chemistry
-
కొన్ని అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత
సాక్షి, ఎడ్యుకేషన్: జేఈఈ–మెయిన్ రెండో దఫా పరీక్షలు మంగళవారం మొదలయ్యాయి. రెండు షిఫ్ట్లలో పరీక్ష నిర్వహించగా.. మొదటి షిఫ్ట్ ప్రశ్నపత్రం ఓ మాదిరి క్లిష్టతతో ఉందని విద్యార్థులు, సబ్జెక్ట్ నిపుణులు చెప్పారు. గత పరీక్షల మాదిరిగానే.. రెండు షిఫ్ట్లలోనూ మ్యాథమెటిక్స్ క్లిష్టత స్థాయి ఓ మాదిరిగా ఉన్నప్పటికీ ప్రశ్నలు సుదీర్ఘంగా ఉన్నాయి. కెమిస్ట్రీలో ప్రశ్నలు సులభంగానే ఉన్నాయి. ఫిజిక్స్ మాత్రం క్లిష్టంగా ఉంది. ఈ నెల 22, 23, 24 తేదీల్లో నిర్వహించిన పరీక్షలతో పోల్చితే మంగళవారం మొదటి షిఫ్ట్ కష్టంగా ఉందని అంటున్నారు. కొన్ని అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు చెబుతున్నారు. ఫిజిక్స్లో ఆప్టిక్స్ నుంచి 3 ప్రశ్నలు, ఫ్లూయిడ్ మెకానిక్స్, థర్మోడైనమిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీల నుంచి రెండు ప్రశ్నల చొప్పున అడిగారు.మ్యాథమెటిక్స్లో వెక్టార్స్..3డి, కానిక్స్ నుంచి మూడు ప్రశ్నల చొప్పున మాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్, సిరీస్, డీఈఎఫ్ ఇంటిగ్రేషన్ల నుంచి రెండు ప్రశ్నల చొప్పున అడిగారు. కెమిస్ట్రీలో ఇనార్గానిక్ కెమిస్ట్రీ ప్రశ్నలు క్లిష్టంగా ఉండడమే కాకుండా ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచే ప్రశ్నలు అడగడంతో బోర్డు పుస్తకాలకే పరిమితమైన విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. పిరియాడిక్ టేబుల్, బేసిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీల నుంచి 3 ప్రశ్నల చొప్పున, అటామిక్ స్ట్రక్చర్, ఫినాల్ – ఈథర్–ఆల్కహాల్, కెమికల్ బాండింగ్ల నుంచి రెండు ప్రశ్నల చొప్పున అడిగారు. రెండో షిఫ్ట్లో కూడా మ్యాథమెటిక్స్ ఓ మాదిరిగా ఉన్నప్పటికీ.. సుదీర్ఘమైన ప్రశ్నలు, కాలిక్యులేషన్స్ అవసరమైన ప్రశ్నలు అడిగారు. కెమిస్ట్రీ సులభంగా, ఫిజిక్స్లో సులభం, ఓ మాదిరి క్లిష్టత గల ప్రశ్నలు ఉన్నాయి. రెండు షిఫ్టుల్లోనూ కొన్ని టాపిక్స్ నుంచే.. మొత్తంగా చూస్తే.. రెండు షిఫ్ట్లలోనూ కొన్ని టాపిక్స్ నుంచే ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. ఈ క్రమంలో మ్యాథమెటిక్స్లో ఏరియాస్, మాట్రిసెస్ అండ్ డిటర్మినేషన్స్, కానిక్స్, వెక్టార్ అండ్ 3డి జామెట్రీ, కానిక్స్, ఇంటెగ్రల్ కాలక్యులస్కు ఎక్కువ వెయిటేజీ కనిపించింది. కెమిస్ట్రీలో కోఆర్డినేట్ కాంపౌండ్, అటామిక్ స్ట్రక్చర్, బేసిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, కెమికల్ బాండింగ్ టాపిక్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగారు. ఫిజిక్స్లో కరెంట్ ఎలక్ట్రిసిటీ, థర్మో డైనమిక్స్, ఆప్టిక్స్, ఫ్లూయిడ్ డైనమిక్స్, మోడ్రన్ ఫిజిక్స్ అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. అదే విధంగా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్లలో కొన్ని ప్రశ్నలు కాసింత తికమక పెట్టేలా అడ్వాన్స్డ్ పరీక్ష స్థాయిలో ఉన్నాయని జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్ సబ్జెక్ట్ నిపుణులు ఎం.ఎన్. రావు తెలిపారు. ఫిజిక్స్లో ఫార్ములా బేస్డ్గా డైరెక్ట్ కొశ్చన్స్ లేకపోవడం విద్యార్థులను కొంత ఇబ్బందికి గురి చేసిందని చెప్పారు. కాగా జాతీయ స్థాయిలో బీటెక్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఈ పరీక్షలు బుధవారంతో ముగియనున్నాయి. -
విద్యార్థినిని గర్భవతిని చేసిన కెమిస్ట్రీ టీచర్..
అన్నానగర్: కడలూరు జిల్లా సేతియాతోపు పక్కన ఉన్న మంగళం ప్రాంతానికి చెందిన మలర్ సెల్వం (50). ఇతనికి పైళ్లె పిల్లలు కూడా ఉన్నారు. అదే ప్రాంతంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కెమిస్ట్రీ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ పాఠశాలలో చదువుతున్న ప్లస్–2 విద్యార్థినిని లైంగికంగా వేధించేవాడని తెలుస్తోంది. ఈ విద్యార్థి ప్రస్తుతం చైన్నెలోని ఓ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతుంది. ఈ స్థితిలో 15వ తేదీన కడుపునొప్పి రావడంతో విద్యార్థిని చికిత్స నిమిత్తం చైన్నెలోని కీల్పాక్కం ప్రభుత్వాసుపత్రికి వెళ్లింది. అప్పుడు ఆమెకి అబ్బాయి పుట్టాడు. దీంతో విద్యార్థిని విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది చూసిన ఆసుపత్రి సిబ్బంది విద్యార్థిని రక్షించి విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అనంతరం విద్యార్థిని బంధువులు సెంఽబియం తోప్పు ఆల్ మహిళా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఉపాధ్యాయుడు మలర్ సెల్వంను గురువారం అరెస్టు చేసి విచారణ చేపట్టారు. ప్రాక్టికల్స్లో మార్కులు తగ్గిస్తానని బెదిరించి గతేడాది స్కూల్లో విద్యార్థినిపై ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డాడని విచారణలో తేలింది. -
కెమిస్ట్రీ పాఠాన్ని ఇలా కూడా బోధిస్తారా? ఆ టీచర్ వేరే లెవల్!
ఉపాధ్యాయుల బోధనా పద్ధతులన్నీ.. విద్యార్థులకు విపులంగా అర్థం కావాడమే ప్రధాన అంశం. అందుకోసం ఒక్కొక్క టీచర్ ఒకో పంథాలో తమ క్లాస్ని చెబుతుంటారు. కొందరు టీచర్లు చెప్పే బోధనా పద్ధతి విద్యార్థులకు బోరింగ్ ఫీలింగ్ కలగుకుండా ఆ సబ్జెక్ట్పై ఆసక్తిని పెంచేలా ఉంటుంది. అచ్చం అలానే ఓ ఫిజిక్స్ ఉపాధ్యాయుడు విద్యార్థులకు రసాయన శాస్త్రంలోని ఓ కాన్సెప్ట్ క్లియర్గా అర్థం కావాలని ఎంతలా కష్టపడ్డాడో చూస్తే.. ఫిదా అవ్వాల్సిందే.ఎలా చెప్పారంటే..ప్రముఖ ఎడ్ టెక్కి చెందిన ఒక ఫిజిక్స్ ఉపాధ్యాయుడు విద్యార్థులకు కెమిస్ట్రీలోని చిరాలటీ కాన్సెప్ట్ని బోధిస్తున్నారు. చిరాలటీలో అణువులు ఒక చిరాల్ కేంద్రాన్ని కలిగి ఉంటాయి. అద్దంలో అతిగా ఇంపోజ్ కావు. కాకపోతే రసాయన చర్యలో ఎడమ, కుడిగా కుడి ఎడమ గానూ అద్దంలో కనిపించే చిత్రంలాగా కనిపిస్తుంది. అదే దీని ప్రత్యేకత. ఇది విద్యార్థులకు అర్థమయ్యేలా తన శరీర భంగిమలతో క్లియర్గా వివరించారు. చెప్పాలంటే తన బోధనలో యోగాని కూడా మిళితం చేసి చెబుతున్నట్లుగా వివరించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు ఆ ఉపాధ్యాయుడికి తన వృత్తిపై ఉన్న అభిరుచి, నిబద్ధతలను ప్రశంసిచగా, మరికొందరు ఇంతలా కష్టపడటం ఎందుకు త్రీడీ వస్తువులతో లేదా ఏదైనా ప్లాస్టిక్ వస్తువులను ఉదాహరణగా తీసుకుని చెబితే సరి అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.Absolute cinema 🎥 pic.twitter.com/KkhZwOr9dD— Priyanka 🪷 (@Oyepriyankasun) December 14, 2024 (చదవండి: 20 ఏళ్లకే డాక్టర్, 22 ఏళ్లకు ఐఏఎస్ ఆఫీసర్..ఇవాళ ఏకంగా..!) -
ప్రోటీన్లపై పరిశోధనకు నోబెల్
స్టాక్హోమ్: మనిషి ఆరోగ్యకరమైన జీవనానికి మూలస్తంభాలైన ప్రోటీన్ల డిజైన్లు, వాటి పనితీరుపై విశేష పరిశోధనలు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ సంవత్సరం రసాయనశాస్త్ర విభాగంలో నోబెల్ అవార్డ్ వరించింది. ప్రోటీన్లపై శోధనకుగాను శాస్త్రవేత్తలు డేవిడ్ బెకర్, డెమిస్ హసాబిస్, జాన్ జంపర్లకు 2024 ఏడాదికి కెమిస్ట్రీ నోబెల్ ఇస్తున్నట్లు కెమిస్ట్రీ నోబెల్ కమిటీ సారథి హెనర్ లింక్ బుధవారం ప్రకటించారు. పురస్కారంతోపాటు ఇచ్చే దాదాప రూ.8.4 కోట్ల నగదు బహుమతిలో సగం మొత్తాన్ని బేకర్కు అందజేయనున్నారు. మిగతా సగాన్ని హసాబిస్, జాన్ జంపర్లకు సమంగా పంచనున్నారు. జీవరసాయన శాస్త్రంలో గొప్ప మలుపు ‘‘అమైనో ఆమ్లాల క్రమానుగతి, ప్రోటీన్ల నిర్మాణం మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. వీరి పరిశోధన రసాయనరంగంలో ముఖ్యంగా జీవరసాయన శాస్త్రంలో మేలి మలుపు. ఈ ముందడుగుకు కారకులైన వారికి నోబెల్ దక్కాల్సిందే’’ అని నోబెల్ కమిటీ కొనియాడింది. అమెరికాలోని సియాటెల్లో ఉన్న వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో డేవిడ్ బేకర్ పనిచేస్తున్నారు. హసాబిస్, జాన్ జంపర్ లండన్లోని గూగుల్ సంస్థకు చెందిన డీప్మైండ్ విభాగంలో పనిచేస్తున్నారు. ‘‘బేకర్ 2003లో ఒక కొత్త ప్రోటీన్ను డిజైన్చేశారు. అతని పరిశోధనా బృందం ఇలా ఒకదాని తర్వాత మరొకటి కొత్త ప్రోటీన్లను సృష్టిస్తూనే ఉంది. వాటిల్లో కొన్నింటిని ప్రస్తుతం ఫార్మాసూటికల్స్, టీకాలు, నానో మెటీరియల్స్, అతి సూక్ష్మ సెన్సార్లలో వినియోగిస్తున్నారు. వీళ్ల బృందం సృష్టించిన సాంకేతికతతో వెలువడిన ఎన్నో కొత్త డిజైన్ల ప్రోటీన్లు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి’’అని నోబెల్ కమిటీలో ప్రొఫెసర్ జొహాన్ క్విస్ట్ శ్లాఘించారు. BREAKING NEWSThe Royal Swedish Academy of Sciences has decided to award the 2024 #NobelPrize in Chemistry with one half to David Baker “for computational protein design” and the other half jointly to Demis Hassabis and John M. Jumper “for protein structure prediction.” pic.twitter.com/gYrdFFcD4T— The Nobel Prize (@NobelPrize) October 9, 2024 నిర్మాణాలను అంచనా వేసే ఏఐ మోడల్ డెమిస్ హసాబిస్, జంపర్లు సంయుక్తంగా ప్రోటీన్ల నిర్మాణాలను ఊహించగల కృత్రిమమేధ నమూనాను రూపొందించారు. దీని సాయంతో ఇప్పటిదాకా కనుగొన్న 20 కోట్ల ప్రోటీన్ల నిర్మాణాలను ముందే అంచనావేయొచ్చు. చదవండి: ఏఐ మార్గదర్శకులకు...ఫిజిక్స్ నోబెల్ -
క్లాస్ రూంలో దారుణం.. లెక్చరర్ ప్రాణం తీసిన ఇంటర్ విద్యార్ధి
విద్యా బుద్దులు నేర్పించే గురువులపై విద్యార్ధులు క్రూరంగా ప్రవర్తిస్తున్నారు.ఎందుకు సరిగ్గా చదవడం లేదు? అని ప్రశ్నించిన పాపానికి ఓ గురువు ప్రాణం తీశాడో ఇంటర్ విద్యార్ధి. క్లాసు రూంలోనే విచాక్షణా రహితంగా కత్తితో కసితీరా పొడిచి చంపాడు.అస్సోం రాష్ట్రం గౌహతిలో జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అస్సాంలోని శివసాగర్ జిల్లాలో రాజేష్ బారువా బెజవాడ (55) కెమిస్ట్రీ లెక్చరర్గా విధులు నిర్వహిస్తూనే..సొంతంగా ఓ స్కూల్ను రన్ చేస్తున్నారు.అయితే శుక్రవారం ఎప్పటిలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ సబ్జెట్ చెప్పేందుకు క్లాస్కు వచ్చాడు. అనంతరం క్లాస్ రూంలో సరిగ్గా చదవడం లేదని, మీ తల్లిదండ్రుల్ని పిలుచుకుని రావాలని ఓ విద్యార్ధిని మందలించారు.ఆ మరసటి రోజు సదరు విద్యార్ధి సివిల్ డ్రెస్తో క్లాస్కు వచ్చాడు. పాఠం చెప్పేందుకు క్లాసుకు వచ్చిన రాజేష్ బారువా..సదరు విద్యార్ధిని మీ పేరెంట్స్ను పిలుచుకుని రమ్మనమన్నాను కదా.. పిలుచుకుని వచ్చావా? అని ప్రశ్నించారు. విద్యార్ధిని సమాధానం చెప్పకపోవడంతో ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ గట్టిగా అరిచారు.దీంతో అప్పటికే పక్కా ప్లాన్తో క్లాసుకు వచ్చిన విద్యార్ధి తన జేబులో ఉన్న పదునైన కత్తితో లెక్చరర్ రాజేష్పై దూసుకెళ్లాడు. తలమీద తీవ్రంగా పొడిచాడు. అక్కడి నుంచి పరారయ్యాడు. విద్యార్ధి దాడితో తీవ్ర గాయాలపాలైన రాజేష్ కుప్పకూలిపోయాడు. అప్రమత్తమైన సిబ్బంది, విద్యార్ధులు ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. కానీ మార్గం మధ్యలోనే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
రిపీట్టే...
ఒక సినిమాలో హీరో–హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అయితే మళ్లీ ఆ జంటను చూడాలని ప్రేక్షకులు కోరుకుంటారు. అయితే ఆ జంటకి మ్యాచ్ అయ్యే కథ దొరకాలి.. ఆ కథకు ఈ ఇద్దరినే హీరో–హీరోయిన్గా తీసుకోవాలనే ఆలోచన డైరెక్టర్కి రావాలి. ఇలా కొన్ని జంటలకు కథ కుదిరింది.ఆ కాంబినేషన్ రిపీట్ చేస్తే బాగుండనే ఆలోచన డైరెక్టర్కీ వచ్చింది. ‘రిపీట్టే..’ అంటూ మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఆ జంటలు చేస్తున్న చిత్రాల గురించి... ► ‘వినయ విధేయ రామ’ చిత్రంతో ఆకట్టుకున్న హీరో రామ్చరణ్–హీరోయిన్ కియారా అద్వానీ ‘గేమ్ చేంజర్’ కోసం రెండోసారి జోడీ కట్టారు. ఈ చిత్రానికి శంకర్ దర్శకుడు. ‘భరత్ అనే నేను’ (2018) సినిమాతో కియారా టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ‘వినయ విధేయ రామ’ (2019) లో రామ్చరణ్కి జోడీగా నటించారామె. ఈ ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. ఇక ఈ ఇద్దరూ జత కట్టిన తాజా చిత్రం ‘గేమ్ చేంజర్’ని ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ΄÷లిటికల్ థ్రిల్లర్గా ఈ చిత్రం రూ΄పొందుతోంది. ► ‘లవ్స్టోరి’ (2021)తో ప్రేక్షకులకు అందమైన ప్రేమకథని చూపించారు హీరో నాగచైతన్య–హీరోయిన్ సాయిపల్లవి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూ΄పొందిన ఈ చిత్రంలో నాగచైతన్య, సాయిపల్లవి జోడీకి మంచి మార్కులు పడ్డాయి. ఈ జంట రెండేళ్లకు రెండోసారి జోడీగా నటిస్తున్నారు. ‘ప్రేమమ్’ (2016), ‘సవ్యసాచి’ (2018) చిత్రాల తర్వాత హీరో నాగచైతన్య– డైరెక్టర్ చందు మొండేటి కాంబినేషన్లో మూడో సినిమా రూ΄పొందుతోంది. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో నాగచైతన్యకి జోడీగా సాయి పల్లవి నటించనున్నారు. చైతు–సాయిపల్లవి తొలిసారి జత కట్టిన ‘లవ్స్టోరి’లానే తాజా చిత్రం కూడా ప్రేమ ప్రధానాంశంగా సాగుతుంది. ► ‘భీష్మ’ వంటి హిట్ సినిమా తర్వాత నితిన్–రష్మికా మందన్నా రెండోసారి నటించనున్న సంగతి తెలిసిందే. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ‘భీష్మ’ (2020) చిత్రంలో నితిన్– రష్మిక తొలిసారి కలిసి నటించారు. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ప్రత్యేకించి నితిన్–రష్మిక డ్యాన్స్లు ప్రేక్షకులను అలరించాయి. ఇక వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ‘ఛలో’ చిత్రం ద్వారానే రష్మిక తెలుగు తెరకు పరిచయం అయిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ విధంగా నితిన్–రష్మిక–వెంకీ కుడుముల.. ఈ ముగ్గురి కాంబినేషన్లో తాజాగా రెండో సినిమా రూ΄పొందుతోందని చెప్పొచ్చు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం నుంచి రష్మికా మందన్న తప్పుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ‘పుష్ప’తో పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు తెచ్చుకున్న రష్మిక ప్రస్తుతం తెలుగు, హిందీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ కారణంగా డేట్స్ సర్దుబాటు కాక΄ోవడంతో ఈ మూవీ నుంచి తప్పుకున్నారట. ఆమె స్థానంలో శ్రీలీల అవకాశం అందుకున్నారని టాక్. ఈ వార్తపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ► ‘గీత గోవిందం’(2018), ‘డియర్ కామ్రేడ్’ (2019) వంటి చిత్రాల తర్వాత విజయ్ దేవరకొండ–రష్మికా మందన్నా ముచ్చటగా మూడోసారి కలిసి నటించనున్నారని టాక్. విజయ్ దేవరకొండ హీరోగా ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘వీడీ 12’ (వర్కింగ్ టైటిల్) చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తొలుత హీరోయిన్గా శ్రీ లీలను ఫిక్స్ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్పై రూ΄పొందుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొన్నారు. అయితే వరుస సినిమాలతో డేట్స్ అడ్జస్ట్ చేయలేక ‘వీడీ 12’ ్రపాజెక్ట్ నుండి శ్రీ లీల తప్పుకున్నట్లు టాక్ . దీంతో చిత్ర యూనిట్ రష్మికా మందన్నాని సంప్రదించగా... ఈ బ్యూటీ పచ్చజెండా ఊపారని తెలుస్తోంది. ఇదే నిజం అయితే విజయ్–రష్మిక కలిసి నటించనున్న మూడో చిత్రం ఇదే అవుతుంది. అయితే నితిన్ సినిమా నుంచి రష్మిక తప్పుకోవడంతో ఆ ప్లేస్ని శ్రీ లీల భర్తీ చేశారని, విజయ్ దేవరకొండ సినిమా నుంచి శ్రీ లీల తప్పుకుంటే ఈ ్రపాజెక్ట్లోకి రష్మిక ఎంట్రీ ఇచ్చారనే వార్తలపై అధికారిక ప్రకటనలు రావాల్సి ఉంది. ► ‘బింబిసార’ వంటి బ్లాక్బస్టర్ హిట్ తర్వాత హీరో కల్యాణ్ రామ్–హీరోయిన్ సంయుక్తా మీనన్ ‘డెవిల్’ సినిమా కోసం రెండోసారి జోడీ కట్టారు. వశిష్ఠ దర్శకత్వంలో కల్యాణ్ రామ్–సంయుక్తా మీనన్ జంటగా నటించిన తొలి చిత్రం ‘బింబిసార’ (2022). ఈ చిత్రవిజయంతో హిట్ పెయిర్ అనిపించుకున్న కల్యాణ్ రామ్–సంయుక్తా మీనన్ తాజాగా ‘డెవిల్’లో నటిస్తున్నారు. దేవాన్ష్ నామా సమర్పణలో పీరియాడిక్ స్పై థ్రిల్లర్గా అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా నవంబర్ 24న రిలీజ్ కానుంది. ఇలా రిపీట్ అవుతున్న జంటలు ఇంకొన్ని ఉన్నాయి. -
నానో ప్రపంచం దగ్గరయింది
బంగారం ఏ రంగులో ఉంటుందో తెలుసు కదా? ముదురు పసుపునకు కొంత కాంతి చేరిస్తే ఉండే రంగు. కానీ, ఇదే బంగారాన్ని నానోస్థాయిలో.. అంటే మన వెంట్రుకలో పదివేల వంతు సూక్ష్మస్థాయిలో చూస్తే దాని రంగు ఎరుపు లేదా వంగపూతగా కనిపిస్తుంది! అదెలా అని ఆశ్చర్యపోనవసరం లేదు. ఇలా నానోస్థాయిలో పదార్థాల ధర్మాల ఆసరాతో అత్యాధునిక ఎల్రక్టానిక్స్ తయారీకి మార్గం చూపిన శాస్త్రవేత్తలకు ఈ ఏడాది రసాయన శాస్త్ర నోబెల్ బహుమతి దక్కిందని మాత్రం తెలుసుకోవాలి! ఆ విశేషాలేమిటో చూసేద్దాం.. క్వాంటమ్ డాట్స్ తయారీకి బాటలు నానోటెక్నాలజీ మనకేమీ కొత్త కాదు. చాలా కాలంగా వేర్వేరు రంగాల్లో వాడకంలో ఉన్నదే. స్పష్టమైన, పలుచని ఎల్ఈడీ స్క్రీన్ల తయారీ మొదలుకొని శరీరంలోని కేన్సర్ కణితులను కత్తిరించడం వరకూ రకరకాలుగా నానో టెక్నాలజీ ఉపయోగపడుతోంది. ఈ అత్యద్భుతమైన టెక్నాలజీ ఆవిష్కరణలకు బీజం వేసిన క్వాంటమ్ డాట్స్ను తయారు చేసేందుకు అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేశారు కాబట్టే స్వీడిష్ నోబెల్ అవార్డు కమిటీ.. మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన మౌంగి బావెండీ, కొలంబియా యూనివర్సిటీ శాస్త్రవేత్త లూయిస్ బ్రూస్, నానో క్రిస్టల్స్ టెక్నాలజీ ఇన్కార్పొరేషన్కు చెందిన అలెక్సీ ఎకిమోవ్లకు ఈ ఏడాది రసాయన శాస్త్ర నోబెల్ అవార్డు ప్రకటించింది. సూక్ష్మస్థాయి కణాల ఉత్పత్తి రసాయన శాస్త్రం చదువుకున్న వారు ఎవరికైనా మూలకాల ధర్మాలు వాటిలోని ఎల్రక్టాన్ల సంఖ్యపై ఆధారపడి ఉంటాయని తెలిసే ఉంటుంది. అయితే మూలకం నానోస్థాయికి చేరిందనుకోండి... సాధారణ స్థితిలో ఉండే ధర్మాల స్థానంలో క్వాంటమ్ స్థాయి తాలూకూ ప్రభావం కనిపించడం మొదలవుతుంది. మూలకం సైజును బట్టి ఈ ధర్మాలుంటాయి. ఉదాహరణకు పైన చెప్పుకున్న బంగారం రంగు! అలాగే సైజును బట్టి మూలకాల యాంత్రిక, ఉపరితల, అయస్కాంత, ఎలక్ట్రా్టనిక్, ఆప్టికల్, ఉ్రత్పేరక ధర్మాలు కూడా మారిపోతాయి. సాధారణ సైజులో విద్యుత్తు ప్రవాహాన్ని అడ్డుకోని పదార్థాలు సైజు తగ్గుతున్న కొద్దీ సెమీ కండక్టర్లుగా మారిపోవచ్చు. మరికొన్ని పదార్థాలు సాధారణ సైజులో సెమీకండక్టర్లుగా ఉన్నప్పటికీ నానోస్థాయిలో సూపర్ కండక్టర్లుగా వ్యవహరించవచ్చు. ఇంతటి సూక్ష్మస్థాయిలో ఉండే కణాలను ఉత్పత్తి చేయడంలో ఈ ఏటి రసాయన శాస్త్ర నోబెల్ అవార్డు గ్రహీతలు విజయం సాధించారు. నానో ప్రపంచంలో మూలకాల ధర్మాలు మారిపోతాయని చాలాకాలంగా తెలుసు కానీ.. వీటితో వాస్తవిక ప్రయోజనం తక్కువని అనుకునేవారు. 1980లో అలెక్సీ ఎకిమోవ్ రంగుల గాజులో క్వాంటమ్ ఎఫెక్ట్ను సృష్టించడంలో విజయం సాధించారు. కణం సైజు ఆధారంగా రంగు మారుతుందని ఆయన నిరూపించడంతో క్వాంటమ్ డాట్స్పై ఆసక్తి పెరిగింది. కొన్నేళ్ల తరువాత ఒక ద్రవంలో స్వేచ్ఛగా కదులుతున్న కణాల సైజుకు అనుగుణంగా క్వాంటమ్ ఎఫెక్ట్స్ మారుతాయని మొట్టమొదటిసారి నిరూపించగలిగారు. భవిష్యత్తులో సురక్షితమైన సమాచార వ్యవస్థ! 1993లో మౌంగి బావెండీ రసాయనికంగా క్వాంటమ్ డాట్స్ను ఉత్పత్తి చేయడం మొదలు పెట్టడంతో వీటిని మన ప్రయోజనాలకు వాడుకోవడం సులువు అయ్యింది. ఇప్పుడు మన కంప్యూటర్ మానిటర్లు, క్యూఎల్ఈడీ స్క్రీన్లో విస్తృత స్థాయి రంగులు వెదజల్లడం ఈ క్వాంటమ్ డాట్స్ పుణ్యమే. అలాగే మన ఎల్ఈడీ బల్బుల రంగులు మారడానికి కూడా ఇవే కారణం. శరీరంలోని కణజాలాన్ని స్పష్టంగా గుర్తించేందుకు బయో కెమిస్టులు, వైద్యులు ఇప్పుడు క్వాంటమ్ డాట్స్ను వాడుతున్నారు. భవిష్యత్తులో ఈ క్వాంటమ్ డాట్స్ ద్వారా ఎటు కావాలంటే అటు మడిచేసుకోగల ఎల్రక్టానిక్స్, అతి సూక్ష్మమైన సెన్సార్లు, పలుచటి సోలార్ సెల్స్ తయారీతోపాటు అత్యంత సురక్షితమైన సమాచార వ్యవస్థను అభివృద్ధి చేసుకునేందుకూ ఉపయోగపడుతుందని అంచనా. క్వాంటమ్ డాట్స్పై పరిశోధనలకు నోబెల్ రసాయన శాస్త్రంలో ముగ్గురు అమెరికా సైంటిస్టులకు ప్రతిష్టాత్మక బహుమతి స్టాక్హోమ్: రసాయన శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ బహుమతిని ‘ద రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ బుధవారం ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక బహుమతి ఈసారి ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలను వరించింది. నానో టెక్నాలజీకి సంబంధించిన క్వాంటమ్ డాట్స్ ఆవిష్కరణలో పరిశోధనలకు గాను మౌంగి బావెండీ, లూయిస్ బ్రూస్, అలెక్సీ ఎకిమోవ్లకు రసాయన శాస్త్ర నోబెల్ ప్రైజ్ లభించింది. క్వాంటమ్ డాట్స్ విశ్లేషణ, ఆవిష్కరణలో, నానో పారి్టకల్స్ అభివృద్ధిలో ఈ ముగ్గురు సైంటిస్టులు కీలక పాత్ర పోషించారని నోబెల్ కమిటీ తెలియజేసింది. ‘ద రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ అధికారికంగా విజేతల పేర్లు ప్రకటించకముందే ముగ్గురు సైంటిస్టుల పేర్లను స్వీడన్ మీడియా సంస్థలు బహిర్గతం చేయడం కలకలం రేపింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
విద్యార్థులే ఊపిరిగా..
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మందమతులేం కాదు, తెలివైన, చురుకైన వారు. విద్యార్థులే కాదు టీచర్లు కూడా నిరంతరం నేర్చుకుంటూనే ఉంటారు’’ అంటోంది నేషనల్ గుడ్ టీచర్ అవార్డు గ్రహీత మాలతీ టీచర్. దేశవ్యాప్తంగా యాభైమంది ఈ అవార్డు అందుకోగా అందులో మాలతీ టీచర్ ఒకరు. తమిళనాడులోని సెంగోటై్టలో పుట్టి పెరిగిన మాలతి నల్లాసైతిరా ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభాస్యం పూర్తిచేసింది. మనస్తత్వ, రసాయన శాస్త్రాల్లో మాస్టర్స్ చేసింది. రసాయనశాస్త్రంలో పీహెచ్డీ చేస్తూ టీచర్గా పనిచేస్తోంది. 2008లో తిరుపూర్ పెరుమతూర్ గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్లో టీచర్గా చేరింది మాలతి. అక్కడ మూడేళ్లు పనిచేశాక బదిలీ అవ్వడంతో తెన్కాసి గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్లో టీచర్గా వెళ్లింది. ఇక్కడ ఏడాది పనిచేశాక ప్రమోషన్ రావడంతో వీరకేరళంబుదూర్ గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్లో పోస్టుగ్రాడ్యుయేట్ సైన్స్ టీచర్గా చేరింది. గత పదేళ్లుగా ఇదే స్కూల్లో సైన్స్ టీచర్గా పనిచేస్తూ విద్యార్థులకు చక్కగా అర్థమయ్యేలా పాఠాలు చెబుతూ వారి మనసులో సుస్థిరస్థానాన్ని సంపాదించుకుంది. ఆటపాటలతో... పాఠాలు విద్యార్థులు సైన్స్సబ్జెక్టుని ఇష్టపడాలని మాలతి కోరిక. అందుకే ఎంతో కష్టమైన చాప్టర్లను సైతం విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధిస్తోంది. విలువిద్య, తోలుబొమ్మలాట, పాటలు పాడడం, నృత్యం, కథలు చెప్పడం ద్వారా సైన్స్ పాఠాలను వివరిస్తోంది. కరోనా సమయంలో ఇళ్లకే పరిమితమైన విద్యార్థులకు ఆన్లైన్ తరగతుల ద్వారా బోధించింది. గ్రామాల్లో మొబైల్ ఫోన్స్ లేని అంధవిద్యార్థులకు సైతం ఆడియో పాఠాలను అందించింది. నూటపద్దెనిమిది మూలకాల పట్టికను సైతం కంఠస్థం చేయాలన్న ఆసక్తి ఉన్న వారికి చక్కగా నేర్చుకునేందుకు సాయపడుతోంది. మేధో వైకల్యాలున్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వీరు కూడా మంచి ఉత్తీర్ణత సాధించేలా కృషిచేస్తోంది. ఈ విద్యార్థులకు ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించి వారి నైపుణ్యాలను మెరుగుపరుస్తోంది. ఇలా మాలతీ టీచర్ సాయంతో సైబుల్ ఇస్లాం అనే మేధోవైకల్య విద్యార్థి 25 సెకన్లలో 20 ద్రవాల పేర్లు టకటకా చెప్పి ‘చోళన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకున్నాడు. ఇస్లాంకు మాలతీ ఆరునెలలపాటు శిక్షణ ఇచ్చింది. మహేశ్వరి, కరణ్, శక్తి ప్రభ వంటి విద్యార్థులు సైతం సెకన్ల వ్యవధిలో నూటపద్ధెనిమిది మూలకాల పీరియాడిక్ టేబుల్ను అప్పచెప్పి చోళన్ వరల్డ్ రికార్డు బుక్లో చోటు దక్కించుకున్నారు. అరవైశాతం మేధో వైకల్యం కారణంగా సరిగా మాట్లాడలేని వారితో సైతం మూలకాల పేర్లను కంఠస్థం చేయించి, గడగడా చెప్పించడం విశేషం. అవార్డులు రికార్డులు... విద్యార్థులను రికార్డుల బుక్లో చోటుదక్కించుకునేలా తయారు చేయడమేగాక మాలతీ కూడా కరోనా సమయంలో ఐదువందల రోజులు ఉచితంగా ఆన్లైన్ తరగతులు చెప్పి చోళన్ వరల్డ్ రికార్డు బుక్ లో చోటు దక్కించుకుంది. మాలతి కృషిని గుర్తించిన తమిళనాడు ప్రభుత్వం 2020–2021 సంవత్సరానికిగాను డాక్టర్ రాధాకృష్ణన్ అవార్డుతో సత్కరించింది. 2022లో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఇరవై ఆరుగంటలపాటు నిరంతరాయంగా ఆన్లైన్ తరగతులు నిర్వహించి వరల్డ్ రికార్డు సృష్టించింది. ఆరోతరగతి నుంచి పై తరగతులకు పాఠాలు బోధించే మాలతీ తనకు వచ్చిన నగదు బహుమతితో విద్యార్థులకు రోటోటిక్స్ కిట్స్ కొని ఇచ్చింది. గేమ్లకు బానిసలు కాకుండా... స్మార్ట్ఫోన్లు వచ్చాక విద్యార్థులంతా మొబైల్ గేమ్స్కు అంకితమైపోతున్నారు. వీరిని ఆడుకోనిస్తూనే పాఠాలు నేర్పించడానికి మాలతి క్విజ్గేమ్ వాయిస్ యాప్ను రూ΄÷ందించింది. ఈ యాప్ను స్టూడెంట్స్తోనే తయారు చేయించడం విశేషం. దీనిలో పీరియాడిక్ టేబుల్ ఉంటుంది. ఈ టేబుల్లో విద్యార్థుల పేర్లు, ఇంగ్లిష్లోని కష్టమైన పదాలను వెతుకుతూ నేర్చుకోవచ్చు. విద్యార్థులకు నేర్పిస్తోన్న పాఠాలను వారి తల్లిదండ్రులు చూసేలా యూట్యూబ్లో పోస్టుచేస్తూ వారి ఉన్నతికి కృషిచేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది మాలతి టీచర్. ‘‘బోధనే నా శ్వాస, విద్యార్థులే నా ఊపిరి. డాక్టర్లు, టీచర్లకు రిటైర్మెంట్ ఉండదు. అధికారికంగా రిటైర్ అయినప్పటికీ ఆ తరువాత కూడా స్టూడెంట్స్ కోసం పనిచేస్తాను. నేను సైకాలజీ చదవడం వల్ల విద్యార్థుల్ని, వారి వైకల్యాలను అర్థం చేసుకుని పాఠాలు చెప్పగలుగుతున్నాను. ప్రతి ఒక్క టీచర్ సైకాలజీ చదివితే మరింత చక్కగా బోధించగలుగుతారు. నేషనల్ గుడ్ టీచర్ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను నేర్చుకుంటూ, విద్యార్థులకు నేర్పించడమే నా జీవితాశయం’’ అని మాలతీ టీచర్ చెబుతోంది. -
విజయ్ సమంత కెమిస్ట్రీ..మళ్లీ అదే ఫార్ములా..
-
ప్లాస్టిక్కి చెక్పెట్టేలా... నీటిని ఫిల్టర్ చేసే చేప
మానువుని తప్పిదాల వల్ల నది జలాలు, సముద్రాలు ప్లాస్టిక్ చెత్తతో నిండిపోతున్నాయి. వీటి కారణంగా జలచర జీవుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఏటా నదులు, సముద్రాల ఒడ్డున లక్షలాది చేపలు వంటి పలు జలచర జీవులు ఈ ప్లాస్టిక్ కారణంగా చనిపోతున్నాయి. ఇప్పుడూ ఆ ప్లాస్టిక్ని నీటి నుంచి సులభంగా వేరుచేసి ఫిల్టర్ చేసే రోబో చేప మన ముందుకు రానుంది. ఈ రోబో భవిష్యత్తు తరాలను నీటి కాలుష్యం నుంచి బయటపడేలా చేస్తోందంటున్నారు పరిశోధకులు. వివరాల్లోకెళ్తే...తాగు నీటిలో, నదుల్లో ఉండే ఐదు మిల్లీమీటర్ల కంటే తక్కువ ఉండే మైక్రో ప్లాస్టిక్ని ఏరేసి ఫిల్టర్ చేసే ఒక సరికొత్త త్రీడీ గిల్బర్ట్ రోబో చేపను రూపొందంచాడు సర్రే విశ్వవిద్యాలయ విద్యార్థి. ఈ రోబో చేప ఇంగ్లాండ్లోని సర్రే విశ్వవిద్యాలయం నిర్వహించిన నేచురల్ రోబోటిక్స్ కాంటెస్ట్ని గెలుచుకుంది. ఈ రోబోని కెమిస్ట్రీ గ్యాడ్యుయేట్ ఎలియనోర్ మాకింతోష్ అనే విద్యార్థి రూపొందించాడు. జలాల్లో ఉన్న మైక్రో ప్లాస్టిక్ని తొలగించేడానికి ఈ రోబో ఉత్తమమైన పరిష్కార మార్గంగా భావిస్తున్నారు పరిశోధకులు. ఈ మేరకు సర్రే విశ్వవిద్యాలయంలోని లెక్చరర్ డాక్టర్ రాబర్ట్ సిడాల్ మాట్లాడుతూ..నదులు, సముద్రాల్లోకి విసురుతున్న ప్లాస్టిక్ ఎక్కడకి వెళ్తుందో తెలియదు. గానీ ఈ రోబో చేప భవిష్యత్తు తరాలను ప్లాస్టిక్ మహమ్మారి నుంచి కాపాడుతుంది అనడంలో సందేహం లేదన్నారు. ఈ రోబో త్రీడీ గిల్బర్ట్ చేప తన తోక సాయంతో కదులుతుంది. ఇది ఈత కొడుతున్నప్పుడే నీటిన శుద్ధి చేసే ప్రక్రియ మొదలుపెడుతుంది. నీటిని సేకరించడానికి నోటిని తెరుస్తుంది. దాని నోటిలో నీరు నిండిపోయిన వెంటనే మూసుకుపోతుంది. ఆ తర్వాత ఆ రోబో చేప అంతర్గత కుహరంలోని గిల్పాప్కి ఉన్న మెష్ ద్వారా ఫిల్గర్ చేసిన నీటిని బయలకు నెట్టేసి, ప్లాస్టిక్ని సంగ్రహిస్తుంది. ఈ రోబో చేప కాలుష్య పోరాటంలో చేరి ప్రపంచాన్ని మరింత సుస్థిరంగా చేస్తుందంటున్నారు పరిశోధకులు. ఐతే మైక్రో ప్లాస్టిక్ మాత్రం శాశ్వతంగా తొలగిపోవాలంటే వందలు లేదా వేల ఏళ్లు పట్టవచ్చు అని చెబుతున్నారు. (చదవండి: షాకింగ్.. బతికున్న మహిళను మింగిన 22 అడుగుల భారీ కొండచిలువ) -
ఆమెతో సహా ముగ్గురికి కెమిస్ట్రీలో నోబెల్
స్టాక్హోమ్: రసాయన శాస్త్రంలో 2022 ఏడాదికిగానూ నోబెల్ ప్రైజ్ను ప్రకటించారు. అమెరికా శాస్త్రవేత్తలు కరోలిన్ బెర్టోజి, బ్యారీ షార్ప్లెస్తో పాటు డెన్మార్క్కు చెందిన మోర్టన్ మెల్డల్లకు సంయుక్తంగా ప్రైజ్ను ప్రకటించింది కమిటీ. భారత కాలమానం ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో స్టాక్హోమ్(స్వీడన్) రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ మేర ప్రకటన చేసింది. క్లిక్ కెమిస్ట్రీ, బయోఆర్తోగోనల్ కెమిస్ట్రీ అభివృద్ధి కోసం వీళ్లు చేసిన కృషికిగానూ నోబెల్ ప్రైజ్ను ఇస్తున్నట్లు కమిటీ తెలిపింది. ఇదిలా ఉంటే.. షార్ప్లెస్కు ఇది రెండో నోబెల్ ప్రైజ్. 2001లో ఆయన రసాయన శాస్త్రంలోనే నోబెల్ అందుకున్నారు. BREAKING NEWS: The Royal Swedish Academy of Sciences has decided to award the 2022 #NobelPrize in Chemistry to Carolyn R. Bertozzi, Morten Meldal and K. Barry Sharpless “for the development of click chemistry and bioorthogonal chemistry.” pic.twitter.com/5tu6aOedy4 — The Nobel Prize (@NobelPrize) October 5, 2022 -
రసాయన శాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి విజేతలు వీరే..!
