bowling
-
మరో సిరాజ్ కోసం.. పాతబస్తీలో ఎమ్మెస్కే వేట (ఫోటోలు)
-
నితీశ్రెడ్డి.. నువ్వు తోపు!
-
‘డెత్ ఓవర్లలో బౌలింగ్ కత్తి మీద సామే’
సెంచూరియన్: పరిస్థితులకు తగ్గట్లు తన బౌలింగ్ను మార్చుకుంటూ ముందుకు సాగుతున్నానని భారత యువ పేసర్ అర్ష్ దీప్ సింగ్ అన్నాడు. దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్న అర్ష్ దీప్ ... ఒత్తిడిలో బౌలింగ్ చేయడాన్ని ఇష్టపడతానని వెల్లడించాడు. 2022లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అర్ష్ దీప్ ఇప్పటి వరకు జాతీయ జట్టు తరఫున 58 టి20 మ్యాచ్లు ఆడి 89 వికెట్లు పడగొట్టాడు. ‘స్పష్టమైన గేమ్ ప్లాన్తో మైదానంలో అడుగుపెడతా. పరిస్థితులకు తగ్గట్లు దాన్ని మార్చుకుంటూ ఉంటా. జట్టుకు ఏం అవసరమో దాన్ని గుర్తిస్తా. వికెట్లు తీయడం ముఖ్యమా... లేక పరుగులు నియంత్రిచాల అనేది చూసి బౌలింగ్లో మార్పులు చేసుకుంటా. డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడం కత్తిమీద సాము లాంటిది. ప్రతిసారి మనం అనుకున్న ఫలితం రాదు. అయినా దాని గురించి అతిగా ఆలోచించను. ఆరంభంలో రెండు ఓవర్లు వేసి మళ్లీ చివర్లో రెండు ఓవర్లు వేయడం మధ్య చాలా సమయం దక్కుతుంది. ఆ లోపు జట్టుకు ఏం కావాలో ఆర్థం అవుతుంది. రోజు రోజుకు మెరుగవడంపైనే ప్రధానంగా దృష్టి పెడతా.ఇటీవలి కాలంలో బౌలింగ్తో పాటు బ్యాటింగ్లో కూడా జట్టుకు సహాయ పడేందుకు ప్రయత్నిస్తున్నా. భారీ షాట్లు ఆడటం ఇష్టమే. నెట్స్లో కేవలం బౌలింగ్పైనే కాకుండా బ్యాటింగ్, ఫీల్డింగ్పై కూడా దృష్టి పెట్టా. ఆ దిశగా కష్టపడుతున్నా. బుమ్రాతో కలిసి బౌలింగ్ చేయడాన్ని బాగా ఆస్వాదిస్తా. అతడి లాంటి బౌలర్ మరో ఎండ్ నుంచి ఒత్తిడి పెంచుతుంటే వికెట్లు తీయడం చాలా సులువవుతుంది.మ్యాచ్పై పట్టు కొనసాగించడం ముఖ్యం. అది ప్రారంభ ఓవర్ అయినా... లేక చివరి ఓవర్ అయినా ఒకే విధంగా ఆలోచిస్తా’ అని అర్ష్ దీప్ వివరించాడు. పొట్టి ఫార్మాట్లో ప్రమాదక బౌలర్గా ఎదిగిన అర్ష్ దీప్ ... జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించడమే తన ప్రధాన లక్ష్యమని వెల్లడించాడు. -
అశ్విన్ టాప్ ర్యాంక్ పదిలం
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్లో భారత సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన నంబర్వన్ ర్యాంక్ను నిలబెట్టుకున్నాడు. ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో అశ్విన్ మొత్తం ఆరు వికెట్లు పడగొట్టాడు. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో అశ్విన్ 853 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్లో కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ కగిసో రబడ ఒక స్థానం పురోగతి సాధించి 851 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకున్నాడు. భారత పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా ఒక స్థానం మెరుగుపర్చుకొని 825 పాయింట్లతో నాలుగో ర్యాంక్లో నిలువగా... స్పిన్నర్ రవీంద్ర జడేజా 754 పాయింట్లతో ఆరో ర్యాంక్ను నిలబెట్టుకున్నాడు. టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో భారత కెపె్టన్ రోహిత్ శర్మ ఒక స్థానం పడిపోయి 729 పాయింట్లతో 12వ ర్యాంక్లో నిలిచాడు. టెస్టు ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో అశ్విన్, రవీంద్ర జడేజా తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. -
‘టాప్’ ర్యాంక్లో షాహిన్ అఫ్రిది
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్లో పాకిస్తాన్ పేస్ బౌలర్ షాహిన్ షా అఫ్రిది తొలిసారి టాప్ ర్యాంక్ను అందుకున్నాడు. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో షాహిన్ అఫ్రిది 673 పాయింట్లతో ఏడు స్థానాలు ఎగబాకి నంబర్వన్ ర్యాంక్లో నిలిచాడు. హాజల్వుడ్ (ఆస్ట్రేలియా) టాప్ నుంచి రెండో ర్యాంక్కు పడిపోయాడు. భారత బౌలర్లు సిరాజ్, కుల్దీప్ యాదవ్ వరుసగా మూడు, ఏడు స్థానాల్లో ఉన్నారు. ప్రస్తుత వన్డే ప్రపంచకప్లో షాహిన్ 16 వికెట్లు పడగొట్టి ఆడమ్ జంపా (ఆ్రస్టేలియా), మార్కో జాన్సెన్ (దక్షిణాఫ్రికా)లతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. బ్యాటర్ల ర్యాంకింగ్స్లో బాబర్ ఆజమ్ తన టాప్ ర్యాంక్ను నిలబెట్టుకున్నాడు. ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రవేశపెట్టాక వన్డే ఫార్మాట్లో ఏకకాలంలో బౌలింగ్, బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో పాకిస్తాన్ క్రికెటర్లు నంబర్వన్ స్థానంలో ఉండటం ఇదే తొలిసారి. -
CWC 2023: ప్రపంచకప్లో అత్యధిక వికెట్ల వీరులు వీరే..!
వన్డే ప్రపంచకప్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లపై ఓ లుక్కేద్దాం. ఈ జాబితాలో ఆస్ట్రేలియా పేస్ దిగ్గజం గ్లెన్ మెక్గ్రాత్ అగ్రస్థానంలో ఉన్నాడు. మెక్గ్రాత్ 1996-2007 మధ్యలో 39 వరల్డ్కప్ మ్యాచ్లు ఆడి 71 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 2 ఐదు వికెట్ల ఘనతలు కూడా ఉన్నాయి. వరల్డ్కప్లో మెక్గ్రాత్ అత్యుత్తమ గణాంకాలు 7/15గా ఉన్నాయి. ఈ జాబితాలో స్పిన్ లెజెండ్, శ్రీలంక మాజీ బౌలర్ ముత్తయ్య మురళీథరన్ రెండో స్థానంలో ఉన్నాడు. మురళీ 1996-2011 మధ్యలో 40 మ్యాచ్ల్లో 68 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 4 నాలుగు వికెట్ల ఘనతలు ఉన్నాయి. ప్రపంచకప్లో మురళీ అత్యుత్తమ గణాంకాలు 4/19గా ఉన్నాయి. మూడో స్థానం విషయానికొస్తే.. శ్రీలంక మాజీ పేసర్ లసిత్ మలింగ ఈ స్థానాన్ని అక్యూపై చేశాడు. మలింగ 2007-2019 మధ్యలో 29 మ్యాచ్ల్లో 56 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 2 నాలుగు వికెట్ల ఘనతలు, ఓ ఐదు వికెట్ల ఘనత ఉన్నాయి. ప్రపంచకప్లో మలింగ అత్యుత్తమ గణాంకాలు 6/38గా ఉన్నాయి. మలింగ తర్వాత వరల్డ్కప్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా పాక్ పేస్ లెజెండ్ వసీం అక్రమ్ నిలిచాడు. అక్రమ్ 1987-2003 మధ్యలో 38 మ్యాచ్ల్లో 55 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 2 నాలుగు వికెట్ల ఘనతలు, ఓ ఐదు వికెట్ల ఘనత ఉన్నాయి. ప్రపంచకప్లో అక్రమ్ అత్యుత్తమ గణాంకాలు 5/28గా ఉన్నాయి. ఈ జాబితాలో భారత బౌలర్ జహీర్ ఖాన్ ఏడో స్థానంలో నిలిచాడు. జహీర్ 2003-2011 మధ్యలో 23 మ్యాచ్ల్లో 44 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ నాలుగు వికెట్ల ఘనత ఉంది. ప్రపంచకప్లో జహీర్ అత్యుత్తమ గణాంకాలు 4/42గా ఉన్నాయి. ప్రస్తుతం క్రికెట్లో కొనసాగుతున్న బౌలర్లలో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ (18 మ్యాచ్ల్లో 49 వికెట్లు) ఐదో స్థానంలో.. కివీస్ స్పీడ్గన్ ట్రెంట్ బౌల్ట్ (19 మ్యాచ్ల్లో 39 వికెట్లు) 10వ ప్లేస్లో ఉన్నారు. ఇదిలా ఉంటే, ఈనెల 5వ తేదీ నుంచి వరల్డ్కప్ స్టార్ట్ కానున్న విషయం తెలిసిందే. -
వరుసగా ఏడు ఓవర్లు బౌలింగ్.. పూర్తిగా కోలుకున్నట్లేనా!
ఐసీసీ ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్కప్కు మరో 99 రోజులు మిగిలిఉంది. భారత్ ఆతిథ్యమిస్తున్న వన్డే వరల్డ్కప్కు సంబంధించిన షెడ్యూల్ను ఐసీసీ మంగళవారం రిలీజ్ చేసింది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనున్న మెగాటోర్నీలో పది స్టేడియాల్లో 48 మ్యాచ్లు, రెండు సెమీఫైనల్స్, ఒక ఫైనల్ జరగనున్నాయి. ఇక వరల్డ్కప్కు బీసీసీఐ టీమిండియా బెస్ట్ టీంను ఎంపిక చేసే పనిలో ఉంది. వెస్టిండీస్, ఐర్లాండ్తో వరుసగా టీమిండియా వన్డే సిరీస్లు ఆడనుంది. ఆ తర్వాత ఆసియా కప్లో పాల్గొంటుంది. ఈ టోర్నీలో ఆటగాళ్లు చేసే ప్రదర్శన ద్వారా తుది జట్టుపై ఒక అంచనాకు రానున్నారు. ఇకపోతే గాయాలతో దూరమైన కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, పేసర్ జస్ప్రీత్ బుమ్రాలు కూడా వరల్డ్కప్ ఆడాలనే ఉత్సాహంతో త్వరగా కోలుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ మేరకు వీరంతా ఎన్సీఏ అకాడమీలోని రీహాబిలిటేషన్ సెంటర్లో వేగంగా కోలుకుంటున్నారు. టీమిండియాకు ప్రధాన పేసర్ అయిన బుమ్రా పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. ఎన్సీఏలో రిహాబిలిటేషన్ పొందుతున్న బుమ్రా.. వరుసగా ఏడు ఓవర్ల పాటు బౌలింగ్ చేసినట్లు సమాచారం. సర్జరీ తర్వాత కొన్నాళ్లు విశ్రాంతి తీసుకున్న బుమ్రా.. గత కొంతకాలంగా ఎన్సీఏలోనే గడుపుతున్నాడు. ఫిట్నెస్ను మెరుగుపరుచుకుంటున్న అతడు.. ఈ క్రమంలోనే ఏడు ఓవర్ల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా బౌలింగ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి మాట్లాడుతూ.. ‘ఒక ఫాస్ట్ బౌలర్ గాయం నుంచి కోలుకోవడం అంత సామాన్యమైన విషయమైతే కాదు. మేం బుమ్రా విషయంలో నిత్యం మానిటరింగ్ చేస్తున్నాం. అతడు వేగంగా కోలుకోవడమే గాక ఫిట్నెస్ను కూడా మెరుగుపరుచుకుంటున్నాడు. నెట్స్లో ఇవాళ వరుసగా ఏడు ఓవర్ల పాటు బౌలింగ్ చేశాడు. క్రమంగా అతడు మరిన్ని ఓవర్లు వేసేందుకు సిద్ధమవుతున్నాడు. వచ్చే నెలలో అతడు కొన్ని ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. అక్కడ ఎలా ఆడతాడో చూశాక బుమ్రా ఫిట్నెస్పై ఒక స్పష్టత వస్తుంది. ఆ తర్వాతే అతడు ఐర్లాండ్తో ఆగస్టులో ఆడతాడో లేదో అనే దానిపై ఒక అంచనాకు రావొచ్చు''అని పేర్కొన్నాడు. ఇక రిషభ్ పంత్, కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ లతో పాటు బుమ్రాను ఆగస్టులో జరిగే ఆసియా కప్ వరకైనా సిద్ధం చేయాలనే లక్ష్యం పెట్టుకున్న బీసీసీఐ ఆ మేరకు ప్రణాళికలు కూడా రెడీ చేసింది. ఆసియా కప్ కంటే ముందే ఐర్లాండ్ తో భారత్ టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ లో బుమ్రాను పరీక్షించి ఆసియా కప్.. ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్ కు సిద్ధం చేయాలని బీసీసీఐ భావిస్తోంది. 🚨🚨 Team India's fixtures for ICC Men's Cricket World Cup 2023 👇👇 #CWC23 #TeamIndia pic.twitter.com/LIPUVnJEeu — BCCI (@BCCI) June 27, 2023 చదవండి: #ICCWorldCup2023: 2011 నుంచి ఆతిథ్య జట్టుదే.. ఈ లెక్కన వరల్డ్కప్ మనదేనా! #ICCWorldCup2023: టీమిండియాతో తలపడే ఆ ఐదు జట్లకు వేర్వేరు పిచ్లు.. -
ఐపీఎల్-2023లో అత్యంత చెత్త బౌలర్ ఎవరు..?
ఐపీఎల్లో బ్యాటర్లు రాజ్యమేలే ఆనవాయితీ ఈ సీజన్లోనూ కొనసాగింది. ఫాస్ట్ బౌలర్, స్పిన్నర్ అన్న తేడా లేకుండా దాదాపు ప్రతి బౌలర్ను బ్యాటర్లు చితకబాదారు. షమీ, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ లాంటి బౌలర్లు వికెట్లయితే పడగొట్టారు కానీ, పరుగులు ధారాళంగా సమర్పించుకున్నారు. ముంబై పేసర్ ఆకాశ్ మధ్వాల్ లాంటి బౌలర్లు ఒక మ్యాచ్లో అత్యుత్తమ గణాంకాలు (5/5) నమోదు చేసి, ఆ మరుసటి మ్యాచ్లోనే (4-0-52-1) తేలిపోయారు. ఇలాంటి ఘటనలు 73 మ్యాచ్ల్లో చాలా సందర్భాల్లో రిపీటయ్యాయి. ఐపీఎల్-2023లో కనీసం 20 ఓవర్లు బౌల్ చేసి, అత్యంత చెత్త ఎకానమీ నమోదు చేసిన బౌలర్లపై ఓ లుక్కేద్దాం.. ఉమ్రాన్ మాలిక్.. 4 కోట్లు పెట్టి సన్రైజర్స్ తిరిగి దక్కించుకున్న ఈ కశ్మీర్ ఎక్స్ప్రెస్.. ఈ సీజన్లోకెల్లా అత్యంత చెత్త ఎకానమీ (8 మ్యాచ్ల్లో 10.85 ఎకానమీతో 5 వికెట్లు) కలిగిన బౌలర్గా నిలిచాడు. ఆ తర్వాతి స్థానంలో ముంబై పేసర్ క్రిస్ జోర్డాన్ (6 మ్యాచ్ల్లో 10.77 ఎకానమీతో 3 వికెట్లు) ఉన్నాడు. ఈ ముంబై పేసర్ ఆడిన ప్రతి మ్యాచ్లో ధారాళంగా పరుగులు సమర్పించుకుని తన జట్టు ఓటములకు ప్రధాన కారకుడిగా నిలిచాడు. విజయ్కుమార్ వైశాక్.. ఈ ఏడాదే ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఈ ఆర్సీబీ పేసర్ 7 మ్యాచ్ల్లో 10.54 ఎకానమీతో 9 వికెట్లు పడగొట్టాడు. ముకేశ్ కుమార్.. ఈ ఏడాదే ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఈ ఢిల్లీ పేసర్ 10 మ్యాచ్ల్లో 10.52 ఎకానమీతో 7 వికెట్లు పడగొట్టాడు. శార్దూల్ ఠాకూర్.. ఈ ఏడాది వేలానికి ముందు భారీ ధరకు ట్రేడ్ అయిన ఈ కేకేఆర్ ఆల్రౌండర్ ఈ సీజన్లో 11 మ్యాచ్లు ఆడి 10.48 ఎకానమీతో 7 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2023లో చెత్త ఎకానమీ కలిగిన టాప్-5 బౌలర్లంతా పేసర్లే కాగా.. బెస్ట్ ఎకానమీ కలిగిన టాప్-4 బౌలర్లు స్పిన్నర్లు కావడం విశేషం. కనీసం 20 ఓవర్లు బౌల్ చేసి ఐపీఎల్ 2023 బెస్ట్ ఎకానమీ కలిగిన బౌలర్ల జాబితాలో అక్షర్ పటేల్ (14 మ్యాచ్ల్లో 7.19 ఎకానమీతో 11 వికెట్లు) అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ (14 మ్యాచ్ల్లో 7.37 ఎకానమీతో 10 వికెట్లు), రవీంద్ర జడేజా (15 మ్యాచ్ల్లో 7.42 ఎకానమీతో 19 వికెట్లు), కృనాల్ పాండ్యా (15 మ్యాచ్ల్లో 7.45 ఎకానమీతో 9 వికెట్లు) టాప్-4లో ఉన్నారు. ఇక ఈ ఏడాది ఐపీఎల్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టి, పర్పుల్ క్యాప్ దక్కించుకున్న బౌలర్గా గుజరాత్ పేసర్ మహ్మద్ షమీ (16 మ్యాచ్ల్లో 28 వికెట్లు) కొనసాగుతున్నాడు. ఇతని తర్వాత రషీద్ ఖాన్ (16 మ్యాచ్ల్లో 27 వికెట్లు), మోహిత్ శర్మ (13 మ్యాచ్ల్లో 24 వికెట్లు) టాప్-3 బౌలర్లుగా ఉన్నారు. ఐపీఎల్ 2023లో టాప్-3 బౌలర్లంతా గుజరాత్కు చెందిన వారే కావడం విశేషం. వీరి దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. చదవండి: ఐపీఎల్ 2023లో అతి పెద్ద సర్ప్రైజ్ ఎవరు..? -
IPL 2023: అర్థం కాని పిచ్లు.. పరుగుల వర్షం కష్టమేనట!
