btech
-
ఫీజులు.. గుండెలు గుభిల్లు
విద్యార్థులు, తల్లిదండ్రుల డ్రీమ్ కోర్సు అయిన ఇంజనీరింగ్కు సంబంధించి దేశంలోనే ప్రఖ్యాత విద్యా సంస్థ ఐఐటీ బాంబేలో నాలుగేళ్ల బీటెక్కు 2008లో మొత్తం ట్యూషన్ ఫీజు రూ.1,08,000 ఉండగా ఇది 2024–25 నాటికి ఏకంగా రూ.8,00,000కు చేరింది. అలాగే మరో ప్రముఖ విద్యా సంస్థ ఎన్ఐటీ తిరుచిరాపల్లిలో 2011–12లో బీటెక్కు రూ.1,42,000 ఫీజు ఉండగా 2023–24 నాటికి ఇది 5,02,800కు పెరిగింది. మొత్తం మీద ఐఐటీల్లో 15 ఏళ్లలో ఏడు రెట్లు, ఎన్ఐటీల్లో 12 ఏళ్లలో మూడున్నర రెట్లు ఫీజులు పెంచారు. అలాగే ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల్లలో 15 ఏళ్లలో 8 రెట్లు ఫీజులు పెరిగాయి. భారతదేశంలో పెరిగిపోతున్న విద్యా వ్యయంపై కెరీర్స్360 ఫౌండర్ చైర్మన్ మహేశ్వర్ పెరి అందిస్తున్న ప్రత్యేక వ్యాసం⇒ మన దేశంలో చదువు రోజురోజుకీ భారంగా మారుతోంది. ప్రాథమిక విద్య నుంచి మేనేజ్ మెంట్ చదువుల వరకు ప్రతి దశలోనూ విద్య సామాన్యుడికే కాదు, మధ్య తరగతికీ తలకు మించిన భారంగా పరిణమించింది. విద్యలో ప్రభుత్వ పాత్ర క్రమేణా తగ్గడం.. ప్రైవేటు విద్యా సంస్థలు పుట్టుకొచ్చి ఫీజులు పెంచుకుంటూ పోవడమే అందుకు ప్రధాన కారణం.⇒ గత 13 ఏళ్లలో ప్రభుత్వ బడుల సంఖ్యలో పెరుగుదల కేవలం 9 శాతం. అదే సమయంలో ప్రైవేటు స్కూళ్లు ఏకంగా 35% పెరిగిపోయాయి. ప్రస్తుతం దేశంలోని మొత్తం కాలేజీల్లో 79 % ప్రైవేటువే. 14 ఏళ్ల కిందట దేశంలోని ప్రతి రెండు ప్రభుత్వ యూనివర్సిటీలకు ఒక ప్రైవేటు యూనివర్సిటీ ఉంటే నేడు ప్రైవేటు వర్సిటీల సంఖ్య ప్రభుత్వ వర్సిటీల సంఖ్యను అధిగమించేసింది. వీటన్నింటి ఫలితంగా చదువులపై పెట్టాల్సిన ఖర్చు గణనీయంగా పెరిగిపోయింది. ఇవన్నీ ఆందోళనకరమైన పరిణామాలు. ⇒ మన చిన్న చిన్న విషయాలపై దృష్టి పెట్టి, పెద్ద పెద్ద విషయాలను పక్కనపెట్టేశామేమో అనిపిస్తోంది. ఈ సందర్భంగా మనమంతా కొన్ని అంశాలు ఆలోచించాలి. మన ప్రజల సుసంపన్నమైన అభివృద్ధికి ఇప్పటికీ కట్టుబడే ఉన్నామా? నిపుణులైన మానవ వనరులను తయారుచేసుకోవడంలో మనం వెనకబడుతున్నామా? గత 15–20 ఏళ్లలో దేశంలో విద్యా రంగంలో చోటుచేసుకున్న పరిణామాలను గమనిస్తే అవుననే అనిపిస్తుంది. ఐఐటీలను మించి స్కూల్ ఫీజులు.. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ఫీజులు స్కూల్ను బట్టి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఉన్నాయి. హైదరాబాద్ లోని పటాన్చెరులో ఉన్న ఒక ఇంటర్నేషనల్ స్కూల్ 2024–25 విద్యా సంవత్సరానికి రూ.12 లక్షల ఫీజు వసూలు చేస్తోంది. ఇది కాకుండా అడ్మిషన్ ఫీజు కింద మరో రూ.1.7 లక్షలు చెల్లించాల్సిందే. అలాగే శంషాబాద్లో ఉన్న మరో అకాడమీ ఏడాదికి రూ.9.5 లక్షల ఫీజు వసూలు చేస్తోంది. అలాగే మోకిలాలో ఉన్న ఇంకో ఇంటర్నేషనల్ స్కూల్లో ఏడాదికి రూ.8.2 లక్షల ఫీజు ఉంది. వీటికి అదనంగా అడ్మిషన్ ఫీజు కింద మరింత ముట్టజెప్పాల్సిందే. భారీ ఫీజులతో తల్లిదండ్రుల్లో ఆందోళన ఆ కోర్సు, ఈ కోర్సు అనే తేడా లేకుండా ప్రతి కోర్సుకు ఫీజుల మోత మోగిపోతోంది. మనదేశంలో విద్యా వ్యయం ఏయేడాదికాయేడాది అంతకంతకూ పెరిగిపోతోంది. తల్లిదండ్రులు తమ పిల్లలను అత్యున్నత విద్యా సంస్థల్లో చదివించాలని కలలు కంటారు. తమ కంటే తమ పిల్లల భవిష్యత్ బాగుండాలని ఆశిస్తారు.మంచి విద్యా సంస్థలో తమ పిల్లలు సీటు సాధించాలని.. ఆ తర్వాత కోర్సు పూర్తయ్యాక మంచి పే ప్యాకేజీతో ఉద్యోగం సాధించాలని ఆకాంక్షిస్తారు. అత్యుత్తమ విద్య, ఆ తర్వాత మంచి ఉద్యోగం సాధించాలంటే మేటి విద్యా సంస్థల్లో చదవకతప్పదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఈ పోటీ ప్రపంచంలో అందరికంటే ముందుండాలన్నా, మంచి అవకాశాలు దక్కించుకోవాలన్నా నాణ్యమైన చదువులతోనే సాధ్యమని నమ్ముతున్నారు. అయితే పెరుగుతున్న ఫీజులు తల్లిదండ్రుల్లో ఆందోళన రేపుతున్నాయి. క్యాష్ చేసుకుంటున్న విద్యా సంస్థలు.. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆకాంక్షలను విద్యా సంస్థలు ‘క్యాష్’ చేసుకుంటున్నాయి. ఫీజులను అమాంతం పెంచేస్తున్నాయి. నర్సరీ నుంచి మొదలుపెడితే పీజీలు, పీహెచ్డీల వరకు ఈ విద్యా వ్యయం ఏటా అంతకంతకూ గణనీయంగా పెరుగుతోంది. ధనవంతులకు ఈ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకపోయినా మధ్యతరగతి వర్గాలు, పేదలు అంతకంతకూ పెరిగిపోతున్న విద్యా వ్యయంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏటా భారీగా పెరిగిపోతున్న ఫీజులను కట్టలేక నాణ్యమైన చదువులకు విద్యార్థులు దూరమవుతున్నారు. ఇలా అర్థంతరంగా చదువులు మానేసేవారి శాతం అంతకంతకూ పెరిగిపోతోంది. కొంతవరకు బ్యాంకులు విద్యా రుణాలు అందిస్తున్నా అవి అందరికీ దక్కడంలేదు. దీంతో డ్రాపవుట్లు పెరుగుతున్నాయి. ప్రభుత్వరంగంలో తగ్గిపోయిన విద్యాసంస్థలుప్రపంచంలోనే అత్యధిక యువజనాభా భారతదేశంలోనే ఉంది. అయితే దేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రభుత్వ రంగంలో విద్యా సంస్థలు ఏర్పాటు కావడం లేదు. ప్రైవేటు రంగంలోనే ఎక్కువ విద్యా సంస్థలు ఏర్పాటవుతున్నాయి. దీంతో ప్రైవేటు విద్యా సంస్థలు భారీగా ఫీజులు వసూలు చేస్తూ నడ్డి విరుస్తున్నాయి.ప్రభుత్వ రంగంలో ఎక్కువ విద్యా సంస్థలు ఏర్పాటయితే ప్రైవేటు సంస్థలతో పోలిస్తే ఫీజుల భారం తక్కువగా ఉంటుంది. అయితే అలా జరగకపోవడంతో పేదలు, మధ్యతరగతి వర్గాలు భారీ ఫీజులను చెల్లించలేక చదువులకు స్వస్తి చెబుతున్నాయి. దేశంలో ప్రైవేటు విద్యా సంస్థల్లో గత 15 ఏళ్లలో వివిధ కోర్సుల ఫీజులు 300 శాతం పెరిగాయి. దేశంలో గత 20 ఏళ్ల కేంద్ర ప్రభుత్వ గణాంకాలను పరిశీలిస్తే దిమ్మతిరిగే విషయాలు వెల్లడయ్యాయి. భారీగా ఫీజుల భారం.. దేశంలో ప్రైవేటు స్కూళ్లు, కళాశాలలు, యూనివర్సిటీలు పెరిగిపోవడం.. ప్రభుత్వ రంగంలో విద్యా సంస్థలు తగ్గిపోవడంతో విద్యార్థులపై భారీ ఎత్తున ఫీజుల భారం పడుతోంది. దీంతో విద్యకు సంబంధించిన ద్రవ్యోల్బణం అంతకంతకూ పెరిగిపోతోంది. తాజా నేషనల్ శాంపుల్ సర్వే ప్రకారం.. 2014–2018 మధ్య ప్రాథమిక విద్యకు తల్లిదండ్రులు 30.7 శాతం వ్యయం చేశారు. అలాగే ప్రాథమికోన్నత తరగతులకు 27.5 శాతం ఖర్చు పెట్టారు. లోకల్ సర్కిల్స్ సర్వే ప్రకారం.. కోవిడ్ తర్వాత తమ పిల్లల స్కూల్ ఫీజులు 30 శాతం నుంచి 50 శాతం వరకు పెరిగాయని 42 శాతం మంది తల్లిదండ్రులు చెప్పారు. తన కుమారుడి ఫీజు కింద నెలకు రూ.30,000 చెల్లిస్తున్నానంటూ హరియాణాలోని గురుగ్రామ్లో ఒక తండ్రి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్గా మారింది. హైదరాబాద్లో ఒక స్కూల్ ఒకేసారి 50 శాతం ఫీజు పెంచింది. 44 శాతం మంది చదువులకు దూరం నేషనల్ శాంపుల్ సర్వే ప్రకారం.. 23 శాతం మంది ఆర్థిక ఇబ్బందులతోనే చదువులు మానేశారు. 21 శాతం మంది తమ కుటుంబ పోషణ కోసం పనులకు వెళ్లడం వల్ల చదువులు మానేశామని చెప్పారు. అంటే దేశ యువతలో 44 శాతం మంది పెరిగిన ఫీజులు, కుటుంబ ఆరి్థక పరిస్థితులతో ఉన్నత చదువులు చదవలేకపోయారు. ఈ నేపథ్యంలో విద్య నిరుపేద, మధ్యతరగతి వర్గాలకు భారం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.ఎంబీబీఎస్.. ఫీజుల మోత మోగాల్సిందే..⇒ ప్రైవేటు స్టేట్ యూనివర్సిటీల్లో రూ.80 లక్షల నుంచి రూ.1.25 కోట్ల వరకు ⇒ డీమ్డ్ యూనివర్సిటీల్లో రూ.1.25 కోట్ల నుంచి రూ. 2 కోట్ల వరకు ⇒ ఎన్నారైలకు రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు -
దక్షిణాదికి మరిన్ని ఇంజనీరింగ్ సీట్లు!
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది దక్షిణాది రాష్ట్రాలకు ఇంజనీరింగ్ సీట్లు పెరగనున్నాయి. అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఈ మేరకు వెసులుబాటు కల్పిస్తోంది. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఏపీ నుంచి వస్తున్న డిమాండ్ను ఏఐసీటీఈ పరిగణనలోకి తీసుకున్నట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంజనీరింగ్పై విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో అక్కడ మేనేజ్మెంట్ కోర్సుల పెంపునకు అనుమతి ఇవ్వాలని భావిస్తున్నారు. ఇదే జరిగితే తెలంగాణవ్యాప్తంగా 10 వేల ఇంజనీరింగ్ సీట్లు పెరుగుతాయని రాష్ట్ర అధికారులు అంచనా వేస్తున్నారు. కంప్యూటర్ కోర్సుల్లోనే సీట్లు పెంచాలని ఇంజనీరింగ్ కాలేజీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచ్లలో సీట్లకు కోత పడొచ్చు.గత ఏడాది 7 వేల సీట్లు ఈ బ్రాంచ్లలో తగ్గాయి. వీటి స్థానంలో కంప్యూటర్ కోర్సుల్లో పెంచారు. దీంతోపాటు మరో 7 వేల వరకూ కంప్యూటర్ బ్రాంచ్ల్లో సీట్లు పెరిగాయి. మారుతున్న ట్రెండ్ కొన్నేళ్లుగా దక్షిణ, ఉత్తరాది రాష్ట్రాల మధ్య కోర్సుల ఎంపికలో తేడా కనిపిస్తోందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఏఐసీటీఈ గుర్తించాయి. తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్ఛేరిలో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (బీటెక్), ఎంబీఏ, ఎంసీఏల్లో ఎక్కువగా చేరుతున్నారు. కానీ ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో విద్యార్థులు ఎక్కువగా సంప్రదాయ డిగ్రీ కోర్సులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు ఇంజనీరింగ్ తర్వాత ఎంఎస్కు విదేశాలకు వెళ్లేందుకు, లేదా సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లోని విద్యార్థులు డిగ్రీ తర్వాత సివిల్స్, ఇతర పోటీ పరీక్షల వైపు దృష్టి పెడుతున్నారు. ఈ డిమాండ్ను బట్టే ఎక్కువ ఇంజనీరింగ్ సీట్లు దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉంటున్నాయి. ► దేశవ్యాప్తంగా 12,47,667 బీటెక్ సీట్లు అందుబాటులో ఉంటే, వీటిల్లో 6,74,697 (54 శాతం) సీట్లు దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ►ఎంసీఏలో 70,065 సీట్లు ఉంటే, 30,812 (44 శాతం) దక్షిణాదిలో ఉన్నాయి. ►ఎంబీఏ, పీజీడీఎం వంటి మేనేజ్మెంట్ కోర్సులకు సంబంధించిన సీట్లు 3,39,405 దేశవ్యాప్తంగా ఉంటే, దక్షిణాదిన 1,57,632 సీట్లున్నాయి. ►రానురాను బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ సీట్లు దక్షిణాదిలోనే పెరగడానికి ఇదే కారణమని ఏఐసీటీఈ భావిస్తోంది. ►2015–16లో దక్షిణాది రాష్ట్రాల్లో 48.77 బీటెక్ సీట్లు ఉంటే, కేవలం ఆరేళ్లలో అవి 5.3 శాతం పెరిగాయి. ఇప్పుడిది 7 శాతానికి చేరొచ్చని అంచనా వేస్తున్నారు. నైపుణ్యంపై దృష్టి ఇంజనీరింగ్ విద్యలో కొత్త కోర్సులు వస్తున్నా, విద్యార్థుల్లో నైపుణ్యం ఉండటం లేదని పలు సర్వేలు చెబుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని ఇంజనీరింగ్లో మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇంజనీరింగ్ రెండో ఏడాది నుంచే ప్రాక్టికల్గా అవసరమైన నైపుణ్యం పొందేలా ప్రాజెక్టులు రూపొందిస్తున్నారు. తరగతిగది కన్నా, నైపుణ్యం పొందే పారిశ్రామిక సంస్థల్లో పనిచేసేలా చేయాలని ఏఐసీటీఈ సూచిస్తోంది. టెక్నాలజీలో దక్షిణాది ముందంజ దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు బీటెక్ చదవడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ ట్రెండ్ రానురాను పెరుగుతోంది. తక్షణ ఉపాధితో పాటు, నైపుణ్యం పెంచే విధంగా ఇంజనీరింగ్లో వస్తున్న మార్పులూ ఇందుకు కారణమే. అందుకే తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ సీట్ల పెంపు అనివార్యమవుతోంది. గణితం నేపథ్యం విద్యార్థులూ ఉత్తరాది కన్నా, దక్షిణాదిలో ఎక్కువగా ఉంటున్నారు. ఇది కూడా బీటెక్ సీట్ల డిమాండ్కు కారణమవుతోంది. – ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఉన్నత విద్య మండలి చైర్మన్ -
చదువు పూర్తయిందా.. ఉద్యోగం కావాలా..? ఇదే బెస్ట్ ఛాయిస్..
ఇంజినీరింగ్ పూర్తయిన వెంటనే ఉద్యోగం సంపాదించాలని అనుకుంటారు. కానీ ఎంచుకున్న రంగంలో ఏ విభాగంలో డిమాండ్ ఉందో తెలుసుకోలేక నష్టపోతుంటారు. పెరుగుతున్న టెక్నాలజీ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఏ విభాగంలో ఎక్కువ కొలువులు రానున్నాయో నిపుణులు కొన్ని సూచనలు ఇస్తున్నారు. చదువు అయిపోయాక ఉపాధి అవకాశాలు లభించాలంటే విద్యను అభ్యసిస్తున్నపుడే సృజనాత్మక ఆలోచనలు, కృత్రిమమేధ, డేటాసైన్స్ సబ్జెక్టులపై పట్టు సాధించాలని నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో ఏటా 1.10 లక్షల మంది ఇంజినీరింగ్ పట్టా తీసుకుంటుండగా... ఇందులో చాలా శాతం మంది ఉద్యోగాలు సాధించడం లేదు. సొంతంగా అంకుర సంస్థలను స్థాపించేందుకు కొద్దిమందే ముందుకొస్తున్నారు. కృత్రిమ మేధ, డేటా సైన్స్లో పరిశోధనలు.. విదేశాల్లో కృత్రిమ మేధ, డేటా సైన్స్, ఆటోమేషన్ అంశాలపై అధికంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అందులో విభిన్నమైన ఉత్పత్తులను తయారుచేస్తున్నారు. ఓ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల సంస్థ కొద్ది నెలల కిందట కృత్రిమ మేధతో అనుసంధానమైన స్మార్ట్ఫ్రిజ్ను అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఐరోపా దేశాల్లో ఆవిష్కరించింది. ఇదీ చదవండి: 4వేలకు పైగా కార్లు వెనక్కి.. సమస్య ఏమిటంటే.. ఒక సాంకేతిక పరికరాన్ని ఫ్రిజ్లో అమర్చితే చాలు అందులోని కూరగాయలు ఏ రోజు వండుకోవాలో చెబుతుంది. పండ్లు, ఇతర సామగ్రి ఖాళీ అవుతున్నప్పుడు దానంటదే ఆన్లైన్లో ఆర్డర్ చేస్తుంది. ఇలాంటి ఆలోచనలు, సాఫ్ట్వేర్లు ఇతర రంగాలకూ అవసరం. వీటితో పాటు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ద్వారా చాలా మార్పులు రానున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి టెక్నాలజీకి సంబంధించిన అంశాలను విద్యను అభ్యసిస్తున్నపుడే నేర్చుకుంటే చదువు అయిపోయాక వెంటనే కొలువు దొరికే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. -
ఉన్నత విద్యకు ‘స్కిల్’ జత
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యలో నైపుణ్యం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే స్వల్పకాలిక నైపుణ్యాభివృద్ధి కోర్సులను కాలేజీలు, యూనివర్సిటీలు అందుబాటులోకి తెచ్చేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంగీకారం తెలిపింది. తాజా బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రస్తావించింది. విధాన పరమైన నిర్ణయాన్ని ప్రకటించినప్పటీకీ పెద్దగా నిధులు కేటాయించక పోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డిగ్రీ, ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థుల్లో నైపుణ్యం ఉండటం లేదన్నది భారత పారిశ్రామిక వేత్తల అభిప్రాయం. సీఐఐ, ఎఫ్ఐఐ, నాస్కామ్ వంటి సంస్థల అధ్యయనంలోనూ ఇదే వెల్లడైంది. ఈ నేపథ్యంలో పారిశ్రామిక భాగస్వామ్యంతో ఈ కోర్సులను ముందుకు తీసుకెళ్ళాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కన్పిస్తోంది. తక్షణ అవసరం ఇదే..: దేశంలో ఇంజనీరింగ్ పూర్తి చేసే విద్యార్థుల్లో కేవలం 8 శాతం మంది మాత్రమే నైపుణ్యం (స్కిల్)తో బయటకు వస్తున్నారు. మిగతా వాళ్ళలో కొంతమంది స్కిల్ కోసం ప్రత్యేక కోర్సులు నేర్చుకుంటున్నారు. అయితే వాళ్లలో కోర్సు నేర్చుకునే నాటికే కొత్త నైపుణ్యాలు మార్కెట్లోకి వస్తున్నాయి. దీంతో మళ్ళీ కొత్త టెక్నాలజీ నేర్చుకుంటే తప్ప మంచి వేతనంతో ఉద్యోగం లభించే అవకాశం కన్పించడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకునే విశ్వవిద్యాలయాలకు యూజీసీ తక్షణ మార్పులను సూచించింది. నైపుణ్యాభివృద్ధి మండళ్లు స్వల్ప వ్యవధి కోర్సులను ప్రారంభించేందుకు అనుమతి అక్కర్లేదని కూడా తెలిపింది. కాకపోతే పారిశ్రామిక భాగస్వామ్యం తప్పనిసరి. అప్పుడే విద్యార్థి అనుభవ పూర్వకంగా నైపుణ్యం సంపాదించేందుకు అవకాశం ఉంటుంది. ఇంటర్ ఉత్తీర్ణత సాధించి డిగ్రీ, బీటెక్ కోర్సుల్లో చేరే విద్యార్థులకు 3–6 నెలల వ్యవధిలో 27 రకాల నైపుణ్య కోర్సులను యూజీసీ సూచిస్తోంది. వీటికి 12 నుంచి 30 క్రెడిట్స్ ఇవ్వాలని కూడా నిర్ణయించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సమీక్ష జరిపింది. ఏయే కోర్సులు అందుబాటులోకి తేవచ్చు అనే విషయాన్ని ప్రభుత్వానికి ఉన్నతాధికారులు వివరించారు. ఇవీ స్కిల్ కోర్సులు అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే కాలంలో మొత్తం 27 స్కిల్ కోర్సులను నేర్చుకోవడానికి అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులకే అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. ఇందులో ఏఐ అండ్ ఎంఎల్, రోబోటిక్స్, ఐవోటీ, ఇండ్రస్టియల్ ఐవోటీ, స్మార్ట్ సిటీస్, డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, వీఆర్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్, 5 జీ కనెక్టివిటీ, ఇండ్రస్టియల్ ఆటోమేషన్, ఎల్రక్టానిక్స్ సిస్టమ్ డిజైన్, వీఎస్ఎస్ఐ డిజైన్స్, కంప్యూటర్ భాషలో ప్రాథమిక అవగాహన, మెకానికల్ టూలింగ్, మొబైల్ కమ్యూనికేషన్ లాంటి ప్రధానమైన కోర్సులున్నాయి. తెలంగాణలో కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీల భాగస్వామ్యంతో ఐవోటీ, ఏఐఎంఎల్ సహా ఇతర కంప్యూటర్ కోర్సుల్లో స్వల్పకాలిక కోర్పులు నిర్వహించవచ్చని అధికారులు అంటున్నారు. సైబర్ సెక్యూరిటీ, డేటా అనాలసిస్ వంటి వాటికి విస్తృత అవకాశాలున్నాయని భావిస్తున్నారు. తొలి దశలో ప్రైవేటు యూనివర్సిటీలు మాత్రమే ఈ దిశగా ముందుకు వెళ్ళే వీలుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కొన్ని డీమ్డ్ వర్సిటీలు ఈ దిశగా కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాయి. స్కిల్తో ఉద్యోగం సులభం డిగ్రీతో పాటు నైపుణ్యం ఉంటే ఉద్యోగం లభించడమే కాదు.. అందులో రాణించడం కూడా సులభం. కంపెనీలు ఇలాంటి అర్హతలే కోరుకుంటున్నాయి. అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే నాటికి ఏదైనా ఒక రంగంలో నైపుణ్యం అవసరం. ఈ దిశగా ప్రభుత్వం, వర్సిటీలు అడుగులు వేయడం అభినందనీయం. – శ్రీరాం వెంకటేష్ (ఉన్నత విద్య మండలి కార్యదర్శి) -
అమెరికాలో భారతీయ విద్యార్థి దారుణ హత్య
న్యూయార్క్: అమెరికాలో భారతీయ విద్యార్థి ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. డ్రగ్స్కు బానిసైన ఒకడు ఆయన్ను సుత్తితో దారుణంగా కొట్టి ప్రాణాలు తీశాడు. హరియాణాకు చెందిన వివేక్ సైనీ బీటెక్ పూర్తి చేసుకుని రెండేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. ఇటీవలే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో ఎంబీయే పూర్తి చేసిన అతడు..జార్జియా రాష్ట్రం లిథోనియా నగరంలో ఉంటూ ఓ స్టోర్లో పార్ట్–టైం క్లర్కుగా పనిచేస్తున్నాడు. అదే స్టోర్ వద్ద నిలువ నీడ లేని జులియన్ ఫాల్క్నర్ అనే డ్రగ్ అడిక్ట్ ఉంటున్నాడు. వివేక్ అతడికి రెండు రోజులుగా నీళ్లు, చిప్స్, కోక్ ఇస్తున్నాడు. చలి నుంచి కాపాడుకునేందుకు జాకెట్ సైతం అతడికి ఇచ్చాడు. ఈ నెల 16వ తేదీన ఫాల్క్నర్ ఇంటికి వెళ్తున్న వివేక్కు అడ్డుగా నిలిచాడు. అడ్డు తొలగకుంటే పోలీసులకు చెబుతా నంటూ హెచ్చరించాడు. అతడు లక్ష్యపెట్టక సుత్తితో వివేక్పై దాడికి దిగాడు. వివేక్ తలపై 50సార్లు సుత్తితో మోదాడు. సమాచారం అందుకుని పోలీసులు వచ్చే సరికి వివేక్ మృతదేహం వద్దే ఆ ఉన్మాది ఉండటం గమనార్హం. -
బీటెక్ చదివి.. యూట్యూబ్ చూసి దొంగతనం.. చివరికి
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): బీటెక్ చదివిన యువకులు ఉద్యోగం లభించక బైక్ చోరీలకు అలవాటుపడి చివరకు పోలీసులకు పట్టుబడ్డారు. ఈ సంఘటన హనుమంతనగర పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా బాలయ్యపల్లి మండలానికి చెందిన హేమాద్రి, పవన్లు బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం బెంగళూరుకు వచ్చారు. అయితే వారికి ఉద్యోగం దొరకలేదు. ఊర్లో మాత్రం బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నామని చెప్పుకునేవారు. యూట్యూబ్లో చూసి బైక్లు చోరీ చేయడం ఎలాగో తెలుసుకున్న ఇద్దరూ ఖరీదైన బైక్లు, బుల్లెట్ బండ్లను చోరీ చేసి ఊర్లో దర్జా చూపేవారు. మరోవైపు బాధితులు హనుమంతనగర పీఎస్లో ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను వారి సొంతూరికి వెళ్లి అరెస్టుచేసి తీసుకొచ్చారు. చదవండి ఎమ్మెల్యేకు షాక్.. సంచలనం రేపుతున్న మహిళా కానిస్టేబుల్ వాట్సాప్ స్టేటస్ -
బీటెక్ పరీక్ష.. ఇదేం పని రా అయ్యా, నిజం తెలిసి ఇన్విజిలేటర్ మైండ్బ్లాక్!