స్టాక్హోం: రసాయన శాస్త్ర విభాగంలో 2021 గాను నోబెల్ పురస్కారాన్ని రాయల్ స్వీడ్ష్ అకాడమీ బుధవారం రోజున ప్రకటించింది. జర్మనీకి చెందిన బెంజమిన్ లిస్ట్, స్కాట్లాండ్కు డేవిడ్ డబ్ల్యుసీ మెక్మిలన్కు రసాయన శాస్త్ర విభాగంలో నోబెల్ వరించింది. ‘అసమాన ఆర్గానో కటాలిసిస్’ను అభివృద్ధి చేసినందుకు గాను వీరికి నోబెల్ పురస్కారం దక్కింది. బెంజిమిన్ లిస్ట్, మెక్మిలన్ల ఆవిష్కరణతో ఫార్మాసూటికల్ పరిశోధనలపై భారీగా ప్రభావం చూపనుంది. విజేతలకు 11 లక్షల డాలర్ల ప్రైజ్మనీ దక్కనుంది. ప్రస్తుతం మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్కు బెంజమిన్ లిస్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. మెక్మిలన్ ప్రిన్స్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఉన్నారు. ఇప్పటికే గత రెండు రోజుల నుంచి రాయల్ స్వీడిష్ అకాడమీ వైద్య, భౌతిక రంగాల్లో నోబెల్ పురస్కారాలను ప్రకటించిన విషయం తెలిసిందే. BREAKING NEWS: The 2021 #NobelPrize in Chemistry has been awarded to Benjamin List and David W.C. MacMillan “for the development of asymmetric organocatalysis.” pic.twitter.com/SzTJ2Chtge — The Nobel Prize (@NobelPrize) October 6, 2021 చదవండి: భౌతిక శాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి విజేతలు వీరే..! -
రసాయనం సులభం.. గణితం కష్టం
సాక్షి, అమరావతి: ఐఐటీలు, ఎన్ఐటీలు, తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ 4వ సెషన్ తొలిరోజు పరీక్ష గురువారం ప్రశాంతంగా ముగిసింది. కంప్యూటరాధారితంగా జరిగే ఈ పరీక్షలు ఆగస్టు 27, 31, సెప్టెంబర్ 2వ తేదీల్లో జరగనున్నాయి. మొత్తం 7.5 లక్షల మంది వీటికి దరఖాస్తు చేసుకోగా ఏపీ నుంచి 70 వేల మంది వరకు ఉన్నారు. మొదటి రోజు ప్రశ్నపత్రంలోని ప్రశ్నలు గతంలో కంటే కఠినంగా ఉన్నాయని కొందరు అభ్యర్థులు, కోచింగ్ కేంద్రాల నిపుణులు అభిప్రాయపడ్డారు. రసాయన శాస్త్రం ప్రశ్నలు ఇంతకు ముందుకంటే కొంత సులువుగా ఉన్నాయన్నారు. భౌతిక శాస్త్రం ప్రశ్నలు మధ్యస్థంగా ఉండగా.. గణితం ప్రశ్నలు కష్టంగా ఉన్నాయని తెలిపారు. రసాయన శాస్త్రం ప్రశ్నల్లో.. ఆర్గానిక్, ఫిజికల్, ఇనార్గానిక్ కెమిస్ట్రీలకు సమాన ప్రాతినిధ్యం ఉందని చెప్పారు. భౌతిక శాస్త్రంలో మోడ్రన్ ఫిజిక్స్లో ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నటిజమ్, ఎలక్ట్రోమ్యాగ్నటిక్ ఇండక్షన్ వంటి అంశాల ప్రశ్నలు ఎక్కువ ఉన్నాయన్నారు. ఇంటర్ ఫస్టియర్ కంటే సెకండియర్లోని అంశాలపైనే ఎక్కువ ప్రశ్నలు ఇచ్చారని తెలిపారు. మ్యాథ్స్లో ఎక్కువ ప్రశ్నలు ఇంటర్ సెకండియర్ నుంచే ఉన్నాయని పేర్కొన్నారు. కాలిక్యులస్ బేస్డ్ ఇంటిగ్రేషన్, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్ ప్రశ్నలు చాలా కఠినంగా ఇచ్చారని చెప్పారు. -
NEET UG 2021: ర్యాంక్ సాధించే మార్గం!
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్–అండర్ గ్రాడ్యుయేట్.. సంక్షిప్తంగా.. నీట్–యూజీ! జాతీయ స్థాయిలో.. సెంట్రల్ యూనివర్సిటీలు, స్టేట్ యూనివర్సిటీలు, ఇతర అన్ని మెడికల్ ఇన్స్టిట్యూట్స్లో.. ఎంబీబీఎస్, బీడీఎస్లతోపాటు ఆయుష్ కోర్సుల్లో చేరాలంటే.. నీట్–యూజీ ఎంట్రన్స్లో స్కోరే ప్రధానం! నీట్లో సాధించిన స్కోర్ ఆధారంగానే మెడికల్ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. అందుకే.. ఇంటర్మీడియెట్ బైపీసీ అర్హతగా నిర్వహించే ఈ పరీక్షకు.. ఏటేటా పోటీ పెరుగుతోంది. నీట్–యూజీ–2021 తేదీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారికంగా ప్రకటించింది. ఆగస్ట్ 1వ తేదీన ఈ పరీక్ష జరుగుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో.. నీట్–యూజీ 2021 విధి విధానాలు.. పరీక్ష ప్యాట్రన్.. ఈ టెస్ట్లో మంచి స్కోర్ సాధించడానికి నిపుణుల సలహాలు.. ఎంబీబీఎస్, బీడీఎస్.. దేశంలో లక్షల మంది విద్యార్థుల కల. తమ డాక్టర్ కలను సాకారం చేసుకునే దిశగా.. నీట్ యూజీలో ర్యాంకు సాధిం చేందుకు ఇంటర్ తొలిరోజు నుంచే కృషి చేస్తుంటారు. ఇంతటి కీలకమైన నీట్–యూజీ –2021 తేదీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఇటీవల వెల్లడించింది. దీంతో విద్యార్థులు ఈ పరీక్షలో స్కోర్ సాధించే దిశగా కసరత్తు ముమ్మరం చేయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పొచ్చు. మొత్తం పదకొండు భాషలు నీట్–యూజీని తెలుగు సహా మొత్తం పదకొండు భాషల్లో నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పష్టం చేసింది. విద్యార్థులు దరఖాస్తు సమ యంలోనే తమకు ఆసక్తి ఉన్న భాషను ఎంచు కుంటే.. ఆ భాషలోనే పరీక్ష పేపర్ను అందిస్తారు. ఒక్కసారే.. ఆఫ్లైన్లోనే నీట్ను కూడా జేఈఈ మెయిన్ మాదిరిగానే ఒకటి కంటే ఎక్కువసార్లు నిర్వహించే అవకాశముందనే వార్తలు ఇటీవల వినిపించాయి. వీటన్నింటికీ ఫుల్స్టాప్ పెడుతూ.. గతేడాది మాదిరిగానే నీట్ ఈ ఏడాది ఒక్కసారి మాత్రమే జరుగుతుందని ఎన్టీఏ స్పష్టం చేసింది. అది కూడా ఆఫ్లైన్ విధా నంలో పెన్ పేపర్ పద్ధతిలో నిర్వహించనున్న ట్లు పేర్కొంది. దీంతో విద్యార్థులకు పరీక్ష నిర్వహణపై ఒక స్పష్టత వచ్చింది. కాబట్టి ఇప్పుడిక ఎలాంటి ఆందోళన లేకుండా.. పూర్తిగా ప్రిపరేషన్కు ఉప క్రమించాలని నిపుణులు సూచిస్తున్నారు. 180 ప్రశ్నలు.. 720 మార్కులు నీట్ యూజీకి అర్హత ఇంటర్మీడియెట్ బైపీసీ. ఈ పరీక్ష మొత్తం మూడు విభాగాల్లో 180 ప్రశ్నలకు ఆబ్జెక్టివ్ (బహుళైచ్ఛిక ప్రశ్నలు) విధానంలో జరుగుతుంది. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు చొప్పున 720 మార్కులకు నీట్ పరీక్ష ఉంటుంది. వివరాలు.. సిలబస్ కుదింపు కష్టమే కొవిడ్ కారణంగా ఇంటర్మీడియెట్, సీబీఎస్ఈ +2 స్థాయిలో సిలబస్ను తగ్గించిన సంగతి తెలిసిందే. దాంతో నీట్ సిలబస్ను కూడా కుదిస్తారా? అనే సందేహం విద్యార్థుల్లో వ్యక్తమవుతోంది. కాని నీట్ సిలబస్ గతేడాది మాదిరిగానే యథాతథంగా ఉంటుందని, ఎలాంటి మార్పులు ఉండవని కొన్ని రోజుల క్రితం కేంద్ర విద్యా శాఖ మంత్రి ట్వీట్ ద్వారా తెలిపారు. జేఈఈ–మెయిన్ మాదిరిగానే నీట్లోనూ ఛాయిస్ విధానం ఉంటుందా అనే వాదన కూడా వినిపిస్తోంది. దీనిపైనా మరో వారం రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అవగాహన ముఖ్యం నీట్–యూజీ–2021కు తేదీ వెల్లడైంది. కాబట్టి ఇప్పటి నుంచి అందుబాటులో ఉన్న సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. ఇంటర్ పరీక్షల ప్రిపరేషన్తో సమన్వయం చేసుకుంటూ.. నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు సాగాల్సి ఉంటుంది. తొలుత అభ్యర్థులు నీట్ సిలబస్పై పూర్తి స్థాయి అవగాహన తెచ్చుకోవాలి. ఆ తర్వాతే ప్రిపరేషన్కు ఉపక్రమించాలి. సిలబస్లో పేర్కొన్న దానికి అదనంగా ఇతర అంశాలను చదవాల్సిన అవసరం లేదు. నీట్, బోర్డ్ సిలబస్లో కొన్ని కామన్ టాపిక్స్ ఉంటాయి. ఆయా అంశాలను మొదట బోర్డు ఎగ్జామ్స్ కోణంలో ప్రిపేరవ్వాలి. దీనివల్ల ఎంతో విలువైన సమయం ఆదా అవుతుంది. టైమ్ ప్లాన్ కూడా ► నీట్ విద్యార్థులు ఆయా సబ్జెక్టుల ప్రిపరేషన్ కోసం ముందుగానే నిర్దిష్ట సమయ ప్రణాళికను రూపొందించుకోవాలి. దానికి కట్టుబడి ప్రిపరేషన్ సాగించాలి. ► ప్రిపరేషన్ టైమ్ టేబుల్ను తప్పనిసరిగా ఏరోజుకారోజు అనుసరించాలి. ► నీట్ సిలబస్కు అనుగుణంగా ఆయా సబ్జెక్ట్లకు కేటాయించాల్సిన సమయాన్ని నిర్దేశించుకోవాలి. ► నిర్దిష్ట సమయంలో సిలబస్ను పూర్తి చేసేలా ముందుకు కదలాలి. ► ఈ సమయంలో అభ్యర్థులంతా స్వీయ సామర్థ్యాలపై స్పష్టతతో వ్యవహరించాలి. ► ప్రతి సబ్జెక్టుకూ సమానంగా సమయం కేటాయించుకోవాలి. ► ప్రతి రోజు చదవాల్సిన టాపిక్స్ను ముందుగానే విభజించుకుని.. దానికి అనుగుణంగా అధ్యయనం చేయాలి. ► ప్రతి రోజు మాక్ టెస్టులకు హాజరవ్వాలి. ఫలితంగా స్వీయ సామర్థ్యాలపై అవగాహన వస్తుంది. ఇంకా ఏఏ సబ్జెక్ట్లలో పట్టు సాధించాలనే దానిపై స్పష్టత లభిస్తుంది. ► సబ్జెక్ట్ పరంగా బలహీనంగా ఉన్న అంశాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి. ► పరీక్షకు రెండు నెలల ముందు కొత్త చాప్టర్లు, అంశాల జోలికి వెళ్లకూడదు. ఈ సమయాన్ని పూర్తిగా రివిజన్కే కేటాయించాలి. ► మోడల్ ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్ చేయాలి. ► డైరెక్ట్ కొశ్చన్స్ కంటే ఇన్ డైరెక్ట్ కొశ్చన్స్నే ఎక్కువ అడుగుతున్న విషయాన్ని గుర్తించాలి. దీనికి అనుగుణంగా మోడల్ టెస్ట్లను వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ► ఇంటర్ పరీక్షలకు నెల రోజుల ముందు వరకు నీట్ ప్రిపరేషన్ను సమాంతరంగా కొనసాగించొచ్చు. ► ఇంటర్మీడియెట్ పరీక్షలకు నెల రోజుల ముందు నుంచి పూర్తిగా బోర్డ్ పరీక్షలకే సమయం కేటాయించాలి. ► ఇంటర్మీడియెట్ పరీక్షలు పూర్తయ్యాక.. తిరిగి నీట్కు పూర్తిస్థాయిలో ప్రిపరేషన్ సాగించాలి. ► ప్రిపరేషన్ సమయంలోనే షార్ట్ నోట్స్ రూపొందించుకోవాలి. ఇది రివిజన్కు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. సబ్జెక్టుల వారీగా నిపుణుల ప్రిపరేషన్ టిప్స్ ఫిజిక్స్.. ఈ టాపిక్స్ ప్రధానం నీట్ ఫిజిక్స్ విభాగంలో మంచి స్కోర్ సాధించాలంటే.. ఆప్టిక్స్, మెకానిక్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, మోడరన్ ఫిజిక్స్ చాప్టర్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో అధ్యాయానికి చివర ఇచ్చిన ప్రశ్నలను సాధించాలి. అవకలనం, సమాకలనం అనువర్తనాలపై పట్టు సాధించాలి. ఇంటర్ రెండేళ్ల పాఠ్యాంశాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. పైన పేర్కొన్న చాప్టర్లతోపాటు మిగిలిన సిలబస్ అంశాలను అధ్యయనం చేయాలి. గత రెండేళ్ల ప్రశ్నల సరళిని పరిశీలిస్తే.. రొటేషనల్ డైనమిక్స్, సిగ్మా పార్టికల్స్పై ఎక్కువగా దృష్టిపెట్టాలని అర్థం అవుతోంది. అదేవిధంగా ఎలక్ట్రోమ్యాగ్నటిజం, ఇండక్షన్, కరెంట్ ఎలక్ట్రిసిటీ వంటి చాప్టర్లు విద్యార్థులకు అంత త్వరగా ఎక్కవు. వీటిని చదవడంతోపాటు ప్రాక్టీస్కు ప్రాధాన్యం ఇవ్వాలని గుర్తించాలి. - ఎన్.నరసింహమూర్తి, సబ్జెక్ట్ నిపుణులు కెమిస్ట్రీ.. పునశ్చరణ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, మోల్ కాన్సెప్ట్, కెమికల్ బాండింగ్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కోఆర్డినేషన్ కాంపౌండ్, ఈక్విలిబ్రియమ్, పాలిమర్లు, బయో మాలిక్యూల్స్, పరమాణు నిర్మాణం, సాలిడ్ స్టేట్, ద్రావణాలు, సర్ఫేజ్ కెమిస్ట్రీ తదితరాలను కెమిస్ట్రీలో కీలక పాఠ్యాంశాలుగా పేర్కొవచ్చు. ఆర్గానిక్ కెమిస్ట్రీలో.. ఐసోమెరిసమ్, సమ్మేళనాల తయారీ, ధర్మాలపై ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి. కెమిస్ట్రీలో విద్యార్థులు చర్యలు, సమీకరణాలను మర్చిపోతుంటారు. కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు పునఃశ్చరణ చేయాలి. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో.. వివిధ మూలకాలు, వాటి సమ్మేళనాల ధర్మాలను అధ్యయనం చేయాలి. కెమిస్ట్రీలో.. ఫిజికల్, ఆర్గానిక్, ఇనార్గానిక్ కెమిస్ట్రీలను వాటి వాటి స్వభావాల ఆధారంగా ప్రిపేరవ్వాలి. ఫిజికల్ కెమిస్ట్రీ విషయానికొస్తే... ఇందులో ఫార్ములాలతో సొంత నోట్స్ రూపొందిం చుకోవాలి. ఫలితంగా ఫార్ములాను అన్వయించే నైపుణ్యాలు సొంతమవుతాయి. పీరియాడిక్ టేబుల్పై పట్టు సాధిస్తే.. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మంచి మార్కులు సాధించొచ్చు. పునశ్చరణ చేస్తూ, మాదిరి ప్రశ్నలు సాధించడం ద్వారా.. పరీక్షకు కావల్సిన సన్నద్ధత లభిస్తుంది. - విజయ్ కిశోర్, కెమిస్ట్రీ సబ్జెక్ట్ నిపుణులు బయాలజీ.. కాన్సెప్ట్లపై పట్టు నీట్–యూజీ పరీక్షలో కీలకంగా భావించే విభాగంగా బయాలజీని పేర్కొనొచ్చు. ఇంటర్ బైపీసీ విద్యార్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీ కంటే బయాలజీపై ఎక్కువ పట్టు కలిగి ఉంటారు. నీట్ బయాలజీలో రాణించాలంటే.. ఫిజియాలజీ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, మార్ఫాలజీ, జెనిటిక్స్ అండ్ ఎవల్యూషన్, సెల్ బయాలజీ, బయోటెక్నాలజీ, హ్యూమన్ ఫిజియాలజీ, డైవర్సిటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్లను ముఖ్య చాప్టర్లుగా భావించి చదవాలి. అన్ని అంశాలకు సంబంధించి కాన్సెప్ట్ట్లపై పట్టు సాధించాలి. ఎకాలజీలో ఆర్గనైజేషన్స్ అండ్ పాపులేషన్, ఎకోసిస్టమ్పై ప్రశ్నలు వస్తున్నాయి. వీటితోపాటు బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ పాఠ్యాంశాలపై ఫోకస్ చేయడం లాభిస్తుంది. ప్లాంట్ ఫిజియాలజీలో.. ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, మొక్కల హార్మోనులు, ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్, మినరల్ న్యూట్రిషన్ చాప్టర్లను ప్రిపేరవ్వాలి. సెల్ స్ట్రక్చర్స్ అండ్ ఫంక్షన్స్లో కణ విభజన(సమ విభజన, క్షయకరణ విభజన)లోని వివిధ దశల్లో జరిగే మార్పులు, కణచక్రం తదితరాలను అధ్యయనం చేయాలి. బయోమాలిక్యూల్స్ నుంచి కంటెంట్ సంబంధిత ప్రశ్నలు వస్తాయి. రీప్రొడక్షన్ నుంచి దాదాపు 10 ప్రశ్నల వరకు అడుగుతున్నారు. మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థను బాగా అధ్యయనం చేయాలి. మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటన్స్లో రెప్లికేషన్, ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్, రెగ్యులేషన్లపై దృష్టిపెట్టాలి. నీట్లో ఇంటర్ సిలబస్లో లేని అంశాలను గుర్తించి.. వాటికోసం ప్రత్యేక సమయం కేటాయించాలి. - బి.రాజేంద్ర, బోటనీ సబ్జెక్ట్ నిపుణులు జువాలజీలో ఇలా జువాలజీలో గత రెండేళ్ల ప్రశ్న పత్రాలను పరిగణనలోకి తీసుకుంటే.. మొత్తం 45 ప్రశ్నల్లో హ్యూమన్ ఫిజియాలజీ నుంచి 14, ఎకాలజీ నుంచి 10–12, జెనిటిక్స్, ఎవల్యూషన్ కలిపి 6 ప్రశ్నలు వరకు వస్తున్నాయి. కాబట్టి విద్యార్థులు ఆయా పాఠ్యాంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఎన్సీఈఆర్టీతోపాటు ఇంటర్ పుస్తకాల నుంచీ ప్రశ్నలు అడుగుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని గత ప్రశ్న పత్రాలను, ఇంటర్లో ఆయా చాప్టర్స్ చివరలో అడిగే ప్రశ్నలను సాధన చేయాలి. ఎన్సీఈఆర్టీ, ఇంటర్ పుస్తకాలను క్షుణ్నంగా చదవాలి. ఇలా చేస్తే ఆశించిన ర్యాంకు సొంతమవడం ఖాయం. - కె.శ్రీనివాస్, జువాలజీ సబ్జెక్ట్ నిపుణులు అనలిటికల్ అప్రోచ్తో ఎంతో మేలు నీట్ ప్రిపరేషన్ క్రమంలో అనలిటికల్ అప్రోచ్తో సాగితే..ఎలాంటి ప్రశ్నలకైనా సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది. ప్రతి రోజు తాము చదివిన అంశాలతో షార్ట్ నోట్స్ రూపొందించుకోవడం, ఇన్స్టిట్యూట్లు నిర్వహించే వీక్లీ టెస్ట్లు, మోడల్ టెస్ట్లకు హాజరు కావడం కూడా ఎంతో మేలు చేస్తుంది. – అనంత పరాక్రమ్ భార్గవ్, నీట్–2020 11వ ర్యాంకు నీట్–యూజీ(2021) సమాచారం ► నీట్ పరీక్ష తేదీ: ఆగస్ట్ 1, 2021 ► పరీక్ష వ్యవధి: మూడు గంటలు(పెన్, పేపర్ విధానంలో) ► అర్హత: బైపీసీ గ్రూప్తో ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సులు ఉత్తీర్ణులై ఉండాలి. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ► నీట్కు బైపీసీతో ఉత్తీర్ణత అని పేర్కొన్నప్పటికీ.. ప్రవేశాల సమయంలో కొన్ని ఇన్స్టిట్యూట్లు బైపీసీ గ్రూప్ సబ్జెక్ట్లలో 50 శాతం మార్కులు పొంది ఉండాలనే నిబంధన విధిస్తున్నాయి. ► వయో పరిమితి: కనిష్ట వయోపరిమితి 17 ఏళ్లు, గరిష్ట వయో పరిమితి 25 ఏళ్లు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ► పూర్తి నోటిఫికేషన్ ఏప్రిల్ మొదటి వారంలో వెల్లడయ్యే అవకాశం ఉంది. ► పూర్తి వివరాలకు వెబ్సైట్స్: https://ntaneet.nic.in, https://nta.ac.in -
రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్
-
రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్
రసాయన శాస్త్రంలో విశేష సేవలందించిన ముగ్గురికి నోబెల్ బహుమతి వరించింది. 2019 ఏడాదికిగానూ గత రెండురోజుల్లో వైద్య, భౌతికశాస్త్రాల్లో నోబెల్ విజేతలను ప్రకటించిన పురస్కార కమిటీ.. తాజాగా రసాయన శాస్త్రంలో గ్రహీతల పేర్లను వెల్లడించింది. జాన్ బి.గూడెనఫ్, స్టాన్లీ విట్టింగమ్, అకిరా యోషినోకు ఈ అవార్డ్ను సంయుక్తంగా అందజేయనున్నట్లు ప్రకటించింది. లిథియం ఆయాన్ బ్యాటరీ అభివృద్ధికి చేసిన విశేష పరిశోధనలకు వారికి ఈ పురస్కారం లభించింది. వీరు అభివృద్ధి చేసిన లిథియం ఆయాన్ బ్యాటరీలు పోర్టబుల్ టెక్నాలజీ విప్లవానికి కారణమయ్యాయి. -
ఎన్నికల లెక్కలపై కెమిస్ట్రీ గెలుపు
వారణాసి/ న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఏకపక్ష విజయం కట్టబెట్టేలా ఎన్నికల గణితం (అర్థమెటిక్)పై కెమిస్ట్రీ గెలుపు సాధించిందని ప్రధాని మోదీ అన్నారు. ‘ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే గణాంకాలన్నిటినీ మించిన కెమిస్ట్రీ (రసాయన శాస్త్రం) ఒకటి ఉందనే విషయం అర్ధమవుతుంది. ఈసారి ఎన్నికల్లో ఆ కెమిస్ట్రీయే గణాంకాలపై విజయం సాధించింది’ అని మోదీ వివరించారు. ‘నేను దేశానికి ప్రధానమంత్రిని. కానీ మీకు ఎంపీని. మీ సేవకుడిని’ అని ప్రధాని అన్నారు. పార్టీ కార్యకర్తలు ఎన్నికల పరీక్షను డిస్టింక్షన్తో ఉత్తీర్ణులయ్యారన్నారు. వరసగా రెండో సారి తనను గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలియ జేసేందుకు సోమవారం ఆయన వారణాసి సందర్శించారు. కాశీ విశ్వనాథుని ఆలయంలో పూజలుచేశారు. బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. అంతకుముందు రోడ్ షోను తలపిస్తూ నగరంలోని పలు వీధుల గుండా భారీ బందోబస్తు మధ్య ఆయన వాహనశ్రేణి ముందుకుసాగింది. ఈ సందర్భంగా ప్రజలు రోడ్లపై బారులు తీరి నిలబడ్డారు. దాబాలపై నుంచి గులాబీ రేకులు విసిరారు. అదో దురభిప్రాయం కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. బీజేపీ హిందీ రాష్ట్రాలకు పరిమితమైన పార్టీ అనేది ఒక దురభిప్రాయంగా మోదీ కొట్టిపారేశారు. లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పార్టీ సాధించిన విజయాలే అందుకు నిదర్శనమన్నారు. రాజకీయ పండితులు బీజేపీని ఇప్పటికీ హిందీ రాష్ట్రాలకు పరిమితమైన పార్టీగా పరిగణించడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వారి ఆలోచనా విధానం, తార్కికత 20వ శతాబ్దానిదనే విషయం వారికి తెలియదన్నారు. బీజేపీ ఓట్ల శాతం పెరగని ప్రాంతమే దేశంలో లేదన్నారు. ‘అసోంలో మన ప్రభుత్వం ఉంది. లడఖ్లో గెలుస్తున్నాం. అయినా రాజకీయ పండితులు మనవి హిందీ ప్రాంత రాజకీయాలంటారు. ఈ విధంగా ఒక తప్పుడు అభిప్రాయాన్ని సృష్టించారు’ అని మోదీ చెప్పారు. అబద్ధాలు, తప్పుడు తార్కికతతో ఈ తప్పుడు అభిప్రాయాన్ని సృష్టించారన్నారు. ‘ఇలాంటి తప్పుడు అవగాహన కారణంగానే ప్రజలు మనతో ఉండేందుకు ఇష్టపడరు. కానీ పారదర్శకత, కఠోర శ్రమతో అలాంటి తప్పుడు, చెడు అవగాహన కల్పించేవారిని ఓడించవచ్చు’ అని అన్నారు. రాజకీయ అస్పృశ్యత పెరుగుతోంది.. బీజేపీ రాజకీయ అస్పృశ్యత, రాజకీయ హింస వంటి ముప్పులను ఎలా ఎదుర్కొందో మోదీ చెప్పారు. ‘కేరళ, కశ్మీర్, బెంగాల్ లేదా త్రిపురలకు సంబంధించిన కేసులు చూడండి. త్రిపురలో కార్యకర్తలను ఉరి తీశారు. బెంగాల్లో హత్యలు కొనసాగుతున్నాయి. కేరళలో కూడా. నాకు తెలిసి దేశంలో ఒకేఒక్క రాజకీయ పార్టీ హత్యలకు గురయ్యింది. హింసను చట్టబద్ధం చేశారు. ఇది మన ముందున్న ఒక ప్రమాదం’ అని చెప్పారు. ‘ అంబేడ్కర్, గాంధీజీ అస్పృశ్యతను రూపుమాపారు. కానీ దురదృష్టవశాత్తూ రాజకీయ అస్పృశ్యత పెరుగుతోంది. బీజేపీ కార్యకర్తలు హత్యకు గురవుతున్నారు’ అని అన్నారు. ఉత్తరప్రదేశ్లోని అమేథీలో బీజేపీ నేత హత్య, బెంగాల్లో కార్యకర్త కాల్చివేతలను ప్రస్తావిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి విద్వేషపూరిత వాతావరణంలో కూడా బీజేపీ.. ‘అందిరితో, అందరి వికాసం కోసం..’ అనే నినాదానికే కట్టుబడి ఉందని చెప్పారు. మిగతా పార్టీల్లాగా బీజేపీ ప్రజాస్వామ్యాన్ని భ్రష్టుపట్టించిన ఓటు బ్యాంకు రాజకీయాలకు తలొగ్గదని చెప్పారు. తనకు వ్యతిరేకంగా పోరాడిన తన ప్రత్యర్థులకు కూడా తాను రుణపడి ఉంటానన్నారు. ప్రజాస్వామ్యంలో విపక్షం ప్రాధాన్యతను ప్రధాని నొక్కిచెప్పారు. ఇతరులు అధికారంలోకి వస్తే ప్రతిపక్ష ఛాయలే ఉండవన్నారు. ‘కానీ త్రిపురలో చూడండి. ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం. అదే సమయంలో మంచి విపక్షం ఉంది. ఇదీ ప్రజాస్వామ్య స్ఫూర్తి’ అని అన్నారు. ప్రభుత్వానికి, పార్టీకీ మధ్య ఉండాల్సిన సమన్వయాన్ని కూడా ఆయన వివరించారు. ప్రభుత్వం విధానాలు రూపొందిస్తే, పార్టీ వ్యూహాలకు రూపకల్పన చేస్తుందన్నారు. ప్రభుత్వం, పార్టీ వ్యవస్థల మధ్య ఉండే సమన్వయం ఒక గొప్ప శక్తిలాంటిదని, బీజేపీ ఈ విషయం తెలుసుకుందని మోదీ అన్నారు. శ్రమ, శ్రామికులు అద్భుతాలు సృష్టిస్తాయన్నారు. తన గెలుపునకు ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించిన కిందిస్థాయి కార్యకర్తలే కారణమన్నారు. కార్యకర్తల కఠోరశ్రమకు, అంకిత భావానికి మోదీ కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు అమిత్ షా మాట్లాడుతూ.. మోదీ అభివృద్ధి అంటే ఏమిటో కొద్దిగానే చూపించారని, వచ్చే ఐదేళ్లలో కాశీ అత్యద్భుతమైన నగరంగా మారుతుందని చెప్పారు. నెహ్రూకి నివాళి భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ దేశానికి చేసిన సేవలను మోదీ కొనియాడారు. నెహ్రూ 55వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ ప్రధాని ట్వీట్ చేశారు. ‘పండిట్ జవహర్లాల్ నెహ్రూజీకి నివాళులు. జాతి నిర్మాణానికి, దేశానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం..’ అని పేర్కొన్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, పలువురు బీజేపీ నేతలు నెహ్రూకి నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు. -
ఈసారి కెమిస్ర్టీ వర్కవుట్ అయింది : మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం తన నియోజకవర్గ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపేందుకు వారణాసిలో పర్యటించారు. కాశీ విశ్వనాధుని దర్శించుకుని పూజలు చేసిన అనంతరం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. లోక్సభ ఎన్నికల్లో ఈసారి అంకెల కంటే కెమిస్ర్టీ (భావోద్వేగాలు)యే పనిచేసిందని ప్రధాని పేర్కొన్నారు. బీజేపీని హిందీ రాష్ట్రాల్లో ప్రాబల్యం కలిగిన పార్టీగా రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారని మోదీ వ్యాఖ్యానించారు. కర్ణాటకలో తాము అత్యధిక స్ధానాలను గెలుచుకున్నామని, గోవా సహా ఈశాన్య రాష్ట్రాల్లో ప్రభుత్వాలు నడుపుతున్నామని అయినా తమ పార్టీ హిందీ బెల్ట్కే పరిమితమా అని ఆయన ప్రశ్నించారు. అసోం వంటి ఈశాన్య రాష్ట్రాలన్నింటిలో బీజేపీ ప్రభుత్వాలు లేదా తమ సారథ్యంలోని కూటమి ప్రభుత్వాలు నడుస్తున్న క్రమంలో బీజేపీని కేవలం హిందీ రాష్ట్రాల పార్టీగా పరిగణించడం పట్ల మోదీ ఆక్షేపించారు. -
డార్లింగ్ గారు
అది 1979 సంవత్సరం. నాకు హైదరాబాద్ నేరేడ్మెట్లోని గవర్నమెంట్ టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో సీటు వచ్చింది. ఇన్స్టిట్యూట్కు దగ్గరలో ఒక రూమ్ అద్దెకు తీసుకున్నాను. మిగిలిన రెండు గదుల్లో తెలంగాణ ప్రాంత విద్యార్థులు ఉన్నారు.ప్రతిరోజూ ఉదయం బావి దగ్గర అంట్ల గిన్నెలు కడుక్కోవడానికి వెళ్లినప్పుడు మిగిలిన అన్నం ఒక కుక్కకు వేసేవాడిని. అన్నం తిన్న తర్వాత కిందకు వెళ్లకుండా ఆ కుక్క గడప దగ్గరే పడుకునేది.‘ఛాయ్.... ఛాయ్’ అని దాన్ని తోలేవాడిని.నేను ‘ఛాయ్... ఛాయ్’ అని అరిచినప్పుడల్లా పక్క రూమ్ మిత్రులు నవ్వేవాళ్లు.ఎందుకంటే వాళ్లు ‘హడీ.... హడీ’ అని కుక్కను తోలేవాళ్లు.నేను ఆ కుక్కకు ప్రతిరోజూ అన్నం వేయడాన్ని గమనించిన పక్కరూమ్ మిత్రులు కుక్క పైకి రాగానే ‘నీ డార్లింగ్ వచ్చింది’ అనేవాళ్లు.కొన్ని నెలల తర్వాత కుక్క కడుపు లావుగా కనిపించింది.అది గర్భవతని, పిల్లల్నికంటుందని చెప్పాడు ఫ్రెండ్. అప్పటి నుండి నేను దానికి ఎక్కువ అన్నం పెట్టేవాడిని. ఒకసారి కాలేజీకి వారం రోజులు సెలవులు ఇచ్చారు. అప్పుడు నేను మా ఇంటికి వచ్చేశాను. నేనుఇంటికి వచ్చేసిన మరుసటి రోజే కుక్కకు నాలుగు పిల్లలు పుట్టాయి.ఈలోపు మిత్రులు ఒక లెటర్ రాశారు. అందులో ఇలా ఉంది...‘మీ డార్లింగ్ ప్రసవించింది.తల్లీ పిల్లలూ బాగున్నారు. డార్లింగ్ మీ కోసం ఎదురుచూస్తుంది’వాళ్లు లెటర్ రాసిన సంగతి, అది మా ఇంట్లో వాళ్లు చదివిన సంగతి నాకు తెలియదు. ఎందుకంటే ఆ లెటర్ అందిన రోజు నేను∙ఇంటి దగ్గర లేను.లెటర్ చదివి మా ఇంట్లో వాళ్లు ఏవేవో ఊహించుకున్నారు.‘డార్లింగ్ ఎవరు?’ ‘ఆమె నీకు ఎలా పరిచయం?’‘మాకు తెలియకుండా పెళ్లి ఏమైనా చేసుకున్నావా?’‘ఈ ఉత్తరం రాసింది ఎవరు? ఆ అమ్మాయి వైపు వాళ్లా?’‘చదువుకోవడానికి వెళ్లావా? సీక్రెట్గా మ్యారేజ్ చేసుకొని పిల్లల్ని కనడానికి వెళ్లావా?’ఇలా ఒకటా రెండా...ఎన్ని ప్రశ్నలు. ఎన్ని డౌట్లు. ఎన్ని ఎత్తి పొడుపులు!వీళ్లేమంటున్నారో కొద్దిసేపటి వరకు నాకు అర్థం కాలేదు. ఆ తరువాత అనుకున్నాను...‘అసలు విషయం చెప్పకుండా కొద్దిసేపు సస్పెన్స్లో ఉంచాలి’ అని.‘ఆమె సంగతి మీకెలా తెలుసు! ఎవరు చెప్పారు?’ అన్నాను.‘‘ఏదో ఒక విధంగా తెలిసిందిలేగాని అసలు సంగతి చెప్పు’’ అన్నారు.‘‘ఆమె నీతో పాటే చదువుతుందా?’’ అని అడిగారు.నాకేమో నవ్వు వస్తుంది.బలవంతంగా నవ్వు ఆపుకొని...‘‘అవును’’ అన్నాను.‘‘నీ రూమ్లో ఉంటుందా?’’ అని అడిగితే...‘‘ఉండదు. రోజూ వచ్చిపోతుంది’’ అన్నాను.‘‘పెళ్లి చేసుకున్నావా?’’ అని కోపంగా అడిగితే...‘లేదు’’ అని కూల్గా చెప్పాను.‘‘పెళ్లికాని పిల్ల రోజూ నీ రూమ్కు వచ్చిపోవడం ఏమిటి? పిల్లల్ని కనడం ఏమిటి?’’ అన్నారు సీరియస్గా.ఇలా కొద్దిసేపు ప్రశ్నలు–జవాబులు కార్యక్రమం తరువాత అసలు విషయం చెప్పాను. అంతే.... అందరూ ఒకటే నవ్వడం!! నవ్వుల కెమిస్ట్రీ! అవి మేము నాగార్జున యూనివర్శిటీలో పీజీ చేస్తున్న రోజులు. ఒకసారి కెమిస్ట్రీ ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్ విడివిడిగా చేయాల్సి వచ్చింది. బర్నరు వెలిగించి ఎక్స్పెరిమెంట్ మొదలు పెట్టాం. ఆరుగంటలు నిల్చొని ఎక్స్పెరిమెంట్ చేయడం కష్టమే కదా... శ్రమను మరిచిపోవడానికన్నట్లు పిచ్చాపాటి మొదలుపెట్టాం. ఎక్స్పెరిమెంట్ మాటేమిటోగానీ...ఒకటే జోక్లు... నవ్వులు! ప్రయోగం కంటే ముచ్చట్లే ప్రధానమయ్యాయి.ఎవరో తలుపు దబదబమని బాదుతున్నారు.నవ్వుల శబ్దానికి ఆ చప్పుడు వినిపించలేదు.తరువాత ఆ చప్పుడు విని తలుపు కొద్దిగా తీసి ‘కమ్ ఇన్’ అన్నది మా ఫ్రెండ్.అంతే, మా మాష్టారు బాణంలా దూసుకొచ్చారు. అందరం బిక్కచచ్చిపోయాం!‘‘తలుపులు వేసి ఎక్స్పెరిమెంట్ చేస్తే.... ఏదైనా అంటుకుంటే చస్తారు ’’ అని పెద్దగా అరిచారు. కొన్ని నిమిషాల పాటు అందరం భయంగా, సీరియస్గా ముఖాలు పెట్టాం. ఆయన అటు వెళ్లాడో లేదో షరామామూలుగా ముచ్చట్లే ముచ్చట్లు, నవ్వులే నవ్వులు! – డి.వి.తులసి, విజయవాడ – నక్కా రాజశేఖర్, కఠెవరం, తెనాలి మండలం, గుంటూరు జిల్లా. -
పరిణామ సిద్ధాంత అన్వయానికి నోబెల్
స్టాక్హోం: జీవ పరిణామ సిద్ధాంతం ఆధారంగా పరిశోధనలు సాగించిన ముగ్గురికి ఈ ఏడాది రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి దక్కింది. ఫ్రాన్సిస్ ఆర్నాల్డ్(అమెరికా), జార్జ్ స్మిత్(అమెరికా), గ్రెగరీ వింటర్(బ్రిటన్)లు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. జీవ ఇంధనాల నుంచి ఔషధాల వరకు మానవాళికి ఉపయోగపడే పదార్థాల తయారీకి దోహదపడే ఎంజైమ్లను వీరు జీవ పరిణామ సిద్ధాంతం ప్రాతిపదికగా సృష్టించారు. రసాయన శాస్త్రంలో నోబెల్ పొందిన 5వ మహిళగా ఫ్రాన్సిస్ ఆర్నాల్డ్ గుర్తింపు పొందారు. సుమారు రూ.7.40 కోట్ల ప్రైజ్మనీని ఆర్నాల్డ్ సగం..స్మిత్, వింటర్లు మిగతా సగాన్ని పంచుకోనున్నారు. ‘నోబెల్ గ్రహీతలు డార్విన్ సిద్ధాంతాన్ని మానవాళికి గొప్ప మేలుచేసే కార్యసాధనకు ఉపయోగించారు’ అని స్వీడిష్ రాయల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కొనియాడింది. ‘వారు డార్విన్ సూత్రాలను ప్రయోగశాలలో అమలుపరిచారు. వేయి రెట్ల వేగంతో జీవ పరిణామ క్రమాన్ని ప్రదర్శించి కొత్త ప్రొటీన్లను సృష్టించారు’ అని నోబెల్ కెమిస్ట్రీ కమిటీ చీఫ్ క్లాయిస్ గుస్తాఫసన్ వ్యాఖ్యానించారు. పరిణామవాదం.. శక్తిమంత ఇంజనీరింగ్ జీవ పరిణామ క్రమాన్ని అనుకరిస్తూ ఆర్నాల్డ్ డీఎన్ఏ విన్యాసంలో మార్పులు చేశారు. దీని వల్ల విషపూరిత శిలాజ ఇంధనాలకు మెరుగైన, పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలు కనుగొనేందుకు వీలు కలిగింది. ఫలితంగా, చెరకు నుంచి జీవ ఇంధనాలను ఉత్పత్తిచేస్తు న్నారు. శీతల వాతావరణంలోనూ మెరుగ్గా పనిచేసే డిటర్జెంట్ల తయారీకి కూడా ఆమె పరిశోధన దోహదపడింది. ‘ఈ భూమ్మీద అత్యంత క్లిష్టమైన, అద్భుతమైన వస్తువులను పరిణామ సిద్ధాంతం సృష్టించింది. ఎలా తయారుచేయాలో ఎవరికీ తెలియని విషయా లను కూడా దీని ద్వారా నిజం చేయొచ్చు. ఈ ప్రపంచంలో పరిణామ క్రమం అనేది అత్యంత శక్తిమంతమైన ఇంజినీరింగ్ పద్ధతి. గ్యాసోలిన్ ఉత్పత్తికి భూమి నుంచి ఇంధనాన్ని తోడాల్సిన పనిలేదు. మొక్కల్లో నిల్వ ఉండే సూర్యరశ్మి చాలు’ అని ఆర్నాల్డ్ ఓ సందర్భంలో చెప్పారు. కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కెమికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఆర్నాల్డ్ (67) కేన్సర్ వ్యాధితో పోరాడి బయటపడ్డారు. బ్యాక్టీరియాపై దాడిచేసే వైరస్తో కొత్త ప్రొటీన్లు తయారుచేయొచ్చని స్మిత్, వింటర్ రుజువుచేశారు. వీరి ప్రయోగాల ఫలితంగా కీళ్ల నొప్పులు, సోరియాసిస్, పేగు వాతం తదితర వ్యాధులకు ఔషధాలు కనుగొన్నారు. స్మిత్ ఎంఆర్సీ మాలిక్యులర్ బయోలజీ లేబొరేటరీలో పరిశోధకులుగా పనిచేస్తున్నారు. -
తనంతటివాడు
అతను ఒక నిరుపేద కుటుంబంలో పుట్టాడు. సైన్స్ అంటే ఇష్టం. ఒక రోజున ప్రఖ్యాత శాస్త్రవేత్త సర్ హెమ్ప్రీ డేవీ ఉపన్యాసం వినేందుకు వెళ్లాడు. డేవీని కలిశాడు. ‘మీ ప్రయోగశాలలో ఏదయినా ఉద్యోగం ఇస్తే జీవితాంతం మీకు రుణపడి ఉంటాను’ అన్నాడు. డేవీ అతని ఉబలాటాన్ని గమనించి, తన ప్రయోగశాలలో చేర్చుకున్నాడు. ఒకరోజు రాత్రి డేవీ తన ల్యాబ్లో ఏదో ద్రావణాన్ని తయారు చేస్తున్నాడు. ఇంతలో ఆయనకు అత్యవసరంగా బయటకు వెళ్లవలసిన పని పడింది. దాంతో ఆయన ‘నేను ఈ ద్రావణంతో కొత్త ప్రయోగం చేయబోతున్నాను. అందుకు దీన్ని చేతితో కదుపుతూ ఉండాలి. నీవు దీనిని నేను వచ్చేంతవరకూ కదుపుతూ ఉండు. నేను త్వరగానే వస్తా’ అని చెప్పి బయటికి వెళ్లాడు. ఆ కుర్రాడు ఆ ద్రావణాన్ని కదిపే పని ప్రారంభించాడు. అలా గంటలు గడిచిపోతున్నా, విసుగూ విరామం లేకుండా అతను ఆ ద్రావణాన్ని కదుపుతూనే ఉన్నాడు. తెల్లవారుతుండగా వచ్చాడు డేవీ. ఏకాగ్రతతో తన పనిలో ఏమాత్రం లోటు రానివ్వకుండా ఆ ద్రావణాన్ని కదుపుతూనే ఉన్న తన యువ శిష్యుణ్ణి చూసి ఆశ్చర్యపోయాడు. ఆజ్ఞాపాలన, ఉత్సాహం గల ఈ కుర్రాడు పెద్దయ్యాక ఎంతో ఎత్తుకు ఎదుగుతాడని గ్రహించి, మరింత వాత్సల్యంతో అతనికి పాఠాలు చెబుతూ, తనంతటివాడిగా తయారు చేశాడు. డేవీ అంచనా వమ్ము కాలేదు. ఆ కుర్రాడు అనతికాలంలోనే డైనమో ద్వారా కరెంట్ను ఉత్పత్తి చేయగలిగాడు. రసాయన శాస్త్రంలో, భౌతిక శాస్త్రంలో ఎన్నో ప్రయోగాలు, పరిశోధనలు చేసి, చిరస్మరణీయుడయ్యాడు. అతనే మైఖేల్ ఫారడే. – డి.వి.ఆర్. -
‘జేఈఈలో కెమిస్ట్రీ, మ్యాథ్స్ కఠినం’
సాక్షి, హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో కెమిస్ట్రీ పేపర్–1, మాథ్స్ పేపర్–2లు కఠినంగా ఉన్నాయని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. ఆదివారం జరిగిన పరీక్షలో పేపర్–1 ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగింది. ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీలతో పోలిస్తే మాథ్స్ కాస్త సులువుగా ఉందంటున్నారు. ఫిజిక్స్లో ప్రశ్నలు మధ్యస్థంగా ఉండగా, కెమిస్ట్రీ ప్రశ్నలు కఠినంగా ఉన్నాయంటున్నారు. మధ్యాహ్నం జరిగిన పేపర్–2లో మాథ్స్ ప్రశ్నలు కఠినంగా, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రశ్నలు మధ్యస్థంగా ఉన్నాయంటున్నారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష కీ ని ఈ నెల 29 నుంచి అందుబాటులో ఉంచుతామని ఐఐటీ కాన్పూర్ తెలిపింది. ఫలితాలు వచ్చేనెల 10న ప్రకటిస్తామని పేర్కొంది. -
నోబెల్ గ్రహీతకు ఎంత కష్టం..!
