు. నిజానికి ఇతను హర్యాంక రాజవంశానికి చెందినవాడు. అయితే ఈ బింబిసారుడు అనే పాత్రను తీసుకుని పూర్తి కల్పిత కథతో 'బింబిసార'ను తెరకెక్కించారు డైరెక్టర్ వశిష్ఠ. 'ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్' అనే ఒక్క క్యాప్షన్తో సినిమా కథను చెప్పేశారు. చరిత్రలో బింబిసారుడు ఎలా ఉన్న ఈ సినిమాలో మాత్రం అత్యంత క్రూరుడిగా, మద గజ మహారాజుగా చిత్రీకరించారు. రాజ్యాన్ని తాను ఒక్కడే పాలించాలనే కోరికతో సొంత తమ్మున్ని సైతం చంపించే అన్నగా బింబిసారుడి పాత్రను ఆవిష్కరించారు. అంతేకాకుండా తనకు ఎదురు వస్తే, తన మాటను ధిక్కరిస్తే చిన్న పిల్లలను కూడా అంతమొందించే రాక్షస రాజుగా బింబిసార పాత్రలో కల్యాణ్ రామ్ను చూపించారు. అహంతో మదమెక్కి అరాచకాలు, ఆకృత్యాలు చేసే చక్రవర్తిగా బింబిసారుడిని చూపించడంలో డైరెక్టర్ పూర్తిగా సక్సెస్ అయ్యారు. తర్వాత ఒక నిజమైన రాజుగా, మంచి మనిషిగా బింబిసారుడు మారే క్రమాన్ని కూడా అంతే బాగా తెరకెక్కించారని చెప్పవచ్చు. త్రిగర్తల సామ్రాజ్యం, అక్కడి భాషా, వేషం అన్ని చక్కగా చూపించారు. విజువల్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఒకటి, రెండు సీన్లలో త్రిగర్తల సామ్రాజ్యపు కోట ఆర్టిఫిషియల్గా కనిపించిన మిగతా సీన్లలో మాత్రం కళ్లకు విజువల్ ఫీస్ట్. ఫ్యామిలీ డ్రామాతో వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కొంచె రొటీన్గా అనిపించిన ఆకట్టుకునేలా ఉన్నాయి. అక్కడక్కడ వచ్చిన కామెడీ కూడా బాగానే పండింది. కొన్ని సీన్లు, విజువల్స్ ఇతర సినిమాల్లో చూసిన ఫీలింగ్ కలుగుతుంది. సెకండాఫ్లో వచ్చే ఫైటింగ్ సీన్స్ చాలా స్టైలిష్గా అదిరిపోయాయి. బింబిసారుడిని ఎలివేట్ చేసే డైలాగ్లు ఆకట్టుకుంటాయి. ఎవరెలా చేశారంటే? ఈ సినిమాలో నందమూరి కల్యాణ్ రామ్ నటన గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఈ చిత్రంలోని కల్యాణ్ రామ్ యాక్టింగ్ అతని కెరీర్లోనే ది బెస్ట్. క్రూరమైన రాక్షస చక్రవర్తి బింబిసారుడిగా పూర్తి నెగెటివ్ పాత్రలో కల్యాణ్ రామ్ అదరగొట్టాడు. అహంతో విర్రవీగే రాజుగా, ఎదురు తిరిగిన, సలహా ఇచ్చిన ప్రతి ఒక్కరినీ నిర్దాక్షణ్యంగా చంపే కర్కోటకపు రాజుగా కల్యాణ్ రామ్ చూపించిన అభినయం అబ్బురపరుస్తుంది. అలాగే సెకండాఫ్లో వచ్చే ఫైటింగ్ సీన్లలో స్టైలిష్గా, ఒక రాజులోని హుందాతనాన్ని నటనతో చాలా చక్కగా చూపించాడు. తర్వాత మనిషిగా మారిన చక్రవర్తిగా, ఎమోషనల్ సీన్లలో సైతం ఆకట్టుకున్నాడు. బింబిసారుడి తమ్ముడు దేవ దత్త పాత్రలో కూడా చక్కగా ఒదిగిపోయాడు. సినిమా మొత్తం తాను ఒక్కడై నడిపించినట్లుగా ఉంటుంది. యువరాణి ఐరాగా కేథరీన్ థ్రేసా, ఎస్సై వైజయంతిగా సంయుక్త మీనన్ నటన పాత్రకు తగినట్లుగా పర్వాలేదు. కానీ వారి రోల్స్కు అంతా ప్రాముఖ్యత లేదు. శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిశోర్, చమ్మక్ చంద్ర కామెడీతో అలరించారు. వివాన్ భటేనా, ప్రకాశ్ రాజు, రాజీవ్ కనకాల, అయ్యప్ప పి శర్మ తదితరులు పాత్రల పరిధిమేర ఆకట్టుకున్నారు. ఎంఎం కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్గా నిలిచింది. అలాగే కథకు అనుగుణంగా వచ్చిన ఒక్కో పాట కూడా అలరిస్తుంది. ఈ ఒక్కో సాంగ్ను చిరంతన్ భట్, వరి కుప్పల యాదగిరి, ఎంఎం కీరవాణి కంపోజ్ చేశారు. ఇక విజువల్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు అత్యద్భుతంగా ఉన్నాయి. ఓవరాల్గా చెప్పాలంటే ఒక రాక్షస రాజుగా నటనతో మెస్మరైజ్ చేసిన కల్యాణ్ రామ్ 'బింబిసార' సినిమా కచ్చితంగా చూడాల్సిందే. -సంజు (సాక్షి వెబ్డెస్క్) -
బింబిసార సినిమా పబ్లిక్ టాక్
-
Bimbisara Movie: ‘బింబిసార’ ట్విటర్ రివ్యూ
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బింబిసార’. ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్ క్యాప్షన్. కళ్యాణ్ రామ్ ఆయన కేరీర్ లోనే బిగ్ బడ్జెట్ మూవీ ఇది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ వశిష్ట్ దర్శకత్వం వహించాడు. కేథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు. (చదవండి: ‘సీతారామం’ ట్విటర్ రివ్యూ) ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి స్పందన లభించడంతో పాటు సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య నేడు(ఆగస్ట్ 5) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల బొమ్మ పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘బింబిసార’ కథేంటి? త్రిగర్తల సామ్రజ్యాధినేత బింబిసారుడిగా కల్యాణ్ రామ్ ఏ మేరకు ఆకట్టుకున్నాడు తదితర అంశాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నార.అవేంటో చూడండి.అయితే, ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. అందులో వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. #BimbisaraOnAug5th #BIMBISARA #BimbisaraReview 1-Excellent movie 👍 2-this movie will bring back telugu audience to teatres 3-1st half is bit slow, but 2nd half is rampage 🔥 4-Kalyan ram as bimbisara is super 5- overall rating is 🌟 🌟 🌟 1/2 ( 3.5/5) — VINOD KUMAR E 2691 Batch,PES University (@VinodPes) August 5, 2022 తెలుగు ప్రేక్షకులను తిరిగి థియేటర్స్కి రప్పించే చిత్రమిదని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఫస్టాఫ్ కొంచెం స్లోగా ఉందని, సెకండాఫ్ అదిరిపోయిందని చెబుతున్నారు. బింబిసారగా కల్యాణ్ రామ్ యాక్టింగ్ చాలా బాగుందని చెబుతున్నారు. వన్ మ్యాన్ షోగా సినిమాను తన భుజానా వేసుకొని నడిపించాడట. ఎంఎం కీరవాణి మ్యూజిక్, విజువల్స్ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాయని చెబుతున్నారు. Showtime: Kalyan Ram in #Bimbisara. A Vasishta directorial and MM keeravani musical. — Day Dreamer!!! (@bunnywrites) August 5, 2022 Bimbisara first half..