ఐపీఎల్(IPL 2023) అంటేనే పరుగుల వర్షానికి పెట్టింది పేరు. సింగిల్స్ వచ్చినట్లుగా బౌండరీలు, సిక్సర్లు వస్తుంటాయి. ఐపీఎల్ ముగిసే సమయానికి బౌండరీల కౌంట్ మీటర్ రికార్డులు సృష్టించడం చూస్తుంటాం. గత 15 సీజన్లలో ఇదే తరహాలో బ్యాటర్లు పండగ చేసుకున్నారు. ఆరెంజ్ క్యాప్ కోసం బ్యాటర్లు పోటీపడి పరుగులు సాధించేవారు. అయితే ఈసారి మాత్రం ఐపీఎల్లో బ్యాటర్లకు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు అని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అర్థం కాని పిచ్ల కారణంగా టి20 క్రికెట్లో మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు టి20లు అంటే పరుగుల ప్రవాహం అనేవారు. కానీ కొన్నాళ్లుగా బౌలర్లు కూడా పండగ చేసుకుంటున్నారు. వరుసబెట్టి వికెట్లు తీస్తూ టి20 మ్యాచ్ను కాస్త టి10 మ్యాచ్లుగా మారుస్తున్నారు. ఇక ఇవాళ ఐపీఎల్ 16వ సీజన్ ఆరంభ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న మ్యాచ్లో పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుందా.. బ్యాటర్లకా అన్న ప్రశ్న తలెత్తింది. నిజానికి అహ్మదాబాద్ పిచ్ బౌలర్లకు ఎక్కువగా అనుకూలిస్తుందంటున్నారు. ఇక్కడి పిచ్పై తేమ ఎక్కువగా ఉంటుండడంతో బ్యాటర్లు పరుగులు చేయడం కష్టంగా మారుతుంది. తొలి ఇన్నింగ్స్లో 150 కంటే ఎక్కువ పరుగులు చేస్తే ఆ జట్టుకే కచ్చితంగా గెలిచే అవకాశాలు ఉంటాయి. లోస్కోరింగ్లు నమోదైన ఆశ్చర్యపోనక్కర్లేదు. అహ్మదాబాద్ మాత్రమే కాదు.. ఐపీఎల్ మ్యాచ్లు ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడి పిచ్లు ఎలా స్పందిస్తాయో ముందే చెప్పలేని స్థితి ఏర్పడింది. అయితే క్యురేటర్లు మాత్రం బ్యాటర్లు పండగ చేసుకునేలానే పిచ్లు రూపొందించనట్లు పేర్కొంటున్నారు.అయితే వాళ్ల మాటలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. అందుకు ఇంకో కారణం ఉంది. అదే వాతావరణం సమస్య. ప్రస్తుతం క్యుములో నింబస్ మేఘాల వల్ల ఉపరితల ఆవర్తనం రోజురోజుకి మారుతూ వస్తుంది. దీంతో పిచ్లు బ్యాటర్లకు అనుకూలంగా ఉండడం లేదని క్రీడా విశ్లేషకులు వాపోతున్నారు. ఒకవేళ అదే జరిగితే మాత్రం ఐపీఎల్ 16వ సీజన్లో బ్యాటర్ల మెరుపులు కాస్త తక్కువే ఉండొచ్చు. చదవండి: IPL 2023: తెర వెనుక నాయకులను చూసేద్దామా.. -
Rahul Gandhi:16 ఏళ్ల బాలుడి ప్రతిభకు రాహుల్ గాంధీ ఫిదా
జైపూర్: రాజస్థాన్ రాజ్సమంద్ జిల్లాలోని నందేస్క్రిప్ట్ గ్రామానికి చెందిన ఓ బాలుడి ప్రతిభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫిదా అయ్యారు. ఆ కుర్రాడు చేసిన బౌలింగ్ వీడియోను తన ట్విట్టర్లో షేర్ చేశారు. అతడి కలలు నిజం చేసేందుకు సాయం అందించాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ను కోరారు. దీపక్ శర్మ అనే వ్యక్తి పోస్టును షేర్ చేశారు రాహుల్. అందులో 16 ఏళ్ల భరత్ సింగ్ అనే కుర్రాడు.. చేల వల కట్టి బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ‘దేశంలోని నలుమూల్లో అద్భుత ప్రతిభ దాగి ఉంది. అలాంటి వారిని గుర్తించి వెలుగులోకి తీసుకురావటం మన బాధ్యత. ఆ బాలుడి కలలు సాకారమయ్యేందుకు సాయపడాలని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ను కోరుతున్నాను.’ అని తన ట్విట్టర్లో రాసుకొచ్చారు రాహుల్ గాంధీ. ఆయన ట్వీట్కు రిప్లై ఇచ్చారు సీఎం గెహ్లోత్.‘తప్పకుండా.., ఈ విషయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి అవసరమైన సాయం చేస్తాము’ ట్వీట్ చేశారు. हमारे देश के कोने-कोने में अद्भुत प्रतिभा छिपी हुई है, जिसे पहचानना और बढ़ावा देना हमारा कर्तव्य है।@ashokgehlot51 जी से मेरा निवेदन है, इस बच्चे का सपना साकार करने के लिए कृपया उसकी सहायता करें। https://t.co/vlEKd8UkmS — Rahul Gandhi (@RahulGandhi) July 27, 2022 ఇదీ చదవండి: తినేందుకు రోటీ ఇవ్వలేదని గొడవ.. కత్తితో పొడిచి హత్య -
సంచలన బౌలింగ్తో మెరిసిన గుజరాత్ టైటాన్స్ బౌలర్
ఐపీఎల్ 2022 విజేత గుజరాత్ టైటాన్స్ బౌలర్ ఆర్. సాయి కిషోర్ తమిళనాడు ప్రీమియర్ లీగ్(TNPL)లో సంచలనం సృష్టించాడు. ప్రతీ బౌలర్ కలగనే స్పెల్ను సాయి కిషోర్ సాధించాడు. లీగ్లో భాగంగా ఐ డ్రీమ్ తిర్నూర్ తమిళన్స్, చేపాక్ సూపర్ గల్లీస్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో సాయి కిషోర్ (4-3-2-4) వరల్డ్ క్లాస్ బౌలింగ్ నమదోఉ చేశాడు. నాలుగో ఓవర్లు వేస్తే అందులో మూడు మెయిడెన్లు అంటేనే సాయి కిషోర్ ఎలా బౌలింగ్ చేశాడనేది తెలుస్తోంది. మరి ఇలాంటి అద్బుత ప్రదర్శన చేస్తే తన జట్టు గెలవకుండా ఉంటుందా. ఐడ్రీమ్ తిర్పూర్పై చేపాక్ సూపర్ గల్లీస్ ఏకంగా 60 పరుగులతో ఘన విజయం సాధించింది. సాయి కిషోర్ ప్రదర్శనను మెచ్చుకుంటూ అభిమానులు కామెంట్స్ చేశారు. వరల్డ్ క్లాస్ బౌలింగ్ నమోదు చేశాడు.. ఇలాంటి క్రికెటర్ జట్టులో కచ్చితంగా ఉండాలి.. వారెవ్వా సాయికిషోర్.. ప్రతీ బౌలర్ కలలు గనే స్పెల్ వేశావు.. నీ బౌలింగ్కు ఫిదా అంటూ పేర్కొన్నారు. ఇక మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన చెపాక్ సూపర్ గిల్లీస్ జట్టు 20 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. ఆ జట్టులో ససిదేవ్ అత్యధికంగా 45 పరుగులు చేశాడు. అనంతరం 133 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన తిర్పూర్ తమిళన్స్ 73 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో కెప్టెన్ శ్రీకాంత్ అనిరుధ 25 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. సాయి కిషోర్ 4 వికెట్లు, సందీప్ వారియర్ 3 వికెట్లు, ఆర్ అలెగ్జాండర్ 2 వికెట్లు, సోను యాదవ్ 1 వికెట్ తీశారు. Sai Kishore on 🔥 #TNPL2022 pic.twitter.com/nDIi05Fmvn — Santhosh Kumar (@giffy6ty) July 22, 2022 చదవండి: క్రికెట్లో అలజడి.. స్కాట్లాండ్ బోర్డు మూకుమ్మడి రాజీనామా -
'ప్రపంచంలోనే చెత్త క్రికెటర్ అంట'.. ఇలాంటి బౌలింగ్ చూసుండరు!
క్రికెట్లో ఫన్నీ ఘటనలు చాలానే ఉంటాయి. ఆటగాళ్ల తమ చర్యలతో ఒక్కోసారి విపరీతమైన నవ్వు తెప్పిస్తుంటారు. ఇక బౌలర్లయితే తమ బౌలింగ్ యాక్షన్తో దృష్టిని మొత్తం తమవైపు తిప్పుకుంటారు. మలింగ, బుమ్రా, పాల్ ఆడమ్స్ ఇలాంటి కోవకే చెందినవారే. తాజాగా విలెజ్ క్రికెట్ లీగ్లో స్పిన్ బౌలర్ అయిన జార్జ్ మెక్మెనెమీ యూనిక్ బౌలింగ్ యాక్షన్తో అదరగొట్టాడు. బహుశా క్రికెట్ చరిత్రలో ఇలాంటి బౌలింగ్ ఇంతకముందు ఎప్పుడు చూసి ఉండరు. మాములుగా స్పిన్నర్ లేదా ఫాస్ట్ బౌలర్ ఎంతో కొంత లైనఫ్ తీసుకొని బౌలింగ్ చేయడం సహజం. ఇప్పుడు మనం చెప్పుకునే బౌలర్ మాత్రం కాస్త వినూత్న పద్దతిని అనుసరించాడు. క్రీజుకు ముందు నిలబడి పరిగెత్తుకు వచ్చినట్లుగా రెండు చేతులను తిప్పాడు. ఆ తర్వాత కాసేపు ఆగి చేతిలోని బంతిని పెట్టుకొని ముందుకు, వెనక్కి జరిగాడు. అనంతరం బంతిని విసిరాడు. అప్పటికే బౌలింగ్తో కన్ఫ్యూజ్ అయిన బ్యాటర్ డిఫెన్స్ ఆడాడు. దీనికి సంబంధించిన వీడియోను అతనే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్గా మారింది. అయితే తన బౌలింగ్పై జార్జ్ మెక్మెనెమీ స్వయంగా స్పందిస్తూ.. ''చూడడానికి మీకు సిల్లీగా అనిపించొచ్చు. ప్రపంచంలోనే అత్యంత చెత్త క్రికెటర్ను అయ్యుండొచ్చు. కానీ ఈ క్రికెట్ నా జీవితాన్ని కాపాడింది. మానసిక సమస్యల నుంచి బయటపడేలా చేసిన క్రికెట్కు కృతజ్ఞతలు. నా ప్రదర్శన పట్ల మా అమ్మ గర్వంగా ఫీలవుతుంది. లవ్ యూ క్రికెట్'' అంటూ ట్వీట్ చేశాడు. Folks I might be a fool, I might even be the worst cricketer in the world but this sport has saved my life, enriched my mental health and given me a platform to be happy once more and try to make my incredible Mummy proud up in heaven. Cricket I love you. #cricket #CricketTwitter pic.twitter.com/o46qOuAzA5 — George McMenemy🏏 (@McMcMenemy) June 20, 2022 చదవండి: Carlos Braithwaite: 'చేసిన పాపం ఊరికే పోదు'.. బౌలర్ తిక్క కుదిర్చిన అంపైర్ Michael Rippon: అరుదైన ఆటగాళ్ల జాబితాలోకి నెదర్లాండ్స్ క్రికెటర్ -
బౌలర్ తప్పుకు వెంటనే పెనాల్టీ .. ఫీల్డ్ అంపైర్కు హక్కు ఉంటుందా?
టి20 బ్లాస్ట్లో భాగంగా డెర్బీషైర్, వార్విక్ షైర్ మధ్య మ్యాచ్లో కార్లోస్ బ్రాత్వైట్ చేసిన తప్పుకు ఫీల్డ్ అంపైర్ బౌలింగ్ జట్టుకు ఐదు పరుగులు పెనాల్టీ విధించడం ఆసక్తికరంగా మారింది. బౌలింగ్ జట్టు తప్పు చేస్తే పీల్డ్ అంపైర్కు వెంటనే యాక్షన్ తీసుకునే హక్కు ఉంటుందా అని చాలా మందికి డౌట్ వచ్చింది. అయితే క్రికెట్ పుస్తకాలు మాత్రం అంపైర్కు ఆ హక్కు ఉంటుందని పేర్కొంటున్నాయి. క్రికెట్ పుస్తకాల్లోని లా 41.5 నిబంధనలు ఇదే విషయాన్ని పేర్కొంటున్నాయి. ఒక బౌలర్ ఉద్దేశపూర్వకంగా బ్యాటర్ను గాయపరిస్తే అతనితో పాటు జట్టుపై ఫీల్డ్ అంపైర్ ఏ విధంగా యాక్షన్ తీసుకోవచ్చనేది పరిశీలిద్దాం లా 41.5.1: ఈ నిబంధన ప్రకారం బౌలింగ్ జట్టులోని ఒక ఫీల్డర్.. బ్యాటర్ బంతి ఆడడానికి ముందు లేదా ఆడిన తర్వాత .. ఉద్దేశపూర్వకంగా తిట్టినా, దృష్టి మరల్చినా, అడ్డుకున్నా అది క్రమశిక్షణ ఉల్లంఘన కిందకే వస్తుంది. లా 41.5.2: ఈ ఘటనపై ఫీల్డ్ అంపైర్ లేదా లెగ్ అంపైర్లో ఎవరో ఒకరు.. పీల్డర్ చేసింది ఉద్దేశపూర్వకమేనా లేక అనుకోకుండా జరిగిందా అన్నది పరిశీలించాలి లా 41.5.3: ఒకవేళ ఫీల్డర్ లేదా బౌలర్ తప్పు ఉందని తేలితే.. మైదానంలో ఉన్న ఇద్దరు అంపైర్లలో ఒకరు వెంటనే బౌలింగ్ జట్టుకు వార్నింగ్ ఇస్తూ డెడ్ బాల్గా పరిగణించాలి. ఇదే సమయంలో మరో అంపైర్కు బంతిని రద్దు చేయడంపై వివరణ ఇవ్వాలి లా 41.5.4: ఇలాంటి బంతులను డెడ్బాల్గా పరిగణించి.. బ్యాటర్ను నాటౌట్గా పరిగణిస్తారు. లా 45.5.5: ఫీల్డర్ లేదా బౌలర్.. బ్యాటర్లతో ఫిజికల్గా ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారా లేదా అని పరిశీలించాలి. ఒకవేళ ఫిజికల్ అని తేలితే.. లా 42 ప్రకారం(ఆటగాడి నిబంధన ఉల్లంఘన) ప్రకారం యాక్షన్ తీసుకోవాలి లా 45.5.6: బౌలింగ్ జట్టు తప్పు ఉందని తేలితే.. ఫీల్డ్ అంపైర్ బ్యాటింగ్ జట్టుకు ఐదు పరుగులు అదనంగా ఇస్తారు. ఆ తర్వాత ఐదు పరుగుల పెనాల్టీ విధిస్తున్నట్లు బౌలింగ్ జట్టు కెప్టెన్కు వివరిస్తారు. లా 45.5.7: బౌలర్ వేసిన బంతిని పరిగణలోకి తీసుకోరు.. డెడ్బాల్గా కౌంట్ చేస్తారు. లా 45.5.8: ఈ తతంగమంతా జరిగే లోపల బ్యాటర్లు పరుగు తీస్తే.. దానిని రద్దు చేయడం జరుగుతుంది. అదే సమయంలో ప్రత్యర్థి బ్యాటర్లు సగం క్రీజు దాటితే మాత్రం పరుగు ఇవ్వడంతో పాటు అదనంగా ఐదు పరుగులు ఇస్తారు. లా 45.5.9: స్ట్రైకింగ్లో ఉన్న బ్యాటర్ తర్వాత బంతిని తాను ఆడాలా లేక నాన్స్ట్రైక్ ఎండ్లో ఉన్న బ్యాటర్ ఆడాలా అనే నిర్ణయం వాళ్లే తీసుకునే అవకాశం. లా 45.5.10: ఆటలో భాగంగా జరిగిన తప్పిదాన్ని మ్యాచ్లో పాల్గొన్న ఇద్దరు అంపైర్లు రాతపూర్వకంగా గవర్నింగ్ కౌన్సిల్కు అందజేయాల్సి ఉంటుంది. బౌలింగ్ జట్టుపై ఏ యాక్షన్ తీసుకున్నారనేది వివరించాలి. -
కొడుకనే కనికరం లేకుండా క్లీన్బౌల్డ్
ఆస్ట్రేలియా స్పీడస్టర్ బ్రెట్ లీ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పి చాలా కాలమే అవుతుంది. అయినప్పటికి తన బౌలింగ్లో పదును మాత్రం పోలేదని మరోసారి నిరూపించాడు. తాజాగా 45 ఏళ్ల బ్రెట్ లీ తన కొడుకు ప్రీస్టన్తో కలిసి ఇంటి ఆవరణలోని గార్డెన్లో సరదాగా క్రికెట్ ఆడాడు. ఈ నేపథ్యంలో బ్రెట్ లీ బంతి విసిరాడు. బ్యాటింగ్ చేస్తున్న ప్రీస్టన్కు కనీసం టచ్ చేసే అవకాశం రాలేదు. ఈలోగా బంతి వేగంగా పాదాల మధ్య నుంచి వచ్చి మిడిల్స్టంప్ను ఎగురగొట్టింది. చదవండి: అన్ని ఫార్మాట్లలోనూ రోహిత్ ‘హిట్’... అశూ, అక్షర్ కూడా అద్భుతం! దీనికి సంబంధించిన వీడియోను ఫాక్స్ క్రికెట్ తన ట్విటర్లో షేర్ చేసింది. '' వయసు పెరుగుతున్న బ్రెట్ లీ బౌలింగ్లో పదును మాత్రం తగ్గలేదు. బంతిని వదిలేశారో ఇక అంతే సంగతులు.. కొడుకనే కనికరం లేకుండా క్లీన్ బౌల్డ్ చేశాడు.'' అంటూ క్యాప్షన్ జత చేసింది.ఇక 13 ఏళ్ల పాటు ఆస్ట్రేలియా తరపున క్రికెట్ ఆడిన బ్రెట్ లీ అన్ని ఫార్మాట్లు కలిపి 718 వికెట్లు తీశాడు. 2003, 2007 వన్డే ప్రపంచకప్లు గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో బ్రెట్ లీ సభ్యుడిగా ఉన్నాడు. Blink and you'll miss it 😳 Brett Lee has shown no mercy to his son 😂 👉 https://t.co/PytmEwGeQa pic.twitter.com/bWcQQ9WAnw — Fox Cricket (@FoxCricket) December 30, 2021 -
PAK Vs BAN: బ్యాటింగ్ అయిపోయింది.. ఇప్పుడు బౌలింగ్ చేస్తున్నావా బాబర్!