చికాగో : నోబెల్ పురస్కార గ్రహీత, ప్రఖ్యాత రసాయన శాస్త్రవేత్త ఐయిచి నెగిషి రోడ్డు ప్రమాదానికి గురై సాయం కోసం రోడ్డుపై అర్థించాల్సిన బాధకరమైన పరిస్థితి ఏర్పడింది. రోడ్డు ప్రమాదంలో ఆయన భార్య సుమైరా నెగిషి(80) దుర్మరణం చెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన గంటలపాటు సాయం కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. ఈ ఘటన అమెరికాలోని ఇల్లినాయిస్లో చోటు చేసుకుంది. సోమవారం ఇంటి నుంచి కారులో బయలుదేరిన నెగిషి దంపతులు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రమాదం అనంతరం ఇంటి నుంచి దాదాపు 320 కిలోమీటర్ల దూరంలో నెగిషి దంపతులను గుర్తించారు. కారు అదుపుతప్పి గుంతలోకి పడిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. సోమవారం విమానాశ్రయానికి బయలుదేరిన నెగిషి దంపతుల ఆచూకీ తెలియకుండా పోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు వృద్ధుడైన నెగిషి గాయాలతో సహాయం కోసం అర్థిస్తూ రోడ్డుపై అటూ ఇటూ తిరుగుతూ కనిపించారు. దీంతో పోలీసులు ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. నెగిషి కనిపించిన ప్రదేశానికి సమీపంలోని ఓ గుంతలో వారి కారు పడిపోయి ఉంది. జపాన్కు చెందిన నెగిషి 1960లో స్కాలర్షిప్పై అమెరికాకు వచ్చారు. ఇండియానాలోని పుర్డ్యూ విశ్వవిద్యాలయంలో రసాయన శాస్త్ర ప్రొఫెసర్గా పని చేస్తున్నారు. కెమిస్ట్రీలో ఆయన చేసిన పరిశోధనలకు గానూ 2010లో ప్రఖ్యాత నోబెల్ బహుమతి ఆయన్ను వరించింది. -
భవిష్యత్ రసాయన శాస్త్రానిదే
భానుగుడి (కాకినాడ) : భవిష్యత్ అంతా రసాయన శాస్రా్తనిదేనని, ఔషధాల వినియోగం దగ్గర్నుంచి, పర్యావరణ విజ్ఞానం వరకూ అన్నీ ఈ శాస్త్రంతో ముడిపడి ఉందని పలువురు రసాయన శాస్త్రవేత్తలు అన్నారు. పీఆర్జీ డిగ్రీ కళాశాలలో మంగళవారం రెండు రోజుల సదస్సు ప్రారంభమైంది. తొలిరోజు ‘రసాయన, ఔషధ, పర్యావరణ విజ్ఞాన శాస్రా్తల సాంకేతిక అంశాల్లోని పరిశోధనలు’ అంశంపై సదస్సు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ చప్పిడి కృష్ణ సదస్సుకు అధ్య క్షత వహించారు. భట్నాగర్ అవార్డు గ్రహీత, హైదరాబాద్ వర్సిటీ మాజీ వీసీ, కర్బన రసాయన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.పెరియస్వామి మాట్లాడుతూ కర్బన లోహ సమ్మేళన, సంశ్లేషణ అనువర్తనాలను విశ్లేషించారు. తీరంలో ఔషధాల వెలికితీత, నీటి నుంచి ఫ్లోరి¯ŒS తొలగింపు అంశాలపై చేసిన పరిశోధనలను ఏయూ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ వైఎల్ఎ¯ŒS మూర్తి సమర్పించారు. హోప్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ సిలాజ్ చార్లెస్, ప్రొఫెసర్ మాచిరాజు, వెంకీ ఫార్మా డైరెక్టర్ శివరామ కృష్ణ, ఉస్మానియా ప్రొఫెసర్ శారద, సల్గ పరి«శోధన అధిపతి డాక్టర్ ఎస్ఎ సల్గా, కళాశాల యూజీసీ కో ఆర్డినేటర్ డాక్టర్ హరిరామ్ప్రసాద్, సుబ్రహ్మణ్యం, ఆర్గనైజింగ్ సెక్రటరీ వైడీ రామారావు, వరప్రసాద్, మల్లికార్జున శర్మ, రామమూర్తి, ఈరంకి శర్మ పాల్గొన్నారు. -
రసాయన శాస్త్రంపై వచ్చే నెల జాతీయ సదస్సు
అనంతపురం ఎడ్యుకేషన్ : స్థానిక ఆర్ట్స్ కళాశాల రసాయనశాస్త్ర విభా గం ఆధ్వర్యంలో జనవరి 30, 31 తేదీల్లో ’మానవ ఆరోగ్యం, వాతావరణ పరిరక్షణలో రసాయనశాస్త్రం పాత్ర’ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలు సోమవారం విడుదల చేశారు. ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.రంగస్వామి, రసాయనశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ డీఎఎస్ సత్యనారాయణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి డాక్టర్ వి.సలీంబాషా, తదితరులు పాల్గొన్నారు. పరిశోధక విద్యార్థులు, అధ్యాపకులు పరిశోధనాపత్రాలు సమర్పించి సదస్సును విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. -
నీటి కోసం పోరాటం!
వైవిధ్యమైన కథా చిత్రాల దర్శకుడు బాల నిర్మించిన తమిళ చిత్రం ‘చండివీరన్’. అధర్వ, ఆనంది, లాల్ ముఖ్యపాత్రల్లో సర్కుణమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘కాళి’ పేరుతో నిర్మాత ఎం.ఎం.ఆర్ తెలుగులో విడుదల చేస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘నీటి కోసం రెండు ఊళ్ల మధ్య జరిగిన పోరా టమే ఈ చిత్రకథ. పల్లెల్లో ఉండే సంక్రాంతి సంబరాలు, సరదాలు, సరసాలు ఉంటాయి. తొలి భాగం నవ్వులు పంచితే, రెండో భాగం ఉత్కంఠగా ఉంటుంది. అరుణగిరి పాటలు, సబేష్ మురళి నేపథ్య సంగీతం, పి.జి. ముత్తయ్య ఛాయాగ్రహణం హైలైట్. అధర్వ, ఆనందిల మధ్య కెమిస్ట్రీ బాగుం టుంది. కథ నచ్చి, తమిళంలో నిర్మించిన బాల తెలుగులో సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ నెలలో పాటలు, సినిమా రిలీజ్కు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రఘు. -
నయనతో కెమిస్ట్రీ కుదిరింది
నయనతారతో కెమిస్ట్రీ వర్కవుట్ అయ్యిందన్నారు సియాన్ విక్ర మ్. ఈయన కథా నాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఇరుముగన్. పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయడానికి ఎంతకైనా సిద్ధపడే ఈ నట పిపాసి ఈ చిత్రంలో మరో రెండు వైవిధ్యభరిత పాత్రలకు జీవం పోశారనే చెప్పాలి. పులి చిత్ర నిర్మాతల్లో ఒకరైన శిబుతమీన్స్ తన తమీన్స్ ఫిలింస్ పతాకంపై నిర్మిస్తున్న భారీ చిత్రం ఇది. విక్రమ్కు జంటగా తొలిసారిగా క్రేజీ నటి నయనతార జత కట్టిన ఈ చిత్రంలో మరో నాయకిగా నిత్యామీనన్ నటించారు. అరిమాతంబి చి త్రం ఫేమ్ ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి హారీష్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం ఉదయం స్థానిక రాయపేటలో గల సత్యం సినిమా థియేటర్లో జరిగింది.నటుడు శివకార్తికేయన్, మలయాళ యువ నటుడు నివీన్బాలి విచ్చేసిన ఈ కార్యక్రమంలో దర్శకుడు హరి, నటి లిజి, గీతరచయిత మదన్కార్గీ పాల్గొన్నారు. అభిమానులను అలరించాలనే.. విక్రమ్ మాట్లాడుతూ పత్రి చిత్రాన్ని అభిమానులను అలరించాలన్న ఆలోచనతోనే అంగీకరిస్తుంటానన్నారు. ఇరుముగన్ గురించి ఇప్పుడు తానేమీ చెప్పనని చిత్రం చూసిన తరువాత అదే మాట్లాడుతుందని అన్నారు. ఇరుముగన్ చిత్రం కోసం తాను తొమ్మిది నెలలు వేచి ఉన్నానని తెలిపారు.దర్శకుడు అంతగా వెయిట్ చేశారని, నిజానికి ఆయనకు ఒక పెద్ద హీరో చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని, దాన్ని ఆయన అంగీకరించవచ్చునని అన్నారు. ద్విపాత్రాభినయం కథా చిత్రం కోసం తాను చాలా కాలంగా ఎదురు చూస్తున్నానన్నారు. ఇక చిత్ర నిర్మాత శిబు తమాన్స్ గురించి చెప్పేతీరాలన్నారు.ఆయన తాను నటించిన చాలా చిత్రాలను కేరళలో డిస్ట్రిబ్యూషన్ చేశారని తెలిపారు. నయన్తో నటించడం గొప్ప అనుభవం తాను, నటి నయనతార కలిసి నటిస్తున్న తొలి చిత్రం ఇదన్నారు. నయనతార చాలా ప్రొఫెషనల్ అని పేర్కొన్నారు. ఆమెతో నటించడం గొప్ప అనుభవం అని.. తమ మధ్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యిందని వ్యాఖ్యానించారు. ఇక నటి నిత్యామీనన్ కూడా అంతేనన్నారు. ఇక హరీష్జయరాజ్ అంటే తనకు చాలా ఇష్టమని,ఆయన తనకు చాలా మంచి పాటల్ని అందించారని విక్రమ్ పేర్కొన్నారు. విక్రమ్ హిజ్రాగా నటించలేదు విక్రమ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో ఒక పాత్రలో రా అధికారిగా కనిపించనున్నారు. మరో పాత్ర హిజ్రా అనే ప్రచారం జరుగుతోం ది. అయితే దీనిపై దర్శకుడు ఆనంద్ శంకర్ స్ప ష్టం చేస్తూ హిజ్రాను కెమికెల్ ప్రాసెస్ ద్వారా ఆ డగాగానీ మగగా గానీ మార్చవచ్చునని చిత్ర ంలో చెప్పామన్నారు. అయితే ఇందులో విక్రమ్ హిజ్రాగా నటించలేదన్నారు. కాగా రెండో పాత్ర వైవిధ్యభరితంగా ఉంటుందన్నారు. ఇంతకు ముందెప్పుడూ చూడని విధంగా ఉం టుందన్నా రు. ఈ గెటప్ విక్రమ్ అభిమానుల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచె త్తుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న దర్శకుడు హరి మాట్లాడుతూ విక్రమ్ది తనది హిట్ కాంబినేషన్ అన్నారు. తాము కలిసి పని చేసిన సామి చిత్రం అప్పట్లో ట్రెండ్ సెట్టర్ అయ్యిందని,ఆ చిత్రానికి సీక్వెల్కు సిద్ధం అవుతున్నట్లు తెలిపారు. -
‘కెమిస్ట్రీ’తోనే అధిక సమయం
- ఎక్కువ ప్రశ్నలు సమస్యాపూరకంగా రావడంతో రాయలేకపోయామన్న విద్యార్థులు - పరీక్షకు 90.76 శాతం హాజరు - ప్రాథమిక కీ విడుదల, 12 వరకు అభ్యంతరాల స్వీకరణ, 14న ర్యాంకులు సాక్షి, హైదరాబాద్ : కెమిస్ట్రీలో సమస్యాపూరక ప్రశ్నలు ఎక్కువగా ఇవ్వడం, వాటికే అధిక సమయం పట్టడంతో మిగిలిన సబ్జెక్టుల ప్రశ్నలన్నింటికి సమాధానాలు రాయలేకపోయామని పలువురు విద్యార్థులు వాపోయారు. దీనికి తోడు ఫిజిక్స్లో అన్వయ సంబంధ అంశాలపై ప్రశ్నలు రావడం, బయాలజీలో తికమక పెట్టేలా ప్రశ్నలు ఉండటం ఎక్కువ సమయం తీసుకున్నాయని అన్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం శనివారం నిర్వహించిన ఎంసెట్-2 పరీక్షకు 90.76% మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష రాసేందుకు 56,153 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 50,964 మంది హాజరయ్యారు. 5,189 మంది గైర్హాజరయ్యారు. ఒక్క హైదరాబాద్ జోన్లో పరీక్ష రాసేందుకు 20,648 మంది రిజిస్టర్ చేసుకోగా 19,356 మంది హాజరయ్యారు. ప్రశ్నల విషయానికి వస్తే సిలబస్ ప్రకారమే ప్రశ్నలు వచ్చాయని, తెలుగు అకాడమీ పుస్తకాల్లోని ప్రశ్నలనే ఇచ్చారని సబ్జెక్టు నిపుణులు వెల్లడించారు. ప్రశ్నల్లో తప్పులేమీ లేవని పేర్కొన్నారు. అయితే ఈ ప్రశ్నలకు ప్రతిభావంతులైన విద్యార్థులే వేగంగా జవాబులను గుర్తించి రాయగలిగేలా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక పరీక్ష ప్రాథమిక కీని శనివారం ఎంసెట్ కమిటీ విడుదల చేసింది. కీని ఎంసెట్-2 వెబ్సైట్లో (med.tseamcet.in) ఉంచింది. ఈ నెల 12 మధ్యాహ్నం 2 గంటల వరకు కీపై అభ్యంతరాలను (keyobjectionstseamcet2016@gmail.com) మెయిల్ ద్వారా స్వీకరిస్తామని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణరావు వెల్లడించారు. ఇక ర్యాంకులను ఈ నెల 14న ప్రకటిస్తామని తెలిపారు. పరీక్షలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు బుక్ కాలేదని, ఎలాంటి తప్పులు దొర్లలేదని పేర్కొన్నారు. పరీక్షకు ‘ఆర్’ సెట్ కోడ్ కలిగిన ప్రశ్నాపత్రాన్ని ఉదయం 6 గంటలకు వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి విడుదల చేశారు. జేఎన్టీయూహెచ్లో జరిగిన ఈ కార్యక్రమంలో వర్సిటీ వైస్ చాన్స్లర్ శైలజా రామయ్యార్, ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి, డీఎంఈ డాక్టర్ రమణి, కాళోజీ హెల్త్ వర్సిటీ వీసీ కరుణాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మా కెమిస్ట్రీ మొదట్లో వర్కవుట్ కాలేదు!
‘‘ ‘అ...ఆ’లో నేను అల్లరి చేస్తా. ఏ సమస్య వచ్చినా తడబడను. తొందరపాటు నిర్ణయాలు తీసేసుకునే అమ్మాయిగా కనిపిస్తాను. నా రియల్ లైఫ్కు దగ్గరగా ఉండే పాత్రను ఈ చిత్రంలో చేశాను. అలాగే ఎప్పుడూ లేనిది కామెడీ కూడా చేశాను. మామూలుగానే త్రివిక్రమ్గారికి సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువ. అందుకే, ఈ పాత్ర విషయంలో నేను ఆయన్నే ఫాలో అయిపోయాను’’ అని కథానాయిక సమంత అన్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత, అనుపమా పరమేశ్వరన్ ముఖ్య తారలుగా ఎస్.రాధాకృష్ణ నిర్మించిన ‘అ..ఆ’ రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా సమంత చెప్పిన విశేషాలు... * ఈ మధ్య కాలంలో హీరోయిన్స్కు తక్కువ ప్రాధాన్యం ఉండే సినిమాలే వస్తున్నాయి. పది సినిమాలు వస్తే అందులో ఒక్క సినిమాలో మాత్రమే హీరోయిన్ క్యారెక్టర్కు మంచి స్కోప్ ఉంటోంది. ఇలాంటి టైమ్లో హీరోయిన్ పాత్రకు కూడా ప్రాధాన్యం ఉన్న ‘అ..ఆ’లో నటించినందుకు ఆనందంగా ఉంది. * నా కెరీర్ స్టార్టింగ్ నుంచి నేను స్క్రిప్ట్ను దృష్టిలో పెట్టుకునే సినిమాలు ఒప్పుకుంటున్నాను. ‘అ..ఆ’కి డెరైక్టర్ త్రివిక్రమ్ అన్న ఒక్క కారణంతో ఈ సినిమాకి ఓకే చెప్పలేదు. ఈ సినిమాలో హీరో, హీరోయిన్ల పాత్ర లకు సమాన ప్రాధాన్యం ఉంటుంది. కొత్త కథతో ఈ సినిమా ఉంటుందని చెప్పను. కుటుంబ భావోద్వేగాల సమాహారంతో సాగే అద్భుతమైన ప్రేమకథ ఇది. త్రివిక్రమ్ సినిమాల్లో ఓ పూర్తి స్థాయి ప్రేమకథగా నిలిచిపోతుంది. * నితిన్, నేనూ తొలిసారి కలిసి నటించాం. దాంతో ఈ చిత్రం షూటింగ్ మొదలైనప్పుడు మా మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ కాలేదు. అది చూసి, మాతో సినిమా చేయాలా? వద్దా? అని త్రివిక్రమ్ కాస్త సందేహించారు. కానీ, వర్క్ చేయడం మొదలుపెట్టాక కెమిస్ట్రీ కుదిరింది. * సినిమా చేసినా బాగా రావాలనే అనుకుంటాం. విజయం సాధించాలని ఆశిస్తాం. కానీ, అంతిమ ఫలితం ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుంది. నేను నటించిన సినిమా ఫ్లాప్ అయితే చాలా బాధపడతా. ‘బ్రహ్మోత్సవం’ విషయంలో కూడా అలా అనుకోని రిజల్డ్ ఎదురయ్యేసరికి బాధపడ్డాను. * ప్రస్తుతం ‘జనతా గ్యారేజ్’ సినిమాలో నటిస్తున్నాను. అంతే కాకుండా కన్నడ చిత్రం ‘యూటర్న్’ తెలుగు, తమిళ రీమేక్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను. -
అప్పుడు ఇష్టం... ఇప్పుడు అయిష్టం!
రియల్ లైఫ్ లవర్స్ జంటగా నటిస్తే, రీల్పై వాళ్ల కెమిస్ట్రీ అదిరిపోతుంది. అందుకు ఓ ఉదాహరణ రణబీర్ కపూర్, కత్రినా కైఫ్. ఈ ఇద్దరూ లవ్లో ఉన్నప్పుడు చేసిన ‘అజబ్ ప్రేమ్కీ గజబ్ కహానీ’లో రొమాంటిక్ సీన్స్లో జీవించారు. అప్పుడు ఇలాంటి సీన్స్లో ఇష్టంగా నటించిన ఈ జంట ఇప్పుడు మాత్రం అయిష్టంగా ఉన్నారట. విడిపోయాక ఈ ఇద్దరూ జంటగా నటిస్తున్న చిత్రం ‘జగ్గా జాసూస్’. అనురాగ్ బసు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం అంగీకరించినప్పుడు రణబీర్, కత్రినా ప్రేమలోనే ఉన్నారు. షూటింగ్ కాస్త అయ్యాక విడిపోయారు. దాంతో ఇప్పుడు రొమాంటిక్ సీన్స్లో నటించడానికి ఇష్టపడటంలేదట. మామూలుగా రిస్కీ ఫైట్ సీన్స్ని డూప్స్తో చేయిస్తారని అందరికీ తెలుసు. కానీ, ఈ చిత్రంలోని రొమాంటిక్ సీన్స్ని డూప్తో తీస్తున్నారట. రణబీర్, కత్రినా ఈ సన్నివేశాల్లో నటించడానికి ఇష్టపడకపోవడంతో, చేసేదేం లేక ఈ విధంగా నకిలీలతో కానిచ్చేస్తున్నారట. ఒకవేళ నకిలీలు కనుక కెమిస్ట్రీ పండిస్తే.. అప్పుడు ప్రాబ్లమ్ లేదు. ఆ సంగతలా ఉంచితే.. దీపికా పదుకొనే నుంచి విడిపోయాక ఆమెతో కలిసి రణబీర్ నటించారు. మరి.. ఇప్పుడు కత్రినా విషయంలో ఈ చాక్లెట్ బోయ్ ఎందుకు అంత పట్టుబడుతున్నారో? అలాగే.. సినిమా కోసం కూడా రణబీర్తో రొమాన్స్ నటించడానికి కత్రినా ఎందుకు అంత ఇదవుతున్నారో?.. బలమైన కారణం ఏదో ఉండే ఉంటుంది. -
ఆన్లైన్లో ప్రశ్నపత్రాలు
లీకేజీలకు విరగడ మంత్రి కిమ్మెన రత్నాకర్ ప్రశాంతంగా రసాయనశాస్త్రం మరు పరీక్ష బెంగళూరు: ప్రశ్నపత్రాల లీకు సమస్యకు పరిష్కారంగా వచ్చే విద్యా ఏడాది నుంచి పదోతరగతి, పీయూసీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలను ఆన్లైన్ ద్వారా రవాణా చేయనున్నట్లు రాష్ట్ర ప్రాథమిక, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కిమ్మెన రత్నాకర్ వెల్లడించారు. విశ్వేశ్వరయ్య టెక్నలాజికల్ యూనివర్శిటీ ఈ విధంగా ప్రశ్నపత్రాలను ఆన్లైన్లో రావాణా చేస్తూ మంచి ఫలితాలను సాధిస్తోందని ఆయన పేర్కొన్నారు. ద్వితీయ పీయూసీ రసాయనశాస్త్రం రీ ఎగ్జామ్ (మరు పరీక్ష) విజయవంతంగా ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో భేటీ అయ్యి పరిస్థితిని వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘అన్లైన్లో పరీక్ష కేంద్రాలకు ప్రశ్నపత్రాలను రవాణా చేయాలంటే సదరు కేంద్రాలకు ఇంటర్నెట్ సదుపాయం ఖచ్చితంగా ఉండాల్సిందే. రాష్ట్రంలో అన్ని పరీక్ష కేంద్రాలకు ఇంటర్నెట్ సదుపాయం ఉండదు. అటు వంటి సమయంలో ఇంటర్నెట్ ఉన్న పరీక్షా కేంద్రాల్లోనే పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో పరీక్షా కేంద్రాల సంఖ్య తగ్గిపోతుంది. అందుకు అనుగుణంగా విద్యార్థులకు పరీక్షా కేంద్రాలు దూరమవుతాయి. ఈ సమస్యను పరిష్కరించాలంటే రవాణాసదుపాయం కల్పించాల్సి ఉంటుంది. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని పెలైట్ ప్రతిపాదికన మొదట కొన్ని ప్రాంతాల్లో ఆన్లైన్ విధానంలో ప్రశ్నపత్రాలను రవాణా చేసి అనంతరం ఈ విధానాన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాం’ అని కిమ్మెన రత్నాకర్ వివరించారు. అయితే యూనివర్శిటీతో పోలిస్తే రాష్ట్ర విద్యాశాఖ వద్ద నాణ్యమైన, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉందన్నారు. అందువల్ల ఆన్లైన్లో ప్రశ్నపత్రం రవాణా చేయడం ఖచ్చితమని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది ద్వితీయ పీయూసీ రసాయనశాస్త్రం పరీక్షకు సంబంధించి రెండుసార్లు పరీక్ష రోజుకంటే ఒకరోజు ముందుగానే లీకయిననేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ప్రశ్నపత్రాన్ని కూడా మంగళవారం ఉదయం ఎంపిక చేసి అన్ని పరీక్షా కేంద్రాలకు రవాణా చేశారు. పోలీసులతో పాటు రెవెన్యూశాఖ సిబ్బంది కూడా ప్రశ్నపత్రాల రవాణాను పర్యవేక్షించారు. ఇక పరీక్ష కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో నిషేదాజ్ఞలు జారీ చేశారు. మొత్తంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా ద్వితీయ పీయూసీ రసాయనశాస్త్రం పరీక్ష ముగియడంతో అటు విద్యాశాఖ అధికారులతో పాటు ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. -
ప్రశ్నపత్రాలన్నీ లీక్
సీఐడీ దర్యాప్తులో వెల్లడి సూత్రధారి మాజీ అధ్యాపకుడు శివకుమార్స్వామి? సీఐడీ అదుపులో శివకుమార్స్వామి ఈ కేసులోమరో ఐదుగురి పాత్ర వారి కోసం గాలిస్తున్న దర్యాప్తు బృందాలు బెంగళూరు: ద్వితీయ పీయూసీ రసాయనశాస్త్రం ప్రశ్నపత్రం లీకుకు సంబందించిన దర్యాప్తులో ఆశ్చర్యకరమైన విషయాలను వెలుగుచూస్తున్నాయి. కేవలం రసాయనశాస్త్రమే కాకుండా గణితం, భౌతికశాస్త్రం, జీవశాస్త్రం సంబంధించిన ప్రశ్నపత్రాలు కూడా పరీక్షకు ముందే బయటికి వచ్చినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. ఇదిలా ఉండగా ద్వితీయ పీయూసీ రసాయనశాస్త్రం ప్రశ్నపత్రం లీకుకు సంబంధించి సూత్రధారి తుమకూరుకు చెందిన శివకుమార్స్వామి అని తేలింది. ఇతను గతంలో లెక్చరర్గా పనిచేసి అక్రమాలకు పాల్పడి విధుల నుంచి డిస్మిస్ అయినట్లు తేలింది. ఈ ఏడాది మార్చి 21న నిర్వహించాల్సిన ద్వితీయ పీయూసీ రసాయనశాస్త్ర పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం రెండు సార్లు లీక్ కావడంతో ఈనెల 12న ఈ పరీక్షను నిర్వహించనున్న విషయం తెలిసిందే. రెండు సార్లు ప్రశ్నపత్రం లీకుకు సంబంధించిన కేసులను దర్యాప్తు చేస్తున్న సీఐడీ బృందం అధికారులు ఈ అక్రమ దందా వెనుక వివిధ అరోపణలతో విధుల నుంచి డిస్మిస్ అయిన లెక్చరర్ శివకుమార్స్వామి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నారు. తుమకూరు జిల్లా గుబ్బి తాలూకా కాగేరికి చెందిన ఇతను బెంగళూరులోని వివిధ కళాశాలల్లో లెక్చరర్గా పనిచేస్తూ మొదటి నుంచి ఎస్ఎస్ఎల్సీ, పీయూసీ, సీఈటీ వంటి పరీక్ష పత్రాల లీకుల దందాకు పాల్పడేవాడు. ఈ విషయమై ఇతనిపై ఇప్పటికే మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయి. ఇందులో బెంగళూరులోని రాజాజీనగర, చంద్రలేఅవుట్ పోలీస్ స్టేషన్లలో తలా ఒకటి కాగా, తుమకూరులో రెండు కేసులు నమోదయ్యాయి. ఇతని కుమారుడైన దినేష్, సోదరుడి కుమారుడు కిరణ్ ఈ దందాలో భాగస్వాములని తెలుస్తోంది. దినేష్ ఎంబీబీఎస్ను మధ్యలోనే మానేశారని సమాచారం. మొదట్లో కిరణ్ ఈ లీకుకు సూత్రధారి అని భావించినా మరింత లోతుగా అధ్యయనం చేయడంతో శివకుమార్స్వామి అసలు సూత్రధారి అని సీఐడీ దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ఈ ముగ్గురితో పాటు మరో ఐదు మంది పాత్ర ఉన్నట్లు సీఐడీ దర్యాప్తులో తేలింది. వీరి కోసం లీకు కేసులను దర్యాప్తు చేస్తున్న సీఐడీ దర్యాప్తు బృందాలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గాలిస్తున్నాయి. ఇదిలా ఉండగా విధుల నుంచి డిస్మిస్ అయిన తర్వాత శివకుమార్స్వామీ వివిధ చోట్ల ట్యుటోరియల్స్ నిర్వహిస్తూ పీయూ బోర్డులో ఉన్నతాధికారులతో నిత్యం సంప్రదింపులు జరిపేవారు. అంతేకాకుండా ప్రశ్నపత్రాల రవాణా కోసమంటూ ట్యుటోరియల్స్కు చెందిన వాహనాలను పీయూబోర్డుకు అందజేసి ఆమేరకు అధికారుల మెప్పు పొందేవారని తెలుస్తోంది. రవాణా కోసం వినియోగించే వాహనంలో ఎస్కార్ట్గా ఉన్న పోలీసు సిబ్బందిని కూడా శివకుమారస్వామి ప్రసన్నం చేసుకునేవాడు. ఇలా ఉన్నతస్థాయి అధికారుల నుండి కింది స్థాయి సిబ్బంది వరకు అందరినీ ప్రలోభాలకు గురిచేసి ప్రశ్నపత్రాలను లీకు చేసే వాడని సీఐడీ దర్యాప్తులో తేలింది. కాగా, రాష్ట్రం మొత్తం మీద వివిధ పేర్లతో 18 ట్యుటోరిల్స్ను శివకుమారస్వామి నిర్వహిస్తున్నారని సీఐడీ అధికారులు గుర్తించారు. విధానసౌధ కేంద్రంగా లీకు వ్యవహారం... ద్వితీయ పీయూసీ రసాయనశాస్త్రం లీకు కేసుకు సంబంధించి రాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రి శరణ్ప్రకాష్ పాటిల్ పీ.ఏ ఓబుళరాజు, ప్రైవేటు కళాశాలలో పీఈటీగా విధులు నిర్వర్తిస్తున్న మంజునాథ్, ప్రజాపనుల శాఖలో పనిచేస్తున్న రుద్రప్పలను సీఐడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విచారణలో లీకుకు సంబంధించి మొత్తం వ్యవహారం విధానసౌధలోని రాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రి శరణ్ప్రకాష్ పాటిల్ కార్యాలయం నుంచి జరిగినట్లు సీఐడీ అధికారులు తెలుసుకున్నారు. ఓబుళరాజు కుమారుడు, రుద్రప్పల కుమార్తె ద్వితీయ పీయూసీ చదువుతున్నారు. ఈ నేపథ్యంలో మంజునాథ్ నుంచి ప్రశ్నపత్రం వాట్స్అప్ ద్వారా ఓబుళరాజు కుమారుడు, , రుద్రప్ప కుమార్తెకు చేరింది. అంతేకాకుండా చేతితో రాసిన సదరు ప్రశ్నపత్రం విధానసౌధాలోని మంత్రి కార్యాలయం ముందే మంజునాథ్ ఓబుళరాజుకు అందజేసి ఇందుకోసం లక్షల నగదు తీసుకున్నట్లు సమాచారం. ఇక ఓబుళరాజు, రుద్రప్పలు మంత్రి కార్యాలయం నుంచే పలువురికి ప్రశ్నపత్రం అమ్మారు. ఇందుకు కార్యాలయం ల్యాడ్లైన్ ఫోన్ను వినియోగించుకున్నారు. తాను ఎవరెవరికి ఎలా ప్రశ్నపత్రాన్ని చేరవేసింది మంజునాథ్ సీఐడీ విచారణలో పూసగుచ్చినట్లు తెలిపినట్లు అధికార వర్గాల సమాచారం. ఇదిలా ఉండగా లీకులకుసంబంధించిన సూత్రధారి శివకుమార్స్వామీని సీఐడీ అధికారులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. -
డీఎన్ఏపై పరిశోధనలకు నోబెల్ పురస్కారం
స్టాక్ హోం: కణాలు తమ డీఎన్ఏలో తలెత్తే అంతర్గత సమస్యలను ఏవిధంగా పరిష్కరించుకుంటాయి.. ఆ ప్రక్రియలో ఎలాంటి రసాయనిక చర్యలు చోటుచేసుకుంటాయి.. తదితర అంశాలపై 'మెకానిస్టిక్ స్టడీస్ ఆఫ్ డీఎన్ఏ' పేరుతో జరిపిన పరిశోధనలకుగానూ రసాయన శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారం లభించింది. స్విడన్, అమెరికా, టర్కీలకు చెందిన ముగ్గురు శాస్త్రవేత్తలు కెమిస్ట్రీ నోబెల్- 2015 పురస్కారానికి ఎంపికయినట్లు బుధవారం నోబెల్ కమిటీ ప్రకటించింది. వీరి ప్రయోగాలతో ఒక తరం నుంచి ఇంకో తరానికి మానవాళి ఏవిధంగా అభివృద్ధి చెందుతూ వస్తున్నదో తెలుసుకునే వీలుంటుందని రాయల్ స్విడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పేర్కొంది. సజీవ కణం ఎలా పనిచేస్తుంది, అది క్యాన్సర్ ట్రీట్ మెంట్ కు ఏవిధంగా ఉపకరిస్తుందనే విశయాలనూ వీరు నిరూపించారు. స్విడన్ కు చెందిన థామస్ లిండాల్ లండన్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్, ప్రిన్స్ టన్, రాక్ ఫెల్లర్ యూనివర్సిటీల్లో అనేక పరిశోధనలు చేశారు. యూఎస్ కు చెందిన పాల్ మాడ్రిచ్..డ్యూక్ యూనివర్సిటీ బయోకెమెస్ట్రీ విభాగంలో పనిచేస్తున్నారు. ఇస్లాంబుల్ యూనివర్సిటీ నుంచి కెమిస్ట్రీ పట్టా పుచ్చుకున్న టర్కీ శాస్త్రవేత్త అజీజ్ సన్కార్ డీఎన్ఏ రిపేర్, సెల్ సైకిల్ చెక్ పాయింట్ మొదలగు ప్రయాగాల్లో విశేష ఖ్యాతి గడించారు. -
కలిసిన హృదయాలు
రీల్ లైఫ్లో రొమాన్స్లతో కెపైక్కించే తారలు రియల్ లైఫ్లోనూ వాటిని కంటిన్యూ చేస్తున్నారు. ఒకటి రెండు సినిమాలు కలసి చేస్తే... హిట్ పెయిర్ అవుతుందో లేదో గానీ.. వారి మధ్య పండిన ఆన్స్క్రీన్ కెమిస్ట్రీ మాత్రం ఆపై పర్సనల్గానూ వర్కవుటయిపోతోంది. ఒకటా రెండా... వందేళ్లు పైబడిన బాలీవుడ్లో ఇలాంటి కథలు లెక్కకు మించి! ఆనాటి నుంచి ఈనాటి వరకు లవ్... లైఫ్లో రొటీనైపోయింది. షూటింగ్ల్లో చిగురించిన ప్రేమ కొందరిని భార్యాభర్తలను చేసింది. ఇంకొందరిని ప్రేమికులుగానే వదిలేసింది. మరికొందరిని విరహంలో ముంచెత్తింది. మరి ఈ వాలంటైన్స్ డే సందర్భంగా ప్రేమ ‘హాట్’ సీట్లో ఉన్న బాలీవుడ్ జంటలపై ఓ లుక్కేద్దాం! హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో లవ్ అఫైర్స్ అనగానే వెంటనే గుర్తుకు వచ్చే స్టార్ జంట కత్రినా కైఫ్, రణబీర్కపూర్. దాదాపు ఏడాదికి పైగా ఇద్దరూ కలసి చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారు. షూటింగ్ల్లో ఎవరికి వారు బిజీగా ఉన్నా... వెసులుబాటు చేసుకుని మరీ కలుస్తున్నారు. న్యూ ఇయర్ రోజు లండన్లోని కత్రినా ఫ్యామిలీని రణబీర్ కలిశాడన్నది పెద్ద వార్త. అక్కడ పెళ్లి ముచ్చట్లు కూడా జరిగిపోయాయని ఇండస్ట్రీ అప్పట్లో టాకేసింది. మరికొందరు ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందన్నారు. కానీ.. రణబీర్ వీటన్నింటినీ ఖండించాడు. ఇక రణబీర్ మాజీ ప్రియురాలు, సూపర్ హీరోయిన్ దీపిక పడుకొనే తాజాగా మరొకరితో లవ్లో పడింది. ధోనీ, యువరాజ్లతో కొంతకాలం డేటింగ్ చేసిన ఈ అమ్మడు తాజాగా కుర్ర హీరో రణవీర్సింగ్తో కలసి తెగ తిరిగేస్తోంది. ఆ మధ్య దీపిక బర్త్డే బెంగళూరులో జరుపుకుంటే... మనోడు అటెండయ్యాడు. అంతటితో ఆగలేదు.. తన ప్రేమను చాటుకోవడానికి పొడుగు కాళ్ల సుందరిని వెంట పెట్టుకుని షాపింగ్కు తీసుకెళ్లాడు. అక్కడ కాస్ట్లీ ఐటెమేదో కొనిపెట్టాడట కూడా. రీసెంట్గా ఈ చిన్నదాని బుగ్గపై పబ్లిక్గా ముద్దు పెట్టి వివాదాల్లో ఇరుక్కున్నాడు. అతికి అసలు అర్థం ఎవరంటే బాలీవుడ్ జనాలు రణవీర్ పేరు చెబుతారు. బహుశా అదే ఆమెకు అతిగా నచ్చేసిందేమో! నాకెవరూ లేరు.. నేను ఒంటరినే అంటూ నిన్నమొన్నటి వరకూ చెప్పుకొచ్చిన సెక్సీ తార బిపాసాబసు తాజాగా తానూ జతగాడిని వెతుక్కుందట. రొమాంటిక్ హీరో జాన్ అబ్రహంతో చాన్నాళ్లు రొమాన్స్ చేసిన బిప్.. ఆ తరువాత కోస్టార్ హర్మాన్ బవేజాతో తిరిగింది. ఇప్పుడు మరో కుర్ర హీరో కరణ్సింగ్ గ్రోవర్తో రిలేషన్ మెయిన్టెయిన్ చేస్తోంది. మొత్తానికి లేదు లేదంటూనే డేటింగ్ల్లో గడిపేస్తూ ఎంజాయ్ చేస్తోంది బిప్! బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్ఖాన్ సీజన్కో గాళ్ఫ్రెండ్ను మారుస్తుంటాడు. అతగాడి లిస్ట్ చెప్పాలంటే బారెడు! ఐశ్వర్యా, కత్రినా, జాక్వెలిన్... ఇలా పెరుగుతూనే ఉంటుంది. అయితే ఇటీవల తన చెల్లి అర్పితాఖాన్ మ్యారేజ్లో రొమేనియన్ టీవీ హోస్ట్ లులియా వంతూర్ను ఫ్యామిలీకి ఇంట్రడ్యూస్ చేసి షాకిచ్చాడు. ఇరువురూ డేటింగ్లో ఉన్నారనేది అసలు విషయం. ఇటు సినిమా ఫీల్డ్... అటు క్రికెట్ గ్రౌండ్లో ఫేమస్ ఫిగర్లు అనుష్కాశర్మా, విరాట్ కొహ్లీల ప్రేమాయణం ఓ రేంజ్లో సాగుతోంది. జతగాడు ఆస్ట్రేలియా టూర్లో ఉంటే... న్యూఇయర్ పార్టీ కోసం అక్కడికి వెళ్లిపోయింది. అనుష్కా కొన్ని రోజులు విరాట్తో ఆసీస్ బీచ్లు, క్లబ్ల్లో షికార్లు కొట్టి వచ్చింది. నిజమెంతో తెలియదు గానీ... ఈ ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని టాక్. సోగకళ్ల చిన్నది సోనాక్షి సిన్హా పెద్దగా వార్తల్లో ఉండదు గానీ... బోనీకపూర్ కొడుకు అర్జున్కపూర్తో సీక్రెట్గా డేటింగ్ సాగిస్తోందని బీటౌన్ టాక్. ఇద్దరూ సినిమాలకు, షికార్లకు వెళ్లినట్టు సమాచారం. అయితే కలసి సినిమా చూసినంత మాత్రాన ఏదో జరిగిపోతున్నట్టేనా అంటూ ప్రశ్నించి కాస్త కన్ఫ్యూజన్లో పెట్టింది సోనాక్షి. వర్ధమాన తారల్లో శ్రద్ధాకపూర్ సహనటుడు ఆదిత్యారాయ్కపూర్తో అఫైర్ నడిపిస్తోందట. ఈ ప్రేమల్లో ఎన్ని సక్సెస్ఫుల్గా సాగిపోతాయో తెలుసుకోవాలంటే వచ్చే వాలెంటైన్ డే వరకు ఆగాల్సిందే! -
జస్ట్ రొమాన్స్..!