👌🔥🔥This is going to be Kalyan ram's career biggest movie..Time travel content..🪐New World..🙏What a story..#Bimbisara @tarak9999 @NANDAMURIKALYAN #BimbisaraReview — SAIKUMAR MANNURU (@im_saichowdary) August 4, 2022 #Bimbisara Movie theater response#BimbisaraOnAug5th Movie good reviews every where 👍👍👍👍 video link 👇👇👇 3/5 👍https://t.co/AaHUH2YDQm — Masthan-Tweets (@sm4582579) August 5, 2022 Good First Half 👌 Interval 🔥🔥@NANDAMURIKALYAN 👌👌 Bgm Excellent 🤙🤙#Bimbisara . https://t.co/TWJFMJKn7J pic.twitter.com/pt3uc0Vhdm — #DADA 🙏 #NTR 💗 (@Dada_NTR) August 5, 2022 మరోవైపు బింబిసార టీమ్కు సినీ ప్రముఖులు మద్దతు తెలుపుతున్నారు. చిత్ర యూనిట్కు ఆల్ ది బెస్ట్ చెబుతూ తమన్, సాయి తేజ్, సత్యదేవ్ తదితరులు ట్వీట్స్ చేశారు. Wishing this whole team of #Bimbisara @NANDAMURIKALYAN anna #Hari gaaru @NTRArtsOfficial #Vasista and Team of #SitaRamam brother @hanurpudi @dulQuer @mrunal0801 @VyjayanthiFilms Dear @SwapnaDuttCh All the Very Best at the #BoxOffice TOMORROW 🏆🥁🥁🥁🥁🥁🥁 pic.twitter.com/xrD6IQTkMz — thaman S (@MusicThaman) August 4, 2022 \ #Bimbisara Looks Promising to bits. All the best @NANDAMURIKALYAN anna.@DirVassishta I know how much you have waited for this day. Wish your hardwork paysoff ra All the best to the entire team@CatherineTresa1 @iamsamyuktha_ @mmkeeravaani garu @ChirantannBhatt @NTRArtsOfficial pic.twitter.com/UIepiaLrX5 — Sai Dharam Tej (@IamSaiDharamTej) August 4, 2022 Promising right from it's Teaser and a Grandeur of this scale from @DirVassishta is so impressive. Your hardwork and transformation for this @NANDAMURIKALYAN anna 🤗👏 All the best Team #Bimbisara@CatherineTresa1 @iamsamyuktha_ @mmkeeravaani @NTRArtsOfficial pic.twitter.com/YOfhhUJUqt — Satya Dev (@ActorSatyaDev) August 4, 2022 Wishing @NANDAMURIKALYAN garu and the entire team of #Bimbisara the best for tomorrow. May cinema win and the industry rise! @DirVassishta @CatherineTresa1 @iamsamyuktha_ @mmkeeravaani @NTRArtsOfficial — Hanu Raghavapudi (@hanurpudi) August 4, 2022 -
తండ్రి హరికృష్ణ చనిపోయిన రోజు ఏం జరిగిందో చెప్పిన కల్యాణ్ రామ్
-
తండ్రి మరణాన్ని గుర్తు చేసుకుని ఎమోషనలైన కల్యాణ్ రామ్
సరైన హిట్టు కోసం ఎంతోకాలంగా వేచి చూస్తున్నాడు కల్యాణ్ రామ్. దీంతో ఆయన ఈసారి రొటీన్ సినిమాలకు భిన్నంగా సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న కథ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కల్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన చిత్రం బింబిసార. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై వశిష్ఠ్ దర్శకత్వంలో కె. హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 5న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా బింబిసార టీం యాంకర్ సుమతో. కల్యాణ్ రామ్, సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి, హీరోయిన్ సంయుక్త మీనన్ ఇతర టీం కలిసి సుమతో లంచ్ చేస్తూ చిత్ర విశేషాలను పంచుకున్నారు. చదవండి: ప్రస్తుత టాలీవుడ్ కష్టాలకు కారణం డైరెక్టర్ రాజమౌళి: వర్మ కాగా ఈ మూవీ టైం ట్రావెలర్ నేపథ్యంలో రూపొందడంతో సుమ ఈ ప్రశ్నతోనే ఇంటర్య్వూను మొదలు పెట్టింది. ఈ సందర్భంగా కీరవాణిని మీరు టైం ట్రావెల్ అవ్వాలనుకుంటే ఏం చేంజ్ చేయాలనుకుంటారని అడగ్గా.. కీరవాణి తాను 2018 ఆగస్ట్ 28కి వెళ్తానన్నారు. ‘అప్పుడు నేను హరికృష్ణ గారికి కాల్ చేసి మనం కంపోజింగ్ పెట్టుకుందాం, ఓ రెండు రోజులు నాతో ఉండిపోండి అని చెప్పేవాడి. అలా చెప్పడం వల్ల ఆయన ఆగస్ట్ 29న జర్నీ చేయరు కదా. ఎందుకంటే హరికృష్ణ గారికి నా కంపోజింగ్ అంటే చాలా ఇష్టం. నేను అలా కాల్ చేసుంటే కచ్చితంగా ఆయన నాతోనే ఉండేవారు’ అంటూ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత సుమ కల్యాణ్ రామ్ని మీ తండ్రి చనిపోయిన రోజు ఎక్కడ ఉన్నారని అడగ్గా.. తాను ఇంట్లోనే ఉన్నానన్నాడు. చదవండి: సంజయ్ లీలా భన్సాలీ, కరణ్ జోహార్తో చై చర్చలు.. అందుకేనా? ‘ఉదయం 5:30 ఆ సమయంలో నేను ఇంట్లో బాల్కానిలో కూర్చోని టీ తాగుతున్నా. అప్పుడే నాకు శివాజీ అనే వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. అప్పుడు ఆయన నాన్నతో(హరికృష్ణ) కలిసి ట్రావెల్ చేస్తున్నారు. ఫోన్ చేసి ఏడుస్తున్నారు. నాకు అర్థం కాలేదు. ఏమైందా అని శివాజీ గారు శివాజీ గారు అని అన్నాను. కానీ అప్పటికే కాల్ కట్ అయ్యింది’ అని చెప్పాడు. ఆ తర్వాత తన మావయ్యకు చెందిన ఫ్యాక్టరీలో పనిచేసే ఓ ఉద్యోగి అదే సమయంలో విజయవాడకు వెళ్తూ నాకు కాల్ చేసి.. కొన్ని ఫొటోలు పంపించారని గుర్తు చేసుకుని కల్యాణ్ రామ్ ఏమోషనల్ అయ్యాడు. కాగా 2018 ఆగస్ట్ 29న హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల ఆయన సోదరి, కల్యాణ్ రామ్ మేనత్త ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. -
తమ్ముడితో పాన్ ఇండియా సినిమా పక్కా.. కథ కుదిరితే బాబాయ్తోనూ..