Babar Azam bowls for the first time in international cricket: ఢాకా వేదికగా బంగ్లాదేశ్- పాకిస్తాన్ రెండో టెస్ట్లో అసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం బౌలింగ్ వేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. కాగా అంతర్జాతీయ స్ధాయిలో బాబర్ బౌలింగ్ చేయడం ఇదే తొలి సారి. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 26వ ఓవర్ బౌలింగ్ చేసిన బాబర్.. కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. అంతేకాకుండా బాబర్ బౌలింగ్లో బంగ్లా బ్యాటర్ తైజుల్ ఇస్లాం క్యాచ్ను స్లిప్ ఫీల్డర్ జారవేయడంతో తృటిలో తొలి వికెట్ను చేజార్చుకున్నాడు. కాగా బాబర్ లిస్ట్ -ఏ కేరిర్లో 12 వికెట్లు సాధించాడు. ఇక బాబర్ బౌలింగ్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. "ఏంటి బాబర్..నీకు బౌలింగ్ కూడా వచ్చా? అంటూ కామెంట్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే పాకిస్తాన్ విజయానికి చేరువలో ఉంది. పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 300-4 వద్ద డిక్లేర్ చేయగా, బంగ్లాదేశ్ కేవలం 87 పరుగులకే కుప్పకూలింది. పాక్ బౌలర్లలో స్పిన్నర్ సాజిద్ ఖాన్ ఒక్కడే 8 వికెట్లు పడగొట్టాడు. కాగా ఫాలోఆన్ ఆడుతున్న బంగ్లాదేశ్ తడబడుతుంది. చదవండి: India Tour Of South Africa: టీమిండియాకు భారీ షాక్.. నలుగురు ఆటగాళ్లు దూరం! వాళ్లిద్దరికీ బంపర్ ఆఫర్! Babar Azam's 1st Over of his International Cricket Career. Babar Azam So Beautiful Bowling@babarazam258 #PAKvBAN #Pakistan #CricketTwitter pic.twitter.com/h9U6nqhSAS — School Education Department & Government of Pak (@SedCorners) December 8, 2021 -
IND Vs AUS: రెస్ట్ అన్నారు.. బౌలింగ్తో సర్ప్రైజ్
Virat Kohli Surprise Bowling Vs Aus.. టి20 ప్రపంచకప్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్లో టీమిండియాకు విరాట్ కోహ్లి సర్ప్రైజ్ ఇచ్చాడు. ఈ మ్యాచ్లో కోహ్లి బరిలోకి దిగడం లేదని.. అతని స్థానంలో తాను కెప్టెన్గా వ్యవహరిస్తున్నట్లు రోహిత్ శర్మ మ్యాచ్ ప్రారంభానికి ముందు పేర్కొన్నాడు. అందుకు అనుగుణంగానే మ్యాచ్కు ప్రకటించిన తుది జట్టులో కోహ్లి పేరు లేదు. దీంతో కోహ్లి రెస్ట్ అని అంతా భావిస్తున్న సమయంలో సడెన్గా ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో కోహ్లి బౌలింగ్ వేసి సర్ప్రైజ్ ఇచ్చాడు. ఏడో ఓవర్లో నాలుగు పరుగులు ఇచ్చిన కోహ్లి తర్వాత వేసిన 13వ ఓవర్లో 8 పరుగులు ఇచ్చాడు. మొత్తంగా మ్యాచ్లో రెండు ఓవర్లు వేసిన కోహ్లి 12 పరుగులిచ్చి వికెట్ తీయలేకపోయాడు. అయితే పార్ట్ టైం బౌలర్గా కోహ్లి బౌలింగ్ చేసిన సందర్భాలు చాలా తక్కువ. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి బౌలింగ్ చేయడంపై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మీమ్స్, ట్రోల్స్తో రెచ్చిపోయారు. చదవండి: T20 WC 2021: ఒమన్ బౌలర్ అద్బుతం.. సింగిల్ హ్యాండ్తో ఇక మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ 57 పరుగుల క్లాస్ ఇన్నింగ్స్తో మెరవగా.. ఆఖర్లో స్టోయినిస్ 25 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్తో 41 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అంతకముందు మ్యాక్స్వెల్ 37 పరుగులతో రాణించాడు. టీమిండియా బౌలర్లలో అశ్విన్ 2, రాహుల్ చహర్, భువనేశ్వర్ కుమార్, జడేజా తలా ఒక వికెట్ తీశారు. చదవండి: T20 WC 2021: మిచెల్ మార్ష్ గోల్డెన్ డక్.. కలిసిరాని పుట్టినరోజు The GOAT Allrounder @imVkohli 🐐❤️#IndvAus #TeamIndia #ViratKohli pic.twitter.com/vCY5z1rorg — Bang VK Haters™ (@BangVKH) October 20, 2021 King @imVkohli Bowling 😍🔥💥#INDvsAUS #T20WorldCup2021 pic.twitter.com/c9jY9GKOZy — 𝐌𝐛 𝐅𝐚𝐧 𝐍𝐚𝐧'𝐂 🔔 (@MbFanNanC) October 20, 2021 -
‘రోహిత్ శర్మను రెండు రకాలుగా బౌల్డ్ చేస్తా’
పరిమిత ఓవర్లలో లెఫ్టార్మ్ పేసర్లను ఎదుర్కోవడంలో భారత జట్టు ఓపనర్ రోహిత్ శర్మ ఇబ్బంది పడతాడని పాక్ మాజీ బౌలర్ మహ్మద్ అమిర్ అన్నాడు. టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు బౌలింగ్ చేయడాన్ని తాను ఎక్కువగా ఇష్టపడతానని అమిర్ పేర్కొన్నాడు. ఆ ఇద్దరితో కలిసి క్రికెట్ ఆడాలని అనుకుంటున్నాని పేర్కొన్న అమిర్.. వారిద్దరూ పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్(పీఎస్ఎల్)లో ఆడితే ఆ మజానే వేరుగా ఉంటుందన్నాడు. కోహ్లితో పోలిస్తే రోహిత్కు బౌలింగ్ చేయడం సులభమని పేర్కొన్నాడు. కోహ్లి ఒత్తిడిలో మెరుగ్గా రాణిస్తాడని తెలిపాడు. అయితే ఈ క్రమంలో వారిద్దరికి బౌలింగ్ చేయడం ఎప్పుడూ కఠినంగా అనిపించలేదని చెప్పుకొచ్చాడు. రోహిత్ను తాను ఇన్ స్వింగ్, ఔట్ స్వింగ్తో ఔట్ చేయగలనని తెలిపాడు ఈ మాజీ పాకిస్తానీ బౌలర్. ఇక 2017లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో అమిర్ పాకిస్తాన్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. పాకిస్తాన్ నిర్దేశించిన 339 పరుగుల టార్గెట్లో రోహిత్, ధావన్, కోహ్లిలనే ఆరంభంలోనే ఔట్ చేసి అమిర్ దెబ్బ కొట్టాడు. దాంతో ఫైనల్ మ్యాచ్లో పరాజయం పాలైన కోహ్లి సేన.. రన్నరప్గానే సరిపెట్టుకుంది. ఇటీవల జట్టు యాజమాన్యం తన పట్ల ప్రవర్తిస్తున్న తీరుకు నిరసనగా మహ్మద్ ఆమిర్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన సంగతి తెలిసిందే. చదవండి: ఈ హైదరాబాదీ భవిష్యత్తులో ప్రపంచ క్రికెట్ను శాసిస్తాడు.. -
చెన్నైకి అదనపు బౌలర్ కావాలి!
సాధారణంగా ఐపీఎల్ గ్రూప్ దశలో చెన్నై సూపర్ కింగ్స్ ఎప్పుడూ ఒత్తిడిలో కనిపించదు. కానీ ఈ సారి అలా అనిపిస్తోంది. ఆ జట్టు వీరాభిమానులు కూడా సోషల్ మీడియాలో పెద్దగా చప్పుడు చేయడం లేదంటే వారూ కొంత ఆందోళన చెందుతున్నట్లు అనిపిస్తోంది. చెన్నై వ్యూహాలు కాస్త భిన్నంగా కనిపిస్తున్నాయి. ప్రతీ ఒక్క ఆటగాడు తన సొంత ప్రదర్శనతోనే జట్టును గెలిపించగలడని అనిపిస్తున్న ముంబై ఇండియన్స్తో పోలిస్తే చెన్నై పూర్తి వ్యతిరేకంగా ఉంది. పోలికలు అనవసరం కానీ జట్టుగా చూస్తే మ్యాచ్లు గెలిచేందుకు అన్ని రకాల అర్హత ఉంది. అయితే ఇది జరగాలంటే ధోని సమర్థంగా నడిపించాల్సి ఉంది. ఆటగాళ్లనుంచి అత్యుత్తమ ఆటను రాబట్టుకోవడం ధోనికి తెలిసినంతగా మరెవరికీ తెలీదు. ఒక్కసారి ధోని తప్పుకుంటే ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. అప్పటికీ ఏదో రూపంలో ధోని జట్టుతో కొనసాగితే తప్ప టీమ్ కూర్పు చాలా మారిపోవడం ఖాయం. రాబోయే రోజుల్లో ఇది ఎలా ఉండబోతోందో చూడాలి. ప్రస్తుతానికి మాత్రం ధోని కొన్ని చిన్న చిన్న సమస్యలు చక్కబెట్టాల్సి ఉంది. పిచ్ బాగుంటే ఒక అదనపు బౌలింగ్ ప్రత్యామ్నాయం అందుబాటులో ఉంటే మంచిది. అన్ని జట్లూ ఇలాగే చేస్తున్నాయి. చెన్నైలో అయితే జడేజా తన 4 ఓవర్లు పూర్తిగా వేసేవాడు. కానీ ఇక్కడ అతడిని నమ్ముకోలేం. బౌలర్ కోసం ఒక బ్యాట్స్మన్ను తగ్గించుకునే అవకాశం సూపర్ కింగ్స్కు ఉంది. నేటి మ్యాచ్లో విజయ్ స్థానంలో రాయుడు ఆడటం దాదాపు ఖాయం కాబట్టి బ్యాటింగ్ బలపడుతుంది. మరి బౌలింగ్ సంగతి చూసుకుంటే మిడిలార్డర్లో ఆడే రుతురాజ్ను పక్కన పెట్టి ఒక స్పెషలిస్ట్ బౌలర్ను తీసుకుంటే మంచిది. ఇలాంటి టోర్నీలో మిడిలార్డర్లో ఆడటం ఒక యువ ఆటగాడికి అంత సులువు కాదు. అందుకు బదులుగా 4 ఓవర్లు బాగా వేయగల బౌలర్ పనికొస్తాడు. బలహీనంగా కనిపించిన సన్రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు బలమైన ఢిల్లీని ఓడించింది. అయితే ఇది మరీ పెద్ద విజయమేమీ కాదని నా భావన. విలియమ్సన్ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడకపోయి ఉంటే హైదరాబాద్ ఓడిపోయేది. ఇన్నేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఐపీఎల్లో వార్నర్ తడబడుతున్నాడు. బెయిర్స్టో అర్ధ సెంచరీ చేసినా అతనిలో ఆత్మవిశ్వాసం కనిపించలేదు. విలియమ్సన్ రాకతో ప్రస్తుతానికి జట్టు బ్యాటింగ్ బలం కాస్త పెరిగింది. సందీప్, కౌల్, థంపిలను కాదని లెఫ్టార్మ్ పేసర్ నటరాజన్కు ఎందుకు అవకాశం ఇచ్చారో ఈ మ్యాచ్ చూస్తే అర్థమైంది. చక్కటి నియంత్రణతో పాత కాలం బౌలర్ల తరహాలో నటరాజన్ మంచి యార్కర్లు వేయగలడని తెలిసింది. ఇన్నేళ్ళలో బ్యాటింగ్లో చాలా మార్పులు వచ్చాయి. 360 డిగ్రీల షాట్లు వచ్చాయి. అయితే కచ్చితత్వంతో, సరిగ్గా బౌలింగ్ చేస్తే ఇప్పటికీ బ్యాట్స్మెన్ల వద్ద సమాధానం లేదని గత మ్యాచ్ నిరూపించింది. అంచనా వేయడం కొంత కష్టమే అయినా... నా దృష్టిలో నేటి మ్యాచ్లో చెన్నైదే పైచేయిగా కనిపిస్తోంది. -
మానవుని శక్తికి, సహనానికి సెల్యూట్
-
కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్!
కొలంబో: శ్రీలంక, ఇంగ్లండ్ జట్ల మధ్య శనివారం జరిగిన ఏకైక టి20 మ్యాచ్లో క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యంతో చూసిన ఒక ఘటన జరిగింది. ఇదే మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన శ్రీలంక స్పిన్నర్ పీహెచ్డీ కామిందు మెండిస్ రెండు చేతులతో బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు. కుడిచేతి వాటం ఆటగాడికి లెఫ్టార్మ్ స్పిన్ వేసిన అతను, ఎడమచేతి వాటం బ్యాట్స్మన్కు ఆఫ్ స్పిన్ బంతులు విసిరాడు. అతను లెఫ్టార్మ్తో వేసిన తొలి బంతికి జేసన్ రాయ్ సింగిల్ తీశాడు. వెంటనే మెండిస్ తన బౌలింగ్ను మారుస్తున్నట్లు అంపైర్కు చెప్పాడు. ఈసారి అతని రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బంతిని స్టోక్స్ ఎదుర్కొన్నాడు. మూడు ఓవర్లలో కామిందు వరుసగా 3, 15, 9 పరుగులు ఇచ్చాడు. అతని మూడో ఓవర్లో ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్లే ఉండటంతో మెండిస్కు బౌలింగ్ మార్చాల్సిన అవసరం లేకపోయింది. అంతర్జాతీయ సీనియర్ స్థాయి క్రికెట్లో ఒక బౌలర్ ఇలా రెండు చేతులతో బౌలింగ్ చేయడం ఇదే మొదటిసారి. దేశవాళీ క్రికెట్లో అక్షయ్ కర్నేవర్ (భారత్), జెమా బార్స్బై (ఆస్ట్రేలియా)లాంటి కొందరు ఉన్నా జాతీయ జట్టు తరఫున ఇలాంటి బౌలింగ్ శైలి (ఆంబిడెక్స్ట్రస్) ఎవరికీ లేదు. గతంలో హనీఫ్ మొహమ్మద్, గ్రాహం గూచ్, హసన్ తిలకరత్నే ఇలాంటి ఫీట్ను ప్రదర్శించినా అదంతా సరదాకు మాత్రమే! సీరియస్గా బౌలింగ్ చేసే ఒక రెగ్యులర్ బౌలర్కు ఇలా రెండు చేతులతో బంతులు వేయగల సత్తా ఉండటం మాత్రం కచ్చితంగా విశేషమే. బ్యాట్స్మెన్కు అనుగుణంగా ఒకే ఓవర్లో బౌలింగ్ మార్చుకోగలడం జట్టుకు అదనపు బలం కూడా కాగలదు. శ్రీలంక అండర్–19 జట్టుకు కెప్టెన్గా కూడా వ్యవహరించిన 20 ఏళ్ల కామిందు మెండిస్ బ్యాటింగ్లో మాత్రమే ఎడంచేతి వాటమే. Kamindu Mendis, Sri Lanka's captain during January's U19 @CricketWorldCup, has been called up to his country's T20I squad for the first time. Here's a clip of him in action - and no, that's not a mirror, he really does bowl both right-arm and left-arm spin! pic.twitter.com/rhjJP4wku1 — ICC (@ICC) 23 October 2018 -
సత్తాచాటుతున్న ఉమాదేవి
ఏలూరు రూరల్: ఆమె బౌలింగ్ ప్రారంభిస్తే ప్రత్యర్థులకు హడలే. బాల్ గింగిరాలు తిరుగుతూ వస్తుంటే ఎంతటి బ్యాట్స్ఉమెన్ అయినా చిత్తు కావల్సిందే. ఆమే దేవరపల్లికి చెందిన మహిళా లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ టి.ఉమాదేవి. ఆరేళ్లగా క్రికెట్ సాధన చేస్తున్న ఈమె ప్రతిభకు పేదరికం అడ్డు కాదని నిరూపిస్తోంది. దేవరపల్లి డిగ్రీ కళాశాలలో సెకండియర్ చదువుతున్న ఈమె ఆంధ్ర మహిళ కుంబ్లేగా అందరిచే కితాబు అందుకుంటోంది. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఈమె నిరంతర సాధన చేసి క్రికెట్లో అంచెలంచెలుగా ఎదుగుతోంది. తోటి క్రీడాకారిణిల్లో స్ఫూర్తి నింపుతోంది. ఈనెల 4వ తేదీ నుంచి 13 వరకూ గుంటూరులో ఏసీఓ మహిళ అకాడమీలో అండర్–19 జోనల్స్థాయి మ్యాచ్లు జరిగాయి. ఈ పోటీల్లో జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఉమాదేవి నార్త్జోన్ జట్టును తన బౌలింగ్ ప్రతిభతో కుప్పకూల్చింది. 4 వికెట్లు తీసి జిల్లా జట్టును విజయపథంలో నడిపించింది. త్వరలో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో ఆంధ్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించనుంది. ఇప్పటికే జాతీయస్థాయి ఎస్జీఎఫ్ పోటీల్లో పాల్గొంది. మూడేళ్లుగా అండర్–16, 19 పోటీల్లో పాల్గొని సత్తా చాటింది. నేడు అండర్–19లో కేరళ, తమిళనాడు, గోవా, కర్ణాటక, హైదరాబాద్ తదితర జట్లతో తలపడి జాతీయ జట్టు సెలక్టర్ల దృష్టిలో పడేందుకు కృషి చేస్తోంది. ఈమె ప్రతిభను గుర్తించిన జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోకరాజు రామరాజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ద్వారా నెలకు రూ.4 వేలు ఉపకార వేతనం అందిస్తున్నారు. సహాయ కార్యదర్శులు ఎం. వగేష్కుమార్ ఉమాదేవికి సహకారం అందిస్తున్నారు. కోచ్ ఎస్. రమాదేవి వద్ద శిక్షణ పొందుతున్న ఈమె తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, రత్నకుమారి వ్యవసాయం చేస్తున్నారు. -
‘మీరట్ కత్తెర’ పదునెక్కింది!