తాడిపత్రి అర్బన్: ఒకరికి బదులుగా మరొకరిని పరీక్ష హాలులోకి పంపించారు. ఇందుకోసం విద్యార్థుల హాల్టికెట్లు, ఐడీ కార్డులను మార్ఫింగ్ చేశారు. ఇలా ఒకరు కాదు... ఇద్దరు కాదు.. ఏకంగా 16 మంది నకిలీ విద్యార్థులను పరీక్షకు పంపించారు. అయితే ఇన్విజిలేటర్ క్షుణంగా తనిఖీ చేయడంతో ఈ నకిలీ విద్యార్థుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. జేఎన్టీయూ(ఏ) పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో గత నెల 25 నుంచి బీటెక్ మొదటి సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. తాడిపత్రిలోని సీవీ రామన్ ఇంజినీరింగ్ కళాశాల (సీవీఆర్టీ)కు చెందిన 16 మంది విద్యార్థులకు తాడిపత్రి ఇంజినీరింగ్ కళాశాల(టెక్)లో పరీక్ష కేంద్రం కేటాయించారు. గురువారం ఉదయం పది గంటలకు డ్రాయింగ్, బీఈఈఈ పరీక్ష ప్రారంభం కాగా, ఇన్విజిలేటర్ విద్యార్థుల హాల్టికెట్లను పరిశీలించారు. ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తున్నట్లుగా గుర్తించారు. మరింత క్షుణంగా తనిఖీ చేయగా, ఒకే కాలేజీకి చెందిన 16 మంది స్థానంలో వేరేవారు పరీక్ష రాస్తున్నట్లు గుర్తించి కళాశాల ప్రిన్సిపాల్ ఈవీ సుబ్బారెడ్డి, జేఎన్టీయూ(ఏ) అబ్జర్వర్కు సమాచారమిచ్చారు. వారు వెంటనే అక్కడికి చేరుకుని ఆయా విద్యార్థుల ఐడీ కార్డులు పరిశీలించగా, అవి కూడా నకిలీవని తేలింది. తమ విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేరని భావింన సీవీఆర్టీ కళాశాల యాజమాన్యం... అసలు విద్యార్థుల ఫొటోలతోపాటు ఐడీ కార్డులను మార్ఫింగ్ చేసి పరీక్షలు రాసేందుకు వేరేవారిని పంపినట్లు గుర్తించారు. అనంతరం నకిలీ విద్యార్థుల నుంచి స్టేట్మెంట్లను రికార్డు చేసిన జేఎన్టీయూ(ఏ) అధికారులు రూల్–3 కింద చర్యలు కేసు నవెదు చేశారు. కాగా, గతంలోనూ సర్ సీవీ రామన్ ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం అనేక మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇంజినీరింగ్ విద్యార్థులను డిగ్రీ చదువుతున్నట్లు చూపి ఫీజు రీయింబర్స్మెంట్ దందాకు పాల్పడింది. దీంతోపాటు నిబంధనల మేరకు ఇంటర్ కళాశాల ఏర్పాటు చేసేటప్పుడు ఇంటర్ బోర్డుకు సీవీ రామన్ యాజమాన్యం అందజేసిన పత్రాలు నకిలీవని బయటపడింది. కళాశాల యాజమాన్యం ఏకంగా ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ల కోసం ఓ బ్యాంకు మేనేజర్ సంతకం కూడా ఫోర్జరీ చేసినట్లు సమాచారం. చదవండి కానిస్టేబుల్ భార్య పైశాచికం.. ప్రియుడి మోజులో పడి, ఇంటికి పిలిచి.. -
తెలంగాణ ఎంసెట్లో ఏపీ స్వీప్
సాక్షి, నెట్వర్క్: తెలంగాణలో బీటెక్, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టీకల్చర్, బీవీఎస్సీ, బీఎస్సీ ఫారెస్ట్రీ, బీఫార్మసీ, బయోటెక్నాలజీ, ఫార్మ్డీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఆ రాష్ట్ర ఎంసెట్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు దుమ్ములేపారు. అటు ఇంజనీరింగ్ విభాగంలోనూ, ఇటు మెడికల్ అండ్ అగ్రికల్చర్ విభాగంలోనూ టాప్ ర్యాంకులు కొల్లగొట్టి సత్తా చాటారు. ఇంజనీరింగ్ విభాగంలో సనపల అనిరుధ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలో బూరుగుపల్లి సత్యరాజ్ జశ్వంత్ తెలంగాణ స్థాయిలో ఫస్ట్ ర్యాంకులతో భళా అనిపించారు. ఇంజనీరింగ్ విభాగంలో 2, 3, 5, 6, 8, 9, 10 ర్యాంకులు మన రాష్ట్ర విద్యార్థులకే దక్కాయి. అదేవిధంగా అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలోనూ 2, 4, 5, 7, 8 ర్యాంకులు ఎగరేసుకుపోయారు. తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం హైదరాబాద్లో తెలంగాణ ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు. కాగా ఇంజనీరింగ్ ర్యాంకర్లందరూ ఐఐటీల్లో చేరతామని, మెడికల్ విభాగం ర్యాంకర్లంతా వైద్య వృత్తిలో స్థిరపడతామని వెల్లడించారు. విజేతల అభిప్రాయాలు వైద్య రంగంలో ఉన్నతవిద్యనభ్యసిస్తా.. మాది చీరాల. నాన్న నాసిక సుధాకర్బాబు, అమ్మ శ్రీదేవి మగ్గం నేస్తారు. విజయవాడలోని ప్రైవేటు కాలేజీలో ఇంటర్మిడియెట్ చదివాను. వైద్య రంగంలో ఉన్నత విద్యనభ్యసించడమే నా లక్ష్యం. – నాసిక వెంకటతేజ, సెకండ్ ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (అగ్రి అండ్ మెడికల్ విభాగం) కార్డియాలజిస్ట్ లేదా న్యూరాలజిస్టునవుతా.. మాది తెనాలి. నాకు ఇంటర్ బైపీసీలో 983 మార్కులు వచ్చాయి. వైద్య రంగంలో స్థిరపడాలనేది నా ఆకాంక్ష. ఇప్పటికే నీట్ రాశాను. ఎంబీబీఎస్ చేసి ఆ తర్వాత కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్ లేదా గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్గా స్థిరపడాలనేదే నా కోరిక. – దుర్గెంపూడి కార్తికేయరెడ్డి, నాలుగో ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (అగ్రి అండ్ మెడికల్ విభాగం) వైద్య రంగంలో స్థిరపడతా.. మాది శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట. అమ్మానాన్న ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. నాకు నీట్లోనూ మంచి ర్యాంకు వస్తుందనే నమ్మకం ఉంది. వైద్య రంగంలో స్థిరపడాలనేది నా కోరిక. – బోర వరుణ్ చక్రవర్తి, ఐదో ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (అగ్రి అండ్ మెడికల్ విభాగం) మంచి వైద్య కళాశాలలో మెడిసిన్ చేస్తా.. మాది నెల్లూరు. అమ్మానాన్న హారతి, శంకర్ వైద్యులుగా పనిచేస్తున్నారు. మంచి మెడికల్ కళాశాలలో మెడిసిన్ చదవడమే నా లక్ష్యం. – హర్షల్సాయి, ఏడో ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (అగ్రి అండ్ మెడికల్ విభాగం) కష్టపడి చదివా.. మాది గుంటూరులోని ఏటీ అగ్రహారం. అమ్మానాన్న ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. కష్టపడి చదవడంతో తెలంగాణ ఎంసెట్లో ఎనిమిదో ర్యాంక్ సాధించాను. – సాయి చిది్వలాస్రెడ్డి, 8వ ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (అగ్రి అండ్ మెడికల్ విభాగం) కంప్యూటర్స్ సైన్స్ చదువుతా.. మాది గుంటూరు. నాన్న శ్రీనివాసరెడ్డి రైతు. ఇంటర్ ఎంపీసీలో 971 మార్కులు వచ్చాయి. జేఈఈ అడ్వాన్స్లో ర్యాంక్ సాధించి ఐఐటీ బాంబేలో సీటు సాధించడమే లక్ష్యం. – యక్కంటి ఫణి వెంకట మణిందర్రెడ్డి, సెకండ్ ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్ విభాగం) జేఈఈ అడ్వాన్స్డ్లో ర్యాంకు సాధించడమే లక్ష్యం మాది ఎన్టీఆర్ జిల్లా నందిగామ. ఇంటర్మిడియెట్ ఎంపీసీలో 983 మార్కులు సాధించాను. ఇటీవల జేఈఈ మెయిన్లో ఓపెన్ కేటగిరీలో 263వ ర్యాంక్ వచ్చింది. వచ్చే నెలలో జరగనున్న జేఈఈ అడ్వాన్స్డ్కు సిద్ధమవుతున్నా. ఇందులో మంచి ర్యాంక్ సాధించడమే నా లక్ష్యం. – చల్లా ఉమేష్ వరుణ్, థర్డ్ ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్ విభాగం) సివిల్స్ సాధించి ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం మాది అనంతపురం జిల్లా తాడిపత్రి. ఇటీవల జేఈఈ మెయిన్లో ఆలిండియాలో 97వ ర్యాంకు సాధించాను. జేఈఈ అడ్వాన్స్డ్లోనూ ర్యాంకు సాధించి ఐఐటీ బాంబేలో చేరతా. తర్వాత సివిల్స్ రాసి ప్రజలకు సేవ చేయాలన్నదే నా లక్ష్యం. – పొన్నతోట ప్రమోద్ కుమార్రెడ్డి, ఐదో ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్ విభాగం) ఐఐటీ బాంబేలో చేరతా.. మాది విశాఖపట్నం జిల్లా గాజువాక. నాన్న బిజినెస్లో ఉండగా అమ్మ ఫార్మసిస్టుగా పనిచేస్తున్నారు. ఇంటర్ ఎంపీసీలో 987 మార్కులు వచ్చాయి. జేఈఈ మెయిన్లో ఆలిండియాలో 110వ ర్యాంకు వచ్చింది. జేఈఈ అడ్వాన్స్డ్లోనూ మంచి ర్యాంకు సాధించి ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్లో చేరతా. – మరడాన ధీరజ్ కుమార్, ఆరో ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్ విభాగం) ఐఐటీ బాంబేలో ఇంజనీరింగ్ చదువుతా.. మాది శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి. నాన్న గణేష్ వ్యాపారి, అమ్మ జ్యోతి గృహిణి. జేఈఈ మెయిన్లో 729వ ర్యాంక్ సాధించాను. వచ్చే నెలలో నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్కు సిద్ధమవుతున్నా. ఐఐటీ బాంబేలో ఇంజనీరింగ్లో చేరాలనేదే నా లక్ష్యం. – బోయిన సంజన, 8వ ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్ విభాగం) కంప్యూటర్ ఇంజనీర్నవుతా.. మాది నంద్యాల. ఇంటర్ ఎంపీసీలో 956 మార్కులు వచ్చాయి. జేఈఈ అడ్వాన్స్లో ర్యాంకు సాధించి మంచి ఐఐటీలో కంప్యూటర్ సైన్స్లో చేరతా. కంప్యూటర్ ఇంజనీర్ను కావడమే లక్ష్యం. – ప్రిన్స్ బ్రన్హంరెడ్డి, తొమ్మిదో ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్ విభాగం) అడ్వాన్స్లోనూ ర్యాంక్ సాధిస్తా.. మాది విజయనగరం జిల్లా గుర్ల. నాన్న అప్పలనాయుడు రైల్వే కానిస్టేబుల్, అమ్మ ప్రభుత్వ టీచర్గా పనిచేస్తున్నారు. ఇటీవల జేఈఈ మెయిన్లో 99 శాతం పర్సంటైల్ సాధించాను. జేఈఈ అడ్వాన్స్డ్లో ర్యాంక్ సాధించి ఐఐటీ బాంబేలో చేరతా. – మీసాల ప్రణతి శ్రీజ, పదో ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్ విభాగం) -
టీచర్లుగా బీటెక్బాబులు వద్దా?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: బీటెక్ చదివి టీచర్లు అవుదామనుకున్న వారి కలలు నెరవేరేలా లేవు. ఇంజనీరింగ్ పూర్తిచేసిన పలువురు అభ్యర్థులు తాజాగా గురుకులాల్లో టీచర్ల కోసం దరఖాస్తు చేసుకుందామని ప్రయత్నించి విఫలమవుతున్నారు. కారణం.. ఓటీఆర్లో విద్యార్హతల వద్ద బీఎస్సీ, బీఏ, బీకామ్ వంటి డిగ్రీలు ఉంచిన వెబ్సైట్లో.. బీటెక్ అన్న కాలమ్ అసలు పొందుపరచనే లేదు. తాము ఎంతో కష్టపడి రెండేళ్ల బీఈడీ కోర్సు పూర్తి చేశామని, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) పరీక్ష కూడా పాసయ్యామని, తీరా ఇపుడు తమకు దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించకపోవడం అన్యాయమంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2019లో తెలంగాణ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో టీచర్ పోస్టులకు తమను అనుమతించడం లేదంటూ కొందరు బీటెక్తోపాటు, బీఈడీ చేసిన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. అపుడు కూడా ఇదే తరహాలో దరఖాస్తులో తమకు బీటెక్ కాలమ్ కనిపించ లేదని చెప్పారు. దీనికి ప్రభుత్వం సమాధానమిస్తూ.. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) 2010 మార్గదర్శకాల ప్రకారమే తాము నోటిఫికేషన్ జారీ చేశామని తేల్చిచెప్పింది. దీనిపై స్పందించిన హైకోర్టు ఎన్సీటీఈ–2014 మార్గదర్శకాల ప్రకారం.. బీటెక్తోపాటు బీఈడీ చేసినవారంతా టీజీటీ పోస్టులకు అర్హులేనని హైకోర్టు స్పష్టంచేసింది. ఈ మేరకు తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖాధిపతులను ఆదేశించింది. మళ్లీ ఇప్పుడూ అదే సమస్య గతంలో ఇదే వ్యవహారంపై హైకోర్టు వరకూ వెళ్లిన నేపథ్యంలో ఈసారి టీచర్ పోస్టులకు సంబంధించి వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని అనుకున్నారు. కానీ, తీరా దరఖాస్తు ఫారం ఓపెన్ చేసే సరికి తిరిగి అదే సమస్య పునరావృతమవడంతో తలలు పట్టుకుంటున్నారు. ఈ విషయమై పలువురు బీటెక్–బీఈడీ అభ్యర్థులు తొలుత గురుకుల కార్యాలయాలకు వరుసగా ఫోన్లు చేసినా.. ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. కొందరు అధికారులు అయితే.. బీటెక్ బీఈడీ వారికి అసలు అర్హతే లేదని, మీరు దరఖాస్తు చేసుకోవద్దని చెబుతున్నారని వారు అంటున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
బీటెక్ అమ్మాయి.. బుల్లెట్పై హైజీనిక్ పానీపూరి
ఈ మధ్య చదువులకు, చేసే పనికి సంబంధం ఉండటం లేదు. డిగ్రీలున్నా ఉద్యోగ అవకాశాలు లేక కొందరు చిరు వ్యాపారాలతో స్వయం ఉపాధి చూసుకుంటుంటే మరికొందరు మాత్రం డిగ్రీ చేసినా ప్రత్యేకమైన లక్ష్యంతో చిరువ్యాపారాల బాట పడుతున్నారు. 21 ఏళ్ల తాప్సీ ఉపాధ్యాయ్.. బీటెక్ పానీపూరి వాలీగా ప్రసిద్ధి చెందారు. బుల్లెట్ బండికి ఏర్పాటు చేసుకున్న చిన్న బండిపై ఆమె పానీపూరీలను విక్రయిస్తున్నారు. బీటెక్ పూర్తి చేసిన తర్వాత ఆమె ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు. ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతోనే తాను ఈ వ్యాపారాన్ని ప్రారంభినట్లు తాప్సీ చెబుతున్నారు. (జీవితాంతం ఒంటరిగానే ఉంటా కానీ! హోలీ యాడ్పై దుమారం: అసలేమైంది?) ఇదీ చదవండి: టాప్ సీక్రెట్ చెప్పిన గూగుల్ మాజీ వైస్ ప్రెసిడెంట్... ఇది ఉంటే జాబ్ పక్కా! View this post on Instagram A post shared by Are you hungry (@are_you_hungry007) తాజాగా ఆమె బుల్లెట్ వాహనానికి పానీపూరి బండిని కట్టుకుని తీసుకెళ్తున్న వీడియోను ఓ వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా వైరల్గా మారింది. అంత చదువు చదువుకుని ఇలా పానీపూరీ అమ్ముకుంటున్నావేంటి అని చాలా మంది ప్రశ్నించారని, కొందరైతే భద్రంగా ఉండాలంటే ఇంటికి తిరిగి వెళ్లాలని సలహా ఇచ్చారని తాప్సీ చెప్పారు. ఈ వీడియో పోస్ట్ చేసినప్పటి నుంచి దాదాపు మూడు లక్షల లైక్లు వచ్చాయి. ఆ యువతి స్ఫూర్తిని అభినందిస్తూ పలువురు కామెంట్లు పెట్టారు. -
బీటెక్లోకి అనుమతించండి
సాక్షి, హైదరాబాద్: రెండేళ్లపాటు కరోనా కారణంగా పీయూసీలో తక్కువ జీపీఏ వచ్చినందున.. మానవతా దృక్పథంతో బీటెక్లోకి అనుమతించాలని బాసర ట్రిపుల్ ఐటీలో చదివిన పలువురు విద్యార్థులు విద్యా మంత్రి సబిత ఇంద్రారెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రిని కలిసి వేడుకున్నారు. నిరుపేద కుటుంబాల నుంచి వచ్చా మని తమ పరిస్థితిని వివరించారు. టెన్త్లో అత్య« దిక మార్కులు వస్తేనే బాసర ట్రిపుల్ ఐటీలో సీటు వస్తుందని ప్రభుత్వానికీ తెలుసునని వారు స్పష్టం చేశారు. పీయూసీలో గ్రేడ్ తక్కువ రావడానికి రెండేళ్లుగా ఉన్న పరిస్థి తులే కారణమని గుర్తించకపోవడం సరికాదని పేర్కొన్నారు. కోవిడ్ కారణంగా ఆన్లైన్ క్లాసులు నిర్వహించారని, తమ కుటుంబాల్లో సెల్ఫోన్ కూడా కొనలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి స్మార్ట్ ఫోన్లు కొనిచ్చినా నెట్ బ్యాలెన్స్కు ఖర్చు పెట్టలేకపోయామని వారు తెలిపారు. నెట్వర్క్ సరిగ్గా పనిచేయని పల్లెల్లో ఉండటం వల్ల ఆన్లైన్ క్లాసులు సరిగా వినలేకపోయామనినిజామాబాద్కు చెందిన విద్యార్థిని ఎం.అంజలి వాపోయింది. విద్యార్థుల ఆవేదనపై ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫె సర్ ఆర్.లింబాద్రి స్పందిస్తూ వెంటనే విషయాన్ని బాసర అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విద్యా ర్థులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.ఈ విషయమై బాసర ట్రిపుల్ ఐటీ వీసీ ప్రొఫెసర్ వి.వెంకట రమణ స్పంది స్తూ, 6 జీపీఏ లేకుండా ఇంజనీరింగ్లోకి అనుమ తించకూడదనే నిబంధన ఉందని స్పష్టం చేశా రు. అయినప్పటికీ ఈ విషయాన్ని బోర్డ్ సమా వేశంలో చర్చిస్తామని, సానుకూల నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. -
ఎన్నో ఉద్యోగాలు వదులుకున్నాడు.. చివరికి అరకోటి ప్యాకేజీతో షాకిచ్చాడు!
ప్రస్తుత రోజుల్లో నాలుగంకెల ఉద్యోగం వస్తే చాలు ఈ పోటీ ప్రపంచంలో అలాంటి జాబ్ దొరకడం కూడా కష్టం అని కొందరు అనుకుంటారు. జీతం ఎంతైనా ఐ డోంట్ కేర్ మనల్ని కంపెనీలు సెలక్ట్ చేసుకోవడం కాదు మనమే కంపెనీలని ఎంచుకోవాలని కొందరు అనుకుంటారు .ఇలానే అనుకున్నాడు ఓ బీటెక్ విద్యార్థి. కాగ్నిజెంట్, అమెజాన్ లాంటి ప్రముఖ కంపెనీల్లో వచ్చిన ఉద్యోగాలను సైతం పక్కన పెట్టాడు. కొడితే కుంభస్థలాన్ని కొట్దాలిరా అనుకున్నాడో ఏమో మైక్రోసాఫ్ట్ లో 50 లక్షల ప్యాకేజీతో జాబ్ ఆఫర్ కొట్టి అందరి చేత ఆహా అనిపించాడు. అతడే మధుర్ రఖేజా. దుకాణదారుడి కొడుకు నుంచి మైక్రోసాఫ్ట్ ఉద్యోగిగా ఎదిగాడు ఓ దుకాణదారుడి కొడుకు తన జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కలల కన్నాడు. వాటి కోసం అంతే శ్రమించాడు. పట్టు వదలక క్యాంపస్ ఇంటర్వ్యూలో మైక్రోసాఫ్ట్ లాంటి ప్రఖ్యాత కంపెనీలో రూ.50 లక్షల జాబ్ కొట్టి అనుకున్నది సాధించడమే గాక తన తల్లిదండ్రులను గర్వించేలా చేశాడు మధుర్ రఖేజా. అతను యూపీఈఎస్ (UPES) స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ నుంచి ఆయిల్ అండ్ గ్యాస్ ఇన్ఫర్మేటిక్స్లో స్పెషలైజేషన్తో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్లో (బీటెక్) పూర్తి చేశాడు. యూనివర్శిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్ (UPES) డెహ్రాడూన్లోని ఓ మల్టీడిసిప్లినరీ విశ్వవిద్యాలయం. టెక్నాలజీ అంటే ఎంతో ఇష్టం తన పయనం గురించి మధుర్ మాట్లాడుతూ.. టెక్నాలజీ అంటే నాకు ఎంతో ఆసక్తి. ఎందుకంటే ప్రజల జీవితాలను మార్చగల సామర్థ్యం దానికి ఉంది. అంతటి ప్రాముఖ్యత, ప్రత్యేకత ఉంది కనుకే అలాంటి ప్రత్యేకమైన కోర్సును ఎంచుకున్నాను. అప్ స్ట్రీమ్ పెట్రోలియానికి సంబంధించి నాకు ఒకతను చెప్పాడు. కంప్యూటర్ సైన్స్లో ఆయిల్ అండ్ గ్యాస్ ఇన్ఫర్మేటిక్స్లో స్పెషలైజేషన్ ఉందని నాకు అప్పుడే తెలిసింది. అందుకే.. దాన్ని ఎంచుకున్నానని చెప్పాడు. వచ్చింది కాదు నచ్చింది చేయాలి మొదట తాను కొన్ని కంపెనీల జాబితాను తయారు చేసుకున్నాడు. అందులో మైక్రోసాఫ్ట్ కూడా ఉంది. మొదటగా ఇతరుల ఇంటర్వ్యూ అనుభవాలను చదవడంతో పాటు ఇంటర్య్వూకు అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోవడం ద్వారా ఎంపిక ప్రక్రియకు సిద్ధమైనట్లు వివరించాడు. మైక్రోసాఫ్ట్తో పాటు, అమెజాన్, ఆప్టమ్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్తో పాటు మరిన్ని వాటికి దరఖాస్తు చేసుకుని తాను తలపెట్టిన మహాయజం చివరికి మైక్రోసాఫ్ట్ ద్గగర ఆగిందని చెప్పుకొచ్చాడు. మధుర్ అనేక కంపెనీలకు దరఖాస్తు చేసుకున్నారు. -
Woman combat pilot: ఫస్ట్ టైమ్ అభిలాష నెరవేరింది
చిన్నప్పుడు అభిలాషకు తండ్రి కథలు చెప్పేవాడు. అవి కాలక్షేప కథలు, కంచికి వెళ్లే కథలు కావు. మన వీరసైనికుల నిజమైన జీవిత కథలు. ఆ కథలు వింటూ పెరిగిన అభిలాష భారత సైన్యంలో పనిచేయాలని గట్టిగా అనుకుంది. తాజాగా ‘ఇండియన్ ఆర్మీ ఫస్ట్ ఉమన్ కంబాట్ ఏవియేటర్’గా చారిత్రక గుర్తింపు పొందింది కెప్టెన్ అభిలాష బరాక్. అభిలాష బరాక్కు మిలిటరీ అనే మాట కొత్త కాదు. నాన్న ఓమ్సింగ్ సైనిక అధికారి. దీంతో దేశంలోని రకరకాల కంటోన్మెంట్లలో పెరిగింది అభిలాష. సైనికుల వీరగాథలను తండ్రి స్ఫూర్తిదాయకంగా చెబుతుండేవాడు. ఆ ప్రభావం తన మీద పడింది. అలా మిలిటరీలో పనిచేయాలనే కలకు అంకురార్పణ జరిగింది. ఒకరోజు ఇండియన్ మిలిటరీ అకాడమీలో తన సోదరుడి పాసింగ్ ఔట్ పరేడ్కు హాజరైంది అభిలాష. ఆ వాతావరణం తనను ఎంత ఉత్తేజపరిచింది అంటే...పనిచేస్తే మిలిటరీలోనే పనిచేయాలన్నంతగా. ‘మిలిటరీ యూనిఫామ్’లో తనను తాను చూసుకొని మురిసిపోవాలనుకునేంతగా! ‘నా లక్ష్యాన్ని మరింత బలోపేతం చేసుకున్న రోజు అది’ అని గతాన్ని గుర్తు చేసుకుంది అభిలాష. దిల్లీ టెక్నాలజికల్ యూనివర్శిటీలో బీటెక్ పూర్తిచేసిన అభిలాష 2018లో ‘ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కాప్స్’లో చేరింది. దీనికి ముందు కొన్ని ప్రొఫెషనల్ మిలిటరీ కోర్స్లు పూర్తిచేసింది. ‘ఇండియన్ ఆర్మీ ఏవియేషన్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు ఇది. కంబాట్ ఏవియేషన్ కోర్స్ విజయవంతంగా పూర్తి చేసిన కెప్టెన్ అభిలాష ఇండియన్ ఆర్మీ ఫస్ట్ ఉమన్ కంబాట్ ఏవియేటర్...’ అని ఆర్మీ తన అధికార ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా తెలియజేసింది. ప్రత్యేక విధులు నిర్వర్తించే దళంగా ప్రసిద్ధమైన ఏవియేషన్ కాప్స్కు ఉన్న ఘనచరిత్ర తక్కువేమీ కాదు. రుద్ర, చీతా, ధృవ...మొదలైన హెలికాప్టర్లను ఆపరేట్ చేయడంతో పాటు సియాచిన్లాంటి సున్నిత ప్రాంతాలలో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తుంది. ‘రెట్టించిన అంకితభావంతో పనిచేయడానికి తాజా బాధ్యత ప్రేరణ ఇస్తుంది’ అంటుంది హరియాణాకు చెందిన 26 సంవత్సరాల అభిలాష ‘స్విఫ్ట్ అండ్ ష్యూర్’ అనేది మన సైన్యానికి సంబంధించిన లక్ష్య ప్రకటిత నినాదం. ఈ నినాదాన్ని వేగంగా అందుకున్న యువ సైనికులలో అభిలాష ఒకరు. ఆమెకు అభినందనలు. -
ఎంటెక్ చేశావా.. టీచింగ్ చేస్తావా?
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక విద్యలో మాస్టర్ డిగ్రీ (ఎంటెక్) పూర్తి చేసిన అభ్యర్థులకు మంచి అవకాశాలు రాబోతున్నాయి. ముఖ్యంగా బీటెక్ కంప్యూటర్ సైన్స్ సహా దాని అనుబంధ కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారికి ఉజ్వల భవిష్యత్ ఉండబోతోంది. రాష్ట్రంలో కొత్త వర్సిటీలు, సాంకేతిక కోర్సుల్లో సీట్లు పెరుగుతుండటం.. మరోవైపు కొన్నేళ్లుగా ఎంటెక్లో ప్రవేశాలు తగ్గుతుండటంతో ఇప్పటికే ఎంటెక్ చేసిన వారికి బోధన రంగంలో మున్ముందు డిమాండ్ పెరగనుందని నిపుణులు చెబుతున్నారు. ఈ రంగంలో మరో రెండేళ్లలో వేతనాలు రెట్టింపయ్యే అవకాశముందని అంటున్నారు. కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న కొరత రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ సీట్లు గత మూడేళ్లుగా పెరుగుతున్నాయి. అదనపు సెక్షన్లు వస్తున్నాయి. దీనికి తోడు కొత్తగా ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు ప్రభుత్వం ఇటీవల అనుమతిచ్చింది. ఇవి కూడా ఎక్కువగా మార్కెట్లో డిమాండ్ ఉండే కోర్సులకే ప్రాధాన్యమిస్తున్నాయి. ఇవన్నీ ఎంటెక్ అభ్యర్థులకు కలిసి వస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే కంప్యూటర్ సైన్స్ సీట్లు పెరిగినా అధ్యాపకుల కొరత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రభుత్వ వర్సిటీల్లోనే దాదాపు 3 వేలకుపైగా ఖాళీలున్నట్టు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. చాలా కాలేజీలు ఇతర రాష్ట్రాల నుంచి ఫ్యాకల్టీని ఆహ్వానిస్తున్నా వేతనాలు ఎక్కువగా ఇవ్వాల్సి వస్తోందని భావిస్తున్నాయి. స్థానికంగా ఎంటెక్ పూర్తి చేసిన విద్యార్థులకు రూ. 50 వేల లోపే వేతనాలు ఇవ్వడానికి ప్రైవేటు కాలేజీలు సిద్ధపడుతున్నాయి. ఇతర రాష్ట్రాల వాళ్లు రూ. లక్షకు పైగా డిమాండ్ చేస్తున్నారు. రెండేళ్లలో భారీగా అవసరం అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీసీ) మార్గదర్శకాల ప్రకారం బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఇతర కంప్యూటర్ కోర్సులు బోధించేందుకు ప్రతి 20 మంది విద్యార్థులకు ఓ అధ్యాపకుడు ఉండాలి. రాష్ట్రంలో కన్వీనర్ కోటా కిందే దాదాపు 80 వేలకు పైగా బీటెక్ సీట్లున్నాయి. ఇందులో 75 శాతం కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐవోటీ, మెషీన్ లెర్నింగ్, రోబోటిక్స్ వంటి కోర్సులున్నాయి. మిగతా కోర్సుల్లో (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) సీట్లు చాలా వరకు మిగులుతున్నాయి. కంప్యూటర్ సైన్స్ కోర్సులకు బోధించడానికి 3 వేల మంది సంబంధిత సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్లు అవసరం. ప్రస్తుతం 2 వేల మందే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. దీంతో 60 మందితో సెక్షన్లు నిర్వహిస్తున్నారు. 2024–25 నాటికి పెరిగే సీట్లను బట్టి కనీసం 10 వేల మంది కంప్యూటర్ సైన్స్, కొత్త కోర్సులు బోధించే వాళ్లు కావాలి. కొత్త వర్సిటీలు వస్తే ఈ సంఖ్య మరింత పెరగనుంది. కొరత ఎందుకు? సాధారణంగా విద్యార్థులు బీటెక్ కంప్యూటర్ సైన్స్, కొత్త కోర్సులు పూర్తి చేసిన తర్వాత ఉపాధి వైపే వెళ్తున్నారు. క్యాంపస్ రిక్రూట్మెంట్లో కొంతమంది ఎంపికవుతున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ప్రారంభంలోనే రూ. 40 వేల నెలసరి వేతనం పొందే వీలుంది. దీంతో ఎంటెక్ చేయాలని విద్యార్థులు ఆలోచించట్లేదు. మరికొంత మంది విదేశాల్లో ఎంఎస్ కోసం వెళ్తున్నారు. ఫలితంగా ఏటా ఎంసెట్లో సీట్లు భారీగా మిగులుతున్నాయి. ప్రైవేటు కాలేజీల్లో ఫ్యాకల్టీ ఎలా ఉందో.. గుర్తింపునిచ్చే వర్సిటీలూ పట్టించుకోవట్లేదు. నాణ్యమైన అధ్యాపకులు లేరని గుర్తించినా విధిలేక అఫిలియేషన్ ఇస్తున్నారు. దీంతో ప్రైవేటు కాలేజీలు అధ్యాపకులకు వేతనాలు అరకొరగా ఇస్తున్నాయనే ఆరోపణలున్నాయి. సాఫ్ట్వేర్తో సమానంగా వేతనం ఉంటే తప్ప బోధన వైపు మళ్లే అవకాశం కనిపించట్లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మున్ముందు కొరతను ఎలా అడ్డుకుంటారనేది ప్రశ్నార్థకమే. జీతాలు పెంచితే కొంత మార్పు రావొచ్చు ఓవైపు కంప్యూటర్ కోర్సులు పెరుగుతున్నాయి. మరోవైపు సంబంధిత విభాగాల్లో ఎంటెక్ చేసేవారి సంఖ్య తక్కువగా ఉంది. ఈ తేడాను పూడ్చాలి. బీటెక్తోనే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తున్నాయి. ఎంఎస్కు విదేశాలకు వెళ్తున్నారు. బోధించేందుకు వారు ఎందుకు ఇష్టపడట్లేదో తెలుసుకోవాలి. ఆకర్షణీయమైన వేతనాలు ఇస్తే కొంత మార్పు రావొచ్చు. – ప్రొఫెసర్ వి వెంకటరమణ (ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్) -
ఐదు జవాబులు రాస్తే సరి..
సాక్షి, హైదరాబాద్: జేఎన్టీయూహెచ్ సాంకేతిక విద్య కోర్సుల్లోని విద్యార్థులకు యూనివర్సిటీ ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కనీస హాజరుశాతం నుంచి మినహాయింపునిచ్చింది. అలాగే సులభతరమైన పరీక్షావిధానాన్ని ప్రకటించింది. గతానికి భిన్నంగా ఈ సారి కేవలం 8 ప్రశ్నలనే పరీక్షల్లో ఇస్తారు. ఇందులో ఐదింటికి సమాధానం రాస్తే సరిపోతుంది. బీటెక్, బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మాడీ, ఫార్మాడీ (పీబీ) కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ఇది వర్తిస్తుందని జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ డాక్టర్ మంజూర్ హుస్సేన్ బుధవారం ‘సాక్షి’ప్రతినిధికి తెలిపారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4 లక్షల (నాలుగేళ్లకు కలిపి)మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. మిగతా యూనివర్సిటీలు కూడా ఇదే విధానాన్ని అనుసరించనున్నట్టు ఉన్నత విద్యామండలి వర్గాలు తెలిపాయి. గతానికి ఇప్పటికీ తేడా ♦సాధారణంగా కాలేజీ పనిదినాల్లో 75 శాతం హాజరు ఉంటేనే పరీక్షలకు అనుమతిస్తారు. ఇందులో 10 శాతం మెడికల్ గ్రౌండ్లో మినహాయింపు ఉంటుంది. కానీ ఈ సంవత్సరం ప్రత్యక్ష బోధన ఆలస్యమైంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని హాజరు శాతాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. ♦కరోనాకు ముందు ప్రశ్నపత్రం రెండు భాగాలుగా (పార్ట్–ఏ, పార్ట్–బీ) ఉండేది. పార్ట్–ఏ నుంచి మూడు మార్కుల ప్రశ్నలు ఐదు, రెండు మార్కులవి 5.. మొత్తం 25 మార్కులుంటాయి. పార్ట్–బీలో ఐదు మార్కుల ప్రశ్నలు 10 ఇస్తారు. దీంతో రెండు పార్టుల్లో మొత్తం 75 మార్కులు, ఇంటర్నల్స్ 25 మార్కులకు పరీక్ష విధానం ఉండేది. ♦ఇప్పుడు ఒకే పార్ట్గా పరీక్ష ఉంటుంది. మొత్తం 8 ప్రశ్నలిస్తారు. ఇందులో ఐదింటికి జవాబులు రాస్తే సరిపోతుంది. ఒక్కో ప్రశ్నకు 15 మార్కులు.. మొత్తం 75 మార్కులుంటాయి. ఇంటర్నల్స్కు 25 మార్కులు ఉంటాయి. కనీస పాస్ మార్క్ 40 (ఇంటర్నల్స్తో కలిపి)గా నిర్ణయించారు. -
బిటెక్ గ్రాడ్యుయేట్లకు శుభవార్త ! శామ్సంగ్ భారీ నియామకాలు
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ శామ్సంగ్ వచ్చే ఏడాది భారత్లో 1,000 మందికిపైగా ఇంజనీర్లను చేర్చుకోనుంది. ఐఐటీలతోపాటు బిట్స్ పిలానీ, ఎన్ఐటీల వంటి ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలల నుంచి కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, కంప్యూటింగ్, ఇన్స్ట్రుమెంటేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 2022లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంటున్న అభ్యర్థులను ఎంపిక చేసుకోనున్నట్టు ప్రకటించింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, ఐవోటీ, డీప్ లెర్నింగ్, నెట్వర్క్స్, ఇమేజ్ ప్రాసెసింగ్, క్లౌడ్, డేటా అనాలసిస్, ఆన్–డివైస్ ఏఐ, కెమెరా టెక్నాలజీ వంటి విభాగాల కోసం వీరిని నియమించుకోనున్నట్టు తెలిపింది. చదవండి: గూగుల్, యాపిల్ను తలదన్నేలా శామ్సంగ్ ప్లాన్ -
OU: 2016కు ముందు పీహెచ్డీ అడ్మిషన్లు రద్దు!
ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): వచ్చే నెల చివరి నాటికి పీహెచ్డీ పరిశోధనలు పూర్తి చేయకుంటే 2016 కంటే ముందు ప్రవేశం పొందిన విద్యార్థుల అడ్మిషన్లను రద్దు చేయనున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. నిబంధనల ప్రకారం పీహెచ్డీ నాలుగేళ్లలో పూర్తి చేయాలని, అలా పూర్తి చేయని విద్యార్థులకు రెండేళ్ల గడువు పొడిగిస్తామని అధికారులు తెలిపారు. మొత్తం ఆరేళ్లు దాటిన పీహెచ్డీ విద్యార్థుల అడ్మిషన్లను రద్దు చేస్తామని, ఇంత వరకు పూర్తి చేయని అభ్యర్థులు వెంటనే థీసిస్ను సమర్పించాలని అన్నారు. బయోమెట్రిక్ లేకుంటే జరిమానా సాక్షి, హైదరాబాద్: జేఎన్టీయూహెచ్ గుర్తింపు ఉన్న అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయాలని యూనివర్సిటీ అధికారులు మరో సారి గుర్తుచేశారు. ఈ నిబంధన అనుసరించని కాలేజీకి రూ.20 వేలు జరిమానా విధిస్తామని, అవసరమైతే కాలేజీ గుర్తింపు కూడా రద్దు చేస్తామని జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో తెలిపారు. హాజరు మొత్తం యూనివర్సిటీకి అనుసంధానమయ్యేలా ఏర్పా టు చేసుకోవాలని సూచించారు. నవంబర్ 1 నుంచి బయోమెట్రిక్ హాజరును జేఎన్టీయూ హెచ్ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. బీటెక్ మేనేజ్మెంట్ సీట్ల గడువు 20 వరకు పెంపు సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్, ఫార్మాకాలేజీల్లో యాజమాన్య కోటా సీట్ల ప్రవేశానికి గడువు పొడిగించినట్లు ఉన్నత విద్యామండలి సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈనెల 20వ తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కాలేజీలను ఆదేశించింది. వాస్తవానికి యాజమాన్య కోటా సీట్ల భర్తీని గతనెల 30వ తేదీలోగా పూర్తిచేయాల్సి ఉంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో కొత్తగా వస్తున్న కంప్యూటర్ సైన్స్ సీట్లను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. -
ప్రాంతీయ భాషల్లో బీటెక్ సాధ్యమేనా?
సాక్షి, అమరావతి: నూతన విద్యావిధానంలో పేర్కొన్న మేరకు ప్రాంతీయ భాషల్లో బీటెక్ కోర్సుల నిర్వహణకు అనుమతులు మంజూరు చేయాలని అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నిర్ణయించింది. కొత్త విద్యాసంవత్సరం నుంచి ఇది అమలు కానుందని కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా శనివారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీటెక్ వంటి సాంకేతిక కోర్సులను స్థానిక భాషల్లో నిర్వహించడం ఎంతవరకు సాధ్యమన్నది చర్చ సాగుతోంది. ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్ కోర్సుల అమలు కష్టమని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. స్థానిక భాషల్లో సాంకేతిక పదజాలం ఏది? స్థానిక భాషల్లో బీటెక్ కోర్సులు అమలు చేయాలంటే ముఖ్యంగా ఆయా పాఠ్యాంశాలకు సంబంధించిన సాంకేతిక పదజాలం ప్రాంతీయ భాషల్లో లేదు. వాటిని ఏదోలా తర్జుమా చేసినా విద్యార్థులకు పదాలు అర్థమవడం కష్టమే. ప్రస్తుతం ఇంజనీరింగ్ సహా అనేక అంశాల పరిజ్ఞానం ఆంగ్లంలోనే లభ్యమవుతోంది. ఆ భాషలో నైపుణ్యమున్న వారికే ఆ పరిజ్ఙానం ఎక్కువగా పొందగలుగుతున్నారు.ప్రాంతీయ భాషల్లో బీటెక్ కోర్సులను నిర్వహించడం, అభ్యసించడం కష్టమే కాకుండా అలా చదువులు పూర్తిచేసిన వారికి ఉద్యోగావకాశాలు దొరకడం గగనంగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగ అవకాశాలు దక్కవు ప్రస్తుతం ప్రపంచంలో ఇంగ్లిషు మాధ్యమంలో విద్యనభ్యసించిన వారికే ప్రాధాన్యం దక్కుతోంది. తెలుగు వంటి స్థానిక భాషల్లో ఇంజనీరింగ్ కోర్సులు నిర్వహించడం చాలా కష్టం. అందరూ ఎల్కేజీ నుంచే ఆంగ్ల మాధ్యమానికి మొగ్గుచూపుతున్న తరుణంలో తెలుగు మాధ్యమంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరేందుకు ఎవరూ ముందుకు రారు. తెలుగులో ఇంజనీరింగ్ చేసేవారికి ఉద్యోగాలు కల్పించేందుకు కంపెనీలు ముందుకురావు. – చొప్పా గంగిరెడ్డి, ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు ఆప్షన్ మాత్రమే ప్రాంతీయ భాషల్లో బీటెక్ కోర్సులు అమలు చేయాలన్నది జాతీయ నూతన విద్యావిధానంలో పాలసీగా పెట్టినా అది ఆప్షన్ మాత్రమే. దేశంలోని 11 ప్రాంతీయ భాషల్లో కొన్ని ఎంపికచేసిన ఇంజినీరింగ్ ప్రోగ్రామ్లకు సంబంధించిన పాఠ్యాంశాలను కూడా తర్జుమా చేయించారు. కాలేజీలు తమకు నచ్చితే అమలు చేయవచ్చు. వద్దనుకుంటే ప్రస్తుతం కొనసాగుతున్న ఆంగ్ల మాధ్యమంలోనే బీటెక్ కోర్సులను కొనసాగించవచ్చు. అది వారిష్టం. – సతీష్చంద్ర, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఉన్నతవిద్యాశాఖ -
ఎవర్ గ్రీన్.. పెట్రోలియం ఇంజనీరింగ్!
ప్రపంచ వ్యాప్తంగా ఇంధన వినియోగం పెరుగుతోంది. ముఖ్యంగా పెట్రో ఉత్పత్తులకు తరగని డిమాండ్. ముడి చమురును భూమి నుంచి వెలికితీసి.. ఇంధనంగా మార్చే క్రమంలో ఎన్నో దశలు దాటాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించే వారే.. పెట్రోలియం ఇంజనీర్లు. భూమి లోపల ఉన్న పెట్రోలియం, సహజవాయువు నిక్షేపాలను గుర్తించి.. వెలికి తీయడానికి అవసరమైన నైపుణ్యాలను అందించే కోర్సు.. పెట్రోలియం ఇంజనీరింగ్! అవకాశాల పరంగా ఎవర్గ్రీన్ బ్రాంచ్గా నిలుస్తున్న పెట్రోలియం ఇంజనీరింగ్పై ప్రత్యేక కథనం.. పెట్రోలియం ఇంజనీరింగ్కు సంబంధించి యూజీ(అండర్ గ్రాడ్యుయేట్), పీజీ(పోస్ట్ గ్రాడ్యుయేట్), పీహెచ్డీ స్థాయి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. యూజీ స్థాయిలో దేశంలోని పలు విద్యా సంస్థలు బీటెక్/ఎంటెక్ ప్రోగ్రామ్స్ను అం దిస్తున్నాయి. నాలుగేళ్ల బీటెక్ పెట్రోలియం ఇంజనీ రింగ్ని విజయవంతంగా పూర్తి చేసిన తరువాత.. రెండేళ్ల ఎంటెక్ కోర్సులో చేరే అవకాశం ఉంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ తరువాత పరిశోధనల దిశగా కొనసా గాలనుకుంటే.. పీహెచ్డీలో ప్రవేశం పొందొచ్చు. పెట్రోలియం కోర్సులు పెట్రోలియం ఇంజనీరింగ్లో బీటెక్/ఎంటెక్తో పా టు పలు ఇన్స్టిట్యూట్స్ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్+ ఎంటెక్ కోర్సునూ అందిస్తున్నాయి. మరికొన్ని కాలే జీలు పెట్రోలియం విభాగంలో ఎంఎస్ కోర్సుల్లో నూ ప్రవేశాలు కల్పిస్తున్నాయి. అంతేకాకుండా మేనేజ్మెంట్ విద్యకు సంబంధించి ఎంబీఏ –పెట్రోలియం కోర్సు కూడా అందుబాటులో ఉంది. అర్హతలు ► బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి 10+2/ ఇంటర్మీడియెట్ ఎంపీసీ(మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) ఉత్తీర్ణత ఉండాలి. దాంతోపాటు సంబం ధిత ఎంట్రెన్స్ టెస్ట్లు జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్, యూపీఈఎస్ఈఏటీ (యూనివర్సి టీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్, డెహ్రా డూన్) ర్యాంకు ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ► పీజీ స్థాయిలో ఎంటెక్లో చేరేందుకు బీఈ/ బీటెక్ పెట్రోలియం ఇంజనీరింగ్ ఉత్తీర్ణతతో పాటు గేట్(గ్రాడ్యుయేట్ అప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్)లో ర్యాంకు సాధించాలి. ఇన్స్టిట్యూట్స్ ఎ ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్(ఐఐటీ)–ధన్బాద్; యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్–డెహ్రాడూన్; పండిట్ దీన్దయాళ్ పెట్రోలియం యూనివర్సిటీ–గాంధీనగర్; ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ– విశాఖపట్నం; మహారాష్ట్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–పుణె; రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ–యూపీ; ఐఐటీ–ఖరగ్పూర్ (పీజీ స్థాయి); ఐఐటీ –గౌహతి(పీజీ స్థాయి); జేఎన్టీయూ–కాకినాడ తదితర ఇన్స్టిట్యూట్స్ పెట్రోలియం ఇంజనీరింగ్ కోర్సులు అందిస్తున్నాయి. జాబ్ ప్రొఫైల్స్ యూజీ, పీజీ స్థాయిలో పెట్రోలియం ఇంజనీరింగ్ కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్థులు.. ఫీల్డ్ ఆపరే టర్, టెస్టింగ్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్, టెక్నీషియన్, జూనియర్ ఇంజనీర్, రీసెర్చ్ ఇంజనీర్, రిజ ర్వాయర్ ఇంజనీర్, డ్రిల్లింగ్ ఇంజనీర్, పైప్లైన్ ఇంజనీర్, సైంటిస్ట్ జియాలజిస్ట్, మినరాలజిస్ట్, వెల్ స్టిమ్యులేటింగ్ ఇంజనీర్ వంటి ఉద్యోగాలు దక్కించుకోవచ్చు. కెరీర్ స్కోప్ పెట్రోలియం ఇంజనీరింగ్ కోర్సులు చేసిన ప్రతిభా వంతులకు దేశవిదేశాల్లో డిమాండ్ నెలకొంది. ముఖ్యంగా ప్రస్తుతం దేశంలో చమురు, సహజవా యు నిక్షేపాల అన్వేషణ విస్తృతంగా కొనసాగుతోంది. దాంతో దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల్లో అవకాశాలకు కొదవలేదు. ముఖ్యంగా హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్పీసీఎల్), ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్ జీసీ), ఆయిల్ ఇండియా లిమిటెడ్(ఓఐఎల్), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్), గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, రిలయన్స్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్, అస్సాం పెట్రోలియం లిమిటెడ్ తదితర కంపెనీల్లో కొలువులు సొంతం చేసుకోవచ్చు. వేతనాలు చమురు రంగం అభివృద్ధి పథంలోనే ఉంటుంది. కాబట్టి పెట్రోలియం ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి.. చక్కటి ఉద్యోగాలు లభిస్తున్నాయి. వీరు ఆకర్షణీయ వేతనాలు సైతం అందుకోవచ్చు. పెట్రో లియం ఇంజనీరింగ్ కోర్సు పూర్తికాగానే వార్షిక ప్రారంభ వేతనం రూ.5 లక్షల నుండి రూ.8 లక్షల వరకు దక్కుతోంది. గేట్ ర్యాంకు ద్వారా ఓఎన్జీసీ లాంటి కంపెనీల్లో అవకాశం అందుకుంటే.. రూ.పది లక్షలకు పైగానే వార్షిక వేతనం అందుతుంది. అనుభవం ఉన్నవారికి గల్ఫ్ దేశాలలో భారీ వేతనాలు లభిస్తున్నాయి. ఆన్షోర్, ఆఫ్షోర్ విభాగాల్లో పని చేసేవారికి వేతనాలతోపాటు ఇతర అలవెన్సులు సైతం ఇస్తున్నారు. క్యాంపస్లోనే ఆఫర్స్ పెట్రోలియం రంగంలో అవకాశాలు ఏటే టా పెరుగుతున్నాయి. ప్రస్తుతం పెట్రోలియం ఇంజనీరింగ్ ప్రత్యేక విభాగంగా అభివృద్ధి చెందింది. ఈ కోర్సు పూర్తిచేసినవారు క్యాంపస్ లోనే భారీ వేతనాలతో ఉద్యోగాలు పొందుతున్నారు. కాకినాడ, జేఎన్టీయూలో 2010లో ఈ విభాగం ప్రారంభించాక.. ఆరు బ్యాచ్ల విద్యార్థులు బయటకు వెళ్లారు. అందరూ కెరీర్లో బాగా సెటిల్ అయ్యారు. ఓఎన్జీసీ, రియలన్స్ గ్యాస్ ఇండస్ట్రీస్ దగ్గరలో ఉండటం వల్ల అక్కడి నిపుణులతో మా విద్యార్థులకు లైవ్ ప్రాజెక్టుల్లో శిక్షణ ఇస్తున్నాం. పెట్రోలియం కోర్సులు చేసిన వారికి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంది. – ప్రొఫెసర్ బి.బాలకృష్ణ, జేఎన్టీయూ–కే ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ -
బీటెక్ ఫస్టియర్.. ఇలా చేస్తే నో ఫియర్!
బీటెక్ మొదటి సంవత్సరంలో అడుగుపెట్టాం.. నాలుగేళ్ల తర్వాత మంచి మార్కులతో పట్టా పొందితే చాలు.. కొలువు ఖాయమనే అభిప్రాయంతో చాలామంది విద్యార్థులు ఉంటారు. వాస్తవానికి కోర్సు పూర్తయ్యాక కోరుకున్న ఉద్యోగం దక్కాలంటే.. మార్కులతోపాటు మరెన్నో నేర్చుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా లేటెస్ట్ టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాలి. ఇండస్ట్రీ 4.0 స్కిల్స్ సొంతం చేసుకోవాలి. ఎందుకంటే.. ప్రస్తుతం జాబ్ మార్కెట్లో ఈ స్కిల్స్ ఉన్న అభ్యర్థులకే ఆఫర్లు ఇచ్చేందుకు సంస్థలు ముందుకొస్తున్నాయి! ఈ నేపథ్యంలో.. బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులు.. తమ నాలుగేళ్ల స్టడీని ఎలా ప్లాన్ చేసుకోవాలి.. నేర్చుకోవాల్సిన నైపుణ్యాలు తదితర అంశాలపై విశ్లేషణ.. బీటెక్లో అకడమిక్గా మంచి మార్కులతోనే కొలువుల కల సాకారమయ్యే పరిస్థితి లేదు. కాబట్టి ఇంజనీరింగ్లో చేరిన విద్యార్థులు తమ బ్రాంచ్కు అనుగుణంగా నూతన టెక్నాలజీలపై పట్టు సాధించాలి. ఇందుకోసం బీటెక్ మొదటి సంవత్సరం నుంచే కృషి చేయాలన్నది నిపుణుల సలహా. డిజిటల్ యుగం ప్రస్తుతం అంతటా డిజిటల్ టెక్నాలజీ రాజ్యమేలుతోంది. అన్ని రంగాల్లోని సంస్థలూ ఆధునిక సాంకేతికతల ఆధారంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. నైపుణ్యాలున్న వారికే నియామకాల్లో పెద్దపీట వేస్తున్నాయి. కాబట్టి బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులు.. సదరు తాజా నైపుణ్యాలు, టెక్నాలజీలపై పట్టు సాధించేందుకు ఇప్పటి నుంచే కృషి చేయాలి. బీటెక్ మూడో సంవత్సరంలోకి వచ్చాక నేర్చుకోవాలనే ప్రయత్నం చేస్తే సఫలం కాలేరు. ఎందుకంటే.. ఆ సమయంలో ఓవైపు తృతీయ, చివరి సంవత్సరాల అకడమిక్ ఒత్తిడి.. మరోవైపు ఇంటర్న్షిప్లు, ప్రాజెక్ట్ వర్క్, ప్లేస్మెంట్స్ వంటివి ఉంటాయి. బ్రాంచ్ ఏదైనా బీటెక్లో ఏ బ్రాంచ్ విద్యార్థులైనా సరే.. తమ విభాగానికి సరితూగే ఇండస్ట్రీ పరిణామాలను నిత్యం తెలుసుకోవాలి. డిజిటల్ నైపుణ్యాలు మెరుగుపరచుకోవాలి. కోర్ బ్రాంచ్లు మొదలు సాఫ్ట్వేర్ కొలువులకు మార్గం వేసే సీఎస్ఈ, ఐటీ విద్యార్థుల వరకూ.. ప్రతి ఒక్కరూ ఆ దిశగా కృషి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇండస్ట్రీ 4.0 స్కిల్స్ ► ప్రస్తుతం బీటెక్ విద్యార్థులు ఇండస్ట్రీ 4.0 స్కిల్స్గా పేర్కొంటున్న నైపుణ్యాలను నేర్చుకోవడం తప్పనిసరిగా మారింది. కారణం.. కంపెనీలు ఈ స్కిల్స్ ఉన్న వారికే ఆఫర్లు ఖరారు చేస్తుండటమే! మొత్తం విద్యార్థుల్లో ఇండస్రీ ్ట4.0 స్కిల్స్ ఉన్న వారి సంఖ్య 20 నుంచి 25 శాతం మధ్యలోనే ఉంటోంది. దీంతో అవకాశాలున్నా.. నైపుణ్యాలు లేక ఎంతోమంది నిరాశకు గురవుతున్నారు. కాబట్టి బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులు.. భవిష్యత్ అవకాశాలు అందుకోవాలంటే.. ఇప్పటి నుంచి ఆయా నైపుణ్యాలు నేర్చుకోవడంపై దృష్టిపెట్టాలి. (ఎన్డీఏ, ఎన్ఏ 2021: ఇంటర్తోనే.. కొలువు + చదువు) ► ఇండస్ట్రీ 4.0 స్కిల్స్గా పేర్కొంటున్న.. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐవోటీ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, రోబోటిక్స్, 3డి డిజైన్, ఎథికల్ హ్యాకింగ్, సైబర్ సెక్యూరిటీ, వీఆర్/ఏఆర్ టెక్నాలజీలు..ఉద్యోగ సాధనలో కీలకంగా మారుతున్నాయి. బీటెక్ విద్యార్థులు తొలి రోజు నుంచే వీటిని నేర్చుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే ఇంజనీరింగ్లో చేరిన లక్ష్యానికి అనుగుణంగా కెరీర్ను ఉజ్వలంగా మలచుకునే అవకాశం లభిస్తుంది. కళాశాలల్లో మౌలిక సదుపాయాల కొరత కారణంగా చాలామంది విద్యార్థులు లేటెస్ట్ స్కిల్స్ నేర్చుకోలేకపోతున్నారు. అలాంటి విద్యార్థులు ఆన్లైన్ మార్గాల్లో సొంతంగా నేర్చుకునే ప్రయత్నం చేయాలి. కోడింగ్.. ప్రోగ్రామింగ్ ప్రస్తుతం ఉద్యోగ సాధనంలో కీలకంగా నిలుస్తున్న నైపుణ్యాలు.. కోడింగ్, ప్రోగ్రామింగ్. వాస్తవానికి ఇంజనీరింగ్ కోర్సు స్వరూపంలోనే వీటికి అకడమిక్గా ప్రాధాన్యం ఉంది. కాని ప్రాక్టికల్ అప్రోచ్ తక్కువగా ఉండటంతో ఈ నైపుణ్యాలు ఆశించినంతగా లభించట్లేదు. ము ఖ్యంగా సీఎస్ఈ/ఐటీ బ్రాంచ్ల విద్యార్థులు కోడింగ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లను ప్రాక్టికల్ అప్రోచ్తో నేర్చుకునేందుకు సిద్ధమవ్వాలి. హెచ్టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్, పైథాన్, ఆర్, జావా, సీ, సీ++, పీహెచ్పీ, ఎస్క్యూఎల్ డేటాబేస్ వంటివి నేర్చుకోవడంపై దృష్టిపెట్టాలి. మూక్స్, ఆన్లైన్ వేదికలు, షార్ట్టర్మ్ కోర్సులు, యూట్యూబ్ వీడియోల ద్వారా అవగాహన పెంచుకోవచ్చు. ఒరాకిల్, మైక్రోసాఫ్ట్, రెడ్ హ్యా ట్, ఐబీఎం, జెట్ కింగ్ వంటి సంస్థలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్పై సర్టిఫికేషన్ కోర్సులను అందిస్తున్నాయి. వీటిద్వారా సంబంధిత నైపుణ్యాలు పొందొచ్చు. సర్క్యూట్ బ్రాంచ్ల విద్యార్థులు ► ఈసీఈ, ఈఈఈ వంటి సర్క్యూట్ బ్రాంచ్ల విద్యార్థులు కూడా లేటెస్ట్ డిజిటల్ స్కిల్స్ సొంతం చేసుకునే దిశగా ఇప్పటి నుంచే కృషి చేయాలి. ► ఈసీఈ విద్యార్థులు వీఎల్ఎస్ఐ, నానో టెక్నాలజీ విభాగాల్లో షార్ట్టర్మ్ సర్టిఫికేషన్ కోర్సులు పూర్తి చేయడం ద్వారా జాబ్ మార్కెట్లో ముందుండొచ్చు. వీరికి కలిసొచ్చే మరికొన్ని సర్టిఫికేషన్ కోర్సులు.. ఫైబర్ ఆప్టిక్ టెక్నాలజీ; ఇండస్ట్రియల్ ఆటోమేషన్, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్; రోబోటిక్స్. ► ఈఈఈ విద్యార్థులు.. ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, పవర్ సిస్టమ్స్ అనాలిసిస్, సర్క్యూట్ అనాలిసిస్, అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇన్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ వంటివి నేర్చుకోవాలి. వీటితోపాటు ఎస్సీఏడీఏ (సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్), డిస్ట్రిబ్యూటెడ్ కంట్రోల్ సిస్టమ్స్ వంటి నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. వీటిని ఇప్పుడు పలు మార్గాల్లో నేర్చుకునే అవకాశం ఉంది. రోబోటిక్ స్కిల్స్ మెకానికల్ బ్రాంచ్ విద్యార్థులు.. రోబోటిక్ స్కిల్స్పై ప్రధానంగా దృష్టిపెట్టాలి. దీంతోపాటు ఈ బ్రాంచ్ విద్యార్థులు క్యాడ్, క్యామ్; ఆటోమేషన్, 2–డి, 3–డి డిజైన్ ప్రింటింగ్లపైనా అవగాహన పెంచుకోవాలి. ప్రస్తుతం రోబో ఆధారిత కార్యకలాపాలు అన్ని సంస్థల్లోనూ సాగుతున్నాయి. అన్ని బ్రాంచ్ల విద్యార్థులకు రోబోటిక్ స్కిల్ మేలు చేస్తుందని చెప్పొచ్చు. వీటిని సొంతంగా అభ్యసించేందుకు పలు ఆన్లైన్ మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలి. ప్రాక్టికల్, అప్లికేషన్ అప్రోచ్ మొదటి సంవత్సరం నుంచి నాలుగో సంవత్సరం వరకు ఇంజనీరింగ్ విద్యార్థులు.. ఏ అంశాన్నైనా ప్రాక్టికల్ ఓరియెంటేషన్, అప్లికేషన్ అప్రోచ్తో అధ్యయనం చేయాలి. అందుకోసం లేబొరేటరీల్లో ఆయా సబ్జెక్ట్ అంశాలకు సంబంధించి ప్రాక్టికల్స్ చేసేందుకు ఎక్కువ సమయం కేటాయించాలి. తద్వారా రియల్ టైం నైపుణ్యాలు సొంతమవుతాయి. ఇంటర్న్షిప్స్ బీటెక్ కోర్సులో చేరిన విద్యార్థులు ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా రియల్ టైమ్ నైపుణ్యాలు పెంచుకునేందుకు.. కనీసం రెండు లేదా మూడు ఇంటర్న్షిప్స్ చేయాలి. ఈ మేరకు ఏఐసీటీఈ కూడా మార్గదర్శకాలు జారీ చేసింది. కాబట్టి విద్యార్థులు ఆయా విభాగాల్లో ఇంటర్న్షిప్ అవకాశాలు పొందేందుకు గల మార్గాలను అన్వేషించాలి. ఇందుకోసం క్యాంపస్లోని ఇండస్ట్రీ ఇంటరాక్షన్ సెల్, ఆయా సంస్థల్లో పని చేస్తున్న సీనియర్ల సహకారం తీసుకోవాలి. ఇంటర్న్షిప్ చేయడం ద్వారా తాజా పరిస్థితులపై అవగాహన వస్తుంది. ప్రాక్టికల్ నైపుణ్యాలు మెరుగుపరచుకోవచ్చు. ఇంటర్న్గా చూపిన ప్రతిభ ఆధారంగా సదరు సంస్థల్లోనే పూర్తిస్థాయి ఉద్యోగం సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది. సాఫ్ట్ స్కిల్స్ బీటెక్ విద్యార్థులు సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవడానికి కూడా ప్రాధాన్యమివ్వాలి. ప్రస్తుతం సంస్థల్లో టీం వర్క్కు ప్రాధాన్యం పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తిచేసే క్రమంలో బృందంలోని సహోద్యోగులతోపాటు వివిధ విభాగాల సీనియర్లతో మాట్లాడాల్సి ఉంటుంది. ఆ క్రమంలో సాఫ్ట్ స్కిల్స్ ఎంతో ఉపయోగపడతాయి. కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, బిహేవియరల్ స్కిల్స్, ఇంటర్ పర్సనల్ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్, క్రియేటివ్ థింకింగ్, డెసిషన్ మేకింగ్ వంటివి ప్రధాన సాఫ్ట్స్కిల్స్గా చెప్పొచ్చు. ఆన్లైన్ సదుపాయాలు విద్యార్థులు ఇండస్ట్రీ 4.0 స్కిల్స్,సాఫ్ట్స్కిల్స్ పెంచుకునేందకు ఆన్లైన్ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవచ్చు. మూక్స్, ఎన్పీటీఈఎల్,స్వయం వంటి పోర్టల్స్ ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రొఫెసర్ల లెక్చర్స్ వినే అవకాశం లభిస్తుంది. ఇలా..ఒకవైపు అకడమిక్ నాలెడ్జ్, మరోవైపు ఇండస్ట్రీకి అవసరమైన లేటెస్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకునేలా.. మొదటి ఏడాది నుంచే ముందుకుసాగితే.. బీటెక్ విద్యార్థులు తమ కలల కెరీర్ను సొంతం చేసుకోవచ్చు. బీటెక్ మొదటి సంవత్సరం.. ముఖ్యాంశాలు ► బ్రాంచ్ ఏదైనా ఉద్యోగ సాధనలో కీలకం ఇండస్ట్రీ 4.0 స్కిల్స్. ► ప్రాక్టికల్ అప్రోచ్,అప్లికేషన్ ఓరియెంటేషన్ ఉంటేనే జాబ్ ఆఫర్స్. ► డిజిటల్ స్కిల్స్తోపాటు సాఫ్ట్ స్కిల్స్కూ ప్రాధాన్యమిస్తున్న సంస్థలు. లేటెస్ట్ స్కిల్స్ ఉంటేనే ఇప్పుడు ఏ బ్రాంచ్ విద్యార్థులైనా.. లేటెస్ట్ స్కిల్స్ ఉంటేనే ఉన్నత విద్య, ఉద్యోగాల పరంగా మెరుగ్గా రాణించే పరిస్థితి ఉంది. కాబట్టి ఇంజనీరింగ్ విద్యార్థులు మొదటి సంవత్సరం నుంచే తమ బ్రాంచ్కు సరితూగే టెక్నాలజీస్పై అవగాహన పొందేందుకు కృషి చేయాలి. అకడమిక్స్లో లెర్నింగ్తోపాటు ప్రాక్టికల్ అప్రోచ్కు ప్రాధాన్యం ఇవ్వాలి. – ప్రొఫెసర్ ఎన్.వి.రమణరావు, డైరెక్టర్, నిట్–వరంగల్. -
TS EDCET 2021: నిబంధనలు సవరిస్తూ ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: బీఏ, బీకాం, బీఎస్సీ వంటి సంప్రదాయ కోర్సులు చదివిన వారు మాత్రమే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్లో (బీఎడ్) చేరే అవకాశం ఉండగా ఇకపై ఇతర సబ్జెక్టులు చదివిన వారికి బీఎడ్లో చేరే అవకాశం వచ్చింది. ఈ మేరకు బీఎడ్ ప్రవేశాల నిబంధనలను ప్రభుత్వం మార్పు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా జీవో 16 జారీ చేశారు. ఇప్పటివరకు డిగ్రీలో ఓరియంటల్ లాంగ్వేజెస్ చదువుకున్న వారికి బీఎడ్లో చేరే అవకాశం లేకపోగా ఇప్పుడు వారికి కొత్తగా అవకాశం దక్కింది. డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎస్సీ (హోంసైన్స్), బీసీఏ, బీబీఎం, బీఏ (ఓరియంటల్ లాంగ్వేజెస్), బీబీఏ, బీటెక్ చేసిన వారు కూడా బీఎడ్ చదివే వీలు ఏర్పడింది. వారు ఆయా డిగ్రీల్లో 50 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. ఇవి చదివిన వారంతా అర్హులే.. ► బీఎడ్ ఫిజికల్ సైన్స్ చేయాలంటే.. బీఎస్సీ విద్యార్థులు ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ లేదా సంబంధిత సబ్జెక్టును పార్ట్–2 గ్రూపులో చదివి ఉండాలి. బీటెక్ విద్యార్థులు ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ; బీసీఏ విద్యార్థులు ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ సబ్జెక్టులను ఇంటర్మీడియట్లో చదివి ఉంటే చాలు. ► బీఎడ్ బయోలాజికల్ సైన్స్లో చేరాలంటే బీఎస్సీ/బీఎస్సీ (హోంసైన్స్) చేసిన వారు బోటనీ, జువాలజీలో ఏదో ఒక సబ్జెక్టు డిగ్రీలో పార్ట్–2 గ్రూపులో చదివి ఉండాలి. బీసీఏ విద్యార్థులైతే ఇంటర్లో బయోలాజికల్ సైన్స్ చదివి ఉండాలి. ► బీఎడ్ సోషల్ సైన్సెస్ చేయాలంటే బీకాం/బీబీఎం/బీబీఏ/బీసీఏ అభ్యర్థులు ఇంటర్లో సోషల్ సైన్స్ చదివి ఉండాలి. ► ఓరియంటల్ లాంగ్వేజెస్లో బీఎడ్ చేయాలనుకునే వారు బీఏలో తెలుగు/హిందీ/మరాఠీ/ఉర్దూ/అరబిక్/సంస్కృతంను ఒక ఆప్షనల్ సబ్జెక్టుగా చదివి ఉండాలి. లిటరేచర్ అభ్యర్థులు (బీఏ–ఎల్) తెలుగు/హిందీ/మరాఠీ/ఉర్దూ/అరబిక్/సంస్కృతం చదివి ఉంటే చాలు. బీఏ ఓరియెంటల్ లాంగ్వేజెస్ వారు తెలుగు/హిందీ/మరాఠీ/ఉర్దూ/అరబిక్/సంస్కృతం చదివి ఉండాలి. ఎంఏ తెలుగు/ హిందీ/ మరాఠీ/ ఉర్దూ/ అరబిక్/ సంస్కృతం చేసిన వారు కూడా అర్హులే. చదవండి: 10 వేలకు పైగా ఉద్యోగాలు.. ఆశావహులకు తీపికబురు NMDC Recruitment 2021: ఎన్ఎండీసీలో 89 పోస్టులు -
Engineering Special: బీటెక్ తర్వాత.. కెరీర్ ఆప్షన్స్