చూస్తుంటే ‘బిగ్బాస్’ రియాల్టీ షోలో రొమాన్స్ కామన్ ఫ్యాక్టర్ అయిపోయినట్టుంది. భిన్న ధుృవాలు ఆకర్షించుకుంటాయన్న సూత్రంలా... హౌస్లో ఉన్న ఆడ- మగ ఒకరికొకరు ఠక్కున కనెక్ట్ అయిపోతున్నారు. చుట్టూ కెమెరాలు రెప్పలార్పకుండా ఉన్నా... వాటిని ఎవరూ పెద్దగా పట్టించుకుంటున్నట్టు లేదు. ప్రస్తుత సీజన్లో హౌస్లో ఉన్న గౌతమ్, దియాంద్రల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుటవుతున్నట్టుంది... సాన్నిహిత్యం రోజురోజుకూ పెరిగిపోతుందట. వారి ప్రేమ కామన్ హాల్... బెడ్రూమ్లు దాటి బాత్రూమ్ల వరకు పాకిందన్నది గుసగుస. వీరే కాదు... ఇలా బిగ్బాస్ షోతో చాలామందే ఒంటరిగా వచ్చి జంటలుగా తేలుతున్నారు. -
రసాయనికంగా సబ్బులు అనేవి..?
1. కార్బోహైడ్రేట్లు అనేవి? 1) మాంసకృత్తులు 2) పిండి పదార్థాలు 3) కొవ్వులు 4) విటమిన్లు 2. మానవ శరీరంలో ఉండే మాంసకృత్తులు? 1) కార్బోహైడ్రేట్లు 2) లిపిడ్లు 3) ప్రోటీన్లు 4) విటమిన్లు 3. సాధారణ కార్బొహైడ్రేట్ల నిర్మాణంలో ఉండని మూలకమేది? 1) హైడ్రోజన్ 2) కార్బన్ 3) ఆక్సిజన్ 4) నైట్రోజన్ 4. {పోటీన్ల నిర్మాణంలో అవసరమైన మూలకాలేవి? 1) హైడ్రోజన్, కార్బన్ మాత్రమే 2) కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ మాత్రమే 3) కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్ మాత్రమే 4) కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్ 5. కిందివాటిలో ప్రోటీన్లు ప్రధానంగా లేని పదార్థం ఏది? 1) గోళ్లు 2) వెంట్రుకలు 3) మాంసం 4) బియ్యం 6. టేబుల్ షుగర్ రసాయన నామం? 1) సుక్రోజ్ 2) గ్లూకోజ్ 3) ఫ్రక్టోజ్ 4) మాల్టోజ్ 7. పాలలోని చక్కెర ఏది? 1) గ్లూకోజ్ 2) సుక్రోజ్ 3) ఫ్రక్టోజ్ 4) లాక్టోజ్ 8. తేనెలో ఉండే కార్బొహైడ్రేట్? 1) ఫ్రక్టోజ్ 2) గ్లూకోజ్ 3) లాక్టోజ్ 4) మాల్టోజ్ 9. మొలాసిస్ నుంచి ఆల్కహాల్ తయారు చేసే ప్రక్రియ? 1) డయాలసిస్ 2) కిణ్వప్రక్రియ (ఫెర్మెంటేషన్) 3) కిరణజన్యసంయోగక్రియ (ఫొటోసింథసిస్) 4) లాక్టైజేషన్ 10. {పోటీన్లలో ఉండే ప్రత్యేక బంధం ’–CO–NH–’ ను ఏమంటారు? 1) ఎస్టర్ బంధం 2) ఈథర్ బంధం 3) ఎమైడ్ బంధం 4) పాలిఎమైడ్ 11. పాలిఎమైడ్లు అనేవి? 1) లిపిడ్లు 2) ప్రోటీన్లు 3) కార్బోహైడ్రేట్లు 4) విటమిన్లు 12. హీమోగ్లోబిన్లో ప్రధానంగా ఉండేవి? 1) లిపిడ్ కణాలు 2) ప్రోటీన్ కణాలు 3) కార్బోహైడ్రేట్లు 4) విటమిన్లు 13. గుండెజబ్బులకు ప్రధాన కారణమైన కొలె స్టిరాల్ అనేది ఒక? 1) లిపిడ్ 2) విటమిన్ 3) చక్కెర 4) ప్రోటీన్ 14. కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వ్యాధిగ్రస్థుల చికిత్సకు సంబంధించిన ప్రక్రియ? 1) ఫెర్మెంటేషన్ 2) లాక్టేషన్ 3) డయాలసిస్ 4) ఆస్మాసిస్ 15. కిడ్నీ ఫెయిల్యూర్ అయిన పేషెంట్ల ఆహా రంలో ఏవి తక్కువ మోతాదులో ఉండాలి? 1) ప్రోటీన్లు 2) లిపిడ్లు 3) విటమిన్లు 4) కొర్బోహైడ్రేట్లు 16. నూనెలను ‘డాల్డా’ లాంటి కొవ్వులుగా మా ర్చే ప్రక్రియ? 1) హైడ్రోజనీకరణం 2) హైడ్రాలిసిస్ 3) ఎస్టరిఫికేషన్ 4) ఫెర్మెంటేషన్ 17. సబ్బుల పరిశ్రమల్లో సహ ఉత్పన్నం ఏది? 1) గ్లిజరాల్ 2) గ్లైకాల్ 3) ఇథైల్ ఆల్కహాల్ 4) అసిటోన్ 18. సోడియం హైడ్రాక్సైడ్ లాంటి క్షారంతో వేటిని మరిగిస్తే సపోనిఫికేషన్ జరిగి సబ్బు ఏర్పడుతుంది? 1) నూనెలు (లిపిడ్లు) 2) కార్బోహైడ్రేట్లు 3) ప్రోటీన్లు 4) ఆల్కహాల్లు 19. మాయిశ్చరైజింగ్ సోప్లలో ఉండేది? 1) ఇథైల్ ఆల్కహాల్ 2) గ్లిజరాల్ 3) మిథైల్ ఆల్కహాల్ 4) ఆస్కార్బికామ్లం 20. నిమ్మజాతి పండ్లలో ఉండే విటమిన్-సికి మరో పేరు? 1) ఎ 2) బి 3) సి 4) డి 21. మొలకెత్తిన ధాన్యాల్లో అభివృద్ధి చెందే ప్రధాన విటమిన్ ఏది? 1) ఎ 2) బి 3) సి 4) ఇ 22. నీటిలో కరిగే విటమిన్లేవి? 1) ఎ, బి మాత్రమే 2) బి, సి మాత్రమే 3) సి, డి మాత్రమే 4) అన్ని విటమిన్లు నీటిలో కరుగుతాయి 23. ఆవుపాలు పసుపురంగులో ఉండటానికి కారణమైన విటమిన్? 1) పిరిడాక్సిన్ (B6) 2) రైబోఫ్లోవిన్ (B2) 3) థయమిన్ (B1) 4)సైనకోబాలమిన్ (B12) 24. ఏ విటమిన్ లోపిస్తే వ్యంధ్యత్వం వస్తుంది? 1) ఎ 2) బి 3) సి 4) ఇ 25. కోబాల్ట్ లోహ అయాన్ ఉండే విటమిన్ ఏది? 1) B1 2) B2 3) B12 4) B6 26. జతపరచండి. విటమిన్ లోపిస్తే వచ్చే వ్యాధి ఎ) B1 1) రికెట్స్ బి) B12 2) స్కర్వీ సి) C 3) రేచీకటి డి) D 4) బెరిబెరి 5) రక్తహీనత ఎ బి సి డి 1) 1 2 3 4 2) 2 3 4 5 3) 4 5 2 1 4) 5 4 1 2 27. గర్భిణీలకు ఇచ్చే విటమిన్ ఏది? 1) థయమిన్ 2) పిరిడాక్సిన్ 3) ఫోలికామ్లం 4) రైబోఫ్లోవిన్ 28. బియ్యాన్ని ఎక్కువగా పాలిష్ చేస్తే ఏ విటమిన్ లోపిస్తుంది? 1) బి 2) సి 3) ఎ 4) డి 29. రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని నియంత్రించే హార్మోన్ ఏది? 1) ఇన్సులిన్ 2) ఈస్ట్రోజన్ 3) ప్రొజెస్టిరాన్ 4) ఏదీకాదు 30. ఎదుగుదలకు దోహదం చేసే హార్మోన్ ఏది? 1) ఇన్సులిన్ 2) థైరాక్సిన్ 3) ఈస్ట్రోజన్ 4) ప్రొజెస్టిరాన్ 31. అత్యల్ప ఆల్కహాల్ ఉండేది? 1) వైన్ 2) బీర్ 3) వోడ్కా 4) విస్కీ 32. వాహనాలు నడవడానికి పెట్రోల్తో పాటు దేన్ని కలుపుతున్నారు? 1) ఇథనాల్ 2) మిథనాల్ 3) గ్లిజరాల్ 4) గ్లైకాల్ 33. రసాయనికంగా సబ్బులు అనేవి? 1) ఫాటీ ఆమ్లాల సోడియం లేదా పొటాషియం లవణాలు 2) ఫాటీ ఆమ్లాల సల్ఫోనేట్ లవణాలు 3) గ్లిజరాల్, బై కార్బొనేట్ల మిశ్రమాలు 4) ఏదీకాదు 34. కిందివాటిలో ఏవి డిటర్జెంట్లు? ఎ. ఆల్కైల్ బెంజీన్ సల్ఫొనేట్లు బి. భార ఆల్కహాల్ల సల్ఫోనేట్ లవణాలు సి. భార ఫాటీ ఆమ్లాల సోడియం లవణాలు 1) ఎ, బి మాత్రమే 2) బి, సి మాత్రమే 3) ఎ, సి మాత్రమే 4) ఎ, బి, సి 35. కార్ రేడియేటర్లలో శీతలీకారిణి (యాంటీ- ఫ్రీజ్)గా దేన్ని ఉపయోగిస్తారు? 1) టెట్రాఇథైల్ లెడ్ 2) ఇథిలీన్ గ్లైకాల్ 3) గ్లిజరాల్ 4) ఇథైల్ ఆల్కహాల్ 36. పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించే ఇథనాల్కు తాగడానికి పనికిరాకుండా ఉండటానికి కలిపే పదార్థం? 1) మిథనాల్ 2) ఎసిటోన్ 3) బెంజీన్ 4) క్లోరోఫాం 37. గాయాలు త్వరగా మానడానికి అవసర మైన విటమిన్ ఏది? 1) ఎ 2) బి 3) సి 4) డి 38. కెఫీన్ అనే డ్రగ్ ఎందులో ఉంటుంది? 1) కాఫీ 2) టీ 3) కోలా శీతల పానీయాలు 4) పైవన్నీ 39. సిగరెట్లో ఉండే డ్రగ్ ఏది? 1) కెఫీన్ 2) టేనిన్ 3) నికోటిన్ 4) వెనిలా 40. సొరచేప కాలేయం నుంచి తీసే నూనె ద్వారా లభించే విటమిన్? 1) ఎ 2) బి 3) సి 4) ఇ 41. ఆల్కహాల్ అధికంగా సేవించే వారిలో ఏ అవయవం పాడవుతుంది? 1) ఊపిరితిత్తులు 2) కాలేయం 3) కిడ్నీ 4) మూత్రనాళం 42. నూనెల హైడ్రోజనీకరణం గురించి సరికాని వాక్యం ఏది? 1) నూనెల హైడ్రోజనీకరణంలో ూజీ లో హాన్ని ఉత్ప్రేరకంగా ఉపయోగిస్తారు 2) నూనెలను హైడ్రోజనీకరణం చేస్తే కొవ్వులు లభిస్తాయి 3) ఈ ప్రక్రియ వల్ల రుచి, వాసన పెరు గుతాయి 4) నూనెల హైడ్రోజనీకరణం వల్ల వచ్చే కొ వ్వులు తక్కువ కాలం నిల్వ ఉంటాయి 43. కఠిన జలంలోనూ డిటర్జెంటులు బాగా ఉపయోగపడటానికి కారణమేమిటి? 1) అవి నీటిలోని అయాన్లను తొలగిస్తాయి 2) అవి కఠినజల అయాన్లతో చర్య నొందవు 3) అవి కఠినజల అయాన్లతో చర్య నొందినప్పటికీ అవక్షేపించవు 4) అవి కఠినజల అయాన్లతో చర్యనొంది అవక్షేపిస్తాయి 44. రక్తం త్వరగా గడ్డకట్టడానికి తోడ్పడే విటమిన్? 1) ఎ 2) బి 3) సి 4) కె 45. ఏ విటమిన్ లోపం వల్ల మగవారిలో బీజాభివృద్ధి సరిగా లేకపోవడం, స్త్రీలలో త రచూ గర్భస్రావం లాంటివి కలుగుతాయి? 1) ఇ 2) బి 3) సి 4) డి 46. సూర్యరశ్మి సమక్షంలో శరీరంలో తయా రయ్యే విటమిన్? 1) ఎ 2) బి 3) ఇ 4) డి 47. కిందివాటిలో సరికాని జత ఏది? 1) కార్బోహైడ్రేటులు - శక్తి 2) ప్రోటీన్లు - పెరుగుదల 3) విటమిన్లు - వ్యాధి నిరోధకత 4) కొవ్వులు - పెరుగుదల 48. మూత్రపిండాలు సరిగా పనిచేయనివారి మూత్రంలో ఎక్కువ పరిమాణంలో కని పించేది? 1) చక్కెర 2) క్రియాటినిన్ 3) ప్రోటీన్ 4) కొవ్వు 49. పండ్లలో చక్కెర ఏ రూపంలో ఉంటుంది? 1) సుక్రోస్ 2) గ్లూకోజ్ 3) ఫ్రక్టోజ్ 4) లాక్టోస్ 50. ముతక బియ్యం (పాలీష్ చేయని బియ్యం) ఉపయోగించి చేసే ఇడ్లీలో పుష్కలంగా లభించే విటమిన్ ఏది? 1) అ 2) ఆ12 3) ఇ 4) ఉ 51. డయాబెటీస్ వ్యాధిగ్రస్థుల మూత్రంలో ఎక్కువ పరిమాణంలో కనిపించే షుగర్ ఏది? 1) సుక్రోజ్ 2) ఫ్రక్టోజ్ 3) గ్లూకోజ్ 4) లాక్టోజ్ సమాధానాలు 1) 2 2) 3 3) 4 4) 4 5) 4 6) 1 7) 4 8) 1 9) 2 10) 3 11) 2 12) 2 13) 1 14) 3 15) 1 16) 1 17) 1 18) 1 19) 2 20) 3 21) 4 22) 2 23) 2 24) 4 25) 3 26) 3 27) 3 28) 1 29) 1 30) 2 31) 2 32) 1 33) 1 34) 1 35) 2 36) 1 37) 3 38) 4 39) 3 40) 1 41) 2 42) 4 43) 3 44) 4 45) 1 46) 4 47) 4 48) 2 49) 3 50) 2 51) 3 -
జేఈఈ అడ్వాన్సడ్ - 2015
జేఈఈ అడ్వాన్స్డ్.. లక్షా యాభై వేల మంది ప్రతిభావంతులు మాత్రమే హాజరయ్యే పరీక్ష. ఇందుకోసం విద్యార్థులు జేఈఈ-మెయిన్లోని పేపర్-1 పరీక్ష రాయాలి. జేఈఈ-మెయిన్ ద్వారా 1,50,000 మంది విద్యార్థులకు అడ్వాన్స్డ్కు అర్హత కల్పిస్తారు. వీరిలో 20,000 మంది విద్యార్థులకు ర్యాంక్ కేటాయిస్తారు. అడ్వాన్స్డ్ ర్యాంక్తోపాటు ఇంటర్లో టాప్ 20 పర్సంటైల్ లేదా 75 శాతం మార్కులు ఉంటేనే ఐఐటీలు, ఐఎస్ఎంలో ప్రవేశం లభిస్తుంది. ఆబ్జెక్టివ్గా రెండు పేపర్లు జేఈఈ అడ్వాన్స్డ్లో రెండు ఆబ్జెక్టివ్ పేపర్లు.. పేపర్-1, పేపర్-2 ఉంటాయి. ప్రతి పేపర్కు 180 మార్కుల చొప్పున మొత్తం కేటాయించిన మార్కులు 360. వీటిలో నాలుగు రకాల ప్రశ్నలిస్తారు. ప్రతి పేపర్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రతి పేపర్కు సమయం మూడు గంటలు. తప్పు సమాధానానికి నెగిటివ్ మార్కులిస్తారు. అంతేకాకుండా హాజరు విషయంలో కూడా పరిమితి విధించారు. ఈ క్రమంలో జేఈఈ-అడ్వాన్స్డ్కు వరుసగా రెండు సార్లు (సంవత్సరాలు) మాత్రమే రాసే అవకాశం ఉంది. మ్యాథమెటిక్స్ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశాలు: లిమిట్స్ అండ్ కంటిన్యుటీ, డిఫరెన్షిబిలిటీ, 3డీ లైన్స్-ప్లేన్స్ (అనుబంధ ప్రశ్నలు), క్వాడ్రాటిక్ ఈక్వేషన్స, మ్యాట్రిక్స్, మ్యాథమెటికల్ ఇండక్షన్, ఏరియా బౌండెడ్ బై కర్వ్స్, మాక్సిమ-మినిమ, జామెట్రికల్ అప్లికేషన్స్, కాంప్లెక్స్ నంబర్స్, అప్లికేషన్స్ ఆఫ్ వెక్టర్ అల్జీబ్రా, డిఫరెన్షియల్ ఇంటిగ్రేషన్.పిపరేషన్ కోసం 4-5 పుస్తకాలను రిఫర్ చేయడం కంటే ఏదో ఒక ప్రామాణిక పుస్తకాన్ని సంపూర్ణంగా చదవడమే ఉత్తమం. బీఆర్క్ కోసం ఏఏటీ బీఆర్క్ (ఆర్కిటెక్చర్)లో చేరాలనుకునే విద్యార్థులు ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఏఏటీ)కు హాజరు కావాలి. జేఈఈ-అడ్వాన్స్డ్లో ర్యాంక్ సాధించిన విద్యార్థులు మాత్రమే ఈ పరీక్షకు హాజరయ్యేందుకు అర్హులు. ఇందుకోసం 2015, జూన్ 18-19 మధ్య రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పరీక్షను 2015, జూన్ 21న నిర్వహిస్తారు. ఫిజిక్స్ ఫిజిక్స్లో కొన్ని అంశాలు ఉమ్మడిగా ఉంటాయి. వాటిని ఒకే సారి చదవడం ప్రయోజనకరం. ఉదాహరణకు గ్రావిటేషన్, ఎలక్ట్రోస్టాటిస్టిక్స్, మాగ్నో స్టాటిస్టిక్స్; కరెంట్ ఎలక్ట్రిసిటీ, హీట్ ట్రాన్స్ఫర్, ఫ్లూయిడ్ డైనమిక్స్; సౌండ్ వేవ్స్, వేవ్ ఆప్టిక్స్, సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్, సింపుల్ హార్మోనిక్ మోషన్; లీనియర్ డైనమిక్స్, రొటేషనల్ డైనమిక్స్; థర్మోడైనమిక్స్, కెమిస్ట్రీలోని థర్మోడైనమిక్స్ భాగం. థర్మోడైనమిక్స్, మోడ్రన్ ఫిజిక్స్. ఆప్టిక్స్లో.. ముందుగా వేవ్ టాపిక్స్ను పూర్తి చేయడం మంచిది. తర్వాత జామెట్రికల్ ఆప్టిక్స్ను ప్రిపేర్ కావాలి. వేవ్స్లో ట్రాన్స్వర్స్ వేవ్స్, సౌండ్ వేవ్స్కు వెయిటేజీ సమంగా ఉంటుంది. సింపుల్ హార్మోనిక్ మోషన్, ఫిజికల్ ఆప్టిక్స్, ఆసిలేషన్స్, ఏసీ సర్క్యూట్స్లలోని మ్యాథమెటికల్ పార్ట్ ప్రిపేర్ కావడం ఉపయుక్తం. గ్రావిటేషన్, ఎలక్ట్రోస్టాటిస్టిక్స్, మాగ్నటిజంలలో కూడా టాపిక్స్ కామన్. ప్రిన్సిపల్స్, అప్లికేషన్స్లో కొద్దిపాటి తేడా ఉంటుంది. కూలుంబ్స్ లా.. న్యూటన్స్ గ్రావిటేషన్ లాగా మారుతుంది. గాస్ లాను గ్రావిటేషన్ ఫీల్డ్ ఎవల్యూషన్లోనూ ఉపయోగించవచ్చు. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ, మాగ్నటిజం అంశాలను ఒక్కటిగా చదువుకోవచ్చు. కెమిస్ట్రీ గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే.. ఇనార్గానిక్ కెమిస్ట్రీకి అధిక ప్రాధాన్యతనిచ్చారు. కాబట్టి మెటలర్జీ, కాంప్లెక్స్ కంపౌండ్స్, అనలిటికల్ కెమిస్ట్రీ, పి-బ్లాక్ ఎలిమెంట్స్, డి-బ్లాక్ ఎలిమెంట్స్పై ఎక్కువగా దృష్టి సారించాలి. ఆర్గానిక్ కెమిస్ట్రీలో అడిగే ప్రశ్నలు ఆయా అంశాల్లోని ప్రాథమిక భావనలను పరీక్షించే విధంగా ఉంటాయి. ఉదాహరణకు ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్స్, రియాక్షన్ మెకానిజం, రీజెంట్స్, స్టెబిలిటీ ఆఫ్ ఇంటర్మీడియెట్స్. ఈ అంశానికి సంబంధించి ఇచ్చిన సిలబస్ వరకే పరిమితం కావడం మంచిది. ఫిజికల్ కెమిస్ట్రీలో మోల్ కాన్సెప్ట్, ఈక్విలెంట్ కాన్సెప్ట్స్, సాల్యుబులిటీ ప్రొడక్ట్, కామన్ ఆయాన్ ఎఫెక్ట్, ఎలక్ట్డ్ ్రపొటెన్షియల్ వంటి అంశాలపై దృష్టి సారించాలి. ఇందులో మెరుగైన మార్కులు సాధించాలంటే ప్రాథమిక భావనలపై పట్టు, ఇచ్చిన సమస్య ప్రకారం సూత్రాన్ని అన్వయించుకునే సామర్థ్యం వంటి నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. షెడ్యూల్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: మే 2, 2015. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ముగింపు: మే 7, 2015. అడ్మిట్ కార్డు డౌన్లోడింగ్: మే 9-12, 2015. పరీక్ష తేదీ: మే 24, 2015. వెబ్సైట్: http://jeeadv.iitd.ac.in -
ఓడ నది నుంచి సముద్రంలోకి ప్రవేశిస్తే... ?
నదీజలం కంటే సముద్ర జలాల్లో లవణాలు ఎక్కువ కాబట్టి సాంద్రత అధికంగా ఉంటుంది. అందువల్ల అత్యంత లవణమయమైన ‘డెడ్ సీ’ నీటిపై నడవవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో విక్రయించే మినరల్ వాటర్ను ‘తిరోగామి ద్రవాభిసరణ’ (రివర్స ఆస్మాసిస్) ప్రక్రియ ద్వారా ప్రాసెస్ చేస్తారు. ఇదే ఆర్.ఒ. ప్రక్రియగా ప్రాచుర్యంలో ఉంది. ఈ ప్రక్రియలో ‘మెంబ్రేన్’ (అతి సూక్ష్మ రంధ్రాలున్న పలుచని పొర) ద్వారా ఉప్పు (కఠిన) నీటిని అధిక పీడనాన్ని ఉపయోగించి పంపిస్తారు. మెంబ్రేన్ నుంచి స్వాదుజలం బయటకు వస్తుంది. దీనిలో అయాన్లన్నీతొలగిపోతాయి. కాబట్టి ‘డీ అయోనైజ్డ్ వాటర్’ అని కూడా అంటారు. హైడ్రోజన్ - దాని సమ్మేళనాలు ఆవర్తన పట్టికలో మొదటి మూలకం హైడ్రోజన్. ఇది అత్యంత తేలికైంది. సాధారణ హైడ్రోజన్ పరమాణు సంఖ్య ఒకటి, పరమాణు భారం ఒకటి. న్యూట్రాన్లు లేని ఒకే ఒక కేంద్రకం హైడ్రోజన్. దీన్నే ప్రోటియం అని కూడా అంటారు. దీని సమస్థానీయాలు (ఐసోటోపులు) డ్యుటీరియం, ట్రిటియం. డ్యుటీరియంనే భార హైడ్రోజన్ అంటారు. ట్రిటియం రేడియోధార్మిక కేంద్రకం. హైడ్రోజన్ అత్యంత శ్రేష్టమైన ఇంధనం. దీన్ని మండించినప్పుడు నీటి ఆవిరి (ఏ2ై) మాత్రమే విడుదలవుతుంది. కాబట్టి వాతావరణ కాలుష్యం ఉండదు. నక్షత్రాల్లోని శక్తికి మూలాధారం హైడ్రోజన్. హైడ్రోజన్కు చెందిన ఐసోటోపులు ‘కేంద్రక సంలీన’ చర్య ద్వారా అత్యధిక శక్తిని విడుదల చేస్తాయి. ఈ ప్రక్రియలోనే వివిధ మూలకాలు ఏర్పడతాయి. కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్ల మిశ్రమాన్నే (ఇై+ఏ2) ‘వాటర్ గ్యాస్’ అంటారు. దీన్నే నీలిగ్యాస్ అని కూడా అంటారు. హైడ్రోజన్ను ఇంధన ఘటాల్లో ఉపయోగిస్తారు. హైడ్రోజన్ లేదా కార్బన్ మోనాక్సైడ్ లేదా మీథేన్ లాంటి ఇంధనాలను దహనం చేయడం ద్వారా వచ్చే శక్తిని సరళరీతిలో విద్యుత్శక్తిగా మార్చే ఘటాలే ఇంధన ఘటాలు. వీటిలో ‘ఆక్సిజన్’ వాయువు ‘ఆక్సీకరణి’గా పనిచేస్తుంది. ఇది నూనెలను ‘హైడ్రోజనీకరణం’ చేసి ‘కొవ్వులు’గా మార్చడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియలో ఉత్ప్రేరకం ‘నికెల్’ లోహం. డాల్డాను ఈ విధానంలోనే రూ పొందిస్తారు. ‘ఫిషర్ - ట్రాప్స్’ పద్ధతిలో కృత్రిమంగా పెట్రోల్ తయారు చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఈ పద్ధతిలో ‘వాటర్ గ్యాస్’ ను దానిలో సగం పరిమాణం ఉన్న ‘హైడ్రోజన్’తో కలిపి ఐరన్ ఆక్సైడ్, కోబాల్ట్ ఉత్ప్రేరకాల సమక్షంలో 2000ఇ వద్ద వేడిచేస్తే హైడ్రోకార్బన్ల మిశ్రమం (కృత్రిమ గ్యాసోలిన్) వస్తుంది. ఆమ్లాల్లో ఒక ముఖ్యమైన అనుఘటకం హైడ్రోజన్. లోహ సంగ్రహణలో.. లోహ ఆక్సైడ్ల నుం చి క్షయకరణ పద్ధతిలో లోహాల్ని నిష్కర్షించడానికి హైడ్రోజన్ను ఉపయోగిస్తారు. నీరు గాలి తర్వాత అత్యంత అవసరమైంది నీరే. ప్రకృతిలో లభ్యమయ్యే నీటిలో అత్యంత శుద్ధమైంది ‘వర్షపు నీరు’. తాగడానికి పనికివచ్చే నీటిని ‘పోటబుల్ నీరు’ అంటారు. నాలుగింట మూడు వంతుల నీరు సముద్రాల్లోనే ఉంది. సముద్ర జలాల్లో అనేక రకాల లవణాలుంటాయి. ఈ నీరు తాగడానికి పనికి రాదు. సబ్బుతో నురగనివ్వదు. ఇలాంటి నీటిని కఠిన జలం అంటారు. ప్రధానంగా కాల్షియం, మెగ్నీషియం బైకార్బొనేట్లు; క్లోరైడ్లు; సల్ఫేట్లు ఉండటం వల్ల నీటికి కఠినత్వం వస్తుంది. నీటి కాఠిన్యత రెండు రకాలు. ఒకటి తాత్కాలిక కాఠిన్యత, రెండోది శాశ్వత కాఠిన్యత. తాత్కాలిక కాఠిన్యత: కాల్షియం బై కార్బొనేట్, మెగ్నీషియం బై కార్బొనేట్ లవణాల కారణంగా నీటికి తాత్కాలిక కాఠిన్యం వస్తుంది. నీటిని మరిగించడం ద్వారా తాత్కాలిక కాఠిన్యతను పూర్తిగా తొలగించవచ్చు. మరిగిస్తే బైకార్బొనేట్లు కార్బొనేట్లుగా అవక్షేపితమవుతాయి. నీటిని మరిగించినప్పుడు పాత్ర అడుగుభాగంలో తెల్లని పొలుసులను గమనించవచ్చు. ఈ పొలుసుల్లో ఉండేది కాల్షియం, మెగ్నీషియం కార్బొనేట్లు. ఈ ప్రక్రియలో కార్బన్ డై ఆక్సైడ్ కూడా విడుదలవుతుంది. దీని కారణంగానే నీటిని మరిగిస్తున్నప్పుడు బుడగలు వస్తాయి. తాత్కాలిక కాఠిన్యాన్ని తొలగించడానికి తోడ్పడే మరో విధానం ‘క్లార్క పద్ధతి’. కఠిన జలానికి సున్నపు నీరు లేదా మిల్క్ ఆఫ్ లైమ్ (కాల్షియం హైడ్రాక్సైడ్) కలపడం ద్వారా నీటి తాత్కాలిక కాఠిన్యాన్ని తొలగించవచ్చు. నీటి శాశ్వత కాఠిన్యత: కాల్షియం, మెగ్నీషియం క్లోరైడ్లు, సల్ఫేట్లు నీటికి శాశ్వత కాఠిన్యాన్ని కలుగజేస్తాయి. అంటే నీటిలో కాల్షియం క్లోరైడ్, కాల్షియం సల్ఫేటు, మెగ్నీషియం క్లోరైడ్, మెగ్నీషియం సల్ఫేట్లు కరిగి ఉంటాయి. సాధారణంగా పెర్మ్యుటిట్ (సోడియం అల్యూమినియం ఆర్థోసిలికేట్) లేదా కాల్గన్ (సోడియం హెక్సామెటా ఫాస్ఫేట్) ద్వారా కఠిన జలాన్ని పంపిస్తే అందులోని కాల్షియం, మెగ్నీషియం అయాన్లు తొలగిపోతాయి. అయాన్ మార్పిడి రెజిన్లు కూడా కఠిన జలాన్ని స్వాదుజలంగా మారుస్తాయి. ‘స్వేదన’ (డిస్టిలేషన్) ప్రక్రియ ద్వారా కూడా నీటి కఠినత్వాన్ని తొలగించవచ్చు. నీటిని మరిగించినప్పుడు ఆవిరవుతుంది. ఆవిరిని చల్లారిస్తే పరిశుద్ధ జలం (100% పరిశుద్ధమైంది) వస్తుంది. సముద్ర జలాన్ని ‘ఆవిరి చేయడం’ వల్ల చివరగా ఉప్పు మిగులుతుంది. నీటి రసాయన నామం హైడ్రోజన్ ఆక్సైడ్ నీటికి అనేక పదార్థాలను కరిగించుకునే స్వభావం ఉంటుంది. కాబట్టి దీన్ని సార్వత్రిక ద్రావణి అంటారు. 40ఇ వద్ద నీటికి గరిష్ఠ సాంద్రత ఉంటుంది. అందుకే నీటిని 00ఇ నుంచి 100ఇ వరకు వేడి చేసినప్పుడు ఉష్ణోగ్రత - ఘనపరిమాణానికి వక్రాన్ని గీస్తే ‘హాకీ స్టిక్’లా ఉంటుంది. ఘనపరిమాణం మొదట తగ్గి తర్వాత పెరుగుతుంది. నీరు 00ఇ (273ఓ) వద్ద ఘనీభవిస్తుంది. 1000ఇ (373ఓ) వద్ద మరుగుతుంది. లవణాలు ఎక్కువగా ఉండటం వల్ల సముద్ర నీటి సాంద్రత అధికంగా ఉంటుంది. అందువల్ల ఏదైనా వస్తువు నది నీటి నుంచి సముద్రం నీటిలోకి ప్రవేశిస్తే కొంచెం పైకి తేలుతుంది. నీటిని విద్యుద్విశ్లేషణ చేస్తే విఘటనం చెం ది హైడ్రోజన్, ఆక్సిజన్లుగా విడిపోతుంది. నీటిని క్రిమిరహితం చేయడానికి విరంజన చూర్ణం (బ్లీచింగ్ పౌడర్) లేదా క్లోరిన్ వాయువు లేదా అతి నీలలోహిత కిరణాలను ఉపయోగిస్తారు. పాత్రలో నీటిని వేడిచేసినప్పుడు పై నుంచి మరుగుతుంది. పొడిగాలి కంటే తడిగాలిలో ధ్వని వేగం ఎక్కువ. భారజలం రసాయనికంగా భారజలాన్ని డ్యుటీరియం ఆక్సైడ్ (ఈ2ై) అంటారు. దీన్ని హెచ్సీ యురే కనుగొన్నాడు. భారజలం ఘనీభవన స్థానం 3.820ఇ, భాష్పీభవన స్థానం 101.420ఇ. దీన్ని న్యూక్లియర్ రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగా న్ని తగ్గించడానికి మితకారిగా వాడతారు. -
బంగారాన్ని కరిగించడానికి వాడే మిశ్రమం ?