భువనేశ్వర్ ఆరంభంలోనే కీలక వికెట్లు తీసి ప్రత్యర్థిని కుప్పకూల్చగలడు... చివర్లో బౌలింగ్కు వచ్చి హిట్టింగ్ చేస్తున్న బ్యాట్స్మెన్ను పెవిలియన్ పంపి మ్యాచ్ను గెలిపించగలడు... మధ్య ఓవర్లలో మ్యాచ్పై పట్టు పోతుందేమో అనిపించినప్పుడు వచ్చి నేనున్నానంటూ వికెట్ తీసి ఆటను మలుపు తిప్పగలడు... ఇక మన ఆట ముగిసిపోయిందని అనిపించినప్పుడు క్రీజ్లోకి వచ్చి బ్యాట్స్మన్లా బాధ్యతగా ఆడగలడు... దక్షిణాఫ్రికా పర్యటనలో అతను చేయలేని పని ఏదైనా ఉందా? కేప్టౌన్లో తొలి టెస్టు తొలి రోజు నుంచి జొహన్నెస్బర్గ్లో తొలి టి20 వరకు భువీ ముద్ర బలంగా కనిపించింది. ఎంత గొప్పగా ఆడినా దిక్కులు పిక్కటిల్లే సంబరాలు ఉండవు. మ్యాచ్ మ్యాచ్కూ జుట్టు రంగు మార్చుకునే కొత్త వేషాలు కనిపించవు. దేశంలో కత్తెరలకు కేరాఫ్ అడ్రస్ మీరట్ నగరం నుంచి వచ్చిన ఈ స్టార్ మూడు ఫార్మాట్లలో కేవలం తన ఆటతోనే అంతటా తానై కనిపించాడు. సాక్షి క్రీడా విభాగం:దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓడిన తొలి టెస్టులో మన జట్టు తరఫున చెప్పుకోదగ్గ విశేషం ఏదైనా ఉందీ అంటే అది భువనేశ్వర్ కుమార్ ప్రదర్శన మాత్రమే. తొలి మూడు ఓవర్లలో మూడు వికెట్లు తీసి సఫారీల స్కోరును 12/3కు పరిమితం చేసిన అతను అద్భుత ఆరంభాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత రెండు ఇన్నింగ్స్లలో కీలక పరుగులు కూడా చేశాడు. కానీ ఇలాంటి ఆట తర్వాత కూడా అతడిని రెండో టెస్టు నుంచి దూరంగా ఉంచారు. కారణమేదైనా ఈ తప్పుపై అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. మూడో టెస్టులో భువీని మళ్లీ తీసుకోగా... తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. మరోసారి పదునైన బౌలింగ్తో పాటు రెండు ఇన్నింగ్స్లలో పట్టుదలగా ఆడిన చేసి పరుగులే జట్టును గెలిపించి అతడిని ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిపాయి. ఆ తర్వాత వన్డేల్లోనూ చక్కటి ఆటతీరు ప్రదర్శించిన భువనేశ్వర్... తాజాగా టి20 మ్యాచ్లో ఐదు వికెట్ల ప్రదర్శనతో మూడు ఫార్మాట్లలో తన విలువేంటో చూపించాడు. మొత్తంగా అటు కోహ్లి తర్వాత ఇటు భువీనే దక్షిణాఫ్రికా పర్యటనను ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేశాడు. బంతి రంగు మారిందంతే... భువనేశ్వర్ పరిమిత ఓవర్ల బౌలర్ మాత్రమే అన్నట్లుగా ఇటీవలి వరకు అతనికి గుర్తింపు కొనసాగింది. కెరీర్ ఆరంభంలో పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకొని రాణించే, పెద్దగా వైవిధ్యమేమీ చూపకుండా కచ్చితత్వంతో బంతులు విసిరే బౌలర్గానే కనిపించాడు. టి20ల్లో పరిస్థితులు బాగుంటే ఆరంభంలో ఒక్క స్పెల్లోనే అతనితో నాలుగు ఓవర్లు వేయించేసి కెప్టెన్ పని ముగించేవారు. కానీ కొన్నాళ్లుగా బౌలింగ్లో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు అతను ఒకే తరహాలో లేదా స్వింగ్ను మాత్రమే నమ్ముకొని బంతులు వేసే బౌలర్ కాదు. పిచ్పై తేమ తగ్గిపోయిన తర్వాత కూడా అతను ప్రభావవంతంగా కనిపిస్తున్నాడు. ఒకప్పుడు అతని బౌలింగ్లో వేగం 120–130 కిలో మీటర్ల మధ్యలోనే ఉండింది. ఇప్పుడు 140 కిమీ కూడా దాటుతోంది. పైగా వేగాన్ని అందుకునే ప్రయత్నంలో గతి తప్పడం లేదు. అద్భుతంగా మలుచుకున్న ఫిట్నెస్ కూడా అందుకు కారణం. దాని వల్లే మైదానంలో ఫీల్డింగ్లో కూడా చాలా చురుగ్గా మారిపోయాడు. తాజాగా దక్షిణాఫ్రికాలో అతని ప్రదర్శన చూస్తే ఇక అతను ఏమాత్రం ఒకే తరహా శైలి బౌలర్ మాత్రం కాదని అర్థమైపోయింది. సఫారీ గడ్డపై జోరుగా... భువనేశ్వర్ టెస్టు కెరీర్లో 2014 ఇంగ్లండ్ సిరీస్లో 19 వికెట్లతో చెలరేగడం అత్యుత్తమ దశ. అయితే ఆ తర్వాత కూడా టెస్టుల్లో అతనిపై పెద్దగా నమ్మకం ఉంచలేదు. కానీ ఈ పర్యటనలో అతను అన్ని విధాలా దానిని తప్పని నిరూపించాడు. తొలి రోజు సఫారీ ఓపెనర్లతో పాటు ఆమ్లా వికెట్ తీసిన తీరు అతను ఈ సిరీస్ కోసం ఎలా సన్నద్ధమయ్యాడో చూపించింది. ఆ తర్వాత డి కాక్ వికెట్ కూడా పడగొట్టాడు. అయితే వికెట్లు తీసిన తీరుకంటే భువీ బౌలింగ్ను ఎదుర్కోవడంలో సొంతగడ్డపై దక్షిణాఫ్రికా తడబడటం అతని సత్తాకు నిదర్శనం. జొహన్నెస్బర్గ్ టెస్టు గెలుపులో నిస్సందేహంగా భువీదే ప్రధాన పాత్ర. తొలి ఇన్నింగ్స్లో చకచకా చేసిన 30 పరుగులు, అనూహ్యమైన బౌన్స్తో బ్యాట్స్మెన్కు ప్రమాదకరంగా మారిన పిచ్పై రెండో ఇన్నింగ్స్లో చేసిన 33 పరుగులు మ్యాచ్ స్వరూపాన్ని మార్చాయి. తొలి ఇన్నింగ్స్లో మళ్లీ ఎల్గర్, మార్క్రమ్లతో పాటు డివిలియర్స్ను అద్భుత బంతితో బౌల్డ్ చేసి భువీ ఈ మ్యాచ్ చేయిదాటిపోకుండా చూశాడు. ఈ కష్టాన్ని గుర్తించే కాబోలు ఆరో వన్డేకు ముందు ‘నిజంగా విశ్రాంతి ఇవ్వాల్సిందంటే భువనేశ్వర్కే’ అంటూ కెప్టెన్ కోహ్లి వ్యాఖ్యానించాడు. వాస్తవానికి ఆల్రౌండర్ అంటూ హార్దిక్ పాండ్యాపై అందరి గురి నిలిచింది కానీ భారత జట్టుకు సంబంధించి ఇప్పుడు అసలైన ఆల్రౌండర్ భువనేశ్వరే. తొలి టి20 మొదటి స్పెల్లో 3 ఓవర్లలో 19 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీసిన భువీ, తన చివరి ఓవర్లో మరో 3 వికెట్లతో మ్యాచ్ను గెలిపించడం విశేషం. కొత్త అస్త్రంతో... ఆటపై బ్యాటింగ్ ఆధిపత్యం ప్రదర్శిస్తున్న ఈ రోజుల్లో బౌలర్లు ప్రతీ సారి భిన్నంగా ప్రయత్నించాల్సి ఉంటోంది. అదే క్రమంలో భువనేశ్వర్ ‘నకుల్ బాల్’ను ప్రత్యేకంగా సాధన చేశాడు. టి20 మ్యాచ్లో అతను దానిని సమర్థంగా ఉపయోగించాడు. ఇందులో సఫలం అయ్యేందుకు దాదాపు ఏడాదిగా శ్రమిస్తున్నట్లు భువనేశ్వర్ చెప్పాడు. నకుల్ బాల్ అనేది బేస్బాల్ క్రీడ నుంచి వచ్చింది. పేరులో నకుల్స్ (వేలి మెటికలు) ఉన్నా అవేమీ ఉపయోగించరు. వేలి గోళ్లతో పట్టు బిగించి ఆ తర్వాత బంతిని వదులుతారు. బంతిని సంధించే సమయంలో సాధారణ బంతిలాగే వేగాన్ని కొనసాగిస్తే బ్యాట్స్మెన్ దీనిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అయితే బౌలర్ కూడా దీనిని నియంత్రణలో ఉంచుకోవాలంటే తీవ్ర సాధన అవసరం. గతంలో జహీర్ ఖాన్ నకుల్ బాల్తో కొంత సఫలం కాగా, సునీల్ నరైన్ బాగా వాడాడు. అయితే టాంపరింగ్ ఆరోపణలతో యాక్షన్ను మార్చుకున్న తర్వాత నరైన్ దీనికి దూరమయ్యాడు. -
అతడి కోసమే మ్యాచ్లు చూస్తా : హీరోయిన్
భారత్ లో క్రికెట్, సినిమాలది విడదీయలేని బంధం. క్రికెటర్లు, ఫిలిం స్టార్స్ మధ్య ప్రేమాయణాలు మనకు చాలా కామన్. అయితే లవ్ కాకపోయినా ఓ దక్షిణాది భామ యువ క్రికెటర్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. టాలీవుడ్లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ముద్దుగుమ్మ రాశీఖన్నా, తొలి ప్రేమ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఈ భామ క్రికెటర్ బూమ్రా అంటే తనకు ఇష్టమని చెప్పింది. క్రికెట్ అంటే తనకు ఇష్టమని చెప్పిన రాశీఖన్నా, బుమ్రా బౌలింగ్ కోసమే మ్యాచ్లు చూస్తుంటానని తెలిపింది. బుమ్రా మ్యాచ్ లో ఉంటే రాత్రులు మేలుకొని మరి మ్యాచ్ చూస్తుందట ఈ భామ. గతంలోనూ బుమ్రా బౌలింగ్పై సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించింది. వరుణ్ తేజ్ సరసన రాశీఖన్నా హీరోయిన్గా తెరకెక్కిన తొలి ప్రేమ ఈ శనివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
బౌలింగ్ చేస్తూ కుప్పకూలిపోయాడు
-
బౌలింగ్ చేస్తూ కుప్పకూలాడు!
సాక్షి, బంజారాహిల్స్: అప్పటివరకు ఉత్సాహంగా బౌలింగ్ చేసిన ఓ యువకుడు అంతలోనే మైదానంలో కుప్పకూలిపోయాడు. బౌలింగ్ చేస్తూ ప్రాణాలు విడిచాడు. ఈ విషాద ఘటన బంజారాహిల్స్లో జరుగుతున్న ఓ క్రికెట్ టోర్నమెంట్లో చోటుచేసుకుంది. క్రికెట్ టోర్నమెంటులో పాల్గొన్న లాయిడ్ ఆంథోనీ అనే 23 ఏళ్ల యువకుడు బౌలింగ్ చేస్తూ.. మైదానంలోనే ప్రాణాలు విడిచాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
కివీస్ చేతిలో విండీస్ చిత్తు
టాంటన్: మహిళల వన్డే ప్రపంచ కప్ టోర్నీలో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన విండీస్ 43 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌటైంది. కైషోనా నైట్ (41) టాప్ స్కోరర్గా నిలవగా, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ లీ కాస్పెరెక్ (10–6–17–3) అద్భుత బౌలింగ్తో అదరొట్టింది. అనంతరం న్యూజిలాండ్ 18.2 ఓవర్లలోనే 2 వికెట్లకు 151 పరుగులు సాధించింది. దూకుడుగా ఆడిన రాచెల్ ప్రీస్ట్ (55 బంతుల్లో 90; 17 ఫోర్లు, 2 సిక్సర్లు) కివీస్ను గెలిపించింది. -
అదరహో అశ్విన్...