ఇంటర్మీడియెట్(ఎంపీసీ) విద్యార్థుల కలల కోర్సు.. ఇంజనీరింగ్(బీటెక్/బీఈ). నేటి యువత క్రేజీ కెరీర్ ఇది. దేశవ్యాప్తంగా ఏటా లక్షల మంది ఇంజనీరింగ్లో చేరుతున్నారు. నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సు పూర్తయ్యాక ఏం చేయాలి?! అనే ప్రశ్న ఎదురవుతోంది. ఉద్యోగమా.. ఉన్నత విద్యా.. ఏ మార్గం ఎంచుకోవాలి.. వాస్తవానికి బీటెక్ ఉత్తీర్ణులైన విద్యార్థుల ముందు అనేక ఉన్నత విద్య, ఉద్యోగ మార్గాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు భవిష్యత్ గురించి ఆందోళన చెందకుండా.. తమ కెరీర్ లక్ష్యాలకు ఏది అనుకూలమో అది ఎంచుకోవడం మేలు అంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో.. బీటెక్ తర్వాత ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలపై ప్రత్యేక కథనం.. బీటెక్ పూర్తయ్యాక ఇంజనీరింగ్ కోర్ విభాగంలోనే కొనసాగాలనుకుంటే.. ఎంటెక్లో చేరొచ్చు. లేదా మేనేజ్మెంట్ వైపు వెళ్లాలనుకుంటే.. ఎంబీఏలో అడుగుపెట్టొచ్చు. ఇటీవల కాలంలో ఎంబీఏను ఎంచుకునే ఇంజనీరింగ్ అభ్యర్థుల సంఖ్య పెరుగుతోంది. మరికొందరు ప్రభుత్వ రంగ సంస్థల్లో(పీఎస్యూ) ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు. ఇంకొందరు సివిల్ సర్వీసెస్కు సన్నద్ధమవుతున్నారు. క్యాంపస్ ప్లేస్మెంట్స్ బీటెక్ కోర్సు పూర్తికాగానే ఉద్యోగంలో చేరాలనుకునే ఇంజనీరింగ్ విద్యార్థులకు వరం.. క్యాంపస్ ప్లేస్మెంట్స్. నిజానికి ప్లేస్మెంట్స్ డ్రైవ్స్ ద్వారా ఉద్యోగం పొందడం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కు అందుబాటులో ఉన్న ఉత్తమ మార్గంగా చెప్పొచ్చు. ప్రముఖ కంపెనీలు, స్టార్టప్ సంస్థలు.. ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రతి ఏటా ప్లేస్మెంట్స్ డ్రైవ్స్ నిర్వహిస్తుంటాయి. ఈ ప్లేస్మెంట్స్ ప్రక్రియలో పాల్గొనాలనుకునే విద్యార్థులు అందుకోసం ముందుగానే కసరత్తు ప్రారంభించాలి. రిక్రూటర్లను ఆకట్టుకునేలా రెజ్యూమ్ని రూపొందించుకొని సిద్ధంగా ఉంచుకోవాలి. అలాగే బీటెక్ మొదటి ఏడాది నుంచే సబ్జెక్ట్ల్లో మంచి స్కోరు వచ్చేలా చూసుకోవాలి. అంతేకాకుండా కంపెనీల్లో ఇంటర్న్షిప్తోపాటు బీటెక్ ప్రాజెక్ట్ వర్క్పైనా పట్టు సాధించాలి. కాలేజీలో జరిగే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో పాల్పంచుకోవడం మేలు చేస్తుంది. ప్లేస్మెంట్స్ ప్రక్రియలో విజయం సాధించేందుకు సబ్జెక్టు నైపుణ్యాలతోపాటు, ప్రాక్టికల్ స్కిల్స్, మంచి కమ్యూనికేషన్, కంపెనీలు, మార్కెట్లు, తాజా టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాలి. ఉన్నత విద్య.. ఎంటెక్/ఎంబీఏ ► ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఉన్నత చదువుల గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. స్వదేశంలో ఎంటెక్ లేదా విదేశాల్లో ఎంఎస్ చేయాలని ప్రణాళికలు వేసుకుంటారు. దేశలోని టాప్ కాలేజీల్లో ఎంటెక్లో చేరేందుకు చక్కటి మార్గం.. ‘గేట్’(గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్). బీటెక్ సబ్జెక్టులపై సమగ్ర అవగాహన, బేసిక్ కాన్సెప్ట్లపై గట్టి పట్టు, ప్రశ్నల ప్రాక్టీస్ ద్వారా గేట్లో మంచి ర్యాంకు సాధించొచ్చు. ► గత కొన్నేళ్లుగా ఇంజనీరింగ్ అభ్యర్థులు మేనేజ్మెంట్ కోర్సులను ఎంచుకుంటున్నారు. బీటెక్+ఎంబీఏ.. గొప్ప కెరీర్ కాంబినేషన్గా గుర్తింపు పొందింది. వీరికి కార్పొరేట్ సంస్థలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. అందుకే చాలామంది విద్యార్థులు బీటెక్ తర్వాత ఎంబీఏలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. టాప్ బిజినెస్ స్కూల్స్ ఐఐఎం(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్)ల్లో పీజీ కోర్సుల్లో చేరాలంటే..క్యాట్(కామన్ ఆప్టిట్యూడ్ టెస్ట్)లో ప్రతిభ చూపాల్సి ఉంటుంది. క్యాట్తోపాటు మ్యాట్,సీమాట్, ఐసెట్, జీమ్యాట్ వంటి ఎంట్రెన్స్ల ద్వారా ఎంబీఏలో చేరేందుకు అవకాశం ఉంది. పీఎస్యూల్లో ఉద్యోగం బీటెక్ అభ్యర్థులకు మరో మంచి అవకాశం.. ప్రభుత్వ రంగ సంస్థల్లో(పీఎస్యూ) ఉద్యోగం. వీరు గేట్లో టాప్ ర్యాంకు ద్వారా సదరు పీఎస్యూలకు దరఖాస్తు చేసుకోవచ్చు. బీహెచ్ఈఎల్, హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్, నాల్కో, హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఓఎన్జీసీ వంటి వాటిల్లో ఆకర్షణీయమైన వేతనాలతో ఉద్యోగం దక్కించుకోవచ్చు. గేట్ స్కోరుతో సంబంధం లేకుండా.. డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా కూడా ప్రభుత్వ రంగ సంస్థల్లో కొలువు సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, ఎన్ఎండీసీ, బార్క్, ఇస్రో వంటి ప్రముఖ సంస్థల్లో ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఉద్యోగాలు లభిస్తాయి. సివిల్స్, ఈఎస్ఈ పరిపాలన విభాగంలో చేరాలనుకునే బీటెక్ అభ్యర్థులకు చక్కటి మార్గం.. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. ఇందుకోసం యూపీఎస్సీ ఏటా విడుదల చేసే నోటిఫికేషన్కు దరఖాస్తు చేసుకోవాలి. మూడంచెల సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియలో విజయం సాధించేందుకు సన్నద్ధమవ్వాలి. ఇది దేశంలో అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటి. అలాగే ఇంజనీరింగ్ అభ్యర్థుల కోసం యూపీఎస్సీ విడుదల చేసే మరో ప్రతిష్టాత్మక నోటిపికేషన్..ఈఎస్ఈ(ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్). దీని ద్వారా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో గ్రూప్ ఏ స్థాయి పోస్టులు భర్తీ చేస్తారు. అలాగే యూపీఎస్సీ విడుదల చేసే మరో ఉన్నత నోటిఫికేషన్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్ఎస్)కు కూడా బీటెక్ అభ్యర్థులు పోటీ పడొచ్చు. దేశ సేవకు ‘డిఫెన్స్’ భారత సైన్యానికి అత్యంత నైపుణ్యం కలిగిన సాంకేతిక విభాగం ఉంది. దీంతో భారత సైన్యంలోని టెక్నికల్ వింగ్స్లో ఇంజనీర్లకు అవకాశాలు లభిస్తున్నాయి. టెక్నికల్ ఎంట్రీ లెవెల్తో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఆర్మీ/నేవీ/ఎయిర్ఫోర్స్ల్లో చేరొచ్చు. బీటెక్ తర్వాత యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్(యూఈఎస్), ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్(ఏఎఫ్ క్యాట్), షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్ఎస్సీ), కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(సీడీఎస్ఈ) వంటి వాటి ద్వారా త్రివిధ దళాల్లో చేరొచ్చు. టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు(టీజీసీ)కు దరఖాస్తు చేసుకొని.. ఇండియన్ మిలటరీ అకాడమీలో చేరొచ్చు. రక్షణ దళాల్లో ఉద్యోగం అంటే.. అత్యంత గౌరవప్రదమైన కెరీర్స్లో ఒకటిగా చెప్పొచ్చు. ఇందులో చేరిన అభ్యర్థులకు మంచి వేతనం, ఉద్యోగ భద్రత, సౌకర్యాలతోపాటు దేశానికి సేవ చేస్తున్నామని సంతృప్తి సైతం లభిస్తుంది. ప్రైవేట్ రంగంలో కొలువు బీటెక్ ఉత్తీర్ణులకు ప్రపంచ వ్యాప్తంగా కార్పొరేట్ రంగంలో ఉద్యోగాలకు కొదవలేదు. నైపుణ్యాలుంటే.. ప్రభుత్వ రంగం కంటే ఎన్నో రెట్లు అధిక వేతనాలు కార్పొరేట్ కంపెనీల్లో లభిస్తున్నాయి. బీటెక్ గ్రాడ్యుయేట్లను ఇంజనీర్లుగానే కాకుండా.. పరిశోధకులుగా, కన్సల్టెంట్లుగా, సాఫ్ట్వేర్ డవలపర్లుగా నియమించుకుంటున్నారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ డెవలపర్, సివిల్/ఎలక్ట్రికల్ ఇంజనీర్, సిస్టమ్ అనలిస్ట్, ఐటీ కో ఆర్డినేటర్, అప్లికేషన్ డెవలపర్ వంటి జాబ్స్ ఐటీ రంగంలో దక్కించుకోవచ్చు. అలాగే క్వాలిటీ ఇంజనీర్, ప్రాసెస్ ఇంజనీర్, ఇండస్ట్రియల్ మేనేజర్, ప్లాంట్ ఇంజనీర్, క్వాలిటీ కంట్రోల్ టెక్నీషియన్ వంటి కొలువులు సైతం తయారీ రంగంలో సొంతం చేసుకోవచ్చు. సీ, సీ++, జావా, ఎస్క్యూఎల్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్, సాఫ్ట్వేర్ టెస్టింగ్, రోబోటిక్స్, నానో టెక్నాలజీ, నెట్వర్కింగ్, ఐవోటీ, బ్లాక్చైన్ టెక్నాలజీ, ఎంబెడెడ్ టెక్నాలజీ, డేటాసైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి నైపుణ్యాలు పెంచుకుంటే వివిధ విభాగాల్లో కొలువులు లభించే అవకాశం ఉంటుంది. ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇటీవల ఎక్కువ మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని, కొత్త ఆలోచనతో స్టార్టప్ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నారు. విద్యార్థులు ప్రారంభించిన పలు స్టార్టప్స్ విజయవంతం కావడం.. ఇంజనీరింగ్ అభ్యర్థులకు ప్రేరణగా నిలుస్తోంది. కాని సొంత వ్యాపారం అనే మార్గంలో అనేక సవాళ్లు ఎదురవుతుంటాయి. వాటిని అధిగమించేందుకు ఎంతో ఓపిక, సహనం అవసరం!! -
టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అరెస్ట్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. చెన్నై విమానాశ్రయంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. 2018లో పులివెందుల పూల అంగళ్ల వద్ద అల్లర్లు, ఘర్షణ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బీటెక్ రవిపై వారెంట్ పెండింగ్లో ఉంది. రాళ్ల దాడి, హత్యాయత్నం కేసులో ఇన్నాళ్లూ అరెస్ట్ కాకుండా, బెయిల్ తీసుకోకుండా బీటెక్ రవి తప్పించుకు తిరుగుతున్నారు. గతంలో జరిగిన రాళ్ల దాడిలో ఎస్ఐ చిరంజీవికి గాయాలయ్యాయి. హత్యాయత్నం కింద బీటెక్ రవితో పాటు మరో 63 మందిపై కేసులు నమోదయ్యాయి. (చదవండి: ‘సుబ్బయ్యపై 14 కేసులు ఉన్నాయి’) ఎస్పీ అన్బురాజన్ మీడియాకు వివరాలు వెల్లడించారు. 2018లో జరిగిన అల్లర్ల కేసులో బీటెక్ రవిని అరెస్ట్ చేశామని తెలిపారు. గతంలో జరిగిన అల్లర్ల కేసులో పలువురికి బెయిల్ లభించిందని, నిందితుడిగా ఉన్న బీటెక్ రవిని అరెస్ట్ చేశామని ఎస్పీ వివరించారు. లింగాల మహిళ హత్య కేసుకు, అరెస్ట్కు ఎలాంటి సంబంధం లేదని ఎస్పీ స్పష్టం చేశారు.(చదవండి: పచ్చ దౌర్జన్యాలు) -
33 కేసులు.. 22 సార్లు జైలు..
సాక్షి, తిరుపతి: రాజకీయ నాయకులు, నిరుద్యోగులే లక్ష్యంగా నేరాలకు పాల్పడుతున్న ఘరానా మోసగాడు తోట బాలాజీనాయుడు మరోసారి పోలీసులకు చిక్కాడు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ఓ వ్యక్తికి ప్రధానమంత్రి గ్రామీణ యోజన కింద రూ.25 లక్షల రుణం ఇప్పిస్తామని చెప్పి రూ.2.5 లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేయించుకున్న కేసులో అతడిని ఆదివారం శ్రీకాళహస్తిలో పోలీసులు అరెస్టు చేశారు. వివిధ ప్రభుత్వ పథకాల పేరు చెప్పి ఇప్పటి వరకు 60 మంది ప్రజాప్రతినిధులను బురిడీ కొట్టించిన ఇతగాడిపై ఏపీ, తెలంగాణల్లోని పలు పోలీస్ స్టేషన్లలో 33 కేసులు నమోదు కాగా 22 సార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడికి చెందిన బాలాజీనాయుడు కాకినాడలోని జేఎన్టీయూలో బీటెక్ పూర్తిచేశాడు. 2003లో ఎన్టీపీసీలో జూనియర్ ఇంజినీర్గా చేరి రామగుండం, పాల్వంచ, విశాఖపట్నం ప్రాంతాల్లో పనిచేశాడు. విశాఖలో పనిచేస్తుండగా 2008లో అప్పటి తణుకు ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు ఆనంద్ నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఆ కేసుతో ఉద్యోగం కోల్పోయి జైలుకెళ్లాడు. బుద్ధి మార్చుకోకుండా.. విశాఖ జైలు నుంచి బయటకు వచ్చిన బాలాజీనాయుడు వివిధ ప్రాంతాల ప్రజాప్రతినిధుల వ్యక్తిగత కార్యదర్శులకు ఫోన్లు చేసి ఎన్టీపీసీలో ఉద్యోగాలంటూ, వారి నియోజకవర్గం నుంచి యువతను సిఫార్సు చేయాలని ఎమ్మెల్యేలకు సూచించాడు. ఆ తరువాత డిపాజిట్ పేరుతో కొంత మొత్తం దండుకొని మోసం చేశాడు. విజయనగరం పోలీసులు 2009లో అరెస్టు చేసి జైలుకు పంపారు. నల్లగొండ జిల్లాలోనూ ఇదే తరహాలో మోసం చేయడంతో 2010లో యాదగిరిగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పోలీస్స్టేషన్ పరిధిలో ఆరోగ్యశ్రీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ రాజకీయ నేతల నుంచి రూ.1.5 లక్షలు వసూలు చేసి జైలుపాలయ్యాడు. పలువురు ప్రజా ప్రతినిధులకు ఫోన్ చేసి రుణాలిప్పిస్తామంటూ వారి పీఏల ద్వారా ఒక్కో అభ్యర్థికి రూ.1,060 వంతున రూ.3.50 లక్షలు రాబట్టాడు. బీజేపీ నేత రాంజగదీష్ ఫిర్యాదు మేరకు కాచిగూడ పోలీసులు 2013 ఫిబ్రవరిలో అరెస్టు చేశారు. బెయిల్పై బయటకు వచ్చాక అప్పటి ఎంపీలు వి.హనుమంతరావు, దేవేందర్గౌడ్, పాల్వాయి గోవర్ధన్లను బురిడీ కొట్టించాడు. 2015లో మల్కాజ్గిరి ఎమ్మెల్యేకు రూ.90 వేలు టోకరా వేసి మళ్లీ పోలీసులకు చిక్కాడు. విడుదలైన బాలాజీ పలు మోసాలు చేశాడు. అతడి మాటలు నమ్మి తెలంగాణ ఎమ్మెల్సీ ఆకుల లలిత రూ.10 లక్షలు బ్యాంకు ఖాతాలో వేయించారు. 2018లో సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ భర్తకు ఫోన్చేసి రూ.30 వేలు ఇస్తే రూ.2 కోట్ల కేంద్ర నిధుల పెండింగ్ ఫైల్ క్లియర్ చేయిస్తానని చెప్పారు. దీనిపై సూర్యాపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదవడంతో బాలాజీని అరెస్టు చేశారు. -
ఇంజనీరింగ్లో కొత్త కోర్సులు
టెక్నాలజీ పరంగా విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయి. ఇది అది అనే తేడా లేకుండా.. అన్ని రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇందులో భాగంగానే విద్యా రంగంలోనూ మార్పులు వస్తున్నాయి. దేశంలో ఇంజనీరింగ్ విద్యను పర్యవేక్షించే.. ఆల్ ఇండియా కౌన్సెల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ).. బీటెక్ స్థాయిలో సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్, బ్లాక్చైన్ టెక్నాలజీ,ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కొత్త కోర్సులను ప్రవేశపెట్టింది. ఆ వివరాలు... ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ రకాల పరిశ్రమలు..మానవ వనరులను తగ్గించుకునేందుకు ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ను ఆయా రంగాల్లో ప్రవేశ పెడుతున్నాయి. ఇవే కాకుండా వ్యాపార అభివృద్ధి సులభతరం చేసుకునే విధంగా డేటాసైన్స్ వంటి టెక్నాలజీ కూడా అందుబాటులోకి వస్తోంది. ఇలాంటి తరుణంలో ఆయా రంగాల్లో సరిపడ సంఖ్యలో సమర్థవం తమైన నిపుణులు ఉన్నారా.. అంటే లేరనే చెప్పాలి. ఈ కొరతను అధిగమించడానికి గత కొంతకాలంగా ఆన్లైన్ మార్గాల ద్వారా ఏఐ,డేటాసైన్స్ లాంటి కోర్సులో పలు అవసరాలకు అనుగుణంగా శిక్షణన అందిస్తున్నాయి. తాజాగా ఆల్ ఇండియా కౌన్సెల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) ఇంజనీరింగ్ విద్యలో ఇలాంటి నూతన కోర్సులను ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చింది. తెలుగు రాష్టాల్లోనూ పలు కాలేజీల్లో బీటెక్ స్థాయిలో ఈ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. డేటా సైన్స్ నైపుణ్యం కలిగిన డేటా సైంటిస్టులను తయారు చేయడానికి ఇంజనీరింగ్ విద్యలో డేటాసైన్స్ కోర్సును అందుబాటులోకి తీసుకువచ్చారు. రంగం ఏదైనా.. జరగబోయే పరిణామాలను ముందే అంచనా వేసి.. కచ్చితత్వంతో కూడిన సమాచారాన్ని అందించేదే.. డేటాసైన్స్. విద్య, వైద్యం, వ్యాపార, సామాజిక ఆర్థిక, రాజకీయం.. ఇలా రంగం ఏదైనా గతంలో ఎదుర్కొన్న ఒడిదుడుకుల సమాచారాన్ని తెలుసుకొని.. భవిష్యత్తులో ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తే.. ఆయా రంగాల్లో విజయం సా«ధించడానికి వీలుంటుందో ఖచ్చితంగా అంచనా వేసి చెప్పే వారే.. డేటా సైంటిస్టులు. డేటా విశ్లేషణ: డేటాసైన్స్.. గణాంక సహిత సమాచారాన్ని విశ్లేషించడానికి ఉపయోగించే సాధనం. అల్గారిథం, మెషిన్లెర్నింగ్ సిద్ధాంతాలను ఉపయోగించి.. వ్యాపారానికి సంబంధించిన వస్తువులు ఏ సంవత్సరంలో ఎంత మొత్తంలో అమ్మకాలు జరిగా యి. ఆ సమయంలో డిమాండ్ –సప్లయ్ ఏ విధంగా ఉంది. ప్రస్తుతం అంత డిమాండ్ ఎందుకు లేదు. ఆయా వస్తువులపై వినియోగదారుల అభిప్రాయం ఏంటి? కొనుగోలు శక్తిలో వచ్చిన మార్పులు ఏంటి?!వంటివి అంచనా వేసి చెబుతారు. గతంలో ఉన్న డిమాండ్ను ప్రస్తుత డిమాండ్తో పోల్చి విశ్లేషించి..రానున్న కాలంలో ఎంత డిమాండ్ ఉండవచ్చు..ఆ సమయానికి వినియోగ దారులకు అందుబాటులో ఉంచాల్సిన ప్రొడక్ట్స్ సంఖ్యతో సహా కచ్చితమైన లెక్కలతో వివరిస్తారు డేటా నిపుణులు. కోర్సు స్వరూపం: డేటాసైన్స్ కోర్సు వ్యవధి నాలుగేళ్లు. ఎనిమిది సెమిస్టర్లుగా ఉంటుంది. ఈ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు.. డేటావిజువలైజర్స్, డేటాసైన్స్ కన్సల్టెంట్, డేటా ఆర్కిటెక్చర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్, డేటా ఇంజనీరింగ్ సహా వివిధ రకాల ఉద్యోగాలు పొందవచ్చు. వేతనాలు: డేటాసైన్స్ వి«భాగంలో ఉద్యోగాలు దక్కించుకున్న వారికి వార్షిక వేతనం దాదాపు రూ.5లక్షల వరకు ఉంటుంది. నైపుణ్యాలు,అనుభవం ఆధారంగా వేతనం పెరిగే అవకాశం ఉంటుంది. సైబర్ సెక్యూరిటీ నేటి డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ వినియోగం తప్పనిసరిగా మారింది. ప్రభుత్వ/ప్రైవేట్, వ్యాపార సంస్థలు సహా ప్రతీ రంగంలో లావాదేవీలన్నీ ఇంటర్నెట్ ఆధారంగానే జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయా లావాదేవీలు, సంబంధిత సమాచార భద్రత అనేది చాలా క్లిష్టంగా మారింది. ఇటువంటి విలువైన సమాచారాన్ని భద్రపరచడానికి రక్షణ కవచంగా వచ్చిందే..సైబర్ సెక్యూరిటీ. కోర్సు స్వరూపం: ఇంజనీరింగ్కు సంబంధించి సైబర్ సెక్యూరిటీ నాలుగేళ్ల కోర్సు. డేటా స్ట్రక్చర్, డిజిటల్ ప్రిన్సిపుల్స్, సిస్టమ్ డిజైన్, జావా ప్రోగ్రామింగ్, సిస్టమ్ సాఫ్ట్వేర్, అల్గారిథంలను రూపొందించడం వంటివి ఈ కోర్సులో భాగంగా నేర్చుకుంటారు. జాబ్ ప్రొఫైల్: ఈ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు సెక్యూరిటీ అనలిస్ట్, సెక్యూరిటీ ఆర్కిటెక్ట్, సెక్యూరిటీ సాఫ్ట్వేర్ డెవలపర్, క్రిప్టానలిస్ట్, సెక్యూరిటీ ఇంజనీర్ వంటి విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే టీసీఎస్, ఇన్ఫోసిస్, గూగుల్, ఫేస్బుక్, అమెజాన్, వంటి సంస్థల్లో ఉద్యోగావకాశాలు పొందే వీలుంటుంది. వేతనాలు : సంస్థను బట్టి సైబర్ సెక్యూరిటీ నిపుణులకు వార్షిక వేతనం రూ.8 లక్షల వరకు లభిస్తుంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇంజనీరింగ్లో కొత్తగా ప్రవేశ పెట్టిన మరో కోర్సు.. బ్లాక్చైన్ టెక్నాలజీ. సైబర్ నేరాలను ఆరిక ట్టడానికి ఆయా వ్యవస్థలపై పనిచేసే నిపుణులు ఎప్పటికప్పడు నూతన పరిజ్ఞానాన్ని అందుబా టులోకి తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా వచ్చిందే బ్లాక్చైన్ టెక్నాలజీ. ఆర్థికపరమైన లావాదేవీలల్లో పారదర్శకతను పెంచేవిధంగా ఈ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు. ఆన్లైన్ ఆధారంగా జరుగుతున్న ఆర్థిక కార్యకలాపాలను సురక్షితంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు బ్లాక్చైన్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. రానున్న కాలంలో బ్లాక్ చైన్ టెక్నాలజీలో భారీ సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే: బ్లాక్చైన్ టెక్నాలజీ అనేది ఒక పట్టిష్టమైన సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ. వ్యక్తులు, వ్యవస్థల మధ్య జరిగే ఆర్థిక సహ ఇతర కార్యకలాపాల సమాచారానికి కట్టుదిట్టమైన భద్రను కల్పించే రక్షణ కవచం ఇది. ఎంతటి సైబర్ హ్యాకర్లైనా దొంగలించేందుకు వీలులేకుం డా ఉండే డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్ ఇది. దీని ద్వారా ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న సర్వర్లలో సమాచారం నిక్షిప్తం చేసి.. ఇతరులు దానిని దొంగిలించకుండా భద్రత కల్పిస్తారు. కోర్సు స్వరూపం: ఇంజనీరింగ్లో బ్లాక్చైన్ టెక్నాలజీ కోర్సు వ్యవధి నాలుగేళ్లుగా ఉంటుంది. కోర్సులో భాగంగా బ్లాక్చైన్టెక్నాలజీ, క్రిప్టో కరెన్సీ, బ్లాక్చైన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లపై లోతైన అవగాహన కల్పిస్తారు. అలాగే సాలిడిటీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ క్లౌడ్ ప్లాట్ఫాం,ఎథెరియం,బిట్ కాయిన్ క్రిప్టోకరెన్సీల గురించి అవగాహన కలిగించే విధంగా కోర్సు ఉంటుంది. జాబ్ ప్రొఫైల్: ఈ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు బ్లాక్చైన్ డెవలపర్, బ్లాక్చైన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, బ్లాక్చైన్ ఎస్ఐ పార్టనర్ డెవలప్మెంట్ మేనేజర్, బిట్కాయిన్ క్రిప్టోకరెన్సీ డెవలపర్, బ్లాక్చైన్ ప్రిన్సిçపల్ ప్రోగ్రామ్ మేనేజర్, బిజినెస్ అనలిటిక్స్ అసోసియేట్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి. ఉద్యోగాలు: ఈ కోర్సు పూర్తిచేసిన వారు ఐబీఎం, మైక్రోసాఫ్ట్, యాక్సెంచర్, వీసా వంటి సంస్థల్లో ఉద్యోగావకాశాలు పొందవచ్చు. వేతనాలు: బ్లాక్చైన్ నిపుణులకు ప్రారంభంలో వార్షిక వేతనం రూ.5 లక్షల వరకు ఉంటుంది. అనుభవం, నైపుణ్యం ఆధారంగా ఆకర్షణీయ వేతనాలు లభిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక రంగంలో ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్. మానవ ఆలోచనలకు అనుగుణంగా కంప్యూటర్ ఆధారిత యంత్ర వ్యవస్థ పనిచేసేలా చేయడమే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లో ఇప్పుడు ఏఐ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఏఐలో స్పీచ్ రికగ్నిషన్, విజువల్ పర్సెప్షన్, లాజిక్ అండ్ డెసిషన్, మల్టీ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ లాంటి చాలా అంశాలుంటాయి. రోబోటిక్స్లోను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానం కీలకం. కోర్సు స్వరూపం: ఇంజనీరింగ్లో నాలుగేళ్ల బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఏఐ, మెషిన్ లెర్నింగ్) ఉంటుంది. ఈ కోర్సు లో భాగంగా విద్యార్థులకు కంప్యూటర్ లాంగ్వేజ్లను నేర్పిస్తారు. జావా, ప్రొలాగ్, లిస్ప్, పైథాన్ వంటి కోర్సులు ఇందులో నేర్చుకోవచ్చు. జాబ్ ప్రొఫైల్ : ఈ కోర్సును పూర్తిచేసిన అభ్య ర్థులకు డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్, డేటా ఇంజనీర్, ప్రిన్సిపుల్ డేటాసైంటిస్ట్, కంప్యూటర్ విజన్ ఇంజనీర్లుగా అవకాశాలు లభిస్తాయి. వేతనాలు : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగా లు పొందిన వారికి వార్షిక వేతనం రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంటుంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని ఒక కుగ్రామంగా మార్చేసిన ఘనత ఇంటర్నెట్కు దక్కుతుంది. సమాచార వ్యవస్థలో వచ్చిన విప్లవాత్మ కతకు ముఖ్య కారణం ఇంటర్నెట్ అనడంలో సందేహం లేదు. దీని విస్తృతి మరింత పెరిగి.. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) తెరపైకి వచ్చింది. ప్రస్తుతం డిమాండ్ ఉన్న కోర్సులో ఐఓటీ కూడా ఒకటి. ఐఓటీ అంటే: భవిష్యత్తులో ప్రపంచం మొత్తం ఒక స్మార్ట్ నగరం గా మారడానికి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) ఉపయోగపడు తుంది. మనుషుల జీవితాలను మరింత సుఖమయం చేయడా నికి ఇది తోడ్పడుతుంది. మనుçషుల మాదిరిగానే యంత్రాలు, యంత్ర పరికరాలు అన్ని ఇంటర్నెట్ ఆధారంగా అనుసంధా నంగా ఉండి.. ఒక నెట్వర్క్గా ఏర్పడి పనిచేయడాన్ని ఇంటర్నెట్ ఆఫ్ «థింగ్స్ అంటారు. అంటే.. మనుషులు తమలో తాము ఎలాగైతే ఒకరితో ఒకరు మాట్లాడుకొని పనులు చేస్తారో.. యంత్రాలు కూడా ఒక దానితో ఒకటి సమాచార మార్పిడి చేసుకొని పనిచేస్తాయి. ప్రతి వస్తువు ఇంటర్నెట్తో అనుసం« దానంగా ఉండి.. వివిధ రకాల కార్యకలాపాలను కచ్చితమైన సమయంలో సమర్థవంతంగా పూర్తిచేస్తాయి. కోర్సు స్వరూపం: ఇంజనీరింగ్ స్థాయిలో నాలుగేళ్ల బీటెక్ ఇన్ ఐఓటీ అండ్ అప్లికేషన్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. జాబ్ ప్రొఫైల్: ఇంజనీరింగ్లో ఐఓటీ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు ఐఓటీ ఇంజనీర్, ఐఓటీ యాప్ డెవలపర్, ఐఓటీ సొల్యూషన్ ఆర్కిటెక్ట్, సిటిజన్ ఐఓటీ సైంటిస్ట్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, ఐఓటీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్లుగా విధులు నిర్వహిస్తారు. బిజినెస్ అనలిటిక్స్ ఒకప్పుడు వ్యాపార సంస్థల మధ్య పోటీ తక్కువగా ఉండేది. కొన్ని సంస్థల గుత్తాధిపత్యం కొనసాగేది. కానీ ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదు. ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ నేపథ్యంలో.. వ్యాపార సంస్థల మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. దీంతో ఆయా వ్యాపారాలను లాభాల బాటలో తీసుకేళ్లేందుకు అందరూ బిజినెస్ అనలిటిక్స్ సహాయం తీసుకుంటున్నారు. అందుకే ప్రస్తుతం బడా కంపెనీల నుంచి చిన్న కంపెనీల వరకూ.. లక్షల్లో జీతాలు ఇచ్చి బిజినెస్ అనలిటిక్స్ నిపుణులను నియమించుకుంటున్నాయి. దీంతో బిజినెస్ అనలిటిక్స్కు బాగా డిమాండ్ ఏర్పడింది. పని తీరు మదింపు: స్టాటిస్టికల్, క్వాంటిటేటివ్, టెక్నికల్ çపరిజ్ఞానాన్ని ఉపయోగించి అందుబాటులో ఉన్న సమాచారాన్ని వివిధ రకాల పద్దతుల ద్వారా విశ్లేషించి.. ఒక కంపెనీ లేదా వ్యాపార సంస్థ పని తీరును మదించడమే బిజినెస్ అనలిటిక్స్. ఆయా సంస్థల వ్యాపారవృద్ధికి అవసరమైన ప్రణాళికలను రూపొందించేందుకు బిజినెస్ అనలిటిక్స్ ఉపయోగపడుతుంది. కోర్సు స్వరూపం: ఈ కోర్సులో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాలనకునే వారు బీటెక్ బిగ్ డేటా అనలిటిక్స్ కోర్సు చేయాల్సి ఉంటుంది. నాలుగేళ్ల ఈ కోర్సులో డేటా మైనింగ్, డేటా వేర్హౌసింగ్, డేటా విజువలైజేషన్ అధ్యయనం చేస్తారు. ఈ కోర్సు కూడా డేటా సైన్స్కు అనుబంధంగా ఉంటుంది. జాబ్ ప్రొఫైల్ : ఈ కోర్సును పూర్తిచేసిన విద్యార్థులు బిజినెస్ అనలిటిక్స్గా కెరీర్ను ప్రారంభించవచ్చు. వేతనాలు: బిజినెస్ అనలిటిక్స్ నిపుణులకు నైపుణ్యాలను బట్టి వార్షిక వేతనం రూ.ఆరు లక్షల నుంచి రూ.పది లక్షల వరకూ లభిస్తుంది. బయో మెడికల్ ఇంజనీరింగ్ బయోమెడికల్ ఇంజనీంగ్ ప్రస్తుతం ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి చూపుతున్న కోర్సులో ఒకటి. ఆరోగ్య రంగానికి సాంకేతిక తోడ్పాటు అందించేందుకు ఈ విభాగం కృషి చేస్తోంది. బయోమెడికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రధానంగా రోగ నిర్ధారణకు సంబంధించి ఉపయోగించే పరికరాలను తయారు చేస్తుంది. అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు రోగ నిర్ధారణ కోసం చేసే సిటీ స్కాన్, ఎంఆర్ఐలతో పాటు రోగా నిర్ధారణ పరిక్షల కోసం ఉపయోగించే ఇతర పరికరాలను తయారు చేసే వారే బయో మెడికల్ ఇంజనీర్లు. ఈ పరికరాలను తయారు చేయడానికి ఇంజనీరింగ్ పరిజ్ఞానం ఒక్కటే సరిపోదు. బయాలజీ, ఇంజనీరింగ్.. ఈ రెండింటిపై అవగాహన ఉండాలి. అందుకే ఈ రెండింటిని కలిపి ఉమ్మడిగా బయో మెడికల్ ఇంజనీరింగ్ కోర్సును రూపొందించారు. కోర్సు స్వరూపం: బయాలజీ, మెడిసిన్లకు సాంకేతికతను అన్వయించి మెడికల్ ఎక్విప్ మెంట్ను తయారు చేసేదే.. బయోమె డికల్ ఇంజనీరింగ్. నాణ్యమైన పరికరాలను తక్కువ ధరల్లో తయారు చేసేందు కు కృషి చేస్తారు. ఇది రానున్న కాలంలో మంచి డిమాండ్ ఉన్న రంగంగా మారుతుందని నిపుణుల అంచనా. జాబ్ ప్రొఫైల్: ఈ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు బయోమెడికల్ టెక్నిషియన్, బయో మెడికల్ ఇంజనీర్, బయో కెమిస్ట్గా విధులు నిర్వర్తిస్తారు. ఉద్యోగాలు: మెడికల్ కంపెనీలు, హాస్పిటల్స్, ఇన్స్ట్రుమెంట్ మ్యానుఫ్యా క్చరర్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్, ఇన్స్టాలెషన్ యూనిట్లల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వేతనాలు: ఈ రంగంలో ఉద్యోగాలు చేసే వారికి నెలకు రూ.30వేల నుంచి రూ.50వేల వరకు వేతనంగా లభిస్తుంది. అనుభవాన్ని బట్టి వేతనం పెరుగుతుంది. -