‘‘ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదు’ అనే మాటలను నేను నమ్మను. ఇతర భాషలతో పోలిస్తే మన తెలుగు ప్రేక్షకులు చాలా గొప్పవాళ్లు.. సినిమాలను ప్రేమిస్తారు. కథ బాగుంటే తెలుగు చిత్రాలనే కాదు.. పరభాషా సినిమాలను కూడా ఆదరిస్తారు’’ అని హీరో కల్యాణ్ రామ్ అన్నారు. వశిష్ఠ్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ హీరోగా, కేథరిన్, సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘బింబిసార’. నందమూరి తారక రామారావు ఆర్ట్స్పై హరికృష్ణ .కె నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలకానుంది. ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ పంచుకున్న విశేషాలు. ► వశిష్ఠ్ చెప్పిన ‘బింబిసార’ కథ వినగానే ఎగ్జయిటింగ్గా అనిపించింది. పైగా సరికొత్త పాయింట్ కావడంతో ఓకే చెప్పేశాను. కథ బాగుండటం, చక్కని టీమ్ కుదరడంతో తను అనుకున్నది అనుకున్నట్లు తీశాడు వశిష్ఠ్. ► మా తాతగారు (ఎన్టీఆర్), బాబాయ్ (బాలకృష్ణ)లు రాజులుగా చేసి, మెప్పించారు. ఈ చిత్రంలో బింబిసారుడు అనే రాజు పాత్ర అనగానే నేను సెట్ అవుతానా? అనిపించింది. రాజు అంటే ఇలాగే ఉంటాడు అనేలా ఈ తరం నటుల్లో ప్రభాస్ ‘బాహుబలి’ చిత్రంతో ఓ మార్క్ క్రియేట్ చేశారు. నా లుక్ విషయంలో ముందు కొన్ని అనుకున్నా ఫైనల్గా మూవీలోని లుక్ ఫిక్స్ చేశాం. ఈ లుక్ కోసం రెండు నెలలు కష్టపడ్డాను. ► ‘ఏ కథలో ఏ హీరో నటించాలో రాసిపెట్టి ఉంటుంది. ఏ కథ అయినా ఆ హీరోని వెతుక్కుంటుంది’ అని మా నాన్న (హరికృష్ణ) చెప్పేవారు. ‘అతనొక్కడే’ చిత్రకథ కూడా ఎందరో విన్నా ఫైనల్గా నేను చేశా. అలా ‘బింబిసారుడు’ కథ నా కోసం పుట్టింది. ప్రేక్షకుల అంచనాలను వందశాతం రీచ్ అవుతాం. ► కోవిడ్కి ముందు ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాం. అప్పుడు ఇతర భాషల్లో చేద్దామనుకోలేదు. ఇప్పటికిప్పుడు ఇతర భాషల్లో విడుదల చేయాలంటే మార్కెటింగ్, ప్రమోషన్స్ కోసం సమయం పడుతుంది. అంత టైమ్ మాకు లేదు.. అందుకే తెలుగులో రిలీజ్ చేస్తున్నాం.. ఇక్కడ హిట్ అయిన తర్వాత ఇతర భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నాం. ► తెలుగువాళ్లకి ఎంటర్టైన్మెంట్ అంటే సినిమానే. కుటుంబంతో కలిసి థియేటర్కి వెళ్లి సినిమా చూడటాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. ట్రైలర్ చూసి సినిమాకి వెళ్లాలా? వద్దా అని ప్రేక్షకులు నిర్ణయించుకుంటున్నారు. మనం మంచి కంటెంట్ ఉన్న సినిమా తీస్తే తప్పకుండా చూస్తారు. ఓ సినిమా బాగుందంటే వచ్చే మౌత్ పబ్లిసిటీకి చాలా పెద్ద స్పాన్ ఉంది. నా ‘అతనొక్కడే’ చిత్రం కూడా తొలి ఆట నుంచే మౌత్ పబ్లిసిటీతో సూపర్ హిట్ అయింది. ఈ మధ్య రిలీజ్ అయిన ‘మేజర్, విక్రమ్’ సినిమాల్లో మంచి కంటెంట్ ఉండటంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ► ఓ నిర్మాతగా నేను ఎలాంటి ఒత్తిడి తీసుకోను.. నా దృష్టంతా నటనపైనే ఉంటుంది. ప్రస్తుతం ‘బింబిసార’ ప్రమోషన్స్తో బిజీగా ఉండటంతో తెలుగులో షూటింగ్ల బంద్ విషయాన్ని నేను పట్టించుకోవడం లేదు. ఈ సినిమా విడుదల తర్వాత స్పందిస్తాను. రొమాంటిక్ సినిమాలు నాకు సెట్ అవ్వవు.. అందుకే చేయను (నవ్వుతూ). ‘బింబిసార 2’కి కథ రెడీగా ఉంది. నేను నిర్మాతగా తమ్ముడితో(ఎన్టీఆర్) ఓ పాన్ ఇండియా సినిమా ఉంటుంది. మంచి కథ కుదిరితే బాబాయ్ (బాలకృష్ణ)తోనూ ఓ సినిమా నిర్మిస్తాను. -
సాంగ్ చూపించేశాం మావా...