పోలీస్ కానిస్టేబుల్: రసాయన శాస్త్రం నైట్రోజన్ - దాని సమ్మేళనాలు నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటీ మొని, బిస్మత్ మూలకాలు నైట్రోజన్ కుటుంబానికి చెందుతాయి. వీటిని ఆవర్తన పట్టికలో 15వ గ్రూపు(VA)లో చేర్చారు. వీటిలో నైట్రోజన్, ఫాస్ఫరస్లు అలోహాలు. ఆర్సెనిక్, యాంటీమొనిలు అర్ధలోహాలు. చివరిదైన బిస్మత్ లోహం. నైట్రోజన్ ఇది గాలిలోని ప్రధాన అనుఘటకం. వాతావరణంలో ఇది ఘనపరిమాణాత్మకంగా 78% (4/5వ వంతు) ఉంటుంది. భార శాతంగా 3/4వ (75%) వంతు ఉంటుంది. భూ పటలంలో ఇది చిలీసాల్ట్ పీటర్ [NaNO3 సోడియం నైట్రేట్, ఇండియన్ సాల్ట్ పీటర్ [KNO3 పొటాషియం నైట్రేట్ల రూపంలో లభిస్తుంది. మొక్కలు, జంతువుల్లోని ప్రోటీన్లలో ఉండే ప్రధాన మూలకం నైట్రోజన్. వాతావరణంలో నైట్రోజన్ అణురూపంలో ఉంటుంది. ఇది ద్విపరమాణుక అణువు (ూ2) గా ఉంటుంది. రెండు పరమాణువుల మధ్య త్రికబంధం (మూడు బంధాలు) ఉంటుంది. జడవాయువుల తర్వాత చర్యాశీలత లేని మూలకాల్లో నైట్రోజన్ ఒకటి. స్థిరమైన ఎలక్ట్రాన్ విన్యాసం ఉండటం, మూడు బంధాలను విడగొట్టడానికి కావాల్సిన బంధశక్తి అధికంగా ఉండటం వల్ల దీని చర్యాశీలత తక్కువ. నైట్రోజన్ రంగు, రుచి, వాసన లేని వాయువు. ఇది గాలి కంటే తేలికైంది. నీటిలో కొద్దిగా కరుగుతుంది. ఇది విషవాయువు కాదు. అయినప్పటికీ నైట్రోజన్ వాతావరణంలో ఆక్సిజన్ అందకపోవడం వల్ల జంతువులు మరణిస్తాయి. ఇది దహనశీలి కాదు (మండదు). మండటానికి తోడ్పడదు (దహన దోహదకారి కాదు). మండే కొవ్వొత్తిని ఆర్పివేస్తుంది. అమ్మోనియా, నైట్రికామ్లం, కాల్షియం సయనమైడ్ లాంటి పారిశ్రామిక రసాయనాల తయారీలో, యూరియా నైట్రేట్ల లాంటి ఎరువుల తయారీలో నైట్రోజన్ను వినియోగిస్తారు. నైట్రోజన్ విషపూరిత పదార్థం సయనైడ్. ఉదా: KCN - పొటాషియం సయనైడ్. ద్రవ నైట్రోజన్ను జీవపదార్థాలు, వీర్యం, ఆహార పదార్థాలను నిల్వచేయడానికి, హిమాంక శస్త్రచికిత్సలో శీతలీకరణిగా ఉపయోగిస్తారు. ప్రయోగశాలల్లో, పరిశ్రమల్లో జడవాతా వరణాన్ని కలిగించడానికి దీన్ని ఉపయోగిస్తారు. – 210.5°C వద్ద ఇది రంగులేని ఘన పదార్థంగా మారుతుంది. ఘనస్థితిలో దీనికి a– నైట్రోజన్, b–Oనెట్రోజన్ అనే రూపాంతరాలుంటాయి. అమ్మోనియా నైట్రోజన్, హైడ్రోజన్తో కలిసి ఏర్పరిచే ప్రధాన సమ్మేళనం అమ్మోనియా (ూఏ3). దీనికి క్షారధర్మం ఉంటుంది. దీన్ని అధిక పీడనానికి గురిచేస్తే రంగులేని ద్రవంగా మారుతుంది. అమ్మోనియాను పారిశ్రామికంగా హేబర్ పద్ధతిలో తయారు చేస్తారు. నైట్రోజన్ ఈ పద్ధతిలో హైడ్రోజన్తో 500°C ఉష్ణోగ్రత, 200 అట్మాస్ఫియర్ల పీడనం వద్ద చర్యనొంది అమ్మోనియాను ఏర్పరుస్తుంది. ఈ చర్యలో ఇనుము (Fe) ఉత్ప్రేరకంగా, మాలిబ్డినం (Mo) ఉత్తేజకంగా పనిచేస్తాయి. దీనికి ఘాటైన వాసన ఉంటుంది. పబ్లిక్ టాయిలెట్లలో ఘాటైన వాసనకు కారణం ఇదే. ద్రవ అమ్మోనియా శీతలీకరణిగా ఉపయోగపడుతుంది. అమ్మోనియా లవణమైన అమ్మోనియం క్లోరైడ్ను సోల్డరింగ్లో ఉపయోగిస్తారు. అమ్మోనియా వాయువు ఉన్న జాడీలో హైడ్రోక్లోరికామ్లంలో ముంచిన గాజుకడ్డీని ఉంచితే దట్టమైన పొగలు రావడానికి కారణం అమ్మోనియం క్లోరైడ్ (NH4Cl) ఏర్పడటం. దీన్ని అమ్మోనాల్ ్రఅమ్మోనియం నైట్రేట్ (NH4NO3) + అల్యూమినియం పొడి (Al)], అమ్మోటాల్ [(NH4NO3+20% TNT) లాంటి పేలుడు పదార్థాల తయారీలో ఉపయోగిస్తారు. - అమ్మోనియం సల్య్ఫూరికామ్లం, నైట్రికామ్లం, ఫాస్ఫారికామ్లాలతో చర్యజరిపి వరుసగా అమ్మోనియం సల్ఫేట్, అమ్మోనియం నైట్రేట్, మోనో అమ్మోనియం ఫాస్ఫేట్ (MAP), డై అమ్మోనియం ఫాస్ఫేట్ (DAP)లను ఏర్పరుస్తాయి. వీటిలో మొదటి రెండు మొక్కలకు నైట్రోజన్ను, చివరివి నైట్రోజన్తో పాటు, ఫాస్ఫరస్ను అందిస్తాయి. కాల్షియం అమ్మోనియం నైట్రేట్ (కాల్షియం కార్బొనేట్, అమ్మోనియం నైట్రేట్ల మిశ్రమం) కూడా ఒక మంచి ఎరువు. యూరియా [NH2CONH2] కూడా నైట్రోజన్ ప్రధాన ఎరువు. కాల్షియం సయనమైడ్ (CaCN2)ను జలవిశ్లేషణం చేస్తే అమ్మోనియా వస్తుంది. ఇది ఒక ఎరువుగా పనిచేస్తుంది. - అమ్మోనియాను ఆక్సీకరిస్తే నైట్రిక్ ఆక్సైడ్ (NO) వస్తుంది. దీన్ని నైట్రికామ్లం తయారీలో ఉపయోగిస్తారు. - హైడ్రజీన్ (N2H4) అనేది నైట్రోజన్ మరో హైడ్రైడ్. ఇది రాకెట్ ఇంధనంగా పనిచేస్తుంది. నైట్రోజన్ ఆక్సైడ్లు నైట్రోజన్ ఆక్సిజన్తో కలిసి వివిధ ఆక్సైడ్లను ఇస్తుంది. - నైట్రస్ ఆక్సైడ్ (N2O)ను లాఫింగ్ గ్యాస్ అంటారు. దీన్ని ఒకప్పుడు మత్తు కలిగించడానికి ఉపయోగించేవారు. - సూపర్సోనిక్, జెట్ విమానాలు వాతావరణంలోకి నైట్రిక్ ఆక్సైడ్ (NO)ను విడుదల చేస్తాయి. ఇది కూడా ఓజోన్ పొరను క్షీణింపజేసే లక్షణం ఉన్న వాయువు. - నైట్రస్ ఆక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్లు గ్రీన్హౌస్ ఫలితానికి కూడా కారణమవుతాయి. - నైట్రిక్ ఆక్సైడ్, పెరాక్సీ ఎసిటైల్ నైట్రేట్, ఓజోన్లు ఫొటోకెమికల్ స్మాగ్కు కారణమవుతాయి. నైట్రికామ్లం (HNO3) - నైట్రోగ్లిసరిన్, డైనమైట్, TNT లాంటి పేలుడు పదార్థాల తయారీలో ఉపయోగపడుతుంది. - కృత్రిమ సిల్కు (సెల్యులోజ్ నైట్రేట్) తయారీలో ఉపయోగపడుతుంది. - 1 : 3 నిష్పత్తిలో గాఢ HNO3, గాఢ HCల మిశ్రమాన్ని ద్రవరాజం (ఆక్వారీజియా) అంటారు. దీన్ని బంగారం, ప్లాటినాన్ని కరిగించడానికి ఉపయోగిస్తారు. - నైట్రికామ్లం చర్మంపై పడితే పసుపురంగు లోకి మారుతుంది. ఈ చర్యలో గ్జాంతో ప్రోటీన్లు ఏర్పడతాయి. - ఇది నైట్రేట్ ఎరువుల తయారీలో ఉపయోగపడుతుంది. - వాతావరణంలోని నైట్రోజన్ వివిధ పద్ధతుల ద్వారా నైట్రేట్ లవణాలుగా భూమిని చేరడాన్ని ‘నత్రజని స్థాపన’ అంటారు. ఈ విధంగా భూమిన చేరిన నైట్రేట్లను మొక్కలు గ్రహించి ప్రోటీన్లను తయారుచేస్తాయి. - మొక్కలు, జంతువుల్లో ఉన్న క్లిష్టమైన ప్రోటీన్లు యూరియా లాంటి సామాన్య పదార్థాలుగా, తిరిగి ఇవి అమ్మోనియా లవణాలుగాను మారతాయి. - వృక్ష, జంతు కళేబరాల లాంటి వ్యర్థ పదార్థాలను ‘అమ్మోనిఫైయింగ్ బ్యాక్టీరియా’ అమ్మోనియా, అమ్మోనియం లవణాలుగా మారుస్తుంది. మాదిరి ప్రశ్నలు 1. గాలిలో నైట్రోజన్ ఘనపరిమాణ శాతం? 1) 20 2) 78 3) 70 4) 50 2. అమ్మోనాల్ అనే పేలుడు పదార్థంలో అల్యూమినియం పొడితోపాటు ఉండే అమ్మోనియం లవణం? 1) అమ్మోనియం కార్బొనేట్ 2) అమ్మోనియం సల్ఫేట్ 3) అమ్మోనియం నైట్రేట్ 4) అమ్మోనియం క్లోరైడ్ 3. వేరు బుడిపెలు ఉండి నత్రజని స్థాపన చేసే మొక్క ఏది? 1) మొక్కజొన్న 2) చిక్కుడు 3) వరి 4) వెదురు సమాధానాలు 1) 2; 2) 3; 3) 2; డాక్టర్ బి. రమేష్ సీనియర్ ఫ్యాకల్టీ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జమ్మికుంట, కరీంనగర్ జిల్లా. -
కెమిస్ట్రీలో ముగ్గురికి నోబెల్
స్టాక్హోమ్: ఈ ఏడాది రసాయన శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి లభించింది. అమెరికాకు చెందిన ఎరిక్ బెట్జిగ్, స్టెఫాన్ డబ్ల్యూ హెల్, విలియమ్ ఈ మోర్నర్లను సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేశారు. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ బుధవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. -
ప్లాస్టర్ ఆఫ్ పారిస్లో ప్రధాన రసాయన పదార్థం?
కెమిస్ట్రీ 1. సిమెంటు తయారీకి కావాల్సిన ప్రధాన ముడి పదార్థం? 1) ఇసుక 2) సున్నపురాయి 3) సోడాయాష్ 4) ఏదీకాదు 2. సిమెంట్ను 1824లో ఒక తాపీమేస్త్రీ కనుగొన్నాడు. అతని పేరు? 1) జె. ఎడిసన్ 2) జె. ఏస్పిడిన్ 3) జె. థామ్సన్ 4) జె. పోర్టలాండ్ 3. కింది వాటిలో సిమెంటు పరిశ్రమకు అవసరమైంది? 1) సున్నపురాయి 2) బంకమన్ను 3) బొగ్గు 4) అన్నీ 4. సరైన వాక్యాలను గుర్తించండి? 1) సిమెంట్ పరిశ్రమలో చివరికి ఏర్పడే కాల్షియం సిలికేట్, అల్యూమినియం సిలికేట్ల గట్టి ముద్దలను క్లింకర్లు అంటారు. 2) క్లింకర్లను చూర్ణం చేసి 2-3 శాతం జిప్సంను కలిపితే వచ్చేది సిమెంట్. 3) జిప్సం వల్ల సిమెంట్కు గట్టిపడే గుణం వస్తుంది. 4) అన్నీ సరైనవే. 5. సిమెంట్ తయారీలో చిట్ట చివర కలిపే పదార్థం? 1) బంకమన్ను 2) సిలికా 3) సున్నపురాయి 4) జిప్సం 6. జిప్సంను 1200ఇ-1300ఇకు వేడిచేస్తే ఒకటిన్నర అణువుల స్ఫటిక జలాన్ని కోల్పోయి కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ ఏర్పడుతుంది. దీన్ని ఏమంటారు? 1) ప్లాస్టర్ ఆఫ్ పారిస్ 2) సిమెంట్ 3) గాజు 4) పోర్సెలిన్ 8. భారాత్మకంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్లో సగభాగం నీటితో కలిపితే ముద్దగా మారి కొంత కాలం తర్వాత గట్టి పదార్థంగా మారుతుంది. దీన్నే ‘సెట్టింగ్’ అని అంటారు. ఈ ప్రక్రియలో ఘనపరిమాణం పెరగడంతోపాటు? 1) కార్బొనేషన్ జరుగుతుంది. 2) నిర్జలీకరణం (డీహైడ్రేషన్) చోటు చేసుకుంటుంది. 3) హైడ్రేషన్ జరుగుతుంది. 4) హైడ్రోజనీకరణం సంభవిస్తుంది. 9. ఒక భాగం తడి సున్నం, మూడు భాగాల ఇసుక, నీరు బాగా కలిసి ఉన్న మిశ్రమాన్ని ఏమంటారు? 1) లైమ్ మోర్టార్ 2) లైమ్ సిమెంట్ 3) రేయిన్ఫోర్సడ్ కాంక్రీట్ 4) ఏదీకాదు 10. విరిగిన ఎముకలు సరైన స్థానాల్లో సెట్ చేయడానికి సిమెంట్ పట్టిగా దేన్ని ఉపయోగిస్తారు? 1) జిప్సం 2) సున్నం 3) సిమెంట్ 4)ప్లాస్టర్ ఆఫ్ పారిస్ 11. గాజు అనేది? 1) నిజమైన ఘన పదార్థం 2) స్ఫటిక పదార్థం 3) అతిశీతలీకరణం చెందిన ద్రవం 4) వాయు పదార్థం 12. గాజు అనేది కింది వాటి మిశ్రమం? ఎ) సోడియం సిలికేట్ బి) కాల్షియం సిలికేట్ సి) సిలికా 1) ఎ, బి మాత్రమే 2) బి, సి మాత్రమే 3) ఎ, బి, సి 4) ఎ, సి మాత్రమే 13. గాజు తయారీకి అవసరమైన ముడి పదార్థాలు? 1) సోడాయాష్ 2) సున్నపురాయి 3) ఇసుక 4) అన్నీ 14. గాజును నెమ్మదిగా చల్లార్చడాన్ని మందశీతలీకరణం అంటారు. దీని వల్ల గాజుకు? 1) పెలుసుదనం వస్తుంది 2) అధిక బలం లభిస్తుంది 3) మందం ఎక్కువ అవుతుంది 4) ఏదీకాదు 15. గాజును వేడిచేసి, మెత్తగా మార్చి దానిలోకి గాలిని ఊది కోరిన ఆకృతిగల గాజు వస్తువులను తయారు చేసే సాంకేతిక నైపుణ్యాన్ని ఏమంటారు? 1) గ్లాస్ మేకింగ్ 2) గ్లాస్ బ్రేకింగ్ 3) గ్లాస్ బ్లోయింగ్ 4) గ్లాస్ ఫ్లోయింగ్ 16. కిటికీ అద్దాలు, గాజు సీసాల తయారీలో ఉపయోగించే గాజు రకం? 1) సోడాగాజు 2) క్వార్ట్జ గాజు 3) పెరైక్స్ గాజు 4) గట్టి గాజు 17. గాజు మంచి? 1) విద్యుత్ వాహకం 2) అర్థ వాహకం (సెమీకండక్టర్) 3) ఉష్ణబంధకం (ఇన్సులేటర్) 4) ఉష్ణవాహకం 18. విద్యుత్ బల్బులు, దృశా పరికరాల తయారీకి ఉపయోగించే గాజు? 1) పెరైక్స్ గాజు 2) క్వార్ట్జ గాజు 3) సోడాగాజు 4)పెరైక్స్గాజు 19. జపతపర్చండి? గాజుకు కలిపే పదార్థం గాజుకు వచ్చే రంగు 1. మాంగనీస్ డై ఆక్సైడ్ ఎ. ఊదా 2. కాపర్ సల్ఫైడ్ బి. నీలం 3. క్రోమియం ఆక్సైడ్ సి. ఆకుపచ్చ 4. క్యూప్రస్ ఆక్సైడ్ డి. ఎరుపు ఎ బి సి డి 1) 1 2 3 4 2) 4 3 4 1 3) 3 1 2 4 4) 2 3 4 1 20. గాజుకు ముఖ్యమైన ముడి పదార్థం అయిన ఇసుక రసాయన నామం? 1) సిలికాన్ 2) సిలికా 3) అల్యూమినా 4) మార్బుల్ 21. సిలికా రసాయన ఫార్మూలా? 1) సిలికాన్ డై ఆక్సైడ్ (జీౌ2) 2) సిలికాన్ (జీ) 3) సిలికాన్ కార్బైడ్ (జీఛి) 4) ఏదీకాదు 22. ఇసుకకు స్ఫటిక రూపాంతరం? 1) రూబీ 2) క్వార్ట్జ 3) కోక్ 4) సాండ్ స్టోన్ 23. రసాయనికంగా క్వార్ట్జ అనేది వీటిలో ఏదీ? (ౌ్కజీఛ్ఛి ఇౌట్ట్చఛ్ఛ 2012) 1) కాల్షియం సిలికేట్ 2) సిలికాన్ ఆక్సైడ్ 3) సోడియం సల్ఫేట్ 4) కాల్షియం సల్ఫేట్ 24. కుండలు, మట్టి సామాగ్రి, పింగాణీ (పోర్సిలిన్) మొదలైన వస్తువులను ఏమంటారు? 1) మృర్మొయ పాత్రలు (సిరామిక్స్) 2) కాస్మొటిక్స్ 3) గాజు 4) లేపనాలు 25. సిరామిక్స్ పరిశ్రమకు ప్రధాన ముడి ఖనిజం? 1) బంకమన్ను 2) సున్నపురాయి 3) బాక్సైట్ 4) బోరాక్స్ 26. సిరామిక్స్ పరిశ్రమలో కింది వాటిలో ఏది అవసరం లేదు? 1) బంకమన్ను 2) ఫెల్స్ఫార్ ఖనిజం 3) ఇసుక 4) సోడాయాష్ 27. సిలికాన్ దేనిలో ఉంది? 1) బొగ్గు 2) ఇసుక 3) చలువరాయి 4) ఉప్పు 28. {పయోగశాలలో అతి నీలలోహిత కిరణాలను (్ఖగ) పంపించడానికి ఉపయోగించే గాజు? 1) సోడా గాజు 2) పెరైక్స్ గాజు 3) క్వార్ట్జ గాజు 4) మెత్తటి గాజు 29. జతపర్చండి? (ఐ 2012) ముడిపదార్థం ఉత్పాదితం 1. లైమ్స్టోన్ ఎ. పోర్సిలీన్ 2. జిప్సం బి. గ్లాస్ 3. సిలికా ఇసుక సి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ 4. మట్టి డి. సిమెంట్ 1 2 3 4 1) 1 2 3 4 2) 4 3 2 1 3) 1 3 4 2 4) 4 1 3 2 30. పాలరాయి/సున్నపురాయి రసాయన నామం? ఐ (2011) 1) ఇ్చఇౌ3 2) CaSo4 3) ఇ్చఏఇౌ3 4) కజఇౌ3 31. గాజు వస్తువుల బ్లోయింగ్కు ఉపయోగించే మంట? 1) ఆక్సీజన్ - ఎసిటలీన్ టార్చి 2) హైడ్రోజన్ టార్చి 3) కోక్ మంట 4) కట్టెల మంట 32. ఫేస్ పౌడర్కు అవసరం లేని గుణం? 1) అపారదర్శకత 2) జారుడు గుణం 3) శోషణం 4) గరుకుదనం 33. టాల్క్లో ఉండే రసాయనం? 1) మెగ్నీషియం ఆక్సైడ్ 2) మెగ్నీషియం సిలికేట్ 3) మెగ్నీషియం డై ఆక్సైడ్ 4) కాల్షియం కార్బొనేట్ 34. పౌడర్లో అపార దర్శకత (కప్పి ఉండే సామర్థ్యం) కోసం దేన్ని ఉపయోగిస్తారు? 1) టైటానియం డై ఆక్సైడ్ 2) సిలికాన్ డై ఆక్సైడ్ 3) బంకమన్ను 4) సుద్ద 35. జతపర్చండి. 1. సున్నపురాయి ఎ. ఇై2 2. పొడి సున్నం బి. ఇ్చఇై3 3. తడిసున్నం (సున్నపుతేట) సి. ఇౌ్చ 4. కార్బన్ డై ఆక్సైడ్ డి. ఇ్చ(ైఏ)2 ఎ బి సి డి 1) 1 2 3 4 2) 2 3 4 1 3) 3 2 1 4 4) 4 1 3 2 36. మనం తినే పాన్ను చేసేటప్పుడు తమలపాకుపై రాసే సున్నపు తేట రసాయన నామం? 1) కాల్షియం కార్బొనేట్ 2) కాల్షియం హైడ్రాక్సైడ్ 3) కాల్షియం ఆక్సైడ్ 4) కాల్షియం సల్ఫేట్ 37. ప్లాస్టర్ ఆఫ్ పారిస్లో ప్రధాన రసాయన పదార్థం? 1) కాల్షియం కార్బొనేట్ 2) కాల్షియం సల్ఫేట్ 3) కాల్షియం ఫాస్ఫేట్ 4) కాల్షియం కార్బైడ్ 38. ఎముకల్లో ఉండే ప్రధాన కాల్షియం పదార్థం? 1) కాల్షియం సల్ఫేట్ 2) కాల్షియం ఫాస్ఫేట్ 3) కాల్షియం కార్బైడ్ 4) కాల్షియం కార్బొనేట్ 39. ఎముకలు బలంగా ఉండటానికి అవసరమైనవి? 1) కాల్షియం 2) ఫ్లోరైడ్ 3) రెండూ 4) ఏదీకాదు 40. సున్నపుతేటను పాలవలె మార్చే వాయువు? 1) బొగ్గు పులుసు వాయువు (కార్బన్ డై ఆక్సైడ్) 2) కార్బన్ మోనాక్సైడ్ 3) నైట్రోజన్ 4) సల్ఫర్ డై ఆక్సైడ్ 41. సున్నపు తేటను గోడలకు వెల్ల వేసినప్పుడు అది గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్ పీల్చుకుని తెల్లగా మారుతుంది. ఇందులో చివరగా ఏర్పడే పదార్థం? 1) కాల్షియం కార్బొనేట్ 2) కాల్షియం సల్ఫేట్ 3) కాల్షియం కార్బైడ్ 4) కాల్షియం ఫాస్ఫేట్ 42. విరంజన చూర్ణం (బ్లీచింగ్ పౌడర్) రసాయన ఫార్మూలా? 1) ఇ్చఇ2 2) ఇ్చైఇ2 3) ఇ్చఇౌ3 4) ఇ్చఇౌ3 43. బ్లీచింగ్ పౌడర్ను నీటిలో కరిగించినప్పుడు విడుదలయ్యే వాయువు ఏది? 1) క్లోరిన్ 2) ఆక్సిజన్ 3) ఫ్లోరిన్ 4) అయొడీన్ 44. మున్సిపల్ వాటర్ను శుద్ధి చేసే ప్రక్రియ? 1) ఆక్సీజినేషన్ 2) క్లోరినేషన్ 3) అయొడినేషన్ 4) హైడ్రేషన్ 45. మామిడి కాయలను కృత్రిమంగా పక్వానికి తెప్పించడానికి కాల్షియం కార్బైడ్ ముద్దలను ఉపయోగిస్తారు. తేమలో ఈ పదార్థం నుంచి విడుదలైన ఏ వాయువు ఈ ప్రక్రియకు తోడ్పడుతుంది? 1) ఇథిలీన్ 2) ఎసిటలీన్ 3) క్లోరోఫాం 4) హైడ్రోజన్ 46. బేకింగ్ సోడా రసాయన నామం? 1) కాల్షియం కార్బొనేట్ 2) కాల్షియం బైకార్బొనేట్ 3) సోడియం కార్బొనేట్ 4) సోడియం బైకార్బొనేట్ 47. చాకలి సోడా రసాయన నామం? 1) సోడియం కార్బొనేట్ 2) సోడియం బై కార్బొనేట్ 3) సోడియం క్లోరైడ్ 4) సుక్రోజ్ 48. జతపర్చండి? 1. సోడియం కార్బొనేట్ 2. సోడియం బై కార్బొనేట్ 3. సోడియం క్లోరైడ్ 4. సోడియం హైడ్రాక్సైడ్ 1 2 3 4 1) 1 2 3 4 2) 2 3 1 4 3) 2 3 4 1 4) 3 1 2 4 49. సాధారణ ఉప్పు (టేబుల్ సాల్ట్) రసాయన నామం? 1) సోడియం సల్ఫేట్ 2) సోడియం క్లోరైడ్ 3) సోడియం హైడ్రాక్సైడ్ 4) సోడియం ఫాస్ఫేట్ 50. సాధారణంగా స్విమ్మింగ్ పూల్లోకి ప్రవేశించే ముందు కాళ్లు కడుక్కోవడానికి పింక్ రంగు ద్రావణం ఉపయోగిస్తారు? అందులో కలిపే క్రిమి సంహార ధర్మం కలిగిన పదార్థం? 1) పొటాషియం పర్మాంగనేట్ 2) పొటాషియం క్లోరేట్ 3) పొటాషియం సల్ఫేట్ 4) హైడ్రోజన్ పెరాక్సైడ్ 51. రాళ్లలో, ఖనిజాల్లోనూ అత్యధిక పరిమాణంలో ఉండే మూలకం? 1) సిలికాన్ 2) కార్బన్ 3) ఐరన్ 4) అల్యూమినియం సమాధానాలు: 1) 2; 2) 2; 3) 4; 4) 4; 5) 4; 6) 1; 7) 1; 8) 3; 9) 1; 10) 4; 11) 3; 12) 3; 13) 4; 14) 2; 15) 3; 16) 1; 17) 3; 18) 2; 19) 1; 20) 2; 21) 1; 22) 2; 23) 2; 24) 1; 25) 1; 26) 4; 27) 2; 28) 3; 29) 2; 30) 1; 31) 1; 32) 4; 33) 2; 34) 1; 35) 2; 36) 2 37) 2; 38) 2; 38) 3; 40) 1; 41) 1; 42) 2; 43) 1; 44) 2; 45) 2; 46) 4; 47) 1; 48) 3; 49) 2; 50) 1; 51) 1. -
బల్బుల ఫిలమెంట్లో ఉపయోగించే కఠినమైన లోహం?
రసాయన శాస్త్రం లోహశాస్త్రం లోహశాస్త్రం అత్యంత ప్రాచీనమైంది. వేదకాలం నుంచే రాగిని ఉపయోగిస్తున్నారు. బం గారం, ప్లాటినం లోహాలు ప్రకృతిలో స్వాభావికంగా లభిస్తున్నాయి. మిగిలినవన్నీ సంయోగ రూపంలో లభిస్తాయి. వీటినే ఖనిజాలు అంటారు. అన్ని ఖనిజాల నుంచి లోహాన్ని లాభసాటిగా నిష్కర్షణ చేయలేం. పారిశ్రామికంగా లోహాన్ని వేరు చేసే ఖనిజాన్ని ఆ లోహ ‘ధాతువు’ అంటారు. లోహాలు - వాటి ధాతువులు ఇనుము: హెమటైట్, మాగ్నటైట్, సిడరైట్ అల్యూమినియం: బాక్సైట్, క్రయొలైట్, కోరండం రాగి (కాపర్): కాపర్ పైరైటీస్, మాలకైట్ మెగ్నీషియం: మాగ్నసైట్, డోలమైట్ కాల్షియం: సున్నపురాయి (కాల్షియం కార్బొనేట్) యురేనియం: పిచ్బ్లెండ్ సాధారణంగా గది ఉష్ణోగ్రత వద్ద మెర్క్యురీ (ద్రవం)తప్ప మిగిలినవన్నీ ఘన పదార్థాలే. సోడియం, పొటాషియం తప్ప మిగిలిన లోహాలన్నీ కఠినమైనవి. లోహాల్లోకెల్లా అత్యంత సాగే గుణం కలిగింది బంగారం. మంచి విద్యుద్వాహకం సిల్వర్. అరచేతిలో (శరీర ఉష్ణోగ్రత వద్ద) కరిగిపోయే లోహం గాలియం. భూ పటలంలో అత్యధికంగా లభించే లోహం అల్యూమినియం. రెండో స్థానంలో ఐరన్ ఉంటుంది. లోహ నిష్కర్షణ: ధాతువు నుంచి వివిధ భౌతిక రసాయనిక చర్యల ద్వారా లోహాన్ని వెలికితీసే పద్ధతినే లోహ నిష్కర్షణ అంటారు. ధాతువులో లోహంతోపాటు కలిసి ఉండే ఇసుక, బంకమట్టి, రాళ్లు, క్వార్టజ్ మొదలైన మలినాలను గాంగు అంటారు. ధాతువును గాలిలేకుండా బాగా వేడిచేసి బాష్పశీల మలినాలను తొలగించే పద్ధతిని భస్మీకరణం(కాల్షినేషన్) అంటారు. ఉదా: కాల్షియం కార్బొనేట్ను బట్టీలో వేడిచేస్తే కార్బన్డై ఆక్సైడ్ వేరుపడి, కాల్షియం ఆక్సైడ్ ఏర్పడుతుంది. మలిన లోహ ద్రవానికి కార్బన్ పొడి కలిపి పచ్చి కర్రలతో వేగంగా రుద్ది లోహాన్ని వేరు చేసే ప్రక్రియ పోలింగు. గాలి సమక్షంలో ధాతువును వేడిచేసే ప్రక్రియ భర్జనం. ధాతువు కరిగే ఉష్ణోగ్రతను తగ్గించడానికి కలిపే పదార్థాన్ని ద్రవకారి అంటారు. సాధారణంగా ఇనుమును శుద్ధి చేయడానికి బ్లాస్ట్ కొలిమిని ఉపయోగిస్తారు. బ్లాస్ట్ కొలిమిలో గరిష్ట ఉష్ణోగ్రత 1500నిఇ వరకు ఉంటుంది. బ్లాస్ట్ కొలిమిలో కోక్ అసంపూర్తిగా మండిన తర్వాత వచ్చిన ‘కార్బన్ మోనాక్సైడ్’ సమక్షంలో ఐరన్ ఆక్సైడ్ ఐరన్గా ‘క్షయకరణం’ చెందుతుంది. సుమారు 750నిఇ వద్ద కొలిమిలో ఏర్పడిన లోహం గుల్లబారి ఉంటుంది. దీన్నే ‘స్పాంజ్ ఇనుము’ అంటారు. ఇనుము రకాల్లో అత్యంత శుద్ధమైంది చేత ఇనుము. (అత్యల్ప కార్బన్ శాతం) ఉంటుంది. పిగ్ ఐరన్లో గరిష్ట శాతంలో కార్బన్ ఉంటుంది. ఎలక్ట్రో ప్లేటింగ్: లోహాల క్షయాన్ని నిరోధించడానికి, తుప్పు పట్టకుండా ఉండటానికి ఎలక్ట్రోప్లేటింగ్ లేదా గాల్వనైజింగ్ పద్ధతులను ఉపయోగిస్తారు. ఎలక్ట్రో ప్లేటింగ్ ద్వారా ఒక లోహంపై మరో లోహపు పూత పూస్తారు. ఈ పద్ధతిలో ఏ లోహంతో పూత పూయాలో ఆ లోహం ఉన్న ద్రావణాన్ని విద్యుద్వి శ్లేష్యంగా, ఏ లోహంపై పూత పూయాలో దాన్ని కాథోడ్గా తీసుకొని విద్యుద్విశ్లేషణ చేస్తారు. గాల్వనైజింగ్ పద్ధతిలో ఏదైనా లోహంపై పూత పూయడానికి ఉపయోగించే లోహం జింక్. మిశ్రమ లోహాలు: రెండు లేదా అంతకంటే ఎక్కువ లోహాల సజాతీయ మిశ్రమాన్ని మిశ్రమ లోహం అంటారు. మిశ్రమ లోహాలకు ఉన్నత ధర్మాలు వస్తాయి. తుప్పుపట్టే గుణం తక్కువ. మిశ్రమలోహంలో ఒక లోహం మెర్క్యురీ అయితే దాన్ని అమాల్గం అంటారు. ఐరన్, ప్లాటినం లోహలు మిశ్రమ లోహాలను ఏర్పరచవు. విగ్రహాల తయారీలో ఉపయోగించే పంచలోహాలు...గోల్డ్+ సిల్వర్+ కాపర్+ ఐరన్+ లెడ్. బంగారం, ప్లాటినం వంటి ఉన్నత లోహాలను కరిగించడానికి ద్రవరాజం (అక్వారీజియా) ఉపయోగిస్తారు. ఇది 3:1 నిష్పత్తిలో గాఢ హైడ్రోక్లోరికామ్లం, గాఢ నైట్రికామ్లాల మిశ్రమం. స్టీల్ (ఉక్కులో) సాధారణంగా కార్బన్ శాతం 0.1 నుంచి 2 వరకు ఉంటుంది. గతంలో అడిగిన ప్రశ్నలు 1. ఆహారపు పాత్రలకు టిన్ (తగరం)తో పూత పూస్తారు. కానీ జింక్తో కాదు. ఎందుకంటే? (కానిస్టేబుల్-2013) 1) తగరం కంటే జింక్ తక్కువ ప్రతిస్పందన (చర్యాశీలత) కలిగి ఉండటం వల్ల 2) జింకు తగరం కంటే ఖరీదైంది 3) జింక్, తగరం కంటే ఎక్కువ మెల్టింగ్ పాయింట్ కలిగి ఉండటం 4) జింక్, తగరం కంటే ఎక్కువ ప్రతిస్పందనను కలిగి ఉండటం జవాబు: 4 2. స్టెయిన్లెస్ స్టీలు దేని మిశ్రమం? (కానిస్టేబుల్ - 2012) 1) ఐరన్, నికెల్ 2) ఐరన్, క్రోమియం, నికెల్ 3) ఐరన్, క్రోమియం,జింక్ 4) ఐరన్, మాంగనీస్ జవాబు: 2. మాదిరి ప్రశ్నలు 1. అల్యూమినియం ప్రధానంగా ఏ ఖనిజం నుంచి లభిస్తుంది? 1) బాక్సైట్ 2) హెమటైట్ 3) మాగ్నసైట్ 4) సిడరైట్ 2. ఎర్రబాక్సైట్లో ఏది మలినంగా ఉంటుంది? 1) ఐరన్ ఆక్సైడ్ 2) సిలికా 3) కాపర్ ఆక్సైడ్ 4) ఏదీకాదు 3. పంచలోహంలో ఉండని లోహం ఏది? 1) బంగారం 2) వెండి 3) కాపర్ 4) టంగ్స్టన్ 4. భూమి పొరల్లో అంత్యంత విస్తారంగా లభించే లోహం ఏది? 1) అల్యూమినియం 2) ఐరన్ 3) కాపర్ 4) సిల్వర్ 5. ఏదైనా లోహం తుప్పుపట్టినపుడు దాని బరువు? 1) తగ్గుతుంది 2) పెరుగుతుంది 3) మారదు 4) లోహ స్వభావంపై ఆధారపడి ఉంటుంది 6. ఐరన్ తుప్పు పట్టినపుడు ఏర్పడే పదార్థం? 1) ఐరన్ కార్బైడ్ 2) ఐరన్ సల్ఫైడ్ 3) ఐరన్ ఆక్సైడ్ 4) ఐరన్ క్లోరైడ్ 7. బైరైటీస్ ఖనిజం ఏ లోహానికి సంబంధించింది? 1) కాల్షియం 2) బేరియం 3) ఐరన్ 4) కాపర్ 8. పైరైటీస్ ఖనిజం ప్రధానంగా ఏ లోహానికి సంబంధించినది? 1) అల్యూమినియం 2) గోల్డ్ 3) సిల్వర్ 4) కాపర్ 9. ఇత్తడి, కంచులో ఉండే సాధారణ లోహం ఏది? 1) జింక్ 2) మెగ్నీషియం 3) కాపర్ 4) అల్యూమినియం 10. జర్మన్ సిల్వర్లో లేని లోహం ఏది? 1) సిల్వర్ 2) కాపర్ 3) జింక్ 4) నికెల్ 11. లోహక్షయాన్ని నివారించడానికి ఏ లోహపు పూత పూస్తారు? 1) జింక్ 2) టిన్ 3) నికెల్ 4) పైఅన్నీ 12. భూమిలో స్వేచ్ఛాస్థితిలో లభించే లోహం ఏది? 1) బంగారం 2) సిల్వర్ 3) కాపర్ 4) పైవన్నీ 13. బల్బుల ఫిలమెంట్లో ఉపయోగించే కఠినమైన లోహం? 1) బంగారం 2) టంగ్స్టన్ 3) వెండి 4) ఇనుము 14. అత్యంత విద్యుద్వాహకత కల్గిన లోహం? 1) వెండి 2) బంగారం 3) అల్యూమినియం 4) రాగి 15. క్లోరోఫిల్లో ఉండే ప్రధాన లోహం? 1) ఐరన్ 2) మెగ్నీషియం 3) కాపర్ 4) జింక్ 16. రక్తంలోని ఎరుపు వర్ణదం హిమోగ్లోబిన్లో ఉండే లోహం? 1) ఐరన్ 2) మెగ్నీషియం 3) కాపర్ 4) జింక్ 17. ఎంజైముల్లో ఉండే ప్రధాన లోహం? 1) కాపర్ 2) జింక్ 3) ఐరన్ 4) అల్యూమినియం 18. వంటపాత్రలకు ఎక్కువగా ఉపయోగించే స్టీలు? 1) క్రోమ్ స్టీలు 2) స్టెయిన్లెస్ స్టీలు 3) టంగ్స్టన్ స్టీలు 4) ఇన్వార్ స్టీలు 19. కార్నలైట్ దేని ధాతువు? 1) రాగి 2) మెగ్నీషియం 3) కాల్షియం 4) జింక్ 20. ఎర్రని నేలలో ప్రధానంగా ఉండే లోహం? 1) ఐరన్ 2) కాల్షియం 3) అల్యూమినియం 4) రాగి 21. దుక్క ఇనుములో గల కార్బన్ శాతం? 1) 0-1 2) 0.2-2 3) 3-4 4) 5-10 22. శస్త్ర చికిత్స సాధనాలు తయారు చేయ డానికి ఉపయోగించే మిశ్రమలోహం? 1) స్టెయిన్లెస్ స్టీలు 2) టంగ్స్టన్ స్టీలు 3) ఇన్వార్ స్టీలు 4) క్రోమ్ స్టీలు 23. విద్యుత్ నిరోధాలు తయారు చేయడానికి ఉపయోగించే మిశ్రమలోహం? 1) గన్ మెటల్ 2) నిక్రోమ్ 3) స్టీలు 4) ఇన్వార్ 24. స్టెయిన్లెస్ స్టీలులో క్రోమియం శాతం? 1) 5-0 2) 12-20 3) 10-12 4) 6-10 25. లోహాల్లోకెల్లా అత్యంత సాగే గుణం కలిగింది? 1) బంగారం 2) రాగి 3) స్టీలు 4) ఇత్తడి సమాధానాలు: 1) 1; 2) 1; 3) 4; 4) 1; 5) 2; 6) 3; 7) 2; 8) 4; 9) 3; 10) 1; 11) 4; 12) 1; 13) 2; 14) 1; 15) 2; 16) 1; 17) 2; 18) 1; 19) 2; 20) 1; 21) 3; 22) 1; 23) 2; 24) 2; 25) 1. -
గోబర్ గ్యాస్లో ప్రధాన అనుఘటకం?