9 నుంచి ఇంజనీరింగ్ ప్రవేశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 9 నుంచి ఇంజనీరింగ్ ప్రవేశాలు చేపట్టాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ను ఖరారు చేసింది. గతేడాది విధానంలోనే ఈసారి కూడా ప్రవేశా లు చేపట్టాలని నిర్ణయించారు. రెండు దశల కౌన్సెలింగ్ తరువాత వచ్చే నెల 4న స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పించనున్నారు. స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలను https://tseamcet.nic.in వెబ్సైట్లో అందుబాటు లో ఉంచనున్నారు. నవంబర్ 5వ తేదీ నాటికి ప్రవేశాలు పూర్తయితే ఇంజనీరింగ్ తరగతులను నవంబర్ 10 లేదా 15వ తేదీ నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. అయితే దీనిపై అధికారిక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. (చదవండి: ‘అడ్వాన్స్డ్’లో తెలుగోళ్లు) సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు 36 హెల్ప్లైన్ కేంద్రాలు కరోనా నిబంధనలు పాటిస్తూనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. ఇందుకోసం 36 హెల్ప్లైన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. నిర్ణీత తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్ట నుంది. ప్రతి అర గంటకో స్లాట్ ఉండేలా కస రత్తు చేసింది. విద్యార్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో హెల్ప్లైన్ సెంటర్, తేదీ, సమయాన్ని పేర్కొంటూ ఆన్లైన్ ద్వారానే స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆయా సమయాల్లో సంబంధిత హెల్ప్లైన్ కేంద్రానికి వెళ్లి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసుకొనేలా కమిటీ ఏర్పాట్లు చేసింది. ప్రాసెసింగ్ ఫీజును ఎస్సీ, ఎస్టీలకు రూ. 600గా, ఇతర విద్యార్థులకు రూ. 1200గా నిర్ణయించింది. కౌన్సెలింగ్కు సంబంధించిన పూర్తి వివరాలను వెబ్సైట్లో బుధవారం అందుబాటులో ఉంచనుంది. (చదవండి: డబ్బులు ఎవ్వరికీ ఊరికే రావు: సజ్జనార్) -
ప్రకృతిలో సాగుబడి
ఇంజినీరింగ్ పట్టా చేతికి రాకుండానే క్యాంపస్ ఇంటర్వ్యూలోఎంపికైపోయి నాలుగంకెల వేతనం అందుకోవాలి.. ఏడాది తిరక్కుండా కంపెనీ తరఫున ఫారిన్ వెళ్లి డాలర్లు సంపాదించాలి. మూడు పదుల వయసులు దాటకుండానే సొంత ఇల్లు,బ్యాంక్ బ్యాలెన్స్ ఉండి తీరాలి.. సగటు బీటెక్ విద్యార్థి ఆలోచన ఇలాగే ఉంటుంది.ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారు వ్యవసాయం గురించి ఆలోచిస్తారా..! అంటే అలాంటి వారు కూడా ఉంటారా? అని ఆశ్చర్యపోతారు. అలాంటప్పుడు‘అల్లోల్ల దివ్యారెడ్డి’ గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే. సాక్షి,సిటీబ్యూరో: ఆర్థికంగా ఉన్నత కుటుంబానికి చెందిన దివ్యారెడ్డి పుట్టి పెరిగిన వాతావరణం అంతా సిటీలోనే అయినా.. ఇంజినీరంగ్ పూర్తి చేసినా ఆమె ఆలోచనలు మాత్రం గ్రామాల వైపు సాగాయి. ముఖ్యంగా దేశీయ ‘గో సంబంధ వ్యవసాయం’తో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని భావించిన ఆమె ఆ దిశగా అడుగులు వేశారు. ప్రస్తుతం ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో పిల్లల నుంచి పెద్దల వరకు తాగుతున్న పాలు కల్తీ అని గుర్తించిన దివ్యారెడ్డి.. స్వచ్ఛమైన దేశీయ ఆవు పాలు, పాల ఉత్పత్తులను ప్రజలకు చేరువ చేసేందుకు ‘క్లిమామ్ వెల్నెస్ ఫామ్స్’ను ప్రారంభించారు. దీనిద్వారా దేశీయ ఆవు పాలతో పాటు నెయ్యి, ఇతర పాల ఉత్పత్తులను తయారు చేస్తూ నగరవాసులకు అందిస్తున్నారు. ఈమె ప్రారంభించిన ఈ ఉద్యమానికి పదుల సంఖ్యలో అవార్డులు సైతం వరించాయి. నగరం మెచ్చిన ఉత్పత్తులు దివ్యారెడ్డి తన క్లిమామ్ ఫామ్ నుంచి నగరంలో రోజుకు 600 లీటర్ల పాలను సరఫరా చేస్తున్నారు. ముఖ్యంగా ఐటీ కారిడార్లోని మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్సిటీ, మియాపూర్ ప్రాంతాలతో పాటు బంజారాహిల్స్, కూకట్పల్లి, సికింద్రాబాద్ వాసులు ఈ పాల గురించి తెలుసుకుని మరీ ఆర్డర్పై తెప్పించుకుంటున్నారు. దివ్యారెడ్డి నడుపుతున్న ఫామ్లో ఉత్పత్తి అయ్యే పాలు, పాల ఉత్పత్తుల కంటే డిమాండ్ అధికంగా ఉండంతో తనలా ఆలోచించే మరో 20 మందికి స్వచ్ఛమైన పాలపై అవగాహన కలిగించి ఫామ్స్ను ఏర్పాటుకు ప్రోత్సహించారు. అలాగే సేంద్రీయ పద్ధతిలో పండించించిన కొర్రలు, బియ్యం, సామలు, అరికెలు, ఊదలు, అండు కొర్రలతో పాటు ఆయిల్, డైఫ్రూట్స్ను జూబ్లీహిల్స్లోని కేబీఆర్ పార్కు సమీపంలో ‘క్లిమామ్ ఫామ్ కేఫ్’ను ప్రారంభించారు. అలాగే, ఈ కేఫ్లో వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతులకు ‘సేంద్రియ వ్యవసాయం’పై అవగాహన కల్పిస్తున్నారు. ఆవులపై అధ్యయనం చేసి.. ప్రస్తుతం గ్రామాల్లో కూడా చాలామంది హైబ్రీడ్ ఆవులవైపు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఇవి దేశీయ ఆవులతో పోలిస్తే ఎక్కువగా పాలు ఇస్తాయని వాటినే పెంచేందుకు ఇష్టపడుతుంటారు. మరోపక్క గతంలో ఆవులను పాల కంటే వాటి పేడను ఎరువుగా వాడి సేంద్రియ వ్యవసాయం చేసేవారు. దాంతో దేశీయ ఆవులు సంతతి తగ్గిపోయింది. దాంతో పాటే ప్రజల ఆరోగ్య సమస్యలు సైతం పెరగనారంభించాయి. ఇలాంటి పరిస్థితితుల్లో సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చే దేశీ ఆవు పాలు, సంబంధిత ఉత్పత్తులు ప్రజలకు అందించడంతో పాటు ఆవు మలమూత్రాలతో సేంద్రియ వ్యవసాయాన్ని చేయాలని 2015లో దివ్యారెడ్డి సంగారెడ్డి సమీపంలోని ఓల్డ్ ముంబై జాతీయ రహదారికి ఆనుకొని ‘క్లిమామ్ వెల్నెస్ ఫామ్స్’ను ప్రారంభించారు. తొలుత 20 దేశీయ ఆవులతో మొదలైన ఈ ఫామ్స్లో ఇప్పుడు 200 ఆవులున్నాయి. ప్రారంభంలో కేవలం తమ ఇంటి అవసరాలు, బంధువులకు మాత్రమే సరఫరా చేసిన ఈ పాలు ఇప్పుడు సిటీలో వందల మందికి సరఫరా చేసే స్థాయికి తీసుకెళ్లారు. ప్రజల్లో అవగాహన పెరగాలి ఒకప్పుడు గ్రామాల్లో పశువులను పాలకోసం కాకుండా వాటి మలమూత్రాలను ఎరువుగా వాడి వ్యవసాయం చేసేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఆదాయం కోసం హైబ్రీడ్ వైపు పరుగులు తీస్తున్నారు. ఈ ఆలోచన తప్పు. పల్లెలకు గత వైభవం రావాలి. మళ్లీ సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు పడేలా నేనొక ప్రేరణగా నిలవాలన్న ఉద్దేశంతో క్లిమామ్ వెల్నెస్ ఫామ్స్ మొదలెట్టా. నేను చేస్తున్నది ఉత్తమమైన పద్ధతి అని అందరికీ ప్రాక్టికల్గా చూపిస్తున్నా. సేంద్రియ ఆహారం అందరికీ అందాలన్నది నా ఉద్దేశం.– దివ్యారెడ్డి, క్లిమామ్ వెల్నెస్ ఫామ్స్ -
టీజీటీ పోస్టులకు బీటెక్ వారూ అర్హులే
సాక్షి, హైదరాబాద్: టీజీటీ (టీచర్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్) పోస్టుల భర్తీ నోటిఫికేషన్లో ఉన్న బీఏ, బీకాం, బీఎస్సీ వారితోపాటు బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులను కూడా అర్హులుగా పరిగణించాలని హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. నోటిఫికేషన్లోని డిగ్రీలతోపాటు బీటెక్ చేసిన వారిని కూడా అర్హులుగా ప్రకటించాలని కోరుతూ ఖమ్మంకు చెందిన సంజీవరావు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ బీటెక్తోపాటు బీఎడ్ కూడా చేశారని, పరీక్ష రాసి ఉత్తీర్ణులైనా ఎంపిక చేయలేదని ఆయన తరఫు న్యాయవాది ఉమాదేవి వాదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఎన్సీటీఈ 2014 రూల్స్ మేరకు టీజీటీ పోస్టులకు నోటిఫికేషన్లోని డిగ్రీలతోపాటు బీటెక్ పూర్తి చేసిన వారిని కూడా అర్హులుగా ప్రకటించాలని ఉత్తర్వులు జారీ చేశారు. -
క్రేజీ కోర్సు ప్రారంభించిన ఐఐటీ హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్ : మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నూతన టెక్నాలజీలు సాంకేతిక విద్యలో దూసుకువస్తున్న నేపథ్యంలో ఆయా కోర్సులను ప్రవేశపెట్టేందుకు ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో 2019-2020 విద్యా సంవత్సరం నుంచి కృత్రిమ మేథ( ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ)లో బీటెక్ ప్రోగ్రామ్ను ఐఐటీ హైదరాబాద్ ప్రారంభించనుంది. ఏఐలో పూర్తిస్ధాయి బీటెక్ ప్రోగ్రాంను ఆఫర్ చేస్తున్న తొలి భారత విద్యా సంస్థ ఐఐటీ- హైదరాబాద్ కావడం గమనార్హం. ఇక అమెరికాకు చెందిన కర్నెగీ మెలన్ యూనివర్సిటీ, మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) తర్వాత ఈ తరహా కోర్సును అందిస్తున్న మూడవ విద్యా సంస్థగా కూడా ఐఐటీ హైదరాబాద్ నిలవనుంది. ఇక బీటెక్ ఏఐలో 20 మంది విద్యార్ధులను తీసుకుంటారు. ఈ కోర్సులో భాగంగా విద్యార్ధులకు ఏఐ, మెషిన్ లెర్నింగ్ల్లో మూల సిద్ధాంతం, ప్రాథమిక అంశాలు, ప్రాక్టికల్స్పై అత్యున్నత శిక్షణ అందిస్తారు. ఏఐ, మెషిన్ లెర్నింగ్ల్లో పెరుగుతున్న డిమాండ్లకు అనుగుణంగా విద్యార్ధులను దేశీయ, అంతర్జాతీయ పరిశ్రమల్లో రాటుదేలేలా తీర్చిదిద్దుతారు. ఐఐటీ హైదరాబాద్లో ఏఐ శిక్షణ, పరిశోధనకు అనువైన వాతావరణం ఏర్పాటు చేయడమే ముఖ్యోద్దేశంగా ఈ కోర్సును ప్రవేశపెడుతున్నామని, ఏఐలో బీటెక్, ఎంటెక్ సహా పలు ప్రోగ్రామ్లను అందుబాటులో ఉంటాయని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ యూబీ దేశాయ్ వెల్లడించారు. విద్యాపరమైన అంశాలతో పాటు పరిశోధన, అభివృద్ధికీ మెరుగైన ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. -
బీ'టెక్' చైన్ స్నాచర్ అరెస్టు
అతను ఉన్నత చదువు చదివాడు. మంచి ఉద్యోగం చేసి తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాల్సిన సమయంలో అతని బుద్ధి వక్రమార్గం పట్టింది. జల్సాలకు అలవాటుపడి డబ్బు కోసం చోరీలు చేయడం మొదలుపెట్టాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలు లెక్కిస్తున్నాడు. తిరుపతి క్రైం : బీటెక్ చదివి చైన్ స్నాచింగులకు పాల్పడుతున్న దొంగను అర్బన్ జిల్లా క్రైం పోలీసులు బుధవారం సాయంత్రం తనపల్లిలోని మార్కెట్ యార్డు వద్ద అరెస్టు చేశారు. క్రైం పోలీసు స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రవిశంకర్రెడ్డి వివరాలు వెల్లడించారు. తిరుచానూరులోని కొత్తపాలెం లేఔట్లో నివాసముంటున్న కాటయ్య కుమారుడు కంపా ఈశ్వర్కిశోర్ (29) 2010లో బీటెక్లో ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) చదివాడు. ప్రభుత్వ ఉద్యోగం పలు పరీక్షలు రాశాడు. ఇందుకోసం తిరుపతి నగరంతోపాటు నంద్యాలలోని కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకున్నాడు. ఉద్యోగం రాకపోవడంతోపాటు జల్సాలకు అలవాటుపడి తిరుపతికి చేరుకుని ద్విచక్ర వాహనంపై తిరుగుతూ మొదట బ్యాగుల దొంగతనం చేయడం మొదలు పెట్టాడు. అలా వచ్చిన డబ్బులు తీసుకుని నంద్యాలకు వెళ్లిపోయాడు. బాధితులు ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో తప్పించుకుని తిరిగాడు. మళ్లీ తిరుపతికి చేరుకుని.. 2013 నుంచి 2015 వరకు తిరుపతిలో ఉంటూ ఉద్యోగాల కోసం ముమ్మరంగా ప్రయత్నించాడు. ఫలితం లేకపోవడంతో డబ్బు అవసరాల కోసం తిరిగి చైన్ స్నాచింగ్లు చేయాలని నిర్ణయించుకున్నాడు. తిరుపతి, శ్రీకాళహస్తి, తిరుచానూరు పరిసర ప్రాంతాల్లో ఒంటరిగా వెళుతున్న మహిళలను గుర్తించి తన ద్విచక్ర వాహనంలో వెళుతూ చైన్ స్నాచింగ్లకు పాల్పడేవాడు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు జల్సాలకు అలవాటు పడిన ఈశ్వర్ కిశోరే చోరీలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. అతనిపై తిరుపతి క్రైం పోలీసు స్టేషన్లో 7, ఎంఆర్పల్లి పోలీసు స్టేషన్లో 7, ఎస్వీయూ పోలీసు స్టేషన్లో 2, శ్రీకాళహస్తి టూటౌన్లో ఒకటి, తిరుచానూరులో 2 మొత్తం 19 కేసులు నమోదయ్యాయి. నిందితుడు ఈశ్వర్ కిశోర్ నగలను అమ్మి వచ్చిన డబ్బును వడ్డీలకు ఇచ్చేవాడు. ఈ నెల 7న స్నేహితులు డబ్బు కావాలని అడగడంతో తన వద్ద ఉన్న బంగారు నగలు అమ్మేందుకు బయలుదేరాడు. సమాచారం అందుకున్న క్రైం సీఐ మధు చాకచక్యంగా నిందితుడిని అరెస్టు చేశారు. అతని నుంచి రూ.13.40 లక్షలు విలువ చేసే 383 గ్రాముల బంగారు ఆభరణాలు, 422 గ్రాముల వెండి, రూ.1.70 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇదే మొదటి సారి డీఎస్పీ రవిశంకర్రెడ్డి మాట్లాడుతూ నిందితుడు ఈశ్వర్కిశోర్ ఇన్ని దొంగతనాలకు పాల్పడ్డా ఇంతవరకు ఒక్కసారి కూడా పోలీసులకు చిక్కలేదన్నారు. 2017లో జరిగిన 16 చోరీలపై బాధితులు ఫిర్యాదు చేయలేదని తెలిపారు. నిందితుడిని అరెస్టు చేయడంలో సీఐలు అబ్బన్న, శరత్చంద్ర, భాస్కర్రెడ్డి, పద్మలత, ఎస్ఐలు రమేష్బాబు, సిబ్బంది ఎంతగానో కృషి చేశారని డీఎస్పీ పేర్కొన్నారు. అదేవిధంగా క్రైం పార్టీ ఇన్చార్జి అబ్బన్న, ఎస్ఐ రమేష్బాబు, ఐడీ పార్టీ సిబ్బంది కీలకంగా వ్యవహరించారని, వీరందరికీ అర్బన్ ఎస్పీ అభిషేక్ మొహంతి ద్వారా రివార్డులు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కేసులో కష్టపడిన సిబ్బంది స్వయం ప్రకాష్, రవిప్రకాష్, గౌరినాయుడులను ప్రత్యేకంగా అభినందించారు. -
ఐఐటీల్లో పీజీ.. ఉద్యోగం ఈజీ!
సాక్షి, హైదరాబాద్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లలో ఇంజనీరింగ్, మేథమెటిక్స్, హ్యుమానిటీస్లో పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) చదువుతున్న విద్యార్థులకు ఈ ఏడాది ఉద్యోగాల పంట పండింది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ విద్యార్థులకు కంపెనీలు భారీగా వేతనాలు ఆఫర్ చేశాయి. ఐఐటీల్లో చదివే బీటెక్ విద్యార్థులతో పోలిస్తే.. పీజీ (ఎంటెక్) విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్మెంట్లలో ఉద్యోగావకాశాల శాతం (60–65 శాతం మాత్రమే) తక్కువ. కానీ ఈ ఏడాది కాన్పూర్, రూర్కీ, భువనేశ్వర్, ఖరగ్పూర్, హైదరాబాద్, గాంధీనగర్ ఐఐటీల్లో పీజీ చదువుతున్న వారిలో 90 శాతం మందికి ఉద్యోగాలు లభించాయి. ముంబై, చెన్నై, ఢిల్లీ ఐఐటీలోనైతే ప్లేస్మెంట్కు నమోదు చేసుకున్న విద్యార్థులందరికీ ఉద్యోగాలు రావడం గమనార్హం. అంతేకాదు కంపెనీలు గతేడాదితో పోలిస్తే 50 శాతం మేర ఎక్కువగా వేతనాలు ఆఫర్ చేశాయి. గతేడాదికన్నా ఎక్కువగా... ఐఐటీ ఖరగ్పూర్లో పీజీ చేస్తున్న విద్యార్థుల్లో 570 మందికి ఆయా కంపెనీలు ఉద్యోగాలు ఆఫర్ చేశాయి. గతేడాది ఉద్యోగాలు పొందిన 342 మందితో పోలిస్తే ఇది 40 శాతం అధికం. ఐఐటీ కాన్పూర్లో గత సంవత్సరం 301 మందికి ఉద్యోగాలివ్వగా.. ఈసారి 30 శాతం ఎక్కువగా 432 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇక గత మూడేళ్లలో ఢిల్లీ, చెన్నై ఐఐటీల్లో పీజీ విద్యార్థుల ప్లేస్మెంట్లు 60–75 శాతానికి మించలేదు. కానీ ఈ ఏడాది ఏకంగా 95 శాతం మంది ఉద్యోగాలు పొందారు. అంతేకాదు కాన్పూర్, చెన్నై, రూర్కీ ఐఐటీల్లో ఈసారి ఉద్యోగాలు పొందిన పీజీ విద్యార్థులకు గత ఐదేళ్ల సగటుతో పోల్చితే 90 శాతం అధికంగా వేతన ఆఫర్లు వచ్చాయి. పీజీ విద్యార్థులకు పెరుగుతున్న డిమాండ్ బీటెక్ చదివినవారు కంపెనీల్లో స్థిరంగా ఉద్యోగాలు చేయకపోవడం, ఏడాది రెండేళ్లు పనిచేశాక పైచదువుల కోసం విదేశాలకు వెళ్లిపోవడం వంటి కారణాలతో ఐటీ కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెన్నై ఐఐటీ ప్లేస్మెంట్ విభాగం ఓ విశ్లేషణలో వెల్లడించింది. అందువల్ల రెండు మూడేళ్లుగా పీజీ విద్యార్థులకు ఆఫర్లు ఎక్కువగా వస్తున్నాయని పేర్కొంది. కంప్యూటర్ సైన్స్ వారికి భారీ వేతనాలు ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రధానాంశంగా, మెకానికల్లో రోబోటిక్స్ ప్రధానాంశంగా పీజీ చేస్తున్నవారికి డిమాండ్ ఎక్కువగా ఉంది. వారికి కనిష్టంగా రూ. 75 లక్షల నుంచి గరిష్టంగా రూ. 90 లక్షల వరకు వార్షిక వేతనాల ఆఫర్లు రావడం గమనార్హం. అంతేకాదు ఈసారి పీజీ పూర్తి చేసుకుంటున్న విద్యార్థులకు గత ఐదేళ్ల సగటుతో పోల్చితే కనిష్టంగా 50 శాతం నుంచి గరిష్టంగా 90 శాతం వరకు అధికంగా వేతనాల ఆఫర్లు వచ్చాయి. ఇంజనీరింగ్ విద్యార్థులు మాత్రమే కాదు డ్యూయల్ డిగ్రీ (ఐదేళ్ల మాస్టర్ డిగ్రీ) చేసిన విద్యార్థులకు కూడా ప్రతిష్టాత్మక కంపెనీలు మంచి ఆఫర్లు ఇచ్చాయి. ఎక్కువ వేతనం ఆఫర్ చేసిన కంపెనీల్లో సామ్సంగ్ ఆర్అండ్డీ, ఇంటెల్, టాటా మోటార్స్, గోల్డ్మన్శాక్స్, హ్యూందాయ్, మైక్రోసాఫ్ట్, హెచ్పీ వంటి కంపెనీలు ఉన్నాయి. ఎన్ఐటీల్లోనూ ‘పీజీ’డిమాండ్ ఐఐటీలే కాదు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)లలో కూడా పీజీ విద్యార్థులకు ఈసారి భారీగా ఉద్యోగ ఆఫర్లు వచ్చాయని నాస్కామ్ తన తాజా బులెటిన్లో వెల్లడించింది. ‘‘పీజీ విద్యార్థులు ప్రత్యేకమైన కోర్సులో స్పెషలైజేషన్ పూర్తి చేస్తారు. ఎంపిక చేసుకున్న సబ్జెక్టు మీద వారికి పూర్తిగా అవగాహన ఉంటుంది. దీంతో కంపెనీలు పీజీ విద్యార్థుల మీద దృష్టి పెట్టాయి..’’అని నాస్కామ్ సీనియర్ డైరెక్టర్ పి.అశోక్ చెప్పారు. ఓ మోస్తరు పేరున్న ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా పీజీ విద్యార్థులకు కంపెనీలు ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్నాయని తెలిపారు. ఈ ఏడాది తెలంగాణలోని టాప్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీల్లో పీజీ విద్యార్థులకు ప్లేస్మెంట్లు చేపడుతున్నట్లు పలు కంపెనీలు ఇప్పటికే లేఖలు రాశాయి. ఇతర కాలేజీల్లో బీటెక్ చేసినా ఐఐటీల్లో ఎంటెక్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో బ్యాచిలర్ అఫ్ టెక్నాలజీ (బీటెక్) సీటు కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది పోటీపడతారు. కానీ పది వేల మందికి మాత్రమే సీట్లు లభిస్తాయి. అదే విద్యా సంస్థల్లో పోస్టు గ్రాడ్యుయేషన్కు మాత్రం పోటీ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఐఐటీల్లో బీటెక్ పూర్తికాగానే క్యాంపస్ ప్లేస్మెంట్లలో మంచి ఉద్యోగావకాశాలు వస్తుంటాయి. మరికొందరు పైచదువుల కోసం విదేశాలకు వెళ్లిపోవడం జరుగుతోంది. దీంతో ఇతర కాలేజీల్లో బీటెక్ పూర్తి చేసినవారు ఐఐటీల్లో ఎంటెక్ చేసేందుకు అవకాశం లభిస్తోంది. అలాంటివారు ‘గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్)’పరీక్ష ద్వారా ఐఐటీల్లో పీజీ కోర్సులు చేయవచ్చు. -
బీటెక్ ఫస్ట్ఇయర్ ఫలితాలు విడుదల
అనంతపురం న్యూసిటీ: బీటెక్ మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్(ఆర్15) రెగ్యులర్, సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేసినట్లు జేఎన్టీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ సి.శశిధర్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. జేఎన్టీయూ అనుబంధ కళాశాలల విద్యార్థులు ఫలితాలను http://jntuaresults.azurewebsites.net వెబ్సైట్లో పరిశీలించుకోవచ్చు. -
బీటెక్ ఫలితాలు విడుదల
జేఎన్టీయూ: జేఎన్టీయూ అనంతపురం పరిధిలో మే, జూన్–2017 లో నిర్వహించిన బీటెక్ ద్వితీయ సంవత్సరం రెండో సెమిస్టర్ రెగ్యులర్ , నాలుగు సంవత్సరం మొదటి సెమిస్టర్ సప్లిమెంటరీ, బీఫార్మసీ ద్వితీయ సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ సి.శశిధర్ తెలిపారు. -
ఆగస్టు 5న స్పాట్ అడ్మిషన్లు
జేఎన్టీయూ: జేఎన్టీయూ అనంతపురంలోని పాలకభవనంలో బీటెక్ (బ్లెకింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్వీడన్), జేఎన్టీయూఏ సంయుక్తంగా అందిస్తున్న బీటెక్ కోర్సుల్లో ఆగస్టు 5న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ విజయ్కుమార్ తెలిపారు. బీటెక్ సీఎస్ఈ, ఈసీఈ, మెకానికల్ బ్రాంచుల్లో చేరడానికి ఆసక్తి గల అభ్యర్థులు హాజరుకావాలన్నారు. ఫీజు తదితర పూర్తి వివరాలకు www.jntua.ac.inలో తెలుసుకోవచ్చన్నారు. -
బీటెక్, బీఫార్మసీ ఫలితాలు విడుదల
జేఎన్టీయూ: జేఎన్టీయూ అనంతపురం పరిధిలో మే, జూన్–2017లో నిర్వహించిన బీటెక్, బీఫార్మసీ మూడో సంవత్సరం రెండో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ సి.శశిధర్ శుక్రవారం తెలిపారు. బీఫార్మసీ మొదటి, రెండు, మూడు, నాలుగో సంవత్సరం మొదటి , రెండో సెమిస్టర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేశామన్నారు. విద్యార్థులు తమ మార్కుల వివరాల కోసం http://jntuaresults.azurewebsites.net ద్వారా తెలుసుకోవాలన్నారు. -
నేటి నుంచి రెండో దఫా కౌన్సెలింగ్
జేఎన్టీయూ: ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి రెండో దఫా కౌన్సెలింగ్ గురువారం నుంచి ప్రారంభం కానున్నట్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కేశవచంద్ర తెలిపారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, అనంతపురం, ఎస్కేయూ హెల్ప్లైన్ కేంద్రాల్లో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావచ్చన్నారు. 22వ తేదీతో కౌన్సెలింగ్ ముగుస్తుందన్నారు. ఇప్పటికే తొలి దఫా ఇంజినీరింగ్ కౌన్సెలింగ్లో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైనవారు, రెండో దఫా సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాల్సిన అవసరం లేదన్నారు. అవసరం అనుకుంటే కేవలం వెబ్ ఆప్షన్లు మాత్రమే మార్చుకోవచ్చునని సూచించారు. 22 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వడానికి షెడ్యూల్ను నిర్ధేశించారని పేర్కొన్నారు. -
ఒక్క బీటెక్ తో జాబ్ రానే రాదు!