పాట వినిపించి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేసేవారు.. ఇది ఒకప్పటి ట్రెండ్. పాట చూపించి థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు.. ఇది ఇప్పటి ట్రెండ్. ప్రేక్షకులను థియేటర్కి రప్పించాలంటే గతంలో ఆడియో, సినిమా పోస్టర్స్ని పబ్లిసిటీలో భాగంగా విడుదల చేసేవాళ్లు. పాటలు బాగుంటే సినిమా కూడా బాగుంటుందని థియేటర్కి వెళ్లేవారు. ఇప్పుడు ‘సాంగ్ చూపించేశాం మావా..’ అంటూ పాట వీడియోను కూడా చూపించి ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. సినిమా మేకింగ్ మారినట్లుగానే పబ్లిసిటీలో కూడా కొత్త ట్రెండ్ మొదలైంది. ఈ మధ్య కాలంలో విడుదలైన కొన్ని సినిమాల వీడియో పాటలను ఓ లుక్కేద్దాం.. ఐయామ్ రెడీ.. ‘‘నేను రెడీ.. రా రా రెడ్డి..’ అంటూ నితిన్ని ఆటపట్టించారు అంజలి. వీరిద్దరి మధ్య వచ్చే ఈ మాస్ సాంగ్ ‘మాచర్ల నియోజక వర్గం’ లోనిది. నితిన్ హీరోగా ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతీ శెట్టి, క్యాథరిన్ హీరోయిన్లు. అంజలి స్పెషల్ సాంగ్ చేశారు. రాజ్కుమార్ ఆకెళ్ల సమర్పణలో ఎన్. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న రిలీజవుతోంది. మహతి స్వర సాగర్ స్వరపరచిన ఈ చిత్రంలోని ‘రా రా రెడ్డి..’, ‘అదిరిందే..’ అంటూ సాగే పాటల ఫుల్ వీడియోను చిత్రబృందం రిలీజ్ చేసింది. ‘మాచర్ల సెంటర్లో మాపటేల నొనొస్తే.. ఐయామ్ రెడీ.. రా రా రెడ్డి..’ అంటూ అంజలి, నితిన్లపై చిత్రీకరించిన సాంగ్, నితిన్, కృతీపై తీసిన ‘అదిరిందే పసిగుండె.. తగిలిందే హై ఓల్టే’ పాటల వీడియోలు మంచి వ్యూస్ దక్కించుకున్నాయి. పలికిందేదో ప్రాణం.. ‘మోడువారిన మనసుల్లోనే పలికిందేదో ప్రాణం.. ఆ కన్నుల్లోనే గంగై పొంగిన ఆనందం, కాలంతో పరిహాసం చేసిన స్నేహం’ అంటూ ఉల్లాసంగా పాడారు కల్యాణ్ రామ్. వశిష్ఠ్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బింబిసార’. కేథరిన్, సంయుక్తా మీనన్ హీరోయిన్లు. హరికృష్ణ .కె నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న రిలీజ్ కానుంది. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘నీతో ఉంటే చాలు..’ అనే ఫుల్ వీడియో సాంగ్ని రిలీజ్ చేశారు. ‘మోడువారిన మనసుల్లోనే పలికిందేదో ప్రాణం..’ అంటూ సాగే ఈ ఫ్యామిలీ సాంగ్కి మంచి స్పందన వస్తోంది. అడిగా.. నన్ను నేను అడిగా... ‘అడిగా.. నన్ను నేను అడిగా.. నా కెవ్వరూ నువ్వని..’ అంటూ అనుపమా పరమేశ్వరన్ని అడుగుతున్నారు నిఖిల్. ఈ ప్రేమ పాట నిఖిల్, అనుపమ జంటగా నటించిన ‘కార్తికేయ 2’లోనిది. కాలభైరవ స్వరపరచిన ఈ చిత్రంలోని ‘అడిగా.. నన్ను నేను అడిగా.. నా కెవ్వరూ నువ్వని, అడిగా.. నిన్ను నేను అడిగా.. నే నిన్నలా నేనని..’ అంటూ సాగే పాటను చిత్రయూనిట్ విడుదల చేసింది. నిఖిల్, అనుపమల మధ్య వచ్చే ఈ ఫీల్ గుడ్ సాంగ్కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇవే కాదు... మరికొన్ని చిత్రాల్లోంచి కూడా వీడియో సాంగ్స్ విడుదలయ్యాయి. ఇవన్నీ ప్రేక్షకులను థియేటర్స్కి రప్పించడానికి కొంతవరకైనా ఉపయోగపడతాయని చెప్పొచ్చు. -
నీతో ఉంటే చాలు.. హత్తుకునేలా 'బింబిసార' గీతం
Neetho Unte Chalu Song Out From Bimbisara: 'అతనొక్కడే' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కల్యాణ్ రామ్ 'పటాస్', '118' వంటి చిత్రాలతో సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు. అయితే గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలోనే రొటీన్ సినిమాలకు భిన్నంగా సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న కథ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై వశిష్ఠ్ దర్శకత్వంలో కె. హరికృష్ణ నిర్మించిన చిత్రం 'బింబిసార'. 'ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్' అనే క్యాప్షన్ ద్వారా ఈ మూవీ ఒక టైమ్ ట్రావెల్ చిత్రమని చెప్పకనే చెబుతున్నారు. ఈ మూవీ ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పటికే విడుదలై టీజర్, ట్రైలర్, పోస్టర్స్, సాంగ్స్కు మంచి స్పందన లభించింది. ఇటీవల గ్రాండ్గా ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. తాజాగా ఈ చిత్రం నుంచి మరో సాంగ్ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. 'నీతో ఉంటే చాలు' అంటూ సాగే ఈ గీతం మనసుకు హత్తుకునేలా ఉంది. స్వీయ సంగీత దర్శకత్వంలో ఎంఎం కీరవాణి రాసిన ఈ పాటను మోహన్ భోగరాజు, శాండిల్య ఆలపించారు. కాగా ఈ మూవీలో సంయుక్త మీనన్, కేథరీన్ థ్రేసా హీరోయిన్లుగా నటించారు. చదవండి: భార్య ప్రణతితో జూనియర్ ఎన్టీఆర్ కబుర్లు.. ఫొటో వైరల్ నాపై విష ప్రచారం, బాధగా ఉంది.. అమీర్ ఖాన్ ఆవేదన This melody #NeethoUnteChalu from #Bimbisara hits you different once you own it ❤️🔥 Tune into the Lyrical Video now 🔗 https://t.co/FxEIIAdgsp#BimbisaraOnAugust5th@NANDAMURIKALYAN @DirVassishta @CatherineTresa1 @iamsamyuktha_ @mmkeeravaani @saregamasouth pic.twitter.com/3X0fPdgZAX — NTR Arts (@NTRArtsOfficial) August 1, 2022 చదవండి: బికినీలో గ్లామర్ ఒలకబోస్తున్న హీరోయిన్ వేదిక.. సల్లూ భాయ్కి లైసెన్స్డ్ తుపాకీ.. ఎలాంటిది అంటే ? -
‘బింబిసార’కోసం త్రిగర్తల సామ్రాజ్యాన్ని క్రియేట్ చేశాం : దర్శకుడు