COMPETITIVE GUIDANCE - GS రసాయన శాస్త్రం ఇంధనాలు - హైడ్రోకార్బన్లు మండించినప్పుడు శక్తినిచ్చే పదార్థాన్ని ఇంధనం అంటారు. ఇవి మూడు రకాలు. అవి: * ఘన ఇంధనాలు: వంట చెరకు, పిడకలు, బొగ్గు (కోల్), వంట బొగ్గు (కోక్). * ద్రవ ఇంధనాలు: కిరోసిన్, పెట్రోల్, డీజిల్, ఆల్కహాల్. వాయు ఇంధనాలు: హైడ్రోజన్, ఎల్పీజీ, సహజవాయువు (సీఎన్జీ), వాటర్ గ్యాస్, ప్రొడ్యూసర్ గ్యాస్ మొదలైనవి. వీటన్నింటిలో వాయు ఇంధనాలు శ్రేష్టమైనవి. వీటిని నిల్వ, రవాణాలో కొన్ని ఇబ్బందులుంటాయి. సాధారణంగా ఇంధన సామర్థ్యాన్ని కెలోరిఫిక్ విలువల్లో వ్యక్తం చేస్తారు. ఒక గ్రామ్ ఇంధనాన్ని పూర్తిగా మండించినప్పుడు విడుదలయ్యే శక్తి (జౌల్లలో)నే దాని కెలోరిఫిక్ విలువగా పేర్కొంటారు. సాధారణంగా వీటిని బాంబ్ కెలోరీ మీటర్ సహాయంతో నిర్ధారిస్తారు. కెలోరిఫిక్ విలువ ఎంత ఎక్కువగా ఉంటే ఆ ఇంధన సామర్థ్యం అంత ఎక్కువ. కొన్ని ఇంధనాల కెలో రిఫిక్ విలువలను పట్టికలో గమనించవచ్చు. వాయు ఇంధనమైన హైడ్రోజన్ అత్యంత శ్రేష్టమైంది, పర్యావరణ హితమైంది. దీని కెలోరిఫిక్ విలువ అధికంగా ఉండటమే కాకుండా, మండించినప్పుడు కేవలం నీటి ఆవిరి మాత్రమే విడుదలవుతుంది. దీని తయారీకి ఖర్చు ఎక్కువవుతుంది. నీటిని విద్యుద్విశ్లేషణ చేసినప్పుడు దాని నుంచి హైడ్రోజన్ విడిపో తుంది. ఇతర ఇంధనాలను మండించినప్పుడు కార్బన్ డై ఆక్సైడ్తోపాటు సల్ఫర్ డై ఆక్సైడ్ లాంటి కాలుష్యకారకాలు కూడా వాతావరణంలోకి విడుదలవుతాయి. ఎందుకంటే వాటన్నింటిలోనూ కార్బన్ తప్పనిసరిగా ఉంటుంది. బొగ్గు కొన్ని మిలియన్ సంవత్సరాలకు పూర్వం వృక్షాలు, జంతువులు భూమి అట్టడుగు పొరల్లో నిక్షిప్తమై, వాయురహిత స్థితిలో అనేక వియోగ చర్యలకు గురవడం వల్ల బొగ్గు ఏర్పడింది. వృక్షాలు వాటి పెరుగుదలకు సూర్యశక్తిని వినియోగించుకుంటాయి. అందువల్ల బొగ్గులో ఉష్ణశక్తి నిక్షిప్తమై ఉంటుంది. అందుకే బొగ్గు నిక్షేపాలను ‘సూర్యశక్తి గిడ్డంగులు’ అంటారు. బొగ్గు అనేది కార్బన్ రూపాంతరం (అల్లోట్రోప్). ఒకే రసాయన, విభిన్న భౌతిక ధర్మాలున్న పదార్థాలనే రూపాంతరాలు అంటారు. గ్రాఫైట్, డైమండ్, జాంతవాంగరం (ఎముకబొగ్గు), కోక్ మొదలైనవి కార్బన్ ఇతర రూపాంతరాలు. బొగ్గులో నాలుగు ప్రధాన రకాలున్నాయి. అవి: ఆంథ్రసైట్, బిట్యుమినస్, లిగ్నైట్, పీట్. వీటిలో ఆంథ్రసైట్ అత్యంత పురాతనమైంది, శ్రేష్టమైంది. దీనిలో అత్యధిక శాతం (95%) కార్బన్ ఉంటుంది. బిట్యుమినస్ లేదా రాతిబొగ్గులో 82% కార్బన్ ఉంటుంది. కార్బన్ శాతం ఎంత ఎక్కువగా ఉంటే అంత తక్కువ బూడిద వస్తుంది. బొగ్గును గాలి తగలకుండా 5000ఇ-10000ఇ వరకు వేడి చేస్తే అనేక రకాల వాయు, ద్రవ, ఘన కర్బన పదార్థాలుగా మార్పు చెందుతుంది. ఈ ప్రక్రియనే బొగ్గు స్వేదనం లేదా ఉష్ణ విశ్లేషణం (కార్బొనైజేషన్) అంటారు. ఈ ప్రక్రియలో కోక్, కోల్ తార్, లైట్ ఆయిల్, కోల్ గ్యాస్ లభిస్తాయి. కోక్, కోల్ గ్యాస్ ఇంధనాలు. కోల్ తార్ నుంచి ఫినాల్, పిరిడీన్, నాఫ్తలీన్, రోడ్డు వేసే తారు లాంటి పదార్థాలు లభిస్తాయి. తేలిక నూనె నుంచి బెంజీన్, టోలీన్ లాంటి రసాయనాలు లభిస్తాయి. వీటిని అద్దకం రంగులు, ఔషధాలు, పేలుడు పదార్థాలు, క్రిమి సంహారక మందుల తయారీలో ఉపయోగిస్తారు. ముడిచమురు చిన్న మొక్కలు, సముద్ర జంతువుల అవశేషాలు భూ పొరల్లో నిక్షిప్తమై వియోగానికి గురవడం వల్ల ఏర్పడిన వివిధ కర్బన పదార్థాల మిశ్రమమే ‘పెట్రోలియం’ లేదా ‘ముడి చమురు’. దీన్ని వెలికి తీసిన తర్వాత, రిఫైనరీల్లో ‘పాక్షిక అంశిక స్వేదనం’ ప్రక్రియ ద్వారా అనుఘటకాలను వేరు చేస్తారు. వేర్వేరు ఉష్ణోగ్రతల వద్ద వేర్వేరు పదార్థాలు వస్తాయి. (పట్టికలో గమనించవచ్చు) * పెట్రోకెమికల్స్: పెట్రోలియం నుంచి లభించే వివిధ పదార్థాలనే పెట్రోకెమికల్స్ అంటారు. * హైడ్రోకార్బన్లు: కేవలం హైడ్రోజన్, కార్బన్ మాత్రమే ఉన్న సమ్మేళనాలను హైడ్రోకార్బన్లు అంటారు. కార్బన్ల సంఖ్య పరమాణు భారం పెరిగే క్రమంలో వరుసగా మీథేన్, ఈథేన్, ప్రొపేన్, బ్యూటేన్, పెంటేన్, హెక్సేన్, ... క్రమంలో ఉంటాయి. వీటిలో మొదటి ఐదు వాయువులు. హెక్సేన్ నుంచి ద్రవాలు. కార్బన్ల సంఖ్య 16 దాటితే ఘన పదార్థాలు. ఇథిలీన్, ఎసిటలీన్ అసంతృప్త హైడ్రోకార్బన్లు. ఎల్పీజీ: ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్)లో ప్రధాన వాయువు బ్యుటేన్ (-బ్యుటేన్, ఐసో బ్యుటేన్). కొద్ది పరిమాణంలో ప్రొపేన్, ఈథేన్ కూడా ఉంటాయి. ఎల్పీజీని ప్రధానం గా వంటగ్యాస్గా ఉపయోగిస్తారు. వాహనా ల్లోనూ ఇంధనంగా వినియోగిస్తున్నారు. మీథేన్: ఇది చిత్తడి నేలల్లో, పంట పొలాల్లో లభిస్తుంది. అందువల్ల దీన్ని ‘మార్ష గ్యాస్’ అంటారు. ఇది బొగ్గు గనుల్లో గాలితో కలిసి పేలుడు స్వభావమున్న మిశ్రమాన్ని ఏర్పరుస్తుంది. కాబట్టి దీన్ని ‘ఫైర్ డాంప్’ అని కూడా అంటారు. గనుల్లో దీన్ని డేవీ ల్యాంప్ ద్వారా గుర్తిస్తారు. బయోగ్యాస్, గోబర్ గ్యాస్ (పేడ నుంచి తయారు చేసేది)లో ప్రధాన అనుఘటకం మీథేన్. కోల్గ్యాస్, సహజవాయువు (సీఎన్జీ)లోనూ మీథేన్ ప్రధానమైంది. దీన్ని ఇంధనంగానే కాకుండా కార్బన్ బ్లాక్, ప్రింటింగ్ ఇంక్ల తయారీలోనూ వాడతారు. అసంతృప్త హైడ్రోకార్బన్ అయిన ఇథిలీన్ను ఉపయోగించి పండ్లను కృత్రిమంగా పక్వానికి వచ్చేలా చేస్తారు. ప్రాచీన కా లంలో దీన్ని మత్తు తెప్పించడానికి కూడా వాడేవారు.కాల్షియం కార్బైడ్ను జలవిశ్లేషణ చేస్తే ఎసిటలీన్ వస్తుంది. దీన్ని కూడా పండ్లను కృత్రిమంగా పక్వానికి వచ్చేలా చేయడానికి విరివిగా (అనుమతి లేకుండా) విని యోగిస్తున్నారు. ఇది హానికరమైంది. ఎ క్కువ ఉష్ణోగ్రత వద్ద వెల్డింగ్ చేయడానికి ‘ఆక్సీ-ఎసిటలీన్’ను టార్చి రూపంలో వా డతారు. ఎసిటలీన్ కూడా ఒక అసంతృప్త హైడ్రోకార్బన్.ప్లాస్టిక్ పరిశ్రమకు ఆధారం పెట్రోలియం ఉత్పత్తులే. * పారిశ్రామిక ఇంధన వాయువులు: వాటర్ గ్యాస్, ప్రొడ్యూసర్ గ్యాస్ ప్రధాన పారిశ్రామిక ఇంధన వాయువులు. * కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్ వాయువుల మిశ్రమాన్నే ‘వాటర్ గ్యాస్’ అంటా రు. ఇది నీలిమంటను ఇస్తుంది. కాబట్టి దీన్ని ‘నీలిగ్యాస్’ అంటారు. పారిశ్రామిక సంశ్లేషణ (సింథసిస్)లోనూ ఉపయోగించడం వల్ల దీన్ని ‘సిన్గ్యాస్’ అంటారు. * కార్బన్మోనాక్సైడ్, నైట్రోజన్ల మిశ్రమాన్ని ‘ప్రొడ్యూసర్ గ్యాస్’ అంటారు. * ఫిషర్-ట్రాప్ పద్ధతిలో వాటర్ గ్యాస్ నుంచి, బెర్జియస్ పద్ధతిలో కోల్ నుంచి కృత్రిమంగా పెట్రోల్ (గ్యాసోలిన్)ను తయారు చేస్తారు. * పెట్రోల్, ఆల్కహాల్ల మిశ్రమాన్ని ‘గ్యాసోహాల్’ అంటారు. * ద్రవ హైడ్రోజన్, హైడ్రజీన్లను రాకెట్ ప్రొ పెల్లెంట్లుగా ఉపయోగిస్తారు. ద్రవ ఆక్సీజన్, ద్రవీకృత నైట్రోజన్ టెట్రాక్సైడ్ లేదా నైట్రికామ్లాలను ఆక్సీకరణులుగా వాడతారు. కాంపిటీటివ్ కౌన్సెలింగ్ నేను డీఎస్సీకి సన్నద్ధమవుతున్నాను. మెథడాలజీ విభాగానికి ఏవిధంగా ప్రిపేరవ్వాలో సూచనలివ్వండి. - పి. మేఘన, మూసాపేట డీఎస్సీ/ టెట్లో విజయాన్ని నిర్ణయించే కీలక విభాగం మెథడాలజీ. ఈ విభాగంలో ప్రతి ప్రశ్నకు ఇచ్చే నాలుగు ఆప్షన్లు చాలా దగ్గరగా ఉంటాయి. అభ్యర్థులు సరిగా సన్నద్ధమవకపోతే చాలా రకాల తప్పులు చేయడానికి ఆస్కారముంది. మెథడాలజీలోని కీలకాంశాలు.. బోధనా లక్ష్యాలు, అభ్యసనానుభవాలు, మూల్యాంకనం, బోధనా పద్ధతులు, బోధనోపకరణాలు. ఇందులో ప్రశ్నలు విశ్లేషణాత్మకంగా, అనువర్తనాలతో కూడినవై ఉంటాయి. ఈ విభాగంలోని అంశాలను కంటెంట్లోని పాఠ్యాంశాలకు అన్వయించుకుని ప్రిపరేషన్ సాగించాలి. భావనలను తరగతి, ఉపాధ్యాయుడు, విద్యార్థికి అనుప్రయుక్తం చేసుకుని అధ్యయనం చేయాలి. బోధనా పద్ధతుల విషయంలో కొంత అయోమయం ఉంటుంది. క్షుణ్నంగా అధ్యయనం చేయడం ద్వారా దీన్ని అధిగమించవచ్చు. ఏయే సబ్జెక్ట్కు ఏ పద్ధతి సరిపోతుందనే అంశంపై అవగాహన పెంచుకోవాలి. రోజులో కనీసం 2 గంటలు మెథడాలజీ కోసం కేటాయించాలి. గత ప్రశ్నపత్రాలను, మోడల్ టెస్ట్లను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఈ విభాగానికి సంబంధించినంతవరకూ వివిధ రకాల మెటీరియల్పై కాకుండా తెలుగు అకాడమీ పుస్తకాలపై ఆధారపడటమే శ్రేయస్కరం. - జంపాన సుధాకర్, సీనియర్ ఫ్యాకల్టీ. మాదిరి ప్రశ్నలు 1. మంచి ఇంధనం లక్షణాన్ని గుర్తించండి. ఎ) తేలికగా నిల్వ చేయగలగాలి బి) అధిక కెలోరిఫిక్ విలువ ఉండాలి సి) తేలికగా రవాణా చేయగలగాలి డి) కెలోరిఫిక్ విలువ తక్కువగా ఉండాలి 1) ఎ, బి మాత్రమే 2) ఎ, సి, డి 3) ఎ, బి, సి 4) బి, డి 2. పరిశ్రమలు ప్రాధాన్యమిచ్చే ఇంధనం రకం ఏది? 1) ద్రవ 2) ఘన 3) వాయు 4) జెల్ 3. గ్యాసోహాల్లో పెట్రోల్తో కలిపే పదార్థం? 1) మీథెల్ ఆల్కహాల్ 2) ఇథైల్ ఆల్కహాల్ 3) ఎసిటోన్ 4) ఫార్మలిన్ 4. గోబర్ గ్యాస్లో ప్రధాన అనుఘటకం ఏది? (గ్రూప్-1, 2008) 1) మీథేన్ 2) ఈథేన్ 3) ప్రొపేన్ 4) బ్యుటేన్ 5. కిందివాటిలో మీథేన్ ఎందులో ప్రధాన అనుఘటకం కాదు? 1) సంపీడ్య సహజ వాయువు (సీఎన్జీ) 2) బయోగ్యాస్ 3) ప్రొడ్యూసర్ గ్యాస్ 4) మార్ష గ్యాస్ 6. కోల్ గ్యాస్ వేటి మిశ్రమం? ఎ) హైడ్రోజన్ బి) మీథేన్ సి) కార్బన్ మోనాక్సైడ్ డి) బ్యుటేన్ 1) ఎ, బి 2) బి, సి 3) ఎ, బి, సి 4) ఎ, డి మాత్రమే 7. గనుల్లో పేలుడుకు కారణమైన వాయు మిశ్రమం ఏది? (సివిల్స్, 2008) 1) హైడ్రోజన్, ఆక్సిజన్ 2) ఆక్సిజన్, ఎసిటలీన్ 3) మీథేన్, గాలి 4) కార్బన్ డై ఆక్సైడ్, మీథేన్ -
గ్రూపులో సాధారణంగా పెరిగే ధర్మాలు ఏవి?
రసాయన శాస్త్రం: మూలకాల వర్గీకరణ - ఆవర్తన ధర్మాలు అసంఖ్యాకంగా ఉన్న మూలకాల ధర్మాలను అర్థం చేసుకోవడానికి వాటి వర్గీకరణ చాలా అవసరం. ఈ దిశగా చేసిన ప్రయత్నాల్లో మొదటగా చెప్పుకోవాల్సింది ‘డాబర్ నీర్ త్రికసిద్ధాంతం’. దీని ప్రకారం మూలకాలను వాటి పరమాణు భారాల ఆరోహణ క్రమంలో అమర్చినప్పుడు త్రికంలోని మధ్య మూలకం పరమాణుభారం మొదటి, మూడో మూలకాల పరమాణు భారాల సగటుకు దాదాపుగా సమానం. డాబర్నీర్ త్రికాలకు ఉదాహరణలు: క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ (Cl, Br, I) లిథియం,సోడియం,పొటాషియం(Li, Na, K) ఐరన్, కోబాల్ట్, నికెల్ (Fe, Co, Ni) న్యూలాండ్, మెండలీఫ్ కూడా మూలకాలను వాటి పరమాణుభారాల ఆరోహణ క్రమంలో వర్గీకరించారు. న్యూలాండ్ మూలకాలను వాటి పరమాణు భారాల ఆరోహణ క్రమంలో అమర్చినప్పుడు ప్రతి 8వ మూలకం, మొదటి మూలక ధర్మాన్ని పోలి ఉండటాన్ని గమనించి, ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. దీన్నే ‘న్యూలాండ్ అష్టక సిద్ధాంతం’ అంటారు. దీన్ని భారతీయ సంగీతంలోని స్వరాలు ‘స రి గ మ ప ద ని స’లతో పోల్చవచ్చు. మెండలీఫ్ పూర్తిస్థాయిలో, క్రమ పద్ధతిలో వర్గీకరణ చేశాడు. ఇతడు మూలకాల ధర్మాలు వాటి పరమాణు భారాల ఆవర్తన ప్రమేయాలు అనే ఆవర్తన నియమాన్ని ప్రతిపాదించాడు. పరమాణు భారాలను నిర్ణయించే సరైన పద్ధతులు లేనప్పటికీ కొన్ని మూలకాల ఉనికిని, వాటి ధర్మాలను ఊహించగలగడం మెండలీఫ్ గొప్పదనం. ఉదాహరణకు పరమాణుభారం 68 ఉన్న మూలకాన్ని ఊహించి, దానికి ‘ఎకా అల్యూమినియం’ అని పేరు పెట్టాడు. 1875లో డెబోస్పాడ్రన్ ఈ మూలకాన్ని కనుగొని ‘గాలియం’ అని పేరు పెట్టాడు. అదేవిధంగా పరమాణు భారం 44 ఉన్న మూలకాన్ని ఊహించి, ‘ఎకా బోరాన్’గా నామకరణం చేయగా, దీన్ని నిల్సన్ కనుగొని ‘స్కాండియం’ అని పేరు పెట్టాడు. మూలకాల ధర్మాలు వాటి పరమాణు సంఖ్య లేదా ఎలక్ట్రాన్ విన్యాసాల ఆవర్తన ప్రమేయాలు అని మోస్లే ప్రతిపాదించాడు. ప్రస్తుతం వినియోగిస్తున్న విస్తృత ఆవర్తన పట్టిక లేదా ఆధునిక ఆవర్తన పట్టికను ఈ ఆవర్తన నియమం ఆధారంగానే రూపొందించారు. - ఆవర్తన పట్టికలోని నిలువు వరుసలను గ్రూపులుగా, అడ్డు వరుసలను పీరియడ్లుగా వ్యవహరిస్తారు. - సుమారు 117 మూలకాలను 7 పీరియడ్లు, 16 గ్రూపులుగా విభజించారు. - మొదటి పీరియడ్ అతి చిన్న పీరియడ్. దీనిలో హైడ్రోజన్, హీలియం అనే రెండు మూలకాలు మాత్రమే ఉన్నాయి. హైడ్రోజన్ పట్టికలోని మొదటి మూలకం. ఇది అత్యంత తేలికైంది. - అత్యంత పొడవైన పీరియడ్ 6వది. దీంట్లో 32 మూలకాలున్నాయి. - 7వది అసంపూర్తి పీరియడ్. - {పతి పీరియడ్ జడవాయువుతో అంతమవుతుంది. అవి: హీలియం (He), నియాన్ (Ne), ఆర్గాన్ (Ar), క్రిప్టాన్ (Kr), క్జినాన్ (Xe), రెడాన్ (Rn) సాధారణంగా ఆవర్తన పట్టికలో ఎడమవైపు లోహాలు, కుడివైపు అలోహాలుంటాయి. ఆవర్తన ధర్మాలు: ఒక నిర్దిష్ట వ్యవధిలో పునరావృతమయ్యే ధర్మాలను ఆవర్తన ధర్మాలు అంటారు. అవి: పరమాణు పరిమాణం రుణ విద్యుదాత్మకత ఎలక్ట్రాన్ అఫినిటీ అయనీకరణ శక్మం ధన విద్యుదాత్మకత పరమాణు పరిమాణం: కేంద్రకం నుంచి బాహ్య కక్ష్యలోని ఎలక్ట్రాన్ మేఘం వరకు ఉన్న మధ్య దూరాన్ని పరమాణు పరిమాణం అంటారు. దీన్ని అంగ్స్ట్రామ్ యూనిట్లలో కొలుస్తారు. - పీరియడ్లో ఎడమ నుంచి కుడికి కేంద్రకావేశం పెరగడం వల్ల పరమాణు పరిమాణం తగ్గుతుంది. - గ్రూపులో పై నుంచి కిందికి కక్ష్యల సంఖ్య పెరగడం కారణంగా (ఉల్లిగడ్డపై పొరలు పెరిగినట్లు) పరమాణు పరిమాణం పెరుగుతుంది. రుణ విద్యుదాత్మకత (ఎలక్ట్రో నెగెటివిటీ): బంధంలోని పరమాణువు ఎలక్ట్రాన్ జంటను తనవైపు ఆకర్షించుకునే స్వభావాన్ని రుణ విద్యుదాత్మకత అంటారు. - రుణ విద్యుదాత్మకతను పౌలింగ్ స్కేలు ద్వారా కొలుస్తారు. - పీరియడ్లో ఎడమ నుంచి కుడికి రుణ విద్యుదాత్మకత పెరుగుతుంది. - గ్రూపులో పై నుంచి కిందికి రుణ విద్యుదాత్మకత తగ్గుతుంది. - రుణ విద్యుదాత్మకత గరిష్టంగా ఫ్లోరిన్కు, కనిష్టంగా సీజియంకు ఉంటుంది. - రుణ విద్యుదాత్మకత కలిగిన మూలకాలు ఎలక్ట్రాన్లను గ్రహించి ‘రుణ అయాన్లు లేదా ఆనయాన్’లను ఏర్పరుస్తాయి. అయనీకరణ శక్మం: వాయుస్థితిలోని పరమాణు బాహ్య ఆర్బిటాల్ నుంచి ఒక ఎలక్ట్రాన్ను తీసివేయడానికి కావాల్సిన కనీస శక్తిని ‘అయనీకరణ శక్మం’ అంటారు. దీని ప్రమాణం ఎలక్ట్రాన్ వోల్ట్. - సాధారణంగా పీరియడ్లో ఎడమ నుంచి కుడికి అయనీకరణ శక్మం పెరుగుతుంది. (కొన్ని మినహాయింపులుంటాయి) - గ్రూపులో పై నుంచి కిందికి అయనీకరణ శక్మం తగ్గుతుంది. సాధారణంగా లోహాలకు అత్యల్ప అయనీకరణ శక్మం ఉంటుంది. ఎలక్ట్రాన్ అఫినిటీ: వాయుస్థితిలో ఉన్న పరమాణు బాహ్య ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ను చేర్చినప్పుడు వెలువడే శక్తినే ‘ఎలక్ట్రాన్ అఫినిటీ లేదా ఎలక్ట్రాన్ గ్రాహ్య ఎంథాల్ఫీ’ అంటారు. - గ్రూపులో పై నుంచి కిందికి ఎలక్ట్రాన్ అఫినిటీ తగ్గుతుంది. పీరియడ్లో పెరుగుతుంది (కొన్ని మినహాయింపులుంటాయి) - ఆవర్తన పట్టికలో గరిష్ట ఎలక్ట్రాన్ అఫినిటీ ఉన్న మూలకం క్లోరిన్. ధన విద్యుదాత్మకత: ఎలక్ట్రాన్లను కోల్పోయే స్వభావాన్ని ధన విద్యుదాత్మకత అంటారు. - సాధారణంగా లోహాలకు ధన విద్యుదాత్మకత ఎక్కువగా ఉంటుంది. - పరమాణువులు ఎలక్ట్రాన్లను కోల్పోయి ‘ధనాత్మక అయాన్లు లేదా కేటయాన్’లుగా మారతాయి. ఆక్సీకరణ, క్షయకరణ ధర్మాలు: - ఒక సమ్మేళనానికి ఆక్సిజన్ కలపడం లేదా హైడ్రోజన్ను తీసివేయడం లేదా పరమాణువు నుంచి ఎలక్ట్రాన్లను తీసివేయడాన్ని ‘ఆక్సీకరణం’ అంటారు. - ఒక సమ్మేళనానికి హైడ్రోజన్ను కలపడం లేదా ఆక్సీజన్ను తీసివేయడం లేదా పరమాణువులకు ఎలక్ట్రాన్లను కలపడాన్ని ‘క్షయకరణం’ అంటారు. - ఆవర్తన పట్టికలో ఎడమవైపున్న మూలకాలు లేదా లోహాలు బలమైన క్షయకరణులుగా పని చేస్తాయి ఉదా: సీజియం, పొటాషియం. గ్రూపులో ఈ ధర్మం పెరుగుతుంది, పీరియడ్లో తగ్గుతుంది. కార్బన్ మోనాక్సైడ్ (CO), కోక్ లాంటివి కూడా బలమైన క్షయకరణులుగా పని చేస్తాయి. ఇవి లోహశాస్త్రంలో ఎక్కువగా ఉపయోగపడతాయి. ఆక్సీకరణ ధర్మం గ్రూపులో తగ్గుతుంది, పీరియడ్లో పెరుగుతుంది. ఆవర్తన పట్టికలో కుడివైపున ఉన్న మూలకాలు (జడవాయువులు మినహా) బలమైన ఆక్సీకరణులు. ఉదా: హాలోజన్లు (ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్). మాదిరి ప్రశ్నలు 1.మెండలీఫ్ ఆవర్తన పట్టికను దేని ఆధారంగా రూపొందించాడు? 1) పరమాణు భారం 2) పరమాణు సైజు 3) పరమాణు సంఖ్య 4) పరమాణు ఘన పరిమాణం 2. సరైన వాక్యాలను గుర్తించండి. ఎ. మూలకాలను మొదటిసారిగా వర్గీకరించింది డాబర్నీర్ బి. పరమాణు సైజు ప్రమాణం అంగ్ స్ట్రామ్ సి. ఎకా అల్యూమినియంకు గాలియం అని పేరు పెట్టారు డి. విస్తృత లేదా ఆధునిక ఆవర్తన పట్టికను పరమాణు సంఖ్య ఆధారంగా రూపొం దించారు. 1) ఎ, బి మాత్రమే 2) బి, సి మాత్రమే 3) ఎ, బి, సి మాత్రమే 4) ఎ, బి, సి, డి 3. గ్రూపులో పై నుంచి కిందికి పోయే కొద్దీ పరమాణు పరిమాణం? 1) తగ్గుతుంది 2) పెరుగుతుంది 3) మారదు 4) మొదట పెరిగి, తర్వాత తగ్గుతుంది 4. స్కాండియంను కనుగొన్నది? 1) డెబోస్పాడ్రన్ 2) నీల్సన్ 3) డాబర్నీర్ 4) లోథర్ మేయర్ 5. సరైన వాక్యాలు గుర్తించండి. ఎ. ఒక సమ్మేళనానికి హైడ్రోజన్ కలపడాన్ని క్షయకరణమంటారు బి. లోహాలు బలమైన క్షయకరణులు సి.గ్రూపులో క్షయకరణ ధర్మం పెరుగుతుంది 1) ఎ, బి మాత్రమే 2) బి, సి మాత్రమే 3) ఎ, బి, సి 4) ఏదీకాదు 6. నిశ్చితవాక్యం (A): ఆవర్తన పట్టికలో రసాయన మూలకాల ఎలక్ట్రాన్ అఫినిటీ ఎల్లప్పుడూ పై నుంచి కిందికి పెరుగుతుంది. కారణం(R): పరమాణు వ్యాసార్ధం సాధారణంగా పై నుంచి కిందికి పెరుగుతుంది. 1) అ, ఖ సరైనవి. R, A కు సరైన వివరణ. 2) అ, ఖ సరైనవి. R, A కు సరైన వివరణ కాదు. 3) అ సరైంది, R సరైంది కాదు 4) అ సరైంది కాదు, R సరైంది 7. సాధారణంగా ఒక ఎలక్ట్రోనెగెటివ్ మూలకం పరమాణువు అయాన్ అయితే? 1) అది ఒకటి లేదా అంత కంటే ఎక్కువ ఎలక్ట్రాన్లను కోల్పోతుంది 2) అది అయనీకరణం చెందుతుంది 3) దాని పరమాణు సంఖ్య పెరుగుతుంది 4) దాని ఎలక్ట్రాన్ల సంఖ్య పెరుగుతుంది 8. సరైన వాక్యాన్ని గుర్తించండి. ఎ. ఒక పరమాణువు ఎలక్ట్రాన్లను గ్రహించినప్పుడు ఏర్పడే రుణ అయాన్ సైజు పెరుగుతుంది. బి. ఒక పరమాణువు ఎలక్ట్రాన్లను కోల్పోయి అయనీకరణం చెందినప్పుడు దాని పరిమాణం తగ్గుతుంది. సి. పరమాణువు ఎలక్ట్రాన్లను గ్రహించినా లేదా కోల్పోయినా దాని పరిమాణం మారదు డి. లోహాలకు ఎలక్ట్రాన్లను గ్రహించే స్వభావం అధికంగా ఉంటుంది. 1) సి మాత్రమే 2) సి, డి మాత్రమే 3) ఎ, బి, సి మాత్రమే 4) ఎ, బి, సి, డి 9. గ్రూపులో సాధారణంగా పెరిగే ధర్మాలు ఏవి? ఎ) పరమాణు పరిమాణం బి) లోహ స్వభావం సి) ఎలక్ట్రో నెగెటివిటి డి) అయనీకరణ శక్మం 1) ఎ, బి 2) బి, సి 3) సి, డి 4) బి, సి, డి సమాధానాలు: 1) 1; 2) 4; 3) 2; 4) 2; 5) 3; 6) 4; 7) 4; 8) 3; 9) 1. -
అణురియాక్టర్లలో భారజలం చేసే పని?
కేంద్రక రసాయన శాస్త్రం కేంద్రక విచ్ఛిత్తి: ఒక భారకేంద్రకాన్ని న్యూట్రాన్లతో తాడనం (Collision) చెందించినప్పుడు దాదాపు సమాన భారాలున్న రెండు కేంద్రకాలుగా విడిపోయే ప్రక్రియనే కేంద్రక విచ్ఛిత్తి (Nuclear fission) అంటారు. ఈ ప్రక్రియ లో కొన్ని మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్ల శక్తి విడుదలవుతుంది. ఉదా: యురేనియం-235 కేంద్రకాన్ని న్యూట్రాన్లతో తాడనం చెందిస్తే బేరియం-141, క్రిప్టాన్-92 కేంద్రకాలుగా విడిపోయి 200 క్ఛగ శక్తి విడుదలవుతుంది. పరమాణు బాంబు లేదా కేంద్రక బాంబులో ఇమిడి ఉన్న సూత్రం ఇదే. ఈ చర్యలో గామా కిరణాలతో పాటు సగటున 2 నుంచి 3 న్యూట్రాన్లు విడుదలవుతాయి. ఇవి మరికొన్ని కేంద్రకాలను తాడ నం చెందిస్తాయి. ఇది ఒక అనియంత్రిత శృంఖ ల చర్య (Uncontrolled Chain reaction). అందువల్ల విస్ఫోటనం (explosion) జరుగుతుంది. న్యూక్లియర్ రియాక్టర్లను ఉపయోగించి పరమాణు బాంబులో ఈవిధంగా జరిగే అనియంత్రిత కేంద్రక చర్యను నియంత్రించడంద్వారా వచ్చే ఉష్ణశక్తి ఆధారంగా అణు విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేస్తారు. అంటే న్యూక్లియర్ రియాక్టర్లలో నియంత్రిత కేంద్రక విచ్ఛిత్తి చర్య జరుగుతుంది. న్యూక్లియర్ రియాక్టర్లో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించడానికి ఉపయోగించే పదార్థాలను మితకారులు (Moderators) అంటారు. భారజలం, గ్రాఫైట్, బెరీలియం ఆక్సైడ్ లాంటివాటిని మితకారులుగా ఉపయోగిస్తారు. భార హైడ్రోజన్ అయిన డ్యుటీరియం ఆక్సైడ్ (D2O)ను భారజలం అంటారు. భారజలాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ‘యూరే’. న్యూట్రాన్ల వేగాన్ని నియంత్రించడానికి ఉపయోగించేవాటిని ‘నియంత్రణ కడ్డీలు’ (Control rods) అంటారు. బోరాన్, కాడ్మియం లాంటివాటిని నియంత్రణ కడ్డీలుగా ఉపయోగిస్తారు. సాధారణ న్యూట్రాన్లను ఫాస్ట్ న్యూట్రాన్లనీ, వేగం తగ్గించిన న్యూట్రాన్లను ఉష్ణీయ న్యూట్రాన్లు (Thermal Neutrons) అని అంటారు. * సాధారణ అణు ఇంధనాలుగా వాడే కేంద్రకా లు: యురేనియం-235, ప్లుటోనియం-239. ఇవేకాకుండా యురేనియం-233, నెప్ట్యూనియం-237, ప్లుటోనియం-238లను కూడా అణు ఇంధనాలుగా ఉపయోగిస్తారు. * రియాక్టర్లలో శీతలీకారిణి (Coolan్ట)గా ద్రవ సోడియం లేదా నీటిని ఉపయోగిస్తారు. * ఇంధన కడ్డీలను కప్పి ఉంచే పొరను క్లాడింగ్ అంటారు. దీన్ని న్యూట్రాన్ల అధిశోషణ సామర్థ్యం దాదాపుగా లేని క్షయాన్ని నిరోధించే (Corrosion resistant) ధర్మం ఉన్న జిర్కోనియం మిశ్రలోహంతో రూపొం దిస్తారు. * 1954 ఆగస్టు 3న రాష్ర్టపతి ఉత్తర్వుల ద్వారా అణుఇంధన శాఖ (ఈఅఉ) నేరుగా ప్రధానమంత్రి పరిధిలోకి వచ్చింది. * 1974లో భారతదేశం పోఖ్రాన్లో అణు పరీక్షలు జరిపిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అణు ఇంధనాల సరఫరాను నియంత్రించడానికి 7 దేశాలతో 1975లో న్యూక్లియర్ సప్లయర్స గ్రూప్ (ూఎ) ఏర్పడింది. * ఎన్ఎస్జీ దేశాలు: కెనడా, పశ్చిమ జర్మనీ, ఫ్రాన్స, జపాన్, సోవియట్ యూనియన్, యునెటైడ్ కింగ్డమ్, అమెరికా. ప్రస్తుతం ఈ గ్రూపులో 48 దేశాలు ఉన్నాయి. * తీసుకున్న ఇంధనం కంటే ఎక్కువ ఇంధనాన్ని ఉత్పత్తి చేసే రియాక్టర్లను బ్రీడర్ రియాక్టర్లు అంటారు. ఇవి యురేనియం- 233 లేదా థోరియం-232 నుంచి ప్లుటోనియం-239ను ఉత్పత్తి చేస్తాయి. * యురేనియం-235 శ్రేష్టమైన అణు ఇంధ నం. కానీ సహజ యురేనియంలో ఇది కేవలం 0.7 శాతం మాత్రమే ఉంటుంది. మిగిలింది యురేనియం-238. దీనికి విఘటన స్వభావం ఉండదు. * యురేనియం-238 నుంచి విఘటన స్వభావం ఉన్న ప్లుటోనియం-239 ఉత్పత్తి అవుతుంది. * పరమాణు రూపకల్పనకు చెందిన అమెరికన్ ప్రాజెక్ట్ మాన్హట్టన్. దీనిలో ముఖ్యపాత్ర పోషించింది రాబర్ట ఓపెన్ హీమర్. * పరమాణు బాంబులను మొదటిసారిగా రెండో ప్రపంచయుద్ధం చివరిదశలో జపాన్ పై అమెరికా ప్రయోగించింది. 1945 ఆగస్టు 6న జపాన్లోని హిరోిషిమాపై ‘లిటిల్బాయ్’ పేరుతో, 1945 ఆగస్టు 9న నాగసాకిపై ‘ఫ్యాట్మ్యాన్’ పేరుతో అణు బాంబులను అమెరికా ప్రయోగించింది. * రేడియోధార్మికతలో ‘కేంద్రకవిచ్ఛిత్తి’పై చేసి న పరిశోధనకుగాను రసాయన శాస్త్రంలో ‘ఒట్టోహాన్’కు నోబెల్ బహుమతి లభించింది. ఇతడిని కేంద్రక రసాయన శాస్త్ర పితామహుడిగా పేర్కొంటారు. * కేంద్రక విచ్ఛిత్తి పరిశోధనలో ఒట్టోహాన్తో పనిచేసినవారు ఫ్రిట్జ్ స్ట్రాస్మన్ (జర్మనీ). * భారజల తయారీ కేంద్రాలు బరోడా (మొదటిది), మణుగూరు, థాల్చేర్, థాల్, ట్యుటికొరిన్, కోట, హజారియాలో ఉన్నాయి. * కేంద్రక సంలీనం (Nuclear Fusion): రెండు తేలిక కేంద్రకాలు కలిసి ఒక భార కేంద్రకంగా ఏర్పడే ప్రక్రియను కేంద్రక సంలీనం అంటారు. కేంద్రక సంలీన చర్యల కారణంగానే సూర్యుడితోపాటు ఇతర నక్షత్రాల్లో హైడ్రోజన్ (ప్రోటియం, డ్యుటీరియం, ట్రిటియం) హీలియంగా మారుతుంది. అందువల్ల సూర్యుని చుట్టూ ఉండే వాతావరణ పొరలో హీలియం ఎక్కువగా ఉంటుంది. సూర్యునిలో జరిగే కేంద్రక సంలీన చర్యలో పాజిట్రాన్లు, న్యూట్రినోలు అనే కణాలు కూడా విడుదలవుతాయి. సూర్య కిరణాల్లో న్యూట్రినోలు కూడా ఉంటాయి. ఇవి అపాయకరమైనవి కావు. * కేంద్రక సంలీన చర్యలో పాల్గొనే పరమాణువుల మొత్తం భారం కంటే సంలీన కేంద్రకం ద్రవ్యరాశి తక్కువగా ఉంటుంది. ఈ ద్రవ్యరాశి లోపమే అపారశక్తి రూపంలో విడుదలవుతుంది (ఐన్స్టీన్ ద్రవ్యరాశి-ద్రవ్యరాశి తుల్యతా నియమం E = mc2) * తేలిక కేంద్రకాలు సంలీనం చెందుతూ బంధ శక్తి అధికంగా ఉన్న స్థిరమైన ఐరన్-60ని చేరతాయి. * ఏదో ఒక సమయంలో నక్షత్రాలు ప్రకాశవంతంగా వెలిగి సూర్యుని కంటే ఎక్కువ పరిమాణంలోకి వ్యాకోచిస్తాయి. ఈ స్థితినే ‘సూపర్నోవా’ అంటారు. * హైడ్రోజన్ బాంబులో ఇమిడి ఉన్న సూత్రం ‘కేంద్రక సంలీన చర్య’. ఈ చర్య ప్రారంభమవడానికి కొన్ని మిలియన్ డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం. ఇది సాధారణ రసాయన చర్యల్లో లభించదు. అందువల్ల కేంద్రక రసాయన చర్యను ప్రారంభించడానికి మొదట ‘కేంద్రక విచ్ఛిత్తి’ చర్య జరిగే పరమాణు బాంబును ‘ట్రిగ్గర్’గా ఉపయోగిస్తారు. కాబట్టి హైడ్రోజన్ బాంబును ‘ఉష్ణీయ కేంద్రక ఆయుధం’ అంటారు. మాదిరి ప్రశ్నలు 1. అస్థిరమైన భార కేంద్రకాన్ని ఏ కణాలతో తాడనం చేసినప్పుడు కేంద్రక విచ్ఛిత్తి జరుగుతుంది? 1) ఆల్ఫా 2) బీటా 3) గామా 4) న్యూట్రాన్లు 2. కిందివాటిలో కేంద్రక విచ్ఛిత్తి సూత్రం ఆధారంగా రూపొందించినవి? ఎ) పరమాణు బాంబు బి) హైడ్రోజన్ బాంబు సి) అణు విద్యుచ్ఛక్తి రియాక్టర్లు 1) ఎ, బి 2) బి, సి 3) ఎ, సి 4) ఎ మాత్రమే 3. సాధారణంగా కేంద్రక విచ్ఛిత్తిలో పాల్గొనే కేంద్రకాలు ఏవి? ఎ) యురేనియం-235 బి) ప్లుటోనియం-239 సి) యురేనియం-238 డి) థోరియం-232 1) ఎ, బి 2) సి, డి 3) ఎ, సి 4) బి, డి 4. కిందివాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఎ) సహజ యురేనియంలో గరిష్టంగా (99.3 శాతం) ఉండే యురేనియం - 238 స్వయంగా విచ్ఛిత్తి చెందదు. కానీ విచ్ఛిత్తి చెందే ధర్మం ఉన్న యురేనియం-239గా పరివర్తనం చెందుతుంది. బి) బ్రీడర్ రియాక్టర్ యురేనియం-235 ను వినియోగించుకున్నదాని కంటే అధిక ఇంధనాన్ని ప్లుటోనియం-239 లేదా యురేనియం-233 రూపంలో ఉత్పత్తి చేస్తుంది. సి) థోరియం-233 నుంచి కృత్రిమంగా ఉత్పత్తి చేసిన యురేనియం-233ని అణు ఇంధనంగా వాడిన ఆసియా ఖండంలోని మొదటి దేశం భారత్. 1) ఎ, బి మాత్రమే 2) బి, సి మాత్రమే 3) ఎ, సి మాత్రమే 4) ఎ, బి, సి 5. కిందివాటిలో సరైనదాన్ని గుర్తించండి. ఎ) న్యూక్లియర్ సప్లయర్స గ్రూప్ (NSG)లో ప్రస్తుతం 48 దేశాలకు సభ్యత్వం ఉంది. బి) 2014-15 సంవత్సరానికి ూఎ అధ్యక్ష స్థానంలో అర్జెంటీనా ఉంటుంది సి) NSGలో భారతదేశానికి సభ్యత్వం ఉంది 1) ఎ, బి 2) బి, సి 3) ఎ, బి, సి 4) ఏదీకాదు 6. అణు రియాక్టర్లలో భారజలం చేసే పని? (సివిల్స్ 2011) 1) న్యూట్రాన్ల వేగం తగ్గించడం 2) న్యూట్రాన్ల వేగాన్ని పెంచడం 3) రియాక్టర్ను చల్లబర్చడం 4) అణుచర్యను నిలిపివేయడం 7. అటామిక్ ఎనర్జీ డిపార్టమెంట్ ఏ శాఖ పరిధిలో విధులు నిర్వహిస్తుంది? (సివిల్స్ 2009) 1) ప్రధాన మంత్రి కార్యాలయం 2) కేబినెట్ సచివాలయం 3) ఇంధన శాఖ 4) శాస్త్ర, సాంకేతిక శాఖ 8. కిందివాటిలో సరికానిది ఏది? 1) ఇందిరాగాంధీ అణు పరిశోధన కేం ద్రం (IGCAR) ఫాస్ట్బ్రీడర్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది 2) ఐఎఇఅఖ ఫాస్ట్ బ్రీడర్ టెస్ట్ రియాక్టర్కు సంబంధించిన యురేనియం-ప్లుటోనియం మిశ్రీత కార్బైడ్ ఇంధనాన్ని రీ ప్రాసెస్ చేస్తుంది 3) యురేనియాన్ని ప్రధానంగా ఉత్పత్తి చేస్తున్న దేశం కెనడా 4) ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని నియంత్రించడానికి మితకారిగా భారజలాన్ని ఉపయోగిస్తారు. 9. న్యూక్లియర్ రియాక్టర్లను నిర్మించడానికి తప్పనిసరిగా వాడాల్సిన మూలకం ఏది? 1) కోబాల్ట్ (Co) 2) నికెల్ (Ni) 3) జిర్కోనియం (Zr) 4) టంగ్స్టన్ (W) 10. న్యూక్లియర్ రియాక్టర్ను విస్ఫోటక దశ నుంచి కాపాడటానికి వాడేవి ఏవి? 1) గ్రాఫైట్ కడ్డీలు 2) కాడ్మియం కడ్డీలు 3) భారజలం 4) జిర్కోనియం కడ్డీలు 11. సూర్యుని శక్తికి కారణం ఏమిటి? 1) కృత్రిమ రేడియోధార్మిక శక్తి 2) కేంద్రక విచ్ఛిత్తి 3) కేంద్రక సంలీనం 4) సహజ రేడియోధార్మికత 12. కిందివాటిలో సరికాని వాక్యం ఏది? 1) ప్రస్తుతం తారాపూర్, రావత్భట్ట, కాక్రాపూర్, కుదంకులం, కైగాలో అణు విద్యుచ్ఛక్తి కేంద్రాలు పనిచేస్తున్నాయి. 2) ప్రస్తుత అణు విద్యుత్ స్థాపిత సామర్థ్యం 5780Mw 3) తొలి భారజల తయారీ ప్లాంటును బరోడాలో నెలకొల్పారు 4) కేంద్రక సంలీనం ద్వారా శక్తి విడుదలకు కారణమైంది అణు బాంబు 13. కిందివాటిలో శ్రేష్టమైన అణు ఇంధనం? (Gr-I, 2007) 1) యురేనియం - 238 2) ప్లుటోనియం - 236 3) నెప్ట్యూనియం 4) థోరియం 14. అణుబాంబు రూపకర్త ఎవరు? (ఎటఐ, 2007) 1) ఇ.ఫెర్మి 2) ఓపెన్ హైమర్ 3) ఓ.హాన్ 4) ఇ. టేలర్ సమాధానాలు 1) 4; 2) 3; 3) 1; 4) 4; 5) 1; 6) 1; 7) 1; 8) 4; 9) 3; 10) 2; 11) 3; 12) 4; 13) 2; 14) 2. -
‘కాంతి స్వభావం- విద్యుదయస్కాంత వర్ణపటం’ అధ్యయనం?