విజయవంతంగా బీటెక్ పట్టాలతో కాలేజీల నుంచి బయటికి వస్తున్న విద్యార్థులకు బ్యాడ్ న్యూస్. బీటెక్ డిగ్రీ హోల్డర్స్ ప్రస్తుతం అత్యంత కఠినమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుస్తోంది. కేవలం ఒక్క డిగ్రీతోనే ఐటీ కెరీర్ లో విజయవంతం కావడం కష్టతరమని పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రతేడాది రాష్ట్రంలో 75వేల మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ తమ గ్రాడ్యుయేట్ పూర్తిచేస్తున్నారు. వారందరూ కెరీర్ లో సక్సెస్ కావాలంటే, అదనపు స్కిల్స్, సముచిత ప్రాంతంలో స్పెషలైజేషన్ కొత్త మంత్రాలుగా విశ్లేషకులు హితభోదిస్తున్నారు. 1990 మధ్యలో ఐటీ బూమ్ ప్రారంభమైనప్పుడు, సాఫ్ట్ వేర్ కంపెనీలు ఎంట్రీ లెవల్ ఉద్యోగాల కోసం కేవలం ఫ్రెష్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లనే నియమించుకునేవి. తర్వాత మూడు నెలల కాలం నుంచి ఆరు నెలల కాలం వ్యవధిలో ట్రైనింగ్ ఇచ్చి, వారిని తమ ప్రాజెక్టులలోకి కేటాయించేవి. కానీ గత కొన్నేళ్ల నుంచి అంతర్జాతీయ ఐటీ మార్కెట్లో విద్యార్థులను నియమించుకునే ప్రక్రియలో చాలా మార్పులు వచ్చాయి. ప్రస్తుతం కంపెనీలు తమ బడ్జెట్ లను మరింత కఠితనరం చేస్తున్నారు. దీంతో ట్రైనింగ్ కు వెచ్చించే అవకాశం కనబడటం లేదు. మంచి అకాడమిక్ రికార్డు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న ఫ్రెషర్లకి అప్పట్లో ఉద్యోగాలు ఆఫర్ చేసేవాళ్లమని మాదాపూర్ కు చెందిన ఓఎస్ఐ కన్సల్టెంగ్ ఎండీ అనిల్ యామిని చెప్పారు. కానీ ప్రస్తుతం పరిస్థితులన్ని మారిపోయాయని, బీటెక్ డిగ్రీతో పాటు ఏదైనా టెక్నాలజీ లేదా వర్టికల్ పై సంపూర్ణ జ్ఞానం ఉన్న గ్రాడ్యుయేట్లనే కంపెనీలు కోరుకుంటున్నాయని తెలిపారు. సీఎస్ఈ, ఐటీ బ్రాంచులను ఎంపికచేసుకునే విద్యార్థుల్లో కూడా తమ కోర్ సబ్జెట్ లలో పరిపూర్ణ జ్ఞానం, నైపుణ్యాలు ఉండటం లేదన్నారు. ఇప్పటికే చాలా అధ్యయనాలు కూడా గ్రాడ్యుయేట్లు ప్రస్తుత ఐటీ ఇండస్ట్రీకి తగిన విధంగా ఉండటం లేదని గుర్తించాయి. ప్రస్తుతం సాఫ్ట్ వేర్ కంపెనీలు ఎంట్రీలెవల్ ఉద్యోగాల్లో కోత పెడుతున్నాయి. తమ బెంచ్ బలాన్ని తగ్గించేసుకుంటున్నాయి. ఇది కొత్త టెకీలపై కూడా ప్రభావం చూపుతుంది. అదనంగా టెక్నికల్ స్కిల్స్ లేని బీటెక్ విద్యార్థులకు ఐటీ ఇండస్ట్రీలో ఉద్యోగాలు వచ్చే అవకాశముండదు. కంపెనీలో జాయిన్ అవకముందే ప్రాజెక్టులపై విద్యార్థులకు అవగాహన ఉండాలని ఐటీ సంస్థలు కోరుకుంటున్నాయని పలువురు పేర్కొంటున్నారు. మరోవైపు ఆటోమేషన్ సైతం ప్రాజెక్ట్ సమయాన్ని తగ్గించడం, బెంచ్ బలగాల డెలివరీ షెడ్యూలపై ప్రభావం చూపడం కూడా చేస్తోంది. -
కోదాడలో పరిమళించిన మానవత్వం
-
రేపటి నుంచి వీశాట్
చేబ్రోలు (పొన్నూరు): ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు విజ్ఞాన్ యూనివర్సిటీ బీటెక్ ప్రవేశ పరీక్ష వీశాట్–2017 జరుగుతుందని అడ్మిషన్స్ డీన్ వి.రవికుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ వర్సిటీలో ప్రవే శాలకు ఏపీ, తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా 42 సెంటర్లలో ఈ పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. ఆయా రాష్ట్రాల నుంచి మొత్తం 42 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. ప్రవేశ పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థులు తమ వర్సిటీలో ఆయా కోర్సుల్లో చేరవచ్చన్నారు. ఇంటర్, ఎంసెట్, జేఈఈ, వీశాట్ తదితర పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు వంద శాతం నుంచి, 25 శాతం వరకు ఫీజు రాయితీ ఉంటుందని రవికుమార్ వివరించారు. -
బీటెక్ మొదటి సెమిస్టర్ ఫలితాలు విడుదల
జేఎన్టీయూ : జేఎన్టీయూ అనంతపురం పరిధిలోని బీటెక్ మొదటి సంవత్సరానికి సంబంధించిన మొదటి సెమిస్టర్ ఫలితాలు విడుదల చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య సి.శశిధర్ తెలిపారు. -
ఐఐటీల్లో పరిశోధకుల ఫెలోషిప్ పెంపు!
⇒ నెలకు రూ.25 వేల నుంచి రూ.75 వేలకు పెంచే యోచన ⇒ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ కసరత్తు ⇒ మధ్యలో మానేస్తే తీసుకున్న మొత్తం తిరిగి చెల్లించాల్సిందే ⇒ బీటెక్ తర్వాత నేరుగా పీహెచ్డీకి అవకాశం సాక్షి, హైదరాబాద్: దేశంలోని ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ విద్యా సంస్థలైన ఐఐటీల్లో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ(పీహెచ్డీ) చేసే వారికి ఇచ్చే ఫెలోషిప్ను పెంచేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్డీ) కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం నెలకు రూ.25 వేలు ఇస్తున్న ఫెలోషిప్ను రూ.75 వేలకు పెంచేందుకు చర్యలు చేపడుతోంది. పరిశోధనా కార్యక్రమాల్లో మరింత నాణ్యతను తీసుకొచ్చేందుకు ఈ చర్యలు చేపట్టాలన్న నిర్ణయానికి వచ్చింది. గత ఏడాదే ఐఐటీ కౌన్సిల్ దీనికి ఆమోదం తెలిపింది. తాజాగా ఎంహెచ్ఆర్డీ పరిశీలనకు పంపిన ఈ ప్రతిపాదనపై త్వరలోనే నిర్ణయం వెలువడనుందని ఐఐటీ వర్గాలు వెల్లడించాయి. బీటెక్తోనే నేరుగా పీహెచ్డీకి అవకాశం.. ప్రస్తుతం పీహెచ్డీలో చేరాలంటే విద్యార్థులు మాస్టర్ డిగ్రీ (ఎంటెక్) పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇలా దేశంలోని 23 ఐఐటీల్లో 25 వేల మంది విద్యార్థులు పీహెచ్డీలు చేస్తున్నారు. వారికి ఈ అవకాశం కల్పించడంతోపాటు బీటెక్తోనే నేరుగా పీహెచ్డీలో చేరే అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణ యించింది. తద్వారా పరిశోధనలకు పెద్దపీట వేసినట్లవుతుందని భావిస్తోంది. పరిశోధనలు చేసేందుకు ఆసక్తిని పెంపొందించేందుకు ఫెలోషిప్ పెంచ డంతోపాటు బీటెక్ తర్వాత నేరుగా పీహెచ్డీ ప్రవేశాలకు దోహదపడతాయని భావిస్తోంది. అగ్రశ్రేణి కంపెనీలు పీహెచ్డీ చేసిన వారికి ప్రా«ధాన్యం ఇçస్తుండటంతో ఇది వారికి ఎంతో ఉపయోగపడుతుందని ఐఐటీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఐఐటీల్లో పరిశోధనలు చేస్తున్న 25 వేల మంది విద్యార్థులకూ ఈ ఫెలోషిప్ పెంపును వర్తింపజేస్తారని భావిస్తున్నారు. దీనిపై అధికారికంగా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఐఐటీ వర్గాలు తెలిపాయి. మానేస్తే.. తిరిగి చెల్లించాల్సిందే.. ప్రస్తుతం పీహెచ్డీ చేస్తున్న వారు తమ పరిశోధనను మ«ధ్యలో మానేస్తే నెలకు రూ.25 వేలు ఇస్తున్న ఫెలోషిప్ ను తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఆ నిబంధనను కూడా మార్చేందుకు చర్యలు చేపట్టింది. నెలకు రూ.75 వేలు ఫెలోషిప్ పొందే విద్యా ర్థులు కనుక మధ్యలో పరిశోధనను మానేస్తే తాము తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించాలన్న నిబంధనను పొందుపరుస్తోంది. తద్వారా పరిశోధనలు మధ్యలో ఆపేయకుండా చేయడం తోపాటు ప్రతి పరిశోధనా కచ్చితంగా పూర్తి అవుతుందని, వాటి ప్రయోజనాలు సమాజానికి ఉప యోగపడతాయని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగా 2017–18 విద్యా సంవత్సరంలో ఫెలోషిప్ పెంపుతో పాటు కొత్తగా దాదాపు వెయ్యి మంది విద్యార్థులకు పీహెచ్డీల్లో ప్రవేశాలను కల్పించేందుకు చర్యలు చేపడుతోంది. త్వరలోనే దీనిపై అధికారికంగా నిర్ణయాన్ని ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. -
బీటెక్, బీఫార్మసీ ఫలితాల విడుదల
జేఎన్టీయూ : జేఎన్టీయూ అనంతపురం పరిధిలో డిసెంబర్–2016లో నిర్వహించిన బీటెక్, బీఫార్మసీ మూడో సంవత్సరం రెండో సెమిస్టర్ (ఆర్–13) (ఆర్–09) సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య సి.శశిధర్ తెలిపారు. విద్యార్థుల తమ మార్కుల వివరాల కోసం http://jnturesults.azurewebsites.net ద్వారా తెలసుకోవాలని సూచించారు. -
సీట్లకు కోతే కోత..!
బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంఫార్మసీ కాలేజీల్లో భారీగా సీట్ల తగ్గింపు సాక్షి, హైదరాబాద్: ఈసారి బీటెక్, బీఫార్మసీ కాలేజీల్లోనే కాదు.. ఎంటెక్, ఎంబీఏ, ఎం.ఫార్మసీ కాలేజీల్లోనూ సీట్ల సంఖ్య భారీగా తగ్గనున్నట్లు సమాచారం. ఆయా కాలేజీల్లో అనేక బ్రాంచీలకు అధికారులు కోత విధించినట్లు తెలిసింది. బీటెక్లో 45 వేల నుంచి 50 వేల సీట్లకు కోత పడే అవకాశం ఉండగా.. ఎంబీఏ, ఎంటెక్, ఎం.ఫార్మసీలో ఉన్న దాదాపు 70 వేల సీట్లలో 25 వేల సీట్ల వరకు కోత పడనున్నట్లు తెలిసింది. ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల అనుబంధ గుర్తింపు, వాటిల్లో ఫీజులపై ఉత్తర్వులు జారీ అవుతాయని శనివారం అర్ధరాత్రి వరకు కాలేజీ యాజమాన్యాలు ఉత్కంఠతో ఎదురుచూశాయి. అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల జాబితా ప్రకటన ఇదిగో అదిగో అని చెప్పినా.. అర్ధరాత్రి వరకు జారీ కాలేదు. ఫీజుల జీవోదీ అదే పరిస్థితి. అర్ధరాత్రి వరకు అధికారులు కాలేజీ వారీగా ఫీజులను పరిశీలిస్తూనే ఉన్నారు. ఇక ఆదివారం ఉదయమే ఫీజుల జీవో, అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. -
బీటెక్లో ‘లోటెక్’ బోధన!
రాష్ట్రంలో కానిస్టేబుల్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న ఐదున్నర లక్షల మందిలో 32,729 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు! ఎంటెక్ చేసిన వారు 1,836! గ్రూపు-2కు దరఖాస్తు చేసిన వారిలో బీటెక్ పట్టభద్రులు 9,204. ఎంటెక్ చేసిన వారు 2 వేల మంది!! టీఎస్పీఎస్సీ వన్టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న బీటెక్ గ్రాడ్యుయేట్లు 2,49,061 మంది. ఏ నోటిఫికేషనొచ్చినా రాసేందుకు రెడీగా ఉన్నారు. - సరైన అర్హతలు లేకుండానే అధ్యాపకుల పాఠాలు - రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో 33 వేల మంది అధ్యాపకులు అవసరం - కానీ ఉన్నది 25 వేలే.. అందులో సగం మందికి కేవలం బీటెక్ అర్హత - 16 వేల మంది పీహెచ్డీ సిబ్బంది ఉండాలి.. ఉన్నది కేవలం 1,500 - బీటెక్ చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్గా పాఠాలు చెబుతున్నవారెందరో.. - తప్పుడు లెక్కలతో మసిపూసి మారేడు కాయ చేస్తున్న యాజమాన్యాలు - నాణ్యమైన విద్యకు దూరమవుతున్న విద్యార్థులు సాక్షి, హైదరాబాద్ అరకొర నైపుణ్యాలతో పట్టాలు పుచ్చుకొని కాలేజీల నుంచి వస్తున్న లక్షలాది మంది ఇంజనీరింగ్ అభ్యర్థులు చివరకు కానిస్టేబుల్ ఉద్యోగానికి కూడా దరఖాస్తు చేసుకుంటున్నారు. దీన్నిబట్టి రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో బోధన ప్రమాణాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. చదివిన రంగంలో ముందుకు సాగ లేక.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందుకోలేక.. ఏదోలా గట్టెక్కిన డిగ్రీతో ఇతర రంగాల వైపు చూస్తున్నారు. విద్యార్థుల ఈ స్థితికి ప్రధాన కారణం బోధన సమస్యలే! కాలేజీల్లో నాణ్యమైన బోధన లేక, అర్హులైన అధ్యాపకుల్లేక ఇంజనీరింగ్ విద్య అంపశయ్యపై కొట్టుమిట్టాడుతోంది. అర్హులైన అధ్యాపకులేరి? రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న 1,26,468 ఇంజనీరింగ్ సీట్లకు గాను 33,706 మంది అధ్యాపకులు అవసరం. కానీ రాష్ట్రంలోని 246 ఇంజనీరింగ్ కాలేజీల్లో అధ్యాపకుల సంఖ్య 25 వేలు మాత్రమే. అందులో సగం మంది బీటెక్ పూర్తి చేసినవారే ఉన్నారు. ప్రొఫెసర్ పోస్టులకు పీహెచ్డీ కలిగి, బోధనలో కనీసం ఐదేళ్లు అనుభవం ఉన్న వారు అర్హులు. అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు కూడా పీహెచ్డీ ఉండాలి. రాష్ట్రంలోని బీటెక్, ఎంటెక్ కాలేజీల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు 16,667 మంది అవసరం. కానీ ప్రస్తుతం ఉన్నది కేవలం 1,500 మంది. అందులోనూ సగం మంది రిటైర్ అయిన వారే ఉన్నట్లు అంచనా. ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు ఎంటెక్ పూర్తి చేసి, బోధనలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. కానీ చాలా కాలేజీల్లో బీటెక్ అర్హత గలవారే పాఠాలు బోధిస్తున్నారు. నిబంధన ప్రకారం ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 1:2:6 నిష్పత్తిలో ఉండాలి. ఈ లెక్కల రాష్ట్రంలో 33,706 మంది బోధనా సిబ్బంది అవసరం. అందులో 22,470 మంది ఎంటెక్ అర్హత కలిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 11,236 మంది డాక్టరేట్ అర్హత కలిగిన అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు కావాలి. కానీ డాక్టరేట్ అర్హత కలిగినవారు 1500 మాత్రమే ఉన్నారు. మరోవైపు రాష్ట్రంలోని 171 ఎంటెక్ కాలేజీల్లో 22,470 మంది అధ్యాపకులు అవసరం ఉన్నా 15,152 మందితోనే నడుస్తున్నాయి. తప్పుడు లెక్కలతో మాయాజాలం కొన్ని కాలేజీల యాజమాన్యాలు అధ్యాపకుల తప్పుడు లెక్కలతో విద్యార్థులు, ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాయి. ఒక కాలేజీలో బోధించే వారినే మరో కాలేజీలో బోధిస్తున్నట్లు లెక్కలు చూపాయి. దీన్ని గ్రహించిన జేఎన్టీయూహెచ్ ఇటీవల 903 మంది అధ్యాపకులను బ్లాక్లిస్టులో పెట్టింది. వారిపై చట్టపరంగా చర్యలు చేపడతామని స్పష్టం చేసింది. నకిలీ పీహెచ్డీ సర్టిఫికెట్లతో అధ్యాపకులుగా కొనసాగుతున్న ఏడుగురిని కూడా బ్లాక్లిస్టులో పెట్టింది. ఇలా తప్పుడు లెక్కలతో పేపర్పైనే అర్హులైన అధ్యాపకులు ఉన్నట్లు చూపడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదు. ఈ విషయాన్ని ప్రభుత్వమే కాదు ప్రైవేటు సర్వేలు కూడా స్పష్టం చేస్తున్నాయి. ‘యాస్పైరింగ్ మైండ్స్’ సంస్థ చేసిన సర్వే ప్రకారం రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో చదివిన వేల మంది విద్యార్థులకు కనీసం ఇంగ్లిషు మాట్లాడే నైపుణ్యం లేదని తేలింది. నాణ్యత ప్రమాణాలపైనే సర్కారు దృష్టి.. రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యలో ప్రభుత్వం నాణ్యత ప్రమాణాలకు పెద్దపీట వేస్తోంది. మౌలిక సదుపాయాలతోపాటు అధ్యాపకుల విషయంలో కచ్చితంగా వ్యవహరిస్తోంది. పక్కాగా అన్ని రకాల సదుపాయాలు ఉన్న కాలేజీలకే అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు జేఎన్టీయూహెచ్ చర్యలు తీసుకుంటోంది. దీంతో 2016-17 విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్ సీట్ల సంఖ్య మొత్తంగా 40 వేల వరకు తగ్గిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోని 58 కాలేజీల్లో దాదాపు 10 వేల సీట్లు తగ్గిపోనున్నాయి. మరోవైపు 46 ఎంటెక్, బీటెక్ కాలేజీల విజ్ఞప్తి మేరకు ఆ కాలేజీల్లోని పలు కోర్సులకు ఏఐసీటీఈ ఈసారి గుర్తింపును రద్దు చేసింది. వాటిల్లో 10 వేల వరకు సీట్లకు కోత పడే అవకాశం ఉంది. మరో 7 కాలేజీలు మూసివేతకు దరఖాస్తు చేయగా ఏఐసీటీఈ ఓకే చెప్పింది. వాటిల్లో 5 వేలకు పైగా సీట్లు తగ్గిపోనున్నాయి. ఇక గతేడాది అందుబాటులో ఉంచిన 1,26 లక్షల సీట్లలో కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటాలో భర్తీ అయినవి కేవలం 75 వేలే! ఈ నేపథ్యంలో ఈసారి అనుబంధ గుర్తింపు ప్రక్రియను పకడ్బందీగా చేస్తుండడంతో మరో 15 వేల సీట్లకు కోత పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
జనగామ : ఉరివేసుకుని ఓ బీటెక్ ఫైనలి యర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలోని 20వ వార్డు పరిధిలోని పోలీస్టేషన్ ఎదురుగా మంగళవారం రాత్రి జరిగింది. తల్లి కృపానందిని కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన బైరు అర్జున్, కృపానందినికి కూతురు బాలనందిని(22), కుమారుడు మహేష్ ఉన్నారు. తండ్రి అర్జు న్ ఆరేళ్ల క్రితం మృతిచెందడంతో కుటుంబ భారం తల్లిపై పడింది. బాలనందిని హైదరాబాద్లోని విజయవాడ హైవేలోగల పోచంపల్లి శివారు దేశ్ముఖ్ గ్రామంలోని సెయింట్ మెరీస్ ఇం జనీరింగ్ కళాశాలలో ఈసీఈ ఫైనలియర్ చదువుతుండగా, కుమారుడు మహేష్ పాలీటెక్నిక్ చదువుతున్నాడు. శ్రీరామనవ మి పండుగ కోసం బాలనందిని 15 రోజుల క్రితం ఇంటికి వచ్చింది. 20వ తేదీ కళాశాలకు వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో ఆమె ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకుంది. తల్లి పని ముగించుకుని ఇంటికి రాగా కూతురు ఎంతకూ తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చి చుట్టుపక్కల వారిని పిలిచింది. స్థానికులు వచ్చి కిటికీ లోంచి చూసేసరికి ఫ్యాన్కు వేలాడుతూ కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై సంతోషం రవీందర్ అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్య చేసుకునే కష్టాలు నందినికి లేవని స్థానికులు చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. కళాశాలలో ఎవరైనా బెదిరించా రా.. లేక మరేదైనా కారణం ఉందా అనే అనుమానాలను స్థానికు లు వ్యక్తం చేశారు. మృతురాలి తల్లి కృపానందిని నుంచి ఎస్సై వాంగ్మూలం తీసుకున్నారు. -
బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
జనగామ (వరంగల్): ఏమైందో ఏమో గాని బీటెక్ ఫైనలియర్ చదువుతున్న ఓ విద్యార్ఙిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన వరంగల్ జిల్లాలోని జనగామలో మంగళవారం రాత్రి జరిగింది. పోచంపల్లిలోని దేశ్ ముఖ్ విలేజ్ సెయింట్ మెరీస్ ఇంజనీరింగ్ కళశాలలో బాలనందిని ఈసీఈ ఫైనల్ ఇయర్ చదువుతోంది. శ్రీరామనవమి పండగ జరుపుకోవడానికి కొన్నిరోజుల కిందట ఇంటికి వచ్చింది. అయితే 20వ తేదీన కళాశాలకు తిరిగి వెళ్లనుంది. ఈ క్రమంలో ఏం జరిగిందో తెలియదు, మంగళవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
దేవుడు పిలిచాడా..?
-
నాణ్యత పెంపునకు కార్యక్రమాలు
సాంకేతిక విద్య ముఖ్యంగా బీటెక్లో నైపుణ్యాలను పెంచే ఉద్దేశంతో ఏఐసీటీఈ దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కళాశాలల్లో క్రమేణా సీట్లు తగ్గించే యోచనలో ఉందనే అభిప్రాయం వెల్లడవుతోంది. ఏఐసీటీఈ యోచిస్తున్న నిర్ణయం దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఇంజనీరింగ్ కళాశాలలు అధికంగా ఉన్న దక్షిణాది రాష్ట్రాలపై ప్రభావం చూపనున్న నేపథ్యంలో వీటి పర్యవసానాలపై ఏఐసీటీఈ చైర్మన్ ప్రొఫెసర్ అనిల్ డి.సహస్రబుద్ధేతో ఇంటర్వ్యూ.. గెస్ట్ కాలమ్ వాస్తవానికి దేశవ్యాప్తంగా పలు కళాశాలల యాజమాన్యాలే స్వయంగా సీట్లు, ప్రోగ్రామ్ల తగ్గింపునకు దరఖాస్తులు చేసుకుంటున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో దేశంలో 556 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేతకు అనుమతి పొందాయి. మరో 1422 ఇన్స్టిట్యూట్లు, డిపార్ట్మెంట్ల మూసివేత దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. మౌలిక సదుపాయాలు, నాణ్యత ప్రమాణాలు పాటించడంలో వాటికి ఎదురవుతున్న ఇబ్బందులు దీనికి కారణం అని చెప్పొచ్చు. నాణ్యత పెరగటం ఖాయం కళాశాలలు లేదా ప్రోగ్రామ్ల తగ్గింపు ద్వారా విద్యార్థుల సంఖ్య తక్కువవడంతో ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత పెరుగుతుంది. అందుబాటులో ఉన్న ఫ్యాకల్టీ, వనరులు ఆ మేరకు అవసరాలకు సరితూగేలా ఉంటాయి. అయితే సీట్లు, కళాశాలల తగ్గింపు వల్ల కొంత ప్రతికూల ప్రభావం కూడా ఉంది. ముఖ్యంగా మూసివేసిన కళాశాలల్లోని విద్యార్థులను, ఫ్యాకల్టీని ఇతర కళాశాలల్లో ఏకీకృతం చేయడం వల్ల అప్పటికే మంచి పనితీరు ప్రదర్శిస్తున్న కళాశాలల పనితీరు కొంత ప్రభావానికి లోనవుతుంది. పథకాలు సిద్ధం సాంకేతిక విద్యలో ముఖ్యంగా బీటెక్ స్థాయిలో నాణ్యత, నైపుణ్యాల పెంపు విషయంలో ఏఐసీటీఈ పలు కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఎఐఊ (ఎౌఛ్చ ఐజ్టీజ్చ్టీజీఠ్ఛి జౌట అఛ్చిఛ్ఛీఝజీఛి ూ్ఛ్టఠీౌటజు) కార్యక్రమం ద్వారా స్వల్పకాలిక పద్ధతిలో విదేశీ ఫ్యాకల్టీ భారత్లో బోధించేందుకు తీసుకువచ్చే ఏర్పాట్లు చేశాం. దీనివల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య లభించటంతోపాటు అంతర్జాతీయ పరిస్థితులపై అవగాహన ఏర్పడుతుంది. యూజీ స్థాయిలో అత్యుత్తమ పనితీరు కనబర్చి, ఎంటెక్లో చేరే విద్యార్థులకు స్కాలర్షిప్తోపాటు బోధన రంగంలో కెరీర్ కోరుకునే వారికి అత్యంత ఆకర్షణీయమైన పథకాన్ని రూపొందించాం. ఉన్నత భారత్ అభియాన్.. విద్యార్థులు పొందిన సాంకేతిక నైపుణ్యాలను తమ పరిసర ప్రాంతాల అభివృద్ధికి ఉపయోగించే విధంగా వారిని తీర్చిదిద్దుతుంది. ఫలితంగా విద్యార్థులకు నైపుణ్యాలతోపాటు సమాజ అభివృద్ధిలో పాల్పంచుకునే అవకాశం లభిస్తుంది. మార్గదర్శన్ పథకం నాణ్యత, నైపుణ్యాల పెంపు విషయంలో ఏఐసీటీఈ చేపడుతున్న మరో పథకం.. మార్గదర్శన్. ఒక ప్రాంతంలో అకడమిక్, మౌలిక సదుపాయాలు వంటి వాటిలో అత్యుత్తమంగా ఉన్న కళాశాలను ఎంపిక చేసి ఇతర కాలేజీలకు మెంటార్గా వ్యవహరించేలా చర్యలు తీసుకుంటాం. ‘ఉత్తమ కళాశాల’గా ఎంపిక చేసిన కాలేజీకు ఏఐసీటీఈ నిధులు కూడా మంజూరు చేస్తుంది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఇంజనీరింగ్ కళాశాలలు వచ్చిన నేపథ్యంలో ఈ పథకం స్థానికంగానే అనేక సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ప్రమాణాలే కీలకం దేశంలో ఇప్పుడు దాదాపు మూడున్నర వేల ఇంజనీరింగ్ కళాశాలలున్నాయి. వాటికి తగిన విధంగా సదుపాయాలు లేని మాట వాస్తవం. దేశంలోని అన్ని వర్గాలకు సాంకేతిక విద్యను అందించాలని పలు కమిటీలు చేసిన సిఫార్సులే ఈ స్థాయిలో కళాశాలలు ఏర్పడటానికి కారణం. ప్రారంభంలో తనిఖీల సమయంలో ఏఐసీటీఈ నిబంధనలు, ప్రమాణాలకు సరితూగేలా వహరించినప్పటికీ.. క్రమంగా ఆయా కళాశాలలు ప్రమాణాలను కొనసాగించలేకపోతున్నాయి. ఎన్బీఏ అనుమతి తప్పనిసరి ఒకవైపు మెజారిటీ సంఖ్యలో సీట్లు, కోర్సులు తగ్గించాలని దరఖాస్తులు వస్తుంటే మరోవైపు సీట్లు పెంచాలని కూడా దరఖాస్తులు వస్తున్నాయి. అయితే ఈ విషయంలో నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్(ఎన్బీఏ) అనుమతి తప్పనిసరి. ఎన్బీఏ అమలు చేస్తున్న కఠిన నిబంధనల ఫలితంగా అత్యుత్తమ పనితీరు కనబర్చిన కళాశాలలకు మాత్రమే సీట్లు, ప్రోగ్రామ్ల పెంపునకు అనుమతి లభిస్తుంది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా.. దేశ వ్యాప్తంగా, అదే విధంగా అధిక సంఖ్యలో ఇంజనీరింగ్ కళాశాలలున్న తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంజనీరింగ్ విద్యలో ప్రమాణాలను ఒకట్రెండేళ్లలో గాడిలో పెట్టేందుకు కృషి చేస్తాం. ఏఐసీటీఈ నిబంధనలను కచ్చితంగా పాటించే విధంగా నిరంతర పర్యవేక్షణ కార్యక్రమాలు చేపట్టి వీలైనంత త్వరలో దేశంలో మళ్లీ ఇంజనీరింగ్ విద్యను పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా రూపొందిస్తాం. -
బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు లెక్చరర్లా!