‘బింబిసారుడు అనే రాజు 500 సంవత్సరాలకు ముందు పరిపాలించిన రాజు. ఆయనకు సంబంధించిన వివరాలేవీ తెలియదు. ఆయన చరిత్రకి మా చిత్రానికి ఎలాంటి సంబంధం లేదు. ఇది పూర్తిగా కల్పిత కథ. సాధారణంగా ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో ఏదో కాలంలోకి వెళ్లినట్లు చూపించారు. కానీ ఇదే కాలానికి చెందిన ఓ రాజు మరో పీరియడ్లోకి వస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో నుంచే ‘బింబిసార’ కథ పుట్టింది’ అన్నారు యువ దర్శకుడు వశిష్ట్. ఆయన దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బింబిసార’. ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్ క్యాప్షన్. వశిష్ట్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై హరికృష్ణ .కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 5న ఈ మూవీ గ్రాండ్ లెవల్లో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు వశిష్ట సినిమా గురించి విశేషాలు.. ► 2018లో ‘బింబిసార’ జర్నీ ప్రారంభమైంది. కథంతా ఓ ఫార్మేట్లోకి వచ్చిన తర్వాత కల్యాణ్ రామ్ని కలిశాను. నేను చెప్పిన పాయింట్ ఆయనకు బాగా నచ్చేసింది. రెండు, మూడు రోజుల్లో కలుద్దామని అన్నారు. అప్పుడు నిర్మాత హరిగారికి కథ నెరేట్ చేశాను. ఆయనకు నచ్చింది. తర్వాత సినిమా ఎలా ముందుకెళ్లిందనేది అందరికీ తెలిసిందే. ► నాకిది తొలి సినిమా. నా సబ్జెక్ట్ని కళ్యాణ్రామ్, నిర్మాత హరి నమ్మారు. బింబిసార వంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. వారు నాకు ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవటానికి ఎంత కష్టపడాలో అంతా కష్టపడ్డాను. నాకు టీమ్ కూడా బాగా సపోర్ట్ చేసింది. కెమెరామెన్ ఛోటాగారు, ఆర్ట్ డైరెక్టర్ కిరణ్గారు, ఫైట్ మాస్టర్ ఇలా అందరి సపోర్ట్తో సినిమాను అనుకున్న సమయంలో పూర్తి చేయగలిగాం. ► నాకు ముందు నుంచి డైరెక్షన్ అంటేనే ఇష్టం. అయితే మధ్యలో ప్రేమ లేఖ రాశా అనే సినిమాలో హీరోగా నటించాను. అయితే ఆ సినిమా రిలీజ్ కాలేదు. చివరకు నాకు వచ్చిన, నచ్చిన పని చేసుకోవటం ఉత్తమం అనిపించింది. దాంతో మళ్లీ దర్శకత్వ శాఖ వైపు అడుగు లేశాను. ► ‘బింబిసార’ టైమ్ ట్రావెల్ మూవీ. కాబట్టి నేను కొత్తగా నేర్చుకుంటూ దాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేశాను. ఓరకంగా చెప్పాలంటే నాకు కూడా ప్రతిరోజూ టైమ్ ట్రావెల్ చేసినట్లు అనిపించేది. బింబిసారుడుకి సంబంధించి త్రిగర్తల అనే సామ్రాజ్యాన్ని క్రియేట్ చేశాం. ► మన దేశాన్ని పాలించిన మన రాజులు ఎవరున్నారు అని ఆలోచించినప్పుడు బింబిసారుడు గురించి తెలిసింది. ఆ పేరు కూడా స్ట్రైకింగ్గా అనిపించింది. ఇది పూర్తిగా కల్పిత కథ. ► బింబిసార సినిమా అనుకోగానే కీరవాణిగారినే మ్యూజిక్ డైరెక్టర్గా అనుకున్నాం. అయితే అప్పటికే ఆయన ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నారు. దీంతో ఆయన్ని కలవలేకపోయాం. అప్పుడు చిరంతన్ భట్ గారిని అనుకున్నాం. ఎందుకంటే అప్పటికే ఆయన ఈ టైప్ ఆఫ్ మూవీ గౌతమీ పుత్ర శాతకర్ణిని చేసున్నారు. ఆయన్ని కలిసి కథ చెప్పిన తర్వాత కర్మ సాంగ్ను ఇచ్చారు. తర్వాత మరో సాంగ్ను ఇచ్చారు. మూడో సాంగ్ను వరికుప్పల యాదగిరి ఇచ్చారు. ఫోక్ సాంగ్ కావాలి. కానీ.. రొటీన్ ఫోక్ కాకూడదనిపించి.. వరికుప్పల యాదగిరికి విషయం చెబితే ఆయనే ట్యూన్ కంపోజ్ చేశారు. తర్వాత టీజర్కి సంతోష్ నారాయణ్మ్యూజిక్ అందించారు. తర్వాత ఆయన బిజీగా ఉండటంతో కీరవాణిగారిని కలిశాం. ఆయన సినిమా చూసి ఏమంటారోనని కాస్త ఆలోచించాం. కానీ ఆయన సినిమా చూసి వర్క్ చేస్తానని చెప్పారు. ► సీనియర్ ఎన్టీఆర్ నుంచి ఇప్పటి వరకు చాలా మంది హీరోలు రాజుల పాత్రల్లో మనల్ని అలరించారు. వారికి దగ్గర పోలికల్లో మన సినిమాలో హీరో లుక్ ఉండకూడదని అనిపించింది. ఆ సమయంలో మా డిజైనర్ రాము కొన్ని స్కెచెస్ ఇచ్చారు. అందులో ఇప్పటి లుక్ అందరికీ నచ్చింది. ► బింబిసార చిత్రాన్ని రెండు భాగాలుగా చూపించబోతున్నాం. ఇందులో పాత్రలన్నీంటికీ ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి అన్నింటినీ ఓ సినిమాలోనే చూపించలేం. కాబట్టి రెండు భాగాలు చేయాలని అనుకుంటున్నాం. స్క్రిప్టింగ్ టైమ్లోనే ఈ ఆలోచన ఉంది. బింబిసారుడు అనే క్యారెక్టర్ ఓ సూపర్ మ్యాన్లాంటి క్యారెక్టర్ దీన్ని 3, 4 భాగాలుగా కూడా చూపించవచ్చు. -
ఈ వారం ఓటీటీలదే జోరు, బోలెడన్ని సినిమాలు రెడీ!
వేసవి ప్రతాపం చల్లారిపోయింది. సమ్మర్ తర్వాత రిలీజైన పలు సినిమాలు సైతం చప్పగా ఉంటూ సినీప్రియులను ఉసూరుమనిపించాయి. దీంతో జనాలు ఆగస్టు వైపు ఆశగా చూస్తున్నారు. కనీసం ఈ కొత్త నెలలోనైనా మంచి కంటెంట్ ఉన్న సినిమాలున్నాయా? అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి ఆగస్టు మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాలేంటో చూద్దాం.. బింబిసార నందమూరి కల్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన చిత్రం బింబిసార. వశిష్ఠ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంయుక్తా మీనన్, కేథరిన్ హీరోయిన్స్గా నటించారు. చరిత్రకు, వర్తమానానికీ ముడిపెడుతూ సాగే జానపద చిత్రమిది. ఈ మూవీ ఆగస్టు 5న థియేటర్లలో విడుదలవుతోంది. చాలాకాలం తర్వాత కల్యాణ్ బింబిసారతో పలకరించనుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. సీతారామం దుల్కర్ సల్మాన్, మృణాలిని ఠాకూర్ జంటగా నటించిన చిత్రం సీతారామం. యుద్ధంతో రాసిన ప్రేమ కథ అనేది ట్యాగ్లైన్. ఇందులో రష్మిక మందన్నా ముఖ్య పాత్ర పోషించింది. హను రాఘవపూడి దర్శకత్వం వహించగా అశ్వనీదత్, ప్రియాంకదత్ నిర్మించారు. ఈ సినిమా కూడా ఆగస్టు 5న రిలీజవుతోంది. ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు... ఆహా పక్కా కమర్షియల్ - ఆగస్టు 5 మహా - ఆగస్టు 5 అమెజాన్ ప్రైమ్ వీడియో కడువా - ఆగస్టు 4 ఆల్ ఆర్ నథింగ్ (వెబ్ సిరీస్) - ఆగస్టు 4 క్రాష్ కోర్స్ (వెబ్ సిరీస్)- ఆగస్టు 5 థర్టీన్ లైవ్స్ - ఆగస్టు 5 నెట్ఫ్లిక్స్ డార్లింగ్స్ - ఆగస్టు 5 కార్టర్ (కొరియన్ చిత్రం) - ఆగస్టు 5 ద సాండ్మ్యాన్ (వెబ్ సిరీస్) - ఆగస్టు 5 హాట్స్టార్ లైట్ ఇయర్ - ఆగస్టు 3 వూట్ ద గ్రేట్ వెడ్డింగ్ ఆఫ్ మున్నీస్ - ఆగస్టు 4 చదవండి: నేనెప్పుడూ అలా ఫీల్ కాలేదు.. రాత్రికి రాత్రే ఏమీ జరగలేదు, ఏడేళ్లుగా.. ఆమె సైకిల్ పట్టుకుంటే నేను తొక్కేవాడిని: చిరంజీవి -
బింబిసారుడిగా కొత్త అవతారం ఎత్తిన కళ్యాణ్ రామ్
-
బింబిసార ప్రీరిలీజ్ ఈవెంట్లో తారక్ ధరించిన షర్ట్ ధరెంతంటే?