నిలకడైన ప్రదర్శనకు మారుపేరుగా మారిన ఆఫ్ స్పిన్నర్ భారత విజయాల్లో కీలకపాత్ర ఒక రికార్డుతో ఇమ్రాన్ఖాన్లాంటి దిగ్గజాన్ని దాటేశాడు. మరో రికార్డుతో మాల్కం మార్షల్లాంటి మరో లెజెండ్ను మరిపించాడు. కుంబ్లేకు, హర్భజన్కు కూడా సాధ్యం కాని అనేక గణాంకాలు అలవోకగా వచ్చి చేరుతున్నారుు. అతనిని వదిలి పెట్టలేమన్నట్లుగా అంకెలు అతనితో అనుబంధాన్ని పెనవేసుకుంటున్నారుు! భారత్లో భారత్ టెస్టు సిరీస్ గెలవడం, స్పిన్నర్లు గెలిపించడం మొదటిసారి కాదు, ఆ విజయాలు మనకు కొత్త కాదు. కానీ ఇలా చేతి నుంచి బంతి దాటడమే ఆలస్యం... అలా వికెట్లు అతని ఒళ్లో వాలిపోతున్నారుు. రవిచంద్రన్ అశ్విన్ చేస్తున్న మాయాజాలానికి ప్రత్యర్థి బ్యాట్స్మెన్ పాహిమాం అంటున్నారు. సూర్యుడు తూర్పున ఉదరుుంచడంలాంటిదే ఇన్నింగ్సలో అశ్విన్ ఐదు వికెట్లు తీయడం అంటూ అతనిపై అభినందనలు కురుస్తుంటే... అతిశయోక్తిగా అనిపించినా చావుపుట్టుకలు ఎంత సహజమో అశ్విన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కావడం అంతే సహజమంటూ మరో మాజీ క్రికెటర్ తనదైన భావాన్ని ప్రదర్శించాడు. ఐదేళ్ల స్వల్ప కెరీర్లోనే ఎవరికీ అందనంత ఎత్తులో అతని రికార్డులు నిలుస్తుండగా, ఇదే తరహాలో జోరు కొనసాగితే వేరుు వికెట్ల మైలురారుు కూడా చిన్నదిగా మారిపోతుందేమో! ఇప్పటికే వరుసగా నాలుగు జట్లు ఈ చెన్నై స్టార్ దెబ్బ రుచి చూశారుు. ఇక ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలకు ప్రమాద హెచ్చరిక జారీ అరుునట్లే! సాక్షి క్రీడా విభాగం దాదాపు మూడేళ్ల క్రితం జొహన్నెస్బర్గ్లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో అశ్విన్ 42 ఓవర్లు పాటు బౌలింగ్ చేసినా ఒక్క వికెట్ కూడా దక్కలేదు. ఆ దెబ్బకు భారత్ ఆడిన తర్వాతి ఏడు టెస్టుల్లో అతనికి చోటు లభించలేదు. అరుుతే ఈ వైఫల్యం నుంచి అతను పాఠాలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత తన యాక్షన్లో స్వల్ప మార్పులు చేసుకున్నాడు. క్యారమ్ బాల్పై అమితంగా ఆధారపడకుండా రెగ్యులర్ ఆర్మ్ బాల్పైనే ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. ఆ తర్వాత జట్టులోకి తిరిగొచ్చిన తర్వాత అశ్విన్కు ఎదురు లేకుండా పోరుుంది. అశ్విన్ ఇంజినీరింగ్ బుర్ర కూడా అద్భుతాలు సృష్టించడంలో బాగా పని చేసింది. అప్పటి వరకు హర్భజన్ తర్వాత మాత్రమే ప్రత్యామ్నాయ స్పిన్నర్గా అవకాశాలు దక్కించుకుంటూ వచ్చిన అశ్విన్, ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లిపోయాడు. వికెట్లలో, రికార్డులలో భజ్జీని వెనక్కి తోస్తూ ఆల్టైమ్ బెస్ట్ స్పిన్నర్లలో ఒకడిగా నిలిచేందుకు కావాల్సిన అర్హతను అందుకున్నాడు. వేదిక ఏదైనా... ‘ప్రస్తుతం స్పిన్నర్ల కోసమే తయారు చేస్తున్న పిచ్లను మేం ఆడినప్పుడు రూపొందిస్తే నా వికెట్లు, కుంబ్లే వికెట్ల సంఖ్య ఎక్కడో ఉండేది’ హర్భజన్ సింగ్ చేసిన తాజా వ్యాఖ్య ఇది. విశ్లేషణకంటే ఒక రకమైన అసూయ, ఒక ఆఫ్ స్పిన్నర్గా తనను అశ్విన్ దాటేసి వెళుతున్నాడనే బాధ ఈ మాటల్లో ఎక్కువగా కనిపిస్తోంది. కొన్నాళ్ల క్రితం వరకు కూడా ఇందులో వాస్తవం ఉంది. అశ్విన్ అద్భుత బౌలింగ్ అంటూ బ్రాకెట్లో పిచ్ షరతులు వర్తిస్తారుు అంటూ జోక్ చేసిన రోజులు కూడా ఉన్నారుు. కానీ ఇప్పుడు అది పూర్తిగా నిజం కాదు. ఎందుకంటే చివరి టెస్టు జరిగిన ఇండోర్ వికెట్ స్పిన్కు పెద్దగా అనుకూలించలేదు. అనూహ్యంగా టర్న్లాంటివి దొరకలేదు. అరుునా సరే అశ్విన్ తనదైన శైలిలో చెలరేగిపోయాడు. గత దక్షిణాఫ్రికా సిరీస్ సమయంలో పిచ్లపై విమర్శలు వచ్చిన విషయం వాస్తవమే అరుునా... న్యూజిలాండ్ వైపు నుంచి కూడా పిచ్ల గురించి ఎలాంటి ఫిర్యాదు లేదు. పైగా అశ్విన్ తీసిన వికెట్లు చూస్తే పిచ్ అనుకూలతకంటే అతని తెలివితేటలే ఎక్కువగా కనిపిస్తారుు. కోహ్లి చెప్పినట్లు ‘పిచ్ ఒక్కటే వికెట్లు అందించదు, బౌలర్లో కూడా సత్తా ఉండాలి. బంతిని భుజం నుంచి వదిలేటప్పుడే మనం ఏం చేయాలనేది బుర్రలో ఉండాలి. అప్పుడే పిచ్పై పడిన తర్వాత బంతి స్పందిస్తుంది’. ఈ రకంగా చూస్తే అశ్విన్ పక్కా ప్లానింగ్ అతని ప్రదర్శనలో కీలకమని అర్థమవుతుంది. ఇటీవల నాటి పేస్ వికెట్లు లేకపోరుునా... సంప్రదాయంగా స్పిన్కు అంతగా అనుకూలించని వెస్టిండీస్లో కూడా అశ్విన్ తాజా సిరీస్లో 17 వికెట్లు తీయగలిగాడు. అంటే అతని ఆట ఎంతో మెరుగైందనే విషయం మాత్రం వాస్తవం. కుదేలైన కివీస్... రెండు సార్లు మ్యాచ్లో పది వికెట్లు, మూడు సార్లు ఇన్నింగ్సలో ఐదు వికెట్లు, కేవలం 17.77 సగటుతో 27 వికెట్లు... తాజాగా న్యూజిలాండ్తో సిరీస్లో అశ్విన్ అద్భుత గణాంకాలివి. కేవలం మూడు టెస్టుల్లో 27 వికెట్లతో అతను సత్తా చాటాడు. సుదీర్ఘ స్పెల్ల పాటు బౌలింగ్ చేయడం, కెప్టెన్ కోహ్లి ఆశించిన సమయంలో, కీలకమైన క్షణంలో వికెట్ తీసి మ్యాచ్ను మళ్లీ మన చేతుల్లోకి తీసుకు రావడం రొటీన్గా సాగిపోరుుంది. కాస్తరుునా మెరుగైన ప్రదర్శన ఇద్దామని భారత్లో అడుగు పెట్టిన న్యూజిలాండ్ను అశ్విన్ దారుణంగా దెబ్బ తీశాడు. మూడు టెస్టుల్లో కొన్ని సందర్భాల్లో కివీస్కు ఆధిపత్యం ప్రదర్శించే మంచి అవకాశాలు లభించినా అశ్విన్ వల్లే మన జట్టు కోలుకోగలిగింది. ఇండోర్ టెస్టు తొలి ఇన్నింగ్సలో అతని బౌలింగ్ జోరు చూస్తే పది వికెట్లు అతనికే దక్కుతాయేమోనని అనిపించింది. దిగ్గజ క్రికెటర్ సంగక్కర సొంతగడ్డపై వరుసగా నాలుగు సార్లు అశ్విన్కే అవుటైతే, ప్రస్తుతం ప్రపంచ టాప్ బ్యాట్స్మెన్లో ఒకడైన విలియమ్సన్ కూడా నాలుగు సార్లు తన వికెట్ అశ్విన్కే అప్పగించాడు. ఈ రెండింటికి మధ్య మరో టెస్టు స్టార్ హషీం ఆమ్లా కూడా అతని దెబ్బకే తలవంచాడు. 2013లో 0-4తో చిత్తుగా ఓడిన ఆసీస్, ఇప్పటికే అశ్విన్ బౌలింగ్ రుచి చూసింది. అంతకుముందు ఏడాది అశ్విన్ను సమర్థంగా ఎదుర్కోవడం వల్లే ఇంగ్లండ్ మన గడ్డపై సిరీస్ గెలవగలిగింది. ఇప్పుడు ఈ రెండు టీమ్లు మళ్లీ మన వద్దకు వస్తున్నారుు. ఈసారి ఏం జరుగుతుందో చూడాలి. సొంతగడ్డపై మరో 10 టెస్టులు వరుసగా ఆడనుండటంతో అశ్విన్ రికార్డుల బాక్స్లు బద్దలు చేయడం మాత్రం ఖాయం. ఘనతల గని... 7 అశ్విన్ కెరీర్లో (39 టెస్టులు) ఇది ఏడో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు. అతనికంటే ముందు ఇన్ని సిరీస్ అవార్డులు అందుకోవడానికి ఇమ్రాన్ఖాన్కు 70 టెస్టులు పట్టారుు. అశ్విన్ అరంగేట్రం తర్వాత భారత్ 8 టెస్టు సిరీస్లు గెలిస్తే 7సార్లు అశ్విన్ బెస్ట్ ప్లేయర్గా నిలవడం విశేషం. 4 వరుసగా అశ్విన్ నాలుగు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలుచుకున్నాడు. గతంలో ఇమ్రాన్, మార్షల్లు మాత్రం ఇలా అందుకున్నారు. 6 కుంబ్లే (8) తర్వాత అశ్వినే అత్యధికంగా ఆరు పర్యాయాలు మ్యాచ్లో పది వికెట్లు పడగొట్టాడు. 1 అశ్విన్ 39 టెస్టులోనే 220 వికెట్లను పడగొట్టాడు. ఇన్ని టెస్టుల తర్వాత ఎవరికీ ఇది సాధ్యం కాలేదు. 1 అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టిన తర్వాత అన్ని ఫార్మాట్లలో కలిపి 413 వికెట్లు తీశాడు. మరే ఇతర బౌలర్ ఇన్ని వికెట్లు తీయలేదు. -
బౌలర్లే లీడర్లు!
కోచ్ ఎవరైనా ఆటగాళ్లే ముఖ్యం నా పరిమితులు నాకు తెలుసు భారత కోచ్ అనిల్ కుంబ్లే బెంగళూరు: ఆటగాడిగా సుదీర్ఘ కెరీర్లో అనిల్ కుంబ్లే బౌలింగ్ బృందం మొత్తాన్ని ముందుండి నడిపించిన రోజులు ఉన్నాయి. తన బౌలింగ్ ముగించి మైదానంలో ఎక్కడో నిలబడిపోకుండా ఇతర బౌలర్లకు తగు సూచనలివ్వడంలో, వ్యూహాలు రూపొందించడంలో కూడా కుంబ్లే కీలకపాత్ర పోషించారు. ఇప్పుడు కోచ్గా కూడా అదే వాతావరణం కల్పించాలని ఆయన భావిస్తున్నారు. జట్టు బౌలర్లలో స్ఫూర్తి నింపి, మరింత బాధ్యతగా వ్యవహరించే విధంగా ప్రోత్సహిస్తానని కుంబ్లే చెప్పారు. భారత జట్టు ప్రధాన కోచ్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం బుధవారం తొలిసారి అనిల్ కుంబ్లే మీడియాతో మాట్లాడారు. రాబోయే ఏడాది కాలం పాటు కోచ్గా తన ఆలోచనలు, జట్టు సభ్యులు, సన్నాహాలకు సంబంధించి వివిధ అంశాలపై ఆయన మాట్లాడారు. విశేషాలు కుంబ్లే మాటల్లోనే... కోచ్గా ప్రాధాన్యతలు... ముందుగా నేను మా బౌలింగ్ విభాగంపై దృష్టి పెట్టదలిచాను. నా దృష్టిలో ప్రస్తుతం చాలా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడే చెప్పను. అయితే ప్రాథమికంగా బౌలర్లతో అన్ని విషయాలు చర్చించి వారి ఆలోచనలు తెలుసుకుంటాను. ఆ తర్వాతే జట్టు వ్యూహాలకు అవకాశం ఉంటుంది. అవసరమైతే పేస్ బౌలింగ్ కోచ్ను కూడా తీసుకొచ్చే ఆలోచన ఉంది. నేను బౌలింగ్ వేసే సమయంలో నన్ను నేను కెప్టెన్గా భావించుకునేవాడిని. అప్పుడే మరింత సమర్థంగా బౌలింగ్ చేయగలం. మా బౌల ర్లు కూడా నాయకులుగా ఎదగాలనేది నా ప్రయత్నం. కోచ్ పని మైదానం బయటే... మైదానంలో అన్ని నిర్ణయాలు కెప్టెన్వే ఉంటాయి. ఆటకు ముందు అవసరమైన వ్యూహరచన, సన్నాహాల్లో సహకరించడంలాంటివే కోచ్ చేయగలడు. మైదానంలో ఎదురయ్యే సవాళ్లకు అనుగుణంగా ఆటగాళ్లను సిద్ధం చేయడమే నా పని. వీటితో పాటు నా అనుభవం జట్టుకు ఉపయోగపడేలా చేస్తా. కోచ్, ఇతర సిబ్బంది ముందుకు రాకూడదు. ఆటగాళ్లే అందరికంటే ముఖ్యం. నేను ఆటగాడిగా కూడా ఉన్నాను కాబట్టి ఇప్పుడు కోచ్గా నా పరిమితులేమిటో బాగా తెలుసు. యువ ఆటగాళ్లలో స్ఫూర్తి... నన్ను కూడా కొన్నిసార్లు జట్టులోంచి తొలగించారు. కొన్ని పర్యటనలకు ఎంపిక చేయలేదు. కీలక ఆటగాడైన నన్నూ మ్యాచ్కు ఎంపిక చేయలేదు. ఇలాంటి సమయంలోనే ఆయా ఆటగాళ్లు స్థైర్యం కోల్పోకుండా చూడాలి. ఏం ఫరవాలేదని కోచ్ ధైర్యం చెప్పాల్సి ఉంటుంది. జట్టు వ్యూహాలు 11 మంది కోసమే కాదు మిగతావారినీ భాగం చేయాలి. ఈ ప్రయత్నంలో ఇబ్బంది లేకుండా వ్యవహరించగలనని నమ్ముతున్నా. ప్రస్తుత జట్టులో 25-26 ఏళ్ల వయసు గల ఆటగాళ్లు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో టెస్టులు ఆడారు. కాబట్టి ఇబ్బంది రాదు. ఆధునిక క్రికెట్ గురించీ తెలుసు... 2008లో నేను రిటైర్ అయిన తర్వాత భారత జట్టులో వచ్చిన ప్రధాన మార్పు ఏదైనా ఉందీ అంటే ఫీల్డింగే. ఇప్పుడు చాలా మెరుగైంది. ఫిట్నెస్ కూడా అద్భుతంగా ఉంది. ఇది మినహా నేనూ ఆటతో పాటు అప్డేట్ అవుతూ వచ్చాను. వివిధ అధికారిక హోదాలతో పాటు కొంత మందితో ఐపీఎల్లో కలిసి పని చేశాను. వారికి ఏం కావాలో, భవిష్యత్తు గురించి ఏం ఆలోచిస్తున్నారో నాకు బాగా తెలుసు. వారిని నేను బాగా అర్థం చేసుకోగలను. రాబోయే విండీస్ సిరీస్పై... గత వెస్టిండీస్ పర్యటనలో మనం గెలిచాం. కాబట్టి మనవాళ్లకు అక్కడ కొంత అనుభవం ఉందని చెప్పవచ్చు. అప్పుడు బాగా ఆడినవారిలో కొంత మంది ఈ జట్టులోనూ ఉన్నారు. నాకూ విండీస్ పిచ్లపై అవగాహన ఉంది. టెస్టుల్లో ఆ జట్టు గొప్పగా ఆడకపోయినా సొంతగడ్డపై బలమైనదే. అయితే సిరీస్ గెలుస్తామని నమ్మకముంది. కోహ్లి, ధోనిలు ఇద్దరితో కలిసి పని చేసేందుకు ఉత్సాహంగా ఉన్నా. జింబాబ్వే సిరీస్ తర్వాత ధోనితో కూడా మాట్లాడాను. పదవి శాశ్వతం కాదు... కోచ్ ఎంపిక వివాదం కావడం నాకిష్టం లేదు. నేను ఎంపిక కాగానే ముందుగా రవిశాస్త్రికే ఫోన్ చేశాను. ఆయనా నన్ను అభినందించారు. ఇన్నాళ్లూ శాస్త్రి చాలా బాగా పని చేశారు. కోచ్గా నేనేమీ శాశ్వతం కాదు. రేపు నా స్థానంలో మరొకరు రావచ్చు. నాకు అవకాశం వచ్చింది కాబట్టి ఏదైనా చేసి చూపించేందుకు ప్రయత్నిస్తా. భారత జట్టు బాగా ఆడాలని, గెలవాలనేదే అందరి లక్ష్యం. శిబిరం మొదలు... వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే భారత జట్టుకు బుధవారం బెంగళూరులో శిక్షణ శిబిరం ప్రారంభమైంది. తొలి రోజు వర్షం కారణంగా శిబిరం ఇండోర్ గ్రౌండ్కే పరిమితమైంది. టెస్టు జట్టుకు ఎంపికైన ఆటగాళ్లందరూ దీనికి హాజరయ్యారు. విండీస్ పర్యటనలో భాగంగా భారత జట్టు నాలుగు టెస్టు మ్యాచ్లు ఆడుతుంది. -
‘కత్తి’లాంటోడు..!