రసాయనశాస్త్రంలో పరమాణు నిర్మాణానికి సంబంధించి ‘కాంతి స్వభావం- విద్యుదయ స్కాంత వర్ణపటం’ పాఠ్యాంశాన్ని పోటీ పరీక్షల కోణంలో ఎలా అధ్యయనం చేయాలి? - కె.సుప్రియ, మూసాపేట అన్ని పోటీ పరీక్షల్లో ‘కాంతి స్వభావం- విద్యుదయస్కాంత వర్ణపటం’ నుంచి ఎక్కువసార్లు ప్రశ్నలు వచ్చాయి. ముఖ్యంగా కాస్మిక్ కిరణాలు, గామా కిరణాలు, గీ-కిరణాలు, ్ఖగ కిరణాలు, దృగ్గోచర కిరణాలు, పరారుణ(ఐఆర్) కిరణాలు, మైక్రో తరంగాలు, రేడియో తరంగాల గురించి ఎక్కువగా ప్రశ్నలు వచ్చే అవకాశముంది. ఈ పాఠ్యాంశాన్ని అధ్యయనం చేయడం ఏంత తేలికో, అందులోని అంశాలను గుర్తుంచు కోవడం కూడా అంతే సులభం. ఉదాహరణకు ఒక గదిలో విద్యుత్ స్విచ్ వేస్తే మరో గదిలో విద్యుదయస్కాంత సిగ్నల్ ఆధారంగా పనిచేసే టీవీలో అలజడిని గమనించొచ్చు. అదేవిధంగా అత్యధిక శక్తి(అల్ప తరంగదైర్ఘ్యం) ఉన్న గామా కిరణాలను క్యాన్సర్ కణాలను నిర్మూలించడానికి ఉపయోగిస్తే, అత్యధిక తరంగదైర్ఘ్యం(అల్పశక్తి) ఉన్న రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలను సెల్ఫోన్లలో ఉపయోగిస్తారు. ఈ అంశాలన్నీ మన నిత్యజీవితంతో ముడిపడినవే కాబట్టి వీటి ధర్మాలు, ఉపయోగాలపై తరచుగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఉదాహరణకు 2012 సివిల్స్ ప్రిలిమ్స్లో ‘నీటి శుద్ధి ప్రక్రియలో అతినీలలోహిత కిరణాల పాత్ర ఏమిటి? అనే ప్రశ్న అడిగారు. దీనికి సమాధానం... ్ఖగ కాంతి నీటిలోని సూక్ష్మజీవులను అంతం చేస్తుంది. మురికిని అవక్షేపించడంలో, వాసనను తొలగించడంలో దీని పాత్ర ఉండదు. 2010లో ఓజోన్ పొర ఉపయోగం, రేడియో తరంగాల ధర్మానికి సంబంధించి కింది ప్రశ్న అడిగారు. ప్రశ్న: అయనోవరణమనే భూ వాతావరణంలోని ఒక పొర, రేడియో కమ్యూనికేషన్లకు వీలు కలిగిస్తుంది, ఎందువల్ల? సమాధానం: రేడియో తరంగాలకు సుదీర్ఘమైన తరంగదైర్ఘ్యం ఉంటుంది. ఓజోన్ పొర కాస్మిక్, ్ఖగ కిరణాలను మాత్రమే ఫిల్టర్ చేస్తుంది. ఓజోన్ పొర స్ట్రాటో ఆవరణంలో ఉంటుంది. రేడియో తరంగాలకు అధిక తరంగదైర్ఘ్యం ఉండటం వల్ల సుదూర కమ్యూనికేషన్లకు ఉపయుక్తంగా ఉంటుంది. అదేవిధంగా 2010లో మైక్రోతరంగాలకు(మైక్రోవేవ్ ఓవెన్ పని చేసే సూత్రం) సంబంధించి కింది విధంగా అడిగారు. ప్రశ్న: తెల్లని, ముద్రించని, స్వచ్ఛమైన పేపర్ ప్లేట్ మీద బంగాళదుంపను ఉంచి, దాన్ని మైక్రో ఓవెన్లో పెడితే బంగాళదుంప వేడెక్కుతుంది కానీ, పేపర్ ప్లేట్ వేడెక్కదు, కారణమేంటి? సమాధానం: ఆహార పదార్థంలోని నీటి అణువులు మైక్రోతరంగాలను గ్రహించి అత్యంత వేగంగా కంపనం చెందడం వల్ల జనించిన ఉష్ణం కారణంగా ఆహారం వేడెక్కుతుంది. కాబట్టి బంగాళదుంపల్లోని నీటికారణంగా అవి వేడెక్కుతాయి. పేపర్లో నీటి అణువులు లేకపోవడంతో అది వేడెక్కదు. రాత్రివేళ చూడటానికి ఉపయోగించే పరికరాల్లో వాడే కిరణాలు ఏవి? అని 2009లో ప్రశ్న అడిగారు. దీనికి సమాధానం పరారుణ తరంగాలు. పై ప్రశ్నలను గమనిస్తే విద్యుదయస్కాంత వర్ణపటంలోని వివిధ వికిరణాల ధర్మాలు, ఉపయోగాలు, వాటిని ఉపయోగించి పనిచేసే వస్తువులు, ఆ వస్తువులు పని చేసే సూత్రాలు లాంటి అంశాలు ప్రధానంగా కనిపిస్తాయి. కాబట్టి గామా, ఎక్స్, యూవీ, ఐఆర్, మైక్రో, రేడియో తరంగాల ధర్మాలకు సంబంధించిన మౌలిక సూత్రాలపై పట్టు సాధించాలి. దీనికోసం ఎన్సీఈఆర్టీ పుస్తకాలతో పాటు, సీఎస్ఐఆర్ ప్రచురించిన How? What? అనే పుస్తకాలు కూడా ఉపయుక్తంగా ఉంటాయి. ఇన్పుట్స్: డాక్టర్ బి.రమేష్, సీనియర్ ఫ్యాకల్టీ ఇన్ కెమిస్ట్రీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, జమ్మికుంట, కరీంనగర్ జిల్లా జాబ్స్, అడ్మిషన్స్ అలర్ట్స శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ వివిధ పోస్టుల భర్తీకి డిజేబుల్డ్ పర్సన్స్ (మహిళలు) నుంచి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వివరాలు: లైబ్రరీ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్ సబార్డినేట్ హెల్పర్ వాచ్మెన్ క్లీనర్ దరఖాస్తు: వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు చివరితేది: ఆగస్టు 11 వెబ్సైట్: www.svuniversity.ac.in సర్దార్ వల్లభాయ్ పటేల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీడియాట్రిక్స్ పోస్ట్: స్టాఫ్ నర్స్ ఖాళీలు: 111 అర్హతలు: జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరిలో డిప్లొమా లేదా బీఎస్సీ(నర్సింగ్) ఉండాలి. మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఉండాలి. ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: జూలై 30 వెబ్సైట్: www.svppgip.org ఇండియన్ లా ఇన్స్టిట్యూట్-న్యూఢిల్లీ కోర్సులు: ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ ది ఇంటర్నెట్ ఏజ్ సైబర్ లాస్ కాలపరిమితి: మూడు నెలలు అర్హతలు: ఏదైనా డిగ్రీ లేదా ఇంటర్ తర్వాత డిప్లొమా ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: ఆగస్టు 18 వెబ్సైట్: www.ili.ac.in -
మోడల్ స్కూళ్లు
కర్నూలు(విద్య): కేంద్రీయ విద్యాలయాల తరహాలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన మోడల్ స్కూళ్లలో(ఆదర్శ పాఠశాలలు) నిర్లక్ష్యం గూడుకట్టుకుంది. ఈ పాఠశాలలు మంజూరై నాలుగేళ్లయినా.. పనుల ప్రారంభానికే రెండేళ్లు పట్టింది. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో భవనాలు పూర్తి కాకపోవడంతో హాస్టల్ వసతి ఎండమావిగా మారింది. జిల్లాలోని 51 మండలాల్లో ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక్కోదానికి రూ.3.02కోట్లను మంజూరు చేసింది. వీటిని ఆయా మండల కేంద్రాల్లో నిర్మించేందుకు నాలుగేళ్ల క్రితం ప్రతిపాదనలు పంపారు. ఒక్కో పాఠశాలను నాలుగు నుంచి ఐదు ఎకరాల స్థలంలో అన్ని రకాల వసతులు, సౌకర్యాలతో నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. డే స్కాలర్, రెసిడెన్సియల్ విధానంలో పాఠశాలలను నిర్మించేందుకు రంగం సిద్ధం చేశారు. ప్రతి పాఠశాలకు ఒక ప్రిన్సిపాల్, తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్ సబ్జెక్టులకు ఇద్దరేసి పీజీటీలు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఎకనామిక్స్, కామర్స్ సబ్జెక్టులకు ఒక్కో పీజీటీలను నియమించారు. మొదటి యేడాది పాఠశాలలు ప్రారంభమైన ఆరు నెలలకు సబ్జెక్టుకు ఒకరు చొప్పున టీజీటీలను నియమించారు. వీరితో పాటు అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఫిజికల్ డెరైక్టర్, యోగా టీచర్, ఆర్ట్ టీచర్, ఎస్యూపీడబ్ల్యు టీచర్, కంప్యూటర్ టీచర్, లైబ్రేరియన్, క్లర్ కమ్, అకౌంట్, జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్ పోస్టులను కేటాయించారు. వీటిని అప్పటి ఎమ్మెల్యేల పేరు చెప్పుకుని కొందరు అమ్ముకున్నారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఒక్కో పోస్టుకు రూ.50వేల నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేసినట్లు తెలిసింది. జిల్లాకు మంజూరైన 51 పాఠశాలలకు స్థలసేకరణ సమస్యగా మారడంతో 36 పాఠశాలలకు మాత్రమే అధికారులు స్థలాన్ని చూపించగలిగారు. దీంతో వీటికి మొదటి విడతగా రూ.108.72కోట్లు మంజూరయ్యాయి. 2013లో 36 భవనాలు పూర్తి కావడంతో పాఠశాలలను హడావుడిగా ప్రారంభించారు. మొదటి సంవత్సరం 6 నుంచి 9వ తరగతితో పాటు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం అడ్మిషన్లు నిర్వహించారు. ప్రతి తరగతికి 80 మంది చొప్పున అడ్మిషన్లను లాటరీ పద్ధతిలో నిర్వహించారు. ఈ యేడాది భవనాల నిర్మాణం పూర్తి కాకపోవడం, హాస్టల్ వార్డెన్, ఇతర సిబ్బంది నియామకం చేపట్టకపోవడంతో హాస్టళ్లను ప్రారంభించలేకపోయారు. ఫలితంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతం. -
సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ కోర్సు వివరాలు
ఎంటెక్ బయోటెక్నాలజీ కోర్సును అందిస్తున్న ఇన్స్టిట్యూట్లేవి? -స్టీవెన్, నల్గొండ. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్ సబ్జెక్ట్లతో ముడిపడి ఉన్న విభాగం బయోటెక్నాలజీ. దీని అనువర్తనాలను పలు విభాగాల్లో వినియోగించుకుంటారు. ఇంజనీరింగ్ సూత్రాలను అనుసరించి జీవకణాల లక్షణాలను విశ్లేషించడమే బయోటెక్నాలజీ. అగ్రికల్చర్, ఫుడ్ప్రాసెసింగ్, డ్రగ్ డెవలప్మెంట్, వేస్ట్ మేనేజ్మెంట్, హార్టికల్చర్, హెల్త్ కేర్, పర్యావరణం వాటిల్లో కొన్ని. హార్టికల్చర్, అగ్రికల్చర్, కెమికల్, బయో ప్రొడక్ట్స్, టెక్స్టైల్స్, హెల్త్కేర్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వ-ప్రైవేట్ రంగంలోని పరిశోధన సంస్థలు, విద్యా సంస్థలు బయోటెక్నాలజీ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు కెరీర్ అవెన్యూస్గా నిలుస్తున్నాయి. అందిస్తున్న ఇన్స్టిట్యూట్లు: ఐఐటీ-ఖరగ్పూర్; వెబ్సైట్: www.iitkgp.ac.in ఐఐటీ-గౌహతి; వెబ్సైట్: www.iitg.ac.in ఐఐఐటీ-హైదరాబాద్;వెబ్సైట్: http://biotech.iith.ac.in చెఫ్గా కెరీర్ ప్రారంభించాలనుకుంటున్నాను. సంబంధిత వివరాలను తెలపండి? -కరణ్, నిజామాబాద్.వివిధ హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార పదార్థాలను నాణత్యను పాటిస్తూ.. వృథా లేకుండా రుచిగా తయారు చేయడమే చెఫ్ ప్రధాన బాధ్యత. హోటల్ మేనేజ్మెంట్ లేదా కలినరీ టెక్నాలజీ సంబంధిత కోర్సులను ఎంచుకోవడం ద్వారా చెఫ్గా కెరీర్ ప్రారంభించవచ్చు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లయిడ్ న్యూట్రిషన్ -హైదరాబాద్ (వెబ్సైట్: www. ihmhyd.org), కలినరీ అకాడమీ-హైదరాబాద్ (వెబ్సైట్: www.iactchefacademy.com) వంటి ఇన్స్టిట్యూట్లు డిప్లొమా నుంచి పీజీ వరకు వివిధ స్థాయిల్లో సంబంధిత కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఈ కోర్సును పూర్తి చేసిన తర్వాత హోటల్స్, రెస్టారెంట్లు, ఎయిర్లైన్స్, క్రూయిజర్స్ వంటి డైనింగ్ ఎస్టా బ్లిష్మెంట్స్లో చెఫ్గా అవకాశాలు ఉంటాయి.రెన్యూవబుల్ ఎనర్జీ కోర్సులను అందిస్తున్న ఇన్స్టిట్యూట్లను తెలపండి? -సిద్ధూ, రామన్నపేట. పెరుగుతున్న ఇంధన అవసరాలు ఒక వైపు, మరో వైపు తరుగుతున్న వనరుల ఫలితంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి సారించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. దాంతో జాబ్ మార్కెట్లో ప్రత్యామ్నాయ ఇంధన వనరుల (రెన్యూవబుల్ ఎనర్జీ) పట్ల అవగాహన ఉన్న నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రెన్యూవబుల్ ఎనర్జీకి అకడమిక్ సబ్జెక్ట్లలో స్థానం కల్పించారు. కొన్ని యూనివర్సిటీలు ఎనర్జీ స్టడీస్-ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో భాగంగా ఈ సబ్జెక్ట్ను బోధిస్తున్నాయి. మరికొన్ని యూనివర్సిటీలు పీజీలో స్పెషలైజేషన్గా అందిస్తున్నాయి. ఇందులో సోలార్ ఎనర్జీ, బయోమాస్, విండ్ ఎనర్జీ, టైడ్ అండ్ వేవ్ ఎనర్జీ, ఫ్యూయల్ సెల్స్, హైడ్రోజన్ ఎనర్జీ, ఎనర్జీ మేనేజ్మెంట్, న్యూక్లియర్ ఎనర్జీ, ఎనర్జీ జనరేషన్, ఎనర్జీ పాలసీస్ వంటి అంశాలను బోధిస్తారు. సంబంధిత కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు సోలార్-విండ్-న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, బయోమాస్ కంపెనీలు, ఆర్కిటెక్చర్ ఫిర్మ్స్, ఎన్జీవో, ఇంధనానికి సంబంధించిన ప్రభుత్వ శాఖల్లో అవకాశాలు ఉంటాయి. రెన్యూవబుల్ ఎనర్జీ కోర్సులను అందిస్తున్న ఇన్స్టిట్యూట్లు: యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం ఎన ర్జీ అండ్ స్టడీస్- డెహ్రాడూన్ కోర్సు: ఎంటెక్ (పవర్ సిస్టమ్స్) వెబ్సైట్: www.upes.ac.in అమిటీ యూనివర్సిటీ-నోయిడా కోర్సు: ఎంటెక్ (సోలార్ అండ్ ఆల్టర్నేటివ్ ఎనర్జీ) వెబ్సైట్: www.amity.edu మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-భోపాల్ కోర్సు: ఎంటెక్ (రెన్యూవబుల్ ఎనర్జీ) వెబ్సైట్: www.manit.ac.in టెరీ యూనివర్సిటీ-ఢిల్లీ కోర్సు: ఎంటెక్ (రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ మేనేజ్మెంట్) వెబ్సైట్: www.teriuniversity.ac.in సాక్షి భవిత ఎడ్యుకేషన్ ఫెయిర్ జూన్ 14, 15 తేదీల్లో వేదిక: విశ్వేశ్వరయ్య భవన్, ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స, ఖైరతాబాద్ సర్కిల్, హైదరాబాద్.ఇంజనీరింగ్తోపాటు ఇతర కోర్సుల్లో చేరాలనుకుంటున్న విద్యార్థులకు ‘సాక్షి’ మార్గనిర్దేశనం చేయనుంది. ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్, ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్సలో జూన్ 14, 15న ‘సాక్షి భవిత ఎడ్యుకేషన్ ఫెయిర్-2014’ను నిర్వహించనుంది. ఇంజనీరింగ్లో ఏ కళాశాలలో చేరాలి? ఏ బ్రాంచ్ను ఎంచుకోవాలనే సందిగ్ధంలో ఉన్న విద్యార్థులకు ఈ ఫెయిర్ పరిష్కారం చూపనుంది. కళాశాలల వివరాలతోపాటు ఆయా బ్రాంచ్ల ప్రత్యేకత, భవిష్యత్లో ఉద్యోగ, ఉన్నత విద్యావకాశాల గురించి విద్యార్థులకు నిపుణులు అవగాహన కల్పిస్తారు. విద్యార్థులు ఫెయిర్లో ఏర్పాటు చేసిన కళాశాలల ప్రతినిధులతో నేరుగా సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు. కార్యక్రమానికి వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈవెంట్ స్పాన్సర్గా, భారత్ ఇన్స్టిట్యూషన్స అసోసియేట్ స్పాన్సర్సగా, వైఈఎస్(యూత్ ఎంప్లాయిబిలిటీ సర్వీసెస్) నాలెడ్జ పార్టనర్గా, 92.7 బిగ్ ఎఫ్.ఎం. రేడియో పార్టనర్గా వ్యవహరిస్తున్నా యి. ఎడ్యుకేషన్ ఫెయిర్కు సంబంధించిన మరిన్ని వివరాలకు ఎంపీ రావు (9912220375), రోహన్ (9951603007), వేణు (9951602991)ను సంప్రదించొచ్చు. సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ కోర్సు గురించి వివరాలు తెలపండి? ఈ కోర్సు చేస్తే ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి? -రాజా, అలంపూర్.ఫైనాన్షియల్ ప్లానర్ సర్టిఫికెట్కు అంతర్జాతీయంగా ఫైనాన్షియల్ రంగంలో గుర్తింపు ఉంది. అనేక సంస్థలు ఈ సర్టిఫికెట్ను ప్రత్యేక అర్హతగా గుర్తిస్తున్నాయి. అందుకే ఈ సర్టిఫికెట్ పొందే ప్రక్రియ కూడా ఎంతో కఠినంగా ఉంటుంది. శిక్షణ, పని అనుభవం, మూల్యాంకనం ఇలా అన్ని అంశాల్లో నైపుణ్యాన్ని పరిశీలిస్తారు. వాటన్నిటినీ సంతృప్తికరంగా పూర్తి చేస్తేనే సర్టిఫికెట్ లభిస్తుంది. ఈ సర్టిఫికెట్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్థిక సేవల పరిశ్రమల్లో అవకాశాలకు మార్గాలు చూపుతుంది. మన దేశంలో ఫైనాన్షియల్ ప్లానింగ్ సర్వీస్ బోర్డు ఆఫ్ ఇండియా (ఎఫ్పీఎస్బీ) సీఎఫ్పీ సర్టిఫికెట్ను అందజేస్తుంది. సర్టిఫికెట్ పొందే ప్రక్రియ: ఎఫ్పీఎస్బీఐ అధీకృత భాగస్వామ్య శిక్షణ సంస్థల్లో శిక్షణ పొందాలి. ఇది ఐదు మాడ్యూల్స్లో ఉంటుంది. ఎన్ఎస్ఈ నిర్వహించే 1-4 పరీక్షల్లో ఉత్తీర్ణులవ్వాలి. తర్వాత ఉద్యోగం పొందడానికి అవసరమైన పని అనుభవం గడించాలి. ఆ సమయంలో ఎఫ్పీఎస్బీ కోడ్ ఆఫ్ ఎథిక్స్కు, బిహేవియరల్ స్కిల్స్, ప్రాక్టీస్ ప్రమాణాలు, క్రమశిక్షణకు సంబంధించిన నియమ, నిబంధనలు, పద్ధతులపై తర్ఫీదు పొందుతారు. సర్టిఫికెట్ తీసుకున్న తర్వాత కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ స్ట్రాటజీస్, ఉత్పత్తులు, క్లయింట్స్పై మార్పుల ప్రభావం వంటి అంశాలను అప్డేట్ చేసుకోవాలి. కెరీర్: సర్టిఫికెట్ పొందిన తర్వాత అభ్యర్థులకు బ్యాంకులు, ఇన్వెస్ట్మెంట్ ఏజెన్సీలు. వెల్త్ ప్లానింగ్ కంపెనీలు, స్టాక్ బ్రోకింగ్ కంపెనీలు, విద్యా సంస్థలు, ఎంటర్ప్రెన్యూర్ రంగంలో అవకాశాలు లభిస్తాయి. ఇగ్నో ప్రవేశాలు ప్రపంచంలోనే అతి పెద్ద సార్వత్రిక విశ్వవిద్యాలయాల్లో ఒకటైన.. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో)..ప్రతి సంవత్సరం జనవ రి, జూన్లలో రెండు విడతలుగా అడ్మిషన్ల ప్రక్రియను నిర్వహిస్తుంది. ప్రస్తుతం జూన్ సెషన్కు సంబంధించి ఇగ్నో నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ స్పెషలైజేషన్స్తో మాస్టర్స్, బ్యాచిలర్ డిగ్రీ కోర్సులను అందిస్తుంది. వివరాలు.. మాస్టర్స్ డిగ్రీ: మాస్టర్ డిగ్రీని ఎంచుకున్న అభ్యర్థులు సంబంధిత కోర్సును రెండు నుంచి ఐదేళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ విభాగం కింద అందిస్తున్న కోర్సుల కోసం ఏదైనా సబ్జెక్ట్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మాస్టర్ ఆఫ్ సైన్స్ విభాగంలో ఉండే కోర్సులకు మాత్రం సంబంధిత/ అనుబంధ సబ్జెక్ట్లో డిగ్రీ చేసిన విద్యార్థులు మాత్రమే అర్హులు. టెక్నికల్ అంశాలతో ముడిపడి ఉన్న కోర్సులకు ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. స్పెషలైజేషన్స్: ఎంసీఏ (కంప్యూటర్ అప్లికేషన్స్), ఎంఎస్సీ (డైటిక్స్ అండ్ ఫుడ్ సర్వీస్ మేనేజ్మెంట్, కౌన్సెలింగ్ అండ్ ఫ్యామిలీ థెరపీ), ఎంఏ (రూరల్ డెవలప్మెంట్, టూరిజం మేనేజ్మెంట్, ఇంగ్లిష్, హిందీ, సోషల్ వర్క్, ఫిలాసఫీ, గాంధీ అండ్ పీస్ స్టడీస్, ఎడ్యుకేషన్, పార్టిసిపేటరీ డెవలప్మెంట్, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, సైకాలజీ, ఎక్స్టెన్షన్ అండ్ డెవలప్మెంట్ స్టడీస్, జెండర్ డెవలప్మెంట్ స్టడీస్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, ఆంత్రోపాలజీ, అడల్ట్ ఎడ్యుకేషన్, ఉమెన్ అండ్ జెండర్ స్టడీస్), ఎంకామ్, ఎంఎస్డబ్ల్యూ కౌన్సెలింగ్.బ్యాచిలర్ డిగ్రీ: బ్యాచిలర్ డిగ్రీ కోర్సులను ఎంచుకున్న అభ్యర్థులు సంబంధిత కోర్సును మూడు నుంచి ఆరేళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. అర్హత: 10+2 ఉత్తీర్ణత (బీఎస్సీ కోర్సులకు సైన్స్ స్ట్రీమ్ చదివి ఉండాలి). స్పెషలైజేషన్స్: బీసీఏ కంప్యూటర్ అప్లికేషన్స్, బీఏ టూరిజం స్టడీస్, బీఏ, బీఎస్సీ, బీకామ్, బీఏ (సోషల్ వర్క్, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్, ప్రిపరేటరీ ప్రోగ్రామ్). మాస్టర్స్, బ్యాచిలర్తోపాటు డిప్లొమా విభాగంలో 53 కోర్సులు, సర్టిఫికెట్ విభాగంలో 58 కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. డిప్లొమా కోర్సులకు/సర్టిఫికెట్ కోర్సులకు అర్హత: 10+2, పీజీ డిప్లొమా కోర్సులకు/ పీజీ సర్టిఫికెట్ కోర్సులకు-బ్యాచిలర్ డిగ్రీ. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత ఫీజును కూడా ఆన్లైన్ ద్వారా చెల్లించవచ్చు. ఆఫ్లైన్ విధానంలో ఫీజును డీడీ రూపంలో స్వీకరిస్తారు. ఆన్లైన్ దరఖాస్తు తర్వాత ప్రింట్ అవుట్, సంబంధిత సర్టిఫికెట్లను జతచేసి దగ్గర్లోని ఇగ్నో కేంద్రానికి పంపాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: జూన్ 20, 2014. రూ. 300 లేట్ ఫీజుతో దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: జూన్ 31, 2014. వివరాలకు: http://ignou.ac.in ది ఫుల్బ్రైట్ నెహ్రూ ఫెలోషిప్ అమెరికాలోని ఎంపిక చేసిన విశ్యవిద్యాలయాల్లో మాస్టర్స్ డిగ్రీ చేసే అవకాశం కల్పిస్తోంది.. ది ఫుల్బ్రైట్ నెహ్రూ ఫెలోషిప్. యునెటైడ్ స్టేట్స్-ఇండియా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ (యూఎస్ఐఈఎఫ్) ఈ ఫెలోషిప్ను అందజేస్తోంది.అందిస్తున్న సబ్జెక్ట్లు: ఆర్ట్స్ అండ్ కల్చర్ మేనేజ్మెంట్తోసహా హేరిటేజ్ కన్జర్వేషన్ అండ్ మ్యూజియమ్ స్టడీస్, ఎన్విరాన్మెంట్ సైన్స్/స్టడీస్, హయ్యర్ ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ హెల్త్, ఆర్బన్ అండ్ రీజనల్ ప్లానింగ్, ఉమెన్స్ స్టడీస్/జెండర్ స్టడీస్. అర్హతలు: గుర్తింపు ఉన్న యూనివర్సిటీ నుంచి కనీసం 55 శాతం మార్కులతో యూఎస్ బ్యాచిలర్ డిగ్రీతో సమానమైన డిగ్రీ. ఈ క్రమంలో బ్యాచిలర్/మాస్టర్ డిగ్రీ ఏదైనా కావచ్చు. బ్యాచిలర్ డిగ్రీ అయిన పక్షంలో దాని కాల వ్యవధి నాలుగేళ్లు ఉండాలి. అదే సమయంలో యూఎస్లోని ఏ యూనివర్సిటీ నుంచైనా మరొక డిగ్రీ కానీ కోర్సులో కానీ చేరి ఉండకూడదు. కనీసం మూడేళ్ల ప్రొఫెషనల్ అనుభవం. స్వదేశానికి తిరిగి వచ్చి సేవా చేస్తామనే దృక్పథం, చక్కని నాయకత్వ లక్షణాలు ఉండాలి.ఎంపిక: వచ్చిన దరఖాస్తుల్లోంచి షార్ట్లిస్ట్ చేసిన అభ్యర్థులకు న్యూఢిల్లీలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. వీరిల్లోంచి అర్హులను ఎంపిక చేస్తారు. వీరు నిర్దేశించి టోఫెల్/జీఆర్ఈ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ అభ్యర్థుల దరఖాస్తులను ఫుల్బ్రైట్ ఫారెన్ స్కాలర్షిప్ బోర్డుకు తుది ఎంపిక కోసం పంపిస్తారు. వీరు నేరుగా ఇన్స్టిట్యూట్లకు దరఖాస్తు చేసుకోవాలి. ప్రయోజనాలు: జే-1 వీసా స్వస్థలం నుంచి ఇన్స్టిట్యూట్ ఉన్న పట్టణం వరకు ఎకానమీ క్లాస్తో విమాన ప్రయాణానికి ఏర్పాట్లు ట్యూషన్ ఫీజుతోపాటు వసతి, సంబంధిత ఖర్చులకు ఫండింగ్ దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 1, 2014. వివరాలకు: www.usief.org.in జాబ్ రిమైండర్సబోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్ పోస్టులు దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 7, 2014 వివరాలకు: http://bsf.nic.in ........................................................ ఇండియన్ ఆర్మీ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:జూన్ 30, 2014 వివరాలకు: http://joinindianarmy.nic.in ........................................................ ఎస్ఎస్సీ స్టెనోగ్రాఫర్స్ పోస్టులు: 534 దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 27, 2014 వివరాలకు: http://ssc.nic.in ........................................................ ఇండియన్ నేవీ ఆర్టిపైసర్ అప్రెంటీస్ సెయిలర్ బ్యాచ్-2015 ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరి తేదీ:జూన్ 20, 201410+2 క్యాడేట్ ఎంట్రీ స్కీమ్ డిసెంబర్-14 ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరి తేదీ:జూన్ 23, 2014 వివరాలకు: ://nausenabharti.nic.in ........................................................ -
‘పట్టు’ సాధించేందుకు ప్రయోగం
సైన్స్పై విద్యార్థులకు ప్రత్యేక తర్ఫీదు శ్రీకారం చుట్టిన జిల్లా విద్యాశాఖ బాల శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు దోహదం 90 మందికి ఉచిత భోజనం, వసతి, శిక్షణ విద్యార్థులకు సైన్స్పై ఆసక్తి పెంపొందించడానికి జిల్లా విద్యాధికారి పూనుకున్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 9వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులను బాల శాస్త్రవేత్తలుగా తయారు చేసేందుకు.. కనీసం వారికి సైన్స్లో ఓనమాలు నేర్పించేందుకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో హన్మకొండలోని న్యూత్రివి హైస్కూల్లో బాల శాస్త్రవేత్తల ఆవాస వేసవి శిక్షణా శిబిరం ఏర్పాటు చేశారు. ఈనెల 2 నుంచి ప్రారంభమైన శిబిరంలో పదో తరగతిలోని ఫిజికల్ సైన్స్, బయాలజీ, కెమిస్ట్రీ సబ్జెక్టులపై ప్రభుత్వ, జెడ్పీ హైస్కూళ్లలో స్కూల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న సుమారు 15 మంది ఉపాధ్యాయులు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. మూడు నెలల క్రితం జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన చెకుముఖి టాలెంట్ టెస్టులో ప్రతిభ చూపిన వారినే బాల శాస్త్రవేత్తల ఆవాస శిక్షణా శిబిరానికి ఎంపిక చేశారు. వివిధ మండలాల నుంచి సుమారు 90 మంది విద్యార్థులకు ఉచిత వసతితోపాటు భోజన సౌకర్యం కల్పిస్తూ శిక్షణ ఇస్తున్నారు. ఉదయం 6 నుంచి 7 గంటల వరకు యోగాలో సునీత శిక్షణ ఇస్తున్నారు. అనంతరం విద్యాబోధన, రిసోర్స్ పర్సన్లు సైన్స్లోని పలు అంశాలపై అవగాహన కల్పిస్తూ ప్రయోగాత్మకంగా అర్థమయ్యే రీతిలో బోధిస్తున్నారు. సాయంత్రం ప్రముఖులతో విద్యార్థులకు ఉపయోగపడేలా, వారికి కెరీర్ గెడైన్స్ పెంపొందించేలా అవగాహన కల్పిస్తున్నారు. గెస్ట్ లెక్చర్లు రమాదేవి, సుహాసిని, శంకర్నారాయణ పలు అంశాలపై వివరించారు. రాత్రివేళ కొంతసేపు మానసికోల్లాసానికి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. సైన్స్ పరికరాల కొనుగోలు, స్నాక్స్ కోసం ఓరుగల్లు సేవా సమితి నుంచి కలెక్టర్ రూ.36వేలు ఇచ్చారు. భోజన వసతి కోసం ప్రైవేటు కళాశాలల యాజమన్యాలు సహకరిస్తున్నాయి. స్కూల్ అసిస్టెంట్ శ్యాంసుందర్రెడ్డి ప్రోగ్రాం ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. రిసోర్స్ పర్సన్లుగా స్కూల్ అసిస్టెంట్లు విజయపాల్రెడ్డి, ఏ.జ్ఞానేశ్వర్, ఎస్.రామనాథం, వి.సురేశ్, రాము, శ్రీనివాస్స్వామి, శంకర్, శశికళాధర్, దయాకర్, సదానందం, అనితాలత విద్యాబోధన చేస్తున్నారు. ఎంతో ఉపయోగపడుతుంది.. లింగాలఘణపురం మండలం వనపర్తి జెడ్పీఎస్ఎస్లో 9వ తరగతి పూర్తిచేసి టెన్త్లోకి ప్రవేశించాను. ఇక్కడ మాకు ఉచిత వసతితోపాటు సైన్స్పై అనేక అంశాలను బేసిక్స్ నుంచి ఉపాధ్యాయులు చెబుతున్నారు. దీంతో టెన్త్ క్లాస్లోని అంశాలను ఇప్పుడే నేర్చుకుంటున్నాం. ఈ శిక్షణతో బట్టీపట్టాల్సిన అవసరం లేకుండా సైన్స్ సబ్జెక్టులోని అనేక అంశాలు ప్రయోగపూర్వకంగా చెబుతున్నారు. వాగ్దేవి, జెడ్పీఎస్ఎస్ వనపర్తి ప్రయోగాత్మకంగా చెబుతున్నారు.. రాయపర్తి మండలం కొండూరు జెడ్పీఎస్ఎస్లో 9వ తరగతి పూర్తి చేశాను. సైన్స్లో ప్రోత్సహించే విధంగా ఫిజిక్స్, బయాలజీ సబ్జెక్టులపై బేసిక్స్తో సహా టీచర్లు చెప్పడమే కాకుండా ప్రయోగాల ద్వారా చూపడంతో స్పష్టంగా అర్థమవుతోంది. శిక్షణా శిబిరంలో చదువుతోపాటు క్రమశిక్షణ నేర్పుతున్నారు. యోగా చేయిస్తున్నారు. ఇది నైపుణ్యాలను పెంపొందించేందుకు కూడా దోహదం చేస్తుంది. - జి.శ్రీకాంత్, జెడ్పీఎస్ఎస్ కొండూరు ఆసక్తి కనబరిచేలా విద్యాబోధన నరేందర్ నగర్లోని ప్రభుత్వ హైస్కూల్లో 9వ తరగతి పూర్తి చేశాను. బాల శాస్త్రవేత్తల ఆవాస వేసవి శిక్షణా శిబిరంలో మాకు టెన్త్లోని ఫిజికల్ సైన్స్, బయాలజీ, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లోని అనేక అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. పలు అంశాలను ప్రయోగాత్మకంగా చూపిస్తున్నారు. ఉపాధ్యాయులు చెబుతున్న సైన్స్ అంశాలు, గెస్ట్ లెక్చర్లు, యోగా, సాంస్కృతిక కార్యక్రమాలు ఆలోచింపజేస్తున్నాయి. - ఈ.రాణి, నరేందర్ నగర్, వరంగల్ ఇదొక ప్రయోగం ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థుల్లో ఎంతో ప్రతిభ ఉంటుంది. వారికి విద్యార్థి దశలోనే సైన్స్ పట్ల ఆసక్తి కలిగిస్తే వారు భవిష్యత్లో బాల శాస్త్రవేత్తలుగా ఎదిగే అవకాశం ఉంది. వేసవిలో విద్యార్థులు ఇంటివద్ద ఉంటే వేరే వ్యాపకాల్లో ఉంటారు. అందువల్ల వారికి రెసిడెన్షియల్గా ఉదయం టిఫిన్, భోజన వసతితోపాటు మధ్యలో స్నాక్స్ కూడా ఇస్తున్నాం. మానసికోల్లాసానికి యోగా, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం. వివిధ అంశాల్లో గెస్ట్ లెక్చరర్లతో గ్రూప్ డిస్కషన్ చేయిస్తున్నాం. ఫిజికల్ సైన్స్, బయాలజీలోని పలు అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. శిబిరం నిర్వహణకు కలెక్టర్ కిషన్, ప్రైవేటు యాజమాన్యాలు సహకరిస్తున్నాయి. శిక్షణను ఈనెల 11వ తేదీ వరకు కొనసాగిస్తాం. - డాక్టర్ ఎస్.విజయ్కుమార్, డీఈఓ సంతృప్తిగా ఉంది వేసవి సెలవులు వస్తే కుటుంబాలతో ఎక్కడికైనా విహార యాత్రకు వెళ్తుంటారు కొందరు ఉపాధ్యాయులు. అయితే విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు టెన్త్లోని సైన్స్పై నైపుణ్యాలను, మహనీయుల స్ఫూర్తి కలిగించే అంశాలను బోధించడం సంతృప్తిగా ఉంది. సెలవులు పోయినా విద్యార్థులకు ఎంతో కొంత ఉపయోగపడుతున్నామనే భావన ఉంది. - విజయపాల్రెడ్డి, స్కూల్ అసిస్టెంట్ -