నందమూరి బ్రదర్స్ ఒకేచోట చేరితే అభిమానులకే పండగే. నిన్న అలాంటి కన్నుల పండగనే ఆస్వాదించారు ఫ్యాన్స్. శుక్రవారంనాడు నందమూరి కల్యాణ్ రామ్ మూవీ బింబిసార ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి అతడి సోదరుడు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వచ్చాడు. ఈ సందర్భంగా తన స్పీచ్తో అదరగొట్టాడు. మా తాతగారు (ఎన్టీఆర్), మా నాన్నగారు(హరికృష్ణ) మాకు వదిలి వెళ్లిన అభిమానులు మీరు.. జీవితాంతం మీకు రుణపడి ఉంటాం, మీకు నచ్చేవరకు చిత్రాలు చేస్తూనే ఉంటాం. మీరు కాలర్ ఎగరేసుకునేలా చేయడమే మా బాధ్యత అంటూ మాట్లాడాడు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఈ ప్రీరిలీజ్ ఈవెంట్కు బ్లాక్ టీషర్ట్ ధరించి వచ్చాడు. అది తారక్కు పర్ఫెక్ట్గా సెట్టవడమే కాకుండా అతడిని మరింత హైలెట్ చేసింది. దీంతో అసలా షర్ట్ ధర ఎంత? అని అనుమానం వచ్చిన నెటిజన్లు నెట్టింట ఆరా తీశారు. ఈ క్రమంలో తారక్ ధరించిన బ్లాక్ టీషర్ట్ ఖరీదు అక్షరాలా రూ.24,000 అని తెలిసింది. ఒక్క టీషర్టే అంత రేటా? అని అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరేమో తారక్ రేంజ్కు తగ్గట్టుగా మెయింట్న్ చేస్తున్నాడు, అందులో ఆశ్చర్యపోవాల్సిందేముందని కామెంట్లు చేస్తున్నారు. చదవండి: వారి కుక్కలకు కూడా స్పెషల్ రూం ఇస్తారు: జయసుధ షాకింగ్ కామెంట్స్ ఈ సినిమాకు కల్యాణ్ రామ్ తప్ప న్యాయం చేయగలిగే నటుడు ఇంకొకరు లేడు.. ఉండడు కూడా -
అభిమాని మృతిపై స్పందించిన ‘బింబిసార’ యూనిట్
బింబిసార ప్రిరిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ అభిమాని సాయిరాం మృతిపై చిత్ర యూనిట్ స్పందించింది. సాయిరాం మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. ఆయన కుటుంబానికి సోషల్ మీడియా వేదికగా సానుభూతి తెలియజేశారు. ‘పశ్చిమ గోదావరి జిల్లాలోని పెంటపాడు మండలానికి చెందిన పుట్ట రాంబాబు కొడుకు సాయిరాం శుక్రవారం రాత్రి జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్కి వచ్చి మృతి చెందడం బాధాకరం. అతని కుటుంబానికి ఏ విధంగానైనా సహాయం చేయడానికి ప్రయత్నిస్తాం. సాయిరాం ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాం’అంటూ బింబిసార టీమ్, ఎన్టీఆర్ ఆర్ట్స్ నుంచి ఓ లేఖని సోషల్ మీడియాలో వదిలారు. కల్యాణ్ రామ్ హీరోగా, కేథరిన్, సంయుక్తా మీనన్ హీరోయిన్స్ గా నటించిన చిత్రం ‘బింబి సార’. వశిష్ఠ్ దర్శకత్వంలో నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ.కె నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 5న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ని హైదరాబాద్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా వచ్చాడు. An unfortunate and heartbreaking incident. May his soul rest in peace. Om shanti. pic.twitter.com/1faIb6n5fk — NTR Arts (@NTRArtsOfficial) July 30, 2022 -
‘బింబిసార’ ఈవెంట్లో విషాదం, ఎన్టీఆర్ ఫ్యాన్ అనుమానాస్పద మృతి
బింబిసార ప్రిరిలీజ్ ఈవెంట్లో విషాదం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమాని అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. కాగా నందమూరి హీరో కల్యాణ్ రామ్ చాలా గ్యాప్ తర్వాత నటించిన చిత్రం ‘బింబిసార’. ఈ మూవీ ప్రిరిలీజ్ వేడుక నిన్న(శుక్రవారం) శిల్పకళా వేదికలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా వచ్చాడు. ఈ సందర్భంగా నందమూరి హీరోలను చూసేందుకు నందమూరి అభిమానులు హైదరాబాద్కు శిల్పకళావేదికకు తరలి వచ్చారు. చదవండి: స్టార్ హీరో షూటింగ్ సెట్లో భారీ అగ్ని ప్రమాదం, ఒకరు మృతి ఈ క్రమంలో సాయిరాం అనే అభిమాని అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. అతడిని వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. కాగా మృతుడి పూర్తి పేరు పుట్టా సాయిరాం అని అతడు తాడేపల్లిగూడెనికి చెందిన వ్యక్తి అని తెలిసింది. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ సంస్థలో జాబ్ చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం సాయిరాం మృతదేహం ఉస్మానియా ఆస్పత్రిలోనే ఉందని, ఈ ఘటనపై విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
‘బింబిసార’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
ఫాన్స్ కాలర్ ఎగరేసుకునేలా చేయడమే మా బాధ్యత : ఎన్టీఆర్
‘‘ఇండస్ట్రీకి గడ్డు కాలం అని, థియేటర్లకి జనాలు రావడం లేదని అంటున్నారు.. ఇదంతా నేను నమ్మను. అద్భుతమైన చిత్రం వస్తే చూసి, ఆశీర్వదించే గొప్ప హృదయం కలిగినటువంటి తెలుగు ప్రేక్షక దేవుళ్లు మీరందరూ. ఆగస్టు 5న విడుదలవుతున్న ‘బింబిసార’, ‘సీతా రామం’ చిత్రాలను ఆదరించి తెలుగు ఇండస్ట్రీకి కొత్త ఊపిరి పోయాలి. ఇండస్ట్రీ పదికాలాల పాటు చల్లగా ఉండి మీ అందర్నీ అలరించాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను’’ అని హీరో ఎన్టీఆర్ అన్నారు. కల్యాణ్ రామ్ హీరోగా, కేథరిన్, సంయుక్తా మీనన్ హీరోయిన్స్ గా నటించిన చిత్రం ‘బింబి సార’. వశిష్ఠ్ దర్శకత్వంలో నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ.కె నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 5న విడుదలకానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ మాట్లాడుతూ–‘‘బింబిసార’ కథని వేణు (వశిష్ఠ్) ఒక ఐడియాగా చెప్పినప్పుడు ఇంత పెద్ద కథని హ్యాండిల్ చేయగలడా? లేదా? అని భయం మొదలైంది. అయితే ఈ సినిమా చూసిన తర్వాత.. తను కథని ఎంత కసితో చెప్పాడో అంతే కసిగా తీశాడనిపించింది. ఈ చిత్ర కథ నాకు తెలిసినా సినిమా చూసేటప్పుడు చాలా ఎగై్జట్మెంట్ కలిగింది. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు కూడా అదే ఎగ్జైట్మెంట్కి గురవుతారు. ‘బింబిసార’ టీజర్లోనే వేణు సత్తా తెలుస్తోంది.. హ్యాట్సాఫ్ వేణు. ఈ సినిమాకి ఛోటా కె.నాయుడు అన్న ప్రాణం పోశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అద్భుతమైన సినిమాలు చూస్తే తప్ప ప్రేక్షకులు సంతృప్తి చెందడం లేదు. ‘బింబిసార’ ఇంత అద్భుతంగా వచ్చిందంటే కారణం నటీనటులు, సాంకేతిక నిపుణులే.. వారందరికీ థ్యాంక్స్. ఈ మూవీకి నేపథ్య సంగీతం, కొత్త రకమైన పాటలు అందించి వెన్నెముకగా నిలిచి, మా నమ్మకాన్ని మరింత పెంచినందుకు కీరవాణిగారికి థ్యాంక్స్. మా తాతగారు(ఎన్టీఆర్), మా నాన్నగారు(హరికృష్ణ) మాకు వదిలి వెళ్లిన అభిమానులు మీరు.. జీవితాంతం మీకు రుణపడి ఉంటాం.. మీకు నచ్చే వరకూ చిత్రాలు చేస్తూనే ఉంటాం.. మీరు కాలర్ ఎగరేసుకునేలా చేయడమే మా బాధ్యత. కల్యాణ్ అన్న కెరియర్ ‘బింబిసార’ కి ముందు, తర్వాత అని కచ్చితంగా అనుకోవాల్సిందే. ఈ చిత్రానికి కల్యాణ్ రామ్ తప్ప న్యాయం చేయగలిగే నటుడు ఇంకొకరు లేడు.. ఉండడు కూడా’’ అన్నారు. కల్యాణ్ రామ్ మాట్లాడుతూ–‘‘ఓ మంచి జానపద, సోషియో ఫ్యాంటసీ సినిమా మీ ముందుకు తీసుకు రావాలనే మా ప్రయత్నమే ఈ ‘బింబిసార’. ఈ సారి మాత్రం మిమ్మల్ని(అభిమానుల్ని) నిరుత్సాహ పరచను.. 100కి 200శాతం మీరు సంతృప్తి చెందుతారు.. గర్వంగా ఫీలవుతారు. ఈ సినిమాకి ప్రాణం పోసిన ఒకే ఒక వ్యక్తి కీరవాణిగారు. ‘బింబిసార’ ని నాకు ఇచ్చిన కె.హరికృష్ణకి జీవితాంతం రుణపడి ఉంటాను’’ అన్నారు. ఈ వేడుకలో కెమెరామేన్ ఛోటా కె.నాయుడు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఈసారి ఎవ్వరినీ డిసప్పాయింట్ చేయను: కల్యాణ్ రామ్
నందమూరి కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బింబిసార. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై వశిష్ఠ్ దర్శకత్వంలో కె. హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 5న రిలీజ్ కానుంది. శుక్రవారం బింబిసార ప్రీరిలీజ్ ఈవెంట్ శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హీరో కల్యాణ్ రామ్ మాట్లాడుతూ.. ఒక మంచి జానపద సినిమాను మీ ముందుకు తీసుకురావాలన్న ప్రయత్నమే ఈ బింబిసార. ఈసారి మాత్రం ఎవరినీ డిసప్పాయింట్ చేయను. 200% మీరందరూ సంతృప్తి చెందుతారు, గర్వంగా ఫీలవుతారు. తెలుగు సినిమాకు మూలకారకుడైన తాతగారు నందమూరి తారకరామారావుగారికి ఈ చిత్రాన్ని అంకితం చేస్తున్నా. ఈ సినిమాకు మాటలు రాసిన వాసుదేవ్.. మా పిల్లలకు ట్యూషన్ చెప్పడానికి వచ్చాడు. ఆ సమయంలో ఈ సినిమా డైలాగ్ రైటర్ అయ్యాడు. సినిమాకు ప్రాణం పోసిన వ్యక్తి కీరవాణి. బింబిసార కోసం పని చేసిన అందరికీ కృతజ్ఞతలు అని చెప్పుకొచ్చాడు. చదవండి: వెంట పరిగెత్తి మరీ కొట్టాను, సినిమాలో కూడా లేకుండా చేశా -
బింబిసార ట్రైలర్ రిలీజ్ చేసిన జూనియర్ ఎన్టీఆర్
సరైన హిట్టు కోసం ఎంతోకాలంగా వేచి చూస్తున్నాడు కల్యాణ్ రామ్. దీంతో ఆయన ఈసారి రొటీన్ సినిమాలకు భిన్నంగా సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న కథ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కల్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన చిత్రం బింబిసార. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై వశిష్ఠ్ దర్శకత్వంలో కె. హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 5న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో అన్న సినిమా థియేట్రికల్ ట్రైలర్ను విడుదల చేశాడు జూనియర్ ఎన్టీఆర్. 'హద్దులను చెరిపేస్తూ మన రాజ్యపు సరిహద్దులు, ఆపై రాజ్యాలను దాటి విస్తరించాలి.. శరణు కోరితే ప్రాణభిక్ష, ఎదిరిస్తే మరణం..' అన్న డైలాగ్తో ట్రైలర్ మొదలైంది. 'నాడైనా, నేడైనా త్రిగర్తల చరిత్రను తాకాలంటే ఈ బింబిసారుడి కత్తిని దాటాలి' అని చెప్పే డైలాగ్ పవర్ఫుల్గా ఉంది. ఇక కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరో లెవల్లో ఉంది. ఇదిలా ఉంటే ఈ ఏడాది నందమూరి తారకరామారావు నూరవ జయంతి సంవత్సరం కాబట్టి బింబిసారను ఆయనకు అంకితం ఇస్తున్నట్లు ఇదివరకే ప్రకటించాడు కల్యాణ్ రామ్. Another peek in to the grand world of #Bimbisara. A big screen experience awaits you on August 5th. https://t.co/p1rBGLeMxu#BimbisaraOnAugust5th @NANDAMURIKALYAN @DirVassishta @CatherineTresa1 @iamsamyuktha_ @mmkeeravaani @ChirantannBhatt @NTRArtsOfficial — Jr NTR (@tarak9999) July 27, 2022 చదవండి: పెళ్లైన రెండు నెలలకే ప్రెగ్నెన్సీపై విమర్శలు.. తొలిసారి స్పందించిన ఆలియా అమ్మ కావాలనుకున్నా, నాలుగోసారి విఫలం.. పైగా సైడ్ ఎఫెక్ట్స్ -
ధనుష్తో గొడవలు.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