ఏడాది క్రితం అతని పేరు కూడా ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు... క్రికెట్ ప్రపంచం అంతా అతడిని కీర్తిస్తోంది. ప్రత్యర్థి క్రికెటర్లు కొన్ని వందలసార్లు అతని బౌలింగ్ వీడియోలు చూస్తున్నారు. కానీ మైదానంలోకి దిగాక ఎవరికీ కొరుకుడు పడని బంతులు వేస్తున్నాడు. ఈ సీజన్ ఐపీఎల్లో పరుగుల వరద పారిస్తున్న విరాట్ కోహ్లి కూడా అతని ధాటికి వెంటనే పెవిలియన్కు చేరాడు. ఆ సంచలనం పేరు ముస్తాఫిజుర్ రెహమాన్. బంగ్లాదేశ్కు చెందిన 20 ఏళ్ల ఈ యువ బౌలర్ ఇప్పుడు ఐపీఎల్ ద్వారా మరింత ప్రకంపనలు పుట్టిస్తున్నాడు. నిలకడగా బౌలింగ్ చేస్తూ సన్రైజర్స్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. సాక్షి క్రీడావిభాగం: గత జూన్లో భారత్తో వన్డే ద్వారా ముస్తాఫిజుర్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్లోనే తన ఆఫ్ కట్టర్స్తో బెంబేలెత్తించి ఐదు వికెట్లు తీసుకున్నాడు. ఆ షాక్ నుంచి ధోనిసేన కోలుకునేలోగానే రెండో వన్డేలో ఆరు వికెట్లతో చెలరేగిపోయాడు. దీంతో తొలిసారి భారత్పై బంగ్లాదేశ్ వన్డే సిరీస్ గెలిచింది. దీంతో బంగ్లాదేశ్లో ముస్తాఫిజుర్ హీరోగా మారిపోయాడు. అయితే ఇలాంటి బౌలర్లు గతంలో చాలామంది వచ్చారని, ముస్తాఫిజుర్ కూడా ఈ సంచలనాలు ఎక్కువ కాలం కొనసాగించలేడనే వాదన కూడా వినిపించింది. అయితే ఏడాది గడిచినా ప్రపంచంలోని టాప్ క్లాస్ బ్యాట్స్మెన్ కూడా ఇప్పటికీ అతని ఆఫ్ కట్టర్స్ను అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ ఏడాది కాలంలో మొత్తం 24 అంతర్జాతీయ మ్యాచ్ల్లో అతను 52 వికెట్లు తీసుకున్నాడు. గత ఏడాది కాలంలో బంగ్లాదేశ్ సంచలన విజయాల్లో ముస్తాఫిజుర్దీ కీలకపాత్ర. చౌకగానే సన్రైజర్స్కు... ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో ముస్తాఫిజుర్ను సన్రైజర్స్ జట్టు రూ.1.4 కోట్లు పెట్టి కొనుక్కుంది. నిజానికి అతని నైపుణ్యానికి ఇంతకంటే ఎక్కువ రేటు రావాల్సింది. కానీ ముస్తాఫిజుర్ ఇంకా ఈ స్థాయిలో రాణిస్తాడని ఏ జట్టూ ఊహించలేదు. ‘తన ఆఫ్ కట్టర్స్ను ఇంకా చాలామంది బ్యాట్స్మెన్ అర్థం చేసుకోలేదు. కాబట్టి కచ్చితంగా అతను మా బలమవుతాడు’ అని సన్రైజర్స్ మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ వేలం సమయంలో అభిప్రాయపడ్డారు. ఒక రకంగా తను చౌకగానే ఈ జట్టుకు దొరికాడు. అయితే బౌల్ట్ లాంటి ప్రపంచ స్థాయి బౌలర్తో పాటు ఆశిష్ నెహ్రా, బరీందర్ శరణ్లాంటి భారత ఎడమచేతి వాటం బౌలర్లు ఉన్నందున తుది జట్టులో ముస్తాఫిజుర్కు చోటు దక్కుతుందని అతను కూడా అనుకోలేదట. కానీ అనూహ్యంగా తొలి మ్యాచ్లోనే తుది జట్టులోకి వచ్చాడు. ఐపీఎల్లో జోరు... సీజన్ తొలి మ్యాచ్లో బెంగళూరుతో మ్యాచ్లో సన్ బౌలర్లు 227 పరుగులు ఇచ్చారు. అయితే ముస్తాఫిజుర్ మాత్రం తన నాలుగు ఓవర్లలో కేవలం 26 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. ప్రతి మ్యాచ్లోనూ నిలకడగా బంతులు వేస్తున్న అతను పంజాబ్పై నాలుగు ఓవర్లలో కేవలం 9 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. ప్రతి మ్యాచ్లోనూ వికెట్లు అవసరమైన సమయంలో... స్లాగ్ ఓవర్లలో కెప్టెన్ వార్నర్ బంతి ముస్తాఫిజుర్కు ఇస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకూ 9 మ్యాచ్లు ఆడిన ఫిజ్... 13 వికెట్లు తీసుకున్నాడు. సన్రైజర్స్ బౌలర్లలో అందరికంటే పొదుపుగా (6.15 ఎకానమీ) బౌలింగ్ చేశాడు. సుదీర్ఘకాలం ఉంటాడా? ఏడాది అంతర్జాతీయ క్రికెట్ అనుభవంలోనే ముస్తాఫిజుర్ రెండుసార్లు గాయాల బారిన పడ్డాడు. ఏ ఫాస్ట్ బౌలర్కైనా గాయాలు సహజం. ముస్తాఫిజుర్కు కూడా ఇప్పుడు తనని తాను గాయాల నుంచి కాపాడుకోవడమే కీలకం. చాలామంది బౌలర్లు గతంలో రెండు మూడేళ్లు సంచలన బౌలర్లుగా ప్రభావం చూపినా ఆ తర్వాత కనుమరుగయ్యారు. కారణం ప్రత్యర్థులు వారి బౌలింగ్ను పూర్తిగా అర్థం చేసుకోవడం. ఏ బౌలర్ అయినా ఎప్పటికప్పుడు మెరుగైతేనే సుదీర్ఘకాలం మనగలుగుతాడు. ముస్తాఫిజుర్లో ఈ నైపుణ్యం ఉందని సన్రైజర్స్ బౌలింగ్ మెంటార్ మురళీధరన్ అభిప్రాయపడుతున్నారు. ‘సరైన గెడైన్స్తో ప్రణాళికతో వెళితే ముస్తాఫిజుర్ సుదీర్ఘకాలం అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతాడు’ అని ఆయన అన్నారు. భవిష్యత్ సంగతి ఎలా ఉన్నా ఈ సీజన్ ఐపీఎల్లో చివరి వరకూ ఇదే నిలకడ కనబరచి సన్రైజర్స్ను చాంపియన్గా నిలపాలని ఆశిద్దాం. స్ఫూర్తిదాయక నేపథ్యం బంగ్లాదేశ్లోని సత్కిరా అనే పట్టణానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారుమూల పల్లెటూరు టెటూలియా ముస్తాఫిజుర్ స్వస్థలం. చిన్నప్పుడు తన ముగ్గురు అన్నలతో కలిసి సరదాగా టెన్నిస్ బాల్తో క్రికెట్ ఆడేవాడు. 12 ఏళ్ల వయసులో తనలో క్రికెట్ టాలెంట్ను గుర్తించిన అతని తండ్రి అబుల్ ఖాసీం ఘాజీ సత్కిరా పట్టణానికి శిక్షణ కోసం పంపించారు. దీనికోసం తన అన్న వెనుక బండి మీద కూర్చుని రోజూ 40 కిలోమీటర్లు వెళ్లి ప్రాక్టీస్ చేసేవాడు. దీంతో చదువు అటకెక్కింది. అయినా తనలో నైపుణ్యం ఉందని కోచ్లు చెప్పడంతో 2012లో ఢాకా వచ్చాడు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పేస్ బౌలింగ్ ఫౌండేషన్కు ఎంపికయ్యాడు. రెండేళ్లలోనే (2014) అండర్-19 ప్రపంచకప్కు ఎంపికయ్యాడు. 2014లో దేశవాళీ క్రికెట్లో నిలకడ, 2015 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో ఢాకా డైనమైట్స్ తరఫున 10 మ్యాచ్ల్లో 14 వికెట్లు తీయడంతో జాతీయ జట్టులో అవకాశం లభించింది. సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ముస్తాఫిజుర్ అంచెలంచెలుగా ఎదిగిన వైనం బంగ్లాదేశ్లోని ఎందరో యువ క్రికెటర్లకు స్ఫూర్తి. ప్రస్తుతం బంగ్లాదేశ్లో ముస్తాఫిజుర్కు క్రేజ్ బాగా పెరిగింది. రోజూ వందల సంఖ్యలో లవ్లెటర్స్ వస్తున్నాయట. డిమాండ్ పెరిగింది...ప్రస్తుతం టి20 క్రికెట్లో సునీల్ నరైన్ తర్వాత అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసిన రికార్డు ముస్తాఫిజుర్ది. ఇప్పటికే అతను అనేక ఘనతలు సొంతం చే సుకున్నాడు. షకీబ్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో సంచలనంగా మారిన ముస్తాఫిజుర్ తమ లీగ్లలో ఆడాలని అన్ని దేశాలూ కోరుకుంటున్నాయి. పాకిస్తాన్ సూపర్ లీగ్లో లాహోర్ అతణ్ని తీసుకుంది. కానీ గాయం కారణంగా ఈ లీగ్లో అతను ఆడలేదు. ఐపీఎల్ తర్వాత ఇంగ్లండ్ కౌంటీల్లో ససెక్స్ తరఫున ఆడబోతున్నాడు. ఆస్ట్రేలియా బిగ్బాష్ లీగ్ జట్లు కూడా ముస్తఫిజుర్తో చర్చలు జరుపుతున్నాయి. ఒకరకంగా ప్రస్తుతం అతను ప్రపంచ క్రికెట్లో హాట్ పేస్ బౌలర్. -
చిక్కుల్లో బౌలర్ ముస్తాఫిజుర్
హైదరాబాద్: సత్ఖీరా పట్టణం.. బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉండే అదే పేరున్న జిల్లా కేంద్రం. అక్కడ పేదవాళ్లుండే కాలనీలో ఓ చిరు ఉద్యోగి తన భార్య, ఆరుగురు సంతానంతో నివసించాడు. అతనికి క్రికెట్ అంటే పిచ్చి. అతని చిన్నకొడుక్కైతే ప్రాణం. ఇద్దరూ క్రికెట్ నే ప్రేమించారు. ఆరాధించారు. నాన్నను ఇంప్రెస్ చెయ్యటంకోసం.. వికెట్లంత ఎత్తు పెరగకముందే బౌలింగ్ మొదలుపెట్టాడా బుడ్డోడు. పెరిగి.. 5అడుగుల 11 అంగులాల ఎత్తయ్యాడు. పేరు ముస్తాఫిజుర్ రహమాన్. క్రికెట్ మోజులోపడి అతను చదువును నిర్లక్ష్యం చేశాడు. అదే ఇప్పుడతన్ని గొప్ప చిక్కుల్లో పడేసింది. ఎన్నో అడ్డంకుల్ని ఎదుర్కొని బౌలర్ గా మంచిపేరు తెచ్చుకున్నాడు ముస్తాఫిజుర్. అరంగేట్రం చేసిన టెస్ట్, వన్ డే మ్యాచ్ ల్లో 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును గెలుచుకున్న మొట్టమొదటి క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. 2015 నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడుతోన్న ముస్తాఫిజులు ఈ ఏడాది ప్రారంభంలో గాయాలపాలై కొన్నిరోజులు ఆటకు దూరమయ్యాడు. మళ్లీ ఐపీఎల్ వేదికగా చెలరేగిపోతున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫన ఆడుతోన్న ముస్తాఫిజుర్ ఇప్పుడో గొప్ప చిక్కుల్లో పడ్డాడు. ఇన్నాళ్లంటే బంగ్లాదేశీ జట్టే కాబట్టి బెంగాలీలో మాట్లాడేవాడు. ఇప్పుడు.. కలగూరగంపలా దేశానికొకరుచొప్పున, ప్రాంతానికి ఇద్దరు చొప్పున కలిసి జట్టుగా ఏర్పడే ఐపీఎల్ లో ఆడుతున్న ముస్తాఫిజుర్ తీవ్రమైన భాషా సమస్యను ఎదుర్కొంటున్నాడు. చిన్నప్పటి నుంచి క్రికెట్ లో పడిపోయి చదువును అలక్ష్యంచేసిన అతనికి అంతర్జాతీయ భాష ఇంగ్లీష్ పదిముక్కలైనా రాదు. దీంతో సహచరులతో ఐడియాలు పంచుకోవాలన్నా, ప్రెజెంటేషన్ సెర్మనీల్లో మాట్లాడాలన్నా వెనకడుగు వేస్తున్నాడు. ఇదే విషయాన్ని శనివారం పంజాబ్ తో జరిగిన మ్యాచ్ అనంతరం హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ చెప్పాడు. ముస్తాఫిజుర్ బౌలింగ్ ఇరగదీస్థాడు కానీ భాషే అతని సమస్య అని చెప్పుకొచ్చాడు. అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఆసియా ఆటగాళ్లు భాషా సమస్యను ఎదుర్కోవడం సహజమే. వీరేంద్ర సెహవాగ్, భజ్జీ, చాలా మంది పాకిస్థాన్ ఆటగాళ్లు ఇలాంటి ఇబ్బందులు పడ్డవారే. క్రమంగా ఇంగ్లీష్ పై పట్టుపెంచుకుని, అనర్గళంగా మాట్లాడటమేకాక, కామెంటేటర్లుగానూ మారారు అందులో కొందరు. సో.. ముస్తాఫిజుర్.. నీక్కూడా ఆల్ ది బెస్ట్. స్పీక్ వెల్.. -
కాలితో బౌలింగ్...భుజంతో బ్యాటింగ్
కశ్మీర్: ఈ సమాజంలో చేతులు లేని వాళ్లు కాళ్లతో తమ పనులు తాము చేసుకోవడం, బలపం పట్టి దిద్దడం, పెన్ను పట్టి రాయడం, చదువులో ఫస్ట్ రావడం మనం చూశాం. చూస్తున్నాం. 26 ఏళ్ల అమీర్ హుస్సేన్ లోన్ వారందరికన్నా ముందున్నారు. రెండు చేతులు భుజాల వరకు లేకున్నా క్రికెట్లో బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. కుడికాలు పెకైత్తి ఎంచక్కా బౌలింగ్ వేస్తారు. భుజానికి, గదమకు మధ్య క్రికెట్ బ్యాట్ పట్టుకొని బ్యాటింగ్ చేస్తారు. ఆ బ్యాట్ను అలాగే పట్టుకొని పరుగులు తీస్తారు. హుస్సేన్ ఎవరి సాయం లేకుండా తన పనులను తానే చేసుకుంటారు. స్నానం చేసి బట్టలు వేసుకోవడం దగ్గరి నుంచి గడ్డం గీసుకోవడం, కాలేజీకెళ్లి చదువుకోవడం. కాలుతో పెన్ను రాయడం లాంటి పనులు తేలిగ్గా చేసుకుంటారు. హుస్సేన్ ఎనిమిదేళ్ల వయస్సులో తన తండ్రి కట్టెల కోత మిషన్లో పని చేస్తుండగా ప్రమాదవశాత్తు రెండు చేతులు తెగిపోయాయి. మిగిలిన చేతుల భాగాలను శస్త్ర చికిత్సలో తీసివేయాల్సి వచ్చింది. ట్రీట్మెంట్కు ఎంతో ఖర్చయింది. ఆ ఖర్చును భరించేందుకు ఆయన తండ్రి తమకున్న పొలాన్ని అమ్మేయాల్సి వచ్చింది. భుజాల వరకు రెండు చేతులు లేకుండా మనుగడ సాగించడం హుస్సేన్కు మొదట్లో కష్టమైంది. చదువుకోవడానికి స్కూల్కు వెళితే ‘నీవు చదువుకు పనికి రావు’ అంటూ స్కూల్ నుంచి వెళ్లగొట్టారు. అయినా అందరితోపాటు తాను చదవగలను, రాయగలనని అనతికాలంలోనే కాశ్మీర్కు చెందిన ఈ హుస్సేన్ నిరూపించి పాఠశాలలో చేరారు. ప్రస్తుతం కాశ్మీర్ పారా క్రికెట్ అసోసియేషన్లో సభ్యుడయ్యారు. తన ఆట తీరుతో అభిమానులను కూడా సంపాదించుకున్నారు. బలమైన సంకల్పం, ఎంతటి అకుంఠిత దీక్ష ఉంటే తప్పా ఇది సాధ్యమయ్యే పని కాదు. ఈ విషయం మానవ స్ఫూర్తికే స్ఫూర్తిగా నిలుస్తున్న హుస్సేన్ వీడియోను ప్రత్యక్షంగా చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. -
ఫంగిసో బౌలింగ్ శైలిపై ఫిర్యాదు
జొహన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఆరోన్ ఫంగిసో బౌలింగ్ శైలి సందేహాస్పదంగా ఉందని తేలింది. దేశవాళీ వన్డే టోర్నీలో తను హైవెల్డ్ లయన్స్ తరఫున ఆడుతున్నాడు. బుధవారం జరిగిన మ్యాచ్లో 32 ఏళ్ల ఫంగిసో రెండు వికెట్లు తీసి తన జట్టు సెమీస్ చేరడంలో సహాయపడ్డాడు. అయితే ఫంగిసో బౌలింగ్ శైలిపై ఫిర్యాదు అందిందని క్రికెట్ దక్షిణాఫ్రికా పేర్కొంది. 16 వన్డేలు, తొమ్మిది టి20లు ఆడిన ఫంగిసో నేడు (శుక్రవారం) ఐసీసీ గుర్తింపు పొందిన హై పెర్ఫార్మెన్స్ అకాడమీలో బౌలింగ్ పరీక్షకు హాజరుకానున్నాడు. అయితే ఈ ఫలితం వచ్చేదాకా తను మ్యాచ్లు ఆడే అవకాశం ఉంది. టి20 ప్రపంచకప్లో ఆడే దక్షిణాఫ్రికా జట్టులో ఫంగిసో సభ్యుడు. -
బౌలర్లను భారత్ రక్షించుకోవాలి: అక్రమ్
ఎక్కువ మంది కోచ్లతో పని చేయడం వల్ల భారత బౌలర్లు నష్టపోతున్నారని పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ అభిప్రాయపడ్డారు. ‘ పలువురి కోచ్ల సలహాలతో బౌలర్లకు నష్టం జరుగుతుంది. ఇర్ఫాన్ ఇలాగే కెరీర్ను నాశనం చేసుకున్నాడు. చాలామంది ఆరంభంలో 140 కి.మీ.పైచిలుకు వేగంతో బౌలింగ్ చేస్తున్నారు. కానీ తర్వాత కోచ్ల వల్ల వేగం తగ్గిపోతోంది. బీసీసీఐ దృష్టిపెట్టి బౌలర్లందరికీ ఒకే కోచ్ ఉండేలా చర్యలు తీసుకుంటే మంచిది’ అని అక్రమ్ చెప్పారు. -
దక్షిణాఫ్రికా భారీ విజయం
హడలెత్తించిన రబడ సెంచూరియన్: రెండో ఇన్నింగ్స్లోనూ పేసర్ కగిసో రబడ (6/32) సంచలన బౌలింగ్ చేయడంతో ఇంగ్లండ్తో మంగళవారం ముగిసిన ఆఖరిదైన నాలుగో టెస్టులో దక్షిణాఫ్రికా జట్టు 280 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో నాలుగు మ్యాచ్ల సిరీస్లో కుక్ సేన ఆధిక్యం 2-1కి తగ్గింది. 382 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 34.4 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. సఫారీల గడ్డపై ఇంగ్లం డ్కు ఇది రెండో అత్యల్ప స్కోరు. మ్యాచ్లో రబడకు 13 వికెట్లు దక్కాయి. దీంతో దక్షిణాఫ్రికా తరఫున ఒకే టెస్టులో అత్యధికంగా 13 వికెట్లు తీసిన మూడో బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. దక్షిణాఫ్రికా గడ్డపై 11 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ సిరీస్ (2-1)ను గెలవడం విశేషం. రబడకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’; స్టోక్స్కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. -
ఇర్ఫాన్ పఠాన్ ఆల్రౌండ్ ప్రదర్శన