కెమిస్ట్రీ బాగా కుదిరింది
‘మై తేరా హూ’ చిత్రంలో వరుణ్ ధవన్తో కెమిస్ట్రీ బాగా కుదిరిందని మోడల్ కమ్ నటి నర్గీస్ ఫక్రి మెలికలు తిరుగుతూ చెప్పింది. నర్గీస్ గతంలో రణ్బీర్ కపూర్, జాన్అబ్రహాంలతోనూ నటించింది. నగరంలో జరుగుతున్న ‘వీట్ బి దివా’ థర్డ్ సెషన్షోకి న్యాయనిర్ణేతగా హాజరైన సందర్భంగా మాట్లాడుతూ ‘ ‘మై తేరా హూ’ చిత్రంలో వరుణ్ ధవన్తో కెమిస్ట్రీ ఎంతో బాగా కుదిరింది. వరుణ్ ధవన్, డేవిడ్ ధవన్లతో కలసి పనిచేయడం ఎంతో ఉల్లాసం కలిగించింది’ అంది. షూజిత్ సర్కార్ నిర్మించిన ‘మద్రాస్ కేఫ్’ సినిమాలో నర్గీస్... జర్నలిస్టు పాత్రను పోషించింది. ఈ సినిమాలో తన పాత్ర పేరు ఆయేషా అని, ఎంతో హాస్యభరితపాత్ర అని తెలిపింది. ఆ పాత్ర తనకు బాగా సరిపోయిందని ప్రత్యేకమైన ఫలరసాలు తీసుకుంటూ బరువు తగ్గించుకున్న నర్గీస్ చెప్పింది. మహిళలు తమ బరువును తగ్గించుకోవడం కడుపు మాడ్చుకోవద్దని సూచించింది. కేవలం డైట్పైనే ఆధారపడొద్దని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవాలని హితవు పలికింది. లీటర్లు లీటర్లు నీరు తాగొద్దంది. మీ డైట్ టిప్స్ను ఇతర తారలకు కూడా తెలియజేశారా అని ప్రశ్నించగా అటువంటిదేమీ లేదంది. తన సలహాలన్నీ బయట నివసించే మహిళలకు మాత్రమేనంది. కాగా దర్శక నిర్మాత డేవిడ్ ధవన్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ నెల నాలుగో తేదీన విడుదల కానుంది. ఏక్తాకపూర్ నేతృత్వంలోని బాలాజీ మోషన్ పిక్చర్స్ సంస్థ ‘మై తేరా హూ’ సినిమాను నిర్మిస్తోంది. ఇది వరుణ్ ధవన్కు రెండో చిత్రం. 2012లో కరణ్ జోహార్ నిర్మించిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాతో వరుణ్ బాలీవుడ్లోకి అడుగు పెట్టాడు. -
కెమిస్ట్రీ
1. {తిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త? డాబర్ నీర్ 2. జాన్ న్యూలాండ్స ప్రతిపాదించిన సిద్ధాంతం? అష్టక సిద్ధాంతం (అష్టక పరికల్పన) 3. GM> అల్యూమినియం అని ఏ మూలకాన్ని అంటారు? గాలియం. 4. ఎకా బోరాన్ అని ఏ మూలకాన్ని అంటారు? స్కాండియం 5. మొదటి పీరియడ్లోని మూలకాల సంఖ్య? 2 (H, He) 6. పరమాణు సంఖ్య 57 నుంచి 70 వరకు గల మూలకాలను ఏమంటారు? లాంథనైడ్లు 7. పరమాణు సంఖ్య 89 నుంచి 102 వరకు గల మూలకాలను ఏమంటారు? ఆక్టినాయిడ్లు 8. జడ వాయువు మూలకాల సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం? ns2np6 9. ఛీ-బ్లాక్ మూలకాలను ఏమంటారు? పరివర్తన మూలకాలు 10. అంతర పరివర్తన మూలకాలు అని వేటిని అంటారు? జ-బ్లాక్ మూలకాలు 11. అయనీకరణ శక్మానికి ప్రమాణాలు? ఎలక్ట్రాన్ వోల్టు లేదా కిలో జౌల్ మోల్-1 12. రుణ విద్యుదాత్మకతను ఏ స్కేలులో కొలుస్తారు? పౌలింగ్ స్కేలు 13. అత్యధిక రుణవిద్యుదాత్మకత ఉన్న మూలకం? ఫ్లోరిన్ 14. అత్యధిక ఎలక్ట్రాన్ అఫినిటీ ఉన్న మూలకం? క్లోరిన్ 15. అత్యధిక ధన విద్యుదాత్మకత ఉన్న మూలకం? సీజియం 16. ఆవర్తన పట్టికలో అత్యధిక ఆక్సీకరణ ధర్మం ఉన్న మూలకాలు? హేలోజన్లు (VII గ్రూప్ మూలకాలు) 17. 6వ పీరియడ్లోని మూలకాల సంఖ్య? 32 18. బెరిల్ ఫార్ములా? Be3 Al2(SiO3)6 19. KCl.MgCl2 6ఏ2ై ను ఏమంటారు? కార్నలైట్ 20. ఎప్సం లవణంలోని నీటి అణువుల సంఖ్య? 7 21. బెరైట్స్ ఏ మూలకం ఖనిజం? బేరియం 22. క్షారమృత్తిక లోహాల్లో రేడియోధార్మికత ఉన్న మూలకం? రేడియం 23. ఆక్సైడ్తో పాటు, పెరాక్సైడ్లను ఏర్పరిచే క్షారమృత్తిక లోహం? బేరియం 24. BeCl2 నుంచి BeH2ను తయారు చేయడానికి ఉపయోగించేది? LiAlH4 (లిథియం అల్యూమినియం హైడ్రైడ్) 25. CeO H లక్షణాన్ని కలిగి ఉంది? క్షార 26. హైపో రసాయన నామం ఏమిటి? సోడియం థయోసల్ఫేట్ 27. స్థిర ఉష్ణోగ్రత వద్ద 100 గ్రా ద్రావణి లో కరిగే ద్రావిత గరిష్ఠ పరిమాణాన్ని ఏమంటారు? {దావణీయత 28. {ధువ ద్రావణికి ఉదాహరణ? నీరు 29. అధ్రువ ద్రావణికి ఉదాహరణ? బెంజీన్, కిరోసిన్ 30. ఉష్ణోగ్రతను పెంచినప్పుడు ద్రావణీయత పెరిగే పదార్థం? NaNO3 31. ఉష్ణోగ్రతను పెంచినప్పుడు ద్రావనీయత తగ్గే పదార్థం? Ce2(SO4)3.9H2O 32. 120 {V>. Na2CO3 జల ద్రావణంలో 10గ్రా. Na2CO3 ఉంటే దాని భార శాతం? 8.33 33. 45 మి.లీ. హెప్టేన్కు 15 మి.లీ. హెక్సేన్ను కలిపినప్పుడు ఏర్పడిన ద్రావణపు ఘనపరిమాణ శాతం? 25 34 మొలారిటీకి ప్రమాణాలు? మోల్.లీటర్-1 35. 750 మి.లీ. 0.4 M NaOH ద్రావణంలో ఉన్న ూ్చైఏ మోల్ల సంఖ్య? 0.3 36. గాఢత తెలిసిన ద్రావణాలను ఏమంటారు? {పమాణ ద్రావణం 37. {పమాణ ద్రావణాలను దేనిలో తయారు చేస్తారు? {పమాణ కుప్పెలు 38. ఏ రకమైన ద్రావణాలు అస్థిరమైనవి? అతి సంతృప్త ద్రావణాలు 39. ఉష్ణోగ్రతను పెంచితే ూ్చఇ ద్రావణీయత ఏమవుతుంది? మారదు 40. ఎసిటిక్ ఆమ్లం ఏ రకమైన విద్యుద్విశ్లేష్యం? బలహీన 41. P2O3° నీటిలో కరిగిస్తే ఏర్పడే ఆమ్లం? ఫాస్ఫరస్ ఆమ్లం (H3PO3) 42. నైట్రస్ ఆమ్లం ఫార్ములా? HNO2 43. కార్బోనిక్ ఆమ్లం ఎన్హైడ్రెడ్ అని దేన్ని అంటారు? CO2 44. ఆమ్ల ద్రావణంలో మిథైల్ ఆరెంజి సూచిక రంగు? ఎరుపు 45. క్షార ద్రావణంలో మిథైల్ ఆరంజి సూచిక రంగు? పసుపు 46. లోహాలపై ఆమ్లాల చర్యవల్ల విడుదలయ్యే వాయువు? హైడ్రోజన్ 47. అయనీకరణ సిద్ధ్దాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త? అర్హీనియన్ 48. జల ద్రావణంలో ఏ+ అయాన్లను ఇచ్చే పదార్థాలు? ఆమ్లాలు 49. ఇై2 ఏ లక్షణాన్ని కలిగి ఉంటుంది? ఆమ్ల 50. 25 oC వద్ద నీటి అయానిక లబ్ధం విలువ? 1.0×10-14 Mole.ion2/lit 51. 0.001 M HCl ద్రావణ ఞఏ విలువ? 3 52. నిమ్మరసం pH విలువ? 2 - 4 53. ఉమ్మి pH విలువ? 6.4 - 6.9 54. వజ్రంలో కార్బన్ - కార్బన్ పరమాణువుల మధ్య దూరం? 1.54 అని 55. మూత్రం pH విలువ? 4.8 - 7.5 56. బలమైన ఆమ్లం, బలమైన క్షారంతో చర్య నొందినప్పుడు వెలువడే తటస్థీకరణ ఉష్ణం విలువ? 13.7 Kcal/Mole 57. NaOH, ఇఏ3ఇైైఏల మధ్య చర్యనొందినప్పుడు విడుదలయ్యే తటీస్థీకరణ ఉష్ణం విలువ? 13.4 Kcal/Mole 58. భూమి పొరల్లో కార్బన్ శాతం? 0.3 59. వజ్రం వక్రీభవన గుణకం? 2.41 60. వజ్రంలో కార్బన్ పరమాణువుల నిర్మాణం? చతుర్ముఖీయం 61. వజ్రంలో బంధకోణం? 1090.28’ 62. గ్రాఫైట్ సాంద్రత? 2.25 గ్రా/c.c 63. గ్రాఫైట్ లో c-c బంధ దూరం? 1.42 అ0 64. గ్రాఫైట్లో బంధ కోణం? 1200 65. గ్రాఫైట్ లో ఏవైనా రెండు పొరల మధ్య దూరం? 3. 35 అ0 66. బక్మిన్స్టర్ పుల్లరిన్ (c60) ఏ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది? ఫుట్బాల్ 67. ఇ60ను కనుగొన్న శాస్త్రవేత్తలు? ఏ.గి. క్రోటో, R.E సాల్మి 68. పరిశ్రమలు, మోటారు వాహనాల నుంచి వెలువడే పొగలో ఎక్కువగా ఉండేది? ఇై (కార్బన్ మొనాక్సైడ్) 69. గాలిలో కార్బన్ ైడె ఆక్సైడ్ శాతం? 0.03 శాతం. 70. సున్నపు తేటను పాలలా మార్చే వాయువు? CO2 71. నిప్పును ఆర్పే యంత్రాల్లో ఉపయోగించే వాయువు? CO2 72. ఘన కార్బన్-డై-ఆక్సైడ్ను ఏమంటారు? పొడి మంచు 73. పిండి పదార్థం ఫార్ములా? (C6H10O5)n 74. అత్యధిక కాటనేషన్ సామర్థ్యం ఉన్న మూలకం? కార్బన్ 75. {పొపైన్లోని బంధాల సంఖ్య? {తిబంధం 76. సూర్యశక్తి గిడ్డంగి అని దేన్ని అంటారు? బొగ్గు నిక్షేపాలు 77. ఆంధ్రప్రదేశ్లో బొగ్గు గనులు ఉన్న ప్రదేశం? రామగుండం, కొత్తగూడెం 78. లిగ్నైట్లో కార్బన్ శాతం? 70 శాతం 79. అతి పురాతనమైన బొగ్గు? ఆంథ్రసైట్ 80. కార్బన్, హైడ్రోజన్లు మాత్రమే కలిగిన కర్బన పదార్థాలను ఏమంటారు? హైడ్రోకార్బన్లు 81. ఆల్కేన్లు ఏ రకమైన రసాయన చర్యల్లో పాల్గొంటాయి? {పతిక్షేపణ చర్యలు 82. C=C ద్విబంధం ఉన్న అసంతృప్త హైడ్రోకార్బన్లను ఏమంటారు? ఆల్కీనులు 83. ఆల్కీనుల మరో పేరు? ఓలిఫిన్లు 84. ఆల్కేన్ల మరోపేరు? ఫారాఫిన్లు 85. – C– O –C ప్రమేయ సమూహం పేరు? ఈథర్ -
అణువణువునా అదే స్ఫూర్తి
చింతామణి నాగేశ రామచంద్రరావు.. డాక్టర్ సి.ఎన్.ఆర్.రావు. రసాయనశాస్త్రంలో ఆయన పరిశోధనలు మైలురాళ్లు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించి.. ఆరు దశాబ్దాలుగా పరిశోధనా ప్రపంచంలో మునిగితేలుతున్న రావును అనేక అవార్డులు, పురస్కారాలు, పదవులూ వరించాయి. శాస్త్రసాంకేతిక అంశాల్లో భారత ప్రధానికి సలహాలు, సూచనలు అందించే ప్రధానమంత్రి శాస్త్రీయ సలహా మండలి చైర్మన్గా వ్యవహరిస్తున్న రావును ఇటీవల భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో సత్కరించింది. సైన్స్తోనే సుస్థిర భవిష్యత్తు అంటున్న సి.ఎన్.ఆర్.రావుతో.. సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూ.. సైన్స్ రంగంలో అడుగుపెట్టడానికి కారణం? పదిహేడేళ్ల వయసులో 1951లో బీఎస్సీ పూర్తి కాగానే సైన్స్ కోర్సును లక్ష్యంగా ఎంచుకున్నాను. బెంగళూరులో 1951లో కళాశాల విద్యార్థిగా ఉన్నప్పుడు.. ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ సి.వి.రామన్ నాకు గొప్ప స్ఫూర్తి. ఎమ్మెస్సీ చదివేటప్పుడు ప్రముఖ శాస్త్రవేత్త లినస్ పాలింగ్ గురించి తెలిసింది. కెమిస్ట్రీలో సంచలనం సృష్టించిన, ఆయన రాసిన ‘ద నేచర్ ఆఫ్ ది కెమికల్ బాండ్’ చదివాను. ఈ పుస్తకం ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. దాంతో పరిశోధనల విషయంలో నాకు పూర్తి స్పష్టత వచ్చింది. రసాయన శాస్త్రమే ఎందుకు? రసాయన శాస్త్రం అంతా కణాలు, పదార్థాల సమ్మేళనమే. విశ్వం అంతా వీటితో కూడి ఉంటుంది. ఒక నిర్దిష్ట అవధిలో కణాలు, పదార్థాల ఆకృతి వెనుకుండే రహస్యాన్ని బంధన అణువుల ఆధారంతో కనుగొనాలని, అదే విధంగా నిర్దిష్ట ఆకృతి సంబంధిత పరమాణు ధర్మాలను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవాలనే జిజ్ఞాసతో రసాయన శాస్త్రాన్ని ఎంచుకున్నాను. పరిశోధనల విషయంలో మీకెదురైన ఇబ్బందులు? దేశానికి స్వాతంత్య్రం లభించేనాటికి అప్పుడే కాలేజీలో అడుగుపెట్టాను. సదుపాయాలు చాలా పరిమితంగా ఉండేవి. అమెరికాలోని పర్డ్యూ యూనివర్సిటీలో పీహెచ్డీ పూర్తి చేసుకుని 1959లో స్వదేశానికి తిరిగొచ్చినా.. దాదాపు అదే పరిస్థితి. నెమ్మదిగా పరిస్థితుల్లో మార్పు వచ్చిందని చెప్పొచ్చు. దేశంలో ప్రస్తుతం పరిశోధనలపై మీ అభిప్రాయం? పరిశోధనల పరంగా దేశం బాగా ముందడుగు వేస్తోంది. ప్రధానంగా గత పదేళ్లలో పరిశోధనల పరంగా సదుపాయాలు ఎంతో మెరుగయ్యాయి. కొన్ని ఇన్స్టిట్యూట్లు అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తూ పరిశోధనలకు ప్రాధాన్యమిస్తున్నాయి. నా వ్యక్తిగత పరిశోధనల పరంగా చెప్పాలంటే.. గత పది, పదిహేనేళ్లలో అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. అసలు ఎలాంటి సదుపాయాలు లేని పరిస్థితిలో మొదలైన నా పరిశోధనలు.. ఇప్పుడు అన్ని సౌకర్యాలతో సాగుతున్నాయి. ప్రధానమంత్రి శాస్త్రీయ సలహా మండలి చైర్మన్గా తీసుకుంటున్న చొరవ? శాస్త్రీయ సలహా మండలి తరఫున సైన్స్, కార్యాచరణ, నిధుల కేటాయింపు వంటి ఎన్నో అంశాలపై ప్రభుత్వానికి, ప్రధానమంత్రికి సిఫార్సులు చేశాం. వీటిలో అధిక శాతం ఆమోదం పొందడంతోపాటు అమల్లోకి కూడా వచ్చాయి. ఉదాహరణకు.. కొత్తగా ఏర్పాటైన ఐదు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లు సలహా మండలి సిఫార్సుల మేరకు జరిగినవే. అదే విధంగా యువతను పరిశోధనలవైపు ఆకర్షించేందుకు రామానుజం ఫెలోషిప్స్, ఇతర కొత్త ఫెలోషిప్స్ అందుబాటులోకి తేవడం కూడా శాస్త్రీయ సలహా మండలి సూచనలతోనే. సైన్స్పై యువతలో అంతగా ఆసక్తి పెరగట్లేదు. దీనిపై మీ అభిప్రాయం? నిజమే. గత కొన్నేళ్లుగా యువతలో సైన్స్ అంటే ఆసక్తి సన్నగిల్లుతున్న మాట వాస్తవమే! దీనికి సహచరులు, సమాజం కూడా కారణం. సైన్స్ను గౌరవించాలి. చక్కటి పనితీరు ప్రదర్శించే యువ శాస్త్రవేత్తలు కచ్చితంగా అద్భుత అవకాశాలు అందుకుంటారు. ఈ క్రమంలో గత రెండు మూడేళ్లుగా చేపడుతున్న చర్యల ఫలితంగా పరిస్థితి కొంత ఆశాజనకంగా మారుతోంది. పరిశోధనల విషయంలో ప్రైవేటు సంస్థలు చొరవ చూపాలని మీరు అన్నారు. ఇది సాధ్యమేనా? వాస్తవానికి మన దేశంలో సైన్స్ రంగం అభివృద్ధి అంతా ప్రభుత్వం మద్దతుతో సాగుతోంది. కానీ అమెరికాలో, జపాన్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం పరిశోధనలకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రైవేటు సంస్థలు కూడా చొరవ చూపడానికి ఇదే సరైన సమయం. అప్పుడే.. ఇతర దేశాల్లో మాదిరిగా.. సైన్స్ పరిశోధనల కోసం జీడీపీలో 2 నుంచి 3 శాతం కేటాయింపులను ఆశించేందుకు వీలవుతుంది. దేశంలో సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ అభివృద్ధి దిశగా మీ సలహా? సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల అభివృద్ధికి మరిన్ని మెరుగైన చర్యలు తీసుకోవాలి. తద్వారా రానున్న 15- 20 ఏళ్లలో దేశం గ్లోబల్ లీడర్గా ఎదగాలని అభిలషిస్తున్నాను. నేటి యువత చక్కటి అవకాశాలు అందుకునేలా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాలి. ఇందుకోసం ఎంతో ముందస్తు ప్రణాళిక అవసరం. వాస్తవానికి.. ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం తగినన్ని మెరుగైన ఇన్స్టిట్యూట్లు ప్రస్తుతం మన దేశంలో లేవు. వీటిని ఏర్పాటు చేసి.. విద్యార్థులకు సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల పట్ల ఆసక్తి కలిగేలా చేయాలి. విద్యార్థులు కూడా సైన్స్ పట్ల ఆసక్తి చూపాలి. ఇదే నా సలహా!! -
ఆ కెమిస్ట్రీ మా వారికి నచ్చింది
ఒకప్పటి పాపులర్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ బాలీవుడ్లో మళ్లీ బిజీ అవుతున్నారు. పెళ్లి తర్వాత దాదాపుగా సినిమాలకు దూరమైన మాధురీ మళ్లీ ఇప్పుడిప్పుడే అవకాశాలను చేజిక్కించుకుంటున్నారు. ఇటీవల ’యే జవానీ హై దీవానీ’ చిత్రంలో గెస్ట్ అప్పియరెన్స్తో అదరగొట్టిన మాధురీ తాజాగా ‘దేడ్ ఇష్కియా’చిత్రంలో నటించారు. ఇది పూర్తి వినోదాత్మక చిత్రమని, ఈ సినిమా ద్వారా సిల్వర్ స్క్రీన్పై మళ్లీ కనిపించడం తన భర్త శ్రీరామ్ నేనేకు చాలా సంతోషం కలిగించిందన్నారు. ఆ చిత్రం ప్రోమో, ‘హమారీ ఆతరియా’ పాట శ్రీరామ్ను ఆకట్టుకుందని, ముఖ్యంగా నసీరుద్దీన్షాతో కెమిస్ట్రీ తన భర్తకు బాగా నచ్చిందని మాధురి తెలిపారు. -
ఇదేం ‘ప్రయోగం’?
=సైన్స్ విద్యార్థుల కోత ప్రయోగాలపై నిషేధం =లెక్చరర్లే ప్రాణుల్ని కోసి బోధించాలి =లేనిపక్షంలో రేఖా చిత్రాల వినియోగం =ప్రభుత్వ నిర్ణయంతో మార్కులకు గండి సైన్స్ విద్యను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందా? చిత్రపటాలతో బోధిస్తే చాలనుకుంటోందా? ప్రభుత్వాదేశాలను పరిశీలిస్తే అవుననే సమాధానమే వస్తోంది. ఇంటర్మీడియట్ బైపీసీలో విద్యార్థులు వివిధ ప్రాణులపై చేయాల్సిన కోత ప్రయోగాలను ఈ ఏడాది నుంచి నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఏడాది నుంచి లెక్చరర్లే కోత ప్రయోగం చేసి విద్యార్థులకు వివరించాల్సి ఉంది. లేనిపక్షంలో చిత్రరూపాల ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించాల్సి ఉంది. నర్సీపట్నం, న్యూస్లైన్: కొన్ని పాఠ్యాంశాలు వింటే చాలు అర్థమవుతాయి. మరికొన్ని పాఠ్యాంశాల బోధన ప్రయోగాలతోనే ముడిపడి ఉంటాయి. ఇంటర్లో బైపీసీ, ఎంపీసీ గ్రూపుల్లోని రసాయన, భౌతిక, జీవశాస్త్రాల్లో ప్రయోగాలు తప్పనిసరి చేయడం వెనుక ఉద్దేశమిదే. ఏటా నిర్ధిష్ట పీరియడ్లలో విద్యార్థులతో ప్రయోగాలు చేయిస్తారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలకు ముందు ప్రత్యేకంగా ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తారు. రసాయన శాస్త్రం సహా జీవశాస్త్రంలో ప్రత్యేకంగా జీర్ణవ్యవస్థ, మరికొన్ని అవయవాల పనితీరును వివరించేందుకు కప్ప, బొద్దింక, వానపాము వంటి ప్రాణులపై విద్యార్థులు కోత ప్రయోగాలు చేసేవారు. లెక్చరర్ పర్యవేక్షణలో వీటిని కోసి అన్ని అవయవాల పనితీరును క్షుణ్ణంగా అర్థం చేసుకునే వారు. తాజాగా విద్యార్థులు ప్రాణులను కోయరాదంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. వీటిని అధ్యాపకులే కోసి వివరించాలని సూచించింది. లేనిపక్షంలో గతంలో ఇచ్చిన చిత్ర పటాల ద్వారా విద్యార్థులకు వివరించాలని ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులకు సులభంగా వచ్చే మార్కులకు గండి పడే అవకాశముంది. ఇంతవరకు కేవలం కోత ప్రయోగాలతో బోధించే విధానం ఉండటం వల్ల ప్రభుత్వ కళాశాలల్లో పూర్తిస్థాయిలో చిత్ర పటాలు అందుబాటులో లేవు. ఈ పరిస్థితుల్లో లెక్చరర్లతో ప్రయోగాలు చేయిస్తే విద్యార్థులకు కొంతమేర నష్టం కలుగుతుందని భావిస్తున్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల ప్రభావం విద్యార్థుల భవిషత్తుపై పడుతుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. -
ప్ర‘యోగం’ లేదు!
కర్నూలు(విద్య), న్యూస్లైన్: విద్యార్థులు సైన్స్ పేరు వింటేనే వణికిపోతున్నారు. జిల్లాలోని 600 పైగా ప్రభుత్వ, ఎయిడెడ్, మున్సిపల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విద్యార్థులు ఈ పరిజ్ఞానం లేకుండానే ఉన్నత చదువులకు వెళ్తున్నారు. టెక్ట్స్బుక్స్లో ఫలానా అంశంపై విద్యార్థులకు ప్రయోగం ద్వారా వివరించాలని స్పష్టంగా పేర్కొన్నా.. 90 శాతం పాఠశాలల్లో ఆ పరిస్థితి కరువైంది. పాఠశాల నిర్వహణకు విడుదలయ్యే స్కూల్గ్రాంట్ నిధుల నుంచి ప్రయోగశాలకు అవసరమైన పరికరాలు కొనుగోలు చేయాల్సి ఉండగా.. చాలా పాఠశాలల్లో వాటి జోలికే వెళ్లడం లేదు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు తప్పనిసరిగా ప్రయోగశాలల ద్వారా సైన్స్ సబ్జెక్టుపై అవగాహన పెంపొందించాల్సి ఉంది. ప్రధానంగా 8, 9, 10వ తరగతి విద్యార్థులకు వారానికి నాలుగు చొప్పున జీవ, రసాయనశాస్త్రాల్లో ప్రయోగ శిక్షణ తరగతులు నిర్వహించాలి. అయితే కొందరు ఉపాధ్యాయులు మాత్రమే అప్పుడప్పుడు పరికరాలను క్లాస్రూంలోకి తీసుకెళ్లి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్ఎంఎస్ఏ కింద 150 పాఠశాలల్లో ప్రయోగశాలల ఏర్పాటుకు 150 గదులు నిర్మించగా.. వీటిని తరగతి గదులుగా ఉపయోగించుకుంటూ ప్రయోగ పరికరాలను బీరువాలకు పరిమితం చేశారు. ప్రయోగశాలల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం, నిర్వహణ విషయంలో విద్యాశాఖాధికారులు శ్రద్ధ చూపకపోవడంతో విద్యార్థులకు ప్రాక్టికల్ విద్య అందని పరిస్థిథి నెలకొంది. గతంలో ప్రభుత్వం ఆయిల్ చార్ట్లను పంపేది. ప్రస్తుతం బడ్జెట్ను కేటాయించి చేతులు దులుపుకుంటుండటంతో ఉపాధ్యాయులు స్థానికంగా దొరికే నాణ్యతలేని చార్ట్లతో సరిపెడుతున్నారు. గాలిలో ధ్వని వేగం కనుక్కోవడం, ఎలక్ట్రికల్, మోటార్స్కు సంబంధించిన కొన్నింటిపై మాత్రమే విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. హీట్, మెల్ట్ చేయాలంటే గ్యాస్ తప్పనిసరి. కానీ గ్యాస్ సిస్టమ్ను హైస్కూల్స్లో ఏర్పాటు చేయకపోవడంతో రసాయనాల ద్వారా రంగుల మార్పుతో పాటు ఇతర ప్రయోగాలేవీ విద్యార్థులకు తెలుసుకునే వీలు లేకపోతోంది. మైక్రోస్కోప్లు, స్ప్రింగ్ త్రాసులు వంటివి పని చేయడంలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో హైస్కూళ్లలో విద్యార్థులు టెస్టు పుస్తకాలతో కుస్తీ పడటమే తప్పిస్తే ప్రయోగాలతో అవగాహన పెంపొందించుకునే భాగ్యానికి దూరమవుతున్నారు. భౌతిక, రసాయనిక, జీవ శాస్త్రాల్లో మారిన పాఠ్యాంశాల మేరకు కొత్త ప్రయోగ పరికరాలు లేకపోవడంతో పాత పాఠ్యాంశాల్లోని పరికరాలతోనే ప్రయోగ విద్యను ఉపాధ్యాయులు తూతూమంత్రంగా బోధిస్తున్నారు. కర్నూలు నగరంలో తొమ్మిది మున్సిపల్ ఉన్నత పాఠశాలలు ఉండగా ఎక్కడా ప్రయోగాలు చేయిస్తున్న దాఖలాల్లేవు. ఉపాధ్యాయులు అప్పుడప్పుడు పరికరాలను చేతబట్టుకుని చూపడంతో సరిపెడుతున్నారు. బండిమెట్ట పాఠశాలలో గదుల కొరతతో పరికరాలను అటకెక్కించారు. డోన్లోని నాలుగు జెడ్పీ హైస్కూళ్లలో ఎక్కడా ల్యాబ్ సౌకర్యమే లేదు. ఈ కారణంగా ప్రయోగ పరికరాలను బీరువాలకే పరిమితం చేశారు. గోనెగండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రయోగశాలకు కేటాయించిన గదిని మధ్యాహ్న భోజన నిర్వహణకు అప్పగించారు. ఆళ్లగడ్డ మండలంలోని కోటకందుకూరు, క్రిష్ణాపురం, ఓబుళంపల్లె పాఠశాలలో ప్రయోగ పరికరం ఊసే కరువైంది. ఆలమూరు, యల్లావత్తుల పాఠశాలల్లో పరికరాలు తుప్పు పట్టడడంతో బీరువాలో భద్రపరిచారు. కోవెలకుంట్లలోని ఉర్దూ ఉన్నత పాఠశాలలో గదులున్నా ప్రయోగ పరికరాలకు టేబుళ్లు లేని కారణంగా నిరుపయోగమయ్యాయి. -
సీఎన్ఆర్ రావుకూ భారతరత్న
రసాయన శాస్త్ర దిగ్గజం రావు న్యూఢిల్లీ: రసాయన శాస్త్రంలో ఎనలేని కృషి చేసిన శాస్త్రవేత్త ప్రొఫెసర్ చింతామణి నాగేశ రామచంద్రరావు (79)కు కూడా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్తో పాటు భారతరత్న అవార్డు దక్కింది. ప్రధానమంత్రి కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో ఈ మేరకు ప్రకటించింది. ఐదేళ్ల విరామం తర్వాత భారతరత్న పురస్కారాలను ప్రకటించారు. చివరిసారిగా 2008లో పండిట్ భీమ్సేన్ జోిఫీకి ఈ అవార్డు దక్కింది. సర్ సి.వి.రామన్, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం తర్వాత దేశ అత్యున్నత పౌర పురస్కారం అందుకుంటున్న మూడో శాస్త్రవేత్త రావు. కర్ణాటకకు చెందిన ఆయనకు ఘన స్థితి, నిర్మాణ, పదార్థ రసాయన శాస్త్రాల్లో దిగ్గజంగా అంతర్జాతీయంగా ఎనలేని పేరు ప్రఖ్యాతులున్నాయి. ప్రధాని శాస్త్ర సలహా మండలి సారథి అయిన రావు 1,400కు పైగా పరిశోధన పత్రాలు సమర్పించడమే గాక 45 పుస్తకాలు కూడా రచించారు. ఎన్నో ప్రతిష్టాత్మక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. ఈ ఏడాది మొదట్లోనే చైనా తన అత్యున్నత శాస్త్ర పురస్కారంతో రావును గౌరవించింది. ప్రపంచవ్యాప్తంగా 60కి పైగా విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. దాదాపుగా ప్రపంచంలోని ప్రతిష్టాత్మక సైంటిఫిక్ అకాడమీలన్నీ సభ్యత్వం, ఫెలోషిప్ వంటివాటితో రావును సత్కరించాయి. నానో మెటీరియల్స్, గ్రాఫీన్లపై రెండు దశాబ్దాలుగా రావు విసృ్తత పరిశోధనలు చేస్తున్నారు. ఆయనకు భారతరత్న ప్రకటించడాన్ని శాస్త్ర, సాంకేతిక రంగ ప్రముఖులంతా ముక్తకంఠంతో స్వాగతించారు. దేశ అత్యున్నత పౌర పురస్కారం అందుకోనున్న సీఎన్ఆర్ రావు రసాయన శాస్త్రంలో చేసే కృషిని క్రికెట్లో సచిన్ సాధించిన ఘనతలతో పోల్చవచ్చని ఆ రంగ ప్రముఖులు చెబుతుంటారు! రసాయన శాస్త్ర రంగంలో చేసిన పరిశోధనలకు కొలమానంగా చెప్పే హెచ్-ఇండెక్స్లో గత ఏప్రిల్లో ఆయన 100 పాయింట్లకు చేరుకున్నారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయునిగా రికార్డు సృష్టించారు. ఐదున్నర దశాబ్దాలుగా కొనసాగుతున్న పరిశోధన ప్రస్థానం ఆయనది. 1934 జూన్ 30న బెంగళూరులో జన్మించిన రావు మైసూరు విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ, 1953లో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి స్నాతకోత్తర విద్య అభ్యసించారు. అమెరికాలోని పర్డ్యూ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టా పొందారు. ఐఐటీ కాన్పూర్లో రసాయన శాస్త్ర అధ్యాపకుడిగా 13 ఏళ్లు పని చేశారు. 1984లో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెన్సైస్ డెరైక్టర్గా పదవీ బాధ్యతలు చేపట్టారు. నానో టెక్నాలజీపై ఆయన రాసిన పుస్తకం సామాన్యులు కూడా ఆ శాస్త్రాన్ని సులువుగా అర్థం చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. మరక కూడా... అయితే రెండేళ్ల క్రితం ప్రొఫెసర్ రావుపై గ్రంథ చౌర్యం ఆరోపణలు వచ్చాయి. అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అనే ప్రఖ్యాత జర్నల్కు పంపిన పరిశోధన పత్రంలో ఇతర శాస్త్రవేత్తల పుస్తకాల్లోని కొన్ని భాగాలను ఎత్తి రాశారన్న ఆరోపణలపై సదరు జర్నల్కు ఆయన క్షమాపణలు చెప్పడమే గాక ఆ పత్రాన్ని వెనక్కు తీసుకునేందుకు కూడా సంసిద్ధత వ్యక్తం చేశారు. తమకు తెలియకుండా ఐఐఎస్సీలోని తమ పీహెచ్డీ విద్యార్థి వాటిని పరిశోధన పత్రంలో చొప్పించారని పరిశోధన పత్రం రచనలో రావుతో పాలుపంచుకున్న మరో శాస్త్రవేత్త అనంతరం ప్రకటించారు. నా దేశం నన్ను గుర్తించింది: రావు సాక్షి ప్రతినిధి, బెంగళూరు: భారతరత్న పురస్కారం దక్కడం పట్ల ఆనందంతో పాటు ఆశ్చర్యానికి కూడా లోనయ్యానని ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావు అన్నారు. ‘‘నా దేశం నన్ను గుర్తించింది. ఎల్లప్పుడూ దేశానికి రుణపడి ఉంటాను. నా భార్య, పిల్లలు, విద్యార్థులకు రుణపడి ఉంటాను. ఇది విజ్ఞానానికి లభించిన గుర్తింపు’ అని పేర్కొన్నారు. ప్రధాని మన్మోహన్సింగ్ రావుకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. భారతదేశానికి, శాస్త్ర సాంకేతిక రంగాలకు ఆయన ఎంతో చేశారన్నారు. ప్రొఫెసర్ రావు చేసిన పరిశోధనలు, ఆయన బోధన నైపుణ్యం పలు తరాలను ప్రగాఢంగా ప్రభావితం చేశాయంటూ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి ఎస్.జైపాల్రెడ్డి కొనియాడారు. సీఎన్ఆర్ రావుకు జగన్ అభినందనలు సాక్షి, హైదరాబాద్: ప్రఖ్యాత శాస్త్రవేత్త సీఎన్ఆర్ రావుకు కేంద్రం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించడం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలియజేశారు. సీసీఎంబీ డెరైక్టర్ అభినందనలు ఇండియన్ సైన్స్ రంగానికి మార్గనిర్దేశకత్వం వహిస్తూ కృషి చేస్తున్న ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావుకు భారతరత్న ప్రకటించడం సంతోషదాయకమని హైదరాబాద్లోని సీసీఎంబీ డైరె క్టర్ సీహెచ్ మోహన్ రావు పేర్కొన్నారు. రసాయన శాస్త్రంలో రాసిన పుస్తకాల ద్వారా విద్యార్థులకు ఆయన సుపరిచితులన్నారు.