‘భీమ్లా నాయక్’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్. ఈ చిత్రంలో రానా సరసన నటించిన ఆమెకు నటన పరంగా మంచి మార్కులు పడ్డాయి. తన అందం , అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఆమెకు తెలుగు ఆఫర్స్ క్యూ కట్టాయి. ప్రస్తుతం ఆమె తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. త్వరలోనే బింబిసార చిత్రంతో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఆగష్టు 5న ఈ మూవీ థియేటర్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా ఆమె మీడియాతో ముచ్చటించింది. చదవండి: మరి మహిళల నగ్న చిత్రాల సంగతేంటి?: ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ ఈ సందర్భంగా సంయుక్తి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ క్రమంలో హీరో ధనుష్తో గొడవలంటూ వచ్చిన పుకార్లపై స్పందించింది. కాగా సంయుక్త, ధనుష్ సరసన సార్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది ధనుష్ స్ట్రయిట్ తెలుగు చిత్రమిది. ఈ మూవీ షూటింగ్ సమయంలో తనకు, ధనుష్కు గొడవ జరిగిందని, దీంతో మధ్యలోనే ఆమె మూవీ సెట్ నుంచి వెళ్లిపోయినట్లు గతంలో జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా ఆమెను దీనిపై ఓ విలేకరి ప్రశ్నించగా.. సంయుక్త ఆసక్తిగా స్పందించింది. చదవండి: బొద్దుగా ఉండే అంజలి.. ఇలా అయిపోయిందేంటి? ‘ధనుష్తో నాకు గొడవలా! నిజంగానే అలాంటి వార్తలు వచ్చాయా? నాకు తెలియదు. అలాంటి వార్తలు రాయాలంటే క్రియేటివిటీ ఉండాలి’ అంటూ ధనుష్తో గొడవలపై క్లారిటీ ఇచ్చింది. అంతేగాక మహేశ్-త్రివిక్రమ్లో చిత్రంలో తను నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో కూడా ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. కాగా ధనుష్ హీరోగా వెంకి అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైనమెంట్స్ సంస్థ నిర్మిస్తుంది. ఈ మూవీ కోసం తను 21 రోజుల కాల్షీట్ను కెటాయించానని, ఓ పాట మీనహా తనకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయిందని ఈ సందర్భంగా సంయుక్త మీనన్ తెలిపింది. త్వరలోనే ఈ పాట షూటింగ్లో పాల్గొననున్నట్లు ఆమె వెల్లడించింది. -
గ్లామర్ని డ్రెస్తో కనెక్ట్ చేయకూడదు: సంయుక్తా మీనన్
‘‘భాష తెలియకుండా నటిస్తే చేసే పాత్రతో సగం కనెక్షన్ మిస్ అయిపోతాం. నా పాత్రకు వేరే వారు డబ్బింగ్ చెప్పడం నాకిష్టం ఉండదు. అందుకే లాక్డౌన్లో ట్యూటర్ని పెట్టుకుని తెలుగు నేర్చుకున్నాను’’ అన్నారు సంయుక్తా మీనన్. కల్యాణ్ రామ్ హీరోగా వశిష్ఠ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బింబిసార’. సంయుక్తా మీనన్, కేథరీన్ హీరోయిన్లుగా నటించారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై కె. హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 5న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో సంయుక్తా మీనన్ మాట్లాడుతూ – ‘‘నటిని అవుతానని అనుకోలేదు. అనుకోకుండా నటిగా అవకాశం రావడంతో సినిమాలు చేశాను. మలయాళంలో నేను చేసిన సినిమాలు నాకు మంచి గుర్తింపును తీసుకుని వచ్చాయి. దీంతో తెలుగు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఫస్ట్ ‘బింబిసార’, ఆ తర్వాత సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం సైన్ చేశాను. ఆ నెక్ట్స్ పవన్ కల్యాణ్గారి ‘భీమ్లా నాయక్’, ధనుష్గారి ‘సర్’ చిత్రాలు అంగీకరించాను. ‘భీమ్లా నాయక్’, ‘సర్’ చిత్రాల ఆఫర్స్ ఒకేరోజు వచ్చాయి. ఇక ‘బింబిసార’ టైమ్ ట్రావెల్ మూవీ. ఫ్లాష్బ్యాక్, ప్రెజెంట్ సిట్యువేషన్స్లో స్క్రీన్ ప్లే సాగుతుంది. ప్రెజెంట్ సాగే కథలో నేను కాస్త మోడ్రన్ పాత్రలో కనిపిస్తాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘మలయాళంలో ఓ పెద్ద సినిమా చేస్తున్నాను. ఏ భాషలో సినిమా చేసినా ప్రేక్షకులు గుర్తుంచుకునే పాత్రలు చేయాలను కుంటున్నాను. నా వస్త్రధారణ కాస్త నిండుగా ఉంటుంది. నా తరహాలో నేను గ్లామర్గానే ఉన్నాను. గ్లామర్ను డ్రెస్తో కనెక్ట్ చేసి చూడటం అనేది తప్పని నా ఫీలింగ్’’ అని అన్నారు. -
బింబిసార.. అందమైన చందమామ కథ
‘‘ఎన్నో చందమామ కథలు విన్నాం.. చదివాం.. వెండితెరపై చూశాం. తాతగారు (దివంగత ప్రముఖ నటులు ఎన్టీఆర్) చేసిన ‘పాతాళ భైరవి’, ‘గులేబకావళి కథ’, ‘జగదేకవీరుని కథ’, బాబాయ్ (బాలకృష్ణ) చేసిన ‘భైరవ ద్వీపం’, ‘ఆదిత్య 369’.., చిరంజీవిగారు చేసిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’, మా జనరేషన్లో తమ్ముడు (ఎన్టీఆర్) చేసిన ‘యమదొంగ’, రామ్చరణ్ చేసిన ‘మగదీర’, ప్రభాస్ ‘బాహుబలి’ సినిమాలు గమనిస్తే.. అందమైన సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న కథలను ప్రేక్షకులు బాగా ఆదరించిన విషయం అర్థమవుతుంది. అలాంటి అందమైన గొప్ప చందమామ కథను ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. అదే మా ‘బింబిసార’. ఈ ఏడాది మా తాతగారు ఎన్టీఆర్ నూరవ జయంతి సంవత్సరం కాబట్టి ఆయనకు మా ‘బింబిసార’ను అంకితం ఇస్తున్నాను’’ అని నటుడు–నిర్మాత కల్యాణ్ రామ్ అన్నారు. కల్యాణ్ రామ్ టైటిల్ రోల్ చేసిన చిత్రం ‘బింబిసార’. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై వశిష్ఠ్ దర్శకత్వంలో కె. హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 5న రిలీజ్ కానుంది. జూలై 5న కల్యాణ్రామ్ బర్త్ డే సందర్భంగా సోమవారం ‘బింబిసార’ ట్రైలర్ను లాంచ్ చేశారు. ‘‘కొత్త దర్శకుడు చెప్పిన కథని నమ్మి, సపోర్ట్ చేసిన నిర్మాత హరికి, ప్రోత్సహించిన నా బింబిసారుడు కల్యాణ్రామ్గారికి ధన్యవాదాలు’’ అన్నారు వశిష్ఠ్.