ప్రైవేటు కాలేజీల తీరుపై హైకోర్టు విస్మయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో తాజాగా బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులే లెక్చరర్లుగా పాఠాలు బోధిస్తున్నట్లు తెలుసుకున్న హైకోర్టు తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది, ఇలా విద్యా ప్రమాణాల విషయంలో రాజీ పడితే విద్యార్థుల పరిస్థితి ఏమిటని కాలేజీలను ప్రశ్నించింది. తగిన బోధనా సిబ్బందిని, కనీస మౌలిక సదుపాయాలను కల్పించడం చేతకానప్పుడు కాలేజీలను ఎందుకు ఏర్పాటు చేశారంటూ నిలదీసింది. మౌలిక సదుపాయాలు కల్పించకపోతే కాలేజీల నిర్వహణకు అనుమతినిచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. తగిన అర్హతలు కలిగిన బోధనా సిబ్బంది, ల్యాబ్లలో సౌకర్యాలు లేని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ల్యాబ్లలో సౌకర్యాలను ఆరు వారాల్లో సమకూర్చుకోవాలని, అర్హులైన బోధనా సిబ్బందిని మూడు నెలల్లో నియమించుకోవాలని ఆదేశించింది, ఈ విషయాలు తనిఖీ చేసేందుకు జేఎన్టీయూహెచ్ ఏర్పాటు చేసే కమిటీలో హైకోర్టు సహాయ రిజిస్ట్రార్ సభ్యునిగా ఉంటారని హైకోర్టు తెలిపింది. ఈ కమిటీ ఆయా కాలేజీల్లో తనిఖీలు చేసి నివేదిక సమర్పించాలంది. ఏఐసీటీఈ అనుమతి ఉండి, జేఎన్టీయూ అఫిలియేషన్ లేని కాలేజీలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయన్న ధర్మాసనం, ల్యాబ్లలో సౌకర్యాలు, బోధనా సిబ్బందిని ఏర్పాటు చేసుకుంటామని ఈ కాలేజీలు రాతపూర్వక హామీ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆరు నెలలకు వాయిదా వేసింది. ఏఐసీటీఈ అప్రూవల్ ఉండి, జేఎన్టీయూహెచ్ అఫిలియేషన్ లేని కాలేజీలకు తాత్కాలిక అఫిలియేషన్లు ఇవ్వాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ జేఎన్టీయూహెచ్, ధర్మాసనం ముందు అప్పీలు దాఖలు చేసింది. ఈ అప్పీలుపై ధర్మాసనం సుదీర్ఘ విచారణ నిర్వహించింది. -
సెలవొస్తే పొలం.. చదువుల్లో సృజనం
అరచేయంత సెల్ఫోన్ అతని దగ్గర లేకపోవచ్చు.. ఆకాన్నంటే ఆలోచనలు.. అవధుల్లేని ఆత్మవిశ్వాసం ఉంది. లక్షలు విలువచేసే బైక్ అందనిదే కావచ్చు.. లక్ష్యం చేరుకోవాలనే సంకల్పం సొంతం.. అందుకు సృజన తోడయింది. ఇంకేముంది.. కొత్త ఆలోచనలు తలుపుతట్టాయి. నూతన ఆవిష్కరణలు వెలుగుచూశాయి. బీటెక్ చదివి.. మరోవైపు పొలం పనులకు వెళుతూనే మూడు నవ్య ఆవిష్క రణలకు శ్రీకారం చుట్టిన ఈ తిరుమల వాసు నేటి యువతరానికి స్ఫూర్తి.. - పొలం పనులకు వెళుతూనే బీటెక్లో రెండు డిగ్రీలు - నవ్య ఆవిష్కరణలకు శ్రీకారం - అంతర్జాతీయ జర్నల్స్లో ప్రచురితం - పేటెంటుకు దర ఖాస్తు సన్నాహాల్లో యువపరిశోధకుడు తెనాలి : ఆ యువపరిశోధకుడి పేరు తిరుమలవాసు. ఊరు చేబ్రోలు మండలం సుద్దపల్లి. వ్యవసాయదారులైన ఆరాధ్యుల వెంకటేశ్వర్లు, ఆదిలక్ష్మి కొడుకు. ఇద్దరు చెల్లెళ్లున్నారు. టెన్త్, ఇంటర్లో అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణుడై విజ్ఞాన్ యూనివర్సిటీలో బీటెక్ చేరారు. సుద్దపల్లి నుంచి రైల్వే ట్రాకు వెంట, క్వారీగోతుల్లో రోజూ 3 కి.మీ నడిచి యూనివర్సిటీకి వెళ్లివస్తుండేవారు. మెకానికల్, ఈసీఈలో రెండు డిగ్రీలు గత నెలలో పూర్తిచేశారు. తన మేధస్సుతో మూడు నవకల్పనలను కనుగొన్నారు. ఆ పరిశోధనాంశాలు అంతర్జాతీయ జర్నల్స్లో ప్రచురితమయ్యాయి. మన చదువుల్లో బ్లాక్బోర్డు, చాక్పీస్ స్థానం చెక్కుచెదరలేదు. ఫ్యాకల్టీలు పాఠ్యాంశాలను చాక్పీస్తో బోర్డుపై రాసి, డస్టర్తో తుడిచేస్తుంటారు. చుట్టుపక్కలకు వెద్దజల్లే చాక్పీస్ రేణువులు ఆరోగ్యసమస్యలను తెస్తాయని ఆలోచించం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, కాల్షియం కార్బొనేట్తో మిశ్రమ చాక్పీస్ల రేణువులు గాలిద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరి శ్వాసకోశ సమస్యలను తెస్తాయి. దీనిని గుర్తించిన వాసు, ‘కాంటెంపరరీ డస్టర్’ను రూపొందించారు. ఈ సరికొత్త డస్టర్తో చాక్పీస్ రేణువులు రోలింగ్ మెకానిజమ్తో ఇందులోని చాంబర్లోకి వెళతాయి. తర్వాత క్యాప్ తీసి బయట పారబోసే వెసులుబాటుంది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ మెటీరియల్ సైన్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్’లో గత ఏప్రిల్లో దీనిని ప్రచురించారు. పరిశ్రమల్లో వినియోగించే సంప్రదాయ కంబూష్టన్ ఇంజిన్స్కు ప్రత్యామ్నాయంగా మాగ్నెటిక్ ఫ్లక్స్ బేస్డ్ మెకానికల్ పవర్ జనరేటర్, తిరుమలవాసు మరో ఆవిష్కరణ. మధ్యలో పర్మనెంట్ మాగ్నెట్. చుట్టూ ఎనిమిది ఫిస్టన్స్తో తిరిగే క్రాంక్ సాఫ్ట్స్తో రూపొందించిన మాగ్నెటిక్ జనరేటర్ అత్యధిక శక్తినిస్తుంది. ఇంధనం, నిర్వహణ వ్యయం, కాలుష్యం బాగా తగ్గుతుందని చెప్పారు. ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ మెకానికల్’ ఈ పరిశోధనను ప్రచురించింది. వీటిపై తాను పేటెంటుకు దరఖాస్తు చేస్తున్నట్టు చెప్పారు. వ్యర్ధమైన కొబ్బరి చిప్పల పొడి, హైడెన్సిటి పాలిథిలిన్, కాపర్ నానో పార్టికిల్స్ కలిపి శక్తివంతమైన ‘కాంపోజిట్’లు చేశారు. ఎలక్ట్రికల్, ఆటోమొబైల్లో ఇంటీరియర్ పార్టులకు, కంప్యూటర్ మదర్బోర్డులకు వీటిని వాడొచ్చు. దీనిని ‘జర్నల్ ఆఫ్ మెటీరియల్ సైన్స్’లో ప్రచురించారు. పూణే, చెన్నై, బాపట్లలో జరిగిన అంతర్జాతీయ సదస్సుల్లో పత్ర సమర్పణ చేసిన వాసు, పూణేలో బంగారు పతకాన్ని గెల్చుకున్నారు. సెలవు రోజుల్లో పొలం పనులకు వెళుతుండే తిరుమలవాసు ఎంఎస్, పీహెచ్డీ చేసి పర్యావరణ అనుకూల పరిశోధనలు చేయాలనే కోరికను వెల్లడించారు. మధ్యతరగతికి చెందిన తనకు ‘విజ్ఞాన్’ యాజమాన్యం ప్రోత్సాహం, వైస్ఛాన్సలర్ తంగరాజన్, ప్రిన్సిపల్ మధుసూదనరావు, ఫ్యాకల్టీలు చావలి మూర్తియాదవ్, ఎం.రామకృష్ణ, టి.అనూప్కుమార్, బి.నాగేశ్వరరావు, రామ్ణారాయణ్ చౌహాన్ల సహకారం ఉందన్నారు. -
ఇద్దరు బీటెక్ విద్యార్థుల దుర్మరణం
కుత్బుల్లాపూర్ : కారును ఓవర్టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న కళాశాల బస్సును బైక్ ఢీకొని ఇద్దరు విద్యార్థులు మృత్యువాతపడ్డారు. పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ దుర్ఘటన జరిగింది. స్థానికులు, ఎస్సై వెంకటేష్ కథనం ప్రకారం.. మెదక్ జిల్లా జిన్నారం మండలం చెట్లపోతారం గ్రామానికి చెందిన శ్రీనివాస్ చిన్న కుమారుడు మద్దులపటేల్ శ్రీధర్(22) కండ్లకోయలోని సీఎంఆర్ కాలేజీలో బీటెక్ తృతీయ సంవత్సరం, షాపూర్నగర్కు చెందిన రఘుపతి పెద్ద కుమారుడు దూపనపల్లి నవీన్(21) బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. స్నేహితులైన వీరిద్దరూ శనివారం సాయంత్రం కళాశాల నుంచి బైక్పై బహదూర్పల్లి వైపు వస్తూ మైసమ్మగూడ మూలమలుపు వద్ద ముందుగా వెళ్తున్న కారును ఓవర్టేక్ చేశారు. ఇదే క్రమంలో ఎదురుగా వచ్చిన ఎంఎల్ఆర్ ఐటీ కళాశాల బస్సును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో శ్రీధర్, నవీన్ తలలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని సూరారంలోని నారాయణ హృదయాలయకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. కుటుంబ సభ్యులు గుండెలు బాదుకుంటూ రోదించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బీటెక్ విద్యార్థుల 43 సెల్ఫోన్లు చోరీ
కీసర: మండల కేంద్రంలోని అశ్విత ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులకు చెందిన 43 సెల్ఫోన్లు శుక్రవారం చోరీ అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని గీతాంజలి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులతో పాటు భోగారం గ్రామంలోని హోళీమేరీ ఇంజినీరింగ్ క ళాశాలకు చెందిన విద్యార్థులకు రెగ్యులర్ పరీక్షలు రాసేందుకు కీసరలోని అశ్విత ఇంజినీరింగ్ కళాశాలలో సెంటర్ పడింది. దీంతో శుక్రవారం రెండు కళాశాలలకు చెందిన విద్యార్థులు పరీక్ష రాసేందుకు అశ్విత కాలేజీకి వచ్చారు. 43 మంది విద్యార్థులు తమ సెల్ఫోన్లను రెండు స్కూటీల డిక్కీలో పెట్టి పరీక్షలు రా సేందుకు వెళ్లారు. విద్యార్థులు తిరిగి వచ్చేసరికి 43 సెల్ఫోన్లు చోరీ అయ్యాయి. దీంతో వారు కీసర పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
12 నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్
ఈ నెల 20 వరకు సర్టిఫికెట్ల పరిశీలన జిల్లాలో నాలుగు హెల్ప్లైన్ కేంద్రాల ఏర్పాటు అవసరమైన ధ్రువపత్రాలను సిద్ధం చేసుకోవాలి {పాసెసింగ్ ఫీజును పెంచిన ప్రభుత్వం గుంటూరు ఎడ్యుకేషన్ : ఎంసెట్ ఆధారిత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ఈనెల 12న ప్రారంభం కానుంది. ఎంసెట్లో ర్యాంకులు పొంది రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో బీటెక్లో ప్రవేశానికి ఎదురుచూస్తున్న విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు అవసరమైన ధ్రువపత్రాలను సిద్ధం చేసు కోవాలి. గుంటూరు నగరం గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల, నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ కేంద్రాల్లో ఈనెల 20వ తేదీ వరకు ర్యాంకుల వారీగా విద్యార్థుల సర్టిఫికెట్లు పరిశీలిస్తారు. పరిశీలన పూర్తయిన విద్యార్థులకు కళాశాలల ఎంపిక కోసం ఈనెల 14 నుంచి 21వ తేదీ వరకు ఆప్షన్లు ఇచ్చుకునేందుకు వెబ్ కౌన్సెలింగ్ జరగనుంది. సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో చెల్లించాల్సిన ప్రాసెసింగ్ ఫీజును ప్రభుత్వం పెంపుదల చేసింది. గతంలో ఓసీ, బీసీ విద్యార్థుల నుంచి వసూలు చేసిన రూ. 600 మొత్తాన్ని రూ. 900కు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. 300 నుంచి రూ. 450కు పెంచింది. ఎస్టీ విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు గుజ్జనగుండ్లలోని పాలిటెక్నిక్ కళాశాలలో హాజరుకావాలి. ఇతర వివరాలకు జ్ట్టిఞట://్చఞ్ఛ్చఝఛ్ఛ్టి.జీఛి.జీ సందర్శించాలి. సర్టిఫికెట్ల పరిశీలనకు వెంట తీసుకెళ్లాల్సిన ధ్రువపత్రాలు.. ఎంసెట్ ర్యాంకు కార్డు, హాల్ టికెట్, 10వ తరగతి, ఇంటర్మీడియెట్ మార్కుల జాబితా, 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, నివాస, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాల్సి ఉంది. ఆయా ధ్రువపత్రాల ఒరిజినల్స్తో పాటు రెండు జిరాాక్స్ కాపీ సెట్లను తీసు కెళ్లాలి. పరిశీలన అనంతరం జిరాక్స్ సర్టిఫికెట్లను సమర్పించాలి. అంగ వైకల్యం, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్, గేమ్స్, ఆంగ్లో ఇండియన్ విభాగాలకు చెందిన విద్యార్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ఈనెల 12 నుంచి 16వ తేదీ వరకు విజయ వాడ బెంజి సర్కిల్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో హాజరవ్వాలి. ర్యాంకులవారీగా సర్టిఫికెట్ల పరిశీలన జరిగే తేదీలు .... - గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో... ఈనెల 12న ఒకటో ర్యాంకు నుంచి 3,700 ర్యాంకు వరకు,13న 15,001 ర్యాంకు నుంచి 18,800 వరకు,14న 30,001 నుంచి 33,700 వరకు, 15న 45,001 ర్యాంకు నుంచి 48,800 వరకు,16న 60,001 ర్యాంకు నుంచి 63,700 వరకు,17న 75,001 ర్యాంకు నుంచి 78,800 వరకు,18న 90,001 ర్యాంకు నుంచి 93,700 వరకు, 19న 1,05,001 నుంచి 1,08,800 వరకు, 20న 1,20,001 ర్యాంకు నుంచి 1,22,500 వరకు హాజరుకావాలి. నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో... ఈనెల 12న 3,701 ర్యాంకు నుంచి 7,500 ర్యాంకు వరకు,13న 18,801 ర్యాంకు నుంచి 22,500 వరకు,14న 33,701 నుంచి 37,500 వరకు, 15న 48,801 ర్యాంకు నుంచి 52,500 వరకు, 16న 63,701 ర్యాంకు నుంచి 67,500 వరకు, 17న 78,801 ర్యాంకు నుంచి 82,500 వరకు, 18న 93,701 ర్యాంకు నుంచి 97,500 వరకు,19న 1,08,801 నుంచి 1,12,500 వరకు, 20న 1,22,501 ర్యాంకు నుంచి 1,25,000 వరకు హాజరుకావాలి. సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో... ఈనెల 12న 7,501 ర్యాంకు నుంచి 11,200 ర్యాంకు వరకు,13న 22,501 ర్యాంకు నుంచి 26,300 వరకు,14న 37,501 నుంచి 41,200 వరకు,15న 52,501 ర్యాంకు నుంచి 56,300 వరకు,16న 67,501 ర్యాంకు నుంచి 71,200 వరకు,17న 82,501 ర్యాంకు నుంచి 86,300 వరకు,18న 97,501 ర్యాంకు నుంచి 1,01,200 వరకు,19న 1,12,501 నుంచి 1,16,300 వరకు, 20న 1,25,001 ర్యాంకు నుంచి 1,27,500 వరకు హాజరుకావాలి. ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలో... ఈనెల 12న 11,201 ర్యాంకు నుంచి 15,000 ర్యాంకు వరకు,13న 26,301 ర్యాంకు నుంచి 30,000 వరకు,14న 41,201 నుంచి 45,000 వరకు,15న 56,301 ర్యాంకు నుంచి 60,000 వరకు,16న 71,201 ర్యాంకు నుంచి 75,000 వరకు,17న 86,301 ర్యాంకు నుంచి 90,000 వరకు,18న 1,01,201 ర్యాంకు నుంచి 1,05,000 వరకు,19న 1,16,301 నుంచి 1,20,000 వరకు, 20న 1,27,501 నుంచి ఆపై చివరి ర్యాంకు వరకు హాజరుకావాలి. -
కొలువులకు కేరాఫ్.. ఈ కోర్సులు!
ఐఐఎస్టీ - బీటెక్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) నెలకొల్పిన సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ. డీమ్డ్ యూనివర్సిటీ హోదా పొందిన ఈ ఇన్స్టిట్యూట్ బీటెక్ స్థాయిలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఏవియానిక్స్, ఫిజికల్ సెన్సైస్ బ్రాంచ్లను అందిస్తోంది. వీటితోపాటు బీటెక్+ఎంటెక్/ఎస్ పేరుతో డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ కూడా ఆఫర్ చేస్తోంది. ♦ అర్హత : ఇంటర్మీడియెట్ ఎంపీసీలో గ్రూప్ సబ్జెక్ట్లలో 70 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ♦ ప్రవేశం : జేఈఈ అడ్వాన్స్డ్లో మెరిట్ ఆధారంగా నిర్వహించే కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశం కల్పిస్తారు. ♦ దరఖాస్తు విధానం: అభ్యర్థులు www.iist.ac.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ♦ 2015-16 విద్యా సంవత్సరానికి ఈ ఆన్లైన్ అప్లికేషన్ విండో జూన్లో అందుబాటులోకి వస్తుంది. ♦ వివరాలకు వెబ్సైట్: www.iist.ac.in కోర్సు పూర్తి చేస్తే కొలువు ఖాయం: ఐఐఎస్టీ అందించే బీటెక్, బీటెక్ డ్యూయల్ డిగ్రీ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ఇస్రో లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్లోని పలు విభాగాల్లో ఎంట్రీ లెవల్లో సైంటిస్ట్/ఇంజనీర్-ఎస్సీ హోదాలో ఉద్యోగం ఖాయం. అయితే విద్యార్థులు నాలుగేళ్ల కోర్సులో 7.5 సీజీపీఏ పొందడం తప్పనిసరి. యూపీఎస్సీ.. ఎస్సీఆర్ఏ కేంద్ర ప్రభుత్వ కొలువు, బీటెక్ డిగ్రీ రెండిటికీ మార్గం.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) నిర్వహించే స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీస్ ఎగ్జామినేషన్(ఎస్సీఆర్ఏ). ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు నిర్ణీత వ్యవధిలో శిక్షణ లభించడంతోపాటు బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) - మెస్రా నుంచి బీటెక్ డిగ్రీ కూడా చేతికందుతుంది. కోర్సు నాలుగేళ్ల కాలంలో నెలకు 9వేలకు పైగా స్టైఫండ్ కూడా లభిస్తుంది. అంతేకాకుండా కోర్సును విజయవంతంగా పూర్తిచేసుకున్న వారికి భారతీయ రైల్వేలో ఇంజనీరింగ్ విభాగంలో కొలువు ఖాయమవుతుంది. ఇలా కొలువు సొంతం చేసుకున్న విద్యార్థులకు ఇండియన్ రైల్వేస్లో ఏడాదిన్నర వ్యవధిలో ప్రొబేషనరీ ట్రైనింగ్ ఉంటుంది. ఈ సమయంలో నిబంధనలకు అనుగుణంగా జీతభత్యాలు ఉంటాయి. ప్రొబేషనరీ ట్రైనింగ్ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటే రైల్వేలో శాశ్వత ఉద్యోగం లభించినట్లే. ♦ ఎస్సీఆర్ఏ అర్హత: 50శాతం మార్కులతో ఇంటర్ ఎంపీసీ గ్రూప్లో అర్హత. ♦ ఎంపిక విధానం: యూపీఎస్సీ నిర్వహించే రెండు దశల ఎంపిక ప్రక్రియ (రాత పరీక్ష, ఇంటర్వ్యూ)లో ప్రతిభ ఆధారంగా. ♦ నోటిఫికేషన్: సాధారణంగా ప్రతి ఏటా నవంబర్/ డిసెంబర్ నెలల్లో ఎస్సీఆర్ఏ నోటిఫికేషన్ వెలువడుతుంది. ♦ వివరాలకు వెబ్సైట్: www.upc.nic.in ఐఐఎస్ఈఆర్.. బీఎస్-ఎంఎస్..సైన్స్ రంగంలో కెరీర్ సైన్స్ రంగంలో కెరీర్ ఖాయం చేసుకోవాలనుకునే విద్యార్థులకు సరైన వేదికలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ప్రాంగణాలు. కోర్ సెన్సైస్లో ఔత్సాహికులను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ఇన్స్టిట్యూట్లు దేశ వ్యాప్తంగా ఆరు (భోపాల్, కోల్కత, మొహాలీ, పుణె, తిరువనంతపురం, తిరుపతి)ఉన్నాయి. వీటిలో అందుబాటులో ఉన్న అయిదేళ్ల వ్యవధిలోని బీఎస్-ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ పూర్తి చేస్తే కేంద్ర ప్రభుత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్, అణు శక్తి విభాగాలు తదితర విభాగాల్లో కొలువులు సులువవుతాయి. ఇంటిగ్రేటెడ్ బీఎస్- ఎంఎస్ వివరాలు.. ఐదేళ్ల బీఎస్- ఎంఎస్ కోర్సులోకి వివిధ మార్గాల్లో ప్రవేశం కల్పిస్తారు. ఎంపిక విధానం: ♦ ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన కోర్సులో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు జేఈఈ అడ్వాన్స్డ్లో మెరిట్ ఆధారంగా. ♦ జేఈఈకు హాజరు కాని విద్యార్థులు ఐఐఎస్ఈఆర్ నిర్వహించే ఆప్టిట్యూడ్ టెస్ట్లో తమ ప్రతిభ చూపాల్సి ఉంటుంది. ♦ కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన ఎస్ఏ స్ట్రీమ్కు అర్హత పొందిన విద్యార్థులు. ♦ ఇన్సపైర్ ఫెలోషిప్ 2015కు అర్హత పొందిన విద్యార్థులు. ♦ దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ముఖ్య తేదీలు: ♦ కేవైపీవై లేదా జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకు ఆధారంగా దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 27, 2015 ♦ ఇంటర్మీడియెట్ మార్కుల ఆధారంగా ఆప్టిట్యూడ్ టెస్ట్ లో ఉత్తీర్ణత ద్వారా దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 4, 2015 ♦ ఐఐఎస్ఈఆర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ తేదీ: జూలై 12, 2015 ♦ వివరాలకు వెబ్సైట్: www.iiseradmission.in గణాంక నైపుణ్యాలు.. కొలువులకు ఐఎస్ఐ బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్.. ఉన్నత విద్య ఔత్సాహికులకు ముఖ్యంగా కామర్స్, స్టాటిస్టిక్స్ విద్యార్థులకు ఈ పేరు ఎంతో సుపరిచితం. గణాంక నిపుణులను తీర్చిదిద్దే ఉద్దేశంతో కోల్కతలో ఏర్పాటైన ఈ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా మరో నాలుగు క్యాంపస్ల(హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, తేజ్పూర్)కు విస్తరించింది. వీటిలో పలు బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్లో ఆనర్స్ డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కోర్సు సమయంలో విద్యార్థులకు స్కాలర్షిప్ లభిస్తుంది. అంతేకాకుండా కేంద్ర గణాంక శాఖ, ప్రణాళిక విభాగం, గ్రామీణాభివృద్ధి విభాగాల్లో ఇంటర్న్షిప్ చేసే అవకాశం కూడా ఉంటుంది. వీటితోపాటు పలు సర్వే ఏజెన్సీలు ఐఎస్ఐ విద్యార్థులకు తమ నియామకాల్లో పెద్దపీట వేస్తున్నాయి. ♦ అర్హత: మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్గా ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత ♦ ఎంపిక విధానం: ఇన్స్టిట్యూట్ నిర్వహించే రాత పరీక్షలో ర్యాంకు ఆధారంగా. ♦ వివరాలకు వెబ్సైట్: www.isi.cal.ac.in భాషలో కెరీర్కు ఇఫ్లూ కోర్సులు లాంగ్వేజెస్లో లాంగ్టర్మ్ కెరీర్ కోరుకునే విద్యార్థులకు చక్కటి మార్గం.. ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ(ఇఫ్లూ)- హైదరాబాద్ అందించే బ్యాచిలర్ డిగ్రీ కోర్సులే అనడంలో సందేహం లేదు. హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటైన ఈ సెంట్రల్ యూనివర్సిటీ ఇప్పుడు మరో రెండు క్యాంపస్లు (షిల్లాంగ్, లక్నో) ద్వారా బ్యాచిలర్ డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులను అందిస్తోంది. ఈ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు భారత్లోని విదేశీ రాయబార కార్యాలయాలు, టూరిజం సంస్థలు, పురావస్తు శాఖ, పర్యాటక శాఖల్లో కొలువులు ఖాయం. కోర్సుల వివరాలు: ఇంగ్లిష్, అరబిక్, ఫ్రెంచ్, జర్మన్, రష్యన్, స్పానిష్ భాషల్లో బీఏ ఆనర్స్ కోర్సు; బ్యాచిలర్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్. ♦ అర్హత: ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత ♦ ఎంపిక విధానం: ఇన్స్టిట్యూట్ నిర్వహించే రాత పరీక్ష, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా. ♦ వివరాలకు వెబ్సైట్: ఠీఠీఠీ.్ఛజఠజీఠ్ఛిటటజ్టీడ.్చఛి.జీ విదేశీ భాషల్లో విలువైన భవితకు జేఎన్యూ కోర్సులు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ.. పరిచయం అక్కర్లేని పేరు. ప్రపంచ వ్యాప్తంగా పేరు గడించిన యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ లాంగ్వేజ్, లిటరేచర్, కల్చర్ స్టడీస్ పరిధిలో బ్యాచిలర్ స్థాయిలో పది విదేశీ భాషల్లో(అరబిక్, చైనీస్, ఫ్రెంచ్, జర్మన్, జపనీస్, కొరియన్, పర్షియన్, పుస్తో, రష్యన్, స్పానిష్) బీఏ ఆనర్స్ డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ఇంగ్లిష్ భాష నిపుణులను తీర్చిదిద్దే ఉద్దేశంతో నెలకొల్పిన సెంటర్ ఫర్ ఇంగ్లిష్ స్టడీస్ పరిధిలో అందిస్తున్న బీఏ ఇంగ్లిష్ కోర్సుకు కూడా అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. ఈ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు కూడా రాయబార కార్యాలయాలు, ఫార్మసీ సంస్థలు, టూరిస్ట్ సంస్థలు, ఆర్కియలాజికల్ సర్వే విభాగాల్లో కొలువులు లభిస్తున్నాయి. ♦ జేఎన్యూ బీఏ(ఫారెన్ లాంగ్వేజెస్) అర్హత: ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత ♦ ఎంపిక విధానం: వర్సిటీ నిర్వహించే రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా ♦ దరఖాస్తు విధానం: ప్రవేశ పరీక్షకు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ♦ వివరాలకు వెబ్సైట్:www.jnu.ac.in న్యాయ నిపుణులుగా తీర్చిదిద్దే నల్సార్ కోర్సులు న్యాయ శాస్త్రంపై అభిరుచి, ఆ తర్వాత ఇదే రంగంలో స్థిరపడాలనుకునే ఔత్సాహికులకు సరైన వేదికలు కేంద్ర ప్రభుత్వం నెలకొల్పిన నేషనల్ లా యూనివర్సిటీలు. దేశ వ్యాప్తంగా పదహారు నేషనల్ లా ఇన్స్టిట్యూట్లు ఉండగా.. వీటిలో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అవి కూడా విభిన్నంగా ఉండటం విశేషం. ఇప్పటి వరకు ఎల్ఎల్బీ కోర్సు అంటే బీఏ ఎల్ఎల్బీ కోర్సే సుపరిచితం. అయితే ఈ నేషనల్ లా ఇన్స్టిట్యూట్లలోని కొన్నిటిలో బీఎస్సీ ఎల్ఎల్బీ, బీబీఏ ఎల్ఎల్బీ, బీఎస్డబ్ల్యు ఎల్ఎల్బీ, బీకాం ఎల్ఎల్బీ ఇలా విభిన్న కాంబిషేన్లతో కూడిన కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్ట్(క్లాట్)లో ప్రతిభ చూపాల్సి ఉంటుంది. ఈ కోర్సు లు పూర్తి చేసిన విద్యార్థులు న్యాయవాద వృత్తిలో స్థిరపడటమే కాకుండా.. పలు ఎంఎన్సీలు, బ్యాంకింగ్ సంస్థలు, కేపీఓలు, స్వచ్ఛంద సంస్థల్లో లీగల్ అడ్వైజర్లు, లీగల్ ఆఫీసర్లుగా కెరీర్ సొంతం చేసుకోవచ్చు. ♦ నేషనల్ లా ఇన్స్టిట్యూట్లలో ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బీ కోర్సుకు అర్హత : ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత. ♦ ఎంపిక విధానం: జాతీయ స్థాయిలో ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)లో ర్యాంకు ఆధారంగా. ♦ క్లాట్-2015 నోటిఫికేషన్ వెలువడింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ♦ ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 14, 2015. ♦ వివరాలకు వెబ్సైట్:www.clat.ac.in చార్టర్డ్ అకౌంటెన్సీ.. కెరీర్ గ్యారెంటీ కెరీర్ గ్యారెంటీగా నిలుస్తున్న మరో కోర్సు.. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెన్సీ నిర్వహించే సీఏ. మొత్తం మూడు దశలుగా (సీపీటీ, ఐపీసీసీ, ఫైనల్) ఉండే ఈ కోర్సులో చేరేందుకు పదో తరగతి నుంచే సన్నద్ధం కావాలి. పదో తరగతి ఉత్తీర్ణత ఆధారంగా కోర్సు తొలి దశ సీపీటీ (కామన్ ప్రొఫిషియన్సీ టెస్ట్)కు నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత ఇంటర్మీడియెట్ పూర్తి చేశాక సీపీటీ పరీక్షకు హాజరు కావాలి. ఈ సీపీటీ ప్రతి ఏటా రెండుసార్లు జూన్, డిసెంబర్లలో జరుగుతుంది. సీపీటీలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు వంద గంటల ఐటీటీ కోర్సును పూర్తి చేసుకుంటే.. సీఏ కోర్సు రెండో దశ ఐపీసీసీలో పేరు నమోదు చేసుకునేందుకు అర్హత లభిస్తుంది. రెండు గ్రూపుల్లో ఉండే ఐపీసీసీని పూర్తి చేసుకుని నిర్ణీత వ్యవధిలో ఆర్టికల్షిప్ పూర్తి చేస్తే సీఏ ఫైనల్ పరీక్షలు రాసేందుకు అర్హత లభిస్తుంది. దీంతో చార్టర్డ్ అకౌంటెన్సీ విభాగంలో కెరీర్ ప్రారంభానికి మార్గం ఏర్పడుతుంది. ప్రస్తుత అవసరాల నేపథ్యంలో కేవలం ప్రాక్టీసింగ్ సీఏగానే కాకుండా.. పలు బహుళ జాతి సంస్థలు, ప్రైవేటు రంగ సంస్థల్లో ఇంటర్నల్ ఆడిటర్, ఫైనాన్షియల్ ఆఫీసర్ వంటి హోదాలు సొంతం అవడం ఖాయం. వివరాలకు వెబ్సైట్: www.icai.org సీఎంఏ.. ఉత్పత్తి, వాణిజ్య రంగాల్లో ఉన్నత కెరీర్ ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉత్పత్తి, వాణిజ్య రంగాల్లో ఉజ్వల కెరీర్కు కేరాఫ్గా నిలుస్తున్న మరో ప్రొఫెషనల్ కోర్సు.. కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ(సీఎంఏ). ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించే ఈ కోర్సు మూడు దశలుగా ఉంటుంది. అవి.. ఫౌండేషన్, ఇంటర్మీడియెట్, ఫైనల్. ఫౌండేషన్ కోర్సుకు ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా సీఎంఏ- ఇంటర్మీడియెట్ కోర్సుకు సీఎంఏ ఫౌండేషన్ కోర్సు ఉత్తీర్ణత లేదా బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో అడుగుపెట్టొచ్చు. సీఎంఏ ఇంటర్మీడియెట్ కోర్సు పూర్తి చేసిన తర్వాత సీఎంఏ ఫైనల్ కోర్సుకు అర్హత లభిస్తుంది. ఇది కూడా పూర్తయితే ఉత్పత్తి రంగంలోని పరిశ్రమలు, కోల్ ఇండియా, నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్, బీహెచ్ఈఎల్, పవర్ గ్రిడ్ తదితర ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు ప్రైవేట్ రంగంలోని సంస్థల్లోనూ అకౌంట్స్ ఆఫీసర్, ఫైనాన్స్ ఆఫీసర్ వంటి హోదాలతో ఉద్యోగం సొంతమవుతుంది. సీఎంఏలోని మూడు దశల కోర్సులకు ఏడాది ఆసాంతం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ప్రతి ఏటా నాలుగుసార్లు జరిగే ఫౌండేషన్ పరీక్షలకు హాజరు కావాలంటే.. నమోదు చేసుకున్న తర్వాత నిర్ణీత వ్యవధి తప్పనిసరి. జూన్లో జరిగే పరీక్షకు జనవరి 31; సెప్టెంబర్లో నిర్వహించే పరీక్షకు ఏప్రిల్ 30; డిసెంబర్లో నిర్వహించే పరీక్షకు జూలై 31; మార్చిలో జరిగే పరీక్షకు అంతకుముందు సంవత్సరం అక్టోబర్ 31లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ప్రతి దశకు నిర్ణీత తేదీలను నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్సైట్ : www.icmai.in కార్పొరేట్ కెరీర్ ‘సీఎస్ కార్పొరేట్ కెరీర్ను సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తున్న కోర్సు.. కంపెనీ సెక్రటరీ(సీఎస్). నిర్వహణ నైపుణ్యాలు, పరిశీలనాత్మక దృక్పథం, విశ్లేషణ సామర్థ్యం, టీం స్కిల్స్ ఉన్న విద్యార్థులకు సరిపడే కోర్సు ఇది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా నిర్వహించే సీఎస్ మూడు దశలుగా (ఫౌండేషన్, ఎగ్జిక్యూటివ్, ఫైనల్) ఉంటుంది. ఫౌండేషన్ కోర్సులో పేరు నమోదుకు ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత అర్హత. ఎగ్జిక్యూటివ్ దశకు నమోదు చేసుకోవాలంటే.. ఫౌండేషన్ కోర్సులో ఉత్తీర్ణత లేదా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. కంపెనీ సెక్రటరీ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు బ్యాంకింగ్ రంగం, ఫైనాన్షియల్ కన్సల్టింగ్ సంస్థలు, స్టాక్ బ్రోకింగ్ సంస్థలతోపాటు ప్రైవేట్ సంస్థల్లో కార్పొరేట్ కార్యకలాపాల విభాగంలోనూ విస్తృత అవకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా సొంతంగా ప్రాక్టీస్ చేసుకునే అవకాశం కూడా ఉంది. వివరాలకు వెబ్సైట్ : www.icsi.edu బెస్ట్ జాబ్..బెటర్ ‘పే’..బ్రైట్ ఫ్యూచర్... విద్యార్థుల జీవిత లక్ష్యాలు.. ఇవే అనడం నిస్సందేహం. కళ్లముందు కోకొల్లలుగా కనిపిస్తున్న కోర్సులు.. అయితే, కొన్ని కోర్సులు మాత్రమే కొలువులకు కేరాఫ్గా నిలుస్తున్నాయి.. ఒక చేత్తో సర్టిఫికెట్.. మరో చేత్తో ఆఫర్ లెటర్ అందిస్తున్న కోర్సులివి.. జాబ్ మార్కెట్లో ఆ కోర్సులెంతో హాట్.. 10+2/ ఇంటర్ పరీక్షలు రాసి.. కెరీర్ అన్వేషణలో ఉన్న విద్యార్థుల కోసం.. కచ్చితమైన కొలువులకు కేరాఫ్గా నిలుస్తున్న కోర్సులపై ప్రత్యేక విశ్లేషణ.. నూతనత్వం దిశగా న్యాయ శాస్త్రం న్యాయ శాస్త్రంలో విద్యా బోధన, కోర్సులు ఇప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నూతనత్వాన్ని సంతరించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, పేటెంట్ లాస్ వంటి విభిన్న కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. అంతేకాకుండా కెరీర్ పరంగానూ కేవలం న్యాయవాద వృత్తికే పరిమితం అని భావించే పరిస్థితి పోయింది. కార్పొరేట్ సంస్థలు సైతం న్యాయశాస్త్ర పట్టభద్రులకు కొలువులు ఆఫర్ చేస్తున్నాయి. నల్సార్లో నిర్వహించే క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్ ఇందుకు నిదర్శనం. నేటి తరం విద్యార్థులు కాస్త విస్తృత దృష్టితో ఆలోచిస్తే ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. - ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి, రిజిస్ట్రార్, నల్సార్ యూనివర్సిటీ అభిప్రాయం మార్చుకుంటే అద్భుత అవకాశాలు ఇంజనీరింగ్ లేదా మెడికల్ కోర్సులు చేస్తేనే భవిష్యత్తు బాగుంటుందనే అభిప్రాయాన్ని విద్యార్థులు మార్చుకోవాలి. ఇప్పుడు లాంగ్వేజ్ కోర్సులకు సైతం ఎంతో డిమాండ్ ఉంది. ఇఫ్లూలోని పలు లాంగ్వేజ్ కోర్సులు పూర్తి చేయడం ద్వారా మంచి ఉద్యోగావకాశాలు పొందిన వారెందరో! వర్కింగ్ ఎగ్జిక్యూటివ్స్కు కూడా లాంగ్వేజ్ కోర్సులు పదోన్నతి దిశగా దోహదపడుతున్నాయి. అందుకే మేం అందిస్తున్న పార్ట్టైం కోర్సులకు పలువురు వర్కింగ్ ప్రొఫెషనల్స్ హాజరవుతున్నారు. ఇలా ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్డ్ రెండు కోణాల్లోనూ లాంగ్వేజ్ కోర్సులు ఇప్పుడు చక్కటి భవిష్యత్తుకు మార్గంగా నిలుస్తున్నాయి. - ప్రొఫెసర్ అలీ రజ్వా ముస్వి, రిజిస్ట్రార్, ఇఫ్లూ. ఇంజనీరింగ్లోనూ విభిన్నంగా నేటి తరం విద్యార్థులకు ఇంజనీరింగ్ కోర్సు క్రేజీ ఆప్షన్ అనేది నిస్సందేహం. అయితే ఈ కోర్సు బ్రాంచ్లు, ఇన్స్టిట్యూట్లను ఎంపిక చేసుకునే విషయంలో కొంత ముందస్తు కసరత్తు చేస్తే ఇతరుల కంటే ముందంజలో నిలవడానికి ఆస్కారం ఉంటుంది. వినూత్న బ్రాంచ్లపై ఆసక్తి చూపాలి. అవి కచ్చితంగా మంచి హోదాను అందిస్తాయి. అంతేకాకుండా కొత్త ఆవిష్కరణలకు ఊతమిచ్చే నైపుణ్యాలు అందిస్తాయి. - ప్రొఫెసర్ మువ్వా వెంకట రమణ, అసోసియేట్ ప్రొఫెసర్, ఐఐఎస్టీ -
ఐబీపీఎస్లో ప్రిలిమ్స్, మెయిన్స్
ఆకర్షణీయ వేతనాలు, ఆహ్లాదకర పనివాతావరణం, కెరీర్లో చకచకా ఎదిగేందుకు విస్తృత అవకాశాలు.. ఇవే నేటి యువతకు బ్యాంకులో కొలువుదీరడాన్ని లక్ష్యంగా నిర్దేశిస్తున్నాయి. బీఎస్సీ, బీఏ, బీకామ్, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ.. చేసిన కోర్సు ఏదైనా ఇప్పుడు చాలా మంది బ్యాంకు ఉద్యోగం లక్ష్యంగా కసరత్తు చేస్తున్నారు. ఇలాంటి వారికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) గేట్ వే వంటిది. ఇది నిర్వహించే పరీక్షల్లో విజయం సాధించడం ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకులో కొలువును ఖాయం చేసుకోవచ్చు. బ్యాంకు ఉద్యోగ నియామకాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఐబీపీఎస్ తాజాగా కొన్ని పరీక్షల విధానాన్ని మార్చింది. వీటిపై స్పెషల్ ఫోకస్.. ఎస్బీఐ, దాని అనుబంధ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి ఎస్బీఐ సొంతంగా నియామక ప్రక్రియ చేపడుతోంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్).. అలహాబాద్ బ్యాంకు, ఆంధ్రాబ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యునెటైడ్ బ్యాంకు ఆఫ్ ఇండియా తదితర ప్రభుత్వరంగ బ్యాంకుల్లో క్లరికల్ కేడర్, ప్రొబేషనరీ ఆఫీసర్, స్పెషలిస్టు ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తోంది. వీటి తర్వాత ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఇప్పుడు ఐబీపీఎస్ కొన్ని పరీక్షల విధానంలో మార్పులు చేసింది. వీటికి పాత విధానమే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు(ఆర్ఆర్బీ)ల్లో స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 ఆఫీసర్లు; ఆఫీస్ అసిస్టెంట్ నియామకాలకు కామన్ రిటెన్ ఎగ్జామినేషన్(సీడబ్ల్యూఈ)-4ను పాత విధానంలో నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఒకే పరీక్ష నిర్వహిస్తారు.ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఐటీ ఆఫీసర్, అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ వంటి స్పెషలిస్టు ఆఫీసర్ల నియామకాలకు కూడా పాత విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. నియామక ప్రక్రియలో ఒకే పరీక్ష ఉంటుంది. ప్రధాన మార్పులు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లరికల్ కేడర్, ప్రొబేషనరీ ఆఫీసర్/మేనేజ్మెంట్ ట్రెయినీ నియామకాలకు ఇప్పటి వరకు ఒకే పరీక్ష ఉండేది. ఇక నుంచి రెండు దశల్లో అంటే ప్రిలిమనరీ, మెయిన్ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రిలిమ్స్లో నిర్దేశ మార్కులు సాధించిన వారిని మెయిన్ రాసేందుకు అనుమతిస్తారు. ఇందులో విజయం సాధించిన వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. తుది జాబితా రూపకల్పనకు ప్రిలిమ్స్ మార్కులను పరిగణనలోకి తీసుకోరు. సీడబ్ల్యూఈ-5 నుంచి కొత్త విధానం అమల్లోకి వస్తుంది. మార్పులెందుకు? ప్రస్తుతం బ్యాంకు పరీక్షలకు ఏటా లక్షల మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. 2013-14లో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని క్లరికల్ పరీక్షలకు 14.24 లక్షల మంది, ఆఫీసర్ కేడర్ పరీక్షలకు 13.19 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఒకే పరీక్ష ఉండటం వల్ల అందులో ఉత్తీర్ణత సాధించిన వారందరికీ ఇంటర్వ్యూలు నిర్వహించడం కష్టమవుతోంది. అందువల్ల పరీక్ష దశలోనే అభ్యర్థులను వడపోసేందుకు ప్రిలిమనరీ, మెయిన్ పరీక్షల విధానాన్ని తెచ్చినట్లు తెలుస్తోంది. మారిన ఫీజు చెల్లింపు విధానం ఇప్పటి వరకు దరఖాస్తు ఫీజును ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ విధానంలో చెల్లించే వెసులుబాటు ఉండేది. ఇకపై ఆన్లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలి. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఐఎంపీఎస్, మొబైల్ వేలెట్, క్యాష్కార్డు ద్వారా చెల్లించవచ్చు. ప్రిపరేషన్ ప్రణాళిక ఐబీపీఎస్ 2015-16లో నిర్వహించనున్న పరీక్షలకు కేలండర్ను ముందుగానే విడుదల చేసింది కాబట్టి అభ్యర్థులు తమ ప్రిపరేషన్కు పటిష్ట ప్రణాళిక వేసుకునేందుకు అవకాశం లభించింది. పరీక్ష విధానం ఏదైనా కష్టపడేవారికి విజయం తథ్యం. ప్రభుత్వరంగ బ్యాంకుల క్లరికల్, పీవో పరీక్షలకు ప్రిలిమినరీ, మెయిన్ రెండంచెల విధానాన్ని ప్రవేశపెట్టినా, పరీక్షల సిలబస్, మార్కులు, సమయం, ప్రిలిమ్స్ నుంచి మెయిన్కు ఎందరిని ఎంపిక చేస్తారు తదితర అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రిలిమ్స్లో రీజనింగ్, ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లపై ప్రశ్నలు ఉండే అవకాశముంది. తక్కువ ప్రశ్నలు ఉండి, స్వల్ప వ్యవధిలో పరీక్ష ముగిసేలా ఉంటుంది. మెయిన్లో ఇప్పుడున్న సబ్జెక్టుల నుంచి కొంత క్లిష్టతతో ప్రశ్నలు అడిగే అవకాశముంది. గత సబ్జెక్టులనే కొనసాగించే అవకాశముంది కాబట్టి పరీక్ష విధానంలో మార్పుల వల్ల ఆందోళన చెందనవసరం లేదు. రోజుకు ఎన్ని గంటలు చదివామనే దానికంటే ఎంత విశ్లేషణాత్మకంగా చదివామన్నదే ముఖ్యం. రోజూ కోచింగ్ తీసుకునే సమయాన్ని మినహాయించి, ఇంటి దగ్గర ప్రిపరేషన్కు మూడు, నాలుగు గంటలు కేటాయించాలి. శిక్షణ కేంద్రంలో నిర్వహించే రోజువారీ, వారంతపు పరీక్షలను తప్పనిసరిగా రాయాలి. దీనివల్ల ఏ సబ్జెక్టుల్లో బలహీనంగా ఉన్నారో తెలుస్తుంది. దానికనుగుణంగా ప్రిపరేషన్ ప్రణాళికను మార్చుకోవచ్చు. రీజనింగ్లో ఎరేంజ్మెంట్, పజిల్ సాల్వింగ్ విభాగాలు చాలా ముఖ్యమైనవి. వీటితో పాటు బ్లడ్ రిలేషన్స్ సమస్యల సాధన కీలకం. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో డేటా ఇంటర్ప్రిటేషన్ ముఖ్యమైంది. 8, 9 పాఠ్యపుస్తకాల్లోని అంశాలను ప్రాక్టీస్ చేస్తే క్వాంటిటేటివ్ విభాగంలో అధిక స్కోర్ సాధనకు వీలవుతుంది. ఇంగ్లిష్లో కటాఫ్ దాటేందుకు చాలా మంది అభ్యర్థులు ఇబ్బందులుపడుతున్నారు. ఈ పరిస్థితి రాకూడదంటే కాంప్రెహెన్షన్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అంశాలపై ఎక్కువ దృష్టిసారించాలి. దీనికోసం ఇంగ్లిష్ గ్రామర్, రూట్ వర్డ్స్పై పట్టు సాధించాలి. ఇంగ్లిష్ గ్రామర్పై పట్టు సాధించడానికి ఇంగ్లిష్ దినపత్రికలు, ప్రామాణిక పుస్తకాలను ఉపయోగించుకోవాలి. ోజూ తప్పకుండా నమూనా పరీక్షలు రాయాలి. గ్రూపుగా ఏర్పడి ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. -
‘ఐఐటీ-గువాహటి’లో విశాఖ విద్యార్థి ఆత్మహత్య
గువాహటి/కె.కోటపాడు(విశాఖ): అస్సాంలోని ఐఐటీ-గువాహటిలో బీటెక్ తుది సంవత్సరం చదువుతున్న కాకి పరమేశ్వరరావు(22) అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాకు చెందిన పరమేశ్వరరావు గురువారం మధ్యాహ్నం తన హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ఐఐటీ అధికార ప్రతినిధి మీడియాకు తెలిపారు. మృత దేహాన్ని పోస్ట్మార్టమ్ నిమిత్తం పోలీసులు గువాహటి వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. కాగా, ఆత్మహత్య చేసుకోడానికి గల కారణాలు తెలియాల్సి ఉందని, తనకు తక్కువ మార్కులు వచ్చిన నేపథ్యంలోనే పరమేశ్వరరావు ఆత్మహత్యకు ఒడిగట్టి ఉంటాడని భావిస్తున్నట్టు తెలిపారు. -
ఉద్యోగం చేసే అమ్మాయిలకు డిమాండ్
కెరీర్ ఫస్ట్..మ్యారేజి నెక్ట్స్ నిన్నటి తరం వరకు భార్య గ్రాడ్యుయేట్ అయ్యుండాలన్నది అబ్బాయిల కండిషన్. ప్రస్తుతం అమ్మాయిలు కూడా ఉన్నత విద్య అభ్యసిస్తుండడంతో ట్రెండ్ మారింది. మంచి చదువుతో చక్కని ఉద్యోగం చేస్తున్న భార్య తోడుంటే జీవితంలో త్వరగా సెటిలైపోవచ్చని నేటి తరం యువకులు ఆలోచిస్తున్నారు. అందుకే అలాంటి అమ్మాయిల కోసం వెదుకుతున్నారు. జాబ్ చేస్తున్న యువతులకు త్వరగా సంబంధాలు సెటిలైపోతున్నాయి. ట్రెండ్ మారింది. ఇప్పుడు కలలన్నీ కెరీర్పైనే. పరుగు ప్రపంచంలో ఒక్క అడుగు వెనుకబడినా బతుకంతా తడబాటే. అందుకే పెద్ద పెద్ద అంగలతో మెట్లు చకచకా ఎక్కేయాలని తాపత్రయపడుతున్నారు నేటి యువత. మూడు ముళ్ల గురించి మూడు పదులు దాటే వరకు ఆలోచించడమే లేదు. ఉన్నత చదువులు... ఉద్యోగమే కాక జాతకాలు... తగిన ఈడు జోడు.. ఇలా అనేక అంశాలు పెళ్లిళ్ల జాప్యానికి కారణాలవుతున్నాయి. ఉన్నత విద్యనభ్యసించాలి... మంచి ఉద్యోగం సంపాదించాలి... ఆర్థికంగా నిలదొక్కుకోవాలి... ఆ తరువాతే పెళ్లి అంటున్నారు నేటి యువతీ యువకులు. విద్యార్థి దశలోనే గమ్యాలను నిర్దేశించుకొని ఆ దిశగా ప్రయత్నాలు చేసి లక్ష్యం చేరుకున్నాకే దాదాపుగా ప్రతి ఒక్కరూ జీవిత భాగస్వామి వెతుకులాటలో పడుతున్నారు. ఈ ప్రయత్నాల్లో అనేకమందికి మూడు పదుల వయస్సు దాటిపోతోంది. జీవిత లక్ష్యం ముందు పెరుగుతున్న వయస్సును ఎవరూ పెద్దగా లెక్క చేయడం లేదు. దాంతో కాస్త ఆలస్యంగా ముప్ఫైలలో పెళ్లిళ్లు చేసుకునే అబ్బాయిల సంఖ్య పెరిగిపోతోంది. అయితే భాగస్వామి విషయంలో అభిరుచులు కూడా మారిపోయాయి. కాబోయే భార్య కూడా తమకు తగ్గట్టు చదువుకొని ఉద్యోగం చేస్తుండాలని కోరుకుంటున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. జీవితంలో స్థిరపడ్డాక భాగస్వాములను హైటెక్ పద్ధతిన వెతుక్కుంటున్నారు. ఈ బాధ్యతలను మ్యారేజ్ బ్యూరోలకు అప్పగిస్తున్నారు. ఫలితంగా కుటుంబ సభ్యులు తీసుకువచ్చిన సంబంధాల కంటే ఆన్లైన్లో కుదుర్చుకుంటున్న సంబంధాల సంఖ్యే అధికంగా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో సుమారు 100 మిలియన్ల యువతీ, యువకుల ప్రొఫైల్స్ భాగస్వాముల కోసం ఆన్లైన్లో ఉన్నట్టు మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు చెబుతున్నారు. కొన్ని మ్యారేజ్ బ్యూరోలు చేసిన సర్వే ప్రకారం.. ప్రస్తుతం పెళ్లిళ్లకు సిద్ధమవుతున్న వారిలో 18 నుంచి 25 ఏళ్లలోపు వారు 31 శాతం మంది ఉండగా, 26 నుంచి 35 ఏళ్లలోపు వారు 49 శాతం, 36 నుంచి 45 ఏళ్లలోపు 11 శాతం, 46 నుంచి 60 ఏళ్లలోపు వారు 9 శాతం మంది ఉన్నారు. జాతకాలు కీలకం.. బీటెక్లు, మెడిసిన్లు, సాఫ్ట్వేర్ ఇలా ఎంత ఉన్నత చదువు చదివినా పెళ్లి విషయంలో కొన్ని పాత ఆచారాలను ఇంకా చాలామంది ఆచరిస్తూనే ఉన్నారు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయిన ఈ రోజుల్లో ఆన్లైన్లో భాగస్వాములను వెతుక్కుంటున్నా.. జాతకాలకు ప్రాధాన్యం తగ్గలేదు. మిగతా విషయాల్లో వీటికి అంతగా ప్రాముఖ్యం ఇవ్వకపోయినా పెళ్లి విషయంలో మాత్రం జాతకం కుదరనిదే అనేకమంది తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదు. ఆస్తి, చదువులు, ఉద్యోగం ఇలా అన్నీ కుదిరినా జాతకం సరిపోని కారణంగా పెళ్లిళ్లు చేసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. దీంతో చాలామంది 30 నుంచి 35 ఏళ్ల వయస్సు వరకు నిరీక్షించాల్సివస్తోంది. వయస్సు పెరిగేకొద్దీ సంబంధాలు కుదరడం కష్టమవుతుందని మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు చెబుతున్నారు. ఇటువంటి సందర్భాల్లో కొంతమంది కులాంతర వివాహాల వైపు మొగ్గు చూపుతున్నారని పేర్కొంటున్నారు. పేరయ్యల స్థానంలోమ్యారేజ్ బ్యూరోలు దశాబ్దం వెనక్కు వెళితే పెళ్లి సంబంధాలు కుదిర్చేందుకు పెళ్లిళ్ల పేరయ్యలుండేవారు. వారే అందరి ఇళ్లకూ వెళ్లి యువతీ యువకుల వ్యక్తిగత విషయాలు, జాతకాలు తీసుకొని సంబంధాలు కుదిర్చేవారు. పేరయ్యలు ఇచ్చిన సమాచారం, సలహాలతో కుటుంబ పెద్దలు అమ్మాయి లేదా అబ్బాయిలను చూసి ఓ నిర్ణయానికి వచ్చేవారు. ఇప్పుడు ఈ విధానంలో మార్పు వ చ్చింది. పేరయ్యల స్థానంలో మ్యారేజ్ బ్యూరోలు వచ్చాయి. మనకు కావాల్సిన వధూవరులు ఎలా ఉండాలో వీరికి తెలియజేస్తే చాలు ఆ అర్హతలు ఉన్న చిట్టాను క్షణాల్లో చూపిస్తారు. అందులో నచ్చకపోతే ఆన్లైన్ వెబ్సైట్లో రిజిస్టర్ చేస్తారు. ఇందుకు మ్యారేజ్ బ్యూరోలు రూ.2500 నుంచి రూ.5000 వరకు తీసుకుంటున్నారు. వ్యక్తిగత వివరాలు, అభిరుచులు ఆన్లైన్లోనే పొందుపరుస్తారు. ఆన్లైన్లో భాగస్వాములను వెతుక్కోడానికి అనేక వెబ్సైట్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. భాగస్వాముల ప్రొఫైల్ ఓకే అనుకుంటే బ్యూరోను సంప్రదిస్తే మిగతా తతంగం అంతా పూర్తి చేస్తారు. ఇలాంటి సేవలు అందిస్తున్న సంస్థలు ప్రస్తుతం విశాఖలో దాదాపుగా 50 వరకు ఉన్నాయి. 90 శాతం పెళ్లిళ్లు మా చేతుల మీదుగానే... ప్రస్తుత కాలంలో పెళ్లి సంబంధాల కోసం 90 శాతం మంది మ్యారేజ్ బ్యూరోలనే ఆశ్రయిస్తున్నారు. వీరిలో పురుషులే 70 శాతంమంది వరకు ఉంటున్నారు. ఉద్యోగస్తులు, గ్రాడ్యుయేషన్, ఎంసీఏ, ఎంబీఏ పూర్తి చేసిన అమ్మాయిలు కావాలని కోరుతున్నారు. నూటికి 80 శాతం దాకా ఇలాంటి దరఖాస్తులే ఉంటున్నాయి. ప్రస్తుతం పెద్ద కుటుంబాల సంఖ్య తగ్గిపోవడంతో బిజీ లైఫ్లో భాగస్వాముల వెతుకులాట కొంత కష్టమవుతోంది. అలాంటి వారు మ్యారేజ్ బ్యూరోలతోపాటు వివాహ పరిచయ వేదికలపై ఆసక్తి చూపిస్తున్నారు. -ఎస్.బాబిరెడ్డి,భావన మ్యారేజ్ బ్యూరో, రామ్నగర్ -
సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్
బీటెక్ అయిపోయిన కుర్రాడు ముందుగా ఆలోచించేది కెరీర్ గురించి. ఫ్రెషర్గా ప్లేస్మెంట్ కొడితే ఏ ప్రెషర్ ఉండదని భావిస్తాడు. కానీ అనిరుధ్ మాత్రం కాస్త డిఫరెంట్. నలుగురు వెళ్లే దారిలో వెళ్తే లైఫ్లో కిక్కేముందని ఫిక్సయ్యాడు. అందుకే కలం పట్టాడు.. కవిగా మారాడు. తన జీవితంలో ఎదురుకాని ఓ కథాంశాన్ని ఎంచుకుని ఎందరి జీవితాలకో స్ఫూర్తినందించే నవల రాశాడు. తలపండిన మేధావులు ట్రై చేసే లవ్ ఫెయిల్యూర్ టాపిక్ మీద కథ అల్లాడు.. కథనం సాగించి ’ఇన్ పెయిన్‘ నవలగా తీర్చిదిద్దాడు. అంతేకాదు నావెల్ ప్రచురణకు పబ్లిషర్స్ దొరక లేదని తన సాహిత్యాన్ని అటకెక్కించలేదు. తానే పబ్లిషర్గా మారాడు. తన నవలను అచ్చేయడమే కాదు యంగ్ ఆథర్స్ రచనలనూ ప్రచురిస్తానని ఆఫర్ ఇస్తున్న అనిరుధ్ను ’సిటీప్లస్‘ పలకరించింది. నా బీటెక్ పూర్తయి మూడు నెలలవుతోంది. చిన్నప్పటి నుంచే చిన్న చిన్న కథలు రాసేవాణ్ని. జీవితంలో ఏదైనా సాధించాలనుకునేవాణ్ని. ఆ ఆలోచనలే నన్ను రచయితను చేశాయి. నవల రాయాలనుకున్నప్పుడు ఏ సబ్జెక్ట్ ఎంచుకోవాలని ప్రత్యేకంగా ఏమీ అనుకోలేదు. ఈ రోజుల్లో లవ్ ఫెయిల్యూర్స్ పెద్ద సమస్యగా మారిపోతున్నాయి. ప్రేమ విఫలమైతే అమ్మాయిని చంపడం.. తాను చావడం.. ఇదే పరిష్కారం అని ఆలోచిస్తున్నారు. మా ఫ్రెండ్స్తో డిస్కషన్స్లో కూడా ఈ టాపికే వచ్చేది. కానీ ప్రేమకి ముందు తర్వాత కూడా జీవితం ఉంటుంది. దాని గురించి ఆలోచించాలనేదే ఈ నవల ఉద్దేశం. ప్రేమిస్తే ఎలా ఉండొచ్చో నా జనరేషన్ వాళ్లకు చెప్పే ప్రయత్నం చేశాను. ఓ వ్యక్తి ప్రేమించిన తర్వాత, ప్రేమలో ఓడిపోయిన తర్వాత ఎలాంటి పరిస్థితులకు లోనయ్యాడనేది ‘ఇన్ పెయిన్‘ కథాంశం. యూనివర్సల్ యాక్సెప్ట్.. మొదట తెలుగులోనే రాయాలనుకున్నాను. నా ఫ్రెండ్ శేషు.. ’లవ్ యూనివర్సల్ సబ్జెక్ట్.. ఈ బుక్ కూడా గ్లోబల్ రీచ్ కావాలంటే ఇంగ్లిష్లో రాయటం మంచిది‘ అని సలహా ఇచ్చాడు. ఇంగ్లిష్లో నాకంత లిటరేచర్ స్కిల్స్ లేకపోయినా.. నేను అనుకున్నది రీడర్కు అర్థమయ్యేలా చెప్పగలనన్న నమ్మకంతో ఇంగ్లిష్లో రాయడానికి సాహసించాను. ఒక్క ఏడాదిలో నావెల్ పూర్తి చేశాను. శేషు, మరో స్నేహితుడు శరత్ చాలా ప్రోత్సహించారు. బుక్ పూర్తయ్యాక ఎడిటింగ్ బాధ్యతలు శరత్ చూసుకున్నాడు. శని, ఆదివారాల్లో వచ్చి ఎడిట్ చేసేవాడు. ‘ఏదో రాస్తావ్ అనుకున్నాం.. ఇంత మెచ్యూర్డ్గా రాస్తావనుకోలేదు‘ అన్న వాళ్ల మాటలు ఎప్పుడూ మరచిపోలేను. ఊహల ఊయలలో.. దీన్ని చదివిన వాళ్లు ఇది నీ కథేనా అని అడుగుతున్నారు. నేను రాసింది కేవలం కథే. లవ్ ఫెయిల్యూర్ ఎలా ఉంటుందో ఊహించుకుని రాశాను. ఆ ఫీలింగ్ను అనుభవించాలని ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఒక గదిలో ఒంటరిగా ఉన్నాను. ఒక అమ్మాయిని ప్రేమిస్తే, ఆ ప్రేమ బ్రేకప్ అయితే ఎలా ఉంటుందో ఊహించుకుని ఆ ఫీలింగ్స్ పేపర్ మీద పెట్టేవాణ్ని. ఒక చాప్టర్ పూర్తయ్యాక అంతకుముందు చాప్టర్ చప్పగా అనిపించింది. మళ్లీ మార్పులు చేర్పులు చేసేవాణ్ని. ఇలా ఎన్నో స్వీయ తర్జనభర్జనల తర్వాత దీనికి ఓ రూపం వచ్చింది. యువకలాల కోసం.. నావెల్ పూర్తయిన తర్వాత పబ్లిషర్ కోసం ముంబై, బెంగళూరు ఇలా చాలా సిటీలు తిరిగాం. కానీ ఎవరూ పబ్లిష్ చేయలేదు. చాలా మంది యంగ్ రైటర్స్ రచనలు పబ్లిష్ కాకుండా ఉండిపోతున్నాయి. అందుకే నా ఫ్రెండ్స్ శేషు, శరత్, సైఫుద్దీన్తో కలసి విప్రెన్సా అని పబ్లిషింగ్ హౌస్ ప్రారంభించాం. యువ రచయితలను ప్రోత్సహించడమే ఈ పబ్లిషింగ్ హౌస్ లక్ష్యం. -
‘గేట్’ దాటితే.. గెటప్ మారినట్టే..!
మార్కాపురం : ఇంజినీరింగ్ విద్యార్థుల కల గేట్ (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్). ఈ పరీక్షకు దాదాపు ఆరు నెలల పాటు నిరంతర శిక్షణ తీసుకుంటే మంచి ర్యాంక్ సాధించడం సులభమంటున్నారు అధ్యాపకులు. గేట్లో విజయం సాధిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ఎంటెక్లో చేరేందుకు అవకాశాలు ఎదురు చూస్తుంటాయి. 100 మార్కులకు ఉండే ఈ పరీక్ష ఆన్లైన్లో జరుగుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. జనవరిలో పరీక్ష ఉంటుంది. మార్చి రెండవ వారంలో ఫలితాలు ప్రకటిస్తారు. బీటెక్ చదివిన ప్రతి విద్యార్థి గేట్లో ర్యాంక్ సాధించడానికి ఉత్సాహపడుతుంటాడు. 2014లో జరిగిన పరీక్షల్లో సుమారు 15 లక్షల మంది విద్యార్థులు దేశ వ్యాప్తంగా పోటీ పడ్డారు. ఇందులో 2.10 లక్షల మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. గేట్ పరీక్ష రాయడానికి ప్రస్తుతం ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులతో పాటు బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు కూడా అర్హులే. ఈసీఈ, ఈఈఈ, మెకానికల్, సివిల్, సీఎస్ఈ, ఇన్స్ట్రుమెంటల్ బ్రాంచ్ విద్యార్థులతో పాటు బీటెక్లో ఇతర కోర్సులు చేసిన వారు పరీక్ష రాయవచ్చు. గేట్లో ఉత్తీర్ణులైతే ఐఐటీ, నిట్, ఐఐఎస్ఈలో సీటు పొందవచ్చు. అర్హత పరీక్ష రాయకుండా బీఎస్ఎన్ఎల్, పీఆర్ డీఓ, ఇస్రో, బీహెచ్ఈఎల్, బీఈఎల్ఎల్, ఎన్టీపీసీ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలకు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. -
బాధితులు.. నిందితులు.. విద్యావంతులే
ఇటీవల నగరంలో జరుగుతున్న మోసాలు ఎక్కువగా విద్యావంతులే చేస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెలుగు చూస్తోంది. మోసపోయేదీ చదువుకున్నవారే. వీరి సులువుగా డబ్బు సంపాదించి విలాస జీవితం గడిపేందుకు మోసాలను దగ్గరి మార్గంగా ఎంచుకుంటున్నారు. ఉద్యోగాల పేరిట నగరంలోని కృష్ణలంక పోలీసులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పేరిట మోసగించిన నలుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసిందీ. వీరిలో ముగ్గురు బీటెక్ చేయగా. ఒకరు ఇంటర్ను మధ్యలోనే ఆపేశారు. నిందితుల్లో సాధిక్, ప్రవీణ్కుమార్, రాజేష్ బీటెక్ చదివారు. ప్రధాన నిందితుడైన పి.భరత్చంద్ర ఇంజినీరింగ్ మధ్యలోనే ఆపేశాడు. బాగా చదువుకొని ఖాళీగా ఉండే వారిని లక్ష్యంగా చేసుకొని వీరు మోసాలకు దిగారు. వీరి చేతిలో మోసపోయిన వారిలో ఎంబీఎ పట్టభద్రులు, బీటెక్ చదివిన వారూ ఉన్నారు. ఉద్యోగాలను ఆశగా చూపించగానే ఏమాత్రం ఆలోచించకుండా నిందితుల చేతుల్లో లక్షలకు లక్షల రూపాయలు పోశారు. క్లిష్టమైన ఉద్యోగాల సులువుగా ఎలా వస్తాయని ఏ ఒక్కరు ఆలోచించినా వీరి మోసాలకు ఆదిలోనే అడ్డుకట్ట పడేదని సెంట్రల్ జోన్ ఏసీపీ లావణ్యలక్ష్మి అన్నారు. నకిలీ బంగారంతో.. తక్కువ ధరకు బంగారం పేరిట మోసగించిన ముఠా సభ్యులు కూడా విద్యావంతులే. ఈ కేసులో మాచవరం పోలీసులు అరెస్టు చేసిన రుద్రపాటి డేవిడ్ ఎంబీఎ చదవగా..ఇదే ముఠా సభ్యులైన మణీంద్రకుమార్ బీఎస్సీ, గోపీనాథ్ ఎంఎ, బీఏ బీఈడీ చేసిన శ్రీకాంత్, బీఎస్సీ చదివిన శివకిషోర్ ఉన్నారు. వీరి చేతిలో మోసపోయిన వారూ.. పెద్ద చదువులు చదువుకొని వ్యాపార రంగంలో స్థిరపడిన వారే. ఇంకా ఉంటారు పోలీసులకు చిక్కిన వాళ్లే కాకుండా చిక్కని మోసగాళ్లూ ఉన్నారు. రక రకాల పద్ధతుల్లో ఇటీవల ఉన్నత విద్యావంతులే మోసాలు చేస్తున్నారు. పరువుకు భయపడి కొందరు బాధితులు ముందుకు రావడం లేదు. మోసపోతున్న వారిలో బాగా చదువుకున్న వాళ్లు ఉండటం దురదృష్టకరం.