గోవాపై బరోడా ఘనవిజయం ముస్తాక్ అలీ టి20 టోర్నీ వడోదర: ఇర్ఫాన్ పఠాన్ బ్యాటింగ్, బౌలింగ్లో చెలరేగడంతో ముస్తాక్ అలీ టి20 టోర్నీ గ్రూప్ ‘సి’ మ్యాచ్లో బరోడా 72 పరుగుల తేడాతో గోవాను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన బరోడా 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఇర్ఫాన్ పఠాన్ (29 బంతుల్లో 49 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడుకు తోడు కేదార్ దేవధర్ (31 బంతుల్లో 39; 4 ఫోర్లు, 1 సిక్స్), హార్దిక్ పాండ్యా (34 బంతుల్లో 38 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నారు. అనంతరం గోవా 15.4 ఓవర్లలో 82 పరుగులకే ఆలౌటైంది. దీప్రాజ్ గావ్కర్ (42 బంతుల్లో 48; 7 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. రిషి అరోథే, హార్దిక్ పాండ్యా, ఇర్ఫాన్ పఠాన్ తలా 2 వికెట్లు తీశారు. అస్సాం 44 ఆలౌట్ ఇక్కడే జరిగిన మరో గ్రూప్ ‘సి’ మ్యాచ్లో ఢిల్లీ 8 వికెట్లతో అస్సాంను చిత్తు చేసింది. ముందుగా అస్సాం 12.1 ఓవర్లలో 44 పరుగులకే కుప్పకూలింది. ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మీడియం పేసర్ సుబోథ్ భాటి (4/9) బౌలింగ్లో చెలరేగగా, శివమ్ శర్మ 3, సాంగ్వాన్ 2 వికెట్లు తీశారు. అనంతరం ఢిల్లీ 9.1 ఓవర్లలో 2 వికెట్లకు 50 పరుగులు చేసింది. ఉన్ముక్త్ చంద్ (28 బంతుల్లో 29 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించాడు. హైదరాబాద్ విజయం నాగపూర్: గ్రూప్ ‘ఎ’ మ్యాచ్లో హైదరాబాద్ 35 పరుగులతో హరియాణాను ఓడించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. విహారి (28 బంతుల్లో 44; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), అక్షత్ రెడ్డి (30 బంతుల్లో 43; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడగా, తొలి మ్యాచ్ ఆడుతున్న ఎ.ఆకాశ్ (18 బంతుల్లో 25; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఆ తర్వాత హరియాణా 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులు మాత్రమే చేయగలిగింది. నితిన్ సైని (25 బంతుల్లో 30; 5 ఫోర్లు) టాప్స్కోరర్. కెప్టెన్ సెహ్వాగ్ (9) విఫలమయ్యాడు. విహారి, సిరాజ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. -
శామ్యూల్స్ బౌలింగ్పై ఏడాది నిషేధం
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్ ఆల్రౌండర్ మార్లన్ శామ్యూల్స్ బౌలింగ్ శైలి రెండోసారి కూడా సందేహాస్పదంగా తేలింది. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో అతడి బౌలింగ్పై ఏడాది పాటు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిషేధం విధించింది. డిసెంబర్ 2013లో తొలిసారిగా శామ్యూల్ బౌలింగ్పై వివాదం రేగింది. అక్టోబర్లో శ్రీలంకతో జరిగిన టెస్టులోనూ అతను నిబంధనలకు వ్యతిరేకంగా బౌలింగ్ చేసినట్టు ఫిర్యాదు అందగా విచారణలో తన మోచేయి 15 డిగ్రీల పరిమితికి మించి వంచుతున్నట్టుగా తేలింది. ఈ ఏడాది ఐసీసీ నిషేధం ఎదుర్కొన్న మూడో బౌలర్గా శామ్యూల్స్ నిలిచాడు. సునీల్ నరైన్ (వెస్టిండీస్), మొహమ్మద్ హఫీజ్ (పాకిస్తాన్)పై కూడా ఐసీసీ వేటు వేసింది. -
ధావన్ బౌలింగ్ శైలి సందేహాస్పదం
దుబాయ్: దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టెస్టులో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ బౌలింగ్ శైలి సందేహాస్పదంగా ఉందని మ్యాచ్ అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన నివేదికను భారత టీమ్ మేనేజ్మెంట్కు అందజేశారు. ధావన్ ఆఫ్ స్పిన్ బంతులను వేసేటప్పుడు మోచేతిని నిబంధనల కంటే ఎక్కువగా వంచుతున్నాడని అంపైర్లు తేల్చారు. దీంతో 14 రోజుల్లోగా ధావన్ బౌలింగ్ పరీక్షకు హాజరు కావాలని ఐసీసీ సూచించింది. ఈ సమయంలో అంతర్జాతీయ క్రికెట్లో బౌలింగ్ చేసుకోవచ్చని వెల్లడించింది. ఢిల్లీ టెస్టులో కేవలం మూడు ఓవర్లు వేసిన ధావన్.. 9 పరుగులిచ్చాడు. -
నా ఆటతోనే నిరూపిస్తా
పునరాగమనంపై ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్య న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం ఎప్పుడనేది తన ప్రదర్శనే చెబుతుందని భారత ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. దీని గురించి తాను మాట్లాడటం కంటే ప్రదర్శనపై ఎక్కువగా దృష్టిపెట్టానని చెప్పాడు. ‘పునరాగమనం గురించి ఎక్కువగా మాట్లాడి నా దృష్టిని మరల్చుకోలేను. ప్రస్తుతానికి బరోడా తరఫున నా సత్తా మేరకు రాణించాలని భావిస్తున్నా. జట్టుకు అవసరమైనప్పుడు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్, బౌలింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నా. అలాగే నా అనుభవాన్ని జట్టు సభ్యులతో పంచుకుంటా. నా ప్రదర్శనే అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చే అంశాన్ని చెబుతుంది’ అని పఠాన్ పేర్కొన్నాడు. 2012లో భారత్ తరఫున చివరి వన్డే ఆడిన ఇర్ఫాన్ చాలా కాలం తర్వాత మళ్లీ రంజీల్లో బరిలోకి దిగాడు. గతవారం పంజాబ్తో జరిగిన మ్యాచ్లో 58 పరుగులు చేయడంతోపాటు 6 వికెట్లూ తీసి జట్టును గెలిపించాడు. అయితే ఇప్పుడు ఆల్రౌండర్ పాత్రపై ఎక్కువగా దృష్టిపెట్టానని చెప్పాడు. ఇందుకోసం ఎక్కువ మ్యాచ్లు ఆడితే బాగా మెరుగుపడొచ్చన్నాడు. క్రీడాకారుడి జీవితంలో గాయాలు చాలా సాధారణం కాబట్టి వాటి గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నాడు. కోహ్లి కెప్టెన్సీ భిన్నం గంగూలీ, ద్రవిడ్, ధోనిల నాయకత్వంతో పోలిస్తే కోహ్లి కెప్టెన్సీ భిన్నంగా ఉందని ఇర్ఫాన్ అన్నాడు. ప్రస్తుత టెస్టు జట్టుకు ఇది మంచి చేస్తుందన్నాడు. ‘ప్రతి కెప్టెన్ పనితీరు భిన్నంగా ఉంటుంది. నేను ఆడిన కెప్టెన్లందరూ భిన్నమైన వైఖరి కలిగి ఉన్నవారే. కెప్టెన్కు తగ్గట్టుగానే జట్టు స్పందన కూడా ఉండేది. ఓవరాల్గా జట్టును నడిపించడం మొత్తం నాయకుడిపైనే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడైతే విరాట్ టీమ్ను బాగా నడిపిస్తున్నాడు. లంకపై, దక్షిణాఫ్రికాపై అద్భుతంగా గెలిపించాడు. అతని కెప్టెన్సీని ఆస్వాదిస్తున్నా. భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా’ అని ఈ బరోడా పేసర్ వ్యాఖ్యానించాడు. -
నరైన్ బౌలింగ్ సందేహాస్పదం
వెస్టిండీస్ స్టార్ స్పిన్నర్ సునీల్ నరైన్ బౌలింగ్ శైలి సందేహాస్పదంగా ఉందని ఐసీసీ ప్రకటించింది. శ్రీలంకతో పల్లెకెలెలో జరిగిన వన్డే తర్వాత అంపైర్లు ఫిర్యాదు చేయడంతో 14 రోజుల్లోగా పరీక్షకు హాజరు కావాలని ఆదేశించింది. ఐపీఎల్, చాంపియన్స్ లీగ్ సందర్భంగా నరైన్ శైలి సందేహాస్పదంగా ఉందని గతంలో తేల్చినా... ఐసీసీ నరైన్ విషయంలో తొలిసారి పరీక్షకు ఆదేశించింది. ఫలితం వచ్చేవరకూ అతను వెస్టిండీస్ తరఫున ఆడొచ్చని ఐసీసీ తెలిపింది. -
కోహ్లి నమ్మకాన్ని నిలబెట్టుకుంటా
భారత పేసర్ ఆరోన్ వ్యాఖ్య న్యూఢిల్లీ: కెప్టెన్ విరాట్ కోహ్లికి తనపై ఎంతో నమ్మకముందని, దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ద్వారా దానిని నిలబెట్టుకుంటానని భారత పేసర్ వరుణ్ ఆరోన్ వ్యాఖ్యానించాడు. శ్రీలంకలో ఒక్క టెస్టు మాత్రమే ఆడిన ఆరోన్... ప్రస్తుతం ఇషాంత్ అందుబాటులో లేనందున మొహాలీలో తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. ‘కోహ్లికి నాపైనే కాదు. జట్టులో అందరిపై నమ్మకం ఉంది. ఇది జట్టులోని ఆటగాళ్ల స్థైర్యాన్ని పెంచుతుంది. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే అవకాశం ఈ సిరీస్లో లభిస్తుందని భావిస్తున్నా’ అని ఆరోన్ అన్నాడు. దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్కు బౌలింగ్ చేయడమనే గొప్ప సవాల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పాడు. గతంతో పోలిస్తే ఇప్పడు తన ఫిట్నెస్ బాగా మెరుగుపడిందని, గాయాల బారిన పడకుండా ఎలా బౌలింగ్ చేయాలో తెలుసుకున్నానని ఆరోన్ తెలిపాడు. -
పాకిస్తాన్ను గెలిపించిన వసీం
హరారే: లెఫ్టార్మ్ స్పిన్నర్ ఇమాద్ వసీం (4/11) అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో జింబాబ్వేతో తొలి టి20లో పాకిస్తాన్ గట్టిక్కెంది. ఆదివారం ఇక్కడ జరిగిన ఈ మ్యాచ్లో పాక్ 13 పరుగుల తేడాతో జింబాబ్వేపై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన పాక్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 136 పరుగులు చేసింది. షోయబ్ మాలిక్ (24 బంతుల్లో 35; 2 ఫోర్లు, 1 సిక్స్), రిజ్వాన్ (32 బంతుల్లో 33 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) రాణించారు. చిబాబాకు 3 వికెట్లు దక్కాయి. అనంతరం జింబాబ్వే 20 ఓవర్లలో 9 వికెట్లకు 123 పరుగులు మాత్రమే చేయగలిగింది. చిగుంబురా (28 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇరు జట్ల మధ్య రెండో టి20 మంగళవారం ఇదే మైదానంలో జరుగుతుంది. -
బంగ్లా ‘ఎ’పై కర్ణాటక విజయం
మైసూరు: లెఫ్టార్మ్ స్పిన్నర్ జగదీష సుచిత్ (6/60) అద్భుత బౌలింగ్తో బంగ్లాదేశ్ ‘ఎ’ జట్టుతో జరిగిన మూడు రోజుల మ్యాచ్లో కర్ణాటక నాలుగు వికెట్ల తేడాతో నెగ్గింది. చివరి రోజు గురువారం బంగ్లా తమ రెండో ఇన్నింగ్స్లో 76 ఓవర్లలో 309 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అనముల్ హక్ (89), షువగత హోమ్ (50 నాటౌట్), నాసిర్ హొస్సేన్ (44) మాత్రమే రాణించారు. అనంతరం 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కర్ణాటక రెండో ఇన్నింగ్స్లో 40.5 ఓవర్లలో ఆరు వికెట్లకు 185 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ సీఎం గౌతమ్ (35 బంతుల్లో 49), శ్రేయాస్ గోపాల్ (40 నాటౌట్) వేగంగా ఆడారు. అల్ అమిన్కు రెండు వికెట్లు దక్కాయి. అంతకుముందు బంగ్లా తమ తొలి ఇన్నింగ్స్లో 138 పరుగులు చేయగా.. కర్ణాటక 287 పరుగులు చేసింది. -
కౌశల్ బౌలింగ్ సందేహాస్పదం!
కొలంబో: భారత్తో జరిగిన మూడో టెస్టులో శ్రీలంక ఆఫ్ స్పిన్నర్ తరిందు కౌశల్ బౌలింగ్ శైలి సందేహాస్పదంగా ఉందని మ్యాచ్ అధికారులు గుర్తించారు. ఈ మేరకు దీనికి సంబంధించిన నివేదికను లంక మేనేజ్మెంట్కు అందజేశారని ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. ‘కౌశల్ బౌలింగ్ శైలిని పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఐసీసీ నిబంధనలకు లోబడి అతను బౌలింగ్ చేయడం లేదు. కాబట్టి 14 రోజుల్లో అతని శైలిని సరి చేసుకోవాలి. అయితే పరీక్ష ఫలితాలు వచ్చే వరకు అంతర్జాతీయ మ్యాచ్ల్లో బౌలింగ్ చేయొచ్చు’ అని ఐసీసీ పేర్కొంది. బౌలింగ్ శైలిని సరిదిద్దుకోవడానికి కౌశల్ త్వరలోనే చెన్నైకి రానున్నాడు. -
కుప్పకూలిన పాకిస్తాన్
కొలంబో: శ్రీలంక ఆఫ్ స్పిన్నర్ తరిందు కౌశల్ (5/42) కట్టుదిట్టమైన బౌలింగ్తో రెండో టెస్టులో పాకిస్తాన్ను కుప్పకూల్చాడు. కెరీర్లో రెండో టెస్టు ఆడుతున్న ఈ బౌలర్ ధాటికి.... గురువారం తొలి రోజు పాక్ 42.5 ఓవర్లలో కేవలం 138 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఓపెనర్ మొహమ్మద్ హఫీజ్ (75 బంతుల్లో 42; 5 ఫోర్లు) ఒక్కడే రాణించాడు. లంచ్ విరామం అనంతరం 49 పరుగుల వ్యవధిలోనే పాక్ చివరి ఏడు వికెట్లు కోల్పోయింది. దమ్మిక ప్రసాద్కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం తమ తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన లంక రోజు ముగిసే సమయానికి 32 ఓవర్లలో వికెట్ నష్టానికి 70 పరుగులు చేసింది. క్రీజులో కౌశల్ సిల్వ (21 బ్యాటింగ్; 3 ఫోర్లు), సంగక్కర (36 బంతుల్లో 18 బ్యాటింగ్; 1 ఫోర్) ఉన్నారు. -
భారత్ ఆటతీరుతో సంతృప్తి: ధోని
‘ఈ మ్యాచ్లో జడేజా, అశ్విన్ ఇద్దరితో పదేసి ఓవర్ల పూర్తి కోటా బౌలింగ్ చేయించాలని భావించా. ఐదుగురు బౌలర్లతో ఆడాలనేది కూడా మా వ్యూహం. అందుకే రైనాను ఉపయోగించుకోవాల్సి వచ్చింది. మొత్తంగా మన బ్యాటింగ్, బౌలింగ్ సంతృప్తినిచ్చాయి. నాకు వార్మప్ మ్యాచ్లపై సదభిప్రాయం లేదు. కాబట్టి నా బ్యాటింగ్ గురించి ఆందోళన అనవసరం. పాక్తో మ్యాచ్లో అప్పటి పరిస్థితులు, పిచ్ను బట్టే ఏ బౌలర్లను ఎంచుకోవాలో నిర్ణయిస్తాం.’ -
ఓజా బౌలింగ్పై నిషేధం
ముంబై: భారత క్రికెటర్, హైదరాబాద్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా బౌలింగ్పై బీసీసీఐ నిషేధం విధించింది. అనుమానాస్పద బౌలింగ్ శైలి కారణంగా అతన్ని మ్యాచ్ల్లో బౌలింగ్ చేయకుండా అడ్డుకుంది. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) విజ్ఞప్తి మేరకు చెన్నైలోని ఐసీసీ గుర్తింపు సెంటర్లో ఓజా బౌలింగ్ శైలిని పరీక్షించారు. స్పిన్నర్ తన మోచేతిని 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంచుతున్నట్లు ఈ పరీక్షలో తేలింది. ఐసీసీ నిబంధనల ప్రకారం బంతులు విసిరేటప్పుడు బౌలర్ మోచేతిని 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంచరాదు. ఓజా దీన్ని ఉల్లంఘించడంతో బోర్డు చర్యలు తీసుకుంది. యాక్షన్ను సరి చేసుకునేంత వరకు ఓజాతో బౌలింగ్ చేయించొద్దని శుక్రవారం ఓ లేఖ ద్వారా హెచ్సీఏకు తెలియజేసింది. దీంతో సర్వీసెస్తో ఆదివారం ప్రారంభంకానున్న రంజీ మ్యాచ్ నుంచి స్పిన్నర్ను తప్పించారు. దాదాపు ఏడాది కాలంగా ఓజా బౌలింగ్ శైలిపై బోర్డు కన్నేయడంతో టెస్టుల్లో వేగంగా 100 వికెట్లు తీసిన జాబితాలో ఉన్నా... జాతీయ సెలక్టర్లు అతనిపై పెద్దగా దృష్టిపెట్టలేదు. మరోవైపు ఓజా బౌలింగ్ యాక్షన్ను సమీక్షించాలని హెచ్సీఏ కోరలేదని సంయుక్త కార్యదర్శి పురుషోత్తం అగర్వాల్ స్పష్టం చేశారు. బోర్డు నుంచి లేఖ అందిందని ధ్రువీకరించారు. ఓజాను బౌలింగ్ నుంచి తప్పించడం ఆశ్చర్యానికి గురి చేసిందని హైదరాబాద్ రంజీ జట్టు కోచ్ అబ్దుల్ అజీమ్ అన్నారు. -
మాలిక్కు ఊరట
కరాచీ: పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ బౌలింగ్పై తమకు ఎటువంటి ఫిర్యాదులు రాలేదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. పాకిస్థాన్ దేశవాళీ ట్రోఫీ ‘కైద్-ఎ-ఆజమ్’లో జెడ్టీబీఎల్ జట్టుకు నేతృత్వం వహిస్తున్న మాలిక్ బౌలింగ్ యాక్షన్పై కొద్ది రోజుల క్రితం అంపైర్లు అనుమానం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కరాచీ డాల్ఫిన్స్తో జెడ్టీబీఎల్ మ్యాచ్ అనంతరం మాలిక్ యాక్షన్ను అంపైర్లు పరిశీలించి ఎలాంటి తప్పు లేదని తేల్చారని పీసీబీ తెలిపింది. తన బౌలింగ్ యాక్షన్పై ఎటువంటి ఆరోపణలు రాలేదన్న విషయంపై మాలిక్ ఆనందం వ్యక్తం చేశాడు. -
షోయబ్ బౌలింగ్ సందేహాస్పదం!
కరాచీ: పాకిస్థాన్ ఆల్రౌండర్ షోయబ్ మాలిక్ బౌలింగ్ శైలి సందేహాస్పదంగా ఉన్నట్లు అంపైర్లు తేల్చారు. ప్రస్తుతం ఫస్ట్క్లాస్ టోర్నీ ‘కైద్-ఎ-అజమ్ ట్రోఫీ’లో జెడ్టీబీఎల్ తరఫున ఆడుతున్న షోయబ్ కొన్ని బంతులు వేసేటప్పుడు నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించారు. కరాచీ డాల్ఫిన్స్తో జరుగుతున్న ఈ మ్యాచ్లో శుక్రవారం తొలి రోజు ఆట ముగిసిన తర్వాత బౌలర్కు సంబంధించిన వీడియో ఫుటేజీని రిఫరీ, అంపైర్లు సమీక్షించారని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. అయితే షోయబ్ విషయం పాక్ క్రికెట్ బోర్డుకు ఇంకా తెలియజేయలేదు. ఇటీవల అద్భుతమైన ఫామ్లో ఉన్న ఈ ఆల్రౌండర్ విదేశీ టి20 లీగ్ల్లో సత్తా చాటాడు. అదే ఫామ్ను కొనసాగిస్తూ తొలి రోజు ఆటలో ఐదు వికెట్లు పడగొట్టాడు. -
రాణించిన రిత్విక్, రోనక్
సాక్షి, హైదరాబాద్: బ్యాటింగ్లో రిత్విక్ (106)... బౌలింగ్లో రోనక్ (6/40) రాణించడంతో యుూనివర్సల్ జట్టు 27 పరుగుల తేడాతో అక్షిత్ సీసీపై ఘన విజయుం సాధించింది. ‘ఎ’ డివిజన్ వన్డే లీగ్ చాంపియున్షిప్లో భాగంగా జరిగిన ఈ వ్యూచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన యుూనివర్సల్ జట్టు వెంకట్ (6/30) దెబ్బకు 268 పరుగులకే ఆలౌటైంది. యుూనివర్సల్ జట్టులో వెంకట్ సెంచరీతో చెలరేగగా, జై (30) ఫర్వాలేదనిపించాడు. లక్ష్యఛేదనలో అక్షిత్ సీసీ జట్టు 241 పరుగులకే చేతులెత్తేసింది. రావుకృష్ణ (95), సహేంద్ర (40) రాణించినా జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయూరు. వురో వ్యూచ్లో జితేశ్ రెడ్డి (5/21), రవి (4/45) బౌలింగ్లో నిప్పులు చెరగడంతో నోబుల్ సీసీ జట్టు.. సఫిల్ గూడ చేతిలో నాలుగు వికెట్ల తేడాతో చిత్తరుుంది. వుుందుగా బ్యాటింగ్ చేసిన నోబుల్ జట్టు 114 పరుగులకు ఆలౌట్ కాగా, సఫిల్ గూడ జట్టు 6 వికెట్లు కోల్పోరుు 115 పరుగులు చేసి గెలిచింది. ఇతర వ్యూచ్ల స్కోర్లు: యుూత్ సీసీ: 165/8 (అలీ 39, వెంకట్ 41, శ్రీనివాస్ రెడ్డి 4/31); గగన్వుహల్ బ్లూస్: 166/5 (నవ్దీప్ సింగ్ 90, గోపి 43) ఎంపీ స్పోర్టింగ్: 228/6 (వీరేన్ నాయుక్ 50, త్రిప్త్ సింగ్ 60, సుశాంత్ 30, షాకీర్ 3/62); అగర్వాల్ సీనియుర్స్: 230/4 (హబీబ్ అబ్దుల్లా 112, ఫారుఖ్ బిన్ అహ్మద్ 72) హైదరాబాద్ టైటాన్స్: 82 (సంజయ్ పటేల్ 3/21, నాగరాజు 3/19); ఇన్కమ్ ట్యాక్స్: 84/5 (శివ 44, సక్లరుున్ 3/19) హెచ్పీఎస్ (రావుంతపూర్): 297/8 (రాహుల్ 92, సారుుతేజ 66, రిషిక్ రెడ్డి 30 నాటౌట్, వుణిందర్ సింగ్ 30); రాజు సీసీ: 129 (ప్రజ్వల్ 40 హృషికేశ్ 3/13) విజయూనంద్: 204 (ఠాకూర్ తిలక్వర్మ 56, సిద్దార్థ్ 38, సనా కార్తీక్ 30, రోహన్ 3/25, శ్రీనివాస్ 3/32); టైమ్ సీసీ: 146 (సారుు 50 నాటౌట్, ఎల్.యుశ్వంత్ 5/36) హైదరాబాద్ పాంథర్స్: 219 (ఎండీ. అబ్దుల్ ఖాదిర్ 41, ఎండీ. ఆదాం 39, సురేశ్ 5/58); వాకర్ టౌన్: 160 (ప్రశాంత్ 48, విక్రమ్ 41, ఎండీ. ఆదాం 5/31) విజయ్పురి విల్లోమెన్: 272/9 (కృష్ణ 116, సతీశ్ 34, చరణ్తేజ్ 3/61, చందు 3/36); డెక్కన్ బ్లూస్: 156 (గిరి 54, గోవింద్ రాజు 37, ఎండీ. వుునావర్ 4/32) టీమ్ కున్: 258/6 (అనిల్ 55, హర్షిత్ 49, సమిత్ రెడ్డి 37, రేవంత్ 32, అశిష్ 31, అఖిలేష్ యూదవ్ 3/62 ); వుయుూర్ సీసీ 137 (హరీశ్ యూదవ్ 32, ఈశ్వర్ 5/32, శ్రీనాథ్ 3/12) సన్షైన్: 130 (ఆడమ్ 49, రాఘవ 5/35, వుహేశ్ 3/30); చుమ్స్ ఎలెవన్ 131/3 (రౌఫ్ కిరణ్ 54, భరణి 37) వర్షం వల్ల రద్దు: యుంగ్ వూస్టర్స్-ఫ్యూచర్ స్టార్స్ వ్యూచ్ -
సక్లయిన్ ముస్తాక్ నెలకు రూ.10 లక్షలు!
కరాచీ:పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సక్లయిన్ ముస్తాక్ కు ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) తో ఒప్పందం కుదిరింది. పాకిస్తాన్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ బౌలింగ్ పై ఐసీసీ నిషేధం విధించడంతో అతని యాక్షన్ సరిదిద్దేందుకు పాకిస్తాన్ నడుంబిగించింది. ఇందులో భాగంగానే సక్లయిన్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం బౌలింగ్ విభాగంలో ప్రపంచ నంబర్ వన్ గా ఉన్న అజ్మల్ పై నిషేధం అంశం పాకిస్తాన్ క్రికెట్ ను కలవర పెట్టింది. వచ్చే ప్రపంచకప్ నాటికి అతని బౌలింగ్ యాక్షన్ ను సరిదిద్ది మరోమారు అంతర్జాతీయ క్రికెట్ లోకి తీసుకు రావాలని పాకిస్తాన్ యోచిస్తోంది. అందుకు గాను ఆ దేశ మాజీ స్పిన్నర్ సక్లయిన్ ముస్తాక్ సహాయం కోరింది. దీనికి అంగీకరించిన పీసీబీ అతనికి నెలకు రూ.10 లక్షలు ఇచ్చేందుకు సిద్ధమైంది. నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ చేస్తున్నాడన్నకారణంతో వన్డేల్లో ప్రపంచ నంబర్వన్ బౌలర్ సయీద్ అజ్మల్పై ఐసీసీ నిషేధం విధించారు. ఇక నుంచి ఈ పాకిస్థాన్ క్రికెటర్ అంతర్జాతీయ క్రికెట్లో బౌలింగ్ చేయకూడదని స్పష్టం చేసింది. బంతులు వేసేటప్పుడు అజ్మల్ తన చేతిని 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంచుతున్నట్లు ఓ స్వతంత్ర సంస్థ చేసిన పరిశోధనలో వెల్లడైందని క్రికెట్ మండలి వెల్లడించింది. గత నెలలో శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో 36 ఏళ్ల అజ్మల్ బౌలింగ్ యాక్షన్ సరిగా లేదని ఆన్ఫీల్డ్ అంపైర్లు బెన్ ఆక్సెన్ఫోర్డ్, ఇయాన్ గౌల్ట్ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్కు ఫిర్యాదు చేశారు. -
అజ్మల్పై నిషేధం
సందేహాస్పద బౌలింగ్పై ఐసీసీ చర్యలు అప్పీలు చేయనున్న పీసీబీ దుబాయ్ / కరాచీ: నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ చేస్తున్నాడన్న కారణంతో వన్డేల్లో ప్రపంచ నంబర్వన్ బౌలర్ సయీద్ అజ్మల్పై ఐసీసీ నిషేధం విధించింది. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని, ఇక నుంచి ఈ పాకిస్థాన్ క్రికెటర్ అంతర్జాతీయ క్రికెట్లో బౌలింగ్ చేయకూడదని స్పష్టం చేసింది. బంతులు వేసేటప్పుడు అజ్మల్ తన చేతిని 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంచుతున్నట్లు ఓ స్వతంత్ర సంస్థ చేసిన పరిశోధనలో వెల్లడైందని క్రికెట్ మండలి వెల్లడించింది. గత నెలలో శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో 36 ఏళ్ల అజ్మల్ బౌలింగ్ యాక్షన్ సరిగా లేదని ఆన్ఫీల్డ్ అంపైర్లు బెన్ ఆక్సెన్ఫోర్డ్, ఇయాన్ గౌల్ట్ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్కు ఫిర్యాదు చేశారు. దీంతో అజ్మల్ మరోసారి తన బౌలింగ్ను పరీక్షించుకోవాల్సి వచ్చింది. ఆగస్టు 25న బ్రిస్బేన్లో జాతీయ క్రికెట్ సెంటర్లో ఐసీసీకి చెందిన ‘హ్యూమన్ మూవ్మెంట్ స్పెషలిస్ట్’లు బౌలర్ యాక్షన్ పూర్తిస్థాయిలో విశ్లేషించారు. అజ్మల్ బౌలింగ్ నిబంధనల ప్రకారం లేదని నివేదిక ఇవ్వడంతో ఐసీసీ చర్యలు తీసుకుంది. 2009లో తొలిసారి ఆరోపణలు అజ్మల్ బౌలింగ్ సందేహాస్పదంగా ఉందని అతను అరంగేట్రం చేసిన ఏడాది (2009)లోనే ఆరోపణలు వచ్చాయి. అతను వేసే ‘దూస్రా’ నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో పెర్త్లోని ‘యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా’లో బౌలింగ్ యాక్షన్ను విశ్లేషించిన నిపుణులు క్లీన్చిట్ ఇచ్చారు. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న చాలా మంది బౌలర్లకు పెర్త్ యూనివర్సిటీ గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటంతో... ఇటీవలే ఐసీసీ తన బౌలింగ్ యాక్షన్ ప్రొటోకాల్ను మార్చి బ్రిస్బేన్లోని సెంటర్కు అనుమతి ఇచ్చింది. దీంతో అజ్మల్ బౌలింగ్ యాక్షన్ను విశ్లేషించిన నిపుణులు నిబంధనలకు అనుకూలంగా లేదని తేల్చారు. పాక్కు ఎదురుదెబ్బ అజ్మల్పై నిషేధం విధించడంతో పాక్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టులో ప్రధాన స్పిన్నర్గా చాలా మ్యాచ్లను ఒంటిచేత్తో గెలిపించిన అతను వన్డే ప్రపంచకప్ జట్టులో కీలక సభ్యుడు కూడా. పాకిస్థాన్ తరఫున ఇప్పటి వరకు 35 టెస్టులు ఆడిన అజ్మల్ 178 వికెట్లు తీశాడు. 111 వన్డేల్లో 183 వికెట్లు తీసి జట్టు బౌలింగ్కు పెద్ద దిక్కుగా మారాడు. అప్పీలు చేస్తాం: పీసీబీ ఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తామని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ షహర్యార్ ఖాన్ తెలిపారు. ‘పూర్తి విషయాలు మాకు ఇంకా తెలియవు. అయితే అజ్మల్కు మరో అవకాశం ఉంది. తన బౌలింగ్పై కసరత్తులు చేస్తే తాజా పరీక్షలు చేయాలని కోరుతాం. రెండు వారాల్లో దీనిపై అప్పీల్ చేస్తాం’ అని ఖాన్ పేర్కొన్నారు. మరోవైపు ఐసీసీ నిషేధం ఎదుర్కొంటున్న అజ్మల్కు తన సహచరుల నుంచి పూర్తిస్థాయిలో మద్దతు లభించింది. ప్రపంచకప్లో ఆడతా: అజ్మల్ కరాచీ: ఐసీసీ నిషేధంపై పోరాడతానని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అజ్మల్ అన్నాడు. దేశం తరఫున ప్రపంచకప్లో ఆడేందుకు ఎంత వరకైనా వెళ్తానన్నాడు. ‘బయోమెకానిక్ పరీక్ష నిరాశపర్చింది. అయితే దీన్ని అంత సులువుగా వదిలిపెట్టను. నిషేధం పెద్ద సమస్య కాదు. అవసరమైన చర్యలు తీసుకుంటా. మళ్లీ జట్టులోకి వస్తా. వీలైంతన తొందరగా పీసీబీ పెద్దలను కలిసి తదుపరి చర్యల గురించి ఆలోచిస్తా. వైద్య నివేదికలు వచ్చిన తర్వాత దీనిపై అప్పీలు చేస్తాం’ అని అజ్మల్ వెల్లడించాడు. -
రోహిత్ హాఫ్ సెంచరీ, రాణించిన రైనా
కార్డిఫ్: ఇంగ్లండ్తో రెండో వన్డేలో భారత్ ఆరంభంలో తడబడినా పోరాడుతోంది. బుధవారమిక్కడ జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగింది. భారత్ ఆరంభంలో 19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ధవన్ 11 పరుగులకే పెవిలియన్ చేరగా, విరాట్ కోహ్లీ డకౌటయ్యాడు. వోక్స్ ఒకే ఓవర్లో వీరిద్దరినీ అవుట్ చేశాడు. ఈ దశలో రోహిత్, రహానె జట్టును ఆదుకున్నారు. వీరిద్దూ మూడో వికెట్కు 91 పరుగులు జోడించారు. కాగా హాఫ్ సెంచరీకి చేరువలో రహానె (41) అవుటవగా, రోహిత్ (52) హాఫ్ సెంచరీ చేసిన వెంటనే వెనుదిరిగాడు. భారత్ 32 ఓవర్లలో నాలుగు వికెట్లకు 140 పరుగులు చేసింది. ధోనీ, రైనా క్రీజులో ఉన్నారు. -
రెండో వన్డే: బ్యాటింగ్ దిగిన భారత్
కార్డిఫ్: భారత్, ఇంగ్లండ్ల రెండో వన్డే ఆరంభమైంది. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా బుధవారమిక్కడ జరుగుతున్న ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ కెప్టెన్ కుక్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత ఓపెనర్లు రోహిత్, ధవన్ బ్యాటింగ్ కు దిగారు. తొలి వన్డే వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. ఈ రోజు కూడా వర్షం కురిసే అవకాశముంది. మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగిస్తే, ఫలితాన్ని డక్వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం తేల్చే పరిస్థితి రావచ్చు. దీంతో టాస్ గెలిస్తే ఫీల్డింగ్ ఎంచుకోవాలని కుక్తో పాటు టీమిండియా కెప్టెన్ ధోనీ కూడా భావించాడు. అయితే కుక్ టాస్ గెలిచాడు. -
లక్ష్మణ్ బౌలింగ్.. గోపీచంద్ బ్యాటింగ్